Hyderabad
-
హైదరాబాద్లో అతి పెద్ద ‘పోర్షే ’ కార్ షోరూమ్
హైదరాబాద్: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల దిగ్గజం పోర్షే ఇండియా తాజాగా భారత్లో 911 జీటీ3ని ప్రవేశపెట్టింది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గంటకు 311 కి.మీ.దూరం ప్రయాణించగలదు. దీని ఎక్స్ షోరూం ధర రూ.3.32 కోట్లుగా ఉంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఇక, కంపెనీ దేశంలోనే అతిపెద్ద షోరూమ్ ‘పోర్షే సెంటర్’ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈవీఎమ్ ప్రీమియం కార్స్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేసింది. దాదాపు 2,800 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో ఉండే ఈ లగ్జరీ సెంటర్లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ (3ఎస్) సేవలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ‘డెస్టినేషన్ పోర్షే’ అనే వినూత్న డిజైన్ కాన్సెప్ట్తో ఈ షోరూమ్ను తీర్చిదిద్దారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఫిల్మ్నగర్ మణికొండ, నానక్ రామ్గూడ, కొండాపూర్లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్సిటీలో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
నిర్మాణ వ్యర్థాల విచ్చలవిడి డంపింగ్పై చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీఅండ్డీ వేస్ట్) పారబోసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పర్యావరణ పరిరక్షణ, నాలాల పూడిక నివారణ, నగరాల్లో వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తాజాగా సంచలన జీఓ జారీ చేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీతో పాటు హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్, హైడ్రా, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, ఆర్అండ్బీ, టీజీఐఐసీ, టీజీఎస్పీడీసీఎల్ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.కొత్త నిబంధనలు ఇలా.. ఇష్టానుసారంగా నిర్మాణ వ్యర్థాలు పారబోస్తే వాహనాలు సీజ్తో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాలలో వేస్తే భారీ జరిమానాలతో పాటు, ఆ వ్యర్థాల తొలగింపు ఖర్చును సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచే రికవరీ చేస్తారు. అక్రమ రవాణా వాహనాలను స్పాట్లోనే సీజ్ చేస్తారు. నిబంధనలు అతిక్రమించే బిల్డర్లు, కాంట్రాక్టర్ల పర్మిషన్లు రద్దు చేయడమే కాక, వారిని శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెడతారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విధులకు అడ్డుతగిలితే కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి. u ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్ లేదా కూల్చివేత అనుమతులు పొందాలంటే బిల్డర్లు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు. దాంతో పాటు వ్యర్థాలను అక్రమంగా పారబోయబోమని అండర్ టేకింగ్ ఇవ్వాలి. u వేస్ట్ మేనేజ్మెంట్ , యుటిలైజేషన్ ప్లాన్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. u పర్యావరణ హితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పరిధిలో జరిగే అన్ని సివిల్, రోడ్డు మౌలిక వసతుల పనుల్లో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రిని రీసైకిల్ చేసిన వ్యర్థాలతో తయారు చేసిన వాటినే ఉపయోగించాలి. u రోడ్డు కటింగ్ పనులు, డ్రైనేజీలు, మెట్రో లేదా మౌలిక వసతుల కాంట్రాక్టర్లు పనులు ముగించే లోపు సైట్ను పూర్తిగా క్లీన్ చేయాలి. u ఈ ఉత్తర్వులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నాయని, ఈ సరికొత్త నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హెచ్చరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత నోడల్ అధికారులు, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఇక్కడే వ్యర్థాలను అప్పగించాలి.. శంషాబాద్ ప్లాంట్ (టోల్ఫ్రీ: 18002030033) తూము కుంట ప్లాంట్ (18002030033) జీడిమెట్ల ప్లాంట్ (18001201159) ఫతుల్లాగూడ ప్లాంట్ (18001201159) -
తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్ పోటీలు (ఫొటోలు)
-
పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదంటూ
హస్తినాపురం: ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన నగర విద్యార్థి అదృశ్యమయ్యాడు. 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమవుతున్నారు.వనస్థలిపురం వైదేహి నగర్కాలనీకి చెందిన మర్ణత, ముత్యంరెడ్డిల కుమారుడు మణిదీప్రెడ్డి ఫిన్లాండ్ లోని ఎల్యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ మే 5 నుంచి ఫోన్చేసినా స్పందించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని కుమారుడి స్నేహితులు, తెలిసిన వారిని నివాస ప్రాంతానికి, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో అక్కడ మణిదీప్రెడ్డి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా తమ కుమారుడు మణిదీప్రెడ్డిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశంఫిన్లాండ్లో తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ మణిదీప్రెడ్డి తల్లిదండ్రులు జి.మర్ణత, ముత్యంరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదృశ్యంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మణిదీప్రెడ్డి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు వివరించాలంటూ కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి విచారణ చేపట్టారు. న్యాయమూర్తి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. -
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. -
ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ సందేశం
సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన “రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత కార్యక్రమం”లో పాల్గొన్న ఉపాధ్యాయులతో గవర్నర్ శుక్రవారం లోక్ భవన్లో ముచ్చటించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు గవర్నర్ ధృవపత్రాలను అందజేసి అభినందించారు.హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఈఎఫ్ఎల్యూ అధ్యాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భావప్రసార, బోధనా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈఎఫ్ఎల్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెరగడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి, ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ అన్నారు. ఇటువంటి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరమైన అంతరాలను తగ్గించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా లోక్ భవన్ నిధుల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.“శిక్షణ పొందిన 56 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్య ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి పనిచేయాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి లోక్ భవన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని గవర్నర్ పేర్కొన్నారు. మాతృభాషలను, గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, పోటీ ప్రపంచంలో రాణించగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులను గవర్నర్ అభినందించి, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించాలని కోరారు.కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో తరచూ ఇక్కడే యాక్సిడెంట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్స్పాట్స్పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు. జాతీయ రహదారులపైనే అత్యధికం.. నగర ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్స్పాట్స్లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్హెచ్ నం.44పై 11, ఎన్హెచ్ నం.65పై 13 ఉండగా.. ఎన్హెచ్ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేకం ‘చావు’రస్తాలే... నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు, సిగ్నళ్లు యాక్టివ్గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్స్పాట్స్లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదాలకు కారణాలివే ⇒ పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్ ఇంజినీరింగ్ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటంచదవండి: బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా! గ్రే స్పాట్లే కీలకం బ్లాక్ స్పాట్స్తో పాటు గ్రే స్పాట్స్ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు. – ఎం.ప్రకాష్ కుమార్, రవాణా రంగ నిపుణుడు -
‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారువిద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరుఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందిసోషల్ వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. -
బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా!
హైదరాబాద్: కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు అది. దానిని ఐదవ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు ఓఆర్ఆర్ పై నడుపుతూ దూసుకెళ్లాడు. విచిత్రమేమంటే తండ్రి బాలుడి పక్కనే కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ క్లిప్ ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు చూసి సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని గుర్తించారు.కారు టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ హాదీది అని నిర్ధారించారు. అతను ఎంజీ సైబర్ స్టార్ లగ్జరీ కారును ఇటీవల కొనుగోలు చేశాడు. ఈనెల 11న తన 11 ఏళ్ల కుమారుడితో కారులో వచ్చాడు. కారు కుమారుడికి చేతికిచ్చి ఔటర్పై శంషాబాద్ వైపు వెళ్ళాడు. చివరకు వాహనాన్ని జప్తు చేశారని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?#Rajendranagar #Police have Booked a #Tolichowki-based businessman, after a video of his 11-year-old son driving #Minor #Driving an #MG #Cyberster convertible luxury electric sports car on the Outer Ring Road went viral on social media. 1/2 pic.twitter.com/l0MQmwYYB5— shinenewshyd (@shinenewshyd) June 19, 2026 -
హైదరాబాద్ లో అతిపెద్ద తొలి టెస్లా షోరూం
-
అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.. భర్త, కూతురితో ఆనందంగా సాగిపోవాల్సిన ఆమె ఇపుడు అనాథ అయింది.. కన్న కూతురు, కట్టుకున్న భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.. ఈనెల 13న తెల్లవారుజామున జరిగిన విద్యుత్ ప్రమాదంలో అందరి ముందూ తండ్రి, కూతురు విగతజీవులగా మారిపోయారు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాజీగూడ టెలికాం కాలనీలో జరిగి విద్యుత్ తీగ కారుపై పడటంతో సందీప్(45), అతని కూతురు రుత్విక(16) ప్రాణాలు కోల్పోవడం ఇంకా స్థానికుల కళ్లముందే మెదులుతోంది.మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. కాదు.. మీ నిర్లక్ష్యం వల్లే అని విద్యుత్ శాఖ అధికారులు, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఆరు రోజులవుతోంది. ప్రమాదానికి కారణం ఏ శాఖ అయినా.. ప్రభుత్వ శాఖలే కదా.. మరి బాధితురాలు శ్వేత గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులైనా వచ్చి బాధితురాలికి భరోసా ఇచ్చి పరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేసి ఉంటే.. అత్యవసర టీమ్ వెంటనే చేరుకుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఇపుడు అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్వేతకు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.ఇలాంటి సమయంలో బాధితురాలికి మానసికంగా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేత అత్త లలిత క్యాన్సర్ బారిన పడింది, మామ చక్రపాణికి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరుతున్నారు. -
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
సాక్షి,హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) అధికారులు ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, అలాగే రూ. 20 వేల చొప్పున రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
‘బ్యాటింగ్ మా ప్రధాన బలం.. సీక్రెట్ వెపన్ అతడే!’
ఆదివారం నుంచి ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుతో సాక్షి మీడియా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జట్టు బలాలు, బలహీనతలపై ఖమ్మం ఏసెస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అన్ని జట్లతో పోలిస్తే బ్యాటింగ్ తమ ప్రధాన బలమని ఖమ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జట్టులో ఉన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్లోనే వాడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయర్ ఎవరనేది మాత్రం తాము రివీల్ చేయబోవవడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం జట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు రంజీల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సహా ఇతర లీగ్స్కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్లు తమ లాంటి ఆటగాళ్లకు కీలకంగా మారుతుందని తెలిపాడు. తమ జట్టులో లెగ్ స్పిన్నర్గా వేద్రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడని, అతడు తన స్పిన్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో కెప్టెన్ సీవీ మిలింద్తో పాటు వైస్ కెప్టెన్ హిమతేజ, లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి, ఓపెనర్ ప్రతీక్రెడ్డి పాటు ఇతర క్రికెటర్లు పాల్గొన్నారు. ఇక ఖమ్మం ఏసెస్ జట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖమ్మం ఏసెస్ జట్టు తన తొలి మ్యాచ్ను జూన్ 21న పాలమూరు స్ట్రైకర్స్తో ఆడనుంది. -
ఎట్టకేలకు హైదరాబాద్ లో టెస్లా
-
హైదరాబాద్లో కల్తీ కలకలం : 110 కిలోల ఫ్రైడ్ చికెన్ సీజ్
హైదరాబాద్ : ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈమేరకు కల్తీ చికెన్, కృత్రిమ, రంగులు, నూనెలకు స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నామని ఐపిఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్.వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు.• నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం.• నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్బెర్రీ రెడ్) ఉపయోగించడం.• పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం.• నీటి విశ్లేషణ ధృవీకరణ (Water Analysis Certification) మరియు నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం.• విపరీతమైన అపరిశుభ్ర వాతావరణం మరియు కీటకాల నియంత్రణ (Pest Control) లేకపోవడం.స్వాధీనం చేసుకున్న ఆహార పదార్తాల వివరాలు:• సుమారు 110 కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్• 6 టిన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు)• కృత్రిమ రసాయన ఆహార రంగులు కల్తీ , అపరిశుభ్రమైన ఆహారం- ఆరోగ్య సమస్యలు • ఫుడ్ పాయిజనింగ్, వాంతులు మరియు విరేచనాలు.• జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు (Gastrointestinal infections).• పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.• కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు మరియు టాక్సిసిటీ (విషపూరితం) కావడం.• కాలేయం (Liver) మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరగడం.చట్టపరమైన చర్యలు:నిందితులు ఈ అసురక్షిత పద్ధతులను దాచిపెట్టి, వినియోగదారులకు కల్తీ ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసారు మరియు చట్టవిరుద్ధంగా లాభపడ్డారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act, 2006) మరియు ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)కు అప్పగించారు. ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కింది జాగ్రత్తలను సూచించింది. • లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయండి/తీసుకోండి.• కొనుగోలు చేయడానికి ముందు FSSAI లైసెన్స్ను తనిఖీ చేసుకోండి.• కృత్రిమ రంగులు కలిపిన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలను నివారించండి.• అసురక్షిత ఆహార పద్ధతులపై అధికారులకు ఫిర్యాదు చేయండి.ఫిర్యాదుల కొరకు టోల్-ఫ్రీ నంబర్: 8712661212 ను సంప్రదించండి. -
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కు బ్రేకులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని ఐజీ వివరించారు.ప్రజలకు అసౌకర్యం తగ్గించేలా షెడ్యూల్జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.సేవలు పునఃప్రారంభంప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది. -
అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ.. డిజిటల్ మోజో సక్సెస్!
భారతదేశంలోని ప్రతి రియల్ ఎస్టేట్ డెవలపర్ చివరకు ఒక ప్రశ్న అడుగుతారు: నా ప్రాజెక్ట్ అనుకున్న వేగంతో ఎందుకు అమ్ముడు పోవడం లేదు? చాలాసార్లు సమాధానం ప్రాజెక్ట్తో సంబంధం ఉండదు. లొకేషన్ అద్భుతంగా ఉండవచ్చు. స్పెసిఫికేషన్లు అత్యుత్తమంగా ఉండవచ్చు. ధర పోటీగా ఉండవచ్చు. అయినప్పటికీ విచారణలు నిదానంగా వస్తాయి, సైట్ విజిట్లు అరుదుగా ఉంటాయి, సేల్స్ టీమ్ అసంతృప్తి ఉంటుంది. కీలకమైన లోటు, దాదాపు ఎల్లప్పుడూ, ప్రాజెక్ట్ వెనుక ఉన్న డిజిటల్ మార్కెటింగ్ నాణ్యత.హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగి, దశాబ్దానికి పైగా పనిచేస్తున్న డిజిటల్ మోజో, ఈ సమస్యను పరిష్కరించడమే తన సంపూర్ణ గుర్తింపుగా నిర్మించుకుంది. నేడు, ఇది హైదరాబాద్లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా నిలబడింది మరియు భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా పేరు సంపాదించింది. తమ గురించి తామే చెప్పుకోవడం ద్వారా కాదు, వ్యాపార ప్రపంచంలో నిజమైన విలువ కలిగిన ఏకైక కరెన్సీ అయిన ఫలితాల ద్వారా నిరూపితమైన పనితీరు ఆధారంగా వారు తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు.మొదటి రోజు నుండి భిన్నమైన తత్వశాస్త్రంచాలా ఏజెన్సీలు లైక్లు, ఇంప్రెషన్లు మరియు రీచ్లో తమ విజయాన్ని కొలుస్తాయి. డిజిటల్ మోజో ఎల్లప్పుడూ విజయాన్ని భిన్నంగా కొలుస్తుంది. సంస్థాపకుడు మరియు సీఈఓ ధీరజ్ మేరానీ స్పష్టంగా వ్యక్తీకరించిన ఏజెన్సీ వ్యవస్థాపక తత్వం ఏమిటంటే, మార్కెటింగ్ P&L లో కనిపించాలి. మూడ్ బోర్డ్లో మాత్రమే కాదు. ఒక క్యాంపెయిన్ను ఆదాయానికి, అర్హత కలిగిన లీడ్లకు, వాస్తవ సైట్ విజిట్లకు మరియు బుకింగ్లకు ట్రేస్ చేయలేకపోతే, అది తన పనిని చేయలేదు.ధీరజ్ మేరానీ ఇరవై సంవత్సరాలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం, IIM నేపథ్యం మరియు US మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ను ఈ తత్వశాస్త్రానికి అందిస్తారు. ఆయన విధానం విక్రేత కంటే వ్యాపార భాగస్వామిగా ఆలోచించే ఏజెన్సీని రూపొందించింది. ఒక వ్యవస్థాపకుడు చేసే అదే తీవ్రతతో క్లయింట్ సేల్స్ పైప్లైన్పై నిమగ్నమవుతుంది.రియల్ ఎస్టేట్ ఎందుకు? డిజిటల్ మోజో ఎందుకు?రియల్ ఎస్టేట్ డిజిటల్గా మార్కెట్ చేయడానికి అత్యంత సంక్లిష్టమైన రంగాలలో ఒకటి. టికెట్ పరిమాణాలు ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులు సందేహాస్పదంగా ఉంటారు, మరియు ఇంట్లో లేదా వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టే నిర్ణయం భావోద్వేగ మరియు హేతుబద్ధ లెక్కల పొరలను కలిగి ఉంటుంది, వాటిని చాలా డిజిటల్ క్యాంపెయిన్లు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతాయి.డిజిటల్ మోజో సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొనుగోలుదారు యాత్రపై స్వయంగా అభివృద్ధి చేసిన అవగాహనను మరియు ఇప్పుడు AI సహాయంతో ఇన్-హౌస్ ప్రొడక్ట్ Mojo Cortex ను అభివృద్ధి చేసింది — Google లో మొదటి సెర్చ్ నుండి చివరి సైట్ విజిట్ వరకు. ఏజెన్సీ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీడియో మార్కెటింగ్ మరియు డేటా అనలిటిక్స్ అంతటా పని చేస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లు మరియు బ్రాండ్ల కోసం, ఈ విభాగాలన్నింటినీ ఫలితాల ఆధారిత సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుతుంది.దేశవ్యాప్తంగా 50కి పైగా యాక్టివ్ క్లయింట్లు మరియు 70 మంది నిపుణుల బృందంతో, ఏజెన్సీ హైదరాబాద్లో బూటిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నుండి ముంబై, ఢిల్లీ మరియు టైర్ 2 నగరాలలో మార్కెట్ చేయబడిన పెద్ద-స్థాయి మిక్స్డ్ వ్యూస్ అభివృద్ధి వరకు ప్రతిదాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పుణే మరియు ఇతర నగరాలలో ప్రముఖ బిల్డర్లు క్లయింట్లుగా ఉన్నారు, వీరి క్యాంపెయిన్లు కాస్ట్ పర్ లీడ్, లీడ్ నాణ్యత మరియు కన్వర్షన్ రేట్లపై పరిశ్రమ బెంచ్మార్క్లను నిరంతరం అధిగమించాయి.హైదరాబాద్ యొక్క అత్యుత్తమ రహస్యం — ఇప్పుడు బహిర్గతమవుతోందిహైదరాబాద్ యొక్క పోటీ మార్కెటింగ్ ల్యాండ్స్కేప్లో, డిజిటల్ మోజో నెమ్మదిగా సీరియస్ బ్రాండ్లు మొదట పిలిచే ఏజెన్సీగా మారింది. 233 Google రివ్యూలలో 4.7 స్టార్ రేటింగ్ మరియు రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు హాస్పిటాలిటీ విస్తరించిన క్లయింట్ పోర్ట్ఫోలియోతో, ఏజెన్సీ దూకుడు స్వయం ప్రమోషన్ కంటే నిరంతర డెలివరీ ద్వారా హైదరాబాద్లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా తన స్థానాన్ని సంపాదించింది. వారు Google సెర్చ్ మరియు AI ఫలితాలలో నంబర్ 1 గా నిరంతరం ర్యాంక్ చేస్తున్నారు.నగరంలో డిజిటల్ మోజోను ప్రత్యేకతను చాటేది దాని పాడ్ మోడల్. ప్రతి క్లయింట్కు అంకితమైన నిపుణులను నియమించే నిర్మాణం, పెద్ద ఏజెన్సీలలో సాధారణంగా ఉండే రివాల్వింగ్-డోర్ అకౌంట్ మేనేజ్మెంట్ కంటే జవాబుదారీతనం మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. క్లయింట్లు ప్రతి కొన్ని నెలలకు కొత్త బృందానికి రీ-బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు. వారి బ్రాండ్ను అర్థం చేసుకున్న వారు వారితోనే ఉంటారు.జాతీయ లక్ష్యండిజిటల్ మోజో ఆశయాలు ఎప్పుడూ హైదరాబాద్కే పరిమితం కాలేదు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం వృద్ధి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, మెట్రో నగరాలు, టియర్-1 మరియు టియర్-2 నగరాల్లోని డెవలపర్లు డిజిటల్ అవగాహన కలిగిన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, ఫలితాలను అందించగల నిపుణుల ఏజెన్సీ అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.ఈ దశను చేరుకోవడానికి డిజిటల్ మోజో ఎంతో ప్రణాళికాబద్ధంగా, లక్ష్యపూర్వకంగా తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. నేడు సంస్థ యొక్క విజయగాథలు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అఫోర్డబుల్ హౌసింగ్, కమర్షియల్ ప్రాపర్టీలు, ప్లాటెడ్ డెవలప్మెంట్స్ మరియు మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు వంటి విభిన్న రియల్ ఎస్టేట్ విభాగాలకు విస్తరించాయి.అదేవిధంగా, సంస్థ యొక్క అనలిటిక్స్ సామర్థ్యాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. అధునాతన అట్రిబ్యూషన్ మోడల్స్ను వినియోగించడం ద్వారా, డెవలపర్లు పెట్టుబడి పెట్టిన ప్రతి మార్కెటింగ్ రూపాయి ఏ ఫలితాన్ని తీసుకువస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునేలా ఖచ్చితమైన విశ్లేషణలను అందిస్తోంది.భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా, డిజిటల్ మోజో ధరపై పోటీ పడటం లేదు. ఇది ఫలితాలపై పోటీ పడుతోంది.క్లయింట్లు నిజంగా ఏమి చెప్తున్నారుఒక ఏజెన్సీ విలువకు అత్యంత నమ్మదగిన సూచిక దాని క్లయింట్ సంబంధాల వ్యవధి. డిజిటల్ మోజోలో, అనేక క్లయింట్లు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏజెన్సీతో ఉన్నారు. అసంతృప్తి మరియు మారడం సాధారణంగా జరిగే పరిశ్రమలో ఇది అరుదు. సంఖ్యలు అర్థమవుతూనే ఉన్నందున వారు ఉంటున్నారు.క్లయింట్ల నుండి పదే పదే వచ్చే అభిప్రాయం ఏమిటంటే, డిజిటల్ మోజో క్లయింట్ అకౌంట్లకు వ్యవస్థాపకుని మనస్తత్వాన్ని తీసుకువస్తుంది. బ్రీఫ్ బలహీనంగా ఉన్నప్పుడు ఏజెన్సీ వెనక్కి నెట్టుతుంది. క్లయింట్ గమనించే ముందే క్యాంపెయిన్ తక్కువ పనితీరు చేస్తున్నప్పుడు ఫ్లాగ్ చేస్తుంది. అడగకుండానే కొత్త ఆలోచనలను తెస్తుంది. సంక్షిప్తంగా, ఇది స్కిన్ ఇన్ ది గేమ్ ఉన్న భాగస్వామిలా వ్యవహరిస్తుంది.ముందున్న మార్గంభారత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన వృద్ధి కాలంలోకి ప్రవేశిస్తోంది. పట్టణీకరణ వేగవంతమవుతూ, గృహావసరాలు పెరుగుతూ, కొనుగోలుదారుల కొత్త తరం తమ మొత్తం ఆస్తి పరిశోధన యాత్రను ఆన్లైన్లో నిర్వహిస్తూ,రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఇక సహాయక పాత్రలో కాకుండా, వ్యాపార వ్యూహంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది.డిజిటల్ మోజో ఈ తరంగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది — మరియు దాని క్లయింట్లు దాని కంటే వేగంగా పెరగడానికి సహాయం చేయడానికి. వ్యర్థ మెట్రిక్స్తో నిండిన డెక్స్లను డెలివరీ చేసే మరియు వాస్తవ సేల్స్ ప్రభావంపై తక్కువగా ఉండే ఏజెన్సీలతో అలసిన డెవలపర్లకు, డిజిటల్ మోజో ఒక భిన్నమైన సంభాషణను అందిస్తుంది: మీ ఆదాయ లక్ష్యంతో మొదలై మిమ్మల్ని అక్కడికి చేర్చే క్యాంపెయిన్ స్ట్రాటజీ వరకు వెనక్కు పనిచేసేది.చాలా ఏజెన్సీలు చేయగలవని మరియు నిరూపించగలవని వాగ్దానం చేయలేవు. డిజిటల్ మోజో చేయగలిగే కొద్ది సంస్థలలో ఒకటి.— డిజిటల్ మోజో | digitalmojo.in | హైదరాబాద్గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
తెలంగాణ సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. నాలుగు దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. బీసీ సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. గత నాలుగు ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని.. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ నేతలు హెచ్చరించారు. -
TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఈ ఇంట్లో ఫ్రీగా తినొచ్చు - పడుకోవచ్చు
-
నగరానికొచ్చిన ‘కోజికోడ్ శ్రీదేవి’
హైదరబాద్: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా ఈ నెల 26న పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్పురా బీబీకా అలావాకు చెందిన బీబీకా ఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. ఇందులో భాగంగా కేరళలోని కోజికోడ్ నుంచి శ్రీదేవి అనే ఆడ ఏనుగు బుధవారం రాత్రి పాతబస్తీకి చేరుకుంది. ప్రధాన ఊరేగింపునకు ముందస్తుగా డబీర్పురా నుంచి చార్మినార్ మీదుగా చాదర్ఘాట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. డెలివరీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కోసం బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. నగరంలో సూపర్ చార్జర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించాయి. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలంటే పబ్లిక్ చార్జింగ్ సదుపాయాలతో పాటు ప్రధానంగా హోమ్ చార్జర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. హైదరాబాద్తో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంస్థకు ఐదు సెంటర్లు ఉన్నాయని తెలిపాయి. టెస్లా భారత్లో రెండు మోడల్స్ని విక్రయిస్తోంది. ఇందులో మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 50,89,000 నుంచి, మోడల్ వై ఎల్ ఆల్ వీల్ డ్రైవ్ వాహనం ధర రూ. 61,99,000 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. వీటిని కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది.సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు 6 నుంచి 10 వారాల వరకు ఉంటోందని సంస్థ వర్గాలు వివరించాయి. మోడల్ని బట్టి ఫైనాన్సింగ్ కింద నెలకు రూ. 39,990 నుంచి ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకులతో చేతులు కలిపినట్లు వివరించాయి. జూన్ 30లోగా బుక్ చేసుకునే వారికి కాంప్లిమెంటరీ వాల్ కనెక్టర్ పొందవచ్చని పేర్కొన్నాయి. -
వడగండ్ల వాన బీభత్సం.. గోడకూలి ఇద్దరు మృతి
సాక్షి,మహబూబ్నగర్: దేవరకద్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పక్కన కారును పార్క్ చేయగా, రెండు అంతస్తుల ఎత్తులో ఉన్న గోడ భారీ గాలులకు కూలిపోయి కారుపై పడింది.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు.అనంతరం తీవ్ర గాయాలపాలైన వారిని అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
హైడ్రా, ఈగల్ తరహాలో ‘ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్సేఫ్టీపై స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఫుడ్సేఫ్టీ వింగ్ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్ ముందుకు రానున్నాయి.కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ మాత్రమే విక్రయాలు చేయాలని మంత్రి ఆదేశించారు.విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ డీలర్లు, కృషి వాస్ నిర్వాహకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాలపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్పై ఫెర్టిలైజర్ డీలర్ల అభిప్రాయాలను, సూచనలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. కృషి వాస్ ప్రతినిధులతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాగు సాంకేతికతపై ఆయన చర్చించారు. -
ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
-
ఇది EV కార్ల పరిస్థితి... కొన్న గంటలోనే ఏం అయిందో మీరే చూడండి?
-
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
-
‘సర్’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర
సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని ఇతర పార్టీ నాయకులను భయపెట్టి,అక్రమంగా కేసులు బనాయించి,అన్యాయంగా స్థానిక ప్రాంతీయ పార్టీలను అధికారం నుండి తొలగించే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ఈ రోజు నల్గొండ జిల్లాలోని దేవరకొండ,నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్ఐఆర్ పేరిట ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ను అడ్డుపెట్టుకొని దేశ వ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో 86 లక్షల ఓట్లు తొలగించారని, బీహార్లో 46 లక్షల ఓట్లు తొలగించారని, ఉత్తరప్రదేశ్ లో సుమారు 2 కోట్లు మొత్తంగా ఇప్పటివరకు 6 కోట్ల ఓట్లు తొలగించారన్నారు. అస్సాంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉన్నదని అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించలేదని విమర్శించారు.నిజంగా దేశ ఎన్నికల కమీషన్ పారదర్శకంగా ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయేది కాదన్నారు. తెలంగాణలో కూడా బిజేపి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నాయని, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి,ఆ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసే ఉన్నాయని, అందుకే పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను, తొమ్మిది రోజులపాటు రేవంత్ రెడ్డి కాపాడారని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీజేపీకి సహాయం చేయడానికి, రాజ్యసభ ఎంపిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేస్తే,గాంధీ భవన్ నుండి లీకులు ఇచ్చి, ఆమెకు వెన్నుపోటు పొడిచి,మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు లీకులు ఇచ్చి ఆమె నామినేషన్ రద్దు చేయించారని పేర్కొన్నారు.అందుకే కాంగ్రెస్, బిజేపి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వివరించారు. 2018లో చంద్రబాబు సేవామిత్ర మొబైల్ యాప్ ద్వారా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు.అదే విధంగా తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి యాప్ తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. బీఎల్ఏలు అయ్యప్ప దీక్ష, భీమ్ దీక్ష, హనుమాన్ దీక్ష చేపట్టినట్లే, బిఆర్ఎస్ కార్యకర్తలు,బిఎల్ఏలు ఎస్ఐఆర్ దీక్ష చేపట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీఎల్ఓలు సర్వేలో భాగంగా ఇంటికి వస్తే ఖచ్చింతంగా నూతన ఓటు నమోదు కోసం ఫారం 6, తొలగించాలంటే ఫారం 7, అభ్యంతరాలు సవరణల కోసం ఫారం 8 నింపి ఇవ్వాలన్నారు. ఇసిఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా బూత్ పరిధిలో ఉన్న ఇంటింటికి తిరిగి అర్హులైన అందరి ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని,తర్వాత బిఎల్ఓ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇటీవల ఏం చేసైనా, కిందపడి, మీద పడి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం వెనుక , ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నందునే మాట్లాడారని,అందుకే బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి బిఎల్ఏలు అవసరం లేదని,ప్రభుత్వ ఉద్యోగులను,బిఎల్ఓలను వారు బిఎల్ఏలుగా పని చేసే విధంగా వారిని బెదిరించి పని చేయిస్తారన్నారు. అందుకే బిఎల్ఓలను,బిఎల్ఏలు వెంటవెంటనే అనుసరించి దొంగ ఓట్లు నమోదు కాకుండా,అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలని వివరించారుదేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్,నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి లింగయ్య యాదవ్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నరహరి అక్రమాస్తులు వంద కోట్లు దాటాయ్
సాక్షి,హైదరాబాద్: నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతి అక్రమాల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.100కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.ఈ సోదాల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29కోట్లు గుర్తించారు. దీంతో పాటు రూ.5.04కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లో విలువైన ఫ్లాట్లు,గచ్చిబౌలిలో జీప్లస్3, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనాలు గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. -
మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం తీవ్రతతో ఎగిసిపడుతున్న మంటలకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో ప్రమాద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా ‘ఈగల్’ ఆపరేషన్.. 19 మంది అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అరెస్ట్ చేసింది. పట్టుబడి వారిలో 14 మందికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయా వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు. గతంలో ఎన్డీపీఎస్ చట్ట కింద చక్రపాణి, హర్షిత్ అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఈ దందాను ఆపలేదు. డగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉంది. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాల ఆటలు కట్టిస్తోంది.మాదాపూర్లో 2 రోజుల క్రితమే.. హైదరాబాద్లోని మాదాపూర్లో ఆదివారం (జూన్ 14న) డ్రగ్స్ భారీగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఎనిమిది మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు 9 మొబైల్ ఫోన్లు, 2 బరువు తూచే మిషన్లు, ప్యాకింగ్ మెటీరియల్ సీజ్ చేశారు. -
ఉజ్జయిని మహాంకాళి బోనాల తేదీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2 వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లేఖను అందజేశారు.జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3 వ తేదీన రంగం (భవిష్య వాణి) ఉంటాయని EO వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తుల రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు.ఈ ఉత్సవాలను రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో, అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించే "రంగం" (భవిష్యవాణి) కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యమైనది. మాతంగి (స్వర్ణలత) అమ్మవారు పూని భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను, వర్షాల గురించి, ప్రజల క్షేమం గురించి భవిష్యవాణి చెప్తారు. దీనిని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. -
500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!
నాగ్పూర్-హైదరాబాద్ మధ్య ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. నాగపూర్నుంచి హైదరాబాద్ మధ్య 500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడున్నర గంటల్లో రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు.ప్రస్తుతం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి గడ్కరీ మాట్లాడుతూ, నాగ్పూర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే పని ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని చెప్పారు. నాగ్పూర్ - చంద్రపూర్లను కలుపుతూ ఆరు లేన్ల రహదారిని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, చంద్రపూర్ చుట్టూ రింగ్ రోడ్డు హైదరాబాద్కు కనెక్టివిటీని అందిస్తుందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణలోని మంచిర్యాల వైపు ,ఆంధ్రప్రదేశ్లోకి విస్తరించే అనేక ఇతర రహదారి ప్రాజెక్టుల పనులు కూడా అధునాతన దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. దీంతోపాటు సమృద్ధి ఎక్స్ప్రెస్వేని గోండియా వైపు పొడిగించడం వల్ల ఛత్తీస్గఢ్కు కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రాయ్పూర్ వైపు స్పర్ రోడ్ ప్లాన్ చేసినట్లు గడ్కరీ చెప్పారు. నాగ్పూర్ మరియు జబల్పూర్లను కలుపుతూ కొత్త హైవే కూడా నిర్మాణంలో ఉందన్నారు. తూర్పు మహారాష్ట్ర ప్రధాన ఉక్కు హబ్గా ఎదుగుతోందని, హైవేల నెట్వర్క్ ద్వారా తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులకు అనుసంధానం చేస్తామని చెప్పారు.అంతేకాదు ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఓడరేవులకు వేగవంతంగా చేరుకోవచ్చని తెలిపారు. పశ్చిమ తీరంలో ముంబైకంటే తూర్పు తీరప్రాంతానికి నాగ్పూర్ను సమర్థవంతంగా చేరువ చేస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి గురించి గడ్కరీ ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన సొరంగ ప్రాజెక్టులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) చేపట్టిందని చెప్పారు. జోజిలా టన్నెల్ ఒక మైలురాయిగా మరియు ప్రపంచంలోని అత్యంత పొడవైన రహదారి సొరంగాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశంజమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఇతర మారుమూల మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో ప్రస్తుతం అనేక సొరంగ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నాగ్పూర్ భవిష్యత్తు అభివృద్ధి గురించి మాట్లాడుతూ, NHAI-మద్దతు గల ప్రాజెక్టుల ద్వారా గణనీయమైన పెట్టుబడులతో నగరం భారీగా మారిపోనుందని గడ్కరీ చెప్పారు. ప్రజామౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పౌర-కేంద్రీకృత సౌకర్యాల కల్పనపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.ప్రతిపాదిత కార్యక్రమాలలో ఆర్థికంగా బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేలా నగరం అంతటా 25 స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే ఐదేళ్లలో, నాగ్పూర్లో ఒకేసారి దాదాపు లక్ష మందికి సరిపడా ప్లేగ్రౌండ్ మౌలిక సదుపాయాలు లభిస్తాయని, అదే సమయంలో మార్కెట్లు మరియు బహిరంగ ప్రదేశాలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. -
కొత్త ఫోన్.. కొత్త బైకు.. ప్రాణం తీసిన ఫోటోషూట్!
కీసర: బంధువులైన ముగ్గురు యువకుల్లో ఒకరు కొత్తగా స్కూటీ, మొబైల్ కొన్నారు. ఆ సంతోషంలో కలిసి ఫోటోలు దిగాలనుకున్నారు. అనుకుందే తడవుగా కొత్త బైకుపై ముగ్గురు కలిసి తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా.. ఓ యువకుడి ఇయర్ బడ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునే క్రమంలో నీట మునగగా.. మరో యువకుడు కాపాడేందుకు ప్రయతి్నంచి బురద నీటిలో మునిగిపోయాడు. వీరిని కాపాడేందుకు మూడో యువకుడు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది.కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం ఆదర్శ్నగర్కు చెందిన కెవిన్ ఆంటోని(19) కొత్త స్కూటీ, మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. బంధువులైన వాలెంటైన్ టోని(20), యాప్రాల్కు చెందిన అమోస్ జోసఫ్లతో కలిసి ఫొటోషూట్ చేయాలని భావించి కొత్త స్కూటీపై తిమ్మాయిపల్లి సమీపంలోని పెద్ద చెరువుకు వచ్చారు. ఈత కొట్టేందుకు ముగ్గురు చెరువులోకి దిగారు. సెల్ఫోన్తో ఫొటోలు దిగుతుండగా చెవికి పెట్టుకున్న ఇయర్ బర్డ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు వాలెంటైన్ టోని వెళ్లాడు. అతని వెనకాలే కెవిన్ ఆంటోని వెళ్లాడు. ఇద్దరు నీట మునిగిపోవడం గమనించిన అమోస్జోసఫ్ వారిని కాపాడేందుకు ప్రయతి్నంచాడు. అక్కడ బురదతో పాటు లోతుగా ఉండటంతో వారిద్దరూ నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో కెవిన్ ఆంటోని మృతదేహాం వెలికితీశారు. గల్లంతైన వాలెంటైన్ టోని కోసం తీవ్రంగా గాలించారు. సాయంత్రం పొద్దుపోయి చీకటిగా ఉండటంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడుతామని సిఐ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతిచెందిన కెవిన్ ఆంటోని తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కాగా ముగ్గురు యువకులు ఇటీవలే ఇంటర్ పూర్తి చేశారు. మృతిచెందిన కెవిన్ ఆంటోని, కాపాడేందుకు యతి్నంచిన అమోస్ జోసఫ్లు ఇద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కాగా, గల్లంతైన వాలెంటైన్ టోని వీరికి వరుసకు బాబాయి అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్!
కంటోన్మెంట్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఘోరీ నగర్కు చెందిన గయాజుద్దీన్ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ కిరాణాషాపు నిర్వహించాడు. ఆ తరువాత నుంచీ ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యతో గొడవలు మొదలయ్యారు.ఈ క్రమంలో భార్య పిల్లలను తీసుకుని ఉప్పుగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భార్య, భర్తల నడుమ విభేదాలు ముదరడంతో కౌన్సెలింగ్కు హాజరవుతున్నారు. తన పిల్లలను చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదంటూ గయాజుద్దీన్ కుటుంబసభ్యులతో వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గయాజుద్దీన్ సోదరుడు రియాజుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం భారత యువ క్రీడాభిమానులకు అలరించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక కావడం విశేషం. నేడు ప్రారంభం కానున్న రగ్బీ లీగ్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో 34, మహిళల విభాగంలో 14 కలిపి 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల విభాగంలో 6 టీమ్లో బరిలో నిలిచాయి. చెన్నై బుల్స్ డిఫెండింగ్ చాంపియన్ కాగా...హైదరాబాద్ హీరోస్, ఢిల్లీ రెడ్స్, కోల్కతా బంగా టైగర్స్, ముంబై డ్రీమర్స్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ పోటీ పడుతున్నాయి. గత ఏడాది టోర్నీలో హైదరాబాద్ హీరోస్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇవే పేర్లతో ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జట్లకు మహిళల విభాగంలో ప్రాతినిధ్యం లేదు. రగ్బీ సెవెన్ ఫార్మాట్లో లీగ్ను నిర్వహిస్తారు. 22 నిమిషాల పాటు జరిగే ఒక్కో మ్యాచ్ను నాలుగు క్వార్టర్లుగా నిర్వహిస్తారు. మ్యాచ్లో ఒక్కో క్వార్టర్ తర్వాత 2 నిమిషాల చొప్పున మూడు ‘బ్రేక్’లు ఉంటాయి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రీమియర్ లీగ్ కమిషనర్ అయిన రాహుల్ బోస్ ట్రోఫీతో పాటు టోర్నీ ప్రత్యేక బంతిని ఆవిష్కరించారు. -
సైన్యానికి హైదరాబాదీ డ్రోన్లు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే–250ఈ రకం డ్రోన్లను అందజేసింది. రూ. 72 కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ డ్రోన్లను నాసిక్లోని సదరన్ కమాండ్ అధికారులకు అందించినట్లు సంస్థ సీఈవో యశ్వంత్ బొంతు సోమవారం తెలిపారు. మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయనుంది.డ్రోగో ఏరోస్పేస్ రూపొందించిన జేకే–250ఈ రకం డ్రోన్లు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 3 గంటలపాటు నిరంతరాయంగా గగనతలంలో ప్రయాణించగలవు. నిఘా, పర్య వేక్షణతోపాటు ఇతర సైనిక అవసరాలకు ఇవి ఉప యోగ పడతాయి. హైదరాబాద్లోని మాదాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రోగో డ్రోన్స్ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్గా మార్చుకుంది. డ్రోన్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికతల అభివృద్ధి, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందించే సంస్థగా విస్తరించింది.రక్షణ, నిఘా వ్యవస్థలు, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం డ్రోగో ఏరోస్పేస్కు నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కొత్త ప్లాంట్ ప్రారంభంతో మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు యశ్వంత్ బొంతు వివరించారు. -
పసిపాపతో మహిళ బిల్డింగ్పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్కు తరలించారు.కేసు ఏంటి? ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప. రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మెట్రోకు అనుమతి లేకపోవడం సీఎం అసమర్థతకు నిదర్శనం.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్ను పట్టించుకోవడం లేదన్నారు.ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.అంతకు ముందు మెట్రో ఫేజ్-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు. -
సమాచారం ఇవ్వలేదని? పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
-
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
-
సినీ నటికి లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పై నటి ఫిర్యాదు
-
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి(ఆది,సోమ, మంగళ) పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్జీ భారీ మద్దతు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. భారీగా పోటెత్తిన Gen-z
-
హైడ్రాలో బైక్ టీమ్లు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా... ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి. ప్రతి బైక్పై ఇద్దరు సిబ్బంది.. ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్ఎఫ్కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్ఎఫ్ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ బైక్ టీమ్లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్ టీమ్లకు అందించారు. ప్రతి బైక్పైనా ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్ల్లో అత్యధికం ఐటీ కారిడార్తో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. -
గగనంలో వైమానిక అబ్బురం..!
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ఎంఎక్–2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగ’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. -
ప్రియురాలితో కలసి జిమ్ ట్రైనర్ వల.. మహిళా పైలట్ను
సనత్నగర్: ప్రియురాలితో పాటు జిమ్కు వచ్చే మహిళా పైలట్ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్ ట్రైనర్ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్ను ఒప్పించే బాధ్యతను కూడా ఆమెపై పెట్టాడు. ఇందుకు మహిళా పైలట్ నిరాకరించడంతో ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియా వేదికగా ఆమె పట్ల అసభ్యకర సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించగా జిమ్ ట్రైనర్తో పాటు అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ చౌరస్తా సమీపంలోని కల్ట్ ఫిట్నెస్ జిమ్ మేనేజర్, ట్రైనర్గా సంతోష్గౌడ్ వ్యవహరిస్తున్నాడు. ఇదే జిమ్కు వచ్చే మహిళా పైలట్పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు తన ప్రియురాలు రజనితో కలిసి పథకం వేశాడు. ప్రియురాలి ద్వారా మహిళా పైలట్పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్గౌడ్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర సందేశాలు పంపించాడు. వేధింపులు భరించలేక మహిళా పైలట్ సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంతోష్గౌడ్, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో హైఅలర్ట్... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
-
హైదరాబాద్లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం
హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్ 14వ తేదీ) ఇందిరా పార్క్ దర్నా చౌక్ వద్ద ఆందోళనకు ప్లాన్ చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. -
హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికి విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా... రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే... ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో... క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు... హైదరాబాద్ ను ఒక ల్యాంచ్ ప్యాడ్ తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా... కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆవిష్కరణలు కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్ కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్ ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
హైదరాబాద్లో జోరు వాన (ఫొటోలు)
-
హైదరాబాద్లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీలో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనుంది. మన దేశంలో టెస్లాకిది ఐదో సెంటర్.కాగా.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఆక్టేవ్ బ్లాక్లో రానున్న ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 6 సీటింగ్ కెపాసిటీ టెస్లా వై ఎల్ (లాంగ్– వీల్ బేస్) మోడల్ కారును ప్రదర్శించనున్నారు. 88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ఫీచర్స్తో ఉన్న ఈ కారు.. 5 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరులో కొలువుదీరిన టెస్లా షోరూమ్లు.. తాజాగా భాగ్యనగరానికి రానున్నాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
బిడ్డతో పాటు బిల్డింగ్ పైనుంచి దూకిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
-
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
-
‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ల్యాప్టాప్లో పని చేసుకుంటూ బైక్ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా స్పందించారు.రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా… pic.twitter.com/qSTFaFvf3w— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 13, 2026 -
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. సిద్ధిపేట్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది.శంషాబాద్ అతలాకుతలం..హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలాకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలుభారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. హైదరాబాద్లో ఉన్నతాధికారులు హై అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను అలర్ట్గా ఉంచాలని సీఎం ఆదేశించారు.సంగారెడ్డిలో ఈదురుగాలుల బీభత్సంసంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొండాపూర్ మండలంలో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. సదాశివపేట వద్ద రహదారిపై భారీ వృక్షం గాలికి విరిగిపడింది. సదాశివపేట చౌరస్తాలో బలమైన ఈదురుగాలులకు పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ షెడ్డు నేలకూలింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.చౌటుప్పల్లో భారీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్నీలో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్లో ఉంటుందన్నారు. ఎల్నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు. -
హైదరాబాద్లో బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి..
హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.భారత్లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. -
కూకట్పల్లి ప్రజలు ఏం పాపం చేశారు..?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు కానీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో వివిధ విబాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.నియోజకవర్గంలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 20 ఏళ్ల కిందటి సమస్యలను రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ చూస్తున్నారన్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి తమ హయాంలో 9 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.నియోజకవర్గంలోని డివిజన్లను మూడు ముక్కలు చేసి మాల్కాజ్గిరి ఎంఎంసీలో కలపడంతో బోయిన్పల్లి సర్కిల్ కార్యాయం ఎక్కడుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్కిల్ అదికారులెవరో ఎమ్మెల్యేగా తనకే తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మెరుగు పర్చాల్సి ఉందన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ నుంచి ఎమ్మెలేకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: హెచ్ఎండీఏ భూ వేలంపై నీలినీడలుసమావేశంలో మాజీ కౌన్సిలర్ ముద్దం నర్సింహయాదవ్. గజ్జెల నాగేశ్, సతీష్గౌడ్, డిప్యూటి కమిషనర్ డాక్నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సౌందర్య, వరుణ్దేవ్, శానిటేషన్ డీఈ సందీప్, వాటర్ వర్క్స్ జీఎం సునీల్, డీజీఎం కృష్ణమాచారి, మేనేజర్ నవీన్, టీపీఎస్ కుర్మయ్య, ఆర్ఐ నాగమణి సర్వేయర్ అనిత నాయకులు హరినాథ్, నరేందర్గౌడ్, బల్వంత్రెడ్డి, కర్రె జంగయ్య, మక్కాల నర్సింగ్రావు మాక్కల సత్యనారాయణ, సయ్యద్ ఏజాజ్ లలితా, ఉదయ్రాణి, సరోజదేవి కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాడొక కామాంధుడు.. మహిళా పైలట్ ని తనతో గడపమని..
-
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
FLO StyleTatva 6వ ఎడిషన్ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
-
మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్.. యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ
శ్రీనగర్కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన యువతి టెలీకాలర్గా పనిచేస్తూ రహమత్నగర్లో నివాసముంటోంది.ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని జహీర్ అబ్బాస్ అనే యువకుడు నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్ళికి యువతి కుంటుంబీకులు అంగీకరించారు. మరో యువతితో నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి జహీర్ను దూరం పెట్టింది. అయితే జహీర్ యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు తెలిసిన వారికి ఫొన్ చేసి, మెసేజులు పంపి దుష్ప్రచారం చేశాడు. దీంతో యువతి తనకు ప్రాణహాని ఉందని మదురానగర్ పోలీసులకు పిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాన్సీ క్రేజ్! అంకెల్లోనే అదృష్టముందని..
సాక్షి, సిటీబ్యూరో: ‘టీజీ 09 జీ 9999’ రూ.25.50 లక్షలు.. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఆర్టీఏ ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్లో ఆల్ నైన్స్ కోసం ఓ ప్రైవేట్ సంస్థ చెల్లించిన మొత్తం ఇది. నవంబర్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ‘టీజీ 09హెచ్ 9999’ కోసం ఓ వాహన యజమాని రూ.22.72 లక్షలు చెల్లించారు. అదే ఆల్నైన్స్ కోసం గత జనవరి 6న ఆన్లైన్ బిడ్డింగ్లో మరో సంస్థ రూ.18 లక్షలతో నంబర్ను సొంతం చేసుకుంది. ఒక్క ఆల్నైన్స్ మాత్రమే కాదు. అన్ని రకాల ప్రత్యేక నంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. ‘టీజీ 09 హెచ్ 0234’ నంబర్ కోసం ఓ వాహన యజమాని రూ.1.01 లక్షలు చెల్లించారు. అదృష్ట సంఖ్యలుగా భావించే నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రవాణా శాఖ మూడు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్ కోసం ఏటా భారీ డిమాండ్ నెలకొంటోంది. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలకూ ప్రత్యేక నంబర్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫీజుల రూపంలో, బిడ్డింగ్ ద్వారా రవాణా శాఖకు ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. వాహనదారుల క్రేజ్ను, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తాజాగా ప్రత్యేక నంబర్ల బిడ్డింగ్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. సాధారణంగా కొత్త వాహనాల తాత్కాలిక రిజి్రస్టేషన్ గడువు 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ గడువు లోపల మాత్రమే నచ్చిన నబర్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. తాజాగా చేసిన సవరణ మేరకు వాహనదారులు 60 రోజుల వరకు పోటీలో పాల్గొనే వెసులుబాటు లభించింది.అంకెల్లోనే అదృష్టముందని.. సాధారణంగా కొన్ని రకాల నంబర్లను వాహనదారులు అదృష్ట సంఖ్యలుగా భావిస్తారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ‘9’ నంబర్ను అదృష్టంగా భావించి దానికే ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో అప్పటి వరకు ఎలాంటి డిమాండ్ లేని ‘9’ నంబర్కు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. అలా సింగిల్ నైన్, ట్రిపుల్ నైన్, ఆల్నైన్ నంబర్లు క్రేజ్గా మారాయి. రైజింగ్ నంబర్లను కూడా చాలా మంది అదృష్టంగా పరిగణిస్తారు. ‘1234’, ‘5678’ వంటి వాటికి డిమాండ్ ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘6’ను అదృష్టసంఖ్యగా భావించారు. దీంతో ఆయన వాహనాలకు ఆ నంబర్లనే ఏర్పాటు చేశారు. క్రమంగా వాహనదారుల్లో ‘6’ తో మొదలై ‘ఆల్ సిక్స్’ వరకు క్రేజ్ పెరిగింది. సినీనటులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తమ వాహనాలకు నచ్చిన నంబర్లను ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయంగా మారింది.బహుమతులుగానూ.. ప్రత్యేక నంబర్లను బహుమతులుగా అందజేసే ఆనవాయితీ కూడా పెరిగింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటిప్రత్యేక సందర్భాల్లో కొత్త వాహనాలతో పాటు, ప్రత్యేక నంబర్లు సైతం కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు బహుమతులుగా అందజేయడం విశేషం. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ ఈ నంబర్ల ఫీజును సైతం గతేడాది భారీగా పెంచింది. ‘ఆల్ నైన్స్’ కోసం రూ.50,000 ఉన్న ఫీజును ఏకంగా రూ.1.5 లక్షల కు, ‘1, 9, 6666’ నంబర్లకు రూ.లక్ష వరకు ఫీజు పెంచింది. ‘99, 999, 3333, 5555’ వంటి నంబర్లకు రూ..50 వేలకు ఫీజు పెంచడం గమనార్హం. -
కాటేదాన్లో.. అస్థి పంజరం కలకలం!
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించడంతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్.. 2 గంటలు నరకయాతన!
ఉప్పల్: స్కైవాక్ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువకుడు దాదాపు బతుకుజీవుడా సుమారు 2 గంటల పాటు అందులో చిక్కుకుని విలవిలలాడాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకుంటాయా.. లేదా? అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు టెక్నీషియన్ వచ్చి చర్యలు చేపట్టడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్ స్కైవాక్పై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్ (22) అనే యువకుడు ఉప్పల్లో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్కు బయలుదేరాడు. ఉప్పల్ రోడ్డు దాటడానికి ౖస్కైవాక్ వంతెన ఎక్కి కిందకు దిగడానికి లిఫ్ట్–6లో వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్ 100, 108 అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.లిఫ్ట్ల మె యింటెనెన్స్ చూస్తున్న హెచ్ఎండీఏ సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. లిఫ్ట్లోని రాహుల్ అరుపులు, కేకలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు 2 గంటల తర్వాత ఎట్టకేలకు టెక్నీíÙయన్ రావడంతో కథ సుఖాంతం అయ్యింది. రాత్రి 11.30 నుంచి 1.15 నిమిషాల వరకు రాహుల్ యువకుడు బిక్కుబిక్కుమంటూ లిఫ్ట్లోనే గడపాల్సి వచ్చింది. తాను హార్ట్ పేషెంట్నని, లిఫ్ట్లో ఇరుక్కోవడంతో భయాందోళన చెందినట్లు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.జడుసుకుంటున్న జనం ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ఎక్కడానికి ప్రయాణికులు జంకుతున్నారు. అందులోనూ లిఫ్ట్లు ప్రమాదకరంగా మారాయంటున్నారు. మొదట్నుంచీ లిఫ్ట్లు మొరాయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ వంతెనకు ఎనిమిది లిఫ్ట్లు, నాలుగు ఎస్కలేటర్లు 24 గంటల పాటు పని చేస్తుంటాయి. రోజూ వేలాది మంది స్కైవాక్ ఎక్కి దిగుతుంటారు.లిఫ్ట్లు, ఎస్కలేటర్ల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. లిఫ్ట్లోఉన్న వారు తలుపులను బలవంతంగా తెరవడం, అటూ ఇటూ లాగడం వల్ల సెన్సా ర్లు పని చేయవని, గురువారం రాత్రి అదే జరిగిందని హెచ్ఎండీఏ అధికారులు వివరణ ఇచ్చారు. టెక్నీíÙయన్ వచి్చన తర్వాతే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయని స్పష్టం చేశారు. -
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
-
మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?
బంజారాహిల్స్: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని లూసిడ్ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్కుమార్ సదరు కానిస్టేబుల్ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్కుమార్, ఆనంద్లపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు. -
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
-
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
అందరివాడు కేన్ మామా...
జెంటిల్మన్ క్రికెటర్ అంటే ఎలా ఉండాలి... పరాజయంలో, మైదానంలో కఠిన సమయంలో, తుది ఫలితంతో గుండె బద్దలైన క్షణంలో కూడా ప్రశాంతంగా కనిపించడమే కాదు... నిగ్రహం కోల్పోకుండా తన ‘క్లాస్’ను కోల్పోకుండా వ్యవహరించాలి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్... ఇలా తన సారథ్యంలో మూడుసార్లూ చివరి మెట్టుపై ఓటమి ఎదురైనప్పుడు కూడా అతను ఎక్కడా గీత దాటలేదు... 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు తమ చేతుల్లోంచి లాక్కున్నట్లుగా ట్రోఫీని కోల్పోయిన సమయంలోనూ అతను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదే చిరునవ్వు, అదే సంయమనం. అందుకే అతను అందరివాడు అయ్యాడు.ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా పలుమార్లు అతను విజయంలో భాగం అయి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. అలాంటి మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడే కేన్ విలియమ్సన్. హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా ‘కేన్ మామా’ అంటూ అభిమానంతో పిలుచుకునే ఈ న్యూజిలాండ్ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 2010 తర్వాత గత దశాబ్దన్నర కాలంలో తమదైన ముద్ర వేసిన ‘ఫ్యాబ్ 4’లలో ఒకడైన కేన్ ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నాడు. -సాక్షి క్రీడా విభాగం న్యూజిలాండ్ క్రికెట్ స్థాయిని పెంచి, తమదైన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ క్రో, రిచర్ట్ హ్యాడ్లీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్ల తర్వాత కేన్ విలియమ్సన్ పేరు కచ్చితంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కేన్ ఆ తర్వాత దూసుకుపోయి పదిహేనేళ్ల పాటు నిలకడైన ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఆడగల నైపుణ్యం కేన్ను సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఈతరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిపింది. ‘ఫ్యాబ్యులస్ 4’లలో ఒకడిగా స్టీవ్ స్మిత్, జో రూట్, విరాట్ కోహ్లిలతో పోటీ పడుతూ పరుగులు సాధించిన విలియమ్సన్ పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన ‘క్లాసిక్’ శైలితో వన్డే క్రికెట్లో చక్కటి గణాంకాలు నమోదు చేసిన ఈ కివీ స్టార్... టి20లకు అనుగుణంగా తన ఆటను మార్చుకొని మంచి ఫలితాలను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం.హైదరాబాదీల అభిమానం...విలియమ్సన్ బ్యాటింగ్ శైలి చూస్తే అతను టి20లకు పనికి రాడని అంతా అనుకుంటారు. కానీ 2014 చాంపియన్స్ లీగ్లోనే అతను 48 బంతుల్లో సెంచరీతో తన వాడిని చూపించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టు ద్వారా హైదరాబాద్ అభిమానులకు అతను చేరువయ్యాడు. 2015 నుంచి 2022 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ‘కేన్ మామా’గానే సుపరిచితుడు. 2016 టైటిల్ విజయంలో భాగంగా ఉన్నా... అతను పెద్ద పాత్ర పోషించలేదు. కానీ 2018లో డేవిడ్ వార్నర్ గైర్హాజరులో కేన్ జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. 8 అర్ధ సెంచరీలు సహా 735 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకొని ముందుండి నడిపించాడు. తాజా సీజన్లో లక్నో జట్టు సలహాదారుడిగా ఇప్పటికే ఐపీఎల్లో కేన్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది.‘వరల్డ్’ విజేతగా...టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విలియమ్సన్ సొంతం. అయితే అరుదైన 10 వేల మైలురాయికి కేవలం 485 పరుగుల దూరంలో ఉన్న అతను సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం అనూహ్యం. అయితే తాను ఎప్పుడైనా వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టు గురించి ఆలోచించానని, ఇప్పుడు ‘టీమ్ షీట్లో ఒక పేరు’గా మాత్రమే ఉండి మరో రెండు మ్యాచ్లు పెంచదల్చుకోలేదని తన ఉద్దేశాన్ని కేన్ స్పష్టంగా చెప్పాడు. చాలా కాలంగా అతను ఫామ్లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. తనకు నచ్చిన టోర్నీలు లేదా సిరీస్లలో ఆడేందుకు 2024 జూన్లోనే అతను న్యూజిలాండ్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగానే భారత గడ్డపై న్యూజిలాండ్ 3–0తో గెలిచిన సిరీస్లో అతను ఆడలేదు. గత 9 ఇన్నింగ్స్లలో ఒకటే అర్ధసెంచరీ చేసిన కేన్... తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో 0, 18 పరుగులే నమోదు చేశాడు. దాంతో తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించాడు. కెప్టెన్గా 2021 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను గెలిపించడం విలియమ్సన్ కెరీర్లోనే అత్యుత్తమ ఘట్టం. భారత్పై లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్లో అతను అజేయ అర్ధసెంచరీ సాధించాడు. గుండె పగిలిన క్షణం...వన్డే క్రికెట్లో కూడా బ్యాటర్గా కేన్ తనదైన ముద్ర వేశాడు. మూడో స్థానంలో అతను ఏకంగా 51.16 సగటుతో పరుగులు సాధించడం అతని బ్యాటింగ్ గొప్పతనాన్ని చూపిస్తుంది. అతని 15 వన్డే సెంచరీల్లో 11 సార్లు జట్టు విజయం సాధించింది. అయితే కేన్ను మరచిపోకుండా చేసిన క్షణం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చింది. ఈ టోర్నీలో అద్భుత ఆటతో 9 ఇన్నింగ్స్లలో అతను 578 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లపై శతకాలతో పాటు సెమీస్లో భారత్పై విజయంలో 67 పరుగులతో కీలకపాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో కేన్ బృందాన్ని దురదృష్టం వెంటాడింది. మ్యాచ్, సూపర్ ఓవర్లలో సమంగా నిలిచినా కూడా ట్రోఫీ దక్కలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘బౌండరీ కౌంట్’ రూల్తో కివీస్ రన్నరప్గానే నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్ మినహా ఇతర క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో బాధపడిందంటే అతిశయోక్తి కాదు. టీమ్ను ఫైనల్ వరకు చేర్చిన విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ రికార్డుటెస్టులు 110 పరుగులు 9515 పరుగులు సగటు 54.06 సెంచరీలు 33 అర్ధ సెంచరీలు 38 అత్యధిక స్కోరు 251వన్డేలు 175 పరుగులు 7256 సగటు 48.69 సెంచరీలు 15 అర్ధ సెంచరీలు 47 అత్యధిక స్కోరు 148టి20లు 93 పరుగులు 2575 సగటు 33.44 అర్ధ సెంచరీలు 18 అత్యధిక స్కోరు 95 -
భాగ్య ‘నరకం’
సాక్షి, హైదరాబాద్: వానాకాలం వచ్చేసింది.. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగింది..కానీ, హైదరాబాద్ నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. చినుకు రాలితే వణికిపోతోంది. గతేడాది భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ, అదేస్థాయి వానలు ఈసారి కురిస్తే అంతకంటే ఎక్కువ ఆగమాగమయ్యే పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. నగరంలో ఏదైనా సమస్య నెలకొంటే ముందుగా అటువైపు వాహనాలను నియంత్రిస్తారు, లేకుంటే ఆ రూట్ ట్రాఫిక్లో చిక్కుకుంటుంది.గత ఏడాది భారీ వర్షాలు, భయంకర ట్రాఫిక్ జామ్లను సృష్టించిన ప్రాంతాల్లో కొత్తగా వేల సంఖ్యలో వాహనాలు వచ్చి చేరుతున్నాయి. అందుకే నగరం ఇప్పుడు వణికిపోతోంది. పైగా నగరం మరింత విస్తరించింది..కొత్త జనావాసాలు వెలిశాయి. ఇతర జిల్లాలు, ఏపీ నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్యా పెరిగింది. రోడ్లు మరింత కుంచించుకుపోయాయి.. అదనంగా ప్రత్యామ్నాయ దారులేవీ అందుబాటులోకి రాలేదు. అందుకే ఇప్పుడు నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. వాహన వరద.. నాలుగో స్థానంలో హైదరాబాద్ దేశంలో ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. గత వానాకాలం ముగిసిన తర్వాత నగరంలో ఏకంగా 5,35 లక్షల వాహనాలు రోడ్డెకెక్కాయి. దీంతో నగరంలో మొత్తం వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరువైంది. ఇప్పుడు ఇదే భాగ్యనగర గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గతేడాది నాటికి ఉన్న వాహనాలకు తగ్గ రోడ్డు నెట్వర్క్ హైదరాబాద్కు లేదు. వాణిజ్య ప్రాంతాల విస్తరణ మీద నగరంలో ఎక్కడా నియంత్రణ లేదు. వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చే విషయంలో ప్రణాళిక అంటూ లేని దుస్థితి.ఆయా ప్రాంతాలో పార్కింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఈ తరుణంలో కొత్తగా లక్షల వాహనాలు రోడ్డెక్కితే పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే చాలా ప్రాంతాల్లో గంటలతరబడి ట్రాఫిక్లో బంధీ కావాల్సిందే. ఈనెల 9న భారీ వర్షంతో ఈసారి తొలకరి పలకరించింది. నాలెడ్జి సిటీ, కొండాపూర్, ఐకియా జంక్షన్, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాయదుర్గం, మెహిదీపట్నం, సచివాలయం, ముషీరాబాద్, పాతనగరం... ఇలా ప్రధాన ప్రాంతాలు సాయంత్రం మూడు గంటలపాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. కేవలం 4–5 సెంటీమీటర్ల మేర కురిసిన ఈ వాన 30 శాతం నగరాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహంలోకి నెట్టేసింది. మరి వరుస పెట్టి 10 సెం.మీ. మేర వాన కురిస్తే నగరం రోజు మొత్తం స్తంభించాల్సిందే. గతేడాది అనుభవాలేంటి..? గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. కేవలం గంట సమయంలోనే 10 సెం.మీ. వాన కురిసిన దాఖలాలు ఉండటంతో మెరుపు వరదలు సంభవించాయి. గత సీజన్లో మొత్తం 18 మార్లు నగరం ట్రాఫిక్లో బంధీ కాగా, అరడజను పర్యాయాలు గ్రిడ్లాక్ పరిస్థితి నెలకొంది. యావత్ నగరం గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో నరకం అనుభవించాల్సి వచ్చింది. ⇒ ఏప్రిల్ 3–4,(ప్రీ–మాన్సూన్): జడివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు కురిసి భారీ వృక్షాలను కూడా కూకటి వేళ్లతో పెకిలించేసింది. ఫలితం నగరం మొత్తం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ⇒ ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఆరు భారీ వర్షాలు కురిశాయి. వానలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రధాన రోడ్లు చెరువుల్లా మారి గంటలపాటు వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది. ⇒ సెప్టెంబర్ 17 రాత్రి కురిసిన వాన రోడ్లను ముంచెత్తింది. ప్రాణనష్టం కూడా నెలకొంది. సెప్టెంబర్ 22న గంట పాటు ఏకబిగిన కురిసిన వానలు నగరం మొత్తాన్ని స్తంభింపజేశాయి. ⇒ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 29న కురిసిన కుండపోత పీక్ గ్రిడ్లాక్గా నిలిచింది. ఐటీ కారిడార్లో మితిమీరిన కేంద్రీకరణ మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, మైండ్స్పేస్ జంక్షన్, కోకాపేట లాంటి ఆధునిక హైదరాబాద్ ప్రాంతాల్లో అతి భారీ భవన సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సగటున ఇంటికి రెండు కార్లున్నాయని తేలింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అలాంటి సమయంలో వర్షం కురిస్తే పరిస్థితి బీభత్సంగా మారుతోంది. ఈ ఏడాది తొలి వాన ఈ ప్రాంతాలను ఆగమాగం చేసింది. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ ఫ్లైఓవర్లను నిర్మించే దిశగా జరిగిన ఆలోచనలో పదో వంతు కూడా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విషయంలో లేకపోవటమే అతి పెద్ద సమస్య. నగరంలో రెండుమూడు సెం.మీ. వానను తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అంతకుమించి ఒక్క చినుకు రాలినా అతలాకుతలమే. భారీ నిర్మాణాలకు అనుమతిచ్చే ముందే ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే వ్యూహం ప్రభుత్వం వద్ద లేదు. ఇలా చేస్తే కొంత మెరుగు ⇒ ఆఫీస్ వేళల్లో మార్పులు : ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నీ ఒకే సమయానికి కాకుండా, గంట, రెండు గంటల వ్యవధితో విడతల వారీగా లీవ్/లాగిన్ టైమింగ్స్ పెట్టాలి. ⇒ కార్ పూలింగ్ –ప్రజా రవాణా: ఒక్కరే కారులో వెళ్లకుండా నలుగురు కలిసి ‘కార్ పూలింగ్’చేయడం ఇలాంటి సందర్భంలో చాలా ఉపయోగం, ఇక సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించే అలవాటు పెంచుకోవాల్సిందే. ⇒ నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు: నగరంలో నీరు నిలిచే 350కి పైగా ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక మోటార్లు ఉంచి, çవరద నీటిని నాలాల్లోకి పంప్ చేయాలి. ⇒ హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ ఉమ్మడి కార్యాచరణ: వర్షం పడగానే రంగంలోకి దిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని జంక్షన్లలో మోహరించాలి. ⇒ వర్క్ఫ్రమ్ హోమ్: భారీ వర్ష సూచనలు అందిన సమయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులుండే ఐటీ కంపెనీలకు ముందే సమాచారం ఇచ్చి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ప్రకటించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ⇒ రోడ్లపై గుంతల పూడ్చివేత: వీలైనంత తొందరగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. అక్రమ పార్కింగులను నియంత్రించాలి. రోడ్డు ఆక్రమణలు తొలగించాలి. ⇒ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు విసరొద్దు.. అవి డ్రైనేజీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వరద నీళ్లు వేగంగా పారకుండా అడ్డుకుంటున్నాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ విమానం వెనక్కి మళ్లింపుహైదరాబాద్లో భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు. -
హైదరాబాద్ కు ప్రమాద ఘంటికలు! ఆక్స్ఫర్డ్ షాకింగ్ హెచ్చరిక
-
భారత్ అండర్–19 క్రికెట్ జట్టులో నల్గొండ కుర్రాడు..
యాదగిరిగుట్ట: భారత్ అండర్ –19 క్రికెట్ జట్టుకు రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు ఉట్కూరి యష్వీర్గౌడ్ ఎంపికయ్యాడు. జూలై 1వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ అండర్ 19 క్రికెట్ టీమ్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో యష్వీర్గౌడ్ ఉన్నాడు.యష్వీర్గౌడ్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అంబర్పేట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా అండర్ –19 హైదరాబాద్ టీమ్లో ఆయన ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో బెంగళూర్లో బీసీసీఐ ఇచ్చిన శిక్షణలో పాల్గొని ఆకర్షించాడు. దీంతో బీసీసీఐ యష్వీర్గౌడ్ను శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు బౌలింగ్ ఆల్రౌండర్గా ఎంపిక చేసింది.మరో రెండు రోజుల్లో భారత్ అండర్–19 జట్టుతో కలిసి బెంగళూర్ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తల్లిదండ్రులు ఉట్కూరి రాజ్కుమార్, వాణి, బాబాయ్ దీపక్కుమార్ గురువారం సాక్షికి తెలిపారు. భారత్ అండర్–19 జట్టుకు యష్వీర్ గౌడ్ ఎంపిక కావడం రాజాపేటకే కాదు, తెలంగాణకే గర్వకారణమని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
సాఫీగా.. సాగేలా..! కారిడార్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళికలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారిడార్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా ప్రణాళికలను రూపొందించింది. కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లానింగ్లో భాగంగా రెండు మార్గాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ నుంచి తార్నాక వరకు, కూకట్పల్లి హౌసింగ్బోర్డు నుంచి గండిమైసమ్మ వరకు ప్రతిపాదించారు. ఒవైసీ నుంచి తార్నాక వరకు సుమారు 20 కి.మీ, కేపీహెచ్బీ వై జంక్షన్ నుంచి గండిమైసమ్మ వరకు 20 కి.మీ. వరకు ఉంటుంది. కామన్ డక్ట్ల నిర్మాణం వల్ల ఈ రూట్లో వాహనాలు నిరాటంకంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది..రోడ్లు 100 శాతం వినియోగం వివిధ కారణాలతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో రోడ్లను వినియోగించుకోలేకపోతున్నట్లు హుమ్టా గుర్తించింది. ఫైబర్ కేబుళ్లు, డ్రైనేజీపైపులైన్లు, విద్యుత్ వైర్లు వంటి వివిధ అవసరాల కోసం వేర్వేరుగా లైన్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్ల కోసం కేటాయించిన స్థలంఆక్రమణకు గురవుతోంది. మరోవైపు ఫుట్పాత్లు, పేవెమెంట్లపైన కూడా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దీంతో 60 ఫీట్ల వెడల్పు రోడ్లు ఉన్నప్పటికీ పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఈ క్రమంలో అన్ని మార్గాల్లో కారిడార్ల అభివృద్ధి చేపడితే రహదారులను 100 శాతం వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కామన్డక్ట్లతో ఫుట్పాత్లు, పేవ్మెంట్లను సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు రోడ్ల వినియోగం కూడా పూర్తిస్థాయిలో ఉంటుంది. రోడ్లపై వరదనీరు నిలువకుండా చేస్తుంది. ప్రయోజనాలు ఇలా..కారిడార్ల అభివృద్ధితో ప్రత్యేకంగా బస్ బేలు, బస్ లైన్ల ఏర్పాటు.ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్లు, నాన్ మోటరైజ్డ్ వాహనాల మార్గాలు.ట్రాఫిక్ నిరాటంకంగా కొనసాగే అవకాశం.అక్కడక్కడ బఫర్జోన్ల ఏర్పాటు. గ్రీనరీ అభివృద్ధి.ఫుట్పాత్లు, పేవ్మెంట్లు వంద శాతం వినియోగం.యూనిఫామ్ క్రాస్ సెక్షన్స్తో ఎక్కడా బాటిల్నెక్స్ ఉండవు.రోడ్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. -
చెంబులో 'కీ'... అదే కలిసొచ్చింది దొంగలకి
గచ్చిబౌలి: ఇంటి యజమాని నిర్లక్ష్యంతో కలశం చెంబులో లాకర్ కీ పెట్టడంతోనే హిల్రిడ్జ్ విల్లాస్లో భారీ చోరీ చోటు చేసుకుందని, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వా«దీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నేపాల్లోని కైలాలి జిల్లా మోహన్యాల్కు చెందిన దంపతులు కమల్ షాహీ (32), విమల్ షాహీ (30)లు నగరంలోని గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లా నంబర్ 73లో నివసించే ప్రకాశ్ పాయ్ వద్ద వాచ్మన్, సర్వెంటుగా చేరారు.ఇంట్లోంచి వెళ్లిన కొద్దిసేపటికే.. ఈ నెల 6న ప్రకాశ్, ఆయన భార్య వందన, కుమారుడు అభిజిత్లు ముంబై వెళ్లారు. సహ నిందితుడు సురేష్ షాహీ కొద్ది సేపటికే కిటికీ యూపీవీసీ లాక్ బ్రేక్ చేసి ఇంటి లోపలికి వెళ్లాడు. సెంట్రల్ లాక్ తీశాడు. బెడ్రూంలో లాకర్పై ఉన్న కలశం చెంబులో కీతో లాకర్ ఓపెన్ చేసి బంగారు ఆభరణాలు బయటకు తీశాడు. కమల్, విమల్ వద్ద నగలు పెట్టాడు. ఆ సమయంలోనే పక్కనున్న వారు గమనించి సురే‹Ùను సమీప విల్లాలో ఉండే ప్రకాశ్ పాయ్ కూతురు వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి సురేష్ మాత్రం విల్లాలో ఉన్నాడు. కమల్, విమల్ ఎన్బీటీ నగర్లోని విమల్ సోదరి కల్పన షాహీని తీసుకొని సికింద్రాబాద్ నుంచి రైలులో పరారయ్యారు. మరునాటి ఉదయం సురేష్ కూడా విల్లా నుంచి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచి్చన ప్రకాష్ పాయ్ లాకర్లో నగలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ నంబర్ ఆధారంగా.. ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు ఎన్బీటీ నగర్కు ఆటో వెళ్లినట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. కొత్త సిమ్ కార్డు కవర్పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఎస్టీఎఫ్ పోలీసుల సహకారంతో కమల్, విమల్, కల్పన, పనిలో చేరి్పంచిన బిశ్వ కర్మను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన సూత్రధారి సురేష్ షాహీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు..
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్ప్లాంట్ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్లోని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ ఏఐఎస్ ఏపీవీఎన్ శర్మతో పాటు లివర్ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు. ఫ్యాటీ లివర్ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్ సిరోసిస్గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. -
‘హీటె’క్ సిటీ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 30 నగరాలు తీవ్ర మైన వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటుండగా అందులో హైదరాబాద్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘మూవింగ్ బియాండ్ ఎక్స్పోజర్: ఎ గ్లోబల్లీ కంపేరబుల్ ఫ్రేమ్వర్క్ ఫర్ హీట్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ సిటీస్’ పేరిట మొత్తం 205 నగరాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వేగవంతమైన పట్ట ణ విస్తరణ, తగ్గిపోతున్న పచ్చదనం, ఎయిర్ కండిషనర్లపై ఆధారపడటం పెరుగుతుండడం వంటివి వేడి సంబంధిత అనారోగ్య సంక్షోభానికి కీలక కారణాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మన నగరానికీ ‘వేడి’మన దేశంలో అహ్మదాబాద్, నాగ్పూర్ మదురై అధిక వేడి ప్రమాదాన్ని కలిగి ఉండగా, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక దాదాపు 80 లక్షల మంది నివసించే హైదరాబాద్ ఈ నగరాల తర్వాతే ఉండగా.. హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో మొత్తం 0.68 వేడి ప్రమాద స్కోరును నమోదు చేసింది. ఇది కైరో, మనీలా, హో చి మిన్ సిటీ వంటి ప్రమాదం ఉన్న నగరాల కంటే కేవలం 0.05 నుంచి 0.10 పాయింట్లతో స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉండగా, బ్యాంకాక్, హనోయ్ వంటి నగరాల కంటే అధ్వాన్నంగా ఉంది. ఈ ఇండెక్స్ అనేది ఒక నిర్దిష్ట జనాభాకు తీవ్రమైన వేడి కలిగించే ప్రమాదాన్ని అంచనా వేసే ఒక కొలమానం. ఈ సూచిక కేవలం ఉష్ణోగ్రత ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉన్న శీతలీకరణ మౌలిక సదుపాయాలు, పచ్చదనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. నగరవాసుల్లో అధిక శాతం మందికి ఈ రెండూ పరిమితంగానే అందుబాటులో ఉండడం వల్ల వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతోంది. క్షేత్రస్థాయిలోని గణాంకాలు కూడా అధ్యయన ఫలితాల్ని బలోపేతం చేస్తూ పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను మించిన రోజులు 47 నమోదు కాగా.. గత 10 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. -
హైదరాబాద్కు రూ.లక్ష కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా నిలుస్తున్న ఆరు మెట్రో నగరాల సమగ్ర అభివృద్ధికి ఎం–6 టాస్క్ఫోర్స్ పేరుతో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నగరాలను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఒక్కో మెట్రో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాభివృధ్ధికి రూ. లక్ష కోట్లివ్వాలని కోరింది.ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నివసిస్తుండగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు పావు వంతు (25 శాతం) వాటాను ఇవే సమకూరుస్తున్నాయని.. అందువల్ల ఈ నగరాల అభివృద్ధిని సాధారణ వ్యయంగా కాకుండా, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని రేవంత్రెడ్డి సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక, పరిపాలనా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రేవంత్రెడ్డి వివరించారు. ‘2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎస్జీడీపీ సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి విప్లవం... విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, భోజనం, రవాణా, డిజిటల్ లెర్నింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం సుమా రు రూ. 24,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ ని వివరించారు.65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కోర్సులు అందిస్తున్నామన్నారు. 26 వేలకుపైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించామని.. ఉపాధ్యాయుల కొరత తీ ర్చేందుకు 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సీఎం వివరించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సీఎంలు వస్తే యంగ్ ఇండియా స్కూళ్లు చూపిస్తాం.. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి లేదా అధికారులైనా తెలంగాణలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చూడాలనుకుంటే సంతోషంగా చూపిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు.నీతి ఆయోగ్కు సీఎం చేసిన వినతులు ఇవీ..⇒ తెలంగాణ విద్యార్థుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఐఐఎంను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. ⇒ హైదరాబాద్ విస్తరణకు వెన్నెముకగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు వేగవంతానికి సహకరించాలి. ⇒ భారత్ ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించే 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి. ⇒ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 విస్తరణకు సహకారం అందించాలి. ⇒ హైదరాబాద్ చారిత్రక జీవనాడి అయిన మూసీ నదిని ప్రపంచస్థాయి రివర్ఫ్రంట్గా అభివృద్ధి చేసేందుకు నిధులివ్వాలి. ⇒ 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్, నెట్ జీరో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక మద్దతు ఇవ్వాలి. ⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు, పీఎంకేఎస్వై సాయం మంజూరు చేయాలి. ళీ సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణకు ప్రాధాన్యమిచ్చి ఎల్రక్టానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీఎంపీ, ఓసాట్ క్లస్టర్లు, మైక్రో ఎల్ఈడీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. -
జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 54.55 కిలోమీటర్ల మేర మిస్సింగ్ లింక్ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత రోడ్లలో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీలో విలీనమైన, శివారు అభివృద్ధి బెల్ట్గా మారిన ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. బడంగ్పేట్, నాదర్గుల్, కుర్మల్గూడ, తుర్కయాంజాల్, మల్లాపూర్, జల్పల్లి పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్ పరిసరాల్లో గొల్లపల్లి, రాళ్లగూడ, ధర్మగిరి ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి తుర్కయాంజాల్ వరకు, మల్లాపూర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మల్గూడ వరకు, కుర్మల్గూడ నుంచి నాదర్గుల్ వరకు, ఆర్సీఐ క్రాస్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ప్రతిపాదించిన రహదారులు దక్షిణ హైదరాబాద్లో కీలక అనుసంధాన మార్గాలుగా మారనున్నాయి.ఎయిర్పోర్ట్ కారిడార్కు ఊతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గణనీయంగా రోడ్ల విస్తరణ ప్రతిపాదించారు. గొల్లపల్లి ఎన్హెచ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు, శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్ వరకు, శంషాబాద్ బస్టాప్ నుంచి రాళ్లగూడలోని ఓయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు పనులు వీటిలో ఉన్నాయి. నార్సింగి– కిస్మత్పూర్ కారిడార్పై ఫోకస్ పశ్చిమ హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న నార్సింగి, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకూ ఈ లింక్ రోడ్ల ద్వారా ఊరట లభించే అవకాశం ఉంది. బైరాగిగూడ నుంచి నార్సింగి వరకు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చేవెళ్ల రోడ్ వరకు కిస్మత్పూర్ మీదుగా, వివేకానంద విగ్రహం నుంచి ప్రతిష్ఠ విల్లాస్ వరకు రహదారి విస్తరణ ప్రతిపాదించారు. దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వరకు, ఫర్మాయిష్ హోటల్ నుంచి తారామతి బారాదరి వరకు (వయా కేంద్రీయ విహార్ అపార్టమెంట్స్) రోడ్డు కూడా వీటిలో ఉంది.కోర్ సిటీలో.. ఖైరతాబాద్ జోన్లో గ్రీన్ల్యాండ్స్ జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి పాటిగడ్డ వరకు, బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గరి రోడ్డు కూడా వీటిలో ఉంది. ఈ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం 1,976 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తెలిపారు. భూసేకరణ సవాల్గా మారనుందన్నారు. చదవండి: హెచ్ఎండీఏ భూ వేలంపై నీలినీడలు -
హెచ్ఎండీఏ భూ వేలంపై నీలినీడలు
హైదరాబాద్: సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థలాన్ని వేలం వేయాలంటూ ఇద్దరు క్లెయిమ్దారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాల 24 గుంటల స్థలం వేలం ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఈ స్థలానికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రెండు సొసైటీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 19న హెచ్ఎండీఏ నిర్వహించతలపెట్టిన బంజారాహిల్స్లోని రూ.1000 కోట్లు విలువ చేసే భూమి వేలంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.షేక్పేట్ మండలం హకీంపేట సర్వేనెంబర్ 102/1లో ఉన్న 8.24 ఎకరాల భూమికి సంబంధించి కొంతభాగం తమ సొంత భూములతో కలిసిపోతుందంటూ యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఈ నెల 19న వేలం వేయాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలోనే అత్యంత ఖరీదైన స్థలాల్లో ఒకటిగా ఉన్న ఈ భూమి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.ఈ భూమికి ఆనుకుని ఉన్న యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు డీమార్కేషన్ చేయాలని కోరుతున్నాయి. తమ పక్కనే ఉన్న ఈ భూములను సుమారు నాలుగు ఎకరాలు హెచ్ఎండీఏ వేలం వేయాలనుకుంటున్న భూమితో కలిసిపోతున్నట్లు ఈ ఇద్దరు క్లెయిమ్దారులు ఆరోపిస్తున్నారు.జాయింట్ సర్వే నిర్వహించే వరకు వేలాన్ని నిలిపివేయాలని యమునానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వారు హెచ్ఎండీఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ అభ్యంతరాల నడుమ హెచ్ఎండీఏ ఈ స్థలాన్ని వేలం వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే. చదవండి: కాంట్రాక్టులపై తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు -
SIR ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: SIR ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్’ మ్యాపింగ్లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఒవైసీ. ఈసీ కోరుతున్న 12 డాక్యుమెంట్స్లో తెలంగాణలో మూడు డాక్యుమెంట్స్ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ‘సర్’ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ. కాగా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చు. -
తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కొత్త కమిటీలను నియమించింది. టెక్నికల్ బిడ్ల పరిశీలనకు కమిటీ-2కి అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది.పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్మార్క్ల పరిశీలనకు కమిటీ-1, ధర బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ-2, అదనపు పనులు, గడువు పొడిగింపుల ఆమోదానికి కమిటీ-3 ఏర్పాటు చేసింది. ఇంజినీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్)కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూఎస్,ఎస్బీ, హెచ్ఎండీఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులను కమిటీల్లో ప్రభుత్వం స్థానం కల్పించింది. ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. -
ఇది స్విమ్మింగ్ పూల్ కాదు ఫ్లైఓవర్.. చూసి షాక్ అవుతున్న పబ్లిక్
-
హైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో గతేడాది ప్రారంభించిన ఈ లీగ్లో మొత్తం ఆరు (రాజ్పుతానా రాయల్స్, మైటీ మరాఠాస్, పృథ్వీరాజ్ యోధాస్, కాకతీయ నైట్స్, చెరో ఆర్చర్స్, చోళా చీఫ్స్) ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్ 8 నుంచి 18 వరకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా రెండో సీజన్ నిర్వహించనున్నట్లు ఏపీఎల్ డైరెక్టర్ అనిల్ కామినేని బుధవారం వెల్లడించారు. భారత స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, అభిషేక్ వర్మతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్ ఆర్చర్లు వివిధ జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 48 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీపడనున్నారు. రాజ్పుతానా రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుండగా... టోర్నీ పూర్తి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తారు. -
ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. గ్రేహౌండ్స్ రద్దు.. సీవీ ఆనంద్
సాక్షి ,హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అయితే సాధారణ ప్రజలను గౌరవిస్తామని రౌడీల, గుండాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.ఈ రోజు (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిజం అంతమైందని అందుకే దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గ్రేహౌండ్స్ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్న 1700 మంది సిబ్బందిని అత్యవసర విభాగాలైన సైబర్ క్రైమ్, నార్కోటిక్ శాఖలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్క్రైమ్ ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారిందని అందుకే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ సిబ్బందికి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయ్,డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నాం. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ నెట్వర్క్లను త్వరలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటించారు. -
లేడీ డాన్ నీతూభాయ్.. కిరాణా షాపు మాటున..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కిరాణా షాపు మాటున నీతూ భాయ్ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూ భాయ్ను అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది.రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతూ భాయ్ కోసం నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్.. గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్ పరారైంది. -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
హైడ్రా నిర్లక్ష్యం?!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల తొలగింపుతో పాటు వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల పర్యవేక్షణ లాంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది హైడ్రా (HYDRA). అయితే తాజాగా ఈ సంస్థపై నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న(మంగళవారం సాయంత్రం) కురిసిన వానకు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోటి ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరి, మురుగు నీటితో కలిసి పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రోగులు, వారి సహాయకులు ఆ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే..ఈ సమస్యపై హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని బాధితులు వాపోతున్నారు. తక్షణమే నీటిని తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇంత కీలకమైన నగర నిర్వహణ బాధ్యతలు ఉన్నప్పటికీ సమస్యపై వెంటనే స్పందన లేకపోవడంతో హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పుడు. దీంతో ఈ విమర్శలపై హైడ్రా ఎలా స్పందిస్తుందో చూడాలి. హైడ్రా విధులు ఏంటంటే.. 1. వరద నియంత్రణ & డ్రైనేజీ నిర్వహణభారీ వర్షాల సమయంలో నీరు నిల్వ కాకుండా చూడటం, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించడం, వరద నీటిని తొలగించడం.2. అక్రమ ఆక్రమణల తొలగింపుచెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించడం.3. విపత్తుల నిర్వహణ (Disaster Response)వరదలు, భవన కూల్చివేతలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి సహాయం చేయడం.4. నగర ఆస్తుల రక్షణచెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు వంటి ఆస్తులను పరిరక్షించడం.5. సమన్వయం & రెస్క్యూ చర్యలుజీహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి రక్షణ చర్యలు చేపట్టడం. -
రాగానే దంచికొట్టింది
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్మెట్, విద్యానగర్, అంబర్పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.7 సెం.మీ., విఠల్వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది. మొత్తం 14 ప్రాంతాల్లో 5 సెం.మీ.కుపైగా వర్షం నమోదైంది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. భారీ సైన్బోర్డులు, ఫ్లెక్సీలు ఊడి పడటంతో కార్లు, బైక్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందల కాలనీలు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. టీ తాగుదామని వచ్చి.. బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జహంగీరాబాద్కు చెందిన అఫ్రోజ్(30), జాఫర్(15) పరిచయస్థులు. వీరు మంగళవారం సాయంత్రం టీ తాగేందుకు బండ్లగూడ చౌరస్తా సమీపంలోని రాయల్ సి హోటల్కు ఆటోలో వచ్చారు. అప్పటికే అక్కడ ఓ స్ట్రీట్లైట్కు సంబంధించిన విద్యుత్ వైరు తెగిపడి ఉంది. నీరు నిలిచి ఉండటంతో గమనించలేకపోయారు. ఈ క్రమంలో మొదట ఆటో దిగిన జాఫర్.. షాక్ తగిలి కింద పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అఫ్రోజ్ నేరుగా వైర్కు తగలడంతో విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాఫర్ను స్థానికులు చికిత్స నిమిత్తం ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాల్లో తడిసిన ధాన్యం నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కుంటాల మండలంలోని జామున ఓల, లింబా(కె), కల్లూరు, కుంటాల, పెంచికల్పాడ్లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జొన్న, వరి ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సొనాల మండలం పెద్దగూడ సరిహద్దులో వాగు ఉధృతికి వంతెన సమీపంలోని రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షంపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.తక్కువ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.నగరంలోని ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకున్న సమాచారంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కూలిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు తొలగించడానికి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
గచ్చిబౌలి చోరీ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిల్ రిడ్జ్ విల్లాలో చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా భావించిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా ఆ గ్యాంగ్ చోరీకి పాల్పడి విషయం బయటపడింది. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. నెల రోజుల క్రితమే పనిలో చేరిన వారు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు వ్యాపారవేత్త. దీనిపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితులు గాలించి ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. -
ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్. ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం -
హైదరాబాద్లో కుండపోత వర్షం (ఫొటోలు)
-
TG: మహిళా సంఘాలకు 553 బస్సులు కేటాయింపు
హైదరాబాద్: మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా 553 బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారుమహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి. ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంచితే, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభకు బస్సులో రాగా అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. CM Revanth Reddy flagged off 553 buses operated by Mandal Mahila Samakhyas (MMS) మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్,… pic.twitter.com/IPhuWbxu9X— Congress for Telangana (@Congress4TS) June 9, 2026 -
దంచికొడుతున్న వర్షం.. చెరువులైన రోడ్లు
-
హైదరాబాద్ లో భారీ వర్షం...
-
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్మెట్, విద్యానగర్, అంబర్ పేట్, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్పేట్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే యత్నం చేస్తున్నారు. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో భారీ ట్రాఫిక్ జామ్..నగర ఐటీ కారిడార్లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గం, ఐకియా, మైండ్స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరుఅంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది. హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు యువకుల మృతిహైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..అడిక్మెట్-36.3 mmవిద్యానగర్- 31.5 mmఅంబర్ పేట్-31.3 mmఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్పేట్-27.5 mmనెహ్రూ నగర్-21 mmమలక్పేట్-మియాపూర్-18 mmఉప్పల్-సరూర్నగర్- 12 mm RTC X Roads after HEAVY DOWNPOUR at 5pm Around 60-70mm was recorded ⚠️ pic.twitter.com/XrTaW8x4Rq— Telangana Weatherman (@balaji25_t) June 9, 2026 -
చీఫ్ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయిటపడింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జే. బాలు నివాసంలో ఈ రోజు ( మంగళవారం) తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని నివాసంతో సహా ఏకకాలంలో పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా అధికారుల తనిఖీల్లో ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు.. బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు దొరికాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మోహన్ నాయక్ పై గతం నుంచే పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు పలు మార్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టగా పెద్ద మెుత్తంలో ఆస్తులు బయిటపడ్డాయి. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
చేప మందు కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు (ఫోటోలు)
-
చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే బత్తిని కుటుంబం ఆనవాయితీగా నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ స్పందన లభిస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం పోటెత్తారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా రోగులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.నిన్న (సోమవారం) రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా చేప ప్రసాదం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. చివరి గంటల్లోనూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉచితంగా ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.3 లక్షల చేప పిల్లలకు మించి..చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ (ఫిషరీస్ డిపార్ట్మెంట్) ఇప్పటికే సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేప పిల్లలను సమకూర్చేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ పూర్తైంది.చేప ప్రసాదం ప్రత్యేకత ఇదేమృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం ప్రత్యేకంగా తయారు చేసే ఔషధ మిశ్రమాన్ని చిన్న చేప నోట్లో ఉంచి రోగులకు అందిస్తారు. దీనిని ప్రజల్లో "చేప ప్రసాదం"గా పిలుస్తారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కారణంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు వస్తుంటారు.చేప ప్రసాదం ప్రభావంపై శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతుంటే.. మరోవైపు దీనివల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని వేలాది మంది రోగులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
Hyd: చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను హైదరాబాద్ సిటీ పోలీస్ కింద పనిచేసే 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి రట్టు చేశాయి.నమ్మకమైన సమాచారం మేరకు సోమవారం(జూన్ 8వ తేదీ) తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్పేట్, కుల్సుంపురా, అత్తాపూర్ మరియు రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7 నాలుగు చక్రాల రవాణా వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను (Poultry Waste) గుర్తించి సీజ్ చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్వాహకులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా, వాణిజ్య చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, అలాగే నల్గొండలోని మాల్ టౌన్కు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నిర్దేశిత నిబంధనల ప్రకారం సురక్షితంగా పారదోలారు (హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎమ్. అంజయ్యలతో పాటు సబ్-ఇన్స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ దాడులలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.ప్రజలకు,వ్యాపారులకు ముఖ్య హెచ్చరికపచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం మరియు వాణిజ్య చేపల చెరువుల్లో వాటిని ఆహారంగా వేయడం పూర్తిగా నిషేధించబడింది. ఇటువంటి అత్యంత అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల ఆహార గొలుసు (Food Chain) లోకి ప్రమాదకరమైన బయోలాజికల్ బ్యాక్టీరియా/విషపదార్థాలు ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తినడం వల్ల మనుషులకు క్యాన్సర్ (Carcinogenic) వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం.అందుచేత చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతున్నారు. -
చికెన్ తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే
-
హై అలర్ట్..ఎబోలా టెన్షన్, గాంధీ ఆస్పత్రిలో 2 అనుమానిత కేసులు
-
పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారు సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు.సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.అడ్వైజరీలోని ప్రధానాంశాలు!● డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి.● ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.● ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం.● వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి.● వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి.● ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి.● వాహనాల ఓడోమీటర్ రీడింగ్లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి.● డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి.● మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం.● ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.● కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.● డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.● అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.● వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత.● మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను 'ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్' లో తప్పనిసరిగా నమోదు చేయాలి.● డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు.సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిపై భారతీయ న్యాయ సంహిత లోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం (సెక్షన్ 317), మోసం (సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం (సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. -
ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్
హైదరాబాద్: ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది దీనిలో భాగంగా ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై 21 రోజుల పర్యవేక్షణ ఉంచనున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలిస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్న ఇద్దరు విదేశీయులకు ఎబోలా వైరస్ నెగిటివ్ వచ్చింది. అయినా రెండోసారి పరీక్షల కోసం శాంపిల్స్ను పుణె పంపారు. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరొకవైపు విదేశీ ప్రయాణికులు తప్పుడు చిరునామాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద చర్యలకు ఆదేశించారు. ఎయిర్పోర్ట్లోనే చట్టపరమైన హెచ్చరికలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషా సిబ్బంది నియామకానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. EFLU సహకారంతో 24 గంటల భాషా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్కు శాఖల మధ్య సమన్వయం పెంచాలని, ఆరోగ్యశాఖ-జీహెచ్ఎంసీ-పోలీసుల సమన్వయంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని, పరీక్షలు ప్రారంభించామని జాతీయ పరిశోధన సంస్థ సీసీఎంబీ తెలిపింది. శాంపిల్ వచ్చిన వెంటనే ఫలితాలు అందిస్తామని పేర్కొంది. -
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్ (ఫొటోలు)
-
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్
చేపల మార్కెట్లపై మృగశిర కార్తె ప్రభావం కనిపించింది. నగరంలోనే ప్రసిద్ధి గాంచిన ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సోమవారం మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కూడా తోడవ్వడంతో చేపల ప్రియులు మార్కెట్కు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. రాంనగర్ చౌరస్తా నుంచి దాయారా మార్కెట్ రోడ్డుపై చేపల విక్రయాలు కొనసాగాయి. కిలో రవ్వ, బొచ్చె మామూలు రోజుల్లో రూ.120– 130 ఉండగా.. రూ.230– 250 వరకు విక్రయించారు. కిలో కొరమీను రూ.450 వరకు ఉండగా.. ఆదివారం రూ.650కు విక్రయించారు. – ముషీరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం -
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్పై ఓ సినీ నటుడు చితకబాదిన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ పూర్తి చేసుకొని మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన కారు నిలిపాడు. అదే సమయంలో కారులో వచ్చిన సినీ నటుడు సుప్రీత్రెడ్డి (కాట్రాజ్) వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నావని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్ శ్రీహరిని దుర్భాషలాడుతూ చితకబాదాడు. వెంటనే బాధితుడు 100కు డయల్ సమాచారం అందించి, కీసర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ర్యాపిడో రైడర్ను బెదిరించి రూ. 20 వేలు వసూలు
హైదరాబాద్: ర్యాపిడో బైక్ రైడర్ను ప్రమాదం పేరుతో బురిడీ కొట్టించి, రూ. 20 వేలు వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహార్ నగర్కు చెందిన సురేష్ (29) మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తూ పార్ట్ టైమ్గా రాపిడో రైడర్గా జీవనం సాగిస్తున్నాడు.జూన్ 4వ తేదీ రాత్రి భవాని నగర్ నుండి బోడుప్పల్కు ప్రయాణికుడిని తీసుకెళ్తుండగా, బంగారు మైసమ్మ వైన్ షాప్ సమీపంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సురేష్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోగా, మిగిలిన ఒక వ్యక్తి తన కాలు విరిగిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సురేష్ ను కోరాడు. అతని మాటలు నమ్మిన సురేష్ తన బైక్పై అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో ఆ వ్యక్తి తన సహచరులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికే మిగతా ఇద్దరూ సురేష్ను అడ్డగించి, బలవంతంగా తమ వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి, ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో సురేష్ తన స్నేహితుడు రాజశేఖర్కు ఫోన్ చేసి, నిందితులు చెప్పిన ’బద్దం శ్రీకాంత్’ అనే మొబైల్ నెంబర్కు ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేయించాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
నేడు చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు. -
‘కింగ్స్ అండ్ క్వీన్’ ఓ మచ్చుతునక మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ డెకాయ్ ఆపరేషన్ చేయడంతో మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. యువతులను రప్పించి.. ఈ పబ్స్ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్కు వచి్చన యువకుల ఫోన్ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్ చేస్తూ పదేపదే అదే పబ్కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ చేసిన బిల్లు నుంచి కమీషన్ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల శ్రుతి మించి..ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్్కఫోర్స్, ఎస్ఓటీలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పబ్స్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
సాక్షి,ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36మంది ప్రయాణికుల్లో 26మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన తోటి వాహనదారులు, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకోగా.. ప్రమాదానికి గురైన బస్సు కేవీఆర్ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చేప ప్రసాదం షురూ.. హైదరాబాద్ కు పోటెత్తిన జనం
-
కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ స్పై ఆపరేషన్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.డీసీపీ స్వయంగా పబ్ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్పల్లి ప్రాంతంలో పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పసిడి పతకం ముద్దాడిన సుచిత్ర అకాడమీ స్టార్లు
హైదరాబాద్ వేదికగా యోనెక్స్-సన్రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (U-15) నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో సరికొత్త ఛాంపియన్లు అవతరించారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా జోడి మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో పసిడి పతకం కైవసం చేసుకున్నారు.ఫైనల్లో ప్రత్యర్ధిపై 21-10, 21-15 వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్స్గా నిలిచారు. అంతకుముందు సెమీఫైనల్లో టోర్నీ రెండువ సీడ్ జోడీపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. కాగా కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా ఇద్దరూ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు.వారిద్దరికి 'సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ'లో చేరకముందు కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచ్లు కూడా అనుభవం లేదు. వారిని చిన్న వయసులోనే హైదరాబాద్ తీసుకొచ్చి, అకాడమీ తరపున డైరెక్టర్ కె. ప్రదీప్ రాజు ఉచిత కోచింగ్ ఇచ్చారు. -
యువతుల ద్వారా కస్టమర్లకు వల వేస్తున్న పబ్ యాజమాన్యం
-
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
-
గ్యాస్ ధరలు హైదరాబాద్లోనే ఎక్కువ.. ఎందుకు?
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ పెంపు దేశమంతా ఒకేలా ఉన్నప్పటికీ, గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో, నగరంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర ఎందుకు భిన్నంగా ఉంటుంది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోల) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో ఒక్కో సిలిండర్పై రూ.29 పెరిగింది. గత మూడు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం. మార్చిలో రూ.60 పెరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు భారం పడనుంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలునగరం14.2 కిలోల ఎల్పీజీ ధరన్యూఢిల్లీరూ.942ముంబైరూ.941.50కోల్కతారూ.968చెన్నైరూ.957.50హైదరాబాద్రూ.994బెంగళూరురూ.915.50తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య దాదాపు రూ.80 వరకు ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.994గా ఉండగా, బెంగళూరులో అదే సిలిండర్ రూ.915.50కే లభిస్తోంది.ఒకే దేశంలో.. ఒకే గ్యాస్.. ధరలు ఎందుకు వేరు?ఎల్పీజీని సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర రాష్ట్రాల వారీగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.రాష్ట్ర పన్నుల ప్రభావంప్రతి రాష్ట్రం ఎల్పీజీపై వేర్వేరు స్థాయిలో వ్యాట్, స్థానిక పన్నులు లేదా సెస్సులు విధిస్తుంది. ఈ పన్నుల రేట్లు మారడంతో వినియోగదారుడు చెల్లించే ధరలో తేడా వస్తుంది.రవాణా ఖర్చులుఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల నుంచి సిలిండర్లను నగరాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా ధరను ప్రభావితం చేస్తుంది. సరఫరా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.పంపిణీ వ్యయండీలర్ల కమిషన్, స్థానిక పంపిణీ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దీంతో తుది ధరలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.పెంపు వెనుక కారణాలుఅంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి వ్యయాల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపునకు ముందు ప్రతి గృహ సిలిండర్పై వందల రూపాయల మేర నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.హైదరాబాద్లో ఎందుకు అత్యధిక ధర?తెలంగాణలో స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావంతో హైదరాబాద్లో ధర దేశంలోని అనేక మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అత్యంత ఖరీదైన గృహ ఎల్పీజీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.వినియోగదారులపై అదనపు భారంమార్చి నుంచి ఇప్పటివరకు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర మొత్తం రూ.89 పెరిగింది. దీంతో నెలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే కుటుంబాల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్పై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో.. -
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు -
..ఇచ్చేద్దాం దేవుడి పటం!
సాక్షి, హైదరాబాద్: పూజలు పూర్తయ్యాక దేవతా చిత్రాలు, విగ్రహాలు, పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువుల నిర్వహణకు శాస్త్రీయ, పర్యావరణహిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్లోని ఇస్కాన్ ఆలయంలో శనివారం ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ పేరుతో చేపట్టిన ఈ పైలట్ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా వాలంటీర్ల ఆధ్వర్యంలో పవిత్ర వస్తువుల సేకరణ డ్రైవ్ను నిర్వహించింది. జీహెచ్ఎంసీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ (ఇస్కాన్) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భక్తులు ఉపయోగించిన దేవతా చిత్రాలు, పాడైన ఫోటో ఫ్రేములు, విగ్రహాలు తదితర పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా రీ సైక్లింగ్ చేస్తారు. నగరంలోని అనేక కుటుంబాలు పాత దేవతా చిత్రాలు, దెబ్బతిన్న విగ్రహాలు, పూజా సామగ్రిని సరైన పారవేత విధానం లేక సంవత్సరాల పాటు ఇళ్లలోనే ఉంచుకుంటుంటాయి. కొందరు వాటిని చెట్ల కింద, చెరువుల వద్ద లేదా దేవాలయాల సమీపంలో వదిలివేయడం వల్ల అవి చివరకు చెత్తలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భక్తి భావనకు భంగం కలగకుండా, పర్యావరణ బాధ్యతతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 68 కిలోల పవిత్ర వస్తువుల సేకరణ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మంది భక్తులు ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 68 కిలోల మేర దేవతా చిత్రాలు, ఫ్రేములు, విగ్రహాలు, ఇతర పవిత్ర వస్తువులు సేకరించారు. సేకరించిన పవిత్ర వస్తువులను వాటి స్వభావం ఆధారంగా వర్గీకరించారు. అనంతరం సంప్రదాయ ‘ఉద్వాసన పూజ’ నిర్వహించి, దైవిక ఉనికిని శా్రస్తోక్తంగా ఉపసంహరించిన తర్వాత వాటిని పునరి్వనియోగం లేదా రీసైక్లింగ్కు అనుగుణంగా శాస్త్రీయంగా వేరు చేశారు. సాధారణ మున్సిపల్ చెత్తతో కలపకుండా మొత్తం ప్రక్రియను ప్రత్యేక కేంద్రంలోనే నిర్వహించారు.పైలట్ దశ విజయవంతమైతే, భవిష్యత్తులో నగరవ్యాప్తంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత సేవల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతిపాదనను జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’లో భాగంగా తదుపరి పవిత్ర వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని జూన్ 13న యూసుఫ్గూడలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. -
సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం
సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని... ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. మలేషియా – పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్కు ఉన్న అనుభవం... గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు. -
దంచికొడుతున్న వర్షం రోడ్లు జలమయం
-
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్కు చాలా ఇష్టమని, హిట్లర్కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. -
562 హోటళ్లు, లాడ్జీలలో 5 వేల మంది పోలీసులతో తనిఖీలు
హైదరాబాద్: నగర అంతర్గత భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో గత రాత్రి సిటీ పోలీసులు 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను నిర్వహించారు. శాంతి భద్రతల పరిరరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.ఈ ఆపరేషన్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనార్ వీసీ సజ్జనార్స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్లో 119, శంషాబాద్లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్లో 82, రాజేంద్రనగర్లో 53, చార్మినార్ జోన్లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.మైనర్లకు గదులు ఇవ్వద్దు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిల్మ్నగర్తో పాటు పలు ప్రాంతాలలో భారీగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురువడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలుచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అప్పటి దాకా ఎండ వేడిమికి తల్లడిల్లిపోయిన పట్టణవాసులకు అకాల వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించాయి. -
చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న ఉదయం చేప ప్రసాదాన్ని తయారు చేసిన అనంతరం దూద్బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. 179 ఏళ్లుగా పంపిణీ చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్బౌలిలోని స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్బౌలిలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 50 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు.. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్ గౌడ్ తెలిపారు. మొదట్లో చేప మందుగా ప్రాచుర్యం పొంది అనంతరం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు రకాల చేప ప్రసాదం... చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు. ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు. -
బంగారంతో పోలిస్తే డైమండ్ ధరల్లో స్థిరత్వం ఉంటుంది : అనంత నారాయణ
హైదరాబాద్ : బంగారం ధరలతో పోలిస్తే డైమండ్ ధరల్లో ఎక్కువగా స్థిరత్వం ఉంటుందని దమాస్ జ్యువెలరీ సీఈవోఓ అనంత నారాయణ హరిహరన్ అన్నారు. ఇర్రంమంజిల్లోని ప్రణవ వన్లో ఏర్పాటు చేసిన ఎస్జీఎల్ డైమండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన శుక్రవారం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయిన ఎమరాల్డ్ అధినేత శ్రీనివాసన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రాల అమ్మకాల్లో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉందని అన్నారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ల వల్ల వజ్రాల నాణ్యత, గ్రేడింగ్ పరిశీలించుకునేందుకు వినియోగదారులకు ఎంతో సులభంగా ఉంటుందని ఇది మరింత పారదర్శకతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్జీఎల్ సంస్థ డైరెక్టర్ చిరాగ్ సోని మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే ఇది అతి పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఈ సెంటర్లో డైమండ్ యొక్క క్వాలిటీతో పాటు గ్రేడింగ్ను పరీక్షించుకోవచ్చుని తెలిపారు.సామాన్యులు ఎవరైనా కూడా ఈ సెంటర్ను అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చి డైమండ్ను ఏ విధంగా పరీక్షిస్తారు. ఎలా గ్రేడింగ్ చేస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. ఇది డైమండ్ గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే ఆటోమెటిక్ గ్రేడింగ్ సిస్టమ్తో డైమండ్ నాణ్యతను కొలుస్తున్నప్పటికీ ఏఐ వల్ల మరింత లోతుగా విశ్లేషించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీల్ సహ వ్యవస్థాపకురాలు షిరిన్ బందుకాల్వ, నేషనల్ హెడ్ వరుణ్ శెట్టి, వసుంధర డైమండ్ గ్రూప్ ఫౌండర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
మీనాకుమారి పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇన్స్ట్రాగామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బదిలీ అయినట్టా.. కానట్టా?
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో నిబంధనలు ఉల్లంఘించి, నియమాలను పట్టించుకోకుండా ఇంజినీర్ల బదిలీలు జరిగినా వారికి కొత్త పోస్టులు, బాధ్యతలు అప్పగించలేదు. పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా ఆగమాగంగా జరగడం.. నాలుగేళ్లు మించి ఒకేచోట ఉన్నవారు సైతం బదిలీ కాకపోవడం, ఇంజినీర్ల బదిలీ వివరాలు కేవలం వారికి తప్ప పైఅధికారులైన సీఈ, ఎస్ఈలకు సైతం తెలియకపోవడం, అసలు బదిలీ ప్రక్రియే షెడ్యూలు కనుగుణంగా జరగకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్ లేకుండానే సీఎంసీలో చేరేందుకు వెళ్లిన ఇంజినీర్ను అక్కడ చేర్చుకోలేదు. ఎంఎంసీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయి వచి్చన పదిమందికి పైగా ఇంజినీర్లు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చినప్పటికీ, వారికి ఎలాంటి పోస్టింగులు, బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది. ఇందుకు కారణం ఏమిటంటే.. బదిలీలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి ఎవరికీ రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దని, ఇతర కార్పొరేషన్ల నుంచి వచి్చన వారిని చేర్చుకోవద్దనీ కమిషనర్ కర్ణన్ తెలిపినట్లు సమాచారం. బదిలీల రగడ ఏ మలుపు తిరగనుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
మన దేశంలోనూ ‘అద్దె ప్రియుళ్లు’.. జాబితాలో హైదరాబాద్!
న్యూఢిల్లీ: జపాన్లో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ‘రెంట్-ఎ-బాయ్ఫ్రెండ్’ (అద్దెకు ప్రియుడు) అనే వింత కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోనూ అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, ఒక వెబ్సైట్ ద్వారా బాయ్ఫ్రెండ్ను అద్దెకు తీసుకుని, అతనితో రోజంతా మాల్లో గడిపిన వీడియోను పంచుకోవడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రారంభ ధర కేవలం రూ. 1,500 లకే లభిస్తున్న ఈ వినూత్న సేవలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చకు దారితీశాయి.రూ. 1,500 లతో మొదలు.. షాపింగ్ మాల్లో..ఇషా భల్లా అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘Kopartner.in’ అనే ప్లాట్ఫారమ్ నుండి ఆమె ఒక పురుష తోడును (Male Companion) అద్దెకు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశంలో అతడిని కలిసి, ఆపై మాల్కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడ అతను తనకు షాపింగ్లో సహాయం చేశాడని, బ్యాగులు మోసాడని, అలాగే తన మాజీ ప్రియుడి గురించి చెబుతూ, ఎమోషనల్ అయినప్పుడు జోకులు వేస్తూ తనను ఓదార్చాడని ఆమె పేర్కొన్నారు. చివరగా ఆ సేవలకు గానూ అతనికి డబ్బులు చెల్లించి వీడ్కోలు పలికినట్లు ఇషా వివరించారు.గంటల లెక్కన రేట్లు.. దేశవ్యాప్తంగా సేవలుఈ అధికారిక వెబ్సైట్ నేరుగా ‘బాయ్ఫ్రెండ్’ అని పేర్కొననప్పటికీ, సామాజిక మద్దతు, విభిన్న జీవనశైలి సేవలను అందిస్తోంది. ఇందులో మూవీ కంపానియన్, క్లబ్బింగ్ వంటి సేవలకు గంటకు రూ. 2,000, షాపింగ్ బడ్డీ సర్వీస్కు గంటకు రూ. 1,200, ట్రావెల్ పార్టనర్కు గంటకు రూ. 2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే వృద్ధుల సంరక్షణ, గృహ సహాయం వంటి సేవలు గంటకు రూ. 1,000 నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది.ఉద్యోగాల్లేకనే ఈ వింత పోకడలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ‘మనం ఏ కాలంలో బతుకుతున్నాం?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ‘ఇదంతా పచ్చి అబద్ధం, ఎవరూ డబ్బులు వృథా చేయకండి’ అని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరైతే దేశంలో ‘నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది’ అనడానికి ఇదే నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. కాగా, తాము పూర్తిగా ధృవీకరించిన, సురక్షితమైన ప్రొఫెషనల్స్ ద్వారానే ఈ సేవలను అందిస్తున్నామని సదరు వెబ్సైట్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ! -
స్పా సెంటర్ల ముసుగులో దారుణాలు
-
హైదరాబాద్లో మరో భారీ ఫ్లై ఓవర్
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా సాగే ఆరు లేన్ల భారీ గ్రేడ్ సెపరేటర్ (ఫ్లై ఓవర్) పనులకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ పనుల్ని రూ.189.68 కోట్లతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది.టెండర్ ఖరారు కావడంతో పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హెచ్– సిటీ పథకం కింద కేటాయించిన నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్డు, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోవడంతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు కూడా సమయం ఆదా కానుంది. స్టీల్ బ్రిడ్జి ఎంతవరకు వచ్చింది? మలక్పేట: మూసారంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) తనిఖీ చేశారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులు వేగిరం చేసి, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆదేశించారు.సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి మొత్తం 85 స్పాన్లు ఉండగా వాటికి గర్డర్లు నిర్మించామని, 79 స్పాన్లకు డెక్స్లాబ్ పూర్తయిందని, అప్ ర్యాంప్, డౌన్ర్యాంప్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మూసారాంబాగ్ డౌన్స్ట్రీమ్ బ్రిడ్జి ఏ2–పీ4 స్పాన్ బాటమ్ స్లాబ్ పూరైందని, పీ3–పీ4 స్టేజింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఎంఎంసీలో రూ.1,474 కోట్ల పనులకు 7న సీఎం శంకుస్థాపనఈ నెల 7న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో రూ.1,474 కోట్ల పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు చేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు.ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్లు(అంచనా రూ.960 కోట్లు), టీకేఆర్ కాలేజ్, గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా నిర్మించనున్న ఫ్లై ఓవర్ (అంచనా రూ.416 కోట్లు), ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో ఎంఎంసీ శాశ్వత భవన నిర్మాణం (అంచనా రూ.98 కోట్లు) పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఇందులో రహదారులు, ఫ్లై ఓవర్ల పనులకు అవసరమైన భూసేకరణకు రూ.559.46 కోట్లు ఖర్చు చేయనున్నారు.చదవండి: చెత్తకు నిప్పు.. ఎంత పనిచేసింది.. -
Hyd: స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) 100పైగా స్పా సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.గత మూడు, నాలుగు నెలల నుంచి హైదరాబాద్లోని పలు స్పా సెంటర్లపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. హబ్సిగూడ, కూకట్పల్లి, వసంత్నగర్ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్లు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా చేసిన దాడుల్లో కూడా పలుచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. -
భారీ వర్షం.. పిడుగుపడి కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. పలు జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. నాగర్కర్నూల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. గద్వాలలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. మామిళ్లపల్లిలో పిడుగుపడి రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం పడుతోంది. పెద్దఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విస్సన్నపేట, మైలవరంలో ఈదురుగాలులలో కూడిన జల్లులు పడుతున్నాయి. -
నిమ్మగడ్డ రమేష్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయన తమను వేధింపులు, వివక్షకు గురి చేశారంటూ నలుగురు అధ్యాపకులు ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో ఒకటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించినది కాగా, మిగిలినవి తమను పక్కనపెట్టి తనకు సన్నిహితులైన వారికి రమేష్ కుమార్ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలతో ఉన్నాయి.హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రభుత్వానికి, ప్రైవేట్ సంస్థలకు మధ్య అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. 2024 ఆగస్టులో ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులకే తనకు రమేష్ కుమార్ నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా నాలుగు సార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మహిళా ప్రొఫెసర్పై వేధింపులుడైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రమేష్ కుమార్ తనను ఒంటరిగా కలవాలని కోరినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 ఏళ్లకు పైగా ఏఎస్సీఐలో పనిచేస్తున్న తనను లైంగిక వేధింపులకు గురిచేశారని వాపోయారు. ఉన్నత పదోన్నతుల కోసం 'కొంతమందిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని' పెడార్థంతో వ్యాఖ్యానించారని, తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇతర సిబ్బంది ఎదుట అవమానించడం, తాను నిర్వహిస్తున్న కేంద్రం డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం, పెద్ద కార్యాలయ గదిని తీసేసి చిన్న గదికి మార్చడం వంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.కాంట్రాక్ట్ పునరుద్ధరణలో వివక్ష?ఏఎస్సీఐలో అధ్యాపకులు ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం సమకూర్చాలి. ప్రతి అధ్యాపకుడు సంవత్సరానికి కనీసం రూ.95 లక్షల ఆదాయం తీసుకురావాల్సి ఉంటుంది. గత మూడేళ్లుగా తాను సగటున రూ.1 కోటి ఆదాయం సమకూర్చినా, ఫిర్యాదు చేసిన తర్వాత తనకు పనులు కేటాయించడం నిలిపివేశారని మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2025 నవంబరులో ముగిసిన తన కాంట్రాక్ట్ను కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించారని వాపోయారు. ఆ గడువు మే 31తో ముగియగా జూన్ 1న కళాశాలకు వెళ్లినప్పుడు భద్రతా సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ చర్యలు POSH చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు ప్రొఫెసర్ల ఫిర్యాదులునిమ్మగడ్డ రమేష్ కుమార్పై 2026లో మరో ముగ్గురు ప్రొఫెసర్లు ఏఎస్సీఐ పాలన బోర్డుకు ఫిర్యాదులు చేశారు. వారు తమ కాంట్రాక్ట్ రెన్యువల్పై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ల్యాండ్ అక్విజేషన్ సెంటర్ను విలీనం చేయడం, సైబర్ ల్యాబ్ మూసివేసేలా ప్రయత్నాలు చేయడం, విస్తరణ పనులపై సమాచారం ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల్ని దూరం చేశారని ఆరోపణలు వినిపించాయి. రమేష్ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తమకు మరిన్ని వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. పబ్లిక్ ఈవెంట్లలో అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం, కాలేజీలో జరిగే ఈవెంట్ల నుంచి బయటకు పంపి అవమానించడం, బెదిరింపులకు పాల్పడడం చేశారని బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2029 వరకు ఉన్న తన కాంట్రాక్ట్ను 2024లో అకస్మాత్తుగా రద్దు చేశారని మాజీ మహిళా ప్రొఫెసర్ కూడా ఆరోపించారు. ఇందులో ఏఎస్సీఐ చైర్మన్ పద్మనాభయ్య పాత్ర ఉందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందనతనపై వచ్చిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవి, ఆధారరహితమైనవిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని, ఏఎస్సీఐ రిజిస్ట్రార్ సమాధానం ఇస్తారని చెప్పారు. అయితే ఇప్పటివరకు రిజిస్ట్రార్ నుంచి అధికారిక స్పందన రాలేదు. -
విషాదం.. నదిలో కాలు జారి ముగ్గురు మృతి
సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి శివారులో మంజీరా నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.మృతులు పిట్లం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన పావని (15),లింపేట్ మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన అనిత (40), శివాని (13) తల్లి కూతురని తెలుస్తోంది. భాను ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.పండరి అనే వ్యక్తి మంజీరా నది వద్ద ఎల్లమ్మ పండగ నిర్వహించడంతో బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిలోకి దిగిన ఓ యువతి, ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు నీటిలో మునిగి మృతి చెందారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి పెరగనుండటంతో.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశంతో గురువారం మూసాపేట్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చంపాపేట్, శంషాబాద్, గండిపేట్ తదితర సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు దస్తావేజుదారులతో కిటకిటాడాయి. భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్ చేసుకున్న కొనుగోలుదారులు రిజి్రస్టేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా కార్యాలయాలు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, క్రయ విక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది రాత్రిపొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజి్రస్టేషన్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. శంషాబాద్లో విజిలెన్స్ తనిఖీలు శంషాబాద్: శంషాబాద్ సబ్రిజి్రస్టార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టారా? సాధారణ తనిఖీల్లో భాగంగానేనా? అనే విషయం బయటికి రాలేదు. రెండు గంటల పాటు రికార్డులు పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల తర్వాత అనేక ఆరోపణలు బయటపడడంతో తాజాగా సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
ఆ మెస్ వల్లే అగ్ని ప్రమాదం.. కుండ బద్దలు కొట్టిన ప్రత్యక్ష సాక్షి


