breaking news
Hyderabad
-
హైదరాబాద్లో మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్
మురుగప్ప గ్రూప్.. క్లీన్ మొబిలిటీ విభాగం అయిన మోంట్రా ఎలక్ట్రిక్, శ్రీరామ్ హర్షతో కలిసి హైదరాబాద్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (e-SCV) డీలర్షిప్ను ప్రారంభించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ తన ఉనికిని విస్తరించడంలో భాగంగా డీలర్షిప్ ప్రారంభించింది.మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్లో EViator కమర్షియల్ వెహికల్స్ ప్రదర్శిస్తారు. ఇవి తక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగి.. చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హైదరాబాద్లో పెరుగుతున్న లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్లీట్ యజమానులు, వ్యవస్థాపకుల నెట్వర్క్ వంటి వాటికి సేవలు అందించడానికి కంపెనీ డీలర్షిప్ ప్రారంభించింది.EViator వెహికల్ 80 కిలోవాట్ మోటారు ద్వారా 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 245 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడినప్పటికీ.. రియల్ వరల్డ్ రేంజ్ 170 కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వెహికల్ కొనుగోలుపై ఏడు సంవత్సరాలు లేదా 2.5 లక్షల కిమీ వారంటీ అందిస్తోంది.హైదరాబాద్లో డీలర్షిప్ ప్రారంభ కార్యక్రమానికి.. ఐటీ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా, TIVOLT ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సాజు నాయర్ మొదలైనవారు పాల్గొన్నారు. -
‘తెలంగాణాలోనూ ‘ఓట్ చోరీ’.. వారి భరతం పడతాం‘
సాక్షి,హైదరాబాద్: ‘బీహార్లోనే కాదు.. తెలంగాణలో ఓటు చోరీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర చేసేవారి భరతం పడదాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఓట్ చోరీ అంశంలో తప్పు చేసినవారిని వదిలేసి..తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రవీంద్ర భారతి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీ ఆరోపణలకు ఏడురోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలన్న ఈసీ ఆదేశాలపైవిధంగా స్పందించారు. ‘ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనంరాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం.గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది.అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు.ఐదు నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు.ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు?.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించగలరా?. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు.రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు.రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి.విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది.విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే.అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది. దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది.అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది.ఇది ఎంతవరకు న్యాయం. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం’ అని వ్యాఖ్యానించారు. -
Ramanthapur: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్: రామంతాపూర్లోని గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
రామంతాపూర్లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. దీంతో, బాధిత కుటుంబ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మరోవైపు.. రామంతాపూర్లో పోలీసులు, అధికారులను మృతుల బంధువులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ సీఎండీని బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.ప్రమాదంలో చనిపోయిన ఆరు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసలు.. అక్కడున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుక విషాదకర ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, మృతుల కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
చేయి చేయి కలిపి.. ‘చతుర్భుజ’మై..!
చేయి చేయి కలిపి చతుర్భుజమై.. కదలి వద్దాం కలను నిజం చేద్దాం.. అందరూ ఒక్కటై అడుగులేద్దాం.. అనుబంధం పెంచుదాం, ఆనందం పంచుదాం.. అన్న ఓ రచయిత మాటలను గుర్తు చేసేలా ఆ ప్రాంత మహిళా శక్తి మొత్తం ముందుకు కదిలింది.. కబ్జా దారుల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలాన్ని విడిపించారు.. అనేక ఆటుపోట్లను అధిగమించి.. బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరారు.. వారే మలక్పేటలోని శ్రీపురం కాలనీ మహిళ సంక్షేమ సంఘం వారు.. కాలనీ వాసులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముందడుగేశారు.. చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరానికి ముందు.. ఆ ప్రాంతమంతా దుర్గంధంతో అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉండేది.. అలాంటి స్థలం కొందరు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది.. కాలనీ వాసుల ప్రయోజనార్థం స్థానిక మహిళా సంక్షేమ సంఘం నాయకులు చుట్టుపక్కల వారి సహకారంతో గుండవరం వేణుగోపాల్ రావు, పద్మలు కోర్టును ఆశ్రయించి పురాతన బావితో సహా స్థలాన్ని కాపాడి చక్కటి నందనవనంగా తీర్చిదిద్దారు.. అనేక బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కుగా అభివృద్ధి చేశారు. పార్కు ఏర్పడి నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తికావడంతో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజతోత్సవాలు జరుపుకున్నారు. పార్కు అవతరణకు సహకరించిన ఆతీ్మయులు రాజేవ్వరరావు, రాజేందర్, నరేందర్, ప్రవీణ్, స్వర్ణ, శకుంతల, అనిత, హేమ తదితరులను ఆహా్వనించి అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలనీవాసులతో నాటి విశేషాలను పంచుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుతూ.. ప్రస్తుతం స్థానిక కాలనీవాసులకు పచ్చని వాతావరణంతో, చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేలా రూపొదిద్దిన పార్కులో నడక మార్గం, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వివిధ రకాల ఆట సామగ్రి ఇలా సకల వసతులూ ఏర్పాటు చేసుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, అలసట తగ్గించుకునేందుకు అనువుగా పచ్చటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. (చదవండి: గ్రీన్ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా..) -
బోనాలతో ఘనంగా తెలంగాణ గంగ తెప్పోత్సవం (ఫొటోలు)
-
HYD: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని రామంతాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులు కన్నీటపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాన్ని పక్కన నిలిపివేసిన స్థానిక యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంట్ షాక్ ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది.ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు.. గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్రెడ్డి(35), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు. క్రీడల్లో గానీ, రోజువారీ జీవితంలోగానీ అవి అత్యంత అవసరమైనవని ఆమె చెప్పారు. జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అనే స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో తన జీవనయానంలో క్రమశిక్షణ, ఇబ్బందులను అధిగమించేందుకు త్వరగా స్పందించాల్సిన అవసరం లాంటి విషయాలు పంచుకున్నారు.జీవీకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి, వీణారెడ్డిలతో జరిగిన ఒక చర్చ.. సాధారణ విషయాల నుంచి సీరియస్ అంశాలవైపు మళ్లింది. ఒలింపిక్ పతకం సాధించడం కంటే ఐస్ క్రీం తినకుండా ఉండడం కష్టమా అన్నప్పుడు.. సింధు నవ్వేసింది. తర్వాత మాట్లాడుతూ, “పతకాలు సాధించడం కష్టమే. కానీ, ఐస్ క్రీం వద్దనడం ఇంకా కష్టం. కానీ క్రమశిక్షణ, కోలుకోవడం, ముందస్తు సంరక్షణల వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నాను. నిలకడ అనేది చాలా ముఖ్యం. గాయాలు కాకుండా చూసుకోవడండ, అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడడంతోనే మనం ఎక్కువకాలం ఆటలో ఉండగలం” అని చెప్పారు.తన సొంత అనుభవాల గురించి సింధు వివరిస్తూ శిక్షణలాగే త్వరగా కోలుకోవడం, వెంటనే స్పందించడం ఎందుకు ముఖ్యమో ఇలా చెప్పారు. “మనమంతా క్రీడల్లో ఫిట్నెస్ పరీక్షలను గౌరవిస్తాం. మరి జీవితంలో వైద్యపరీక్షలంటే ఎందుకు భయపడతాం? మనం ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటామన్నది కాదు, ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది. కానీ మహిళలకు వ్యాధుల నివారణ చాలా కీలకం. మీరు పెద్దస్థాయిలో పోటీ పడుతున్నా, లేదా చురుగ్గా ఉన్నా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. దానివల్ల ఏమైనా సమస్యలున్నా త్వరగా తెలుస్తాయి, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండగలరు” అని వివరించారు.హైదరాబాద్లోని వేగవంతమైన జీవితంలో సింధు చెప్పే విషయాలు చాలా ముఖ్యం. “ఏదో సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కాకుండా ఏటా వైద్యపరీక్షలు చేయించుకోవడం అవసరం. అనారోగ్యం వచ్చినప్పుడు పరుగెత్తడం కంటే ముందస్తు వైద్య పరీక్షలకు తప్పకుండా వెళ్లాలి. మీరు పతకాల కోసం ప్రయత్నిస్తున్నా, డెడ్లైన్లు వెంటాడుతున్నా, లేదా ఫిట్గా ఉన్నా కూడా ఎర్రజెండా వచ్చేవరకు ఆగద్దు. వైద్యపరీక్షలను ఒక అలవాటుగా చేసుకోండి” అని కోరారు.మహిళలు తమ ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారని సింధు అన్నారు. “ఆరోగ్యం విషయంలో అలసత్వాన్నుంచి మనం స్వాతంత్య్రం పొందాలి. డాక్టర్ గూగుల్ను నమ్మకండి.. వైద్య పరీక్షలు చేయించుకోండి. ఏదైనా జరిగేవరకు వేచి చూడడం మంచిది కాదు. ఈ లోపే స్పందించాలి. జీవితంలో వెనకబడిపోవడం కాకుండా ఏది అవసరమో దానిపై దృష్టిపెట్టే స్వేచ్ఛ మీకు ముందస్తు వైద్యపరీక్షలతో వస్తుంది” అని సింధు తెలిపారు.ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ, “ఇళ్లలోనైనా, ఆఫీసుల్లోనైనా మహిళలు తమ గురించి తక్కువ ఆలోచిస్తారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అంటే మీ సొంత అవసరాలు, విశ్రాంతి, సంపూర్ణ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడమే. ఇవన్నీ లగ్జరీలు కావు.. అత్యవసరమైనవే. చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని కాపాడతాయి. చిట్టచివరి నిమిషంలో పరుగెత్తాల్సిన పని ఉండదు” అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఎన్జీకే శాస్త్రి కూడా సమస్యలను ముందుగా గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా కలుగుతాయో సవివరంగా చెప్పారు.జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి సంవత్సరంలోనే రోగుల అవసరాలకు సమగ్ర పరిష్కారాలు అందిస్తూ, 17 విభాగాలకు సంబంధించిన ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర వైద్యపరీక్షలు, డేకేర్ శస్త్రచికిత్సలు, నివారణ చికిత్సలు చేస్తూ సమగ్ర ఆస్పత్రిగా ఎదిగింది.ముందస్తు వైద్య పరీక్షలు కేవలం అథ్లెట్లకు మాత్రమే కాదని ఈ చర్చలో చివరగా తేల్చారు. సింధు అయితే ఒకే సూత్రం చెబుతారు.. మీ శరీరం మరమ్మతులు కోరుకోకముందే దానిని చూడండి. అది మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటుంది. -
సిక్కిం షోయగం..
-
1 నుంచి నెలవారీ రేషన్ కోటా
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్–1) నుంచి మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని (బ్యాగ్) అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. -
ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళల దాడి
మాదాపూర్ : మాదాపూర్లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు. మాదాపూర్ ఇమేజ్గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లగ్జరీదే మూడో వంతు వాటా.. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది. అందుబాటు ఇళ్ల కొరత.. నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్పూర్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది. -
తేట తెలుగులో.. టెక్కీ పాఠాలు
హైదరాబాద్: తెలుగు రాష్టాల్లోని మారుమూల గ్రామాల నుంచి ఎంతో కష్టపడి మేధావులుగా మారిన, ఆంగ్ల భాషపై పట్టు లేక ఎంతో మంది ఉన్నత అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఇదే ఆ యువకుడిని ఆలోచింపజేసింది. నైపుణ్యానికి భాషా ప్రావీణ్యం ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఆలోచన ఎడ్యుటెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడిని చేసింది. విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉన్న ఐటీ రంగంలో భాషా నైపుణ్యాలు ఎదిగేందుకు అవరోధాలు కాకూడదనే సంకల్పంతో మొదలైన శివకుమార్ రెడ్డి ప్రయాణం జాయిన్ డెవాప్స్ వ్యవస్థాపకుడిని చేసింది.ఐటీ రంగంలో తనకున్న దశాబ్ద కాలం అనుభవాలను రంగరించి భాషా నైపుణ్యాలను చేదిస్తూ ఉన్నత ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ఎడ్యుటెక్ స్టార్టప్తో ఎంతో మంది యువతకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడిగా నిలిపింది. ఐటీ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. వందలాది స్టార్టప్లూ నగరంలో పురుడు పోసుకుని ఖండంతరాలకు విస్తరిస్తున్నాయి.అలాంటిదే శివకుమార్ రెడ్డి స్థాపించిన జాయినొవాప్స్, తెలుగు మాట్లాడే ప్రొఫెషనల్స్ కోసం భాషా అడ్డంకులను తొలగిస్తూ, అతి తక్కువ ఖర్చుతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా టెక్ రంగంలో డెవాప్స్ శిక్షణనిచ్చే సంస్థగా ఎదిగింది. భాషా నైపుణ్యాలు లేక జీవితాలను మలుపు తిప్పే అవకాశాలను చేజార్చుకుంటున్న ఎంతో మంది యువతకు ఇదొక చుక్కానిలా నిలుస్తోంది. తెలుగు భాషలో అత్యాధునిక టెక్ నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ ఎదిగింది. ఈ స్టార్టప్ టియర్-2, టియర్-3 నగరాల నుండి వచ్చిన యువతను గ్లోబల్ ఐటీ రంగంలో విజేతలుగా నిలబట్టడానికి ఎంతగానో కృషి చేస్తోంది.సింగపూర్ అనుభవాలే.. స్టార్టప్కు నాందిఐటీ రంగంలో స్థిరపడిన శివకుమార్ మెరుగైన అవకాశాలను దక్కించుకుంటూ ఖండాంతరాలకు విస్తరించారు. దశాబ్ద కాలం అనుభవంతో సింగపూర్లో పలు ప్రధాన ఐటీ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఇవేవి తనకు సంతృప్తినివ్వలేదు. తనలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాలను నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఎంతో మందికి స్పూర్తితో.. తాను కూడా అలాంటి మెరికలను ఐటీ రంగానికి అందించాలనే నిర్ణయంతో జాయిన్ డెవాప్స్కు ఊపిరి పోశారు. అనుభవం నుంచి ఉద్భవించిన ఆలోచనకు కార్య రూపమే ఈ జాయిన్ డెవాప్స్ కాగా, స్కీల్లింగ్ ఇకోసిస్టమ్లో భాషా నైపుణ్యాలు లేక వెనుకబడిన ఎంతో మందిని ప్రత్యక్షంగా చూశారు. నైపుణ్యాభివృద్ధిలో గుర్తించిన అంతరాన్ని తెలుగు ఆధారిత శిక్షణతోనే టెక్ రంగంలో స్థిరపడే విధంగా సన్నద్ధం చేయాలని ఈ స్టార్టప్ను 2020లో స్థాపించారు.ప్రతిభకు భాష అవసరమే లేదు..ప్రతిభకు భాషతో అవసరమే లేదు. కానీ సరైన సమయంలో సమర్థుడిని నిరూపించుకోవడంలో భాషనే కీలకంగా మారింది. ఇదే గొప్ప అవకాశాలను చేజారిపోయేలా చేస్తోంది. ఈ సమస్యను మార్చడానికి జాయిన్ డెవాప్స్ ద్వారా ప్రాంతీయ భాషలో టెక్ కోర్సులను మిళితం చేసి శిక్షణ వేదికను ఏర్పాటు చేశాడు. 2026 నాటికి 20.5 బిలియన్ డాలర్లకు చేరుకునేలా జాయిన్ డెవాప్స్ అధిక డిమాండ్ ఉన్న రంగంలోకి తీసుకెళ్లారు. ఆధునాతన టెక్నాలజీ సాయంతో క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్లో వృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో శిక్షణార్థులను సన్నద్ధం చేయడం, ప్రతిభతో మెరుగైన అవకాశాలను అందుకునేలా యువతను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ దూసుకుపోతుంది.ఎన్నో ప్రత్యేకతలు..తెలుగులో ఐటీ శిక్షణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శిక్షణార్థులు భాషా అడ్డంకులు లేకుండా సంక్లిష్టమైన ఐటీ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ భావనలను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంత తెలుగులోనే శిక్షణనిస్తున్నారు.వరల్డ్ క్లాస్ కరిక్యులమ్:మొదటి రోజు నుంచి విద్యార్థులు ఎంటర్ప్రైజ్ పరిసరాలను ప్రతిబింబించే ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణలో పాల్గొంటారు. ఇది వారిని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలలో అవకాశాలకు సిద్ధం చేస్తోంది. దీనికోసం వరల్డ్ క్లాస్ కరిక్యులమ్తో శిక్షణ విధానం ఉంటుంది.తక్కువ ధర:కేవలం రూ.1,000 నుండి ప్రారంభమయ్యే ఫీజుతో జాయినొవాప్స్ మార్కెట్లో రూ.2-6 లక్షల ప్యాకేజితో ఉద్యోగ అవకాశాలను దక్కించుకునేలా నైపుణ్యాలను అందిస్తోంది.జీవితాన్ని మార్చే ఫలితాలు:సాధారణ డిగ్రీల నుంచి ఎంటెక్ చేసిన సరైన నైపుణ్యాలు లేక చాలీచాలనీ జీతాలతో నెట్టుకొచ్చే ఎంతో మందికి ఇదొక చుక్కానిలా నిలుస్తోంది. డెవాప్స్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్కించుకున్న వారికి సగటున వార్షికంగా రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల ప్యాకేజితో ఉద్యోగాలను అందుకుంటూ జీవితాలను మార్చుకుంటున్నారు.ఇక దేశంలో అత్యధికంగా రూ. 48 లక్షలు కాగా, రూ.1.9కోట్ల వార్షిక ప్యాకేజీతో విదేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. దేశంలోని ఉన్నత ఐటీ సంస్థలలో, యూఏఈ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ప్లేస్మెంట్లతో జాయిన్ డెవాప్స్ శిక్షణార్ధులకు భరోసానిస్తోంది. వైజాగ్ కు చెందిన పృథ్వీరాజ్ తక్కువ జీతంలో బీపీవోలో పనిచేస్తున్నాడు. కానీ జాయిన్ డెవాప్స్ లో చేరిన అనతి కాలంలోనే టీసీఎస్లో డెవలపర్ ఉద్యోగం సంపాదించాడు. తాను పొందుతున్న దానికంటే పదిరెట్ల ఎక్కువ జీతంతో ఉద్యోగాన్ని పొందేలా నైపుణ్యాలను అందించింది. ఇప్పటివరకు 8,500 మంది జాయిన్ డెవాప్స్ వేదిక ద్వారా శిక్షణ పొందగా.. మెజార్టీ మంచి అవకాశాలను దక్కించుకుని జీవితాలను మార్పుకున్నారు.టైర్-2, 3 నగరాల్లో:ప్రాంతీయ భాషాలో స్కిల్లింగ్ ద్వారా టైర్-2 టైర్-3 నగరాలలో ఐటీ ప్రతిభా సమూహాన్ని 40-50 శాతం వరకు విస్తరిస్తూ 2027 నాటికి 2 మిలియన్లకు పైగా డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని జాయిన్ డెవాప్స్ కృషి చేస్తోంది. తెలుగులో మాట్లాడుతూ శిక్షణార్ధులకు టెక్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. కంపెనీలకు డెప్లొయ్మెంట్-సిద్ధంగా ఉన్న ఇంజనీర్లను అందించడంలో సహాయపడుతోంది. స్టార్టప్ యొక్క సముదాయ -ఆధారిత మోడల్ దాని విజయానికి మరో కీలకం. ఇక ఇక్కడ శిక్షణ పొందిన వారే మెంటర్లుగా తిరిగి వస్తున్నారు. శిక్షణ నాణ్యతను నిర్ధారిస్తూ, నాలెడ్జీ భాగస్వామ్యం యొక్క చక్రాన్ని పెంపొందిస్తారు.ఉన్నత శిఖరాలకు:జాయిన్ డెవాప్స్ ఇప్పుడు భారతదేశానికి మించి, యూఏఈ వంటి గ్లోబల్ హట్లలో తెలుగు మాట్లాడే ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకుని విస్తరించడంలో శివకుమార్ ప్రతిభనే కీలకం. అదునాతన క్లౌడ్ స్పెషలైజేషన్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల కోసం ప్రణాళికతో టెక్ రంగంలో దూసుకుపోతుంది. "కేవలం నైపుణ్యాలను బోధించడం లేదు. ఐటీ భవిష్యత్తును మరింత శక్తివంతం చేసే ప్రతిభను నిర్మిస్తున్నాము." అని ఈ రంగంలో ఉన్న వృద్ధిని రెండు మాటల్లో శివకుమార్ వివరిస్తున్నారు. గ్లోబల్ టెక్ పవర్స్ భారత్ తన స్థానాన్ని బలోపేతం చేస్తున్నప్పుడు, జాయిన్డెవాప్స్ భాష విజయానికి ఎప్పుడూ అడ్డంకిగా ఉండకూడదని నిరూపిస్తోంది. తెలుగు ప్రొఫెషనల్స్ను పోటీ ప్రపంచంలో దైర్యంగా నిలిచేలా డెవాప్స్ సాయపడుతున్నందుకు గర్వపడుతున్నామని శివకుమార్ చెబుతారు. -
సర్కారు డాక్టర్లూ.. ఇదేం పద్ధతండీ
సాక్షి, హైదరాబాద్: అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం.. ఇదీ ప్రభుత్వ వైద్యుల తీరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూనే కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ దర్శనమిస్తున్నారు. మరికొంత మంది వైద్యులు మరో అడుగు ముందుకేసి ఓపీలోని కొంతమందిని తమ సొంత క్లినిక్/ఆసుపత్రికి మళ్లిస్తున్నారు. ఇది జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధం. అయినా ఆ శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఓపీకి వచ్చే వందలాది రోగులను తూతూమంత్రంగా విచారించి పంపుతున్నారు. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న చులకనభావం బలపడుతోంది.ఓపీ నుంచి సొంత క్లినిక్లకు... గ్రేటర్ పరిధిలో గాందీ, ఉస్మానియా, నిలోఫర్, సరోజని, ఈఎన్టీ, ఛాతీ ఆసుపత్రి, ప్లేట్లబురుజు, ఫీవర్ ఆసుపత్రి, సుల్తాన్బజార్ ప్రభుత్వ ఆసుపత్రి, మానసిక ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్య, విధాన పరిషత్ పరిధిలోని కింగ్ కోఠి, కొండాపూర్, మలక్పేట్, నాంపల్లి, గోల్కొండ, వనస్థలిపురం, బార్కాస్, డబీపూర, సీతాఫల్మండీ, అంబర్పేట్ (Amberpet) తదితర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సుమారు 3 వేలకుపైగా వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఇందులో కొంతమందికి సొంతంగా క్లినిక్లు ఉండగా, మరికొంత మంది ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్, ఆన్ కాల్పై వైద్య సేవలందిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, కిడ్నీ, గుండె తదితర కీలక విభాగాల వైద్యులు (Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీకి వచ్చిన రోగులను తమ సొంత క్లినిక్లకు రావాలని సూచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బందితో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రోగులకు అవసరం ఉన్నా, లేకున్నా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అవి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవని, బయట చేయించుకోవాలని పంపిస్తున్నారు. దీంతో రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.సమయపాలన ఏదీ..? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమయపాలన ఉండటంలేదు. ఉదయం పది గంటలు దాటిన తర్వాత కూడా వైద్యులు విధులకు వస్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి ఓపీ చీటీ కోసం లైన్లో నిలబడి, తర్వాత వైద్యుడి కోసం ఎదురుచూసిన రోగులను ఒక్క నిమిషంలో విచారించి పంపిస్తున్నారు. పీహెచ్సీ, క్లస్టర్, ఇతర ఆసుపత్రుల్లో ఓపీలో గంట నుంచి గంటన్నర మాత్రమే ఉంటున్నారు. మరికొంత మంది ముందుగానే సెలవు చీటీ రాసి ఇస్తున్నారు. ఎవరైనా ఆకస్మిక తనిఖీకి వస్తే సెలవు చీటీ పనిచేస్తుంది. లేదంటే డ్యూటీకి వచ్చినరోజు మిగిలిన అన్ని రోజులకు కలిపి ఒకేసారి సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.చదవండి: ఆ హెర్బల్ డ్రగ్స్తో డేంజర్! స్కేలు సరిపోవడంలేదు.. ప్రభుత్వ వైద్యులకు ఇప్పుడున్న స్కేల్ సరిపోవడం లేదు. ఎయిమ్స్, నిమ్స్ వైద్యులతో సమానంగా వేతనాలు ఇచ్చి ప్రైవేటు ప్రాక్టీస్ బంద్ చేయాలంటే బాగుంటుంది. సాయంత్రం 4 గంటల తరువాత ప్రైవేటు కన్సల్టెంట్గా ఉండే అవకాశం ఇతర రాష్ట్రాల్లో ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు (డీఎంఈ), డీఎంహెచ్ఓలకి ఫిర్యాదు చేయవచ్చు. ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. – శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు -
నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..
హైదరాబాద్లో ‘రియల్’ దూకుడు పెరిగింది. నగరానికి నాలుగు వైపులా భారీ లేఅవుట్లు, కొత్త వెంచర్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల విక్రయాల్లో సైతం జోరు పెరిగింది. దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న ‘రియల్’ స్తబ్దత క్రమంగా పటాపంచలవుతోంది. – సాక్షి, సిటీబ్యూరోమహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. మరోవైపు ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన బిడ్డింగ్కు సైతం అనూహ్య స్పందన లభించింది. ఫ్యూచర్ సిటీ నుంచి షాద్నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులను ఇచ్చారు. మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపయ్యే అవకాశం ఉంది.గత మూడేళ్లలో హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులుగతేడాది కంటే ఎక్కువే.. గత సంవత్సరం 2024లో మొత్తం 878 అనుమతులు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులు ఇవ్వడం విశేషం. గత సంవత్సరం అన్ని అనుమతులపై హెచ్ఎండీఏకు రూ.395.13 కోట్ల ఆదాయం లభించగా ఈ సంవత్సరం జూన్ వరకు రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మరోవైపు 2023 సంవత్సరంలో 1,361 అనుమతులు ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది.నిర్మాణ రంగంలో కొంతకాలం స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా బిల్డ్నౌను ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది. క్షణాల్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేసే సదుపాయం లభించింది. మరోవైపు దరఖాస్తుదారులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ‘కీ’లు లభిస్తున్నాయి. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు.వేలానికి సిద్ధంగా హెచ్ఎండీఏ స్థలాలు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమవుతోంది. గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది.అలాగే తుర్కయంజాల్, తొర్రూరు, బాచుపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోనూ విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బహదూర్పల్లి, లేమూరు, ఇన్ముల్ నెర్వా తదితర ప్రాంతాల్లో త్వరలో వేలం నిర్వహించే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న హెచ్ఎండీఏ లే అవుట్లు -
బంధువుల పెళ్లిలో రమేశ్ బాబు కుటుంబం (ఫొటోలు)
-
యువతుల పట్ల అసభ్య ప్రవర్తన.. హాస్టల్ యజమానిపై తల్లిదండ్రులు దాడి
-
తలసేమియా లేని భారత్ కోసం : అకాన్ ఆహ్వానం పేరుతో నిధుల సేకరణ
హైదరాబాద్: తలసేమియా లేని భారత్ తమ లక్ష్యంతో బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని తలసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే తలసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రముఖ లౌంజ్ అండ్ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్కు నిధుల సేకరణ కోసం అకాన్ ఆహ్వానం కార్యక్రమం నిర్వహించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్రతిన బూనారు.అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయని కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కొత్తగూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి తలసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించినట్టు చెప్పారు. -
హైదరాబాద్లో ఈ-వాహనాలదే హవా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
సృష్టి కేసులో నేరం ఒప్పు కున్న డాక్టర్ నమ్రత
-
రెంటల్ అగ్రిమెంట్.. ఇలా సేఫ్..
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దె ఇల్లు అనేది నిత్యజీవితంలో చాలా సాధారణమైంది. ఉద్యోగావకాశాలు, విద్య, వైద్యం వంటి అంశాల కోసం లక్షలాది మంది నగరానికి తరలివచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంటల్ అగ్రిమెంట్ అనే విషయం ఎంతో కీలకమైంది. కానీ ఇప్పటికీ చాలామంది ఇంటి యజమానులు, అద్దెదారులు దీనిపై స్పష్టమైన అవగాహన లేకుండా నేరుగా మాటల కుదుర్చుకొని ముందుకు వెళ్లడం చూస్తుంటాం. రెంటల్ అగ్రిమెంట్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే అద్దెదారులు, గృహ యజమానులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం ఉభయులకు ఉపయుక్తంగా ఉంటుంది. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత రియల్టీ మార్కెట్ గమనిస్తే, రెంటల్ అగ్రిమెంట్కు గల చట్టపరమైన ప్రాముఖ్యతను సమర్థంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. అద్దెదారుడి హక్కులు, ఇంటి యజమానుడి బాధ్యతలు, ఒప్పంద కాలం, అడ్వాన్స్, పెనాల్టీలు, ఇంటి పరిస్థితి వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనడం వల్ల భవిష్యత్తులో అనవసర గొడవల నుంచి తప్పించుకోవచ్చు. రెంటల్ అగ్రిమెంట్ అంటే కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదు, అది రెండు వ్యక్తుల మధ్య నమ్మకాన్ని, బాధ్యతను ప్రతిబింబించే ఒప్పందం. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న నగరీకరణ మధ్య ఇది ఒక అవసరం.‘మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021’..భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021’ ప్రకారం అద్దె సంబంధిత అన్ని వ్యవహారాలను సరళంగా, పారదర్శకంగా చేయాలనే లక్ష్యంతో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. ➤ఇందులో భాగంగా ప్రతి అద్దె ఒప్పందం రిజిస్టర్ చేయించుకోవాలి. ➤అద్దెదారును అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లగొట్టడం తప్పు. ➤అడ్వాన్స్గా ఎక్కువ డబ్బు తీసుకునేలా నియంత్రణ తప్పనిసరి. ➤అద్దె ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి. ➤వ్యాపారాల నిమిత్తం అద్దె తీసుకుంటే ముందస్తుగా 6 నెలల కిరాయి మాత్రమే డిపాజిట్ చేయాలి. ➤అద్దె పెంపు, భద్రత డిపాజిట్ వంటి వాటికి స్పష్టత ఉండాలి. ➤ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో అమలవుతున్నాయా అన్నది ప్రశ్నే. కానీ ఈ చట్టం నగరాల్లో ఇప్పుడిప్పుడే మెల్లగా పుంజుకుంటోంది.11 నెలల రెంటల్ అగ్రిమెంట్ 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మెట్రోనగరాల్లో ఎక్కువగా రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలలకు మాత్రమే చేస్తుంటారు. ఎందుకంటే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 12 నెలలకు (ఏడాది) పైబడిన ఒప్పందాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పడతాయి). కానీ 11 నెలల ఒప్పందానికి నోటరైజ్ చేయడం సరిపోతుంది. చట్టబద్ధంగా తక్కువ బాధ్యతలు ఉండటం వల్ల, దీనిని ఇంటి యజమానులు, అద్దెదారులు అనుసరిస్తున్నారు. ఇది ఒక ‘కంఫర్ట్ జోన్’గా మారింది. కానీ దీని వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. న్యాయ వివాదం తలెత్తినప్పుడు, నోటరైజ్డ్ ఒప్పందానికి పూర్తి చట్టపరమైన మద్దతు ఉండదు.నగరంలో అద్దెలు..హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లు ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థుల అవసరాలను తీర్చేలా ఉన్నాయి. కానీ చాలామంది యజమానులు సరైన ఒప్పందం లేకుండా రూమ్లు ఇచ్చేస్తున్నారు. ఆన్లైన్ రియల్టీ ప్లాట్ఫామ్స్ (99ఎకర్స్, నోబ్రోకర్, మ్యాజిక్ బ్రిక్స్ మొదలైన) ద్వారా ఒప్పందాలు అయితే వస్తున్నాయి. కానీ అవి కూడా చాలాసార్లు 11 నెలల్లోనే నిమిత్తమవుతున్నాయి. ప్రధానంగా పోలీస్ వెరిఫికేషన్, ఆధార్ ఆధారిత ఒప్పందం వంటి వాటిని చాలామంది పట్టించుకోట్లేదు.భవిష్యత్తు దృష్టితో.. రియల్టీ, లైఫ్స్టైల్ పరంగా చూస్తే, అద్దె ఇల్లు అనేది తాత్కాలిక అవసరంగా కనిపించినా, జీవన శైలిని ప్రభావితం చేసే అంశం. చట్టపరమైన అవగాహన, పారదర్శక ఒప్పందాలు ఉండటం వల్ల అద్దెదారుడికి భద్రత ఉంటుంది. యజమానికి లీగల్ కవరేజీ ఉంటుంది. రెండు పక్షాల మధ్య విశ్వాసం పెరుగుతుంది. -
అరేయ్.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి..!
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీవ్రంగా కొట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని స్రవంతినగర్లో గంగోల శ్రీనివాసులు (29) అనే యువకుడు సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాసులు తనతో పనిచేస్తున్న కిరణ్, శ్రీనిజ, వెంకటేష్ , మహేష్, పవన్, సుభాష్ తదితరులతో కలిసి మూసాపేట చంద్రకళ థియేటర్లో కూలీ సినిమా చూసి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తిరిగి వెంకటగిరికి వచ్చి శ్రీనిజను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారు. అదే సమయంలో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి మద్యం మత్తులో తూలుతూ శ్రీనివాసులును ఉద్దేశించి అరేయ్.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి మీరెవరు..అంటూ కొట్టాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకోవడానికి యతి్నంచిన శ్రీనివాసులు స్నేహితుడిని కూడా కొట్టారు. నువ్వు కారు ఎక్కు.. నీతో పని ఉంది అంటూ బలవంతంగా కారు ఎక్కించుకుని 10 నిమిషాల పాటు హైలంకాలనీ ఏరియాలో తిప్పారు. ఓ వైన్ షాపు ముందు ఆపి తమతో పాటు తెచ్చుకున్న బీర్లు తాగుతూ రేవంత్తో పాటు ఆయన స్నేహితుడు విశాల్.. శ్రీనివాసులును తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన కిరణ్ను కూడా తీవ్రంగా బాదారు. మళ్లీ కారు ఎక్కించుకుని శ్రీనివాసులుతో పాటు ఆయన స్నేహితుడు కిరణ్ను మళ్లీ యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్ వైపు తీసుకువెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసు వాహనం అటువైపు రావడంతో వీరిద్దరూ బిగ్గరగా అరిచి పోలీసులను అప్రమత్తం చేశారు. స్పందించిన పోలీసులు కారును ఆపి నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిద్దరికీ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్థారణ అయ్యింది. దర్యాప్తులో నిందితుడు తొక్కుడుబియ్యపు రేవంత్ (27) యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో నివసిస్తుంటాడని, తండ్రి పోలీసు చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆయనకు చాంద్రాయణగుట్ట బ్రాంచ్ పింఛన్ ఆఫీసులో సబార్డినేట్ పోస్టు వచి్చనట్లు తేలింది. ఆయన స్నేహితుడు నారగాని విశాల్ శ్రీనగర్కాలనీలో నివసిస్తుండగా ఓ కారు షోరూంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నట్లు తేలింది. వీరి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం.. మరో మూడు రోజులు తట్టుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అల్పపీడన ప్రభావంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది.While entire North TG is getting INSANE DOWNPOURS, the moderate to heavy rains to further cover Siddipet, Sangareddy, Medak in next 2hrsLight to moderate rains to continue in Hanmakonda, Warangal, Mulugu, Jangaon, Yadadri, Vikarabad districtsHyderabad - Steady drizzles or…— Telangana Weatherman (@balaji25_t) August 16, 2025 చెరువును తలపించిన హైదరాబాద్..హైదరాబాద్ నగరంలోనూ రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. కూకట్పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గాజులరామారంలో రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. సూరారం జంక్షన్ వద్ద మోకాళ్ల లోతు వరద చేరి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కూకట్పల్లి ప్రగతినగర్లో రోడ్డుపై చెట్టు ఒరిగింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.వరంగల్లో నిలిచిన రాకపోకలు..కాగా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి వాగులు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం-మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు సాగడం లేదు. మేడారం సహా మండలంలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.జలదిగ్బంధంలోనే ఏడుపాయల వన దుర్గమ్మ..మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం మూడో రోజూ జలదిగ్బంధంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూర్లోని నక్క వాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. ఈక్రమంలో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ రాజగోపురం నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట, ఆలయం వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా ఔట్పోస్ట్ సిబ్బంది బారికేడ్లు పెట్టి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. -
ఉప్పల్లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు. -
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్/లంగర్హౌస్: భార్యను మోసం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని లంగర్హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఫరీసా షాహీన్ 1990లో సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ పాకిస్థానీ జాతీయుడు సాహెద్ అఖిల్ను వివాహం చేసుకున్నారు. .వీరికి 1991లో ఫహద్ అఖీల్ గోందల్ జన్మించాడు. భర్త చనిపోయిన తర్వాత ఫరీసా 1998లో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నగరంలోని విద్యనభ్యసించిన ఫహద్ ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్గా పని చేస్తున్నారు. గతంలో ఉప్పల్లోని సంస్థలో పని చేసినప్పుడు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన మహిళను వివాహం చేసుకుని లంగర్హౌస్ నేతాజీనగర్లో నివసిస్తున్నారు. ఫహద్కు ఏడాది క్రితం మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దాని తీసింది. వీళ్లిద్దరూ బంజారాహిల్స్లోని ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫహద్ భార్య తొమ్మిది నెలలుగా దూరంగా ఉంటోంది. గురువారం రాత్రి ఫహద్ ఆ మహిళతో కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఫహద్ను లంగర్హౌస్ ఠాణాకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఫహద్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. -
హైదరాబాద్ : పార్శీల నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
సైమా అవార్డ్స్ ప్రెస్మీట్లో మెరిసిన హీరోయిన్ 'వేదిక' (ఫొటోలు)
-
Revanth Reddy: మేం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం
-
ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు. -
గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన రేవంత్ రెడ్డి
-
ఆర్ట్.. అదిరేట్టు..!
మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీ యువ కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. చిత్రకారులు, ఫొటో గ్రాఫర్ల ప్రతిభను వెలికితీసేలా ఏడాది పొడవునా ఏదో ఒక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు పలు వర్క్షాపులు కూడా నిర్వహిస్తోంది. ఆర్ట్.. అదిరేట్టు అన్న రీతిన చిత్రప్రదర్శనలు నగర సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతోంది. గణేశ చతుర్థి నేపథ్యంలో 22న పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిత్ర ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది.. హైదరాబాద్ నగరంలో చిత్రకళా ప్రదర్శనలకు వేదికగా మారుతోంది మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీ. ప్రముఖ చిత్ర కళాకారులు మొదలు.. యువప్రతిభవంతుల వరకూ తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీని వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు 10కి పైగా గ్యాలరీలు కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. గ్యాలరీలనే కాకుండా అడిటోరియాన్ని కూడా నిర్వాహకులు అద్దెకిస్తున్నారు. పిల్లల కోసం చిత్రలేఖన తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో దాదాపు 80 ప్రదర్శనల వరకూ జరుగుతాయి. గణేశ చతురి్థ, బతుకమ్మ, ఉమెన్స్ డే, ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. కళాకారులకు కావాల్సిన వర్క్షాపులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే కళాకారులకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర, ఫొటో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆలిండియా ఆర్ట్ కాపిటేషన్, ఎగ్జిబిషన్ ఇండియన్ ఫొటో ఫెస్ట్ ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు. గణేశ పెయింటింగ్ కాంపిటీషన్.. ఈనెల 22న ఆర్ట్ గ్యాలరీలో గణేశ్ చతుర్థి 2025 పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 90309 04040, 91000 22958, 76618 72327లలో సంప్రదించవచ్చు. ఆకట్టుకుంటున్న బియాండ్ బౌండరీస్.. 53 మంది చిత్ర కళాకారులు వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 21వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సందర్శకులకు అందుబాటులో ఉంటున్నాయి. బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్.. కళాకారుడు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శనను గురువారం ప్రారంభించారు. కళాకారుడు శరత్ ముపుడు తీసిన 120 ఫొటోగ్రఫీ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. గ్యాలరీ బుకింగ్.. సోలో ఎగ్జిబిషన్ రూ.4,500. గ్రూప్ ఎగ్జిబిషన్ రూ.6000లుగా నిర్ణయించారు నిర్వాహకులు. చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా శిక్షణ తరగతులు, పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు తిలకించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. (చదవండి: యస్...ఇది గణేష్ బండి!) -
మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్లలోని మాచారం ఫ్లైఓవర్పై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ ఇద్దరు మహిళలున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ప్రేవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
సాక్షి,హైదరాబాద్: నార్సింగ్-అప్పారోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా నార్సింగ్-అప్పారోడ్డులో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అటువైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా గమ్య స్థానాలకు వెళ్లాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలుఇలా ఉంటే హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. -
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 37, 38/1లో 1.07 ఎకరాల భూమిపై ఎందుకంత దూకు డుగా వెళ్తున్నారని హైడ్రా (హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి సంరక్షణ విభాగం) కమిషనర్ ఏవీ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టేటస్కో ఆదేశాలు పాటించాలని చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కొందరు దీన్ని వాడుకుని ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని పేర్కొంది. చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో ప్రజలను అవస్థలకు గురిచేయడం, హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నించింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్తున్నట్లు వాహనాలకు ఆ రంగులేంటని అడిగింది. ఇలానే చట్టవిరుద్ధంగా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టుకు రప్పించి.. కఠిన శిక్షలు విధించడానికి వెనుకాడబోమని తేల్చిచెప్పింది. తన భూమిలో హైడ్రా చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటోందంటూ జూబ్లీహిల్స్కు చెందిన ఎస్.వెంకటేశ్వర్రావు ఏప్రిల్ 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. మొత్తంగా 6 ఎకరాల భూమి తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉందంటూ హైడ్రా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారించారా?హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా తమ భూమిలో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తోందని జూన్ 11న వెంకటేశ్వర్రావుతోపాటు మరో ఇద్దరు ధిక్కరణ పిటిషన్లు వేశారు. వీటిపై బుధ వారం జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు స్టేటస్కో ఆదేశాలు ఇచ్చినా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ లెక్కచేయలేదని, తమ్మిడికుంట ఎఫ్టీఎల్, బఫర్జోన్ను నిర్ధారించకుండానే దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వాదన లు విన్న న్యాయమూర్తి.. హైడ్రా కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు.. హడావుడి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారన్నారు. తాము నిలుపుదల ఆదేశాలు ఇవ్వని చెరువులున్న ప్రాంతాల్లో మునకపై ఏ చర్యలు తీసుకున్నారని, ఎఫ్టీఎల్పై ఇప్పటివరకు విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
హైదరాబాద్ లో హై అలర్ట్.. బయటకు రావద్దంటూ హెచ్చరిక
-
శ్రావణం స్పెషల్ ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్
హైదరాబాద్ నగరంలోని వీ హబ్ వేదికగా నిర్వహించిన వినూత్న కార్యక్రమం ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంప్రదాయం, సృజనాత్మకత, మహిళా వ్యవస్థాపకత– ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీ హబ్ ఆధ్వర్యంలో శ్రావణం స్పెషల్గా ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ను నిర్వహించింది. మహిళా వ్యవస్థాపకులకు విలువైన అమ్మకాల అవకాశాలు, ప్రత్యక్ష మార్కెట్ లింకేజీలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులకు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి దాదాపు 30 మంది మహిళా వ్యవస్థాపకులు, స్థానిక చేతివృత్తుల వారు ఒకచోట చేరి వారి కళాత్మక, సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా అద్భుతమైన చేనేత, హస్తకళలు, పండుగ దుస్తులు, నగలు, ప్రామాణికమైన తెలంగాణ ఆహారాలు, స్నాక్స్–స్వీట్లు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడ ఉంచారు. వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది మహిళల సంస్థ, మహిళా శక్తి. ఈ సంస్కృతి సమాజ స్ఫూర్తికి ఒక వేడుక అని తెలిపారు. ప్రతి మహిళా వ్యవస్థాపకురాలు తన నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా ఈ కమర్షియల్ మార్కెట్లకు ప్రాప్యత పొందేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు. (చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!) -
Hyderabad: అంతా అటెన్షన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని కంట్రోల్ రూంను ఆయన తనిఖీ చేశారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. కంట్రోల్ రూం కార్యకలాపాలను సమీక్షించారు. 24్ఠ7 అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నగరంలో భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశాం. ఉన్నత అధికారులను హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆదేశించాం. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తూ అపసవ్యతలను చక్కదిద్దుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలలో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పౌరుల ఫిర్యాదులపై స్పందించేందుకు, సహాయక కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా నిర్వహించేందుకు పోలీస్, హైడ్రా, విద్యుత్, జలమండలి, మెట్రో రైలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. రిలీఫ్ కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్లు చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీకి కంట్రోల్ రూమ్తో పాటు నేరుగా, వివిధ మాధ్యమాల ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నాం. నాలాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాం. ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకూడదు’ అని కమిషనర్ సూచించారు. ట్రాఫిక్ ఫ్లో సజావుగా సాగేలా చర్యలు.. నగరంలో వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. మ్యాన్హోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు అని కమిషనర్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా సిబ్బందికి, ప్రజలకు సూచించారు. మ్యాన్హోళ్లపై ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ చోకింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్, హైడ్రా తో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణంతో వాటర్ లాగింగ్ కాకుండా చేసినందువల్ల ట్రాఫిక్ జామ్లు తగ్గాయని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు. -
తెలంగాణలో త్వరలో ‘పర్యాటక పోలీసులు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో పర్యాటక పోలీసులు రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో పర్యాటక శాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం బుధవారం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండి వి.క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి చ. ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ పేర్కొన్నారు.అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పొచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయని.. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని డీజీపీ ఆదేశించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ తెలిపారు. -
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు
ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకంపై తాత్కాలికంగా స్టేవిధించింది. గతంలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతల పిటిషన్పై సుప్రీం ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. కోదండరామ్, అమీర్ అలి ఖాన్ల నియామకాల స్టేవిధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.తీర్పు ఇలా వస్తుందని అనుకోలేదు: ఆమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఆమీర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతాను. కొద్ది సేపటి క్రితమే సుప్రీం కోర్టులో జరిగిన విషయాల గురించి తెలుసుకున్నారు. నేను మొన్నటి వరకు జర్నలిస్టును. నాకు ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు.ఇదే అంశంపై న్యాయ పోరాటం చేస్తాం’ అని అన్నారు. -
సత్తా చాటిన యంగ్ సెయిలర్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ వేదికపై నగరానికి చెందిన 14 ఏళ్ల యువ సెయిలర్లు దండు వినోద్, నిరుడు బద్రీనాథ్ సత్తాచాటారు. చెక్ రిపబ్లిక్లోని లేక్ లిప్నోలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆ్రస్టేలియా, భారత్ నుంచి వచ్చిన 104 బోట్లతో కూడిన అంతర్జాతీయ బృందాలను వినోద్, బద్రీనాథ్ అండర్ 17 క్యాడెట్ క్లాస్లో ఆశ్చర్యపరిచారు. మొత్తం 12 రేసుల్లో రెండు సింగిల్ డిజిట్ స్థానాలను, అందులో ఒక రేసులో రెండో స్థానాన్ని కూడా సాధించారు. ఓవరాల్గా 14వ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకున్నారు. సికింద్రాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వీరు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. హెడ్ కోచ్ సుహీమ్ షేక్, మాజీ జాతీయ చాంపియన్ అయ్యాజ్ షేక్ పర్యవేక్షణలో కేవలం రెండు నెలల కఠిన శిక్షణతోనే క్యాడెట్ క్లాస్లో ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత సాధించడం విశేషం. నైపుణ్యం మెరుగుపర్చుకునే అవకాశం2026 జులైలో ఇటలీలో జరగబోయే తదుపరి ప్రపంచ చాంపియన్షిప్లో పతకం అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియా క్రీడల కోసం 29 ఈఆర్, ఇంటర్నేషనల్ 420 వంటి పెద్ద బోట్లలో శిక్షణ కోసం సన్నద్ధమవుతున్నారు. 2000వ సంవత్సరం వరకు భారత్లో బాగా ప్రాచుర్యం పొందిన అండర్–17 క్యాడెట్ క్లాస్ సెయిలింగ్ బోట్ను సుహీమ్ కోచ్ చొరవతో ఇటీవల తిరిగి ప్రవేశపెట్టడం విజయానికి ఒక ప్రధాన కారణమైంది. ఇది యువ సెయిలర్లకు డబుల్ హ్యాండర్ విభాగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించింది. మాజీ జాతీయ క్యాడెట్ పుష్పరాజన్ ముత్తు ఈ బోట్ను అద్భుతమైన ఆవిష్కరణగా అభివర్ణించాడు. మొదటిసారి సెయిలింగ్ చేసేవారికి చాలా ఉత్తమమైన బోట్ అని హెడ్ కోచ్ సుహీమ్ షేక్ చెప్పారు. -
తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.అప్రమత్తమైన జీహెచ్ఎంసీభారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది. -
హైదరాబాద్లో భారీ వర్షం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మాదాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట సహ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.Rains🌧️ further spread into the most parts across City - Khairatabad, Begumpet, Kondapur, Jubilee Hills, Shaikpet, Attapur, Alwal, Malkajgiri, Musheerabad, Abids, Charminar, Rajendranagar, Uppal, LB Nagar (Near-by Areas) next 1-2 hrs#HyderabadRains https://t.co/t4cDJTf8rc— Weatherman Karthikk (@telangana_rains) August 13, 2025యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. -
హైదరాబాద్కు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, సరాసరి 10 నుంచి 15 సెం.మీ కంటే ఎక్కువ, కొన్ని చోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురవవచ్చని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా రోజుల్లో వాహనాల కదలికలను తగ్గించాలని అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
ఖజానా జ్యువెలరీ షాపులో దోపిడికి తెగబడ్డ దొంగల ముఠా
-
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. INSANE RAINFALL IN MANCHERIAL, ASIFABAD, MULUGU, BHUPALAPALLY, PEDDAPALLI The first round of LPA rains turned MASSIVE as North East TG got extremely heavy rainfall in few places. Bheemini, Kannepalli in Mancherial recorded highest rainfall of 207mm. Other parts too got VERY…— Telangana Weatherman (@balaji25_t) August 13, 2025భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.5:00 AM Update 🌧️🌧️Scattered Rains across - Adilabad, Asifabad, Nirmal, Mancherial, Nizamabad, Jagtial, Kamareddy, Sircilla, Karimnagar, Peddapalli, Siddipet, Sangareddy, Medak, Hanumakonda, Nalgonda, Suryapet, Nagarkurnool, Mahabubnagar, Wanaparthy, Gadwal districts next 3hrs— Weatherman Karthikk (@telangana_rains) August 12, 2025 -
నారీ స్వారీ!
శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్ పోలీస్.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్ను పహారా కాస్తోంది.. సెల్ఫ్ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.‘జాబ్కి జెండర్ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీస్లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, రోజు విడిచి రోజు లేక్ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్ పోలీస్ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్ గురించి నోటీస్ వచ్చేదాకా. ఏఆర్ పోలీస్లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్ పోలీస్లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్ పోలీస్ అంటే ఏంటో రీసెర్చ్ చేశారు. ‘ట్రైనింగ్ టఫ్గా ఉంటుంది.. ఫిట్నెస్ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్ చెప్పాక దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్ ఫిట్నెస్నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్గా డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్ పోలీస్ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్ పోలీస్కి కావల్సినంత ఫిజికల్ ఫిట్నెస్ లేక ట్రైనింగ్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిలఉత్సాహం.. ప్రోత్సాహం.. చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్ జాబ్లోకి వచ్చాను. అది రొటీన్ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. – మర్రి హవంతికబ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను..చిన్నప్పటి నుంచీ నాకు టఫ్ టాస్క్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్ జాబ్ వైపు, మౌంటెడ్ పోలీస్ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్. గుర్రపు స్వారీతో లైఫ్ బ్యాలెన్సింగ్ను నేర్చుకున్నాను. నా భవిష్యత్ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్. – సుభద్ర -
స్కూళ్లు,కాలేజీలకు సెలవులు .. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?
సాక్షి,హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని బట్టి విద్యా సంస్థలకు సెలవులు.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులకు,ఉన్నతాధికారులకు ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి.అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలి. ఉద్యోగులు,సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాలి.వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి.అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి’ అని సూచించారు. -
ఆధార్ అప్డేట్ ఉంటేనే.. ఫ్రీ జర్నీ!!
‘‘అమ్మా.. ఆధార్ కార్డ్ అప్డేట్ ఉండాలె. లేకుంటే పైసలిచ్చి టికెట్ తీసుకోండి..’’ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ‘‘ఇయ్యాళ్టికి వదిలేస్తున్నాం.. రేపటికల్లా అప్డేట్ చేసుకోండ్రి.. లేకుంటే మాత్రం ఊకోం.’’ ఇది మరికొందరు కండకర్లు చెబుతున్న మాట. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఉంటేనే ఆ ప్రయాణం వర్తిస్తుందని పలువురు కండక్టర్లు తెగేసి చెబుతున్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండడమే అందుకు ప్రధాన అభ్యంతరంగా చెబుతున్నారు.మన దేశంలో ఆధార్ కార్డులు జారీ అయ్యాక ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ చేసుకోని వాళ్లు కోట్లలోనే ఉన్నారు. అదే టైంలో.. కేవలం పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మార్చేసుకున్నవాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉమ్మడి జిల్లాల పేరుమీదే.. ఏపీ రాష్ట్రం అలాగే ఉండిపోతూ వచ్చింది. అయితే తెలంగాణలో ఫ్రీ జర్నీ అమలై ఏడాదిన్నర పైనే అవుతోంది. ఈ క్రమంలో ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడంపై కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఆధార్ అప్డేట్ వ్యవహారం అనుకున్నంత ఈజీగా సాగడం లేదు. ఈ తరుణంలో ఫ్రీ టికెట్ జర్నీకి ఇబ్బందులు తప్పవా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఆధార్ అప్డేట్ ఉంటేనే టికెట్ అనే దానికి అధికారిక ఉత్తర్వులు ఏమైనా జారీ అయ్యాయా?.. పోనీ ఉద్యోగులకు ఏమైనా ఆదేశాలిచ్చారా? అనేదానిపై తెలంగాణ ఆర్టీసీ స్పందించాల్సి ఉంది. సిగ్నల్ లేదు.. పైసలియ్యండి!తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యాష్లెస్ పేమెంట్లో భాగంగా.. ఆన్లైన్ పేమెంట్లను క్యూఆర్ కోడ్తో ప్రొత్సహిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. అయితే కొందరు కండక్టర్లు ఈ విషయంలో తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికులు అధికంగా ఉండడమో లేదంటే ఇతర కారణాలో తెలియదుగానీ.. సిగ్నల్ లేదని, టికెట్ మిషన్ పని చేయడం లేదని.. ఏదో ఒక కారణం చెబుతూ టికెట్కు క్యాష్ చెల్లించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. -
ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ భిలాయ్కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!) -
ఏఐఎన్యూ 150 పడకల ఆస్పత్రి ప్రారంభం
యూరో-నెఫ్రో చికిత్సలపై దృష్టిపెట్టిన భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి చైన్ అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తన ప్రధాన ఆస్పత్రిని ప్రారంభించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కొత్త ఆస్పత్రిలో 150 పడకలు, 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైన యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయి. దీంతో దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఇది అతిపెద్ద కార్పొరేట్ ఆస్పత్రిగా నిలిచింది.ఈ సందర్భంగా ఏఐఎన్యూ ఛైర్మన్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “యూరలాజికల్ సమస్యలు ఉన్న రోగుల చికిత్సను సమూలంగా మార్చడంలో సాంకేతిక ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ, ఎండోస్కొపిక్, లాప్రోస్కొపిక్ సర్జరీలు, 3డి ఇమేజింగ్, ఏఐ వాడకం లాంటివి యూరాలజీ రంగం రూపురేఖలు మారుస్తున్నాయి. శస్త్రచికిత్సల కచ్చితత్వం, సమర్థత వీటివల్ల మరింత పెరిగింది. యూరో-నెఫ్రో చికిత్సలలో అత్యంత కచ్చితత్వం, అత్యాధునిక టెక్నాలజీలతో రోగులు వేగంగా, సురక్షితంగా, మరింత సమర్థంగా కోలుకునేలా చేయడంలో మా 12 ఏళ్ల వారసత్వాన్ని ఏఐఎన్యూ బంజారాహిల్స్ ఆస్పత్రి మరింత ముందుకు తీసుకెళ్తుంది. మేం సేవ చేసే వర్గాల ప్రయోజనం కోసం వైద్య విజ్ఞానాన్ని, పరిశోధనను, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్తూ, వైద్యపరమైన విజయాలు సాధించే సంస్కృతిని నెలకొల్పుతున్నాం” అని తెలిపారు.ఏఐఎన్యూ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి మాట్లాడుతూ, “ఏఐఎన్యూ బంజారాహిల్స్ ఆస్పత్రి విస్తరణతో మేం యూరాలజీ, నెఫ్రాలజీలలో ఇంకా లోతుకు వెళ్లి.. యూరో-ఆంకాలజీ, ఆండ్రాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ లాంటి సబ్ స్పెషాలిటీలపై దృష్టిపెడుతున్నాం. సగటున పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఇక్కడి వైద్యులంతా అత్యున్నత శిక్షణ పొంది, మంచి నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వీరంతా కలిసి ప్రతి రోగికీ అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా నిర్ధారిస్తారు. వ్యాధి వచ్చాక చికిత్సల కంటే నిరోధించడంపైనా చాలా దృష్టిపెట్టాం. కొన్ని వ్యాధులను త్వరగా గుర్తిస్తే ఇతర వ్యాధులు కూడా రాకుండా ఆపగలం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏఐఎన్యూ ఆధ్వర్యంలో తెలంగాణలని గ్రామాల్లో ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నాం. వాటిద్వారా మూత్రంలో ప్రోటీన్ పోవడం, అధిక రక్తపోటు లాంటి ముందస్తు లక్షణాలను గుర్తిస్తున్నాం” అని చెప్పారు.ఏషియా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి మాట్లాడుతూ, “భారత ఉపఖండంలో పెరుగుతున్న యూరాలజీ, నెఫ్రాలజీ సమస్యల కారణంగా ఈ రంగంలో ప్రత్యేకంగా చికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ద్వారా మేం దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ నెట్వర్క్ ఈ విభాగంలో ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో అత్యున్నత నైపుణ్యం గల వైద్యులు, అత్యాధునిక టెక్నాలజీ కలయిక ఉంటుంది. మన దేశంలో ఏడాదికి 2 కోట్లకు పైగా నెఫ్రాలజీ, యూరాలజీ ప్రొసీజర్లు జరుగుతాయి. అందువల్ల రోగుల చికిత్సలో సరికొత్త ప్రమాణాలు పాటించాలి. యూరో-నెఫ్రో రంగంలో ఏఐఎన్యూ కచ్చితత్వాన్ని పునర్నిర్వచిస్తోంది” అన్నారు.ఏఐఎన్యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “బంజారాహిల్స్ ఆస్పత్రి దేశంలోనే మా ప్రధాన ఆస్పత్రి అవుతుంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు అత్యంత నమ్మకమైన సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రిగా దీన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. గత ఆరేళ్లలో మేం ఒక ఆస్పత్రి నుంచి మెట్రో నగరాల్లో ఏడు, ద్వితీయశ్రేణి నగరాల్లో రెండు ఆస్పత్రులకు ఎదిగాం. ఇప్పటివరకు 1200కు పైగా రోబోటిక్ సర్జరీలు, వెయ్యికిపైగా రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ సర్జరీలు, 300కుపైగా కిడ్నీ మార్పిడులు, 2 లక్షలకు పైగా డయాలసిస్ సెషన్లు చేసి దేశంలోని ఏడు యూనిట్లలో 5 లక్షల మంది రోగులకు సేవలందించాం. రాబోయే 18-24 నెలల్లో మరో మూడు కొత్త ఆస్పత్రులు ఏర్పాటుచేయాలని చూస్తున్నాం” అని వివరించారు -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: కొన్ని రోజులుగా హైదరాబాద్ను వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. ఏదొక సమయంలో నగరాన్ని ముంచెత్తుతున్నాడు వరుణుడు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) మహా నగరాన్ని వర్షం తడిపేసింది. వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం వేళ చినుకు చినుకుగా మొదలైన భారీ వర్షంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్లో సైతం కుండపోత వర్షం పడింది. అల్వాల్, మల్కాజ్గిరి, తార్నాక, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, అమిర్పేట, ఎర్రగ్డ, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. -
ధోని కాదు!.. ‘ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ అతడే’
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్గా భారత మాజీ ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, అభిమానులు ఊహిస్తున్నట్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)పేరు మాత్రం కాదు.స్టంప్డ్భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కీర్మాణి (Syed Kirmani) ‘స్టంప్డ్: లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ట్వంటీ-టూ యార్డ్స్’ పేరిట తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని తీసుకువచ్చాడు. హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సహా టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులు హాజరయ్యారు.ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ అతడేఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ సయ్యద్ కీర్మాణి. అలాంటి వికెట్ కీపర్ మరొకరు ఇంకా పుట్టనేలేదు. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లు ఉన్న జట్టులో వికెట్ కీపర్గా ఉండటం అంటే మాటలు కాదు.1983 వన్డే వరల్డ్కప్లోనూ అతడు ఎన్నో అత్యుత్తమ క్యాచ్లు అందుకున్నాడు. జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన మ్యాచ్లోనూ.. కీర్మాణి 24 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్లో ఆ పరుగులు కూడా ఎంతో కీలకం.ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆ దేవుడు ఆయనకు దీర్ఘకాల ఆయుష్షును ప్రసాదించాలి. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. తన ఆటోబయోగ్రఫీ పుస్తకం విజయవంతమైన బుక్స్లిస్టులో చేరాలి’’ అని ఆకాంక్షించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథికాగా ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్గా మహేంద్ర సింగ్ ధోని పేరొందాడు. భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ దిగ్గజ సారథి.. ఆటగాడిగానూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, అజారుద్దీన్ మాత్రం బెస్ట్ వికెట్ కీపర్గా సయ్యద్ కీర్మాణి పేరు చెప్పడం విశేషం. ఆయన తర్వాత కూడా అంతటి గొప్ప వికెట్ కీపర్ మరెవరూ జన్మించలేదనడం గమనార్హం. కాగా 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సయ్యద్ కీర్మాణి సభ్యుడు.చదవండి: ‘అంబానీని అగార్కర్ ఒప్పించాల్సింది.. నేనైతే అలాగే చేస్తా’ -
హైదరాబాద్ : కిర్మాణీ ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించిన సిరాజ్ (ఫొటోలు)
-
హైడ్రా సేవలు ఆగిపోలేదు: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, సాక్షి: హైడ్రా (Hyderabad Disaster Response and Action) కంట్రోల్ రూమ్ సేవలు బంద్ అయ్యాయన్న కథనాలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా విధులు ఎక్కడా ఆగలేదని.. ప్రజా వాణి యధాతథంగా కొనసాగుతోందని సోమవారం మధ్యాహ్నాం స్పష్టం చేశారాయన. ఈ ఉదయం.. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులు బహిష్కరించారన్నది తెలిసిందే. ఆపై బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో వీళ్లు అందించే ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే హైడ్రా వర్షాకాల సేవలపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. ఈలోపు.. సేవలేం ఆగిపోలేదని హైడ్రా ప్రకటించడం గమనార్హం.హైదరాబాద్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో HYDRA యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు రంగంలోకి దిగి సేవలు ప్రారంభించింది. ఈ సేవల్లో మార్షల్స్, DRF బృందాలు, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్లు, క్లీన్-అప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. మొత్తం 150 డివిజన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు (METs): ఒక్కో టీమ్లో 4 మంది, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.ఇందులో డీఆర్ఎఫ్ బృందాలు 51 టీమ్లు ఉండగా.. మొత్తం 918 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే.. స్టాటిక్ బృందాలు 368 ఉండగా.. నీటి నిలయాల వద్ద 734 మంది ఉన్నారు. 21 బైకులతో ఎమర్జెన్సీ బైక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భధ్రత, సమన్వయం కోసం మార్షల్స్ను ఏర్పాటు చేశారు. వీళ్లలో మాజీ సైనికులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా.. మాన్పవర్ 4,100 మంది ఉన్నారు. వానా కాలంలో నీరు తొలగించేందుకు పంపులు, చెట్ల కట్ మిషిన్లు, క్లీన్-అప్ టూల్స్ వీళ్లకు అందిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక్కరోజులోనే సత్వర శిక్షణ ఇప్పించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో ఈ సిబ్బంది సేవలు అందిస్తూ వస్తున్నారు. -
తెలంగాణకు అలర్ట్.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :10-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/7Vx8ZrRLag— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 10, 2025నేడు, రేపు భారీ వర్షాలు.. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి.Overnight, as expected, South, East TG like Rangareddy, Mahabubnagar, Nagarkurnool, Narayanpet, Khammam, Suryapet, Yadadri - Bhongir, Vikarabad rocked 💥🌧️ Next 2hrs, NON STOP MODERATE RAINS to continue in Gadwal, Wanaparthy, NagarkurnoolScattered rains ahead in Asifabad,…— Telangana Weatherman (@balaji25_t) August 11, 2025ఇక, ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.మరోవైపు.. ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
Hyd: ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
హైదరాబాద్: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగూబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించి అక్కడ వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు తన ఆకస్మిక పర్యటన అనంతరం సీఎం రేవంత్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బల్కంపేట ప్రాంతంలోని…బుద్ధనగర్, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో …ఆకస్మికంగా పర్యటించాను.భారీ వర్షాల సమయంలో… కాలనీల్లోని ప్రాంతాల్లో… సాధ్యమైనంత త్వరగానీటి ప్రవాహం జరిగి, ముంపు తలెత్తకుండా… తీసుకుంటున్న చర్యలను …డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాను. భారీ వర్షాల… pic.twitter.com/aiHR8JcCh3— Revanth Reddy (@revanth_anumula) August 10, 2025 -
మహా నగరాన్ని వదలని వరుణుడు
హైదరాబాద్: మహా నగరాన్ని వరుణుడు పగబట్టినట్లే ఉన్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. చినుకు చినుకుగా మొదలైన వాన.. భారీ వర్షంగా మారడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చి హమ్మయ్యా అనుకునేలోపే మళ్లీ నగరంలోని ఏదో మూలన భారీ వర్షం మొదలవుతోంది. శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా, ఆదివారం(ఆగస్టు 10వ తేదీ) మధ్యాహ్న సమయానికే మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్లో భారీ వర్షం కురుస్తోంది. పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలు చోట్లు భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్ రాయపూర్కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్లోని మెడికొవర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్ను డెవలప్ చేశాడు. యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు.. రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైల్ట్ ట్రాఫికింగ్ ద్వారా రూ.కోట్లు సంపాదించి నమ్రత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 30 మంది అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. రూ.25 కోట్లు వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను ఈ ముఠా విక్రయించింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీలాండరింగ్పై ఈడీ విచారణ చేయనుంది. సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత గతంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసిందా..? ఔననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.2020లో విశాఖపట్నంలో ఈమెపై క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత హైదరాబాద్లోనూ కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటి విషయంలో ఆమె అప్పట్లో పోలీసులను మేనేజ్ చేయడంతో బయటపడ్డారని తెలుస్తోంది. ఆపై కరోన విజృంభణ, లాక్డౌన్ తదనంతర పరిణామాలతో మరికొందరు బాధితులు వెనక్కు తగ్గారు. ఇవన్నీ కలిసి రావడంతోనే నమ్రత యథేచ్ఛగా తన దందా కొనసాగించగలిగారని సమాచారం. సృష్టి సెంటర్కు అనుకూలంగా 2019, 2020ల్లో ఇంటర్నెట్లో జరిగిన ప్రచారం అనేక మంది దృష్టికి ఆకర్షించింది.దీంతో వివాహమై కొన్నేళ్లు అయినా సంతాన లేమితో బాధపడుతున్న భార్య భర్తలు సికింద్రాబాద్లోని ఈ సెంటర్ను సంప్రదించారు. వీరికి పరీక్షలు చేసే నమ్రత వారిలో ఉన్న లోపాలను గుర్తించేది. ఆ విషయాలను మాత్రం వారికి చెప్పకుండా దాచి పెట్టేది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో సంతానం కలిగే అవకాశం ఉందంటూ చెప్పి భారీ మొత్తం వసూలు చేసేది.ఐవీఎఫ్ విధానంలో భార్య నుంచి అండం, భర్త నుంచి వీర్యం తీసుకుని ల్యాబ్లో పిండాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ పిండాన్ని తిరిగి భార్య గర్భంలో ఉంచి సంతానం కలిగేలా చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి విరుద్ధంగా వ్యవహరించిన నమ్రత వేరే వారికి చెందిన అండం, వీర్యాలను సేకరించి (ఏది అవసరమైతే అది) పిండాన్ని అభివృద్ధి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.అప్పట్లో ఈ విషయం గుర్తించిన ఒకరిద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీటిని స్వీకరించే సమయంలో అధికారులు సైతం బాధితుల తరఫునే నిలిచేవారు. ప్రాథమిక విచారణ పేరు నమ్రత లేదా ఆమె తరఫు వారిని పోలీసుస్టేషన్కు పిలిచే వారు. ఆ సమయాన్ని సది్వనియోగం చేసుకునే నమ్రత ఆయా అధికారులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కారణంగానే మరోసారి ఠాణాకు వచ్చే బాధితులతో ఆయా అధికారుల ప్రవర్తన పూర్తిగా మారిపోయేది. తాజాగా నమ్రతపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గతాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కొన్ని అంశాలు వెలుగులోకి వచి్చనట్లు తెలిసింది. డాక్టర్ నమ్రత నెట్వర్క్లో ఆమెతో కలిసి విద్యనభ్యసించిన వైద్యులు కూడా ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలో దర్యాప్తు చేస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యుడు సదానందం మాదిరిగానే వైజాగ్కు చెందిన ప్రభుత్వ వైద్యులు నమ్రతకు సహకరించారని తెలుస్తోంది. నమ్రతపై నమోదైన కేసుల్లో గోపాలపురం పోలీసులు ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తుల్లో వెలుగులోకి వస్తున్న వివరాల ఆధారంగా మరికొందరు వైద్యులు, టెక్నషియన్లు, సహాయకులతో పాటు ఏజెంట్లు, శిశువుల్ని విక్రయించిన, ఖరీదు చేసిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
బంగ్లా యువతిని నిర్బంధించి.. వ్యభిచార కూపంలోకి దించి
హైదరాబాద్: విదేశీ యువతిని నిర్బంధించి వ్యభిచార కూపంలోకి దించిన ముఠా సభ్యులను పాతబస్తీ బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, బండ్లగూడ ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ ఢాకా కు చెందిన రూపా అనే మహిళ సమీపంలో ఉండే యువతిని హైదరాబాద్ నగరం నివాసం, జీవనోపాధికి బాగుంటుందని నమ్మించి ఆరు నెలల క్రితం అక్రమంగా పశి్చమ బెంగాల్ మీదుగా హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చాక మెహదీపట్నం మురాద్నగర్కు చెందిన షహనాజ్ ఫాతీమా(32) ఇంట్లో ఉంచింది. అనంతరం హఫీజ్బాబానగర్కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ సమీర్(23) బాధితురాలిని బండ్లగూడ ఇస్మాయిల్ నగర్కు చెందిన హజేరా బేగం (41) ఇంటికి తీసుకొచ్చి నిర్బంధించారు. ‘నీవు వ్యభిచారం చేయాలని, లేకుంటే భారత్కు అక్రమంగా వచ్చావంటూ ఫిర్యాదు చేస్తే జైలుకు వెళుతావంటూ’ తీవ్రంగా బెదిరించడంతో బాధితురాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించింది. ఇలా ఆరు నెలల నుంచి నగరంలోని పలు హోటళ్లకు బాధితురాలిని పంపించి వ్యభిచారం చేయించారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకొని శుక్రవారం బండ్లగూడ పోలీస్స్టేషన్కు చేరుకొని జరిగిన విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రూపా, వీరికి సహకరించిన సర్వర్ అనే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో డీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం
-
అర్ధరాత్రి దంచికొట్టిన జడివాన.. వణికిన హైదరాబాద్ నగరం(ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) కూడా తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కాగా, హైదరాబాద్ మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న (శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది.ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది.ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
వందేభారత్.. తగ్గేదేలే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా నడుస్తున్న వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయ ని మరోసారి స్పష్టమైంది. ప్రయాణికుల ఆదరణ భారీగా ఉండటంతో ఇటీవలే వాటి కోచ్ల సంఖ్యను పెంచారు. అయినా, టాప్ ఆక్యుపెన్సీ రేషియోతో దూసుకుపోతున్నాయి. దీంతో విశాఖప ట్నం, తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలును నడిపేందుకు ఆస్కారం ఉందని అధికారులు తేల్చారు. సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర చాలా ఎక్కువ కావటంతో దేశంలోని కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్ల ఆదరణ స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ నుంచి నడుస్తున్న వందేభారత్ రైళ్లకు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రద్దీ నేపథ్యంలో కోచ్ల సంఖ్య పెంచగా, ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దేశంలోనే టాప్ సర్విసులలో స్థానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందేభారత్ సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రాల నుంచి డిమాండ్ల నేపథ్యంలో వాటి సంఖ్య పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. దేశంలోని అన్ని రూట్లలో రైళ్లు 130 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా ట్రాక్ల సామర్థ్యం పెంచుతున్నారు. కొన్ని కీలక రూట్లలో 160 కి.మీ. వేగానికి పెంచుతున్నారు. ఈ ట్రాక్ అప్గ్రెడేషన్ పనుల కారణంగా కొన్ని రూట్లలో వందేభారత్ రైళ్ల సగటు వేగం గంటకు 78 కి.మీ.కు తగ్గింది. దీంతో కొన్ని రూట్లలో ప్రయాణికుల ఆదరణ కూడా స్వల్పంగా తగ్గింది.సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం కూడా జనంలో కొంత ఆదరణ తగ్గేందుకు కారణమైంది. కానీ, హైదరాబాద్ నుంచి నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్లు మాత్రం క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెంచుకుంటూ దేశంలోనే అత్యధిక ఆదరణ ఉన్న టాప్ 10 సర్విసుల్లో స్థానం పొందాయి. దక్షిణ మధ్య రైల్వే తొలి వందేభారత్ సర్వీసుగా 2023 జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ రైలు మొదలైంది. 16 కోచ్లతో ప్రారంభమైన ఈ సర్వీసు ఆది నుంచి 140 శాతానికి మించిన ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ వచ్చింది. దీంతో 2024 మార్చిలో ఈ రెండు నగరాల మధ్య రెండో వందేభారత్ రైలును 8 కోచ్లతో ప్రారంభించారు.రెండోది కూడా 135 శాతాన్ని మించిన ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ వచ్చింది. అప్పట్లో దేశంలో టాప్ 5 సర్వీసుల్లో ఒకటిగా ఇవి నిలిచాయి. దీంతో 2025 జనవరిలో తొలి సర్విసు కోచ్ల సంఖ్యను 20కి, రెండో సర్వీసు కోచ్ల సంఖ్యను 16కు పెంచారు. కోచ్లను భారీగా పెంచినా వీటి ఓఆర్ 130 శాతంగా నమోడవుతుండటం విశేషం. సికింద్రాబాద్–తిరుపతి మధ్య 2023 ఏప్రిల్ 8న ప్రారంభమైన సర్విసుకు 8 కోచ్లే ఉండటంతో ఆక్యుపెన్సీ రేషియో 133 శాతంగా ఉంటూ వచ్చింది.కోచ్ల సంఖ్యను 2024 మేలో 16కు పెంచినా ఓఆర్ 120 శాతానికి మించి నమోదవుతోంది. దీంతో ఈ మార్గంలో మరో వందేభారత్ సర్విసు నడపాలన్న యోచనలో రైల్వే బోర్డు ఉంది. కాచిగూడ–బెంగళూరు(యశ్వంత్పూర్) మధ్య 2023 సెపె్టంబర్లో 8 కోచ్లతో ప్రారంభమైన వందేభారతసర్విసుకు 110 శాతాన్ని మించిన ఓఆర్ నమోదవుతూ వచ్చింది. దీంతో ఈ నెల 10న కోచ్ల సంఖ్యను 16కు పెంచారు. ఇప్పుడు దీని ఓఆర్ 80 శాతంగా ఉంది. నాగ్ ‘పూర్’సర్వీసు.. సికింద్రాబాద్– పుణె మధ్య గతేడాదే వందేభారత్ రైలు మంజూరైంది. కానీ, అది పట్టాలెక్కకుండానే అనూహ్యంగా సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య సర్విసు ప్రారంభించారు. ప్రయాణికుల డిమాండ్తో సంబంధం లేకుండా రాజకీయ నేతల ఒత్తిడితో దీన్ని ప్రారంభించారు. దేశంలో 20 కోచ్లతో నడిచే రెండో సర్వీసుగా దీన్ని తిప్పటం ప్రారంభించారు. కానీ, ప్రయాణికుల ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం మాత్రమే నమోదవుతూ వచ్చింది. దీంతో గత ఫిబ్రవరి 19 నుంచి ఒకేసారి కోచ్ల సంఖ్యను మూడోవంతుకు కు దించి 8 కోచ్లతో మాత్రమే నడుపుతున్నారు. మొత్తం ప్రయాణికులు ఆ 8 కోచ్లలోనే సర్దుకుంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో 70 శాతంగా నమోదవుతోంది. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది. -
హైదరాబాద్ను మరోసారి ముంచెత్తిన భారీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో భారీ వర్షంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్లౌడ్ బరస్ట్ అయిన తీరులో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దులాపూర్మెట్, నాగోల్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్నగర్, మీర్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాత్ తదిదర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, ట్రోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్నగర్, సబర్మతినగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. -
ఐదు కిలోమీటర్ల మేర.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్-బొల్లారం రోడ్డులో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్ వెళ్లడానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. గంటల తరబడి ఆర్టీసీ బస్సులు నెమ్మదిగా కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.‘రాఖీ స్పెషల్’ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు చేయడంతో జూబ్లీ బస్టాండ్, జేపీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు భారీ సంఖ్యల్లో వెళ్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల్లో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. అదనంగా మరికొన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీని కోరుతున్నారు.మరో వైపు, భాగ్యలత నుంచి హయత్నగర్ వరకు కూడా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. రాఖీ పండుగ, వారాంతం కారణంగా ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, బోయిన్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పలు చోట్ల కిలో మీటర్లు ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది. -
ప్లాస్టిక్ సర్జరీలలో భద్రత ముఖ్యం.. ఉన్న అందం చెడకుండా
హైదరాబాద్: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులు వస్తున్నా ఇప్పటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, లేజర్ చికిత్సలు, ముఖానికి సంబంధించిన మార్పుల కోసం చేయించుకునే శస్త్రచికిత్సల విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం.. చేయించుకుంటే ఏమైనా అవుతుందేమోనన్న భయం. రోగుల్లో ఈ భయం రావడానికి కూడా కారణాలు లేకపోలేవు. కొన్నిసార్లు ఈ తరహా చికిత్సల వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్లు రావడం, రకరకాల సమస్యలు తలెత్తడం లాంటివి ఉంటున్నాయి. కుప్పలు తెప్పలుగా నకిలీ వైద్యులు పుట్టుకురావడం, ఉన్నవారిలో కొందరికి నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వక్తలు పేర్కొన్నారు. రోగులకు ఈస్థటిక్ చికిత్సలు, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు అత్యంత సురక్షితంగా చేయడం ఎలాగన్న విషయాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా నగరంలోని టి-హబ్ వేదికగా రెండురోజుల పాటు నిర్వహించే సేఫ్ ప్లాస్ట్-2025 సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 120 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతో పాటు విదేశాల నుంచి ఆన్లైన్లో కూడా కొందరు పాల్గొన్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 25 మంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు వివిధ అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు.ఈ సదస్సులో దుబాయ్కి చెందిన ప్రముఖ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ మాట్లాడుతూ, ‘‘ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవి. కొన్ని సందర్భాల్లో మనం నూటికి నూరుశాతం కృషిచేసినా, ఫలితాలు మాత్రం అలా ఉండకపోవచ్చు. మరికొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురవు తుంటాయి. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించు కోవాలో తెలియడం ముఖ్యం. అలాగే అసలు సమస్యకు కారణం ఏంటన్నది కూడా గుర్తించాలి. అసలు ప్రక్రియ ఎలా చేయాలన్నది తగినంత శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేసేయడం కూడా సరికాదు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత చేస్తే మాత్రమే రోగులకు అత్యంత సురక్షితంగా చికిత్స చేయగలం. మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు, ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు. కాస్త అందంగా కనపడాలని, ఉన్న లోపాన్ని సరిచేయించుకోవాలని వచ్చేవాళ్లకు మనం పూర్తి సంతృప్తి ఇవ్వగలగాలి. అంతే తప్ప ఉన్నదాన్ని కూడా మరికొంత చెడగొడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స చేసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా లైపోసక్షన్, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ముఖం మీద వివిధ భాగాలు అంటే ముక్కు, గడ్డం, బుగ్గలు.. ఇలాంటివి సరిచేయించుకునే చికిత్సలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి చాలా సున్నితమైనవి. వీటి విషయంలో ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించుకుని రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పారు.పెర్సానిక్స్ కాస్మొటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురుకర్ణ వేముల మాట్లాడుతూ, ‘‘అసలు ఈ చికిత్సలు చేయించుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలనేది రోగులు ముందుగా నిర్ణయించుకోవాలి. అందుకోసం వాళ్ల ప్రొఫైల్, వెబ్సైట్లు, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో రిజిస్ట్రేషన్లు అన్నీ చూసుకోవాలి. వైద్యుల డిగ్రీల గురించి తెలుసుకోవాలి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీహెచ్ లాంటివి అన్నీ మంచి డిగ్రీలు. అవికాకుండా ఎఫ్ఐఎస్ఎస్, ఇలాంటి ఏవేవో పేర్లతో ఉండే ఫెలోషిప్లు ఉన్నాయంటే మాత్రం కొంత అనుమానించాలి. తగిన శిక్షణ లేని వాళ్లు ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల పలురకాల సమస్యలు వస్తున్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు కొంతమందికి తలమీద ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే బొటాక్స్, ఫిల్లర్లు, లేజర్ చికిత్సల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే.. రోగులు ముందుగా తగిన వైద్యుడిని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే, ఈస్థటిక్ సర్జరీల గురించి మన దేశంలో ఇంకా శిక్షణ మెరుగుపడాలి. శిక్షణ కార్యక్రమాలు పెంచాలి. బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలను అత్యంత సురక్షితంగా చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం అందాన్ని మెరుగుపరిచేది మాత్రమే కాదు.. అనేక సందర్భాలలో ప్రాణాలను సైతం రక్షిస్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చిన సీనియర్లు చెబుతున్న విషయాలేవీ వైద్య పుస్తకాల్లో ఉండవు. వీటిని కేవలం వారి అనుభవాల ద్వారానే తెలుసుకోవాలి. ఈ రంగంలో ఉన్న అత్యుత్తమ వైద్య నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నందున వీటినుంచి నేర్చుకుంటే ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు తమ వృత్తి జీవితంలో రాణించగలరు’’ అని తెలిపారు. -
Metro Rail: ఒక్కరోజే 5.36 లక్షల మంది
సాక్షి,హైదరాబాద్: నగరంలోని వివిధ మెట్రో కారిడార్లలో గురువారం రికార్డు స్థాయిలో పయనించారు. భారీ వర్షం కారణంగా అత్యధిక మంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో ఈ ఒక్కరోజే 5.36 లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లోనూ ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది. సాధారణంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.7 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతుంది. చాలా రోజుల తర్వాత 5.36 లక్షల మంది ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గం నుంచి అమీర్పేట్, నాగోల్ రూట్లో, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లో అత్యధిక మంది ప్రయాణం చేశారు. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో నడిచినప్పటికీ వేలాది మంది మెట్రో స్టేషన్లలోనే పడిగాపులు కాశారు. రద్దీ కారణంగా అన్ని రూట్లలో మెట్రో రైళ్లు కిక్కిరిసి నడిచాయి. గురువారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. -
Hyderabad: దారి తప్పిన ప్లానింగ్
సాక్షి, హైదరాబాద్: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు.. నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు. లోపాలతోనే వేగానికి తూట్లు... నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆరీ్టరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే.. నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేలి్చంది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్లో విలీనమై జీహెచ్ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేలి్చంది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. అన్నీ ఉన్నా అధ్యయనమేది? రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆరీ్టరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.ఆ ‘భుజం’కు ఊతమేది? నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్పాత్లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్పాత్లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం. -
ఆఫీస్ స్పేస్.. సిటీ టాప్ ప్లేస్..
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం నగర ఆఫీస్ మార్కెట్ అనూహ్యమైన డిమాండ్ను చవిచూసిందని ‘ఎ బిలియన్ స్క్వేర్ ఫీట్ అండ్ కౌంటింగ్ – ఇండియా ఆఫీస్ సప్లై’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ నివేదిక వెల్లడించిన ఇతర విశేషాల ప్రకారం.. –సాక్షి, సిటీబ్యూరోఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యే నాటికి, నగరం మొత్తం ఆఫీస్ స్టాక్ 123 మిలియన్ చదరపు అడుగులు, ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్ మార్కెట్లో 12% కాగా వార్షికంగా చూస్తే 9.2% అభివృద్ధితో టాప్ ఆరు మెట్రో నగరాల్లోనే అత్యధిక వృద్ధిని ప్రదర్శించింది. టెక్ రంగంలో బలమైన ప్రగతి, నిరంతరం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదల, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం నగర కార్యాలయ విస్తృతికి దోహదం చేస్తున్నాయి.టాప్ ప్లేస్లో ఈ ఏరియాలు..కొండాపూర్, మణికొండతో సహా సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్లు(ఎస్బీడీలు) నగర వాణిజ్య కార్యాలయ ల్యాండ్స్కేప్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవే మొత్తం కార్యాలయ సముదాయంలో 47% వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్రామ్గూడ వంటివి 41% వాటాను దక్కించుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంప్రదాయ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్లు ఇప్పుడు 11% వాటాను కలిగి ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ వంటి బలమైన మౌలిక సదుపాయాలు తక్కువ కార్యాచరణ ఖర్చులు వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..నాణ్యతలో టాప్ 3..గ్రేడ్ ఏగా లెక్కించిన 68% కార్యాలయ సముదాయంతో నగరంలోని ఆఫీస్ స్పేస్ నాణ్యతపరంగా మొదటి మూడు భారతీయ నగరాల్లో ఒకటిగా ఉంది. నగరంలో గ్రేడ్ బీ 30% వాటాను కలిగి ఉండగా, గ్రేడ్ సీ కేవలం 1% మాత్రమే ఉండటం గమనార్హం. నగరం కొంత కాలంగా ఐటీ/ఐటీఇఎస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆకర్షణీయంగా, అయస్కాంతంలా మారింది. ఇవే ప్రధానంగా లీజింగ్ కార్యకలాపాలకు ఊపునిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో, నగరంలోని కీలక టెక్ కారిడార్లలో ఫ్లెక్స్–ఎనేబుల్డ్ వర్క్స్పేస్లను కోరుకునే బహుళజాతి సంస్థల నుంచి సిటీ బలమైన డిమాండ్ను చవి చూసింది. -
బండి సంజయ్కు లీగల్ నోటీసులిస్తా.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు నిరూపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులిస్తా’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ, బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పని చేస్తాయో అర్థం కాలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.అలాగే కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన ఆరోపణలు హద్దు దాటాయి. ఇంత చౌకబారు వ్యాఖ్యలు ఆయనకు కొత్త కాదు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలలో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాల్ విసురుతున్నా.. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు’’ అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, ఇవాళ సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారన్న బండి సంజయ్.. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు
-
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. -
మహానగరంలో వరలక్ష్మి వ్రత శోభ
-
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం.సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలుకేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది. 2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్ తీసుకుంటారు. హైదరాబాద్లో వారి స్వంత స్టోర్ ఉంది. 2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం -
భార్యపై ఇన్స్టాలో భర్త అసభ్య పోస్టులు.. నవవధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాంగోపాల్పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్స్ట్రాగామ్లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్పేట్ గైదీన్బాగ్కు చెందిన కీర్తి, రామంతపూర్కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్లోని ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పుట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆటోలో 2 రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే? -
హైదరాబాద్ లో వర్ష భీభత్సం
-
ముంచెత్తిన వాన.. చెరువులుగా మారిన రోడ్లు
సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీనగర్ నుంచి చాదర్ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు, బషీర్బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్పేట వరకు, ట్యాంక్బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.కూ కట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్భవన్ రహదారి నీట మునిగింది.పలు జిల్లాల్లోనూ..పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు. -
హైదరాబాద్లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం
-
హైదరాబాద్లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Rains Updates: హైదరాబాదులో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లుNDRF ఫోన్ నెం.8333068536, ఐసీసీసీ 8712596106.హైడ్రా ఫోన్ నెం.9154170992, ట్రాఫిక్ 8712660600.సైబరాబాద్ 8500411111, రాచకొండ 8712662999.TGSPDCL ఫోన్ నెం.7901530966, RTC 9444097000.GHMC ఫోన్ నె.8125971221, HMWSSB 9949930003.👉జంట జలాశయాల్లోకి భారీగా వరదకాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులులోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనకిస్మత్పూర్, బండ్లగూడ, సన్సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచనవరద నీటిలో మునిగిన ఖైరతాబాద్-రాజ్భవన్ రహదారిమోండా మార్కెట్, బండిమెట్లో భారీగా వరదజీడిమెట్ల, సుచిత్రలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాబేగంబజార్, గౌలిగూడ బస్తీల్లో భారీగా నిలిచిన వరదభారీ వర్షానికి మణికొండలో కారుపై కూలిన గోడయూసుఫ్గూడ, కృష్ణానగర్లో భారీగా వరద ప్రవాహంభారీ వర్షానికి మాదాపూర్లో పొంగుతున్న డ్రైనేజీ👉నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మెుదలైంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, మియాపూర్, చందానగర్, బాలానగర్ సనత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్....అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్. దిల్సుఖ్నగర్ చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, నాచారం తార్నాక, నల్లకుంట హబ్సిగూడ, బేగంపేట్, వారణాసిగూడ, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్నగర్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.👉హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.👉జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.👉నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్ఆర్ నగర్ 11, ఖైరతాబాద్ 11, సరూర్నగర్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.👉ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరించాడు. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.👉కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్శిటీలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.👉బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్పై ఫిర్యాదు చేయగా.. రేవంత్రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది. -
పబ్లో యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36 లోని క్రిస్టల్ క్లబ్ పబ్లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండలో నివసించే యువతి (29) మంగళవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి క్రిస్టల్ పబ్కు వచ్చారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వీరి వెనుక సీట్లో కూర్చొన్న ఓ యువకుడు వాటర్ బాటిల్ను యువతి ఉన్న చోటికి వదిలాడు. తీసుకునే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాత్రి 12.10 గంటల ప్రాంతంలో సదరు యువతి స్నేహితురాలితో కలిసి బయట నిలబడగా భరత్, మారుతి, డోనాల్డ్ అనే ముగ్గురు యువకులు బయటకు వచ్చి మరోసారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే ఆమె సోదరుడు బయటకు రాగా తీవ్రంగా కొట్టారు. ఆపేందుకు వెళ్లిన ఆమెను దూషించారు. విషయం తెలుసుకున్న బౌన్సర్లు బయటకు వచ్చి యువకులను కట్టడి చేసేందుకు యతి్నంచగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బాధిత యువతితో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, అదే రోజు అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. జరిగిన ఘటన పట్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు భరత్, మారుతి, డోనాల్డ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు. ఆల్వేస్ వి న్నర్ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్ను అభినందించారు. బౌలర్గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు. ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదేఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది.కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోయాడు. ఓవల్లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్వన్గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్లో ఉన్నాడు. హైదరాబాద్లో సన్మానం! ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్లు ఆడటం లేదు.ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
హైదరాబాద్ : ఓ ఈవెంట్లో సందడి చేసిన మానసా వారణాసి (ఫొటోలు)
-
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
ప్లాట్ల వేలం.. రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియ చేపట్టారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.200– 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్కు రూ 30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది. రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన 50 ప్లాట్లకు సంబంధించిన వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 46,500 ధర పలికింది.చదవండి: ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం -
దేనికింద ఏముందో.. ఏది కుంగనుందో?
సాక్షి, హైదరాబాద్: నాలాలు కుంగిపోయి వాహనాలు దిగబడుతున్నా దిక్కేలేకుండా పోయింది. కుహరాల్లా కుంగిపోతున్నా బల్దియాకు సోయే లేకుండాపోతోంది. గత ఏడాది బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 11 ఉదయ్నగర్లో నాలా శ్లాబ్తో పాటు రిటైనింగ్ వాల్ కూలింది. గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో నాలాశ్లాబ్ స్వల్ప సమయంలోనే ఐదారుసార్లు కుంగింది. ఈ సంవత్సరం కూడా ఆ శ్లాబ్ కూలింది. వాహనాలు దిగబడ్డాయి. గతంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలోనూ నాలాపైనున్న రోడ్డు కుంగిపోయింది. ఇలా ఎంతోకాలంగా నగరంలోని నాలాల పైకప్పులు, నాలాలపై ఉన్న రోడ్లు కుంగిపోవడం, వాహనాలు అందులో దిగడం పరిపాటిగా మారినా ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి శ్రద్ధ చూపడంలేదు. పురాతన కాలం నాటివెన్నో.. నగరంలోని నాలాలు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి. నిజాం కాలం నాటి నాలాలూ వాటిల్లో ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు, వాటి పైకప్పులు (రోడ్లు) ఎలా ఉన్నాయి.. ఏమేర దెబ్బతిన్నాయి వంటి అంశాలను అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. నాలాల కింద ఎక్కడెక్కడ ఏమేమున్నాయో తెలిసే ఇన్వెంటరీ కూడా జీహెచ్ఎంసీ వద్ద లేదు. దీంతో.. ఏ నాలా కింద ఏముందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. తాజాగా బంజారాహిల్స్లో నాలాలో వాటర్ ట్యాంకర్ దిగబడటంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచి్చంది. భారీ వాహనం కావడంతో నాలాలో పడిపోయింది. కనీసం నాలాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించేందుకు హెచ్చరికల బోర్డుల వంటివి సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలోనూ నాలాలపై రోడ్లు కుంగినప్పుడు సైతం ఏ నాలా పరిస్థితి ఏమిటో, వాటికింద ఏమేమున్నాయో, రిటైనింగ్ వాల్స్ పరిస్థితేమిటో తెలుసుకోవాలనుకోలేదంటే అధికారుల తీరును అంచనా వేయవచ్చు. రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నా.. జీహెచ్ఎంసీ పరిధిలో 955 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడికతీతల కోసం దాదాపు రూ. 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ.. రోడ్ల దిగువనున్న నాలాల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తు నాలాల్లో వాహనాలు దిగబడినప్పుడు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.అదే వాహనాల్లో ఎక్కువమంది ఉండి ప్రమాదం తీవ్రమైతే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఆధునికీకరణ సరే.. ఆపదల మాటేమిటి? వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మక నాలా అభివద్ధి పథకం కింద ఇప్పటికే దాదాపు రూ. 950 కోట్లు ఖర్చుచేశారు. నాలాల ఆధునికీకరణ, నీటి పారుదలకు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాల వంటివి చేపట్టారు కానీ.. పురాతన నాలాలపై కనీస శ్రద్ధ పెట్టలేదు. వీటిలో కాలనీలు, స్లమ్స్ మధ్యన ఉన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నాలా రిటైనింగ్ వాల్స్నే ఆనుకుని వెలసిన అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అయినప్పటికీ, నాలాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. నాలా సేఫ్టీ ఆడిట్ పేరిట ప్రతి నాలానూ అధికారులు తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ, నాలాల శ్లాబ్ (రోడ్)లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేరు. శిథిల భవనాల విషయంలో మొక్కుబడి సర్వేలు చేస్తున్నప్పటికీ, పురాతన నాలాలు, వాటిపై ఉన్న రోడ్ల స్టెబిలిటీ గురించి మా త్రం కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. ఏ నాలా ఎప్పుడు కుంగుతుందో తెలియని దుస్థితి దాపురించింది. కాగితాలకే పరిమితం.. నాలా సేఫ్టీ చర్యల్లో భాగంగా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నడుచుకుంటూ వెళ్లి పరిశీలించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న ఓపెన్ నాలాలకు అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఉండాలి. పైకప్పులున్న నాలాల్లో ఎక్కడైనా కప్పులు దెబ్బతిన్నా, ఓపెన్గా ఉన్నా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నది కాగితాలకే పరిమితమైంది. వరదనీరు ఏ నాలా నుంచి ఎక్కడకు వెళ్తుందో కూడా తెలియని అధికారులున్నారంటే అతిశయోక్తి కాదు. బలహీనంగా నాలా కప్పులు నగరంలో ప్రస్తుతమున్న నాలా వ్యవస్థ గంటకు 20 మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. సగటున గంటకు 60 మి.మీ.లకు పైగా వర్షపాతం న మోదవుతుండటంతో ఉన్న నాలాలు వర్షాన్ని తట్టుకునేలా లేవు. దాంతో నాలాల పైకప్పులూ బలహీనమవుతున్నాయి. 000లో కురిసిన భారీ వర్షాలతో అప్పటి ఎంసీహెచ్ పరిధి వరకు వరద కాలువలపై అధ్యయనం చేసిన కిర్లోస్కర్ కమిటీ సమగ్ర నివేదిక రూపొందించింది. 170 కి.మీ పొడవున్న 71 నాలాలను తక్షణం విస్తరించాలని సూచించింది. 2007లో జీహెచ్ఎంసీగా> రూపాంతరం చెందాక గ్రేటర్ పరిధి మొత్తానికి వాయెంట్స్ సొల్యూషన్స్ వరదనీటి కాలువలపై అధ్యయనం చేసింది. 20మి.మీ మించి వర్షం కురిసిన ప్రతిసారీ నగరం నీట మునుగుతోంది. 390 కి.మీ మేర మేజర్ నాలాలను ఆధునికీకరించాలని వాయెంట్స్ సొల్యూషన్స్ సూచించింది. నాలాల వెంబడి బఫర్జోన్ పరిధిలో మొత్తం 28వేల అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించింది. రోడ్డు కుంగి నాలాలో కూరుకుపోయిన వాటర్ ట్యాంకర్బంజారాహిల్స్: రోడ్ నెం– 1లోని మహేశ్వరి చాంబర్స్ అపార్ట్మెంట్ వీధిలో ఓ వాటర్ ట్యాంకర్ నాలాలో దిగబడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి ఈ రోడ్డులోని నాలా కుంగిపోయింది. దీంతో అపార్ట్మెంట్కు వస్తున్న వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుకు రాకపోకలు నిలిచిపోయాయి. వాటర్ ట్యాంకర్ను వెలికితీసేందుకు 70 టన్నుల క్రేన్ కావాల్సి ఉంటుందని, ఇంత పెద్ద క్రేన్ నిలిపేందుకు అక్కడ స్థలం లేకపోవడంతో సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. రాత్రి వరకు క్రేన్ ద్వారా నాలాలో పడిపోయిన ట్యాంకర్ను తొలగిస్తామని ఈఈ విజయ్కుమార్ తెలిపారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన నాలా కావడంతో కుంగిపోయిందని అధికారులు గుర్తించారు.మాస్టర్ప్లాన్ ఏదీ?నాలాలపై ఉన్న రోడ్లపై వాహనాల రాకపోకలతో దెబ్బతినే ప్రమాదాలున్నందున నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. వర్షం వచి్చనప్పుడు నీరు నాలాల్లో చేరినప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్లి ఎక్కడ కలుస్తోంది వంటి వివరాలు లేవు. నిర్వహణ లేదు. నాలాలకు మాస్టర్ప్లాన్ అనేదేమీ లేదు. అక్రమ నిర్మాణాల కారణంగానూ నాలా పరిసరాలు బలహీనమవుతున్నాయి. నాలాలకు అడ్డుగా ఉన్న పైపులైన్లు తదితర యుటిలిటీస్ను తరలించడం, నాలాల్లో చెత్తా చెదారాలు చేరకుండా చూడాల్సి ఉంది. పైకప్పుల్ని బలోపేతం చేయాల్సి ఉంది.కాంక్రీట్ కప్పుల వల్లే.. నాలాలపై కాంక్రీట్ కప్పుల (రోడ్ల) వల్ల లోపల మరమ్మతులు చేయలేని పరిస్థితులుంటున్నాయి. లీకేజీలు గుర్తించలేకపోతున్నారు. చాలాకాలం క్రితం నిర్మించిన నాలాల పైకప్పులు బీటలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అంబర్పేట, బేగంబజార్, విజయ్నగర్ కాలనీ, మలక్పేట తదితర ప్రాంతాల్లోనూ కప్పులు దెబ్బతిని ప్రమాదాలు జరిగాయి. వీటికి తగిన పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉంది. -
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
-
నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్ అవర్’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్ అవర్ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ హోం అప్లయన్స్ బ్రాండ్ కెన్స్టార్ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్ అవర్’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్స్టార్ ఆహ్వానిస్తోంది. కెన్స్టార్ సీఈఓ సునిల్ జైన్ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ డిజిటల్ యుగంలో మనకు వేలాది ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్ అవర్’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్ మీడియాలో # NoPhoneHour హ్యాష్ట్యాగ్తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..) -
అత్తమామలపై కక్ష సాధింపు కేసు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: గృహ హింస, వరకట్నం కేసు ల్లో ఆరోపణలతో, భర్తపై కక్ష సాధింపుతో అత్తమామలపై పెట్టే కేసు చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని నిందితుల జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్లపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. తమ కోడలు సెక్షన్ 498 –ఏ కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర చోర్బుర్జికి చెందిన 74 ఏళ్ల గోవింద్ ప్రసాద్, అతని భార్య ఉషాశర్మ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున కపీష్కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లపై ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదీ ఎలాంటి వివరాలను సమర్పించలేదని పేర్కొన్నారు. వేధింపులు, క్రూరత్వం, వరకట్నం డిమాండ్కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని వివరించలేకపోయారన్నారు. దీంతో పిటిషనర్లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐర్లాండ్లో లీగల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు
హైదరాబాద్: ఐర్లాండ్ దేశంలో విద్యకోసం వెళ్తున్న విద్యార్థులు ఆ దేశ నియమ నిబంధనల ప్రకారం లీగల్గానే పార్ట్టైం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఐర్లాండ్ దేశ ఎడ్యుకేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెండి డిసౌజ అన్నారు. ఐ 20 ఫివర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఐర్లాండ్లోని వివిధ యూనివర్సిటీలలో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థుల అవగాహన సదస్సు మంగళవారం జరగగా ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్కడి పరిస్థితులపై, పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కవడానికి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉండేందుకు అక్కడి చట్టం అనుమతిస్తుందని తెలిపారు. ప్రతీయేటా తెలుగు రాష్ట్రాల నుంచి ఐర్లాండ్లో బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్, హెల్త్కేర్ రంగాల్లో చదువుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్లిన్ సిటీ యూనివర్సిటీ, మేనూత్ టీయూఎస్ ఎన్సీఐ గ్రిఫిట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే ప్రతినిధులు హాజరయ్యారు. ఐ20 ఫివర్ సంస్థ ప్రతినిధులు నవీన్ యాతపు, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్తో ఓవల్ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.బాగా ఆడి ఇండియాను గెలిపించాలిఇంగ్లండ్తో ఓవరాల్గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్కు బయల్దేరే ముందు సిరాజ్ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ విషయం గురించి సిరాజ్ తల్లి షబానా బేగం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.నాన్నంటే వాడికి ప్రాణంఅదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్కు ప్రాణమని.. ‘‘సిరాజ్కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్ వెనకాడేవాడు కాదు. సిరాజ్ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.కాగా సిరాజ్ క్రికెటర్గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.కుమారుడి ఎదుగుదల చూడకుండానేముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్ కన్నుమూశారు. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతేఅయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్ పేసర్గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్కు వెళ్లే ముందు కూడా సిరాజ్ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
డాక్టర్ నమ్రతా కస్టడీలో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.సరోగసీ కోసం హైదరాబాద్లోని సృష్టి సెంటర్ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్తో కథ నడిపించారు.ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
జయహో జకీయుద్దీన్..! సైకిల్పై ట్రాఫిక్ పోలీసు విధులు
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్. 2014 బ్యాచ్కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు. విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు. (చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..) -
చనిపోయిన వారి పింఛన్ల రికవరీ
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబసభ్యులు అధికారులకు తెలియ జేయకపోవ డంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. వృద్ధులు, ఇత రకేటగిరీల వారికిచ్చే రూ.2,016 మొదలు.. దివ్యాంగులకు ఇచ్చే రూ.4,016 వరకు చనిపో యిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ– పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్ వెరిఫికేషన్, ఎన్ఐసీ పోర్టల్లో పేర్లను సరిచూడడం వంటి వాటి ద్వారా పింఛన్దారులు చనిపోయినా వారి కుటుంబసభ్యు లు డబ్బులు విత్డ్రాచేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్ డెబి ట్ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలింది. దీంతో మరణించిన 28 వేల పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొల గించినట్టు అధికారులు వెల్లడించారు. అదేసమ యంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
Hyderabad Rains: నగరం.. నిలిచిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి, పంజగుట్ట–మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు. -
హైదరాబాద్లో ఆఫీస్ వసతులు రూ.1.39 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో రూ.1.39 లక్షల కోట్ల విలువైన 123 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులు (ఆఫీస్ స్పేస్) ఉన్నట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో జూన్ త్రైమాసికం చివరికి 993 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, దీని విలువ 187 బిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో సెపె్టంబర్ త్రైమాసికం చివరికి కార్యాలయ వసతుల పరిమాణం బిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం యూఎస్లో 10.2 బిలియన్ ఎస్ఎఫ్టీ, చైనాలో 6.26 బిలియన్ ఎస్ఎఫ్టీ, జపాన్లో 1.77 బిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఆఫీస్ స్పేస్ ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘2005లో 200 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్న ఆఫీస్ స్పేస్ ఏటా 8.6 శాతం చొప్పున పెరుగుతూ వచి్చంది. ఈ ఏడాది చివరికి బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. నగరాల వారీగా.. → బెంగళూరులో ఆఫీస్ వసతుల పరిమాణం జూన్ చివరికి 229 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండగా, దీని వలువ 49 మిలియన్ డాలర్లు. → ఢిల్లీ ఎన్సీఆర్లో 44 బిలియన్ డాలర్ల విలువైన 199 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ వసతులు అందుబాటులో ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో మొత్తం 169 మిలియన్ ఎస్ఎఫ్టీ (41 బిలియన్ డాలర్లు) అందుబాటులో ఉంది. → పుణెలో 106 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ఉండగా, దీని విలువ 16 బిలియన్ డాలర్లు. → 13 బిలియన్ డాలర్ల విలువైన 92 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీసు వసతులకు చెన్నై నగరం వేదికగా ఉంది. → అహ్మదాబాద్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు), కోల్కతాలో 34 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు) మేర కార్యాలయ వసతులు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. → టాప్–8 నగరాల్లోని మొత్తం ఆఫీస్ స్పేస్లో గ్రేడ్–ఏ వసతులు 53 శాతంగా ఉంటే, గ్రేడ్–బీ వాటా 43 శాతంగా, గ్రేడ్–సీ 4 శాతం చొప్పున ఉన్నాయి.జీసీసీలు ప్రధాన చోదకం ‘‘గత 35 ఏళ్లలో భారత్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎంతో మార్పును చూసింది. ముఖ్యంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఆఫీస్ స్పేస్ డిమాండ్కు ప్రధాన చోదకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆఫీస్ మార్కెట్గా భారత్ అవతరించింది. ఇప్పటికే 0.99 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, బిలియన్ ఎస్ఎఫ్టీ మార్క్ను త్వరలో చేరుకోనుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. -
హైదరాబాది స్టైల్లో సిరాజ్పై ఓవైసీ ప్రశంసలు
సాక్షి,హైదరాబాద్: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్ను భారత్ మట్టి కరిపించింది.ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది.మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు.చివరి మ్యాచ్లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అయితే నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్పై హైదరాబాద్ ఎంపీ అహ్మద్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా సిరాజ్ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. Always a winner @mdsirajofficial! As we say in Hyderabadi, poora khol diye Pasha! pic.twitter.com/BJFqkBzIl7— Asaduddin Owaisi (@asadowaisi) August 4, 2025 -
చెరువుల్లా హైదరాబాద్ రోడ్లు.. వాహనదారులకు నరకం
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి ముగ్గురు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనకు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక’ రెఫరెండంగా భావిస్తూ ముందస్తు కార్యాచరణకు దిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ కావడంతో ఈ స్థానాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్లు జూబ్లీహిల్స్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (jubilee hills bypoll) బాధ్యతలను అప్పగించారు.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్కు సిట్టింగ్ సీటు కావడంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే.. క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. సుడిగాలి పర్యటనతో సంక్షేమ, అభివృద్ధి అ్రస్తాలను ప్రయోగిస్తున్నారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు లేకుండా సమన్వయ సాధన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయడంతోపాటు బీజేపీని నిలవరించేందుకు సికిందాబాద్ కంటోన్మెంట్ తరహాలో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడాలన్నదే అధికార కాంగ్రెస్ (Congress Party) అన్ని అ్రస్తాలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల బాధ్యతలు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది. నియోజక వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్లకు బాధ్యతలను అప్పగించింది. ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పన కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళ్రావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో కొంత భాగం.. పొన్నం ప్రభాకర్కు యూసఫ్గూడ, బోరబండ డివిజన్లు, గడ్డం వివేక్ వెంకటస్వామికి షేక్పేట రహమత్నగర్ డివిజన్లను కేటాయించారు. మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఆరుగురు చొప్పున మొత్తం 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. వారంతా సంబంధిత మంత్రులతో సమావేశమవుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు డివిజన్లపై దృష్టి సారించి ఇక క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివద్ది పధకాల అమలు పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.క్షేత్ర స్థాయి పర్యటనలు.. మంత్రులు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. తమకు కేటాయించిన డివిజన్లల్లో అత్యధిక ఓటు బ్యాంకు (Vote Bank) సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజవర్గంలోని డివిజన్లలో క్షేత్ర స్థాయి పర్యటనలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. బూత్ స్థాయి నేతలతో సమావేశమై ఎన్నికలపై చర్చిస్తున్నారు. చదవండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ఇటీవల బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నంతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా వ్యవహరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు మంత్రులు తుమ్మల దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. -
ప్రజాధనం దుర్వినియోగమైనట్లు నివేదికలో స్పష్టమైంది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ ఆ సమావేశం బ్రీఫింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు.మేడిగడ్డ బ్యారేజ్లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు.ప్రజాధనం దుర్వినియోగం చేశారు..‘మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. మొత్తం ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్, డిజైనింగ్ అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్ అంచనాలు పెంచి నిర్మించారు. కాళేశ్వరం కమిషన్కు హరీష్రావు సరైన సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ కరెక్ట్ ప్రదేశంలో కట్టలేదు. కాంట్రాక్టర్స్కు ఫేవర్గా చూడటానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని ఉత్తమ్ తెలిపారు.ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్ మార్చేశారు..‘కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలను ఘోష్ కమిషన్ పరిశీలించింది. కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్బీఎఫ్ దగ్గర లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల ురుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను 25 పేజీలకు కుదించాం’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Guvvala Balaraju: బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు4) బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి పార్టీలో ఇన్ యాక్టీవ్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఆగస్టు3) రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
Rain: హైదరాబాద్లో వర్షం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువల్ని తలపించాయి.సికింద్రాబాద్,కోఠితో పాటు అన్నీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫ్రిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లిహిల్స్లో 7.4సెంటీమీటర్లు, మెహిదీపట్నంలో 5.3సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసఫ్ గూడా 3.9,ఖైరతాబాద్ 3.6, మైత్రీవనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురు గాలులు నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హయత్నగర్, వనస్థలీపురం, అబ్ధుల్లాపూర్ మెట్లలో వర్షం కురుస్తుండగా.. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి,అబిడ్స్,మలక్పేట్లో దంచికొడుతోంది. రాజ్ భవన్ రోడ్, తెలంగాణ సెక్రటరియేట్ ఎదుట వరద నీరు రోడ్డు మీదకు చేరింది.తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న మరో రెండు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ ,హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. -
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని ఆశించారు.‘సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్డేగా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాం. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’ అని తెలిపారు -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
లారీ బీభత్సం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా, సాయికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్పూర్ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్తో పాటు శివకుమార్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులులారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్ షాప్లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఎన్నికల్లో ‘గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్లో చేసిన అభివృద్ధికి ,సేవలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నారు. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నాడు.హైదరాబాద్లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అన్ని బఫర్ జోన్, ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు.జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే చెప్తున్నా. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు. గెలుస్తాం అని ఇంట్లోనే ఉండకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన మాగంటి గోపినాధ్ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితం ఇవ్వాలి.ఎలక్షన్ కమిషన్ తీరు సరిగా లేదు. ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఓట్లు తీసివేసి పనిలో ఉంది. బీహార్లో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఓటునే తీసేశారు. మన ఓట్లు తీసివేయడం ఒక లెక్కనాఅందరం జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. -
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపురి బస్తీ వైపు ఓ గేటు ఉంటుంది. ఈ గేటు వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యం ఉదయం వేళల్లో 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటాయి. గడిచిన మూడు రోజుల నుంచి నిమ్స్ అధికారులు ఈ గేటు మూసివేశారు. దీంతో రోగుల సహాయకులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అనారోగ్య సమస్యలతో వస్తుంటారని అలాంటి వారికి అన్నదానం చేస్తుంటే ఆపడం ఎంత వరకు సబబు అని బాలాపురి బస్తీవాసి, అన్నదాత బిట్ల శ్రీనివాస్ రాజు ప్రశ్నించారు. గేటు తెరవకపోతే ఈ విషయమై సంబంధిత శాఖా మంత్రిని కూడా కలిసి నిమ్స్ డైరెక్టర్, అధికారులపై ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. -
ఫాస్ట్ట్యాగ్
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ కళ్లల్లో కారం కొట్టి, కాల్చి చంపిన కేసులో నిందితులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2025 జూలై 15న హైదరాబాద్లో ఈ హత్య చేసి, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన దుండగులు నాలుగు రోజుల్లోనే చిక్కడంలో ఓ కారుకు సంబంధించిన ఫాస్ట్ట్యాగ్ కీలకంగా మారింది. ఈ హంతక ముఠా అరెస్టుతో విశాఖపట్నంలోని గాజువాక షీలానగర్లో జరిగిన భారీ చోరీ కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఈ ముఠాలోని ఇద్దరు అక్కడి వెంకటేశ్వర కాలనీలో నివసించే ఎల్ఐసీ ఉద్యోగి ఎస్.శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులని తేలింది. ఆ ఇంట్లో వీళ్లు 700 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి నగలు, వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు తస్కరించారు.సీపీఐ ఎంఎల్ తెలంగాణ సెక్రటరీ రాజన్న అలియాస్ రాజేష్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల కిందట చందు నాయక్తో పరిచయమైంది. ప్రభుత్వ, భూదాన్ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. చందును హత్య చేయడానికి రాజన్న గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరికి సుపారీ ఇచ్చినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజన్న ఈసారి తన అనుచరులు ఏడుకొండలు, శ్రీను, కందుకూరి ప్రశాంత్లతో పాటు ఏడుకొండలుకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన అర్జున్, రాంబాబులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉప్పల్ భగాయత్లోని హోటల్ సైలాలో గది బుక్ చేసి ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లను అందులో ఉంచాడు. షీలానగర్లో 2025 జూలై 12న చోరీ చేసిన అర్జున్, రాంబాబు అక్కడ నుంచి తమ వాటాగా వచ్చిన సొత్తు, నగదుతో కాకినాడ వెళ్లారు. అక్కడ కారు బుక్ చేసుకుని, అందులోనే హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్లో బస చేశారు. అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి క్యాబ్లో హోటల్ సైలాకు వచ్చి ఏడుకొండల్ని కలిశారు. మర్నాటి ఉదయం హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాక తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజు తెల్లవారుజామున (2025 జూలై 15) వీళ్లు ఉప్పల్ భగాయత్కు రాగా; అక్కడే ఉన్న రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లతో కలిసి ఓ కారులో వెళ్లి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కు వద్ద చందును కాల్చి పంపారు. వాకింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన చందుపై తొలుత అర్జున్, శ్రీను కాల్పులు జరిపారు.అతడు చనిపోయాడో, లేదో అనే సందేహంతో రాజన్న కూడా అర్జున్ నుంచి తుపాకీ తీసుకుని మరోసారి కాల్చాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కారును ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏడుకొండలు హత్యానంతరం తిరిగి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండగా, దాని వివరాలన్నీ ఏజెన్సీ యజమాని ఫోన్లో నమోదవుతాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్లోని వివరాలను విశ్లేషించి, ఏడుకొండలు అద్దెకు తీసుకున్న నాటి నుంచి కారు ఎక్కడెక్కడ సంచరించిందో గుర్తించారు. ఇలా పోలీసులకు భగాయత్లోని హోటల్ సైలా వివరాలు తెలిశాయి. అక్కడకు వెళ్లిన దర్యాప్తు అధికారులు అర్జున్, రాంబాబు గచ్చిబౌలి నుంచి అక్కడకు వచ్చిన క్యాబ్ నంబరు గుర్తించారు.ఆ నంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్ను గుర్తించారు. అక్కడే టాస్క్ఫోర్స్ బృందానికి వాళ్లు వినియోగించిన కాకినాడ ట్యాక్సీ నెంబర్ దొరికింది. చందు హత్య తర్వాత ఆరుగురూ ఉప్పల్ నుంచి ఇదే వాహనంలో బీబీనగర్, వలిగొండ, ఖమ్మం మీదుగా కోదాడ చేరుకున్నారు. ఆ సమీపంలోని చిలుకూరు వద్ద కారు దిగిన రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్ జనగాం పారిపోయారు. అర్జున్, రాంబాబు అదే కారులో విజయవాడ వెళ్లి, ట్యాక్సీని పంపేశారు. తమ వద్ద ఉన్న సొత్తు విక్రయించడం విజయవాడలో సాధ్యం కాకపోవడంతో అట్నుంచి మచిలీపట్నం వెళ్లి ప్రయత్నించారు. అక్కడా కుదరకపోవడంతో నెల్లూరు వెళ్లిపోవాలని భావించారు. దీంతో మరోసారి కాకినాడ నుంచి అదే ట్యాక్సీ పిలిపించి మచిలీపట్నం నుంచి బయలుదేరారు.రాజన్న, ఏడుకొండలు, ప్రశాంత్, శ్రీను ఫోన్లూ స్విచాఫ్లో ఉండటంతో సాంకేతిక నిఘా సాధ్యం కాలేదు. అర్జున్, రాంబాబు నంబర్లు పోలీసుల వద్ద లేవు. దీంతో కాకినాడ ట్యాక్సీ నంబర్ ఆధారంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాని ఫాస్ట్ట్యాగ్ వివరాలను సంగ్రహిచడం మొదలెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ టోల్గేట్ను ఆ వాహనం దాటినా తెలిసేలా జాతీయ రహదారుల సంస్థతో పాటు టోల్గేట్స్ నిర్వాహకులతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఓ బృందం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంత్లాలో గాలిస్తోంది. 2025 జూలై 19 తెల్లవారుజామున ఆ ట్యాక్సీ మచిలీపట్నం నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఆ మార్గంలోని టోల్గేట్లు దాటినప్పుడల్లా టాస్క్ఫోర్స్కు సమాచారం వచ్చింది. వీటి ఆధారంగా వాహనం విజయవాడ దాటి చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బృందాన్ని అప్రమత్తం చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కావలి పంపి అర్జున్, రాంబాబు ప్రయాణిస్తున్న వాహనం నంబర్ చెప్పారు. అక్కడి చెక్పోస్టు సిబ్బంది సహకారంతో ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో జనగాంలో దాక్కున్న రాజన్న, ఏడుకొండలు తదితరులను పట్టుకున్నారు. -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘సృష్టి’ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ నమ్రత.. పేద మహిళలను గుర్తించింది. పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి.. ఏజెంట్లు ట్రాప్లోకి లాగుతూ.. ఆర్థికంగా ఆశ చూపి పిల్లలను కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఎర వేసినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం.. నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత బ్యాచ్.. చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతోంది. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయపడ్డాయి.సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, A6 సంతోషి స్టేట్మెంట్లు విచారణలో కీలకంగా మారనున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. -
అక్కడ అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్: పెరిగిన రెంట్
విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట, ఎస్ఆర్నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు 6 నెలల్లో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారెడ్పల్లి, అల్వాల్లో 20-25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయి దారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి, పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10-15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10-15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20-25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3-4 నెలలు అడ్వాన్స్లను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతోంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)
-
మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్ మనోహర్తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ రామ్ మనోహర్ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
పేరుకుపోతున్న ఘన, బయో, నిర్మాణ, ఈ–వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.పరిశ్రమల నుంచి కలుషిత జలాలు.. రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి. 3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.ఘన వ్యర్థాలూ ఘనమే.. రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.ఈ–వేస్ట్.. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు జీడిమెట్ల, ఫతుల్గూడ, శామీర్పేట, శంషాబాద్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది. -
Sheep Scam: గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్ఫోన్లు, 20 సిమ్కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది. -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
హైదరాబాద్ పబ్లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సచిన్దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్లకు వెళ్లే అతడికి కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్యాదవ్తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్లో పబ్కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్ను తాను బైక్పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్ను అత్తాపూర్లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్కుమార్యాదవ్ గతంలో అదే పబ్లో బౌన్సర్గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్కు మకాం మార్చి అంబర్పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్యాదవ్, పవన్కుమార్యాదవ్తో పాటు కిడ్నాప్లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోసం చేసినట్లు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత!
హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సరోగసీ పేరుతో పలువురిని మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారు. చేసిన తప్పులను ఒప్పుకున్న డాక్టర్ నమ్రత.. దంపతులను సరోగసీ విషయంలో మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించినట్లు తెలిపిన నమ్రత.. ఆ రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ రిపోర్ట్ అడిగితే.. కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అనస్థీషియన్ సదానందం డాక్టర్ నమ్రతకు సహకరించారని పోలీసులు తెలిపారు. సరోగసీ ద్వారా నమ్రత చాలా మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
లగ్జరీగా హీరో రవితేజ మల్టీఫ్లెక్స్.. ఫోటోలు వైరల్
-
సింగిల్ యూజ్.. ప్లాస్టిక్ బ్యాన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని త్వరలో పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో నగరంలో దీని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్లను సంపూర్ణంగా నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరిట దీన్ని అమల్లోకి తేనున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు నిరీ్ణత మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదిలో అట్టహాసమే తప్ప అమలులో అటకెక్కింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచే ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసమని పెనాలీ్టలను రూ.5 వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు విధిస్తూ పలు సర్క్యులర్లు, జీవోలు జారీ అయినప్పటికీ, అమలులో మాత్రం నీరు గారింది. ఈ నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నారు. తద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగంలో లేని నగరంగా హైదరాబాద్ ఉండాలని భావిస్తున్నారు. టీసీయూర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్)వరకు దీన్ని అమలు చేసే ఆలోచనలున్నప్పటికీ.. తొలుత చట్ట సవరణ ద్వారా జీహెచ్ఎంసీ పరిధి వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట సవరణ చేయనున్నారు. గతంలో ఇలా.. ఎన్ని మైక్రాన్ల లోపు ఉంటే సింగిల్ యూజ్ ప్లాస్టికో క్రమేపీ మారుతోంది. 20 మైక్రాన్ల లోపు వాటిని ఒకప్పుడు సింగిల్యూజ్ ప్లాస్టిక్గా పరిగణించగా, ప్రస్తుతం ఇది 120 మైక్రాన్లకు చేరింది. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలోనే 2007 ఆగస్ట్ 8న జారీ అయిన సర్కులర్ మేరకు 20 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మినవారికి రూ.5వేలు, వినియోగించిన వారికి రూ.500 జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2011లో 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగరాదన్నారు. 2016లో మొదటిసారి రూ.10వేల జరిమానాతో పాటు మూడోసారి సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. 2017లో వెలువడిన జీవో మేరకు నిషేధం అమల్లో జీహెచ్ఎంసీ విఫలమైతే జీహెచ్ఎంసీకి పీసీబీ రూ.25వేల జరిమానా విధిస్తుందని పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2022లో డీలర్లు, డి్రస్టిబ్యూటర్లకు లక్ష రూపాయల జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. ఒక టాస్్కఫోర్స్ సైతం ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. పర్యవసానంగా ఏ మార్కెట్కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీబ్యాగ్ల భారం అదనంగా పడుతోంది. గత పాలకమండలిలోనూ నగరంలో ప్టాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక తిరిగి పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. నిషేధానికి చేయనున్న చట్ట సవరణలోనూ కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. నిషేధం అమల్లోకి వస్తే నగరంలో వివిధ సమస్యలు తగ్గుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలాల్లో వ్యర్థాలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా వరద సమస్యలు తగ్గుతాయి. ఎగుమతి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ ఉత్పత్తి చేసేవారికి, సీల్డు సరుకుల ప్యాకేజీలు, పాలు,పాల ఉత్పత్తుల ప్యాకింగ్స్, నర్సరీల అవసరాలకు అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా మినహాయింపులు ఉండనున్నాయి. -
HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత
సాక్షి, హైదరాబాద్: గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు అధికారుల. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్ ఎకోటిక్ పార్క్లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. -
హైదరాబాద్ : ఓ షోరూంలో సినీ నటులు, మోడల్స్ సందడి (ఫొటోలు)
-
Hyderabad: వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. వెలుగులోకి భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను మోసం వెలుగులోకి వచ్చింది. కేసులో హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థ ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ ప్రధాన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపించగా.. డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించినట్లు అధికారలు నిర్థారించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది.సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు అధికారులు గుర్తించారు. ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. -
హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి
-
హైదరాబాద్లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
రాజాసింగ్ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారా..?
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. ‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్కు లేఖ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు. -
కుక్క కావాలా..
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బల్దియా చర్యలు చేపట్టనుంది. ఎంపిక చేసిన పెద్ద పార్కుల్లో వీధికుక్క పిల్లల ప్రదర్శన.. దత్తత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. గతంలో ‘మా ఇంటి నేస్తం’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మెరుగులు దిద్ది, కొత్త విధానంలో చేపట్టేందుకు రెడీ అవుతోంది. డా.బి.జనార్దన్రెడ్డి కమిషనర్గా ఉన్న సమయంలో ‘మా ఇంటి నేస్తం’ కింద కుక్క పిల్లలను పెంచుకోవాలని ముందుకొచ్చేవారికి వాటిని అందజేసేవారు.సదరు కార్యక్రమానికి మెరుగులు దిద్ది, వాటిని స్ట్రీట్ డాగ్స్లా చూడకుండా అందమైన పెట్డాగ్స్గా పెంచుకునేందుకు కుక్క పిల్లలకు వైద్య పరీక్షలు, టీకాలు తదితరాలు పూర్తయ్యాక పెంపకంపై తగిన అవగాహన వంటివి సైతం కల్పించి దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి అందజేయనున్నారు. ఎంపిక చేసిన పార్కుల్లో కెన్నెల్స్లో కుక్కపిల్లలను ఉంచి ప్రదర్శన ఏర్పాటు చేసి, అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి, నిబంధనలకనుగుణంగా నడచుకునేలా అవగాహన కలి్పంచి దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపే వారికి కుక్కపిల్లలను అందజేయనున్నారు.కుక్కకాట్లు తగ్గేందుకు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని పలు నగరాల్లో వీధి కుక్కల సమస్యలున్నాయి. వాటి బారిన పడి ఎందరో.. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కోర్టులు సైతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఆయా మున్సిపల్ కార్పొరేషన్లను ప్రశి్నస్తున్నాయి. ఎంతగా శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, కుక్కల సంతతిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వీధికుక్కలుగా ఉంటే జనాన్ని కరుస్తుండటంతో వాటిని పెంపుడు జంతువులుగా మారిస్తే సమస్య తగ్గుతుందనే తలంపుతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. పార్కుల్లో ప్రదర్శనలు ఇందులో భాగంగా తొలుత బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కులో, తర్వాత కేబీఆర్ పార్కులో కెన్నెల్స్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తద్వారా డాగ్ లవర్స్ కుటుంబాలతో సహ వచ్చి ప్రదర్శనలోని కుక్కపిల్లల్లో నచ్చిన దానిని ఎంచుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రదర్శనకు అవసరమైన కెన్నెల్స్ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో సమకూర్చుకోనున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవల సిబ్బంది దత్తత ఇచ్చేందుకు కుక్కపిల్లలకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యకరంగా ఉన్నవాటినే ప్రదర్శనలో ఉంచుతారు. తల్లిపాలు మరచిన, నులిపురుగులు వంటివి లేకుండా తగిన మందులతోపాటు అవసరమైన టీకాలు వేసిన రెండునెలల వయసు దాటిన కుక్కపిల్లలను ప్రదర్శనల్లో ఉంచుతారు. ప్రదర్శన సమయంలో కుక్కపిల్లల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి అక్కడే దరఖాస్తులు అందజేస్తారు. ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రజల సందేహాలకు సమాధానాలిస్తారు. ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు వీధికుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, ఎక్కువమంది ప్రజలు కుక్కల్ని దత్తత తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యంపై వాకబు.. దత్తత తీసుకునేవారికి కుక్కల పెంపకంపై తగిన అవగాహనతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన అంశాల వంటివి వివరించనున్నారు. దత్తత ఇచి్చన కుక్కలకు అవసరమైన వైద్య పరీక్షలకు జీహెచ్ఎంసీ సహకరించనుంది. నిరీ్ణత వ్యవధిలో దత్తత తీసుకున్న ఇళ్లకు వెళ్లడం లేదా ఫోన్ ద్వారా సంప్రదించి దత్తత కుక్కల ఆరోగ్యాన్ని వాకబు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, జంతు సంరక్షణల దృష్ట్యా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కాలుష్యరహితంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగరం నడిరోడ్డున (కోర్ సిటీ) ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం చెప్పారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్లు తయారు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడంతో పాటు నిర్మాణ రంగ వ్యర్థాలను ఇష్టారీతిన డంప్ చేయకుండా చూడాలని ఆదేశించారు.ఉద్దేశపూర్వకంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సది్వనియోగం చేసుకునేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీవరేజీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలుగా వారసత్వ కట్టడాలు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడంతో పాటు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని సీఎం రేవంత్ సూచించారు. పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పనులపైనా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, చారి్మనార్ తరహాలో ల్యాండ్ మార్క్ను నిర్మించాలని ఆదేశించారు. మీరాలం ట్యాంకు వద్ద అధునాతన హోటల్ నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సూచించారు.సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సీడీఏ కమిషనర్ కె.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిత్తల్, మెట్రో రైలు ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
శస్త్రచికిత్సలకు 3 నెలలపాటు ఎదురుచూపులు
హైదరాబాద్: అది ఆసియాలోనే పేరున్న ఆసుపత్రి.. నిష్ణాతులైన వైద్యులకు నిలయం.. శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి. కానీ, ఇటీవల వైద్యులు, ఫార్మసిస్టుల కొరత పీడిస్తోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం తీవ్రమైంది. శస్త్ర చికిత్సలకు కనీసం మూడు నెలలపాటు వేచి చూడాల్సిందే. ఇదీ కోఠి ఈఎన్టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రి పరిస్థితి. కొంతకాలంగా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ కావడంతో ఇక్కడ ప్రతినిత్యం జరిగే శస్త్రచికిత్సలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రోజూ వెయ్యిమందికిపైగా ఓపీ రోగులుతెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజు వెయ్యి నుంచి 1300 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. 200 నుంచి 300 వరకు ఇన్ పేషంట్లు వివిధ యూనిట్లలో చికిత్సలు పొందుతుంటారు. ఇటీవల కాలంలో ఓపీ రోగులు పెరుగుతుండటంతో సరైన వైద్య సేవలు అందటంలేదు. బదిలీలు అయిన వైద్యుల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రమే ఉంది. తీవ్రంగా వైద్యుల కొరత.. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను ఇద్దరు బదిలీకావడంతో ముగ్గురే సేవలందిస్తున్నారు. 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు సకాలంలో అందడంలేదు. నెలలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఫలితం శూన్యమని చెప్పవచ్చు. కేవలం ఒక ఫార్మసిస్టు మాత్రమే వందల మంది రోగులకు మందులు అందిస్తున్నారు. దీంతో ఆ ఫార్మసిస్టుపై పనిభారం ఎక్కువై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టును వెంటనే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. మందులతోనే సరి..వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఔట్ పేషెంటు రోగులకు పీజీ వైద్యులు కేవలం మందులు రాసి సరిపెడుతున్నారు. ఒక్కప్పుడు ఇదే ఆసుపత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇప్పుడు శస్త్రచికిత్సలకు కనీసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు సరైన సౌకర్యాలు సైతం లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆసుపత్రికి సరైన వైద్యులు, ఫార్మసిస్ట్లు, నర్సింగ్ సిబ్బందిని సమకూర్చాలని పలువురు రోగులు కోరుతున్నారు.చదవండి: హైదరాబాద్లో చిరుత పులి.. పక్షం రోజులు దాటినా దొరకని జాడ -
డీజే బీట్స్.. రోడియో నైట్స్..
యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక ‘రాయల్ ఛాలెంజ్ అమెరికన్ ప్రైడ్ రోడియో నైట్స్’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్ మేళవింపుతో ఈ నైట్ను బోల్డ్ లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్స్టైల్ వేదికగా అమెరికన్ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్ థీమ్లతో బ్రాండ్ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్ చేయనుంది. ఈ ఈవెంట్ ప్రధానంగా అమెరికానా వైల్డ్ వెస్ట్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డెనిమ్ స్టైల్తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్ గేమ్స్, ఏ ఆర్ ఫొటో మూమెంట్స్ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్లు, హ్యామర్ స్లామ్లు, హ్యాండ్ పెయింటెడ్ డీఐవై జోన్ వంటి క్రియేటివ్ స్పేస్తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్ అమెరికన్ బైట్స్, సిగ్నేచర్ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్ డీజే బీట్ అహూతులను ఉత్సాహపరిచాయి. ఆధునిక జీవనశైలి.. ‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ వరుణ్ కూరిచ్ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు. -
‘మీరు నన్నెలా అరెస్ట్ చేస్తారు?’.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత
సాక్షి,హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ పోలీసులు తనని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిందితులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు డాక్టర్ అట్లూరి నమ్రత తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలనుండి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో.. తెలంగాణ పోలీసులు నాపై కేసులు ఎలా నమోదు చేసి.. అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో చిరుత పులి.. స్థావరాలను మారుస్తూ..
హైదరాబాద్ నగరవాసులను చిరుత పులి భయపెడుతోంది. అభయారణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చి.. దారి తెలియక అటూ ఇటూ స్థావరాలను మారుస్తూ శివారు ప్రాంతాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరకు రాజేంద్రనగర్ పరిధిలోని అటవీ, పోలీసు శాఖల క్యాంపులలో ఉన్న చిరుతపులి సోమవారం ఏకంగా మిలిటరీ కేంద్రంలోకి దూరింది. దాన్ని పట్టుకునేందుకు పక్షం రోజులుగా అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు.మొయినాబాద్ మండలం, అజీజ్నగర్ గ్రామంలోకి వెళ్లే పాత రోడ్డులో ఉన్న మూలికావనంలో ఈ నెల 9వ తేదీన చిరుతపులి (Leopard) జాడ కనిపించింది. అక్కడి నుంచి ఈ నెల 20వ తేదీన పక్కనే ఉన్న గండిపేట మండలం, మంచిరేవులలోని పోలీస్ గ్రేహౌండ్స్లోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ దాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం సమయంలో గ్రేహౌండ్స్లో ఓ రోడ్డు దాటుతూ సీసీ కెమరాలో చిక్కింది. ఆ మరుసటి రోజే గ్రే హౌండ్స్ వెనకాల ఉన్న ఓ విల్లా ప్రాజెక్ట్లో నివాసితులకు ఓ రాతి గుండుపై కూర్చుని కనిపించింది. ఈ నెల 24వ తేదీన తెల్లవారు జామున ఏకంగా ఔటర్రింగ్ రోడ్డు (Outer Ring Road) దాటి సర్వీసు రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన ట్రెక్ పార్క్లోకి చేరింది. దాంతో అక్కడా సీసీ కెమరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరో మారు ప్రయాణం.. మొయినాబాద్ మండలంలోని మూలికా వనం నుంచి మొదలయిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారు జామున రాందేవ్గూడలోని మిలట్రీ ఏరియాలోని రోడ్డు దాటి శిక్షణా కేంద్రంలోకి వెల్లింది. అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న చిరుతను చూసి 100 నెంబర్కు ఫోన్ చేశాడు. దాంతో ఇప్పటి వరకు అటవీశాఖ ట్రెక్పార్కులో ఉందనుకున్న చిరుత సోమవారం రంగారెడ్డి జిల్లా పరిధి దాటి హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో మిలట్రీ వారు అలర్ట్ అయి దాన్ని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. చదవండి: హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్భయాందోళనలో ప్రజలు.. తమ గ్రామాలకు పక్కనే చిరుతపులి సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహింబాగ్, రాందేవ్గూడల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.తిరిగి రావాల్సిందే.. మొయినాబాద్ మండల పరిధిలో ఆనవాళ్లు కనిపించిన చిరుతను పట్టుకునేందుకు పక్షం రోజులుగా ప్రయత్నిస్తునే ఉన్నాం. చాలాచోట్ల సీసీ కెమరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. సోమవారం తెల్లవారుజామున రాందేవ్గూడలోని మిలట్రీ ఏరియాలో రోడ్డు దాటి మిలట్రీ క్యాంప్లోకి వెళ్లినట్టు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దానికి అక్కడ అనువైన ప్రాంతం లేదు. కాబట్టి అది తిరిగి ట్రెక్ పార్క్, గ్రేహౌండ్స్ వైపే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. – లక్ష్మణ్, అటవీ రేంజ్ అధికారి, చిలుకూరు రేంజ్ -
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు. -
నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు
సాక్షి,హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిటెండెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారు. స్థలం పేరుతో నిమ్స్ డిప్యూటీ సూపరీడెంట్ రూ.50 లక్షలు కాజేశారు. కోర్టు సిఫారసుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ భాస్కర్పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలున్నాయి.తనకి గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడి ఉందని బాధితుడని లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు గురిచేశారు. ఈక్రమంలో లక్ష్మీ భాస్కర్తో పాటు ఆయనకు సహకరించిన మరికొందరి పైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు
సాక్షి, హైదరాబాద్: రైతుల, వ్యాపారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా, పండ్ల మార్కెట్ ఏర్పాటు అతీగతీలేదు. నాయకులు హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇంకా ప్రభుత్వ ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇదీ కోహెడలో పండ్ల మార్కెట్ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని కోహెడ్లో పండ్ల మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి కంప్యూటర్ గ్రాఫిక్ చిత్రాల్లో మెరుస్తోందే తప్ప ఆచరణలో రూపుదిద్దుకోవడంలేదు. కనీసం భూమిపూజకు కూడా నోచుకోలేదు. డీపీఆర్లో మార్పుల కారణంగా ఈ వ్యవహారం గజిబిజిగా మారింది. తొలుత ఫ్రూట్ మార్కెట్ అని, ఆనక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పూలు, పండ్లు, కూరగాయల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని అధికారులు చెబుతూ వచ్చారు. తాజాగా గ్లోబల్ గ్రీన్ మార్కెట్గా పేరు మార్చారు. రూ.399 కోట్ల నుంచి రూ.2,900 కోట్లకు.. గడ్డిఅన్నారం (Gaddi Annaram) పండ్ల మార్కెట్ను కొత్తపేట నుంచి కోహెడకు తరలించే ప్రతిపాదనల్లో నిర్మాణ విస్తీర్ణం, అంచనా వ్యయం ఏటేటా పెరుగుతున్నాయి. తొలుత రూ.399 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా ఈ మొత్తం రూ.2,,900 కోట్లకు చేరింది. తొలి దశలో (2021) ప్రతిపాదనలు సిద్ధం చేసినపుడు 178 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం సుమారుగా రూ.399 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్లో అనేక దఫాలు మార్పులు చేస్తూ భూసేకరణ 199 ఎకరాలకు చేరింది. నిర్మాణ వ్యయం అంచనా సుమారు రూ.2,900 కోట్లకు పెరిగింది.కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్ను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ)కి 167 ఎకరాలు రూ.2,044 కోట్లు, మరో 31 ఎకరాల్లో రూ.856 కోట్లతో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్లు, కార్మిక విశ్రాంతి గదులు, పార్కింగ్, అంతర్గత రహదారులు, టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ సెంటర్లు, వంటివి నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. దీనికి అధికారికంగా ప్రభుత్వ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అనంతరం టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి మరికొన్నేళ్లు వేచిచూడాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.ప్రత్యేక ఆకర్షణగా టవర్ ఆఫ్ ఎక్సలెన్స్.. కోహెడ మార్కెట్లో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంద అడుగుల ఎత్తులో, సుమారు 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్లు, హెలీప్యాడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు అంతస్తులు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారని పేర్కొంటున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌలిక వసతులు అంతంతగానే ఉన్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కోహెడ మార్కెట్ (Koheda Market) నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. చదవండి: హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్ -
‘సృష్టి’ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్
హైదరాబాద్: సృష్టి పెర్టిలిటీ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యింది. సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీలో విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు.2016లో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న మెడికల్ కౌన్సిల్ ఐదేళ్లు రద్దు చేయగా, 2021లో TGMC కి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారని డాక్టర్ నమ్రత. కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న పునరుద్ధరించలేదన్నారు. అయితే అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్ను నడుపుతూ దొరికిపోవడంతో సదరు సెంటర్ పై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లు పోలీసులు నిర్దారణలోతేలింది. eదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు.ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. అక్రమ బాగోతం ఎలా వెలుగుచూసిందంటే..!పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్లో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు
సాక్షి,హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతోన్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్లోనూ చిరుత ప్రత్యక్షమైంది. 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు పెట్టిన చిరుత చిక్కలేదు.ఇక సిటీలోపలికి చిరుత రావడం భయాందోళనకు గురిచేస్తోంది. -
ఫేక్ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. ఏకంగా 3 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్, పవర్బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. -
షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు