breaking news
Hyderabad
-
‘నంబర్’ ప్లేట్ ఫిరాయించాడు
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించకపోడం సహా పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ఈ–చలాన్లు తప్పించుకోవడానికి తన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లో ఓ సంఖ్యను మార్చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఈ– చలాన్లు మరో వాహనం యజమానికి వెళ్లాయి. ఆయన ఫిర్యాదుతో ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ ద్విచక్ర వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్11ఈజెడ్ 2936. ఈ–చలాన్లు తప్పించుకుపోవడానికి ఉద్దేశపూర్వకంగా దాన్ని టీఎస్11ఈజెడ్ 2836గా మార్చాడు. దీంతో ఇతడు చేసిన ఉల్లంఘనలకు సంబం«ధించిన చలాన్లు ‘2836’ వాహన యజమాని ఫహీమ్ అలీకి వెళ్లాయి. ఇలా దాదాపు 23 చలాన్లు అందుకున్న ఆయన చివరకు నగర ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధ్యుడిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాలను పరిశీలించి అలీవుద్దీన్ ఆచూకీ కనిపెట్టారు. నిందితుడిపై చాదర్ఘాట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కోర్టులో నిరూపితమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ వాహనం నంబర్ ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే వెబ్సైట్: ఈ– చలాన్ తప్పించుకోవడానికి ఎత్తుగడ ఈమెయిల్: echallan helpdesk.hyd@gmail.com, వాట్సాప్: 87126 61690లకు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ సూచించారు. -
FSL అగ్నిప్రమాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో అగ్నిప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదం సీఎం రేవంత్ పనే. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్రలు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మయం చేసేందుకు ఇలా చేశారు.తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా చేశారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణిచ్చారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉన్న జిల్లాలను తొలగించేది లేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదు. జిల్లాల పునర్వవస్థికరణ కోసం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు’ అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.గత జనవరిలో సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. -
కన్న బిడ్డలను చంపుకున్న ఇద్దరమ్మల కన్నీటి కథ..
-
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
-
ప్రమాదం ప్రభుత్వమే చేసిందా? కాలిబూడిదైన కీలక ఆధారాలు
-
నాంపల్లి ప్రమాదం.. 2015 కేసు ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. -
నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆదివారం ఉదయం ల్యాబ్ను సీజ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రానున్నారు. ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.కాగా, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో నేడు మరోసారి క్లూస్ టీం ఎస్పీ తనిఖీలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరు ఉన్నారు? అనే దానిపై ఎస్పీ ఆరా తీయనున్నారు. అలాగే, కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించనున్నారు. మరోవైపు.. కార్యాలయంలో అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం. చేశారు. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ట్యాప్లు, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం దాగి ఉందా అని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ గదిలోంచి ఉదయం 10.30 గంటలకు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆఫీస్బాయ్ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్ మాన్, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీ శ్వేతారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘కేసు సంబంధిత ఆస్తి, ఎఫ్ఎస్ఎల్కు చెందిన సామగ్రి సురక్షితంగానే ఉందని జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం’ అని శిఖా గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.ఎఫ్ఎస్ఎల్ ఎంతో కీలకం వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం. -
అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గెలుపులో నగర కుర్రోడు
మల్లాపూర్/కాప్రా: హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్లో మైమరిపిస్తూ.. ఫ్లిక్లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ స్టయిల్ను ప్రపంచానికి చాటాడు. బిహార్కు చెందిన మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి టీమ్ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్ బ్యాటింగ్తో అరోన్ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్లో నివసిస్తోంది అరోన్ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్. కేరళకు చెందినవారైనా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అరోన్ అండర్–19 హైదరాబాద్ జట్టు కెప్టెన్ కూడా. ప్రపంచ కప్లో అఫ్ఘానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్–19 క్రికెట్లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్ ప్రస్తుతం సైనిక్పురి భవన్స్ కాలేజీలో బీకాం (ఫైనాన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్ చేశాడు. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్ రానున్న అరోన్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు. -
దోమలు చంపుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా 4,846 కాలనీల్లోని నీటినిల్వ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, సెల్లార్లల్లో దోమల నివారణ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ యంత్రాంగం చెబుతున్నా నగరవాసులకు దోమకాటు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీడైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యంగ్య వీడియో చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో దోమల వల్ల నటులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ఆ వీడియోలో చూపించారు. నగరంలోని దోమలబెడద,ప్రజల బాధను ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల కూకట్పల్లికి చెందిన ఓ ఇంజినీరు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. చెరువుల్లో గుర్రపుడెక్క నిర్మూలన పనుల బిల్లుల వ్యవహారం కావడంతో అది కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ pic.twitter.com/U0orlNGngM— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026 -
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్.. రూ. 56 కోట్లు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు సమీపంలో బహదూర్పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్ లేఅవుట్లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్ స్వగహ కార్పొరేషన్కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్! -
ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.➤2024లో గ్రేటర్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
గజ్వాల్లో హై టెన్షన్.. హరీశ్రావుకు నిరసన సెగ
-
గ్రీన్ గోదాంలకే డిమాండ్.. ఈ ఏడాది భారీ లీజులు!
భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగంలో డిమాండ్ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.పట్టణాల్లోనూ.. తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.హైదరాబాద్లో.. గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్హౌస్ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్హౌస్ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లో 22 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది. -
నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం
-
వెంటాడిన అజ్ఞాత వ్యక్తి! ఆత్మహత్య కు కారణం అదే..
-
మాదాపూర్ : శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్మేళా –2026 (ఫొటోలు)
-
పవన్ ప్రచారం చేస్తే.. మైనస్సే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు. -
ఐస్క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)
-
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టరి్మనల్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చెందిన శంషాబాద్.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్ హబ్గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్(త్రిబుల్ ఆర్)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లలో రాజీవ్గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్ ట్రాన్సిట్ ఆఫీస్గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్ హబ్తో శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్లకు, కార్పొరేట్లకు సీ–సూట్కు ట్రాన్సిట్ ఆఫీస్గా మారుతుంది. ఫైవ్స్టార్ హాస్పిటాలిటీ, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి. -
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరును కేటాయించింది. 161ఏఏ నంబరును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ, ఆ తర్వాత రోడ్డును నాలుగు వరుసలకే కుదించడంతోపాటు కొన్ని మార్పులు చేయటంతో అందులో జాప్యం జరిగింది. టెండర్ల ఫైనాన్షియల్ బిడ్ను తెరవాలంటే రోడ్డుకు జాతీయ నంబరు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ అవాంతరం కూడా తొలగింది. దీంతో ఇక టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించటమే తరువాయి. ఆ రోడ్డు నంబరు దీనికి...ప్రస్తుతం సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏఏ నంబరు ఉంది. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం కూడా దానికి సమాంతరంగా సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్న విషయం తెలిసిందే. రీ జినల్ రింగురోడ్డు జాతీయ రహదారిగా రూపొందనున్నందున, అదే మార్గంలో మరో జాతీయ రహదారి అవసరం లేదు. దీంతో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్ర స్తుత రోడ్డుకు జాతీయ రహదారి హోదా తొలగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోకి తిప్పి పంపనున్నారు.దీంతో దానికి ఉన్న 161 ఏఏ జాతీయ రహదారి నంబరును రీజి నల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి కేటాయించారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్రస్తుత జాతీయ రహ దారి ఇక రాష్ట్ర రహదారిగా మారుతుంది. రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు సంగారెడ్డి–, చౌ టుప్పల్ రోడ్డును అందులో భాగంగా అభివృద్ధి చేయాలని భావించారు. పూర్తి కొత్త రోడ్డు(గ్రీన్ఫీల్డ్)గా కాకుండా బ్రౌన్ఫీల్డ్ రోడ్డుగానే దాన్ని నిర్మించాలన్నది తొలి ఆలో చన. తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్వే స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడు అది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది.పట్టణాల మీదుగా కొన సాగుతున్న ప్రస్తుత రోడ్డు అందుకు సరిపోదు. దీంతో దాన్ని రీజినల్ రింగురోడ్డుగా మార్చాలన్న ఆలోచనను విరమించుకున్నారు. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం వద్ద ఎన్హెచ్–65 నుంచి ఉత్తర రింగు మొదలై, అదే ఎన్హెచ్–65 మీదే ఉన్న చౌటుప్పల్ సమీపంలోని తంగేడుపల్లి వరకు కొనసాగుతుంది. మహారాష్ట్రలోని అకో లా నుంచి సంగారెడ్డి వరకు ఉన్న జాతీయ రహదారికి 181 నంబరు ఉంది. అక్కడి నుంచే రీజినల్ రింగురోడ్డు మొదలు కానున్నందున అదే నంబరును కొన సాగిస్తున్నారు.సాధారణంగా ఇలాంటి అనుసంధాన రోడ్డు నంబరుకు ఏ అన్న ఆంగ్ల అక్షరాన్ని జోడిస్తారు. కానీ, ఇప్పటికే మహారాష్ట్రలోని అకోట్ నుంచి బీదర్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏ కొనసాగుతోంది. దీంతో కొత్త రోడ్డుకు 161ఏఏ ఖరారు చేశారు. కేంద్ర రహదారుల శాఖ అధీనంలోని జాతీయరోడ్ల వరసలో ఈ కొత్త రోడ్డు 402వదిగా గెజిట్లో చూపారు.ఈ నెలలోనే పీపీపీఏసీ భేటీ... రోడ్డు నిర్మాణానికి ఆమోదం...ఇప్పటికే కేంద్ర జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి స్థాయిలో రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి ఆమో దం లభించింది. దీనికి నిధులు విడుదల కావాలంటే, కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)ఆమోదం అసవరం. ఈ నెలాఖరుకు ఆ సమావేశం ఉంటుందని సమాచారం. రోడ్డు నంబరు కూడా కేటాయించినందున ఇక టెండర్లు తెరిచేందుకు పీపీపీఏసీ ఆమో దముద్ర వేయనుంది. దీంతో నిర్మాణ సంస్థతో ఒప్పందానికి మార్గం సుగమమవుతుంది. ఆగస్టు నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వీలుంది. -
హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్: పెరిగిన ఇళ్ల ధరలు
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.హైదరాబాద్లో 8 శాతం ధరల వృద్ధి2025లో హైదరాబాద్లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చింది.బెంగళూరు ముందంజదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.2026పై అంచనాలుప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది. -
బకాయిలపై రెడ్ నోటీస్.. పీటీపీపై జీహెచ్ఎంసీ ఫోకస్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు సిద్ధమైంది. రెడ్ నోటీసుల జారీకి శ్రీకారం చుట్టింది. తొలుత జోన్లు, సర్కిళ్ల పరిధిలో భారీ బకాయిలున్న వారిని గుర్తిస్తున్నారు. ఇంకా ఆస్తిపన్ను చెల్లించని వారందరికి కూడా వీటిని జారీ చేయనున్నారు. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే రెడ్ నోటీసుల జారీ ప్రారంభం కాగా, మిగతా సర్కిళ్లలోనూ సిద్ధమవుతున్నారు. రెడ్ నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్ట ప్రకారం దుకాణాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకునే వీలుంది. పరిష్కారమేదీ? గతంలో ఫిబ్రవరి నుంచి మార్చి దాకా ప్రతి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకపూట ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం (పీటీపీ) పేరిట జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. ప్రజలు ఆస్తిపన్నుకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం కన్నా తమకు ఎక్కువ ఆస్తిపన్ను పడినా ఇతరత్రా వ్యత్యాసాలున్నా, ఆస్తిపన్ను చెల్లించినప్పటికీ, రికార్డుల్లో నమోదు కాకపోయినా, తదితర సమస్యల్ని అధికారుల దృష్టికి తెచ్చేవారు. సంబంధిత ట్యాక్స్ సెక్షన్ అధికారులతో పాటు డిప్యూటీ, జోనల్ కమిషనర్లు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేసి ఇబ్బందులు తీర్చేవారు. ఈ ఫిబ్రవరిలో ఒక ఆదివారం ముగిసిపోయినా, ఇప్పటి వరకు ఇంకా పీటీపీ ప్రకటించలేదు. పీటీపీ నిర్వహిస్తే ప్రజలు తమ సందేహాలు తీర్చుకునేందుకు వీలుంటుంది. కానీ అధికారులు ఇంతవరకు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రెండేళ్లుగా ఈ అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని 2024లో కేవలం మార్చిలో నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహించారు. ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారో.. అసలు నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి. -
ఆఫీస్ మార్కెట్కు అడ్డా.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. స్థిరమైన డిమాండ్, ఆఫీస్ వసతుల ఖాళీలు తగ్గుతుండడం, అద్దె ధరల్లో స్థిరమైన పెరుగుదులతో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టినట్టు రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. 2025–26లో చివరి త్రైమాసికం (2026 జనవరి–మార్చి) నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా 18–19 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ ఆఫీస్ వసతులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇందులో పావు వంతు (23 శాతం) వసతులకు లీజింగ్ ఒప్పందాలు ఇప్పటికే కుదిరినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల్లోనూ హైదరాబాద్ ఆఫీస్ వసతుల పట్ల కిరాయిదారుల్లో స్థిరమైన విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా పేర్కొంది. లీజింగ్ భళా.. 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా ఆఫీస్ వసతుల మార్కెట్ బలమైన పనితీరు చూపించింది. ఈ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో 8.4 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ స్పేస్ అదనంగా అందుబాటులోకి వచి్చంది. ఇక ఆఫీస్ వసతుల నికర స్వీకరణ 8.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ఐటీ–బీపీఎం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థల నుంచి డిమాండ్ నెలకొంది. దీంతో 2025 డిసెంబర్ నాటికి ఖాళీ వసతులు 17 శాతానికి తగ్గాయి. 2024 మార్చి నాటికి ఖాళీలు 18.2 శాతంగా ఉండడం గమనార్హం. కొత్త వసతులు అందుబాటులోకి వచి్చనా కానీ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మూలాలు బలంగా ఉన్నట్టు, వసతుల భర్తీ రేటు 2027 మార్చి నాటికి 82.5–83 శాతానికి పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఆఫీస్ మార్కెట్లో కింగ్.. దేశవ్యాప్తంగా టాప్–6 నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల్లో హైదరాబాద్ మార్కెట్ గత ఐదేళ్లలో వేగవంతమైన విస్తరణ చూసినట్టు ఇక్రా నివేదిక ఆధారంగా తెలుస్తోంది. పోటీ మార్కెట్లలో వసతులు ఏటా 7 శాతం మేర పెరిగితే, హైదరాబాద్లో 14 శాతం అధికమవుతూ వచ్చాయి. టాప్–6 నగరాల్లోని వసతుల్లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వాటా 2021 మార్చి నాటికి 13 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 16 శాతానికి చేరింది. హైటెక్ సిటీ/మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని ఆఫీస్ వసతులు నగరంలోని మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరాలో 63 శాతం వాటా కలిగి, సరఫరాకు కీలకంగా ఉన్నాయి. హైటెక్ సిటీలో 2026–27లో పరిమిత సరఫరానే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఖాళీలు తక్కువగానే ఉండొచ్చని.. అయితే గచి్చ»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో ఖాళీలు స్థిరంగా ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. లీజు ధరలు క్రమంగా పెరుగుతున్నాయంటూ, ఈ మూడు సూక్ష్మ మార్కెట్లలో గత ఐదేళ్లలో ఏటా 3–4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని ఇక్రా నివేదిక వెల్లడించింది. 2025–26 క్యూ4 నుంచి 2026–27 వరకు ఇదే స్థాయిలో లీజు ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్, బలమైన లీజింగ్ కార్యకలాపాలు మధ్య కాలానికి హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
విజయశాంతి రెడ్డి ఘటనపై డాక్టర్ అనిత షాకింగ్ నిజాలు..
-
ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణ గ్రామపంచాయతీలకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్. కేంద్రం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు సంబంధించిన బకాయి నిధులను గురువారం విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణ పంచాయితీలకు కేంద్రం రూ.3 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో కొద్ది కొద్దిగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. అయితే ఈలోపు.. ఎన్నికలు రావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపుల అనంతరం నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎందుకమ్మా! ఏమైందమ్మా!
-
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని ఐ పోలవరం(కోనసీమ) మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. అన్నేసి పని గంటలతో మానసికంగా అతను కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది. -
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. -
చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా
హైదరాబాద్: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు."పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
క్యాన్సర్ మరణ శాసనం కాదు: చిరంజీవి
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు. అది మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుందన్నారు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి అధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు.అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి.కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.క్యాన్సర్ చికిత్స కోసం అనేక రకాలైన అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఎక్కువకాలం బ్రతికే అవకాశం ఉందన్నారు. సమాజంలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. అలాగే క్యాన్సర్ను జయించిన వారు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట మరియు క్యాన్సర్ చికిత్స పొందిన మరియు పొందుతున్న వారు పాల్గొన్నారు. -
ఓ వైపు రీల్స్ చేస్తూ.. మరోవైపు చిల్..
హైదరాబాద్ నగరం మరోసారి తన ట్రెండ్ సెట్టర్ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్ కల్చర్, సోషల్ మీడియా లైఫ్స్టైల్ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్, లైకులతో హైదరాబాద్ను డిజిటల్ హబ్గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..! నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్ ట్రెండ్ (Reels Trend) అనే కల్చర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు టీ హబ్ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్ స్పాట్ నుంచి రియల్ హబ్గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్నీ ఒక లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తున్నారు.రీల్స్కు కొత్త అడ్రస్.. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కేఫ్లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్ లైఫ్, నేచురల్ లైటింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్, మినిమల్ వైబ్స్.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్ దగ్గర నుంచి, డిజైన్ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్ ఫ్రేమ్లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్ సన్లైట్తో జూబ్లీహిల్స్ రోడ్లు ఆర్గానిక్ రీల్స్కి పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా మారుతున్నాయి.కార్పొరేట్ నుంచి క్రియేటివ్ వైపు..ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్ మోషన్.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్ రీల్స్కు సరైన స్పేస్గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్ పక్కన పెట్టి, ఫోన్ చేతిలో పట్టుకుని యువత రీల్స్ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్ అయిపోయాక రీల్స్ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్ స్టైల్.టీ హబ్ టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్..టీ హబ్ అంటే కేవలం స్టార్టప్లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్ స్టేట్మెంట్ స్పాట్గా మారుతోంది. ఇక్కడ రీల్స్ అంటే డ్యాన్స్ కాదు వాక్ అండ్ టాక్ రీల్స్, మోటివేషనల్ వాయిస్ ఓవర్స్, డే ఇన్ మై లైఫ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్లో చూపిస్తోంది.రుచికి రీచ్.. నీలోఫర్ కేఫ్.. 2026లో నీలోఫర్ కేఫ్ మరోసారి వైరల్ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్ స్టైల్ రీల్స్ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్ గ్లాస్, ఇరానీ చాయ్ ఆవిరి, రాత్రి పూట జిగేల్మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్ హైదరాబాద్ వైబ్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్ అయ్యే అనుభూతి.అర్బన్ నేచర్ హాట్స్పాట్.. దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్ వ్యూ, నైట్ లైట్స్.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫ్రేమ్స్. నేచర్ ప్లస్ సిటీ ఈక్వల్స్ టు రీల్ అండ్ రియల్ మ్యాజిక్.. ఇక్కడ సన్సెట్ టైమ్లో తీసిన రీల్స్ లక్షల్లో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్స్టా, ఫేస్బుక్ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.నగరంలో బెంగళూరియన్స్ రీల్స్? ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ నగరంలోని ప్రముఖ స్పాట్స్లో రీల్స్ (Reels) షూట్ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్ బ్యాక్డ్రాప్స్, నాచురల్ లైటింగ్, కల్చర్ ప్లస్ మోడర్నిటీ మిక్స్.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో కొత్త రీల్ క్యాపిటల్గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.చదవండి: అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ -
తల్లీపిల్లల ఆత్మహత్య కేసు.. వెలుగులోకి CCTV దృశ్యాలు
-
అంతుచిక్కని తల్లీపిల్లల ఆత్మహత్య కేసు
-
పిల్లి తెచ్చిన తంటా!
సాక్షి, హైదరాబాద్: పిల్లి తెచ్చిన తంటా పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. వివరాలు... వనస్థలిపురానికి చెందిన పెండ్యాల శాంభవిదేవి మూడేళ్లుగా మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. అనారోగ్యం కారణంగా గతేడాది ఆగస్టు 27న అల్కాపురిలోని స్నిఫర్స్ పెట్ క్లినిక్కు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ క్రాంతికుమార్ పిల్లిని పరీక్షించి, మూత్ర సంబంధిత సమస్య ఉందని చెప్పారు. ఆమె అంగీకరించడంతో అదేరోజు శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ సమయంలో పిల్లి కదలడంతో దాని శరీరంలో వేసిన పైపు పక్కకు జరిగిందని చెప్పి మళ్లీ శస్త్రచికిత్స చేశారు. అనంతరం చికిత్స ఖర్చులను శాంభవి చెల్లించి పిల్లిని తీసుకొని ఇంటికెళ్లింది. అయినా పిల్లి ఆరోగ్యం కుదుటపడకపోగా విషమంగా మారింది. డిసెంబర్లో మళ్లీ క్లినిక్కు తీసుకెళ్లగా డాక్టర్ క్రాంతి పిల్లికి మరో సర్జరీ చేశారు. మూడు శస్త్రచికిత్సల తర్వాత కూడా దాని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శాంభవి కుంగిపోయింది. ఈ విషయమై క్లినిక్కు వెళ్లి ప్రశి్నంచగా డాక్టర్ క్రాంతి ఆమెను అసభ్యపదజాలంతో దుర్భాషలాడారు. ఇంకోసారి క్లినిక్కు వస్తే చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేశారు. గత నెల 31న డాక్టర్ క్రాంతి కుమార్కు ఆమె ఫోన్ చేయగా, ఇకపై దానికి చికిత్స చేయనని, ఇంకోసారి ఫోన్ చేయొద్దని దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో మంగళవారం బాధితురాలు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్లో ఎంగేజ్మెంట్ మేనేజర్ 'కోమల్ ఝా'.కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్లో ఎంగేజ్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు. -
World Cancer Day: ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి
హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు ప్రజలు 040-6905 9100 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.కుటుంబంలో ఒకరు, అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వారసత్వ కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది.సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశమున్నప్పటికీ, సుమారు 10 శాతం క్యాన్సర్లు వారసత్వ జన్యు మార్పుల కారణంగా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు, తక్కువ వయస్సులో క్యాన్సర్ రావడం, తరతరాలుగా కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ కనిపించడం వంటి అంశాలు జన్యుపరీక్షలకు కీలక సూచికలని వివరించారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా లక్ష్యిత స్క్రీనింగ్, నివారణ చర్యలు మరియు వ్యక్తిగత వైద్య సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.కామినేని ఆసుపత్రి జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.కామినేని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ, “చాలామంది కుటుంబ చరిత్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. లక్షణాలు కనిపించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వచ్చి, తమ ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం, బోర్డు సర్టిఫైడ్ జన్యు కౌన్సెలర్లతో పాటు ఆంకాలజీ తదితర విభాగాల వైద్యులతో కలిసి సమగ్ర ప్రమాద అంచనా మరియు వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. -
ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: ఏఐఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు. అనారోగ్య సమస్యతో గతేడాది నవంబర్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి చివరికి తుదిశ్వాస విడిచారు.పాషా ఖాద్రీ ఏఐఎంఐఎంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న నేత. 2004లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2018లో యాకుత్పుర నియోజకవర్గం నుంచి గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. పాషా ఖాదద్రీ ఏఐఎంఐఎం వ్యవస్థాపకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ సహచరుడిగా గుర్తింపు పొందారు.2008లో ఏఐఎంఐఎం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన పాషా ఖాద్రీ, పార్టీని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్లోని ముస్లిం ఓటర్లలో ఏఐఎంఐఎం స్థిరమైన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, పార్టీ విస్తరణలో చేసిన కృషి ఏఐఎంఐఎంకు బలమైన పునాది వేశాయి.సుమారు 60 ఏళ్ల వయసులో ఖాద్రీ మరణం ఎంఐఎంకు పెద్ద లోటు. చార్మినార్, యాకుత్పురా నియోజకవర్గాల్లో ఆయనకు ఉన్న బలమైన పట్టు, ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీకి అమూల్యమైందని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని సహచర నేతలు చెబుతున్నారు. సయ్యద్ పాషా ఖాద్రీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(MCH)లో కార్పొరేటర్ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సయ్యద్ పాషా ఖాద్రీ మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు రైతులు మృతి
సాక్షి,మల్లాపూర్: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు రైతులు మృతి చెందారు. స్థానికులు వివరాల మేరకు.. మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
Garam Garam Varthalu: పోలీసుల ముందే తోక జాడించిన ఆటో డ్రైవర్
-
Hyderabad: హైస్పీడ్ హబ్.. ‘ట్రయాంగిల్ డైమండ్’
సాక్షి, హైదరాబాద్: నేలపై విమానాలు దూసుకెళ్తున్నాయా.. అనుకునేంత హైస్పీడ్తో నడిచే రైళ్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వేగం గంటకు సుమారు 350 కి.మీ. ఉండనుంది. మహానగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ‘ట్రయాంగిల్ డైమండ్’ వచ్చి చేరనుంది. నగరం నుంచి చెన్నై, బెంగళూర్, పుణెలకు హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ మూడు కారిడార్లను కలిపేవిధంగా దక్షిణ మధ్య రైల్వే భారీ టెర్మినల్ను నిర్మించనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థలమిస్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోగానీ, ఫ్యూచర్ సిటీలోగానీ (Future City) టెర్మినల్ రూపుదాల్చనుంది. పుణె నుంచి ముంబై వరకు కూడా హైస్పీడ్ కారిడార్ విస్తరించనున్న దృష్ట్యా హైదరాబాద్ నుంచి పుణె మీదుగా ముంబైకి రాకపోకలకు అవకాశం లభించనుంది. ఈ డైమండ్ ట్రయాంగిల్ కారిడార్లు దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సమన్వయానికి దోహదం చేస్తాయి. ఫలితంగా విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఎయిర్పోర్టును తలపించేలా.. ఎయిర్పోర్టు తరహాలోనే హైస్పీడ్ రైల్వే టెర్మినల్ నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను కూడా విమానాశ్రయం తరహాలోనే పునరాభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే అత్యాధునిక సాంకేతిక హంగులతో హైస్పీడ్ రైల్ టెర్మినల్ నిర్మించనున్నారు. దీనికోసం ఎన్ని వందల ఎకరాల భూమి అవసరమవుతుందనే అంశంతోపాటు విధివిధానాలపై త్వరలో కసరత్తు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి హైస్పీడ్ రైల్వే టెర్మినల్ (High Speed Train Terminal) అందుబాటులో ఉంటే ప్రయాణికులకు రెండు రకాల ప్రయాణ సదుపాయాలు సమాంతరంగా లభించే అవకాశం ఉంటుంది. రెండున్నర గంటల్లో ముంబైకి.. కారిడార్ల సామర్ధ్యం గరిష్టంగా 350 కి.మీ. వరకు ఉన్నప్పటికీ హాల్టింగ్ స్టేషన్లు, మలుపులు, తదితర సాంకేతిక అవసరాల దృష్ట్యా రైళ్ల వేగం కొంతవరకు తగ్గనుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి 12 నుంచి 13 గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైల్లో 2.55 గంటల్లో చేరుకోవచ్చు. బెంగళూరుకు 2 గంటలు, పుణెకు 1.55 గంటల్లో చేరుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి పుణె మీదుగా ముంబైకి హైస్పీడ్ రైలులో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రతిరోజు 5 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. చెన్నై, ముంబైకి కూడా రోజుకు సుమారు 2,500 నుంచి 3 వేలకుపైగా మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. బస్సులు, విమానాలు, సొంత వాహనాల్లో వెళ్లేవారిని కలిపితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం రైళ్లు, విమానాల్లో ఎక్కువగా ప్రయాణించేవారు భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. పునరాభివృద్ధికి మరో ఏడాది... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) పునరాభివృద్ధి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టనుంది. వచ్చే మార్చి నాటికి స్టేషన్ పదో నెంబర్ వైపు పనులు పూర్తవుతాయని, ఒకటో నెంబర్ వైపు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.750 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేట్టిన సంగతి తెలిసిందే. నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించనున్నట్లు జీఎం పేర్కొన్నారు. ప్రయాణికులకు పారదర్శకమైన సదుపాయం లభించేవిధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
చిరంజీవిని కలిసిన కొండాసురేఖ
సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్కు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో మా కుమార్తె కొండా సుస్మితతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/JUMYDVAaaA— Konda Surekha (@iamkondasurekha) February 2, 2026 -
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలన్మవరణం కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. తన పిల్లలిద్దరితో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె బలన్మవరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారనే దాని గురించి ఇంకా వెల్లడి కాలేదు. దీంతో విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్ను సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. అందులోని సమాచారం బయటకు వస్తే కారణం తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే డీఎస్పీ జావిద్ సోమవారం సాక్షి టీవీతో చెప్పారు. ''ఇలాంటి ఘటన జరగటం బాధాకరం. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలని తీసుకుని జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వచ్చారు. స్టేషన్కు వచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏమి లేవనీ తెలుస్తుంది. ఏదో బలమైన కారణంతోనే ఆమె బలన్మవరణానికి పాల్పడి ఉంటారు. పార్కింగ్ స్లిప్ వెనకాల రాసిన సూసైడ్ నోట్ ఆమె కారులో మాకు దొరికింది. 28వ తేదీన విజయశాంతి రెడ్డి- సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు అని తెలిసింది. 31 తేదీ సురేందర్ రెడ్డి పుట్టిన రోజు అని తెలిసింది. మరింత లోతుగా విచారణ చేస్తున్నామ''ని రైల్వే డీఎస్పీ జావిద్ తెలిపారు.ప్లీజ్.. చనిపోవద్దు మంచి ఉద్యోగం, కుటుంబం ఉన్న విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తనతో పాటు పిల్లల ప్రాణాలు తీయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. చదువుని, ఉద్యోగం చేస్తున్న ఆమె ఇలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడాలని, కనీసం పిల్లల కోసమైనా ఆలోచించాల్సిందని అంటున్నారు. అయితే ఒంటరితనం కారణంగా ఆమె ఎంతో బాధ అనుభవించి ఉండొచ్చని, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయానికి ఉండొచ్చని కొంతమంది పేర్కొన్నారు. ఏదేమైనా బతికి సాధించాలని, చావుతో సమస్యలు పరిష్కారం కావని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.సూసైడ్నోట్ ఏం రాశారంటే..? -
తెలంగాణకు గుడ్న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. రూ.5,454 కోట్ల నిధులు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే బుల్లెట్ ట్రైన్కు హైదరాబాద్ హబ్గా మారుతుందన్నారు.ఈ సందర్బంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చాం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్గా నిర్మిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. బుల్లెట్ ట్రైన్కు హైదరాబాద్ హబ్గా మారుతుంది. ఇది సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు. అలాగే, 10,134 కోట్ల రూపాయల బడ్జెట్ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేటాయించాం. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైలుతో 2:55 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు వెళుతుంది అని చెప్పుకొచ్చారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనది. సిబ్బంది మొత్తం మార్చాల్సిన అవసరం ఉంది. కంట్రోల్స్, కమాండ్, టైం టేబుల్ కూడా మార్పు జరగాలి. ఇదంతా కూడా చాలా జటిలమైన ప్రక్రియ. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో మూడు నాలుగు ఏళ్ళు పట్టేది. ఈసారి మేము చాలా ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తున్నాం. సజావుగా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేందుకు పనిచేస్తున్నాం. సౌత్ కొస్టల్ జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు (రెండు గంటల జర్నీ)హైదరాబాద్-చెన్నై(2:55 గంటల జర్నీ)హైదరాబాద్-పుణె (1:45 గంటల జర్నీ)హైదరాబాద్-చెన్నై ,కోల్కతా-చెన్నై. -
తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్ తన్నేసిన భర్త
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది. మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్కు చెందిన కొండల్ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది. కాగా, కొండల్ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కొండల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్ వేసుకొని సీలింగ్ ఫ్యాన్కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పె ట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్ స్టూల్ను తన్నాడు. దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్ చె ప్పా డు. అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్ త న్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ ఎందుకలా చేసిందో..!
హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇంటర్ చదివే కుమారుడు, కూతురుతో కలిసి ఆ తల్లి రైలుకింద పడి బలవన్మరణం చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలవన్మరణం కేసు మిస్టరీ ఆదివారం రాత్రి వరకు వీడలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గంటల కొద్దీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్ఫోన్ సందేశాలలో పోలీసులకు రెండు అనుమానాస్పద సందేశాలు లభించాయి. ఈ రెండు సందేశాలను పంపించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను రైల్వే పోలీసు లు సికింద్రాబాద్ రప్పించి విచారించారు. ఒకరు సారీ మేడం ఇటువంటి తప్పు మరోమారు జరగదు అని, మరోకరు మేడం గుడ్మార్నింగ్ అని సందేశాలు పంపించారు. ఇవి రెండు సందేశాలు కార్యాలయ సమాచార నిమిత్తం పంపినవని పోలీసులు తమ విచారణలో ధృవీకరించుకున్నారు. సహచరులను పోలీసులు సంప్రదించినా విజయశాంతిరెడ్డి తన కార్యాలయంలో చురుకుగా ఉండే తీరును మాత్రమే పోలీసులకు వివరించారు. ఎప్పుడూ తను ఆందోళన చెందుతున్నట్టు కానీ... భయపడుతున్నట్టు కానీ కనిపించేది కాదని చెబుతున్నట్టు జీఆర్పీ ఇన్స్సెక్టర్ జీ.సాయీశ్వర్గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి పుట్టింటివారు, మెట్టింటికి చెందిన పలువురు సమీప బంధువులను కూడా పోలీసులు విచారించారు. వారి నుంచి కూడా పోలీసులు ఆశించిన సమాచారం అభించలేదు. సురేందర్రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులది ఆదర్శవంతమైన జీవనమని బంధువులు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విజయశాంతిరెడ్డి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకునేంతటి పరిస్థితులు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్మాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్ను సైబర్ క్రైం పోలీసులకు పంపించినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారం రోజుల్లో ఈ వివరాలు వచ్చే అవకాశముంది. డేటా వస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు వారు చెప్పారు. -
హైదరాబాద్ : నుమాయిష్ ఎగ్జిబిషన్.. ఫుల్ రష్ (ఫొటోలు)
-
హైదరాబాద్ పై వరాల జల్లు, 7 హైస్పీడ్ రైళ్లు
-
హైదరాబాద్కు హై-స్పీడ్ రైళ్లు..
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా హైదరాబాద్ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది. -
హైదరాబాద్ 631 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: బ్యాటర్లు దంచికొట్టడంతో రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 415/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 154 ఓవర్లలో 631 పరుగులకు ఆలౌటైంది. ప్రజ్ఞయ్ రెడ్డి (126; 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... క్రితం రోజే శతకం పూర్తి చేసుకున్న హిమతేజ (258 బంతుల్లో 171; 18 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాగాలాండ్తో సావోమిలో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 267/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 130 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (227 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. శశికాంత్ (138 బంతుల్లో 60; 5 ఫోర్లు), త్రిపురాన విజయ్ (94 బంతుల్లో 58; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకారం అందించారు. అనంతరం నాగాలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. -
రియల్ఎస్టేట్: 12 నెలలు.. 65 లక్షల చదరపు అడుగులు
హెచ్–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ హాట్ ఫేవరెట్గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది హైదరాబాద్లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్ రిపోర్ట్ వెల్లడించింది.గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.వేకెన్సీ 18.2 శాతం.. ఏటేటా హైదరాబాద్లో కార్యాలయ స్థలాల మార్కెట్ సరికొత్త రికార్డ్లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్ క్వార్టర్లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్కేర్ అండ్ లైఫ్సైన్సెస్ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.97 శాతం ఆఫీసు స్పేస్ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ వంటి (పెరిఫెరల్ బిజినెస్ట్ డిస్ట్రిక్ట్) పీబీడీ–వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్ స్పేస్ ఆఫీసులలో హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ.9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులో గుర్తించారు. ఏడుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా, నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు.హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది.హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. -
Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య (శనివారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైలట్ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయ(38), కూతురు చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. చేతన ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, విశాల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిసింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటున్నాడని పోలీసులు నిర్ధారించారు. విజయ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని.. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందని పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
కోఠిలో కాల్పుల కలకలం.. గన్ తో కాల్చి రూ.6 లక్షలతో పరార్
-
సందడిగా వింగ్స్ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)
-
‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’
హైదరాబాద్: నేను రోడ్డెక్కలేదు.. నా బండి నంబర్ రికార్డు చేసుకోండి.. నేను ఊదనంటే.. ఉద.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులకు ఓ వాహనదారు చుక్కలు చూపించాడు. ఎంతసేపు వారించినా బ్రీత్ ఎనలైజర్లో ఊదనంటే ఊదనంటూ అరగంట పాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి బైక్ను వదిలేసి వెళ్లాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లో ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. స్కూటర్పై ఓ యువకుడు రావడంతో ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని.. అందులోకి ఊదాల్సిందిగా పోలీసు సిబ్బంది అతడికి సూచించారు. ‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’నంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్కు సహకరించకుండా అరగంట పాటు పోలీసులతో వాదించాడు. చివరకు బైక్ను వదిలేసి పారిపోయాడు. పోలీసులు బైక్ను సీజ్ చేశారు. -
నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)
-
ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం
ఢిల్లీ: కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పాల్గొన్న తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. ‘ తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశాం. రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చాం. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశం కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు.తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశం ఈరోజు(శుక్రవారం. జనవరి 30వ తేదీ) జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం.. సుమారు రెండు గంటల పాటు సాగింది.ప్రధానంగా పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సీపీ గౌస్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందిఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్ సీపీ గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్ది సేపటి క్రితం ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
‘కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి. తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్ కాట్ చేయాలి’’ అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.కాగా, ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్లు విలువైన విదేశీ గంజాయిని పట్టుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది.హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. -
బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)
-
కేసీఆర్ లేఖపై సిట్ స్పందన
హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు.ఇవాళ.. కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
నిప్పులు చెరిగిన సిరాజ్
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్ఘడ్తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్తో పాటు రక్షన్ (9.3-1-28-2), తనయ్ త్యాగరాజన్ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్ యాదవ్ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్ఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ప్రతీక్కు వికల్ప్ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్ సెంచరీకి చేరువైన వికల్ప్ తివారిని ఔట్ చేసి ఛత్తీస్ఘడ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్, ప్రతీక్ మినహా ఛత్తీస్ఘడ్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్ పాండే 11, అనుజ్ తివారి 4, సంజీత్ దేశాయ్ 1, కెప్టెన్ అమన్దీప్ ఖారే 16, మయాంక్ వర్మ 3, సహబాన్ ఖాన్ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్ ఆదిత్య సింగ్ 16 పరుగులకు ఔటయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్రావ్ 32, అభిరథ్ రెడ్డి 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
అనుమానం వస్తే కాల్ చేయండి.. సజ్జనార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.‘‘హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా… pic.twitter.com/fOmkk80ie7— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2026 -
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు గుర్తింపు ట్యాగ్లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. జాతర కోసం ఆర్టీసీ తీసుకున్న చర్యలు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సురేష్ కుమార్, ఉప్పల్ ఇన్స్పెక్టర్ కె. భాస్కర్, పరిపాలనా సబ్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చిరంజీవి, వినయ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అదరహో అనేలా.. బేగంపేట ఎయిర్ షో
-
హైదరాబాద్లో అపోలో అంతర్జాతీయ హెల్త్ డైలాగ్–2026
హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ (IHD–2026) ఈ నెల 30, 31 తేదీల్లో హెచ్ఐసీసీ–నోవోటెల్, హైదరాబాద్ వేదికగా జరగనుంది. ‘గ్లోబల్ వాయిసెస్.. వన్ విజన్’ అనే థీమ్తో నిర్వహించే ఈ సదస్సులో రోగి భద్రత, డిజిటల్ హెల్త్, ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్ ఫలితాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీతా రెడ్డి మాట్లాడుతూ, “ఏఐ, డేటా, డిజిటల్ టెక్నాలజీలను మానవీయత, సహకారంతో మేళవిస్తే భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ మరింత సమగ్రమవుతుంది. ఈ వేదిక గ్లోబల్ స్థాయిలో ఆలోచనలు, ఆవిష్కరణలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది,” అన్నారు.ఈ సదస్సులో నైజర్, పాపువా న్యూగినియా, కాంగో దేశాల ఆరోగ్య మంత్రులు సహా అంతర్జాతీయ నిపుణులు పాల్గొననుండగా, రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా హాజరై ప్రసంగించనున్నారు. -
బేగంపేట్ : అట్టహాసంగా వింగ్స్ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)
-
స్నేహితుల ఆనంద ప్రయాణం… విషాదాంతం
మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్ (23), సాయివరుణ్ (23), వెంకట్ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ బీటెక్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్యూవీ 700 కారులో బోడుప్పల్ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్తో పాటు సాయివరుణ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం
సాక్షి హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో చేపట్టిన బదిలీల రద్దుపై అధికారులకు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఎసీ నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న రాత్రి వరకూ మింట్ కాంపౌండ్ లో ఎర్రగడ్డ స్కాడా ఆఫీసులో చర్చలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లో బదిలీలను వాయిదా వేసేది లేదని యాజమన్యం స్పష్టం చేయడంతో రాజీకి అంగీకారం కుదరలేదు.దీంతో విద్యుత్ జేఏసీ నేతలు మహా ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు( గురువారం) నుంచి జిల్లాలో / సర్కిళ్లలో రిలే దీక్షలు చేపడతామని తెలిపారు.ఈ చర్చలలో యాజమాన్యం తరపున సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, డైరెక్టర్ చక్రపాణి ఐఏఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ పాల్గొనగా జేఏసీ తరపున ఎనిమిది మంది నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్ఎఫ్ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్వర్క్లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్హాఫెన్, స్పెయిన్లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బీఏఎస్ఎఫ్ డిజిటల్ హబ్ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్ప్లేస్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్ అండ్ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
లోహ విహంగం.. విన్యాసాల వైభోగం..
మొన్నటివరకూ పతంగుల పండగ.. ఇప్పుడు విహంగాల పండగ వచ్చేసింది. నగరం మరోసారి అతిపెద్ద విమానాల ప్రదర్శనకు సిద్ధమైంది.. బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా రెండేళ్లకు ఓమారు జరిగే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన అయిన వింగ్స్ ఇండియా–2026 షో మళ్లీ వచ్చేసింది. నాలుగు రోజుల పాటు నగరవాసులను లోహ విహంగాలు అబ్బురపరిచే విన్యాసాలతో కనువిందు చేసేందుకు ఇప్పటికే రన్వేపై కొలువుదీరాయి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకూ జరిగే షోలో వివిధ విమాన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దీనికి తోడు వైమానిక విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ ఎయిరోబాటిక్ టీమ్ మార్క్ జాఫ్రీస్ అద్భుత విన్యాసాలకు రెడీ అవుతున్నారు. నాలుగు రోజుల పాటు మొత్తం 13 సార్లు ఆయా ఎయిరోబాటిక్ టీమ్లు నింగిలో అద్భుతాలను ఆవిష్కరించనున్నాయి. ప్రారంభం రోజు మార్క్జాఫ్రీస్ బృందం అదనంగా మరో ‘షో’తో పాటు డ్రోన్ షో కూడా సందర్శకులను కట్టిపడేయనుంది. అర్కా ఏవియేషన్, హెచ్ఏఎల్, శక్తి ఏవియేషన్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దస్సాల్ట్ ఏవియేషన్, ఎయిర్బస్, ఎబ్రాయెర్, యూఏసీ, టెక్నాం, పిలాటస్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ తదితర కంపెనీలు స్టాటిక్ డిస్ప్లేలో పాల్గొంటున్నాయి. అలాగే ఎగ్జిబిషన్లో విమానయాన రంగానికి చెందిన ప్రతి ఉత్పత్తినీ తయారీ సంస్థలు ప్రదర్శించనున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు వింగ్స్ ఇండియా వేదికగా జరిగే ‘ఇండియన్ ఏవియేషన్ : పేవింగ్ ది ఫ్యూచర్–ఫ్రం డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇన్క్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సొసైటీ టు సస్టెయినబులిటీ’ అంశాలపై సదస్సు జరుగనుంది. భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హాజరుకానున్నారు. 2024లో సారంగ్.. ఇప్పుడు సూర్యకిరణ్.. 2024లో జరిగిన వింగ్స్ ఇండియా షోలో సారంగ్ టీమ్ హెలికాఫ్టర్లు నగరవాసులను మంత్రముగ్ధులను చేయగా.. ఈసారి సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ టీమ్ కనువిందు చేయనుంది. భారత్ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) అధికారిక ఎయిరోబాటిక్స్గా సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ వెలుగొందుతోంది. మొట్టమొదటిసారి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్ ఇండియా–2026లో వైమానిక విన్యాసాలకు రెడీ అవుతున్నారు. 52వ స్కాడ్రన్కి చెందిన ఈ టీమ్ ‘సదైవ సర్వోత్తమ్’ నినాదంగా ముందుకుసాగుతుంది. కర్ణాటక బీదర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ కేంద్రంగా ‘సూర్యకిరణ్’ టీమ్ సేవలందిస్తోంది. 1996లో ఆవిర్భవించిన సూర్యకిరణ్ మొదటిసారి కోయంబత్తూర్లో 1996 సెప్టెంబర్ 15న మొదటి ప్రదర్శన ఇచ్చారు. 1998 నుంచి 9 విమానాల ఫార్మేషన్ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టీమ్ ప్రస్తుతం బీఏఈ హాక్ ఎంకే–132 జెట్ ట్రైనర్లను ఉపయోగిస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఎయిరోబాటిక్ కోసం స్మోక్ సిస్టమ్తో మార్చబడ్డాయి. మొత్తం 13 మంది ఫైలెట్లు ఉన్నప్పటికీ ప్రతి ప్రదర్శనలో 9 మంది పైలెట్లు మాత్రమే విమానాలు నడిపిస్తారు.సందడే సందడి..స్టాటిక్ ప్రదర్శనలో ఉంచే లోహ విహంగాలు బేగంపేట ఎయిర్పోర్ట్ రన్ వేపై ఇప్పటికే వాలిపోయాయి. ఇందులో ప్రధానంగా ఎయిర్ బాలి్టక్ (ఎయిర్బస్ ఏ 220–300), యూఏసీ ఐఎల్ 114–300 రీజనల్ టర్బోప్రోప్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (737–8), సంజయ్ గోదావత్ గ్రూప్కు చెందిన స్టార్ ఎయిర్ (వీటీ–జీఎస్జే), ఆదానీ గ్రూపుకు చెందిన బాలి్టక్ (వీటీ–కేజీఏ), న్యూజనరేషన్ (ఓకే–జేఆర్పీ), హెచ్ఏఎల్కు చెందిన హిందూస్థాన్–228, ధ్రువ్ ఎన్జీ, ఎస్జే–100, శక్తి ఎయిర్ విమానాలు, హెలికాఫ్టర్లు రన్వేపై కొలువుదీరాయి. మంగళవారం రాత్రికి మరిన్ని విమానాలు, హెలికాఫ్టర్లు వింగ్స్ ఇండియా–2026కి రానున్నట్లు షో వర్గాలు పేర్కొన్నాయి.మరోసారి మార్క్ జాఫ్రీస్ బృందం.. లండన్లో ఎయిరోబాటిక్ విన్యాసాలు చేసే మార్క్ జాఫ్రీస్ బృందం ఈ సారి కూడా గగనంలో అద్భుత వైమానిక విన్యాసాలకు సిద్ధమయ్యారు. వైమానిక విన్యాసాల్లో మార్క్ జాఫ్రీస్ది ఐదు దశాబ్దాల అనుభవం. ప్రపంచ ప్రఖ్యాత ఎయిరోబాటిక్ పైలట్. ఎల్–39 ఆల్బట్రోస్ జెట్ విమానాలతో అద్భుత షోలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎయిర్ షోలు జరిగినా ఈ టీమ్ వైమానిక విన్యాసాలు ఉండాల్సిందే. హైస్పీడ్ జెట్ ఫ్లైపాస్ట్, లూప్స్, రోల్స్, క్రాస్ ఫ్లైట్ మేనూవర్స్, ఫార్మేషన్ ఫ్లయింగ్, నైఫ్ ఎడ్జ్ పాస్, మిర్రర్ ఫ్లైయింగ్Š వంటి రిస్కీ స్టంట్స్కు ప్రసిద్ధి. 2014లో ఈ బృందం మొదటిసారి ఇండియన్ ఏవియేషన్ షోలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి వింగ్స్ ఇండియా షోలో విన్యాసాలు చేస్తుటుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ టీమ్ సభ్యులైన మార్క్జాఫ్రీస్, క్రిస్ హేమ్స్, జాన్ రావెన్్రస్కోప్ట్, క్రిజ్ బర్కెట్ల బృందం బేగంపేట ఎయిర్పోర్ట్కు మంగళవారం చేరుకున్నారు. -
వన మేడారానికి జనసాగరం
సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఉప్పల్ రింగ్రోడ్డు వద్ద అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. కార్లు, మ్యాక్సీ క్యాబ్లు బారులు.. ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు తదితర ప్రైవేట్ వాహనాల్లోనే కాకుండా సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో ఉప్పల్– వరంగల్ మార్గంలో రద్దీ పెరిగింది. రహదారులపై పెద్ద ఎత్తున కార్లు తదితర వాహనాలు బారులు తీరాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగనుంది. బస్సులు, రైళ్లు తదితర వాహనాల్లో మేడారం జాతర కోసం సుమారు 10 లక్షల మందికిపైగా నగరవాసులు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా.ఎంజీబీఎస్లో చిన్నారులకు రిస్ట్ బ్యాండ్ అఫ్జల్గంజ్: లక్షలాది మంది భక్తులు తరలివెళ్లే మేడారం మహా జాతరలో పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మహాత్మా గాంధీ బస్స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ తెలిపారు. వోడాఫోన్ ఐడియా సహకారంతో రూపొందించిన రిస్ట్ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రుల సంపూర్ణ సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. పిల్లలు తప్పిపోయిన పక్షంలో సమీపంలోని వలంటీర్ల సహకారంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ అదనపు డీసీపీలు కృష్ణగౌడ్, శ్యామ్బాబు, గోషామహల్ డివిజన్ ఏసీపీ సుదర్శన్, అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి, టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత పాల్గొన్నారు. -
బేగంపేట ఎయిర్పోర్ట్లో నేటి నుంచి వింగ్స్ ఇండియా షో (ఫొటోలు)
-
సింగరేణి కుంభకోణం.. ఆధారాలతో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడు అని భావించే పరిస్థితి తలెత్తిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సింగరేణిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొద్ది సేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు లోక్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు.సీఎం అంటే అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో. సింగరేణి సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. వాటిని ఫుట్ బాల్ ఆటకి వినియోగించారు. సీఎం రేవంత్ సింగరేణి సంస్థకు తీరని అన్యాయం చేశారని అన్నారు. -
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్
హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రూ. 16.20 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారు వీరు. అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం సైతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, కొరియర్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశాలకు నగదు తరలిస్తున్నారు. వీరి బారిన పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న నగదును పోగొట్టుకుంటున్నారు. -
TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు. 👉ఎన్నికల షెడ్యూల్ వివరాలు.. ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ పాపం ఎవరిది?
మూసాపేట (హైదరాబాద్): చైనా మాంజాకు ఓ నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో సంతోషంగా బైక్పై వెళుతున్న ఓ చిన్నారి గొంతుకు చైనా మాంజా తగిలి గొంతు తెగటంతో మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోనసీమ, అంబాజీపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామ్సాగర్, పద్మావతిలు కేపీహెచ్బీ కాలనీలోని గోకుల్ ప్లాట్స్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నిష్విక దర్యా (4) లండన్ కిడ్స్ స్కూలులో ఎల్కేజీ చదువుతోంది. వీరు ఇటీవల కాజీపల్లిలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు.సోమవారం సెలవు కావటంతో తమ కొత్తింట్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు కుటుంబ సభ్యులు బైక్పై వెళ్లి వస్తున్నారు. కూకట్పల్లి, వివేకానందనగర్లో పిల్లర్ నంబర్ 781 వద్ద డివైడర్ పక్క నుంచి వస్తుండగా పాప ఒక్కసారిగా గట్టిగా అరిచింది. తండ్రి వెంటనే వాహనాన్ని ఆపి చూడగా పాప గొంతు నుంచి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసి తండ్రి అక్కడే పడిపోయాడు. పాప మెడకు మాంజా దారం చిక్కుకుని ఉండటాన్ని గమనించి వెంటనే మాంజాను తొలగించారు. అటు నుంచి బైక్పై వెళుతున్న మరో వ్యక్తి పాపను బైక్పై సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. గొడవపడి.. బైక్ ముందు కూర్చుని.. కాజిపల్లి నుంచి బయలుదేరేటప్పుడే తన అక్కతో ముందు నేను కూర్చుంటానని గొడవపడి నిష్విక ముందు కూర్చుంది. జేఎన్టీయూ వద్ద యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చాలా ముందుకు వచ్చారు. పిల్లర్ నంబర్ 781 వద్ద పాప గొంతుకు మాంజా తగిలింది. వాహనం ఆపడానికి వీల్లేక పోవడం.. అలాగే ముందుకు రావటంతో పాప గొంతు లోతుగా తెగింది. కాగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతోనే పాప చనిపోయిందని వైద్యులు రఘురాం తెలిపారు. మెదడు నుంచి గుండెకు, గుండె నుంచి మెదడుకు రక్తాన్ని పంపు చేసే రెండు ప్రధాన నరాలు గొంతులో తెగిపోయాయని ఆయన చెప్పారు.కేసు ఎవరి మీద?జేఎన్టీయూ వద్దే యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని పాప తల్లిదండ్రులు రోదించారు. కూకట్పల్లి పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ.. కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగురవేశారనేది గుర్తించడం కష్టమని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది చైనా మాంజా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది రెండోదని గుర్తు చేశారు. -
నెక్లెస్ రోడ్డు వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ (ఫొటోలు)
-
‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్్కఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. -
రేపట్నుంచి ఆకాశాన విన్యాసాలు
హైదరాబాద్: రంగురంగుల పొగలు.. తీరొక్క ఆకృతులు.. రకరకాల విన్యాసాలు.. ఇవీ నగర గగనతలంలో రేపట్నుంచి కనువిందు చేసే దృశ్యాలు. కేంద్ర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నాయి. విన్యాసాలను వీక్షించేందుకు మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్యవేత్తలకు, తరువాతి రెండు రోజులు సామాన్యులకు అనుమతిస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్, మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు నాలుగు రోజులపాటు ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలు చేయనున్నాయి. విమాన విన్యాసాల వేళలు... నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11.00–11.30 గంటల వరకు సూర్యకిరణ్ టీమ్, మధ్యాహ్నం 12.00–12.30, సాయంత్రం 4.00–4.30 వరకు మార్క్జెఫ్రీ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ప్రారంభ రోజైన బుధవారం మాత్రం అదనంగా రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు మార్క్ జెఫ్రీ బృందం ప్రదర్శనతో పాటు సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు డ్రోన్ షో కనువిందు చేయనుంది. మొత్తంగా 13 సార్లు విమాన విన్యాసాలు, ఒక డ్రోన్ షో నిర్వహించనున్నారు. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వింగ్ ఇండియా–2026 వర్గాలు పేర్కొంటున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఇండియన్ ఏవీయేషన్–2026ను ప్రారంభించనున్నారు. 200లకు పైగా ప్రధాన కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్బస్, సీఎస్ఐఆర్–ఏఎన్ఎల్, ఆర్కా ఏవియేషన్ దస్సాల్ట్ తమ విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనకు రానున్నాయి. -
నృత్య సేవే దైవారాధన
‘సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు శాస్త్రీయ నృత్యం ద్వారా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను’ అని చెప్పారు తెలంగాణ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ కళాకారిణి ఐదున్నర దశాబ్దాలుగా నృత్య సేవ చేస్తున్నారు. దీపికారెడ్డి చేస్తున్న కృషికి ఈ యేడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ కళా సేవ గురించి తమ జీవన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు..పాశ్చాత్య హోరులో మునిగిపోతున్న మన చిన్నారులకు, యువతకు మన దేశ నృత్య కళలు తెలియాలి. కళలకు గుర్తింపు లభించి, ఇలాంటి అవార్డులు రావడం ద్వారా రాబోయే తరాలకు ప్రేరణ కలిగిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక క్రమ శిక్షణ అలవడుతుంది. మెదడు చురుకుగా, శక్తిమంతం అవుతుంది. నృత్యం ద్వారా వచ్చే మనశ్శాంతి, సంతోషం మనల్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. మా విద్యార్థుల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. నృత్య ప్రదర్శనల్లోనూ పాల్గొంటారు. ఇందులో ఒక టీమ్ వర్క్ ఉంటుంది. అందరి ప్రోత్సాహంతో...నాలో ఈ నాట్య తపనను వెలిగించింది మా అమ్మ రాధికారెడ్డి. తను భరతనాట్య నృత్యకారిణి. ఆమె 1961లో రవీంద్రభారతి ప్రారంభోత్సవానికి చిత్రాంగద బ్యాలె ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అమ్మ సాధనను చూసి, నేనూ స్ఫూర్తి పొందేదాన్ని. నాట్యంపై నాకున్న ఆసక్తి గమనించిన అమ్మ నాచేత గజ్జె కట్టించారు. అలా అమ్మ మొదటి గురువు, ఆ తర్వాత నాట్యంలోని మెళకువలతో ముందుకు తీసుకెళ్లింది గురువు సుమిత్ర కౌశల్. అటు నుంచి ఎంతో మందిని నృత్యకారులుగా తీర్చిదిద్దిన వెంపటి చినసత్యంగారు గురువుగా లభించడం నాకు ఓ వరం. 1976లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు వంటి ప్రముఖులు కూచిపూడి నృత్యానికి టార్చ్బేరర్ అని ప్రశంసించారు. పదకొండేళ్ల వయసులో పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా అదృష్టమే. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. నాన్న వి.ఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో అందరికీ శాస్త్రీయ నృత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. అలా వారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. పెళ్లి తర్వాత నా భర్త శ్యామ్గోపాల్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. పిల్లలు అభినవ్, శ్లోక పుట్టిన తర్వాత కూడా నృత్యం చేస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ నుంచి నృత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటే నా కూతురు శ్లోక కూడా మా బాటలోనే నడిచింది. అలా మూడుతరాల శాస్త్రీయ నృత్యకారులు మా ఇంట్లో ఉన్నారు. మూడు తరాల నృత్యంమహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజునే గంగా పండాల్లోని పెద్ద స్టేజీపైన ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివ సతీయం, గంగావతరణం కథలను దాదాపు గంటసేపు నా కూతురు శ్లోకారెడ్డి, శిష్యబృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చాను. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్యసేవలో ఉండటం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులు శాస్త్రీయ నృత్యకారులుగా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్నారు. నృత్యసేవ అంటే భగవంతుని ఆరాధనే. దేవాలయాల వద్ద, వేదికలపైన నృత్యప్రదర్శనలు ఇస్తున్నప్పుడు దివ్యానుభూతికి లోనవుతుంటాం. ఎంతో మంది ఆ ఆనందంలో మమేకం అవుతుంటారు. ప్రదర్శన తర్వాత కలిసి తమ అనుభూతిని తెలియజేసిన వారెందరో. మొదటి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు చూపిన ఎంతోమంది చూపిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి గౌరవం అందుకునేలా చేసింది’’అని ఆనందంగా వివరించారు ఈ నృత్యకళాకారిణి. సామాజిక అంశాలపై సందేశంఅభినయం అనేది నాటి సినిమా నటీనటుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు నృత్యం నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. కూచిపూడి నృత్యం అనగానే చాలామంది పౌరాణిక గాథలు అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ, ప్రతి నెలా ఒక సామాజిక అంశంతో కొత్త కాన్సెప్ట్ని తీసుకుంటాం. అందులో యువతరపు ఆలోచనలనూ ముందుకు తీసుకువస్తున్నాను. దీంట్లో భాగంగా పర్యావరణం, పర్యాటకం, హ్యాండీక్రాఫ్ట్స్, మహిళల సమస్యలు, మన సంస్కృతికి వన్నెతెచ్చే అంశాలు తీసుకుంటూ సందేశాత్మకంగా ప్రేక్షకుల ముందుకు నృత్యరూపకంగా తీసుకువచ్చాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఎలా పొందవచ్చు అనేవి నృత్య రూపకం ద్వారా చూపించగలిగాను. – నిర్మలారెడ్డి -
HYD: బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
సాక్షి హైదరాబాద్ : కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకొని గాయాలు కావడంతో ఓ బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న ఓ బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళుతుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తికి సైతం మంజా తగిలి గోంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమయ్యింది. కర్ణాటకలో ఓ వ్యక్తి చైనా మాంజా ప్రమాదంలో మృతి చెందారు. అయితే చైనా మాంజాపై రాష్ట్ర పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంజాను అమ్మినా కొన్నా వారిపై కేసులుపెడతామని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పెద్దమెుత్తంలో మాంజాను పట్టుకొని సీజ్ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకులు ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.ఆ చిన్నారి చావుకు బాధ్యులెవరు..?చైనా మాంజాతో గాలి పటాలు ఎగరేయకండని, అవి ప్రమాదమని చెప్పినా ఇంకా ప్రాణాలే పోతున్నాయ్కూకట్పల్లిలో ఓ చిన్నారి తండ్రితో పాటు బైక్పై వెళుతూ ప్రాణాలు కోల్పోయిందినాన్నా.. నాన్నా అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్ర గాయమైందిఆస్పత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదుఆ చిన్నారికి చావుక ఎవరు బాధ్యులు.. మనకి మనం మారదాం.. మనకు మనం తెలుసుకుందాంఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకొచ్చేదెవరూ..?ఆ కుటుంబం అరణ్య రోదనకు కారణం ఎవ్వరూ..?మనం మారాలి.. ఈ సమాజం మారాలి. సరదా కంటే ప్రాణం ముఖ్యమనే సంగతి తెలుసుకోవాలి -
20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం
-
రూ. 26 వేలకే కారు.. తీరా చూస్తే?
సాక్షి హైదరాబాద్: మల్లాపూర్లో తప్పుడు ప్రచారంతో తమను బురిడీ కొట్టిద్దామని చూసిన నిర్వాహకులకు ప్రజలు దేహశుద్ధి చేశారు. మల్లాపూర్లో రూ.26 వేలకే కారు అందిస్తామని కొద్దిరోజుల ఇన్స్టాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నమ్మిన ప్రజలు ఈ రోజు ( సోమవారం) పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది. దీంతో ఆగ్రహాం చెందిన ప్రజలు కర్రలతో నిర్వాహాకులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతిపజేశారు. అనంతరం నిర్వాహకులను అదుపులోకి తీసుకొని నాచారం పీఎస్కు తరలించారు. -
విద్యార్థిని ప్రాణం తీసిన గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం
సాక్షి,కామారెడ్డి: బాన్సువాడ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆటో నుంచి కిందకు దూకి ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని మృతికి ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీతే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన సంగీత బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత ఇంట్లో ఓ శుభకార్యం కోసం విద్యార్థినులే పాఠశాల ఫర్నిచర్ తరలించారు. తిరిగి ఫర్నిచర్ తీసుకొస్తున్న సమయంలో విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా జారి పడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. తలకు తీవ్ర గాయాలు రావడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.తల్లిదండ్రుల ఆందోళనసంగీత మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సునీత ఇంటి కార్యక్రమం కోసం విద్యార్థులను పనుల్లో ఉపయోగించడం, ఫర్నిచర్ తరలింపులో పాల్గొనడం వంటి చర్యలపై తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు.పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోవడంతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపించింది. సంగీత మృతి కుటుంబాన్ని, సహ విద్యార్థులను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ దూసుకెళ్లి..
రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ కిలోమీటర్ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు సిబ్బందితో సాగర్ హైవేపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్పైనే ఉండి కిలోమీటర్ దూరం వెళ్లిన ఎస్ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ్, హయత్నగర్కు చెందిన శ్రీకర్, నితిన్లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్సిటీ సీపీ సు«దీర్బాబు సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధుతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. -
కర్రెగుట్టలో ఐఈడీ పేలుళ్ల కలకలం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో బీజాపూర్ జిల్లా, కర్రెగుట్ట కొండల అటవీ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజ్లు (IEDs) పేలాయి. ఐఈడీలు పేలడంతో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో పదిమంది డీఆర్జీ సిబ్బంది, ఒకరు కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు డీఆర్జీ సిబ్బంది కాళ్లకు గాయాలు కాగా, మరో ముగ్గురి కంటికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్సనందిస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతం గతంలో నక్సల్స్కు సురక్షిత స్థావరంగా ఉండేది. 2025 ఏప్రిల్-మే నెలల్లో 21 రోజులపాటు జరిగిన విస్తృత ఆపరేషన్లో 31 మంది నక్సల్స్ హతమయ్యారు. ఆ సమయంలో భద్రతా బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, వైద్య సరఫరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది నవంబర్లో భద్రతా బలగాలు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది.కాగా,తాజాగా ఐఈడీ పేలుళ్ల ఘటన మరోసారి నక్సల్స్ వ్యూహాత్మక దాడుల తీవ్రతను చూపించింది. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నప్పటికీ, ఐఈడీ దాడులు వారికి ప్రధాన సవాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. -
ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్ తేడాతో..
సాక్షి, హైదరాబాద్: యువ బౌలర్ ధ్రుతి కేసరి ఐదు వికెట్లతో సత్తా చాటినా... హైదరాబాద్ జట్టుకు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం ఏఓసీ సెంటర్లో జరిగిన హోరాహోరీ వన్డే ప్రాక్టీస్ మ్యాచ్లో ఉత్తరాఖండ్ జట్టు 1 వికెట్ తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. మొదట హైదరాబాద్ 44.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. సంధ్య గోర (50; 9 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్ జట్టు 37 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. నందిని కశ్యప్ (63 బంతుల్లో 39; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్ కేసరి ధ్రుతి 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ధ్రుతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అతికష్టంపై ఛేదించి గెలిచింది. ఇదీ చదవండి: అనాహత్ ఓటమి న్యూఢిల్లీ: భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ న్యూయర్క్ వేదికగా జరిగిన ‘స్పోర్ట్ టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ రెండో రౌండ్లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ అనాహత్ 11–6, 11–6, 2–11, 8–11, 6–11తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సతోమి వటనాబె (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్ల్లో అది్వతీయ ప్రదర్శనతో సంచలనం నమోదు చేసేలా కనిపించిన 17 ఏళ్ల అనాహత్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. -
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు
-
హైదరాబాద్ నెక్లేస్ రోడ్ లో ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీ మేళా (ఫొటోలు)
-
గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)
-
హైదరాబాద్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు మరో పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ వేదికగా ముగిసిన పోరులో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో 42 సార్లు చాంపియన్ ముంబై చేతిలో ఓడింది. ఈ విజయంతో బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు 30 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఓవర్నైట్ స్కోరు 166/7తో ఆదివారం నాలుగోరోజు ‘ఫాలోఆన్’ కొనసాగించిన హైదరాబాద్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 69.5 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్ (128 బంతుల్లో 85; 12 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడగా... అతడికి నితిన్ సాయి యాదవ్ (32; 6 ఫోర్లు), కెప్టెన్ సిరాజ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 5 వికెట్లు... మోహిత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 10 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జట్టు 3.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 560 పరుగులు చేయగా... హైదరాబాద్ 267 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక విజయం, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ జట్టు గ్రూప్లో ఐదో స్థానంలో ఉంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో గురువారం నుంచి ఛత్తీస్గఢ్తోహైదరాబాద్ తలపడనుంది. -
నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతి విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాపు యజమాని అరెస్ట్
సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో నిన్న అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు( ఆదివారం) ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచానిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.కాగా నిన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అఖిల్ (7), ప్రణిత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) చనిపోయినట్లు ఫైర్ డిజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బాధితులు బయిటకి రావడం కష్టమైందని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. -
నాంపల్లి: అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం
సాక్షి హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
ఏబీఎన్ క్షమాపణ చెప్పాల్సిందే: BRS
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానెల్ డిబేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వైఖరిని బీఆర్ఎస్ ఖండించింది. ప్రత్యేక చర్చ సందర్భంగా MLC రవీందర్ రావుపై ఏబీఎన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్యా స్పూర్తికి ఇది విరుద్ధం అని పేర్కొంది. కనుక తక్షణమే ఎమ్ఎల్సీకి, ఏబీఎన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఇక నుంచి ఏబీఎన్ ప్రతినిధులను బీఆర్ఎస్ సమావేశాలకు అనుమతించేది లేదని కీలక నిర్ణయం తీసుకుంది. -
ఐదుగురూ చనిపోయారు.. ఆ తప్పే ప్రమాదానికి కారణం
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
నాంపల్లి ప్రమాదంలో దొరకని ఐదుగురి ఆచూకీ.. ఎందుకింత ఆలస్యం?
-
రెస్క్యూ ఆపరేషన్.. ఐదుగురు మృతులు వీరే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. తాజాగా ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అగ్నిప్రమాదంలో 90 శాతం వరకూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తియ్యిందని తెలుస్తోంది. 200 మంది సిబ్బంది 22 గంటలకుపైగా ఈ రెస్క్యూ ఆపరేషన్లోపాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం చేసుకుంది.అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నించారు.. ఇందుకోసం వారు ఆక్సిజన్ సిలిండర్తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా వెళ్లారు.తొలుత ఒక ఒక డెడ్ బాడీ లభ్యమయ్యింది. అది గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డిఎన్ఎ టెస్ట్కు అధికారులు తరలించారు. మరో డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపై మరో మూడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారు ఫైర్ డీజీప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇది జరిగిందన్నారు. -
నిప్పు.. ఎప్పుడు కనువిప్పు?
సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/అబిడ్స్: గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగి్నకి ఆహుతి చేస్తోంది. నిబంధనలను మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులిచ్చేస్తోంది. ఫలితంగా అభమూ శుభమూ తెలియని అభాగ్యులు కాలిబూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరామామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్బ్యాక్లు అధికారులకు గుర్తుకొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫరి్నచర్ దుకాణాలు, గోడౌన్లు, స్క్రాప్ నిల్వల భవనాలు మంటల్లో మాడిమసి అవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నివాస భవనాల్లో గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగి్నకీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో ఐదుగురు చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. వాణిజ్య భవనాల్లో.. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత నాలుగేళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగిప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూమ్లు, పబ్లు ఇలా.. అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికీ నిబంధనల కనుగుణంగా సెట్బ్యాక్లుండవు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లుండవు. కాగా వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. 835 ప్రమాదాలు.. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగి్నప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తినష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్హౌస్ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్లో శాలిబండ ఎల్రక్టానిక్స్ షోరూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. డిసెంబర్లో కాచిగూడ సుందర్నగర్లో జరిగిన అగి్నప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు రూ.32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. గుండెల్ని పిండేసే దుర్ఘటనలెన్నో.. నిరుడు గుల్జార్హౌస్ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. గత ఏడాది టాటానగర్ ప్లాస్టిక్గోడౌన్లో, కూకట్పల్లి గ్యాస్ దుకాణం తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు. మూడేళ్ల క్రితం బజార్ఘాట్లో నివాస భవనంలోని కెమికల్ గోడౌన్లో సంభవించిన అగి్నప్రమాదంలో 9 మంది అసువులు బాశారు. నాలుగేళ్ల క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. గత సంవత్సరం అఫ్జల్గంజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్కు చెందినది కావడంతో భవనం సెల్లార్లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు. ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూనాంపల్లిలో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్ ఎగ్జిబిషన్కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. -
హైదరాబాద్లో పాతకాలపు ఇళ్లకు ఫుల్ డిమాండ్
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత మనలో చాలా మందికి తెలిసిందే.. అయితే చాలా మంది కొత్త విషయానికి ఆకర్షితులయ్యినంతగా.. అలవాటు పడిన పాతదానికి ఆకర్షితులు కారనేది ఒక కోణమైతే.. పాత విషయాన్నీ అలా వదిలేయకుండా నిలబెట్టుకుంటూ.. కొత్త వాటిని తొందరపడి వదులుకోకూడదు అనే మరో కోణాన్నీ ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఇదే చెవికెక్కించుకున్నారో! ఏమో గానీ నగరంలో పాత ఇళ్ల (వింటేజ్ హౌస్)కు ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఇంటి వరండాలో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ సేవించడం, లివింగ్ రూమ్లో ఆసీనులై పుస్తక పఠనం చేయడం, మిద్దె మీదకు ఎక్కి నక్షత్రాల నీడలో నచి్చన సంగీతాన్ని ఆస్వాదించడం.. వంటి సంప్రదాయ అభిరుచులన్నీ సిటీలోని ఏ ఆధునిక కేఫ్కి వెళ్లినా సుసాధ్యమే. సిటీలో ప్రస్తుతం ఈ తరహా ట్రెండీ కేఫ్స్ పాత ఇళ్లలోనే ఏర్పాటవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో నివసించాలి అనుకునేవారు మాత్రమే కాదు.. కేఫ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న వారు కూడా ఇళ్లనే అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేఫ్స్ అంటే ఆహారం, పానీయాలు మాత్రమే అందించే చోటు కాదు.. పాత కథలను చెప్పే కొత్త వేదికలు కూడా. నగరంలో కేఫ్ సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇటీవల ఒక కొత్త ధోరణిని సంతరించుకుంటోంది. పాత ఇళ్లు, బంగ్లాలు హాయిగా, అందమైన గొప్ప కేఫ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్.. వీలైనంత పాత ఇళ్లనే కేఫ్స్ కోసం ఎంచుకోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కేఫ్స్లో 1970ల నాటి హెరిటేజ్ విల్లాలు సైతం కేఫ్స్గా అవతరించాయి. నగరంలో కేఫ్లుగా మారిన ఇళ్లు సాధారణ వాణిజ్య సెటప్ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తూ ‘ఇంటి నుంచి దూరంగా ఉన్నవారి ఇల్లు’ లాగా సేద తీరుస్తున్నాయి. వీటిలో సూర్యకాంతి ధారాళంగా ప్రవహించే వరండాలు, పాతకాలపు కిటికీలు, ద్వారాలతో గత జీవితాల జాడలను గుర్తుచేస్తాయి. అలా నగరంలో పాత ఇంటి నుంచి కొత్త కేఫ్స్గా మారినవి కొన్ని..వారసత్వ నిర్మాణాలు.. 80 ఏళ్ల వయసు గల ఓ పురాతన భవనం బంజారాహిల్స్లో ప్రస్తుతం రోస్టరీ కాఫీ హౌస్గా ఆధునిక సొబగులు అద్దుకుంది. అతిగా మార్పు చేర్పులు లేకుండా ఈ భవనంలోకి వెళుతుంటే ఓ పాత ఇంట్లోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందవచ్చు. ఈ వింటేజ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ను కేఫ్గా మార్చారు. దాని పాతకాలపు అందాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచిన ఫలితంగా వారసత్వ నిర్మాణాన్ని తాజా కాఫీ సువాసనతో మిళితం చేస్తూ సరికొత్త ఫ్యూజన్ ప్లేస్గా నిలుస్తోంది. కేరళ తరహా నిర్మాణం.. దాదాపు కేరళ శైలి నిర్మాణాన్ని అనుకరించే వారసత్వ భవనానికి ప్రస్తుతం సృజనాత్మక, కళాత్మకను అద్ది ఆరోమలే కేఫ్ పేరిట రూపుదిద్దారు. జూబ్లీహిల్స్లోని ఆ ఇంటిలోని తోట సహా నాటి నివాస అనుభూతిని అచ్చంగా భద్రపరిచారు. దీనిని వాణిజ్య అవసరాలతో పునఃరూపకల్పన చేయడానికి బదులుగా, యజమానులు పాత ఇంటిలోని ప్రతి గదినీ చదవడం, సంగీతం, సంభాషణలు, కమ్యూనిటీ సమావేశాల కోసం ప్రత్యేకంగా మార్చారు.గాలి, వెలుతురుకు అనుకూలంగా.. జూబ్లీహిల్స్లోనే మరో కేఫ్ గ్లాస్ హౌస్. ఇంటి సుపరిచితమైన లేఅవుట్ను కొనసాగిస్తూనే కేఫ్గా మారిన నివాస స్థలం. ఇది ఇప్పటికీ ఇల్లులా కనిపిస్తుంది. వరండా, ప్రాంగణం సీటింగ్ ప్రదేశంగా మారింది. అలాగే ఒకదానితో ఒకటి అనుసంధానించిన ‘గదులు‘ ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహిస్తూ ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తాయి. సైనిక్పురిలో ఉన్న దిస్ ఈజ్ ఇట్ కూడా దాని గత గృహశైలి లేఅవుట్ను యథాతథంగా ఉంచింది. లైటింగ్తో నివాస భవనాన్ని తలిపించేలా ఆలోచనాత్మకంగా పునర్నిర్మితమైంది.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ నివేదిక ప్రకారం 1970లో నిర్మించిన ఇంటి లోపల ఏర్పాటైంది రేషియో. జూబ్లీహిల్స్లో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్ను దాని పురాతన ఆత్మను నిలుపుకునేలా ఆలోచనాత్మకంగా వాస్తుశిల్పులు పునఃరూపకల్పన చేశారు. పొడవైన పైన్–వుడ్ కిటికీలు, సూర్యకాంతి పడేలా ప్రత్యేక స్థలాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసలు ఇంటి సారం చెక్కుచెదరకుండా ఉంచారు.అలంకరణలు చెక్కు చెదరకుండా.. హిమాయత్నగర్లోని మిరోసా కేఫ్ మరో నివాస విల్లా. ఇది ఓపెన్ సీటింగ్తో రెండు అంతస్తుల లేఅవుట్. సన్నిహిత సీటింగ్, వెచ్చని రంగుల పాలెట్.. అతిథులకు సుపరిచితమైన ఇంటి అనుభూతిని ఇస్తుంది. ఫిల్మ్ నగర్లోని వైబేయార్డ్ బిస్ట్రో కేఫ్లోని ఆక్సైడ్ గోడలు, చెక్క తలుపులు/ కిటికీలు, విశాలమైన గార్డెన్.. పురాతన ఇంటి అనుభవాన్ని అందిస్తాయి.జూబ్లీ హిల్స్లోని ది ఫిఫ్త్ స్ట్రీట్ కేఫ్ ఇదే కోవకు చెందింది. చెక్క అలంకరణలు, ఒకదానితో ఒకటి అనుసంధానించిన గదులు, ఇంటి ఫీల్ను సజీవంగా ఉంచుతాయి. -
హైదరాబాద్లో వాహనాల సరాసరి వేగం ఇది
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న వాహనాల సంఖ్య.. ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రహదారులు.. వాహన చోదకులు, వ్యాపారుల్లో కొరవడిన స్పృహ.. ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా... నగరంలో ట్రాఫిక్ చిక్కులు (కంజెక్షన్) మాత్రం తగ్గుతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. కంజెక్షన్ 1.6 పర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది. అలాగే సరాసరి వేగం సాధారణ సమయంలో గంటకు 18.4 కి.మీ, రద్దీ వేళల్లో 16.1గా నమోదైంది. అంతర్జాతీయ సంస్థ టామ్ టామ్ ఈ విషయం ప్రకటించింది. ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ను విడుదల చేసింది. హైదరాబాద్ 2024లో అంతర్జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్లో ఉండగా.. నిరుడు 47వ స్థానానికి వెళ్లింది. ఎంత తక్కువ ర్యాంక్లో ఉంటే అంత ఎక్కువ ట్రాఫిక్ చిక్కులు ఉన్నట్లు లెక్క. ఈ కారణంగానే బెంగళూరు అంతర్జాతీయ స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రోడ్లపై ఓ వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే సరాసరిన 32.37 నిమిషాలు పడుతోంది.విస్తృతంగా సర్వే62 దేశాల్లోని 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేపట్టింది. ఆయా నగరాల జనాభా, అక్కడి వాహనాల సంఖ్య, రోడ్ల శాతం, ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను విశ్లేషించింది. ప్రపంచంలోని ఇతర నగరాలను పోలుస్తూ ర్యాంకింగ్స్ ఇచి్చంది. హైదరాబాదీలు ఏడాదికి 123 పని గంటలు నష్టపోతున్నట్లు లెక్కకట్టింది. ఆగస్టు 30... దారుణమైన రోజు..హైదరాబాద్లో 2025లో అత్యంత దారుణమైన రోజు ఆగస్టు 30. ఇతర రోజుల్లో సరాసరిన 15 నిమిషాల్లో ఓ వాహనం 4.6 కిమీ ప్రయాణిస్తే.. ఆ రోజు మాత్రం 3.3 కి.మీకే పరిమితమైంది. బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, బంజారాహిల్స్, హిమాయత్నగర్, మెహిదీపట్నం తదితరాలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలుగా నమోదయ్యాయి.ఏదైనా నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగ్గా ఉందా? లేదా? అనేది తేల్చడానికి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం వాహనాల సరాసరి వేగం ఆధారంగా ట్రాఫిక్ స్థితిగతుల్ని అంచనా వేయకూడదు. ఇందులో రోడ్ల వెడల్పు, బాటిల్నెక్స్, మౌలిక సదుపాయాలు.. ఇలా అనేకం ముడిపడి ఉంటాయి. కంజెక్షన్ శాతం ఆధారంగానే దీన్ని లెక్కకట్టాలి. ఇది ఎంత ఎక్కువ ఉంటే ట్రాఫిక్ చిక్కులు అంతలా ఉన్నట్లు. ఇది తక్కువగా నమోదవుతున్నప్పుడే పరిస్థితులు మెరుగుడుతున్నట్లు అంచనా వేయాలి. – ఆర్.ప్రభాకర్, రవాణా రంగ నిపుణుడు -
సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు!
మెట్రో నగరాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే సామాన్య, మధ్యతరగతికే కాదు ధనిక కుటుంబాలకూ పొదుపు తప్పనిసరి. వార్షిక ఆదాయ, పొదుపు, తలసరి వ్యయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహాల ధరల నేపథ్యంలో హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కనిష్టంగా 23 ఏళ్ల సేవింగ్స్ అవసరం. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఏకంగా వందేళ్లకు పైగా పొదుపు చేస్తేనే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.2022–23లో దేశ స్థూల పొదుపు, స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 30.2 శాతంగా ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని.. రాష్ట్రంలోని అత్యంత ధనవంతులైన 5 శాతం మంది సగటు కుటుంబ ఆదాయం, రాష్ట్ర రాజధానిలోని 110 చదరపు మీటర్లు(1,184 చ.అ.) ఇంటి సగటు ధరతో పోల్చి ఈ డేటాను రూపొందించారు.ఠి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ తలసరి వ్యయం(ఆర్బీఐ ఎంపీసీఈ) ప్రకారం హైదరాబాద్లో ఐదు శాతం ధనిక కుటుంబాల వార్షిక ఆదాయం రూ.12.5 లక్షలుగా ఉంది. దీనికి ఆయా ఫ్యామిలీలకు 30.2 శాతం పొదుపు రేటును వర్తింపజేస్తే వారి వార్షిక పొదుపు దాదాపు రూ.3.8 లక్షలుగా ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బోర్డ్ (ఎన్హెచ్బీ) డేటా ప్రకారం 645 చ.అ. నుంచి 1,184 చ.అ. మధ్య కార్పెట్ ఏరియా ఉన్న ఇంటి చ.అ. ధర గతేడాది మార్చిలో రూ.89 లక్షలుగా ఉంది. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ.3.8 లక్షల పొదుపుతో రాష్ట్ర రాజధానిలోని టాప్–5 అర్బన్ కుటుంబాలు ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కనిష్టంగా 23 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది.ఢిల్లీలో 35 ఏళ్ల పాటు.. ఇదే విధమైన లెక్కల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు కొనాలంటే 35 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ ప్రవేశం చేయాలంటే ఏకంగా 109 ఏళ్ల పాటు సేవింగ్స్ చేయాల్సిందే. దేశంలో పది కంటే ఎక్కువ రాష్ట్రాల రాజధానుల్లో ఇల్లు కొనాలంటే 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిల్లో ముంబై, గుర్గావ్, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్ రాజధానులు ఉన్నాయి.దక్షిణాదిలో మన దగ్గరే తక్కువ..దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంతో పోలిస్తే భాగ్యనగరంలోనే తక్కువ కాలం పొదుపు చేస్తే సరిపోతుంది. చెన్నైలో 37 ఏళ్ల పాటు సేవింగ్స్ చేస్తేనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇక, బెంగళూరులో 36 ఏళ్లు, తిరువనంతపురం, విశాఖపట్నంలలో 26 సంవత్సరాలు పొదుపు చేస్తే సొంతిల్లు సొంతవుతుంది. ఇక, అత్యల్పంగా కేవలం 15 ఏళ్ల పొదుపుతో సొంతింటి కలను సాకారం చేసుకునే ఏకైక నగరం చంఢీగడ్. ఆ తర్వాత 16 ఏళ్లతో జైపూర్ నగరాలున్నాయి. -
నైనీ బొగ్గు టెండర్లు.. విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు టెండర్ల వ్యవహారంపై విచారణ మొదలైంది. శుక్రవారం రెడ్హిల్స్లోని సింగరేణి కార్యాలయానికి వెళ్లిన కేంద్ర బృందం.. సుమారు ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. విచారణ గోప్యంగా జరిగినప్పటికీ.. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. టెక్నికల్ కమిటీ సభ్యులు అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవాళ సింగరేణి కార్యాలయానికి మరోసారి వెళ్లనున్న సెంట్రల్ టీం.. మరోసారి అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొన్న, నిన్నటి విచారణలో సీఎండీ కృష్ణ భాస్కర్తో పాటు కొందరు అధికారులను విచారించారు. పలు కీలకమైన ఫైల్స్ను పరిశీలించారు. ప్ఱధానంగా సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ అంశంపై కేంద్రానికి సెంట్రల్ టీం నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టమౌతోంది. అసలు ఏంటీ వివాదంఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా నైనీ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిని గతంలో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులను ఇతర సంస్థలకు అప్పగించేందుకు ‘మైన్ డెవలపర్, ఆపరేటర్’(ఎండీఓ) ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానిస్తూ గత నవంబరులో సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29లోగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో టెండర్లు వేయాలని గడువు విధించింది. ఈ నోటిఫికేషన్లో గని నేపథ్యం(బ్యాక్గ్రౌండ్) వివరాలు తెలిపిన అంశాల్లో ఒకటో విభాగంలోని 1.8 నిబంధన ప్రకారం... నైనీకి వెళ్లి, గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు అక్కడి సింగరేణి జనరల్ మేనేజర్(జీఎం) నుంచి ‘ధ్రువీకరణ పత్రం’ తీసుకుని టెండర్తో పాటు తప్పనిసరిగా దాఖలు చేయాలి. అయితే, తాము గనిని సందర్శించినా అక్కడి జీఎం సర్టిఫికెట్ ఇవ్వలేదని కొన్ని కంపెనీలు ఆరోపించడంతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లయ్యింది. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సింగరేణి నుంచి సీఎస్ఆర్ నిధులను మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోపక్క.. సింగరేణి సంస్థ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నడుం బిగించింది. టెండరు ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితులతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై విచారణకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గుశాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ)గా పనిచేస్తున్న చేతన్ శుక్లా, సాంకేతిక విభాగం డైరెక్టర్గా పనిచేస్తున్న మారపల్లి వెంకటేశ్వర్లును విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆదేశంతోనే కమిటీని ఏర్పాటు చేసినట్లు తన ఉత్తర్వుల్లో తెలిపింది. వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉంది. పాలకమండలి సమావేశాలను మాత్రమే హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో నైనీతోపాటు సీఎస్ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను వెంటనే తమ ముందు పెట్టాలని సింగరేణి అధికారులను కమిటీ సభ్యులు కోరారు. దీంతో.. కమిటీ అడిగిన వాటిని తెప్పించే పనిలో సింగరేణి యంత్రాంగం తలమునకలైంది. -
పబ్కు రా.. రమ్మని
మాదాపూర్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి రూ.లక్షల్లో వేతనం. ఇటీవల ఓ డేటింగ్ యాప్లో ఉత్తరాదికి చెందిన యువతితో పరిచయమైంది. తాను హైదరాబాద్ వచ్చానని, హైటెక్ సిటీలోని ఓ పబ్లో కలుద్దామని చెప్పింది. అతడు హుషారుగా పబ్కు వెళ్లాడు. ఖరీదైన మద్యం, ఫుడ్ ఆమె ఆర్డర్ చేసింది. గంట లోపే రూ.56 వేలు బిల్లు అయింది. తనకు ఫోనొచి్చందంటూ పబ్ నుంచి ఆమె చిన్నగా జారుకుంది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాధితుడు బిల్లు కట్టేసి ఇంటికెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కిలేడీ సోషల్ మీడియాలో ప్రొఫైల్ అన్నీ బ్లాక్ చేసింది. ఇదేదో డేటింగ్ యాప్ మోసం కాదు. నగరంలోని పలు పబ్ నిర్వాహకులు ఉత్తరాది అమ్మాయిలతో కలిసి యువకులను చీటింగ్ చేస్తున్న తీరు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న మోష్ పబ్ నిర్వాహకుడు, ఢిల్లీ ముఠాకు చెందిన ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వందకు పైగా పబ్లున్నాయి. వీటిలో చాలావరకు సరైన అమ్యూజ్మెంట్ లైసెన్స్లు లేవని సమాచారం. అర్ధరాత్రి దాటినా పబ్లు నడవడం, అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పలు పబ్లు గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటి మత్తు పద్దారాలు పట్టుపడటం, అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వచి్చనా వాటి వెనక బడా రాజకీయ నాయకులు, సంపన్నుల పిల్లలు ఉండటంతో కేసులు నీరుగారిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఉత్తరాది అమ్మాయిలతో.. ఢిల్లీ, హరియాణా వంటి ఉత్తరాదికి చెందిన వ్యవస్థీకృత ముఠాలతో స్థానికంగా పలు పబ్ నిర్వాహకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. పాతికేళ్ల లోపు వయసున్న నిరుద్యోగ, పేద యువతులను పార్ట్ జాబ్ పేరుతో తీసుకుంటారు. వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేస్తారు. టిండర్, బంబుల్, హ్యాపెన్, హింజ్ వంటి డేటింగ్ యాప్స్లలో అందమైన ఫొటోలతో ప్రొఫైల్స్ సృష్టిస్తారు. ఐటీ నిపుణులు, ఉన్నత ఉద్యోగులు, యువతను లక్ష్యంగా యాప్లలో పరిచయం చేసుకుంటున్నారు. మాట కలిపి.. మాయ చేసి..డేటింగ్ యాప్లో పరిచయమైన అమ్మాయి.. కొద్ది రోజుల్లోనే బాధితుడికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాను వ్యక్తిగత పని మీద నగరానికి వచ్చానని, ముందుగా ఎంపిక చేసుకున్న పబ్, కెఫే, రెస్టారెంట్లో కలుద్దామని ఒత్తిడి చేస్తుంది. దీంతో బాధితుడు ఆమె సూచించిన ప్రాంతానికి వెళ్లగానే.. మెనూ కార్డు చూడకుండానే ఖరీదైన పానీయాలు, ఆహారం, మద్యం వంటివి ఆర్డర్ చేస్తుంది. బిల్లు వచ్చేలోపే అక్కణ్నుంచి జారుకుంటుంది. ఇది తెలియక లోపలే వెయిట్ చేసే బాధితుడు ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి, బిల్లు కట్టేసి ఉస్సూరుమంటూ వెళ్లిపోతాడు. ఒకవేళ బిల్లు కట్టే పరిస్థితి లేకపోతే పబ్ యాజమాన్యాలు బౌన్సర్ల సహాయంతో బెదిరింపులు, దాడులు తప్పవు. ఢిల్లీ ముఠా హైదరాబాద్లో 50–60 మందిని మోసం చేసి కేవలం 45 రోజులలోనే ఏకంగా రూ.30 లక్షలకు పైగా దోచుకుంది. -
మణికొండ : నార్సింగిలో సందడిగా పశుసంక్రాంతి (ఫోటోలు)
-
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్మెంట్
స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్హౌస్ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్మెంట్లు హాట్ ఫేవరెట్స్గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరోఎవరు కొంటారంటే? సాధారణంగా బెడ్ కమ్ లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.మన దగ్గర తక్కువే.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కేవలం 34 స్టూడియో అపార్ట్మెంట్ల ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. -
కెన్యా మహిళకు కొత్త జీవితం..!
పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.కెన్యాకు చెందిన 55 ఏళ్ల ఫతుమో మొహముద్ డుబో కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కెన్యాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో ఆమె తన సోదరి, చిన్న కూతురుతో కలిసి మెరుగైన చికిత్స కోసం భారత్కు వచ్చారు. AINU హైటెక్ సిటీలో చేరారు. వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జీవ దాత ద్వారా కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఆమె సోదరి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు.ప్రాణాలు నిలిపిన సోదరి:AINU హైటెక్ సిటీ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె సోదరి కిడ్నీ సరిపోలుతుందని తేలింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో ఒకే సెషన్లో దాత నుంచి కిడ్నీ తీసి స్వీకర్తకు అమర్చామనీ AINU సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సను AINU హైటెక్ సిటీ ట్రాన్స్ప్లాంట్ విభాగానికి చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా, క్రిటికల్ కేర్ నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. "ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు దాత ఎంపిక నుంచి శస్త్రానంతర సంరక్షణ వరకు అన్ని దశల్లో సమన్వయంతో పనిచేశాం. ఎండ్స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్న రోగులకు జీవ దాత కిడ్నీ మార్పిడి అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది" అని వెల్లడించారు.జన్యుపరమైన వ్యాధి:పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అనేది జన్యుపరమైన కుటుంబ సంబంధిత వ్యాధి అని డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారికి కాలక్రమేణా మూత్రపిండాల్లో అనేక సిస్టులు ఏర్పడతాయని చెప్పారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్, దీర్ఘకాలిక ఫాలోఅప్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐతే ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వైఫల్యం కాదని, కొన్ని సందర్భాల్లో మాత్రం క్రానిక్ కిడ్నీ డిసీజ్గా మారి, చివరికి ఎండ్స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్కు దారి తీస్తుందని వివరించారు. వారికి తప్పకుండా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు.భారత్కు కృతజ్ఞతలు:ఈ సందర్భంగా ఫతుమో మొహముద్ డుబో మాట్లాడుతూ, “కెన్యా నుంచి భారత్కు రావడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఇక్కడి వైద్యులు నాకు మళ్లీ జీవించే అవకాశం ఇచ్చారు. ప్రతి దశను స్పష్టంగా వివరించి మాకు అండగా నిలిచారు. నా సోదరి కిడ్నీ దానం చేయడం వల్లనే నా ప్రాణాలు నిలిచాయి,” అని తెలిపారు. అవయవ మార్పిడుల్లో భారత్ ప్రపంచ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతోందని, దీనికి తాజా శస్త్ర చికిత్స ఒక ఉదాహరణ అని వైద్యులు తెలిపారు.కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ దీపక్ రగూరి, డాక్టర్ ఎమ్.డి. తైఫ్ బెండిగేరి, డాక్టర్ . సయ్యద్ ఎమ్.డి. ఘౌస్, డాక్టర్. దీక్ష ప్రియలతో కూడిన వైద్య బృందం నిర్వహించింది.(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!) -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్లో పలు సవరణలు చేసింది.వివరాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ క్రమంలో ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, ఐదేళ్లకు మించి నిరంతర గైర్హాజరు అయితే సేవల నుంచి తొలగించే విధంగా సవరణ జరిగింది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ టూర్ వెళ్లినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేశారు. అయితే, చర్యలకు ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
సాక్షి హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి దగ్గర బుల్లెట్ ఉండడం తీవ్రకలకలం రేపింది. తిరుపతి నుంచి వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ని భద్రతా అధికారులు తనిఖి చేయగా అతని వద్ద బుల్లెట్ ఉండడం గమనించారు. దీంతో అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ బుల్లెట్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రయాణికున్ని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆబుల్లెట్ నుంచి వచ్చిందా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు భళా!
హైదరాబాద్ ఇళ్ల మార్కెట్ 2025లో మెరిసింది. అమ్మకాలు 6 శాతం పెరిగి 54,271 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో విక్రయాలు 51,337 యూనిట్లుగా ఉన్నాయి. దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో అమ్మకాలు గతేడాది 15 శాతం పెరిగి 1.33 లక్షల యూనిట్లకు చేరినట్టు ప్రాప్టైగర్ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2025లో 3,86,365 యూనిట్లుగా ఉన్నట్టు, 2024లో విక్రయాలు 4,36,992 యూనిట్లతో పోల్చితే 12 శాతం తగ్గినట్టు పేర్కొంది. బెంగళూరులో 54,414 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు 2025లో నమోదయ్యాయి. 2024లో విక్రయాలు 48,272 యూనిట్ల కంటే 13 శాతం పెరిగాయి. చెన్నైలోనూ గతేడాది ఇళ్ల విక్రయాలు 55 శాతం దూసుకెళ్లి 24,892 యూనిట్లకు చేరాయి. కోల్కతాలో విక్రయాలు 15,172 యూనిట్లుగా ఉన్నాయి. 2024తో పోల్చితే 12 శాతం పెరిగాయి. ముంబై రీజియన్లో విక్రయాలు 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 13 శాతం తగ్గాయి. 35,711 యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో అమ్మకాలు 12 శాతం తగ్గి 29,223 యూనిట్లకు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 37,087 యూనిట్లుగా ఉన్నాయి. టాప్–8 నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం తగ్గి 2025లో 3,61,096 యూనిట్లుగా ఉంది. 2021 తర్వాత ఇదే కనిష్ట సరఫరా అని ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది. డిమాండ్ దెబ్బతినలేదు.. ‘‘2025 సంవత్సరంలో డిమాండ్కు విఘాతం కలగలేదు. సర్దుబాటు జరిగిందంతే. కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. డెవలపర్లు మాత్రం సరఫరా పరంగా సమయోచితంగా వ్యవహరించారు. ఈ ధోరణి నిల్వపరమైన ఒత్తిళ్లు తగ్గి, ధరలు స్థిరంగా ఉండేలా సాయపడింది’’అని ఆరమ్ ప్రాప్టెక్ ఈడీ ఓంకార్ షెట్యే తెలిపారు. -
అంధులకు చదివే అదృష్టిం!
సాక్షి, హైదరాబాద్: సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు చదవడం మామూలు విషయమే. కానీ చూపులేని విద్యార్థులకు మాత్రం అదో పెద్ద ప్రహసనం. బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడమే వారికి వీలవుతుంది. ఒకవేళ బ్రెయిలీలో నూతన ఎడిషన్లు అందుబాటులో లేకపోయినా, పేలవమైన ఆడియో రికార్డింగ్లు ఉన్నా లేక ఖరీదైన సాఫ్ట్వేర్లు అవసరమైనా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది.అయితే ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్–ఐటీ) పరిష్కారం చూపించింది. కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతల ఆధారంగా ‘దృష్టి’పేరుతో డిజిటల్ ల్రైబరీని అభివృద్ధి చేసింది. పూర్తిగా ఉన్నత విద్యా సంబంధ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలా పనిచేస్తుందంటే..: దృష్టి లైబ్రరీలో ఉపయోగించేఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ (ఓసీఆర్) వ్యవస్థ.. బొమ్మలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్కాన్ చేసి చూపులేని విద్యార్థులకు అను కూలమైన ఫార్మాట్లలో వాటిని అందిస్తుంది. అంటే వాటిని బ్రెయిలీ లిపితో కూడిన అక్షరాలుగా మారుస్తుంది. అలాగే టెక్స్ట్టు స్పీచ్ టూల్స్ను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలను ఆడియోబుక్స్లాగా మార్పిడి చేస్తుంది. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసిన రీడర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్ను దృష్టి లైబ్రరీ అందిస్తుంది. 12 భాషల్లో..: ప్రస్తుతం దృష్టి లైబ్రరీలో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళం, ఒడియా భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ చూపులేని వారు సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. అలాగే శ్రవణ అనుభవాన్ని సైతం పొందేందుకు వీలవనుంది. అంతేకాకుండా ఆడియో వేగాన్ని నచ్చినట్లుగా నియంత్రించడంతోపాటు బుక్మార్క్లు, పర్సనలైజ్ సెట్టింగ్స్, వాయిస్ ఆదేశాలతో నావిగేట్ చేసుకోవడం వీలవుతుంది.చూపులేని విద్యార్థులు, ఆయా విద్యాసంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగానే పరిశోధకుడు కృష్ణ తులసియన్ ట్రిపుల్–ఐటీ హైదరాబాద్లో ‘దృష్టి లైబ్రరీ’ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏఐ ఆధారిత భాషా వేదిక ‘భాషిణి’సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ‘దృష్టి’ప్ర«దానంగా యూజీ, పీజీ పాఠ్య పుస్తకాలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.వినియోగం ఉచితమే.. అంధుల పాఠశాలలు, అభ్యాసకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడున్నా కంటెంట్ను పొందేందుకు వీలుగా ‘దృష్టి’ని అభివృద్ధి చేశాం. ఖరీదైన సాఫ్ట్వేర్లను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వాటిని అంధ పాఠశాలలకు అందిస్తాం. – ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ కంటెంట్ను అందించొచ్చు.. దృష్టి డిజిటల్ లైబ్రరీని ఓపెన్ ప్లాట్ఫాంపై రూపొందించడం వల్ల చూపులేని విద్యార్థులకు అవసరమైన కంటెంట్ను ఎన్జీవోలు, వలంటీర్లు, విద్యాసంస్థలు అందించేందుకు వీలవుతుంది. ఈ లైబ్రరీని విస్తరించాలంటే అందుకు అందరి తోడ్పాటు అవసరం. – ప్రొఫెసర్ జవహర్ -
Davos: భారత్ ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చ
దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)- 2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్లో ఉన్న గోద్రేజ్ క్రీమ్ లైన్ డెయిరీ ప్లాంట్ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు.భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌళిక వసతులు (స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు) ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. -
శామీర్పేటలో హైడ్రా కూల్చివేతలు
మేడ్చల్: జిల్లాలోని శామీర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 30 ఏళ్ల క్రితం 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. అయితే దీనిపై ఫ్రెండ్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రహరీ గోడ కూల్చివేసి రోడ్డు డైరెక్షన్ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ ముక్తా మహబూబ్పేటలో ఆక్రమణలను తొలగించింది. ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆక్రమిత భూమి చిన్నదా.. పెద్దదా అని కాకండా హైడ్రా కూల్చివేతలు చేపడతూ వస్తంది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ నగర పరిధిలోని అనేక ఆక్రమిత భూములన హైడ్రా కాపాడింది. కాగా, గత ఏడాది నవంబర్లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించింది. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. -
హైదరాబాద్లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
హైదరాబాద్ x ముంబై
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ తలపడనుంది. గ్రూప్ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్ ఠాకూర్ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, సిద్ధేశ్ లాడ్లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం.. సీఐడీపై సజ్జనార్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఐడీ రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం, ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటి వద్దకు వెళ్తారు. హైదరాబాద్లో పకడ్బందీగా అమలులోకి విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నూతన విధానం ఉంటుంది. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు వర్తింపు ఉంటుంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారు.నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు ఉంటాయి. విధానం అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అకారణంగా స్టేషన్కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు ఇప్పటికే ప్రారంభమైన సీ-మిత్రతో పాటు ఈ విధానం ప్రజలకు మరింత మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. -
అందుకే గాంధీభవన్ వదిలా: జీవన్ రెడ్డి
సాక్షి హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్లో పెద్ద పీట వేస్తే వారి పక్కన ఎలా కూర్చుంటామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.10 ఏళ్లు బీఆర్ఎస్ పై తాము పోరాటం చేసిన నాయకులకు కాంగ్రెస్లో పెద్దపీట వేస్తే కేత్రస్థాయిలో ఉన్న నాయకులకు ఏమని సమాధానం చెప్తామని ప్రశ్నించారు. అందుకే అది జీర్ణించుకోలేకపోయానని, పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయిటకి వెళ్లిపోయానని జీవన్ రెడ్డి తెలిపారు.స్పీకర్తో తానే స్వయంగా పార్టీ మారలేదని చెప్పారని అలాంటి వారిని సమావేశానికి పిలవాల్సిన అవసరమేముందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నాయకులను చులకన చేస్తున్నారని పార్టీలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఉహించలేదన్నారు. నిన్నటి వరకూ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాల పై పోరాటం చేశాను. ఇప్పుడేమో మీటింగ్ లో అలాంటి వ్యక్తి ని పక్కను కూర్చోబెట్టారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించిన వ్యక్తి ని పార్టీ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తెచ్చేలా ఈ సమావేశం జరిగిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో విలువ ఇచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు.తాను ఎన్నో కష్టాలు భరించి పార్టీలో ఉన్నానని ఇప్పుడు దాని నుండి ఎందుకు వెళ్లిపోతానన్నారు. కాంగ్రెస్ తనపార్టీ అని కేవలం ఈ రోజు జరిగిన మీటింగ్కు మాత్రమే నిరసనగా బయిటకి వెళుతున్నానని తెలిపారు. -
తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వ బదిలీలు చేపట్టింది. తెలంగాణవ్యాప్తంగా 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సర్కార్ కీలక మార్పులు చేపట్టింది.జీహెచ్ఎంసీలో పలువురు కమిషనర్లు, మేనేజర్లకు కొత్త బాధ్యతలను అప్పగించింది. రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీల్లో బదిలీలు చోటుచేసుకున్నాయి. కాగా, వెంటనే కొత్త పోస్టింగ్లకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.బదిలీలు ఇలా.. రాజేష్ కుమార్ ప్రమోషన్తో GHMC కి బదిలీటీ.ఎస్.వి.ఎన్. త్రిలేశ్వర రావు C&DMA హెడ్ ఆఫీస్ కు బదిలీబి. సత్యనారాయణ రెడ్డి ప్రమోషన్పై GHMC కి బదిలీఆర్. వెంకట గోపాల్.. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ఉమా మహేశ్వర రావు - ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్పి. రామాంజుల రెడ్డి - మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్బి. తిరుపతి - కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ (ప్రమోషన్)చ. నాగరాజు - నేరెడ్చర్ల మున్సిపల్ కమిషనర్వై. సుదర్శన్ - ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్C.V.N. రాజు - రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీకె. సమ్మయ్య - సచివాలయానికి రిపాట్రియేషన్కీర్తి నాగరాజు - రాయకల్ మున్సిపల్ కమిషనర్ఏ. శ్రీనివాస రెడ్డి - హాలియా మున్సిపల్ కమిషనర్ఎం. నూరుల్ నజీబ్ - అమర్చింత మున్సిపల్ కమిషనర్కె. సంపత్ కుమార్ - వెనులవాడ మున్సిపల్ కమిషనర్టి. రమేష్ - ములుగు మున్సిపల్ కమిషనర్ఎం. రామచంద్ర రావు - తిరుమలగిరి (OD)జి. రాజు - ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్మునావర్ అలీ - ఎదులాపురం మున్సిపల్ కమిషనర్జె. సంపత్ - బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పి. చంద్రశేఖర్ రావు - భూత్పూర్ మున్సిపల్ కమిషనర్డి. మురళి - నందికొండ మున్సిపల్ కమిషనర్చి. వేణు - ఆచంపేట్ మున్సిపల్ కమిషనర్ఎం. రామదుర్గ రెడ్డి - కల్లూరు మున్సిపల్ కమిషనర్ -
‘పెద్ద వాళ్ల మెప్పు కోసమే భట్టిపై తప్పుడు కథనాలు’
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై దురుద్దేశ పూర్వకంగానే ఏబీఎన్ కథనాలు రాసిందని దళిత సంఘాలు మండిపడ్డాయి. డిప్యూటీ సీఎంపై ఏబీఎన్ రాసిన తప్పుడు కథనాలను ఖండించాయి దళిత సంఘాలు. ఈ మేరకు దళిత సంఘాల నేతలు ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ..‘‘ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. భట్టిపై దురద్దేశపూర్వకంగాకథనాలు రాశారు. నైనీ బ్లాక్పై ఆంధ్రజ్యోతిది ఊహాజనిత వార్త. ఇంధన శాఖకు భట్టి అర్హలు కారని ఎలా రాస్తారు?, భట్టి ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు. పెద్ద వాళ్ల మెప్పు కోసమే తప్పుడు వార్తలు రాశారు’ అని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
చిన్మయ మిషన్.. 75 సంవత్సరాల వేడుక
సాక్షి,హైదరాబాద్: ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక సేవా రంగాలలో 75 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ “అమృత మహోత్సవం”ను జనవరి 24, 25 తేదీలలో హైదరాబాద్లోని ఎన్టిఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిన్మయ మిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా 50వేల మందితో గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.. స్వామి చిన్మయానంద (1916–1993) చిన్మయ మిషన్ స్థాపకులు, భగవద్గీత, ఉపనిషత్తుల బోధలను సామాన్య ప్రజలకు చేరేలా చేయడానికి తన జీవితం మొత్తాన్ని అర్పించారు. 1951లో పూణేలో తన మొదటి గీతా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకూ చిన్మయ మిషన్ 32 దేశాల్లో 330కి పైగా కేంద్రాలతో విస్తరించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు చిన్మయ మిషన్ తెలిపింది. -
లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ!
-
బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్
-
ఆర్మీ వాహనం బీభత్సం.. చక్రాల కింద విద్యార్థి నుజ్జు నుజ్జు
-
బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్: బేగంపేట ప్లై ఓవర్పై కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ప్లై ఓవర్పై ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి.. కారు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.మరో ఘటనలో ఈ నెల 18న ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్ను పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
భార్యను చంపి.. ఆపై ‘స్టేటస్’లో పెట్టి
రహమత్నగర్(హైదరాబాద్): ఆనందంగా సాగే ఆ కుటుంబంలో అనుమానం చిచ్చు రగిల్చింది. దీంతో భర్త ఉన్మాదిగా మారాడు..కట్టుకున్న భార్యను హతమార్చాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన రొడ్డె ఆంజనేయులుకు కొల్లాపూర్కు చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి రహమత్నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్లో ఓ భవనంలో అద్దెకు దిగాడు. ఆంజనేయులు కొంతమందితో కలిసి జూబ్లీహిల్స్లో కార్ల క్రయవిక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. సరస్వతి ఎమ్మెల్యే కాలనీలో హౌస్ కీపింగ్ పనిచేసేది. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఆమె ఫోన్ ఓపెన్ చేసి అన్నీ పరిశీలిస్తూ, ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి గమనించేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు జరిగాయి. సరస్వతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు తన అత్తగారింటికి వెళ్లి, భార్య తరఫు పెద్ద మనుషులతో మాట్లాడి, గొడవలు పెట్టుకోనని నచ్చజెప్పి తన భార్యను రాజీవ్గాంధీనగర్కు తీసుకొచ్చాడు. అయితే భార్యపై కక్ష మాత్రం తగ్గలేదు. సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలితో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయులు హత్య చేసిన అనంతరం తన స్టేటస్లో ‘నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్న’అంటూ ఫొటో పెట్టాడు. నిందితుడి కోసం బోరబండ పోలీసులు గాలిస్తున్నారు. -
వీధి కుక్కల సామూహిక హత్య.. జంతు సంక్షేమ సంస్థల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను చట్టవిరుద్ధమైన రీతిలో వధించటాన్ని తెలంగాణ జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి ఖండించింది. కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు, తీవ్ర క్రూరత్వ ఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.సభ్య సంస్థలు సంకలనం చేసిన క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం.. ఈ కూటమి జనవరి 2026 మొదటి వారాల్లోనే సుమారు 500 వీధి కుక్కల హత్యను నమోదు చేసింది. అలాగే ఇటీవలి కాలంలో పదికి పైగా తీవ్రమైన క్రూరత్వ కేసులను నమోదు చేసింది. వాటిలో కుక్కలను రాడ్లతో కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విష ప్రయోగం చేయడం, వాటి అవయవాలను ముక్కలు చేయడం వంటివి ఉన్నాయి. కామారెడ్డి, హన్మకొండ జిల్లాల నుండి అత్యంత తీవ్రమైన సంఘటనలు నివేదించబడ్డాయి. ఇక్కడ స్థానిక పంచాయతీ అధికారులు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుసరించి వీధి కుక్కలను సామూహిక హత్యలకు ఆదేశించారు. ఈ హింస జంతువుల ప్రవర్తన వల్ల కలిగింది కాదని, మానవ నిర్లక్ష్యం, దీర్ఘకాలిక పరిపాలనా వైఫల్యం వల్ల జరిగిందని ఈ కూటమి పేర్కొంది.హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహిస్తున్న "కుక్కల తొలగింపు కార్యక్రమాలు" జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 మరియు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నియమాలు, 2023లను ఉల్లంఘిస్తున్నాయని కూటమి గుర్తుచేసింది. తగినంతగా పశువైద్య మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది. -
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన భర్త సుధీర్రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్బస్
జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2026లో 'ఎయిర్బస్' తన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు & వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ను ప్రదర్శించనుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్-ఐల్ విమానం A321neo, దేశీయ & అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్చేంజర్గా నిలిచిన A220 విమానాలతో పాటు H160, H125 హెలికాప్టర్లు స్టాటిక్ డిస్ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి.ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. H125 హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెమగల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద అసెంబ్లీ కానుంది. కాగా హాల్ Aలోని స్టాండ్ 11 వద్ద A321XLR, H145 మోడళ్లను ఎయిర్బస్ పరిచయం చేయనుంది.పబ్లిక్ డేస్లో ఎయిర్బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక ‘మీట్-అండ్-గ్రీట్’ రిక్రూట్మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది. డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు. ముఖ్యంగా బిగ్ డేటా, ఐఓటీ, అవియానిక్స్ సాఫ్ట్వేర్, ఎయిర్ఫ్రేమ్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్బస్ కోరుకుంటోంది. -
సమయం లేదు మిత్రమా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అద్దె భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యా సంస్థలు ప్రభుత్వ భవనాల్లోకి తరలింపు ప్రశ్నార్ధకంగా మారింది. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలు ఖాళీగా వెక్కిరిస్తున్నా.. అవి అనువుగా లేవంటూ కొందరు అధికారులు ఖాళీ చేసేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. అద్దె భవనాలను వెంటనే ఖాళీ చేయాలని డిసెంబరు 31నాటికి గడువు విధించి మరో నెల వెసులు బాటు కల్పించింది. ఏకంగా ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్లో సుమారు 30 శాతానికి పైగా సర్కారు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా స్టాంప్ అండ్ రిజి్రస్టేషన్, ఆర్టీఓ, పాఠశాలలు, బస్తీ దవఖానాలు, అంగ¯Œన్వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. దీంతో ఏటా అద్దెల పేరుతో కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. తరలింపు వద్దని యజమానుల ఒత్తిడి నగరంలోని కొన్ని భవనాల యజమానులు సర్కారు ఆఫీసులు ఖాళీ చేయకుండా విభాగ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏదోరకంగా కొన్ని నెలలు ఖాళీ చేయకుండా చూస్తే ఆ తర్వాత తాము చూసుకుంటామని పేర్కొంటున్నట్లు సమాచారం. తమ భవనాలు ఖాళీ అయితే అంతమొత్తం అద్దె రాదని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా సరైన మౌళిక సదుపాయాలు లేకున్నా.. ప్రభుత్వం పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సగానికిపైగా ఖాళీఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కార్యాలయాలు క్రమంగా విజయవాడకు తరలిపోయాయి. దీంతో పలు భవన సముదాయాలు ఖాళీగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పరిశ్రమ భవన్, గగ¯Œ∙ విహార్ కాంప్లెక్స్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రమంజిల్ వంటి పెద్ద భవనాల్లో సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి. 159 పాఠశాలలు అద్దె భవనాల్లోనే.. హైదరాబాద్లోని 16 మండలాల్లో 713 ప్రభుత్వ పాఠశాలల్లో 446 చోట్ల సొంత భవనాలుండగా.. మరో 68 పాఠశాలలు జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాళ్లలో, 40 బడులు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగతా 159 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అత్యధికంగా చారి్మనార్, బహదూర్పురా వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నాంపల్లి మండలంలోని బజార్–ఎ–జుమేరత్ ప్రాథమిక పాఠశాల 1975 నుంచి, కోట్లా అలీజా బాలికల హైసూ్కల్ 1995 నుంచి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మొత్తంమీద నెలవారీ కిరాయి సుమారు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది..మరోవైపు బస్తీ దవాఖానాలదీ ఇదే పరిస్థితి. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
సాక్షి,హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున (జనవరి 20) కంటైనర్, కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు పటేల్ (42),రాజన్న (60),బాబన్న(70)కారు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Vij- Hyd: జనం తిరుగు ప్రయాణం
-
ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్!
మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్ ఫేవరేట్ ప్లేస్గా మారింది. గతేడాది జులై–డిసెంబర్ (హెచ్–2)లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగింది. 2025 హెచ్2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోమెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్కు ప్రధాన కారణాలు.పెరిగిన దక్షిణం, తూర్పు..సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి దక్షిణ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ వంటి తూర్పు హైదరాబాద్ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.తగ్గిన ఉత్తరం, సెంట్రల్..ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్ వంటి ఉత్తర హైదరాబాద్ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్ హైదరాబాద్ వాటా 3 శాతానికి తగ్గింది.ప్రీమియం ఇళ్లకే మొగ్గు..2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.ఆఫీసు అ'ధర'హో..నగరంలో హెచ్ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్(ఎస్బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట వంటి సెంట్రల్ బిజినెస్ డి్రస్టిక్ట్(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.లాంచింగ్స్లో వెస్ట్దేనివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్–2తో పోలిస్తే లాంచింగ్స్ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్ సిటీ వాటా 5 శాతంగా ఉంది.నగరంలోని ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్ స్క్వాబ్ కార్పొరేషన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, రాండ్స్టాడ్, గోల్డ్మన్ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్ స్పేస్ విభాగం ఉంది. థర్ట్ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి. -
ఎన్టీఆర్ లేకుండానే కళ్యాణ్ రామ్ నివాళి
-
నందమూరి తారక రామారావుకు లక్ష్మీ పార్వతి నివాళి
-
Wings India2026: హైదరాబాద్లో విమానాల జాతర
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో కోసం హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ నెల 28 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపింది. గ్లోబల్ ఏరోహబ్గా భారత్ ఎదుగుతున్న వైనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించింది. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేయనున్న గగనతల విన్యాసాలు ఈ షోకే హైలైట్గా నిలవనున్నాయి. వివిధ రకాల విమానాలను సందర్శకులు దగ్గరి నుంచి చూసేలా స్టాటిక్ డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. కేవలం వినోదం, వ్యాపారమే కాదు.. యువతకు ఉపాధి కల్పించేలా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏవియేషన్ రంగంలో కెరీర్ను కోరుకునే యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పరిశ్రమ దిగ్గజాలను, నైపుణ్యం కలిగిన యువతను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ చాలెంజ్ను కూడా నిర్వహించనున్నారు. 20కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు, బృందాలు ఈ వేడుకలో పాల్గొననున్నాయి. విమానయాన సంస్థలు, తయారీదారులు, ఎయిర్పోర్ట్ డెవలపర్లు, పెట్టుబడిదారులు అంతా ఒకేచోట చేరనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సీఈవోల ఫోరం, బిజినెస్ మీటింగ్స్ జరగనున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, మహిళలకు విమానయాన రంగంలో అవకాశాలు, ఎయిర్ కార్గో వంటి 13 కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. -
తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ప్రజాభవన్లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు.సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల తరఫున హులికుంటే మూర్తి, డా. ఆశ్నా సింగ్, వి.మృదుల, రాహుల్ పాల్గొన్నారు. హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వెముల’ ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ, ప్రొఫెసర్ తిరుమల్, ప్రొఫెసర్ రత్నం, వి. రఘునాథ్, డా డోంత ప్రశాంత్, తిరుపతి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.


