breaking news
Hyderabad
-
శివరాత్రి రోజున చికెన్ వండనని చెప్పడంతో..
మేడ్చల్ జిల్లా: చికెన్ వండలేదని భార్యతో గొడవపడి ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగి దసరాజుల ప్రకాశ్(66) భార్య పద్మతో కలిసి ప్రతాప్సింగారం లోని న్యూవెంచర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 15 చికెన్ వండమని భార్యకు కోరగా అమె శివరాత్రి రోజున వండనని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటినుంచి బయటికి వెళ్లిన పద్మ కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూడగా..భర్త ప్రకాశ్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో కొన ఊపిరితో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్,హెచ్ ఎం డి ఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరుల హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జి లను ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటు పైన జాగ్రత తీసుకోవాలి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలి. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. -
ibomma Ravi : ఇమ్మడి రవికి బెయిల్
సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ రవికి బెయిల్ లభించింది. సినిమా పైరసీ కేసులో గతేడాది నవంబర్లో అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది. పైరసీ కేసులో అరెస్టైన బెయిల్ పొందిన ఇమ్మడి రవి ఇప్పటికైనా అతని తండ్రి అప్పారావు దగ్గరికి వెళతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది కుమారుడు అరెస్టును తండ్రి అప్పారావు సమర్ధించారు.ఇమ్మడి రవి తండ్రి ఏమన్నారంటే?ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను. పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా.. నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. తాజాగా బెయిల్ వచ్చిన ఇమ్మడి రవి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా? లేదంటే ఉద్యోగం చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా,ఇమ్మడి రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది. గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. -
TG: ఈఏపీసెట్ పరీక్షా తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అగ్రి కల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం , మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిప్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో షిప్ట్లో పరీక్షలు నిర్వహించనున్నారు. -
మా నాన్న హీరో: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ( మంగళవారం) కేసీఆర్ జన్మదినం సందర్బంగా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ని పట్టుకొని కొంతమంది నేతలు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తెలంగాణ హీరో అని తెలిపారు. ఆయన నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన భగవంతున్ని కోరుత్నుట్లు తెలిపారు.సంచులు మెసేవారికి జాతి గురించి కానీ దాని గౌరవం గురించి గాని ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని ఒకటేమో తెలంగాణ జాతయితే మరోకటి రాష్ట్ర ద్రోహులదని తెలిపారు. బీర్ఎస్ పార్టీకి అధిష్ఠానం ఆడిస్తే ఆడడం తెలియదని కేటీఆర్ అన్నారు. ఏ జాతికి జాతిపిత అని మాట్లాడుతున్నారు. రుద్రమదేవి, కొమురం భీం, సర్వాయి సర్దార్ పాపన్న, కాళోజీ , చాకలి ఐలమ్మ, తుర్రెబాజ్ ఖాన్, దాశరథి, తెలంగాణ విద్యార్థి అమరవీరుల జాతి మాదని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ భవన్కు భారీగా నేతలు తరలివచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు. కాగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలు చోట్ల కేకులు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. -
పొద్దన టీ తాగినోడు నైట్ ఎలా చనిపోతాడు..
చైతన్యపురి: ఓ భవనం సెల్లార్లో హైడ్రాలిక్ పార్కింగ్ రాడ్కు వాచ్మన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. చైత్యపురి బస్ స్టాప్ వెనకవైపు నీరటి రాజు, అతని సోదరులు కలిసి కమర్షియల్ కాంప్లెక్స్ను నిరి్మస్తున్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40)ను అక్కడ వాచ్మన్గా నియమించారు. అయితే ముత్తయ్య సోమవారం తెల్లవారుజామున సెల్లార్లో హైడ్రాలిక్ కార్ పార్కింగ్ రాడ్కు ఉరేసుకుని కనిపించాడు.మరో వాచ్మన్ గమనించి సూపర్వైజర్కు సమాచారం ఇవ్వడంతో అతను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ముత్తయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. కూతురుకు వివాహం చేశాడు. కుమారుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తన తండ్రికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కూతురు, కుమారుడు మీడియాకు తెలిపారు. -
హైదరాబాద్ : మణికొండలో కాలనీలను ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం?
హైదరాబాద్: సిటీ ట్రాఫిక్ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ క్లియర్ చేయడంపై కంటే చలాన్ల మీదే వారికి ఎక్కువ దృష్టి ఉంటుందనే విమర్శలకు ఊతమిచ్చే ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. చేతిలో కెమెరా, మొబైల్ ఫోన్ పట్టుకుని కేవలం చలాన్ల కోసమే రోడ్లపై వేచి చూసే పోలీసులు చాలాచోట్ల కనిపిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఫొటో తీయడమే వారి డ్యూటీ. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి టీఎస్ 10ఎఫ్డీ 8002 కారును ఆర్పీరోడ్లోని దర్గా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉదయం 10.15 గంటలకు నిలిపి, మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ మధ్య సమయంలో కారుకు ఉదయం 10.29, 10.50, మధ్యాహ్నం 12.18 గంటలకు వరుసగా మూడు చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. అవి కూడా వేర్వేరు సెక్షన్లకు కాదు. అన్నీ కూడా క్యారేజ్ వే లో పార్కింగ్ పేరిటే కావడం గమనార్హం. ఇదీ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఘన కార్యం. రాణిగంజ్, ఆర్పీరోడ్లోని షాపుల ముందు నిత్యం పార్క్ చేసే వాహనాలను మాత్రం పట్టించుకోరు. -
ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం
మూసాపేట (హైదరాబాద్): మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఇంట్లోనే ఉంచుకోవటంతో దుర్వాసన వెలువడి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివేకానందనగర్, రామకృష్ణనగర్ వీధిలో శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులోని అద్దె ఇంట్లో తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో నివాసం ఉంటోంది. భర్త రిటైర్డ్ ఎస్ఐగా చేసి గతంలోనే మరణించాడు. భర్తకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ముగ్గురికి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపునకు తాళం వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపుతట్టగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తలుపు వేసుకున్నారు. సోమవారం కూడా మృతదేహాన్ని అలాగే ఉంచటంతో దుర్వాసన ఎక్కువైంది. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మృతదేహాన్ని తరలించాలని సూచించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పటంతో చివరికి వారి సొంత ఊరు కైకలూరికి అంబులెన్స్లో తరలించారు. అయితే గతంలో వాచ్మన్పై దాడి చేసింది కూడా వీరేనని, అద్దె డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. -
సిటీ బస్సుల్లోనూ లగేజ్ ర్యాక్స్
సాక్షి, హైదరాబాద్: జిల్లా సర్వీసుల్లో బస్సెక్కగానే ప్రయాణికులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగులను బస్ అటక(ర్యాక్స్) మీద పెట్టేస్తారు... ఆ బరువు మోసే అవసరం వారికి ఉండదు. కానీ, హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఆ వసతి లేదు. దీంతో ప్రయాణికులు బరువు ఎంతున్నా, బ్యాగులను మోస్తూ నిలబడాల్సిందే. ఈ విషయంలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో చాలా మంది ఈ విషయంలో ఆర్టీసీ పరిష్కారం చూపాలని కోరినా, బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ, సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు...జిల్లా సర్వీసుల్లాగా ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఎక్కువసేపు ప్రయాణించే పరిస్థితి ఉండదు. కానీ, ప్రయాణించే సమయం తక్కువే అయినా, ఎక్కువ బరువుతో ప్రయాణించేవారు లగేజీ పెట్టుకునే స్థలం లేక మోస్తూ నిలబడాల్సి వస్తోంది. సిటీ బస్సుల్లో ఎక్కువ సమయం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఆ సమయంలో నిలబడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు వారి బ్యాగులను కింద పెట్టే వీలు కూడా ఉండదు.తప్పని పరిస్థితిలో మోస్తూ ఉండాల్సిందే. పాఠశాల విద్యార్థులు భారీ బ్యాగులను మోస్తూ, రద్దీ మధ్యలో మెసలడం.. వారికి, తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత రెండు బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించింది. ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తొలిదశలో 150 బస్సుల్లో అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా, తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బస్సుకు రూ.15 వేలు...ఆర్టీసీకి ప్రత్యేకంగా మియాపూర్లో బస్బాడీ నిర్మాణ విభా గం ఉంది. సొంతంగా సిబ్బందే బస్సు బాడీలను తయారు చేసే సామర్థ్యం ఉన్న వారు కావటంతో, ఈ పనిని కూడా వారికే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.15 వేల ఖర్చు అవుతుందని తేల్చారు. ప్రస్తుతం ఆ బస్సుల్లో అట కలు ఏర్పాటు చేసే పని జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు అటకలతో తిరగనున్నాయి. అవి ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉన్నాయా, సిటీ రద్దీ నేపథ్యంలో అవి అంతగా వినియోగించుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది గుర్తించి... మిగతా బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఒకచోట కాకుండా అటూ ఇటూ మారుతుంటారు. అలాంటప్పుడు ఈ ర్యాక్స్ను వినియోగించుకోవటం అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది పరిశీలించనున్నారు.అప్పట్లో పార్టీషన్ పేరుతో వృథా వ్యయం...ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు–పురుష ప్రయాణికులు కలిసిఉండే వీలు లేకుండా ప్రత్యేక పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ వరుస సీట్లను తొలగించి మధ్యలో ఇనుప జాలీ తరహాలో స్లైడింగ్ డోర్తో కూడిన విభజనను ఏర్పాటు చేశారు. ఇందుకు ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఓ ఉన్నతాధికారి వీటి ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్ది రోజులకే ఆ ఏర్పాటు వృథా ప్రయాస అని తేలిపోయింది. మళ్లీ వాటిని తీసేసి, వాటి కోసం తొలగించిన సీట్లను తిరిగి ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే, తాజా నిర్ణయం ఉపయోగకరమైంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూలత ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. -
‘మా పార్టీ బేస్ పెరిగింది.. ఓటింగ్ శాతం పెరిగింది’
హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బైంసా, నారాయణపేట్లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి, వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్రావు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలిచాం. నిజామాబాద్లో మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీఅరవింద్, రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ కష్టపడి పని చేశారు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి. బీజేపీ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రెండు పార్టీలు ఎంఐఎం తో కలిసి మేయర్, చైర్మన్ రాకుండా చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న దానికి ఏం పేరు ఇవ్వాలి. ప్రజలే వీరి మధ్య సంబంధం ఏంటో చూడాలి. కమ్యునిస్టు పార్టీలు కనుమరుగు అవుతున్నాయి. వాటికి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఆలోచన చేయాలి. ఏప్రిల్లో ఎస్ఐఆర్ రాబోతుంది. అధికారులు అప్రమత్తంగా దొంగ ఓట్లు తొలగించాలి. ఓటర్లకు తెలియకుండానే వారి ఇళ్లలో ఓట్లను చేరుస్తున్నారు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విప్ జారీ చేశాం’ అని రాంచందర్రావు స్పష్టం చేశారు. -
షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ స్టూడెంట్ బలవన్మరణంచింతల్: పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్మెంట్ వాచ్మన్ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య ఫిలింనగర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ మహబూబాబాద్కు చెందిన గుగులోత్ సంధ్యారాణి(20) షేక్పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలో హాస్టల్లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్పాస్ట్ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో షవర్కు ఉరేసుకుంది. కాసేపటి తరువాత మిత్రులు బాత్రూమ్ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది.దీంతో హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా షవర్కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్ మెసేజ్ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు చేరాయి. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు చేరగా, బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ చేరింది. ఇక సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్ చేరగా, ఇండిట్లు నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకున్నారు.మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలుకాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లుబీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలుబీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లువరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలుతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా..మిగిలిన 9 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక పూర్తి..9 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టు ప్రకటించిన అధికారులు* భూపాలపల్లి మున్సిపాలిటీ - (కాంగ్రెస్) _ చైర్మన్ బుర్ర కొమురయ్యనర్సంపేట_ చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి ( కాంగ్రెస్ )స్టేషన్ ఘన్పూర్_ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్ ( కాంగ్రెస్ )వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి ( కాంగ్రెస్ )ములుగు మున్సిపాలిటీ చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ ( కాంగ్రెస్ )మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి ( కాంగ్రెస్ )పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ( కాంగ్రెస్ )మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి ( కాంగ్రెస్ )కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ బానోత్ సునీత ( కాంగ్రెస్ ) ఎన్నికకాంగ్రెస్లో కొనసాగడంపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్జగిత్యాల మున్సిపల్ ఎన్నికపై జీవన్ రెడ్డి విచారంసంతోషమా.. బాధ అర్థం కావడం లేదు: జీవన్ రెడ్డిపార్టీ జెండా మోసిన వ్యక్తికే పదవి ఇవ్వాలని మెుత్తుకున్నాకాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందిపార్టీలో ఉండాలా లేదా అనే సందిగ్ధత నెలకొంది జగిత్యాల జిల్లాజగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి మెట్పల్లి ఛైర్మన్ స్థానంపై బీజేపీ నేతల అసంతృప్తిఅసంతృప్తితో మెట్పల్లిలోని ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలు యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలుబీఫామ్లు ఇవ్వడంలో యాదగిరి నిర్లక్షం చేశారని ఆరోపణ10 సీట్లు గెలిచినా ఛైర్మన్ దక్కలేదని నేతల అసంతృప్తిఏడు కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక పూర్తిమహాబూబ్నగర్, నల్గగొండ, మంచిర్యాల, కాంగ్రెస్ కైవసంరామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంకొత్తగుడెం కార్పొరేషన్ కైవసం చేసుకున్న సీపీఐకరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కించుకున్న బీజేపీమెుత్తంగా కాంగ్రెస్కు ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలలో ఇల్లందు మినహా కొత్తగూడెం కార్పొరేషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తిఎదులాపురం మున్సిపాలిటీ చేర్మెన్ గా పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికవైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్మధిర మున్సిపాలిటీ ఛైర్మెన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా తన ఓటు వినియోగించుకున్నారుసత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా రెహానా బేగం, వైస్ చైర్మన్గా బొంతు సుమలతకల్లూరు మున్సిపాలిటీ చైర్మన్గా ధరావత్ మోహన్ నాయక్ , వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరికొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపురపు లలిత కుమారిఅశ్వారావుపేట మున్సిపాలిటీలోచైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యా, భర్తలుచైర్మన్గా జూపల్లి శశికళవైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికరంగారెడ్డి జిల్లాఆమనగల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నేనవత్ పత్య నాయక్ క్లినిక్ పై దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలుబీఆర్ఎస్ నుండి కౌన్సిలర్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆగ్రహంబిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పత్య నాయక్రంగారెడ్డి జిల్లాఇబ్రహీంపట్నంలో క్యాంప్ రాజకీయాలురహస్యప్రాంతాలకు కౌన్సిలర్ల తరలింపుఅభ్యర్థులను తరలిస్తున్న పార్టీలుఎన్నికలు వాయిదా పడడంతో అభ్యర్థుల తరలింపుమహబూబాబాద్ జిల్లాఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ ఫిర్యాదుకావ్య ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని బీఆర్ఎస్ ఫిర్యాదుగ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఇదివరకే కావ్య ఓటు వేశారని ఫిర్యాదు హంగ్ వచ్చిన మూడు చోట్ల కాంగ్రెస్ పాగాకేసముద్రం,మహబూబాబాద్, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశంతెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ పూర్తిగా బీజేపీ కైవసంభైంసాలో ఇండిపెండెంట్ కు మద్ధతుఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల పదవులు దక్కించుకున్న బీజేపీకరీంనగర్ కార్పోరేషన్ బీజేపీ వశంనారాయణపేట్ మున్సిపాలిటీ బీజేపీ కైవసంభైంసా ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ వశం3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు దక్కించుకున్న బీజేపీ1. ఆమన్ గల్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ2. జిన్నారం (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ3. నర్సాపూర్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ4. అలియాబాద్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ5. ఎల్లంపేట (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీనిర్మల్ జిల్లాభైంసా మున్సిపాలిటీ ఛైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థిఛైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తూముదత్తాత్రి26స్థానాలకు 12 చోట్ల గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు సూర్యాపేట జిల్లాసూర్యాపేట మన్సిపల్ ఛైర్మన్గా మొరిశెట్టి నివేదితవైస్ ఛైర్మన్గా ఎండీ షపీఉల్లా ఎన్నికకోదాడ ఛైర్మన్గా వేర్నేని కుసుమ వెంకటరత్నంవైస్ ఛైర్మన్గా దేవర పల్లిమల్లీశ్వరిహుజూర్నగర్ ఛైర్మన్ డోంతగాని శ్రీనివాస్ గౌడ్వైస్ ఛైర్మన్గా తన్నీరు మల్లిఖార్జుననేరెడుచర్ల ఛైర్మన్గా కొణతం చిన వెంకట్ రెడ్డివైస్ ఛైర్మన్గా నూకల సందీప్ రెడ్డితిరుమలగిరి ఛైర్మన్గా ఎస్ రఘనందన్ రెడ్డివైస్ ఛైర్మన్గా గోవిందమ్మయాదాద్రి జిల్లాభువనగిరి ఛైర్మన్గా తంగళ్ళపల్లి శ్రీవాణివైస్ఛైర్మన్గా పోతంశెట్టి మంజులయాదగిరిగుట్ట ఛైర్మన్ భరత్ గౌడ్వైస్ ఛైర్మన్గా బరిగే రమ్య ప్రమాణస్వీకారంచౌటుప్పల్ ఛైర్మన్గా మోగుదాల పావనివైస్ ఛైర్మన్గా గోశిక వినయ్ ప్రమాణస్వీకారంభూదాన్ పోచంపల్లి ఛైర్మన్ తడక వెంకటేశంవైస్ ఛైర్మన్గా కొయ్యడ రజినిఆలేరు ఛైర్మన్గా బాలామణివైస్ ఛైర్మన్గా ఇంగడి ఆంజనేయులుమోత్కూరు ఛైర్మన్గా గడ్డం స్వప్నవైస్ ఛైర్మన్గా పల్లెర్ల వెంకన్ననల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ (ఆమీర్)నల్లగొండ జిల్లామిర్యాలగూడ ఛైర్మన్గా చిలుకూరు సుధ వైస్ ఛైర్మన్గా పావని ప్రమాణస్వీకారంచిట్యాల ఛైర్మన్గా పందిరి గీత ప్రమాణస్వీకారం వైస్ ఛైర్మన్గా గుండెబోయిన శ్రీలక్ష్మిదేవరకొండ: ఛైర్మన్గా పున్న శైలజవైస్ ఛైర్మన్గా జూబేరియా తబసుంచండూరు: ఛైర్మన్గా కోడి శ్రీనివాసులువైస్ ఛైర్మన్గా దశరథ ప్రమాణస్వీకారంహాలియా ఛైర్మన్గా చింతల రామచంద్రారెడ్డివైస్ ఛైర్మన్గా రాజా రమేష్ ఎన్నికనందికొండ ఛైర్మన్గా గౌతమివైస్ ఛైర్మన్గా రాజా ప్రసాద్ ప్రమాణస్వీకారం. మహబూబ్నగర్ మేయర్ కాంగ్రెస్ వశంమేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మమత రాష్ట్రంలో 11 మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదాఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదాక్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ ఎన్నిక వాయిదానారాయణపేట మున్సిపాలిటీ బీజేపీదే నారాయణపేట మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న బీజేపీనారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు వేసిన ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసంఇటీవల బీజేపీలో చేరిన ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 12కి చేరిన బీజేపీ బలం 12 మంది కౌన్సిలర్లతోపాటు, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మేజిక్ ఫిగర్ 13కి చేరిన బీజేపీ బలం.నారాయణ పేట మున్సిపాలిటీ చైర్మన్గా కొండా శ్వేత ఎన్నికనారాయణ పేట మున్సిపాలిటీ ఓటింగ్కి దూరంగా ఉన్న బీఆర్ఎస్నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు.మున్సిపాలిటీ చైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 13..11 వార్డులలో బీజేపీ విజయం.7 వార్డులలో కాంగ్రెస్ విజయం.2 స్థానాలలో BRS అభ్యర్థులు విజయం.2 వార్డులలో AIMIM కైవసం.ఒక వార్డులలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. ఇటీవల బీజేపీలో చేరారుఒక వార్డులో గెలిచిన AIFB అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు.పెద్దపల్లి జిల్లా:మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్గా ముస్కుల సహేందర్ రెడ్డి ఎన్నికకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్: కరీంనగర్ మేయర్గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ప్రమాణం.34 ఓట్లతో మేయర్ అభ్యర్థి ప్రకటనకాంగ్రెస్- 14టీఆర్ఎస్- 9ఎంఐఎం- 3ఇండిపెండెంట్స్- 8నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ :నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉమా రాణి 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన ఉమా రాణి.డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్54 డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నిక ఎంఐఎం కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ కాంగ్రెస్కు మద్దతు పలికిన బీఆర్ఎస్ కౌన్సిలర్లుకామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నిక ఇబ్రహీంపట్నం:ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతమున్సిపల్ కార్యాలయంపై రాళ్లతో దాడిఎన్నికను ఆపాలంటూ కాంగ్రెస్,బీఆర్ఎస్ ఆందోళన ఆందోళ కారుల్ని చెదరగొట్టిన పోలీసులు కౌన్సిలర్ యాదగిరి కనిపించకుండా పోవడంతో అనుచరుల ఆగ్రహం ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్తెలంగాణలో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లలో పదవుల కోసం బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పోటీ అభ్యర్థులను మభ్యపెడుతున్న పార్టీలు అభ్యర్థుల కోసం క్యాంపు రాజకీయాలు ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న హైటెన్షన్రంగారెడ్డి:ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ఒకే కారులో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన మహిపాల్రెడ్డి,రఘునందన్ రావుఎక్స్అఫిషియో ఓట్లతో బీఆర్ఎస్కు దక్కనున్న ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం తొర్రూర్ మున్సిపాలిటీ: తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవికిపై ఉత్కంఠ తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లుబీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం అంటూ ఆరోపణలు కాంగ్రెస్పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహంకాంగ్రెస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో ఏదో చేయాలని కాంగ్రెస్ చూస్తోందిఎంపీ కడియం కావ్య 2025 ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారుఎంపీ కడియం కావ్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళతాం. రాజ్యాంగ బద్ధంగా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి మాదే. జనగామ జిల్లా:తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్డగింతతొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్దకు వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన ఎంపీకాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలుబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులట.కరీంనగర్: జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ ఎన్నికలో కొనసాగుతున్న ఉత్కంఠ.జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో సహా బి అర్ ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లు ఇండిపెండెంట్లు మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్న బీఆర్ఎస్, బీఅర్ఎస్ చైర్మెన్ పీఠం దక్కించుకునే అవకాశం. కరీంనగర్:కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీకరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీబీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ఈ క్రమంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్న బీఆర్ఎస్సూర్యాపేట జిల్లా:కోదాడ మున్సిపాలిటీలో పదవి పంపకాలుచైర్ పర్సన్ ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్లో బుజ్జగింపు రాజకీయాలుమొదటి రెండు సంవత్సరాలు చైర్ పర్సన్గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబువైస్ ఛైర్మన్గా దేవారంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డిఅనంతరం మరో మూడు సంవత్సరాలుచైర్ పర్సన్గా పారా సత్యవతి సీతయ్యవైస్ చైర్మన్ గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పేర్లు ఖరారు జగిత్యాల జిల్లా:జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసంసీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరుఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని అధిష్ఠానంజీవన్ రెడ్డి, సంజయ్కు కూడా అందని సమాచారంవాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజయ్అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న జీవన్ రెడ్డి, సంజయ్ఎవరి వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నారన్న ఉత్కంఠ.కరీంనగర్: కరీంనగర్లో శరవేగంగా మారుతున్న మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు..రాత్రికి రాత్రే చక్రం తిప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కాంగ్రెస్కు మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరికానీ, చేతులెత్తి ఓటేసే విషయంలో పీఠముడిబీఆర్ఎస్ అభ్యర్థుల డిమాండ్లకు కాంగ్రెస్ సరైన స్పందన లేకపోవడంతో అలకతటస్థంగా వ్యవహరించాలని నిర్ణయం..?మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తకపోతే బీజేపీదే విజయంఉత్కంఠగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:వ్యూహ-ప్రతివ్యూహాల నడుమ మున్సిపల్ పోరుఎక్స్ అఫీషియో ఓట్లతో గేమ్ ప్లాన్గెలుపు గుర్రాలను తేల్చేది ప్రజా ప్రతినిధులేఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలుకింగ్ మేకర్లుగా స్వతంత్రులుమొయినాబాద్, ఎల్లంపేటలో హంగ్ భయంస్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు.. క్లైమాక్స్కు చేరిన మున్సిపల్ ఉత్కంఠమేడ్చల్ జిల్లా :జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే చాన్స్మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలంకాంగ్రెస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలుఎల్లంపేట లోనే మల్లారెడ్డి, ఈటల ఓట్ల నమోదుఎల్లంపేట 13-13 ఓట్లతో టై.. లాటరీ ద్వారా చైర్మెన్ ఎన్నుకుంటారా ? బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా ? అనేది ఉత్కంఠనిజామాబాద్: నిజామాబాద్ : బోధన్ మున్సిపాలిటీలో వీడిన ప్రతిష్టంభనకాంగ్రెస్, ఎం. ఐ. ఎం. మధ్య అవగాహనచైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.మున్సిపల్ చైర్మన్గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు.నిజామాబాద్:నిజమాబాద్ జిల్లాలో మేయర్,చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్,ఏడు మున్సిపాలిటీలునిజమాబాద్తో పాటు కామారెడ్డి, బోధన్లో హాంగ్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మేయర్,ఎంఐఎంకు డిప్యూటీ మేయర్కు ఇచ్చేలా కుదిరిన ఒప్పందంమేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఖరారు తొలిసారి మహిళకు అవకాశంఆర్మూర్, భీంగల్ ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యంసీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు పంపనున్న అధిష్టానం మహబూబ్ నగర్: నేడు మహబూబ్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నికమహబూబ్ నగర్ కార్పోరేషన్లో కుదరని ఏకాభిప్రాయంగంగరగోళంగా అభ్యర్దుల ఎంపికపదవి కోసం మైనార్టీల పట్టుహంగ్ నేపద్యంలో గద్వాల,నారాయణ పేట,అమరచింతలో ఉత్కంఠతక్యాంపుల నుంచి నేరుగా సమావేశలకు గెలిచిన అభ్యర్దులుఖమ్మం..మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తికౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎన్నికఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్కేచైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ..నేడు పేర్లు ప్రకటించనున్న ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖకొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ ,కాంగ్రెస్ల మధ్య కుదిరిన ఒప్పందంమొదటి రెండున్నర ఏళ్ళు సీపీఐకి మేయర్..కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్తర్వాత రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్కు మేయర్ సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్లో60 డివిజన్లో పార్టీల వారీగా గెలిచిన స్థానాలుకాంగ్రెస్ 22, సిపిఐ 22 ,బి ఆర్ ఎస్ 8, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు 6చోట్ల గెలుపొందారుఇందులో ఐదుగురు స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికజాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్తో నడవాలని నిర్ణయించుకున్న సీపీఐఅంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపద్యంలో సిపిఐకి బహిరంగంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నిజమాబాద్ జిల్లా:నేడు జిల్లాలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, ఉత్తమ్ పర్యటననిజమాబాద్ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో గా ఓటు హక్కు వినియోగించుకోనున్న మహేష్ కుమార్ గౌడ్మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనున్న మంత్రులు.నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కొలువుదీరనున్న పాలకవర్గాలుఉదయం 10 గంటలకు సమావేశం. అనంతరం సభ్యుల ప్రమాణంక్యాంపుల నుంచి నేరుగా సమావేశానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుపలు మున్సిపాలిటీల్లో ఇంకా చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎవరో రాని స్పష్టతనల్లగొండ మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.ఇక్కడ డిప్యూటీ మేయర్ గా మైనార్టీ, బీసీ వర్గాలకు అవకాశందేవరకొండ చైర్ పర్సన్ గా పున్నా శైలజకు అవకాశం?హాలియా చైర్మన్ గా చింతల చంద్రారెడ్డినందికొండ చైర్ పర్సన్గా మానసస్వర్ణమిర్యాలగూడ నుంచి పోటీలో నలుగురుచండూరు చైర్మన్గా కోడిశ్రీనివాస్చిట్యాల చైర్ పర్సన్గా పందిరి గీతకు అవకాశంనేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన వెంకటరెడ్డి. వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డికోదాడ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు. పోటీలో ఐదుగురుసూర్యాపేట చైర్ పర్సన్గా మొరిశెట్టి నివేదితతిరుమలగిరి చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రుఘునందన్ రెడ్డిహుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో స్పష్టత కరువు.భువనగిరి చైర్ పర్సన్ గా గంజి శ్రీవాణి, బర్రె పూజిత, పోతంశెట్టి మంజులలో ఒకరికి అవకాశంచౌటుప్పల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువుమోత్కూరు చైర్ పర్సన్ కోసం ముగ్గురు పోటీఆలేరు చైర్ పర్సన్ పోటీలో ఇద్దరుయాదగిరిగుట్ట చైర్ పర్సన్ గా వాణి ఎంపిక దాదాపు ఖరారేపోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేష్ కు అవకాశం -
మంత్రులు, పీసీసీ చీఫ్తో సీఎం జూమ్ మీటింగ్
హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో మీపాత్ర మరవలేనిది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాభవన్లోసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అందుకే దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రం కోసం సురేష్ నాయక్, కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడీల పాత్ర మరవలేనిదన్నారు. అందుకే తండాలలో రోడ్డు లేకుండా ఏ తండా ఉండకూడదని అన్ని తండాలకు బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాను zptc అభ్యర్థి గా పోటీ చేసినప్పుడు తండా ల్లో ఉన్న యువకులు తన విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారన్నారు. పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం రేషన్ కార్డని సీఎం తెలిపారు. కార్డు ఉన్నవారందరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.9,000 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.ఇటీవల జరిగిన గ్రూప్-1పై అక్రమ కేసులు వేస్తే పోరాడి ఉద్యోగాలు ప్రకటించామన్నారు. గ్రూప్-1లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. దీనిపైన ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కపెట్టుకోవాలని సీఎం సవాల్ విసిరారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారని, అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనులకు భూములు పంచారన్నారు. తమ ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని అందుకే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి గొప్పస్థానాలకు ఎదగాలన్నారు. -
బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన ప్రతిచోటా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్లో ఉన్నాయని సింగరేణిలో కొన్నిచోట్ల బీజేపీ, సీపీఐ సైతం కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. -
కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..
హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్లో నివాసముంటున్న సతీష్(45), విజయ్కుమార్, రాజులు ఈ నెల 9న కారులో వెళుతుండగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్ను ఢీకొట్టడంతో అతను బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని అందులో ఉన్న మహేష్ తరుణ్లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం. -
అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్ నగర్లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సిటీ శివారులో రియల్ ఎస్టేట్ డిమాండ్!
వీకెండ్ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్ హోమ్స్ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఎవరు కొంటున్నారంటే.. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.అద్దెకు కూడా.. వీకెండ్ హోమ్స్ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.ఈ ప్రాంతాలలో డిమాండ్.. నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్పల్లి, జహీరాబాద్ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. -
కోకాపేటలో కొత్త రియల్ఎస్టేట్ ట్రెండ్..
విలాసవంతమైన గృహ విభాగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గృహ కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సంస్థలు ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవసీ, భద్రత, గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచి్చన బిల్డర్లు.. ఇప్పుడు కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. లగ్జరీ ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసుల నుంచి ఈ తరహా ఇళ్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో ఇటువంటి ఫైవ్ స్టార్ హోమ్స్ వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్ వాడటంతో అర్థమే మారిపోయింది. కొందరు మాత్రమే ఈ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండటంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీకి పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదు నక్షత్రాల రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు నివాసం ఉండేవారికి స్టార్ హోటల్ మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి.హోటల్స్, ఫ్యాషన్ డిజైనర్లతో ఒప్పందం ఇంటర్ కాంటినెంటల్, మారియట్, తాజ్, రిడ్జ్, కార్ల్టన్, లీలా వంటి స్టార్ హోటల్ బ్రాండ్స్, అబూజానీ, సందీప్ ఖోస్లా వంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం చేసుకొని గృహ నిర్మాణాలను చేపడుతున్నాయి. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. నివాసితులకు అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని అందించడమే ఈ గృహాల ప్రత్యేకత.హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కరోనా నుంచి నగరంలో హైఎండ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి నేటి యువ గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు, ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్కు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఇళ్ల కొనుగోలుదారులు సెకండ్ లేదా థర్డ్ హోమ్ బయ్యర్లు ఉంటారు. ఇందులో నివాసం ఉండటం స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు. హైటెక్ సిటీ, గచి్చ»ౌలి, రాయదుర్గం, నియోపొలిస్, నానక్రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్, మదీనాగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. వీటి విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభవుతుంది. ధర రూ.6 కోట్ల నుంచి ఉంటుంది.వీటి ప్రత్యేకతలివే.. స్టార్ హోమ్స్ అంటే హోటల్ ఆధారిత ప్రాజెక్ట్లు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే నిర్వహిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేకంగా యాప్ ఉంటుంది. ఇందులో నుంచి ఫుడ్, స్పా, సెలూన్ వంటివి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్మెంట్కు వచ్చి సర్వీస్ చేస్తారు. అలాగే వీటిల్లో సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, బ్యూటీఫుల్ వ్యూ, స్కై లాంజ్, స్పా, మినీ థియేటర్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.ప్రైవసీ, భద్రత..ప్రైవసీ, భద్రత ఈ ప్రాజెక్ట్ల ప్రత్యేకత. వెంటిలేషన్, ఓపెన్ స్పేస్, వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఈ డిజైనర్ హోమ్స్లో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. -
అజిత్ ఎక్కడ.. ఏటీఎం దొంగ వేటలో పోలీసులు!
గచ్చిబౌలి: రూ.60 లక్షలతో ఉడాయించిన సీఎంసీ వాహన డ్రైవర్ అజిత్ కుమార్ అలియాస్ శివ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. భారీ నగదుతో పరారైన నిందితుడు ఎక్కడికి వెళ్లాడనే క్లూ ఇంకా లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నాయి.గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో గోపన్పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి భారీ నగదుతో అజిత్ పరారైన విషయం తెలిసిందే. తెల్లాపూర్లో గద్దర్ చౌరస్తాలో వాహనం వదిలి వెళ్లిన అజిత్ ఓ ఆటోలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అశోక్నగర్లో ఓ లాడ్జీకి వెళ్లిన నిందితుడు.. పెట్టె పగుల గొట్టి అందులోని నగదును బ్యాగ్లోకి సర్దుకొని బస్సులో వెళ్లి మియాపూర్లో దిగి ఐడీఏ బొల్లారం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బొల్లారం, బాచుపల్లి పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్డేటా ఆధారంగా దర్యాప్తు అజిత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరో బృందం దర్యాప్తు చేస్తోంది. భారీ నగదుతో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. గత ఏడేళ్లుగా తిరుమలగిరిలోనే ఉంటున్న అజిత్ ఆధార్ కార్డు మాత్రం బెంగళూర్లో తీసుకున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ఆరు నెలల క్రితమే సీఎంసీ వాహనంలో డ్రైవర్ డ్యూటీలో చేరిన అజిత్ పక్కా ప్లాన్ తోనే రూ.60 లక్షల నగదు ఉన్న వాహనంతో పరారైనట్లు తెలుస్తోంది.పెట్టెలో ఉన్న నగదును తీసుకు వెళ్లేందుకు తన వద్ద బ్యాగ్ను ముందే సమకూర్చుకున్నట్లు సమాచారం.దాదాపు 7 ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేశారు.కస్టమర్లు ఏటీఎంలో డిపాజిట్ చేసిన నగదును తీసి వాహనంలోని బాక్స్లో భద్రపరుస్తారు. చివరి ఏటీఎంకు వచ్చే సరికి డిపాజిట్ మొత్తం భారీగా ఉందని నిర్ధారించుకున్న తరువాతే అదును చూసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ముందే చెప్పాలి..ఇండిగో సిబ్బందిపై ఆగ్రహాం
సాక్షి హైదరాబాద్: శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది తీరుపై ప్రయాణికులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం విమానాశ్రయం నుంచి 8.20 గంటలకు ఫ్లైట్ బాగ్డోగ్రా వెళ్లాల్సిఉంది. అయితే ఇండిగో సిబ్బంది ఉదయం 7.40 గంటలకే గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేట్ వద్ద 50 మంది వరకూ ప్రయాణికులు వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డింగ్ సమయంలో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమాన సమయాల్లో ఎవైనా మార్పులుంటే ముందుగా సమాచారం ఇవాల్సిందని ఆగ్రహాం చెందారు. కాగా కొద్ది నెలల క్రిత ఇండిగో నిర్లక్షంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. -
ఆ గాలి పీల్చితే రోగాలే
సాక్షి, హైదరాబాద్: నగరంలో గాలి కాలుష్యం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) వందలు దాటి వేలల్లో నమోదవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఏక్యూఐ 50 వరకు ఉంటే సేఫ్, 200 దాటితే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఏక్యూఐ ఏకంగా 1,651గా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం మణికొండ, ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో నమోదైన వివరాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ గాలి పీలి్చతే శ్వాసకోశ వ్యాధులు తథ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో ఏక్యూఐ గరిష్టంగా 500గా ఉంటోంది. అలాంటిది హైదరాబాద్లో దానికి మూడున్నర రెట్లు పెరగడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. మణికొండలో నిర్మాణ రంగ పనులు జోరుగా సాగుతున్నాయి. కొండప్రాంతాల్లో తవ్వకాలు, మట్టి, గ్రావెల్, నిర్మాణ సామగ్రి తరలింపుతో రహదారులు నిత్యం దుమ్ముతో నిండిపోతున్నాయి. ఈ దారిలో వెళ్లాలంటేనే భయమేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. కళ్లలో దుమ్మూ ధూళితో నిండిపోతున్నాయి. దుస్తులు, శరీరంపై పిండి పడ్డట్లు దుమ్ము చేరుతోందంటున్నారు. రెడీమిక్స్ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బల్దియా ఎన్నికలు జూన్లో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పుర పోరు ఫలితాలతో జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్.. మహా నగరంలోనూ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇదే ఊపుతో విజయం సాధించవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు నగర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలనుకున్నా కనీసం ఐదారు నెలలు ఆగక తప్పని పరిస్థితులున్నాయి. అందుకు తగిన కారణాలున్నాయి. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియగానే, కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో అవి కుదురుకునేందుకు ఆర్నెల్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎంత త్వరపడినా కనీసం మే నెల వరకైతే ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. మే ఆఖరు దాకా.. కాంగ్రెస్ ఎంత తొందర పడినా.. ఎన్నికల నిర్వహణకు ముందు ప్రీ–ఎలక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు దాదాపు మూడు నెలలు పట్టనుంది. మహా నగరంలోని 300 వార్డులు మూడు కార్పొరేషన్లుగా మారడంతో.. తిరిగి వార్డు నంబర్లు మారనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వార్డుల వారీగా జనాభా, రిజర్వేషన్లు, తాజా ఓటరు జాబితా తదితర పనులు చేయాల్సి ఉంది. కొన్ని వార్డుల సరిహద్దులకు సంబంధించి మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని మున్సిపల్ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తిచేసి, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు వివిధ అంశాలను బేరీజు వేస్తే ఎంత త్వరగా చేసినా మే ఆఖరు వరకు సమయం పడుతుంది.కొత్త కార్పొరేషన్లలో సమస్యలు మరోవైపు.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీఎం) బాలారిష్టాల్లో ఉన్నాయి. ఇంకా వాటి కార్యాలయాల పనులు, సిబ్బంది నియామకాలే పూర్తికాలేదు. చేయాల్సిన మౌలిక సదుపాయాల పనులు చాలా ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు జీతాలకు సైతం ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిధులపైనే ఆధారపడ్డాయి. ఎన్నికలు ఆలస్యమయ్యేకొద్దీ, ప్రజలు ఆశించిన సదుపాయాలు అందుబాటులోకి రాక, వ్యతిరేకత పెరిగేందుకు అవకాశముంటుంది. త్వరితంగా ఎన్నికలు జరిగితే కనీసం చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక.. బహుశా జూన్లో నగరంలోని మూడు బల్దియాలకు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జూన్ రెండో వారం వరకు పాఠశాలలకు సెలవులుంటాయి. సాధ్యమైనంత వరకు ఆలోగా ఎన్నికలకు వెళ్లే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. -
మంత్రి పదవి ఇవ్వకుంటే నా టార్గెట్ అదే
హైదరాబాద్: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి. లేదంటే నా టార్గెట్ అదే’ అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిని ప్రస్తావిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి ఇస్తానంటే ఇంకా ఆగుతానని.. అదే సమయంలో పదవి గురించి తాను బాధపడటం లేదని చెప్పారు. ఇకపై మునుగోడు నియోజకవర్గాన్ని పార్టీ కార్యకర్తలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాను చూసుకుంటానన్నారు. సమయం వచ్చి నప్పుడు జెండా ఎగురవేద్దామని వ్యాఖ్యానించారు. ‘సమయం వస్తుంది.. అది కూడా నెరవేరుతుంది’ అని అన్నారు. -
చలో కొలంబో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో భారత్–పాక్ మ్యాచ్ సెగలు పుట్టిస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ హై–వోల్టేజ్ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. ఈ విపరీతమైన రద్దీని క్యాష్ చేసుకుంటూ ఎయిర్లైన్స్ సంస్థలు చార్జీలను ఆకాశానికి ఎత్తేశాయి.శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకు నేరుగా వెళ్లే విమానాల్లో టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణ రోజుల్లో రూ.13,000 ఉండే రౌండ్ ట్రిప్ ధర.. ఇప్పుడు ఏకంగా రూ. లక్షకు చేరింది. డైరెక్ట్ ఫ్లైట్స్ దొరక్కపోవడంతో బెంగళూరు, చెన్నై మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ప్రయాణికులు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చిస్తున్నారు.పనిలో పనిగా పర్యాటక ప్రాంతాల సందర్శనకేవలం క్రికెట్ కోసమే కాకుండా, శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు రియల్టర్లు, వ్యాపారవేత్తలు, యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. కొలంబోలోని 5–స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోగా, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.క్యాండీ వంటి సుందర ప్రదేశాలు, క్యాసినోల సందడికి తోడు ‘దాయాదుల పోరు’ కూడా తోడవ్వడంతో శ్రీలంక పర్యాటకం ఒక్కసారిగా కళకళలాడుతోంది. మ్యాచ్ టికెట్ దొరకడం ఒక ఎత్తైతే.. కొలంబో ఫ్లైట్ ధర భరించడం మరో ఎత్తు! అయినా సరే, మైదానంలో టీమ్ ఇండియాకు మద్దతు తెలపడానికి ఫ్యాన్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. -
రంజాన్కు రెడీ!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ ఉపవాస దీక్షలకు నగరంలోని ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న నెలవంక కనిపిస్తే 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. నగర రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడి పసందైన వంటకాలకు మంచి పేరుంది. రంజాన్ మాసంలో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణ ఉట్టిపడుతుంది. హలీం తయారీ ఏర్పాట్లు షురూ అయ్యాయి. హలీం తయారీలో కీలకమైన గోఠా, డెకీసాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఛత్తబజార్లో అన్వర్ తయారు చేసిన గోఠాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాలోనూ డిమాండ్ ఉంది.అన్ని హోటళ్ల వద్ద నిర్వాహకులు హలీం బట్టీలను నిర్మిస్తున్నారు. ఫంక్షన్ ప్యాలెస్లు, మైదానాల్లో కూడా హలీం బట్టీలు ఏరాటు చేస్తున్నారు. హలీంలో గోధుమలు, మటన్, నెయ్యి, మసాలాలు కీలకం. అయితే ఈసారి కొంతమంది తయారుదారులు ఎక్కువ కొవ్వు లేకుండా ఆర్యోగానికి మేలు కలిగించే మిల్లెట్స్, వోట్స్, వెజిటెబుల్తో తయారు చేస్తున్నట్లు ఓ హోటల్ నిర్వాహకుడు తెలిపారు. ప్రొటీన్స్, తక్కువ మసాలాలతో ఆరేబియన్, యమనీ, సోమాలీ తదితర వెరైటీల్లో హలీం అందుబాటులోకి రానుంది. 5 వేలకుపైగా విక్రయకేంద్రాలు నగరంలో 5 వేలకుపైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి నూనె, పప్పులు, మటన్, చికెన్తోపాటు మసాలాల ధరలు ఎక్కువగా ఉండటంతో హలీం ధరలు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందని నిర్వాహకులు అంటున్నారు. గతంలో 280 వరకు ఉండగా ఈసారి ధర 320 వరకు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.మసీదుల్లో ఏర్పాట్లు నమాజ్ల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మసీదు కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులకు సున్నాలు, కలర్ పెయింటింగ్ పూర్తి చేశారు. వజూఖానాల మరమ్మతులతోపాటు మంచినీటి సౌకార్యం కోసం కూలర్లు అమర్చుతున్నారు. మసీదు ప్రాంగణాల్లో షామియానాలు, రెకులòÙడ్లు అమర్చారు. ఇఫ్తార్ విందులకు ఇప్పటికే ప్రణాళికలు చేసుకొని రోజువారీ దాతల పేర్లు ఖరారు చేశారు. రాత్రి ఇషా నమాజ్ అనంతరం మసీదుల్లో తరావీ నమాజ్లు చేస్తారు. తరావీ నమాజ్లో హఫేజ్ (ఖురాన్ కంఠస్థం చేసినవారు) ఖురాన్ వినిపిస్తారు. అన్ని మసీదుల్లో హఫేజ్ల నియామకాలను మసీదు కమిటీలు పూర్తి చేసినట్లు జహారానగర్ మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్ బాకర్ సాహెబ్ తెలిపారు. -
ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం
-
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యలపై రగడ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతామని వీహెచ్ తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసనకు దిగారు. ఆటో కార్మికులు ఏం చేస్తారంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. -
హైడ్రా కూల్చివేతలు..మాదాపూర్లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ ఖానామెట్లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేయడంపై ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అక్రమ నిర్మాణాలను హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలోనే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే పలు చోట్ల మాత్రం హైడ్రా చర్యలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎప్పట్నుంచో ఇక్కడ ఉంటుంటే హఠాత్తుగా హైడ్రా పేరుతో ఈ తొలగింపులేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. ప్రధానంగా బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. -
Bharat Bandh: ఇది ఆరంభం మాత్రమే... బీజేపీకి మాస్ వార్నింగ్
-
కూతురుని చూసేందుకు వచ్చిన తల్లికి అవమానం
-
మూసీలో ముందడుగు.. నిర్వాసితులకు పరిహారం
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్–టీడీఆర్) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు. పట్టా భూములకు టీడీఆర్ సర్టిఫికెట్లు.. సుందరీకరణలో సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్ సరి్టఫికెట్లను అందజేయనున్నారు. సుందరీకరణ ఇలా.. ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చి్రల్డన్స్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ది చేస్తారు. -
బన్నీ ఫ్యాన్స్ సడన్ మీటింగ్ దేని గురించి అంటే...!
-
స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!
ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్ ఆ కొరత తీర్చింది. సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్. నౌబత్ పహాడ్ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.పాలరాతి సొగసుల మందిరం... పూర్తిగా రాజస్థాన్ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో విలక్షణంగా కనిపిస్తుంది. బిర్లా మందిర్లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్ మంచి స్పాట్.హైదరాబాద్ ఎక్స్కర్షన్...! అందులో బిర్లా మందిర్ విజిటింగ్..! ఇదీ స్కూల్ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్ బుక్స్లోనూ బిర్లా మందిర్ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. కొత్త జంటలకు ఫేవరెట్ కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్ స్పాట్ బిర్లా మందిర్. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్లో హార్ట్ బీట్ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! ఇంకేం వీకెండ్ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.ప్రత్యేకతలు ఇవి 1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నౌబత్ పహాడ్పై బిర్లామందిర్ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది. 24 నుంచి స్వర్ణోత్సవాలు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.– సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ -
ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి.. యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాబాద్లో నివాసం ఉండే పల్లవి షిండే (26) ఇటీవల 8న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్లోని కోడ్ జెన్స్ టెక్నాలజీలో ఉద్యోగంలో చేరింది. 9న ఉదయం 9.20 గంటలకు ఉద్యోగం నిమిత్తం విధులకు హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రం 8 గంటలకు ఫోన్ చేసి.. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని, ఇంటికి వస్తున్నానని చెప్పింది. అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రారండి.. కేరళ (ఫొటోలు)
-
Hyderabad: భూకంపమా.. కాదా?
హైదరాబాద్: గాజులరామారంలోని మెట్కానిగూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 10. 20 గంటల సమయంలో మెట్కానిగూడ, హెచ్ఏఎల్, ఓక్షిత్ ఎన్క్లేవ్, ఆదర్శనగర్ కాలనీలలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించడంతో అపార్ట్మెంట్లు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుంపులుగా చేరారు. భూమి కంపించడంతో స్థానిక పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కొద్దిసేపటి దాకా ఇళ్లలోకి పోయేందుకు స్థానికులు భయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు భూకంపమా..? లేక ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఏ విషయమూ అంతు చిక్కలేదని సూరారం సీఐ సుధీర్కృష్ణ తెలిపారు. ప్రగతి నగర్లోని ఇన్కాయిస్ అధికారులకు సంప్రదించగా.. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
‘అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు ఎందుకు డిమాండ్ చేయరు?’
హైదరాబాద్: కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తీసుకొని పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూబ్లిహిల్స్ ప్యాలెస్లో కూర్చొని కళ్లప్పగించి చూస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ఈరోజ(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్రావు.. కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్సీ.. కేఆర్ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని హరీష్ స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్రెడ్డి కాపాడాలని, ఈఎన్సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని హరీష్ మండిపడ్డారు. -
బైక్ పై పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే .. హైదరాబాద్ యువతకు సజ్జనార్ వార్నింగ్
-
హైదరాబాద్ లో భూకంపమా! భయంతో జనం పరుగులు
-
గాజుల రామారంలో భారీ శబ్ధంతో భూ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: గాజుల రామారంలో భారీ శబ్ధంతో భూ ప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. మెట్కాన్ గూడెంలో ఉదయం 10 గంటల సమయంలో భారీ శబ్ధంతో భూమి కంపించిందంటూ స్థానికుల చెబుతున్నారు. క్వారీ బ్లాస్టింగా? భూంకపమా? అనే దానిపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.శబ్ధాలు రావడంతో ఉలిక్కిపడిన గేటెడ్, అపార్ట్మెంట్ వాసులు రోడ్లపైకి వచ్చారు. స్థానికంగా ఉన్న పాఠశాలలకు స్కూల్స్ యాజమాన్యం సెలవు ప్రకటించాయి. -
Hyderabad: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని... మహాదేవప్ప సూసైడ్ లెటర్ రాయలేదని.. విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కాగా, మక్తల్ పట్టణ కేంద్రంలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో తాత్కాలింగా ఆ వార్డు ఎన్నిక మాత్రమే రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
చిన్నారి చిత్రకారిణి.. ప్రతిభలో మేటి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బాలిక వేసిన పెయింటింగ్ విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది. నిజాంపేట్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పెయింటింగ్లో శిక్షణ పొందిన విశ్వేశ్వరరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ప్రవ్య ఆదిత్రి నాలుగు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు మొత్తం 20 అడుగుల కాన్వాస్పై కేవలం 12.44 నిమిషాల్లో శివుడి పెయింటింగ్ (Lord Shiva Painting) వేసి ఆదివారం ఈ రికార్డును సొంతం చేసుకుంది.బంజారాహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి, రిటైర్డ్ ఎస్పీ ఎస్ఎం రత్న, డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్ సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు సమక్షంలో అతి తక్కువ సమయంలో శివుడి పెయింటింగ్ వేసి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రతిభను తిలకించిన అతిథులు సన్మానించి అభినందనలు తెలిపారు. చదవండి: నో ఫోన్ చాలెంజ్.. 2 వారాల్లోనే అనూహ్య మార్పు -
అత్తాపూర్: కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మూడుకార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50కి పైగా కార్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలన అదుపు చేశారు.అర్ధరాత్రి 1: 30 సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించగా.. మంటలను గమనించిన స్థానికులు.. ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలన అదుపు చేశారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదమే తప్పింది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు… ఉద్యోగం కూడా పోతుంది!
-
డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..
-
సాఫ్ట్ వేర్ విజయశాంతి రెడ్డి కేసులో న్యూ ట్విస్ట్..
-
హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)
-
రూ. 5వేల కోట్ల గేమింగ్ స్కాం.. గుట్టురట్టు
హైదారాబాద్్లో భారీ ఆనే లైన్ గేమ్ స్కాంను DGGI అధికారులు గుట్టు చేశారు. ఫిన్ టెక్ ముసుగులో దాదాపు రూ. ఐదు వేల కోట్ల ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒపినియన్ వెబ్ సొల్యూషన్స్, వెబ్ విన్ సొల్యూషన్స్ అనే నకిలీ షెల్ కంపెనీలకు నిధులు నిధుల మళ్లించినట్లు పేర్కొన్నారు.దుబాయి కేంద్రంగా ఆన్ లైన్ గేమ్ దందా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఓటీపీలు లేకుండా నిధులు మళ్లీంచే టెక్నాలజీ వాడి డబ్బులను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జీఎస్టీని ఎగ్గోట్టడానికి ఎస్క్రో ఖాతాలను వాడినట్లు సమాచారం. విగోఫిన్ డైరెక్టర్లు ప్రభుకూమార్, రాజశేఖర్ రెడ్డిలపై పాత్రపై అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. funinmatch360 మరియు raceje-et247 వెబ్సైట్ల ద్వారా అక్రమంగా ఆ దందా సాగినట్లు తెలిపారు. బ్యాంకింగ్ ఏపీఐలను దుర్వినియోగం చేసి, ఆడిట్కు దొరక్కుండా కేటుగాళ్లు జాగ్రత్తపడ్డట్లు అధికారులు తెలిపారు . -
‘నంబర్’ ప్లేట్ ఫిరాయించాడు
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించకపోడం సహా పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ఈ–చలాన్లు తప్పించుకోవడానికి తన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లో ఓ సంఖ్యను మార్చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఈ– చలాన్లు మరో వాహనం యజమానికి వెళ్లాయి. ఆయన ఫిర్యాదుతో ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ ద్విచక్ర వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్11ఈజెడ్ 2936. ఈ–చలాన్లు తప్పించుకుపోవడానికి ఉద్దేశపూర్వకంగా దాన్ని టీఎస్11ఈజెడ్ 2836గా మార్చాడు. దీంతో ఇతడు చేసిన ఉల్లంఘనలకు సంబం«ధించిన చలాన్లు ‘2836’ వాహన యజమాని ఫహీమ్ అలీకి వెళ్లాయి. ఇలా దాదాపు 23 చలాన్లు అందుకున్న ఆయన చివరకు నగర ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధ్యుడిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాలను పరిశీలించి అలీవుద్దీన్ ఆచూకీ కనిపెట్టారు. నిందితుడిపై చాదర్ఘాట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కోర్టులో నిరూపితమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ వాహనం నంబర్ ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే వెబ్సైట్: ఈ– చలాన్ తప్పించుకోవడానికి ఎత్తుగడ ఈమెయిల్: echallan helpdesk.hyd@gmail.com, వాట్సాప్: 87126 61690లకు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ సూచించారు. -
FSL అగ్నిప్రమాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో అగ్నిప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదం సీఎం రేవంత్ పనే. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్రలు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మయం చేసేందుకు ఇలా చేశారు.తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా చేశారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణిచ్చారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉన్న జిల్లాలను తొలగించేది లేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదు. జిల్లాల పునర్వవస్థికరణ కోసం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు’ అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.గత జనవరిలో సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. -
కన్న బిడ్డలను చంపుకున్న ఇద్దరమ్మల కన్నీటి కథ..
-
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
-
ప్రమాదం ప్రభుత్వమే చేసిందా? కాలిబూడిదైన కీలక ఆధారాలు
-
నాంపల్లి ప్రమాదం.. 2015 కేసు ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. -
నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆదివారం ఉదయం ల్యాబ్ను సీజ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రానున్నారు. ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.కాగా, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో నేడు మరోసారి క్లూస్ టీం ఎస్పీ తనిఖీలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరు ఉన్నారు? అనే దానిపై ఎస్పీ ఆరా తీయనున్నారు. అలాగే, కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించనున్నారు. మరోవైపు.. కార్యాలయంలో అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం. చేశారు. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ట్యాప్లు, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం దాగి ఉందా అని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ గదిలోంచి ఉదయం 10.30 గంటలకు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆఫీస్బాయ్ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్ మాన్, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీ శ్వేతారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘కేసు సంబంధిత ఆస్తి, ఎఫ్ఎస్ఎల్కు చెందిన సామగ్రి సురక్షితంగానే ఉందని జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం’ అని శిఖా గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.ఎఫ్ఎస్ఎల్ ఎంతో కీలకం వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం. -
అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గెలుపులో నగర కుర్రోడు
మల్లాపూర్/కాప్రా: హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్లో మైమరిపిస్తూ.. ఫ్లిక్లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ స్టయిల్ను ప్రపంచానికి చాటాడు. బిహార్కు చెందిన మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి టీమ్ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్ బ్యాటింగ్తో అరోన్ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్లో నివసిస్తోంది అరోన్ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్. కేరళకు చెందినవారైనా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అరోన్ అండర్–19 హైదరాబాద్ జట్టు కెప్టెన్ కూడా. ప్రపంచ కప్లో అఫ్ఘానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్–19 క్రికెట్లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్ ప్రస్తుతం సైనిక్పురి భవన్స్ కాలేజీలో బీకాం (ఫైనాన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్ చేశాడు. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్ రానున్న అరోన్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు. -
దోమలు చంపుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా 4,846 కాలనీల్లోని నీటినిల్వ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, సెల్లార్లల్లో దోమల నివారణ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ యంత్రాంగం చెబుతున్నా నగరవాసులకు దోమకాటు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీడైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యంగ్య వీడియో చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో దోమల వల్ల నటులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ఆ వీడియోలో చూపించారు. నగరంలోని దోమలబెడద,ప్రజల బాధను ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల కూకట్పల్లికి చెందిన ఓ ఇంజినీరు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. చెరువుల్లో గుర్రపుడెక్క నిర్మూలన పనుల బిల్లుల వ్యవహారం కావడంతో అది కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ pic.twitter.com/U0orlNGngM— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026 -
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్.. రూ. 56 కోట్లు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు సమీపంలో బహదూర్పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్ లేఅవుట్లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్ స్వగహ కార్పొరేషన్కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్! -
ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.➤2024లో గ్రేటర్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
గజ్వాల్లో హై టెన్షన్.. హరీశ్రావుకు నిరసన సెగ
-
గ్రీన్ గోదాంలకే డిమాండ్.. ఈ ఏడాది భారీ లీజులు!
భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగంలో డిమాండ్ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.పట్టణాల్లోనూ.. తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.హైదరాబాద్లో.. గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్హౌస్ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్హౌస్ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లో 22 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది. -
నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం
-
వెంటాడిన అజ్ఞాత వ్యక్తి! ఆత్మహత్య కు కారణం అదే..
-
మాదాపూర్ : శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్మేళా –2026 (ఫొటోలు)
-
పవన్ ప్రచారం చేస్తే.. మైనస్సే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు. -
ఐస్క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)
-
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టరి్మనల్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చెందిన శంషాబాద్.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్ హబ్గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్(త్రిబుల్ ఆర్)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లలో రాజీవ్గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్ ట్రాన్సిట్ ఆఫీస్గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్ హబ్తో శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్లకు, కార్పొరేట్లకు సీ–సూట్కు ట్రాన్సిట్ ఆఫీస్గా మారుతుంది. ఫైవ్స్టార్ హాస్పిటాలిటీ, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి. -
ఇక ఆర్ఆర్ఆర్ 161 ఏఏ
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరును కేటాయించింది. 161ఏఏ నంబరును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ, ఆ తర్వాత రోడ్డును నాలుగు వరుసలకే కుదించడంతోపాటు కొన్ని మార్పులు చేయటంతో అందులో జాప్యం జరిగింది. టెండర్ల ఫైనాన్షియల్ బిడ్ను తెరవాలంటే రోడ్డుకు జాతీయ నంబరు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ అవాంతరం కూడా తొలగింది. దీంతో ఇక టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించటమే తరువాయి. ఆ రోడ్డు నంబరు దీనికి...ప్రస్తుతం సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏఏ నంబరు ఉంది. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం కూడా దానికి సమాంతరంగా సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్న విషయం తెలిసిందే. రీ జినల్ రింగురోడ్డు జాతీయ రహదారిగా రూపొందనున్నందున, అదే మార్గంలో మరో జాతీయ రహదారి అవసరం లేదు. దీంతో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్ర స్తుత రోడ్డుకు జాతీయ రహదారి హోదా తొలగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోకి తిప్పి పంపనున్నారు.దీంతో దానికి ఉన్న 161 ఏఏ జాతీయ రహదారి నంబరును రీజి నల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి కేటాయించారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ప్రస్తుత జాతీయ రహ దారి ఇక రాష్ట్ర రహదారిగా మారుతుంది. రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు సంగారెడ్డి–, చౌ టుప్పల్ రోడ్డును అందులో భాగంగా అభివృద్ధి చేయాలని భావించారు. పూర్తి కొత్త రోడ్డు(గ్రీన్ఫీల్డ్)గా కాకుండా బ్రౌన్ఫీల్డ్ రోడ్డుగానే దాన్ని నిర్మించాలన్నది తొలి ఆలో చన. తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్వే స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడు అది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది.పట్టణాల మీదుగా కొన సాగుతున్న ప్రస్తుత రోడ్డు అందుకు సరిపోదు. దీంతో దాన్ని రీజినల్ రింగురోడ్డుగా మార్చాలన్న ఆలోచనను విరమించుకున్నారు. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం వద్ద ఎన్హెచ్–65 నుంచి ఉత్తర రింగు మొదలై, అదే ఎన్హెచ్–65 మీదే ఉన్న చౌటుప్పల్ సమీపంలోని తంగేడుపల్లి వరకు కొనసాగుతుంది. మహారాష్ట్రలోని అకో లా నుంచి సంగారెడ్డి వరకు ఉన్న జాతీయ రహదారికి 181 నంబరు ఉంది. అక్కడి నుంచే రీజినల్ రింగురోడ్డు మొదలు కానున్నందున అదే నంబరును కొన సాగిస్తున్నారు.సాధారణంగా ఇలాంటి అనుసంధాన రోడ్డు నంబరుకు ఏ అన్న ఆంగ్ల అక్షరాన్ని జోడిస్తారు. కానీ, ఇప్పటికే మహారాష్ట్రలోని అకోట్ నుంచి బీదర్ వరకు ఉన్న జాతీయ రహదారికి 161ఏ కొనసాగుతోంది. దీంతో కొత్త రోడ్డుకు 161ఏఏ ఖరారు చేశారు. కేంద్ర రహదారుల శాఖ అధీనంలోని జాతీయరోడ్ల వరసలో ఈ కొత్త రోడ్డు 402వదిగా గెజిట్లో చూపారు.ఈ నెలలోనే పీపీపీఏసీ భేటీ... రోడ్డు నిర్మాణానికి ఆమోదం...ఇప్పటికే కేంద్ర జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి స్థాయిలో రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి ఆమో దం లభించింది. దీనికి నిధులు విడుదల కావాలంటే, కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)ఆమోదం అసవరం. ఈ నెలాఖరుకు ఆ సమావేశం ఉంటుందని సమాచారం. రోడ్డు నంబరు కూడా కేటాయించినందున ఇక టెండర్లు తెరిచేందుకు పీపీపీఏసీ ఆమో దముద్ర వేయనుంది. దీంతో నిర్మాణ సంస్థతో ఒప్పందానికి మార్గం సుగమమవుతుంది. ఆగస్టు నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వీలుంది. -
హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్: పెరిగిన ఇళ్ల ధరలు
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.హైదరాబాద్లో 8 శాతం ధరల వృద్ధి2025లో హైదరాబాద్లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చింది.బెంగళూరు ముందంజదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.2026పై అంచనాలుప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది. -
బకాయిలపై రెడ్ నోటీస్.. పీటీపీపై జీహెచ్ఎంసీ ఫోకస్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు సిద్ధమైంది. రెడ్ నోటీసుల జారీకి శ్రీకారం చుట్టింది. తొలుత జోన్లు, సర్కిళ్ల పరిధిలో భారీ బకాయిలున్న వారిని గుర్తిస్తున్నారు. ఇంకా ఆస్తిపన్ను చెల్లించని వారందరికి కూడా వీటిని జారీ చేయనున్నారు. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే రెడ్ నోటీసుల జారీ ప్రారంభం కాగా, మిగతా సర్కిళ్లలోనూ సిద్ధమవుతున్నారు. రెడ్ నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్ట ప్రకారం దుకాణాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకునే వీలుంది. పరిష్కారమేదీ? గతంలో ఫిబ్రవరి నుంచి మార్చి దాకా ప్రతి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకపూట ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం (పీటీపీ) పేరిట జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. ప్రజలు ఆస్తిపన్నుకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం కన్నా తమకు ఎక్కువ ఆస్తిపన్ను పడినా ఇతరత్రా వ్యత్యాసాలున్నా, ఆస్తిపన్ను చెల్లించినప్పటికీ, రికార్డుల్లో నమోదు కాకపోయినా, తదితర సమస్యల్ని అధికారుల దృష్టికి తెచ్చేవారు. సంబంధిత ట్యాక్స్ సెక్షన్ అధికారులతో పాటు డిప్యూటీ, జోనల్ కమిషనర్లు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేసి ఇబ్బందులు తీర్చేవారు. ఈ ఫిబ్రవరిలో ఒక ఆదివారం ముగిసిపోయినా, ఇప్పటి వరకు ఇంకా పీటీపీ ప్రకటించలేదు. పీటీపీ నిర్వహిస్తే ప్రజలు తమ సందేహాలు తీర్చుకునేందుకు వీలుంటుంది. కానీ అధికారులు ఇంతవరకు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రెండేళ్లుగా ఈ అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని 2024లో కేవలం మార్చిలో నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహించారు. ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారో.. అసలు నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి. -
ఆఫీస్ మార్కెట్కు అడ్డా.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. స్థిరమైన డిమాండ్, ఆఫీస్ వసతుల ఖాళీలు తగ్గుతుండడం, అద్దె ధరల్లో స్థిరమైన పెరుగుదులతో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టినట్టు రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. 2025–26లో చివరి త్రైమాసికం (2026 జనవరి–మార్చి) నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా 18–19 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ ఆఫీస్ వసతులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇందులో పావు వంతు (23 శాతం) వసతులకు లీజింగ్ ఒప్పందాలు ఇప్పటికే కుదిరినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల్లోనూ హైదరాబాద్ ఆఫీస్ వసతుల పట్ల కిరాయిదారుల్లో స్థిరమైన విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా పేర్కొంది. లీజింగ్ భళా.. 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా ఆఫీస్ వసతుల మార్కెట్ బలమైన పనితీరు చూపించింది. ఈ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో 8.4 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ స్పేస్ అదనంగా అందుబాటులోకి వచి్చంది. ఇక ఆఫీస్ వసతుల నికర స్వీకరణ 8.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ఐటీ–బీపీఎం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థల నుంచి డిమాండ్ నెలకొంది. దీంతో 2025 డిసెంబర్ నాటికి ఖాళీ వసతులు 17 శాతానికి తగ్గాయి. 2024 మార్చి నాటికి ఖాళీలు 18.2 శాతంగా ఉండడం గమనార్హం. కొత్త వసతులు అందుబాటులోకి వచి్చనా కానీ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మూలాలు బలంగా ఉన్నట్టు, వసతుల భర్తీ రేటు 2027 మార్చి నాటికి 82.5–83 శాతానికి పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఆఫీస్ మార్కెట్లో కింగ్.. దేశవ్యాప్తంగా టాప్–6 నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల్లో హైదరాబాద్ మార్కెట్ గత ఐదేళ్లలో వేగవంతమైన విస్తరణ చూసినట్టు ఇక్రా నివేదిక ఆధారంగా తెలుస్తోంది. పోటీ మార్కెట్లలో వసతులు ఏటా 7 శాతం మేర పెరిగితే, హైదరాబాద్లో 14 శాతం అధికమవుతూ వచ్చాయి. టాప్–6 నగరాల్లోని వసతుల్లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వాటా 2021 మార్చి నాటికి 13 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 16 శాతానికి చేరింది. హైటెక్ సిటీ/మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని ఆఫీస్ వసతులు నగరంలోని మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరాలో 63 శాతం వాటా కలిగి, సరఫరాకు కీలకంగా ఉన్నాయి. హైటెక్ సిటీలో 2026–27లో పరిమిత సరఫరానే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఖాళీలు తక్కువగానే ఉండొచ్చని.. అయితే గచి్చ»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో ఖాళీలు స్థిరంగా ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. లీజు ధరలు క్రమంగా పెరుగుతున్నాయంటూ, ఈ మూడు సూక్ష్మ మార్కెట్లలో గత ఐదేళ్లలో ఏటా 3–4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని ఇక్రా నివేదిక వెల్లడించింది. 2025–26 క్యూ4 నుంచి 2026–27 వరకు ఇదే స్థాయిలో లీజు ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్, బలమైన లీజింగ్ కార్యకలాపాలు మధ్య కాలానికి హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
విజయశాంతి రెడ్డి ఘటనపై డాక్టర్ అనిత షాకింగ్ నిజాలు..
-
ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణ గ్రామపంచాయతీలకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్. కేంద్రం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు సంబంధించిన బకాయి నిధులను గురువారం విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణ పంచాయితీలకు కేంద్రం రూ.3 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో కొద్ది కొద్దిగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. అయితే ఈలోపు.. ఎన్నికలు రావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపుల అనంతరం నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎందుకమ్మా! ఏమైందమ్మా!
-
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని ఐ పోలవరం(కోనసీమ) మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. అన్నేసి పని గంటలతో మానసికంగా అతను కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది. -
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. -
చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా
హైదరాబాద్: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు."పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
క్యాన్సర్ మరణ శాసనం కాదు: చిరంజీవి
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు. అది మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుందన్నారు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి అధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు.అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి.కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.క్యాన్సర్ చికిత్స కోసం అనేక రకాలైన అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఎక్కువకాలం బ్రతికే అవకాశం ఉందన్నారు. సమాజంలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. అలాగే క్యాన్సర్ను జయించిన వారు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట మరియు క్యాన్సర్ చికిత్స పొందిన మరియు పొందుతున్న వారు పాల్గొన్నారు. -
ఓ వైపు రీల్స్ చేస్తూ.. మరోవైపు చిల్..
హైదరాబాద్ నగరం మరోసారి తన ట్రెండ్ సెట్టర్ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్ కల్చర్, సోషల్ మీడియా లైఫ్స్టైల్ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్, లైకులతో హైదరాబాద్ను డిజిటల్ హబ్గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..! నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్ ట్రెండ్ (Reels Trend) అనే కల్చర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు టీ హబ్ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్ స్పాట్ నుంచి రియల్ హబ్గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్నీ ఒక లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తున్నారు.రీల్స్కు కొత్త అడ్రస్.. జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు కేఫ్లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్ లైఫ్, నేచురల్ లైటింగ్, మోడర్న్ ఆర్కిటెక్చర్, మినిమల్ వైబ్స్.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్ దగ్గర నుంచి, డిజైన్ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్ ఫ్రేమ్లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్ సన్లైట్తో జూబ్లీహిల్స్ రోడ్లు ఆర్గానిక్ రీల్స్కి పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా మారుతున్నాయి.కార్పొరేట్ నుంచి క్రియేటివ్ వైపు..ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్ మోషన్.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్ రీల్స్కు సరైన స్పేస్గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్ పక్కన పెట్టి, ఫోన్ చేతిలో పట్టుకుని యువత రీల్స్ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్ అయిపోయాక రీల్స్ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్ స్టైల్.టీ హబ్ టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్..టీ హబ్ అంటే కేవలం స్టార్టప్లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్ స్టేట్మెంట్ స్పాట్గా మారుతోంది. ఇక్కడ రీల్స్ అంటే డ్యాన్స్ కాదు వాక్ అండ్ టాక్ రీల్స్, మోటివేషనల్ వాయిస్ ఓవర్స్, డే ఇన్ మై లైఫ్, హైదరాబాద్ గ్రోత్ స్టోరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్లో చూపిస్తోంది.రుచికి రీచ్.. నీలోఫర్ కేఫ్.. 2026లో నీలోఫర్ కేఫ్ మరోసారి వైరల్ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్ స్టైల్ రీల్స్ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్ గ్లాస్, ఇరానీ చాయ్ ఆవిరి, రాత్రి పూట జిగేల్మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్ హైదరాబాద్ వైబ్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్ అయ్యే అనుభూతి.అర్బన్ నేచర్ హాట్స్పాట్.. దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్ వ్యూ, నైట్ లైట్స్.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫ్రేమ్స్. నేచర్ ప్లస్ సిటీ ఈక్వల్స్ టు రీల్ అండ్ రియల్ మ్యాజిక్.. ఇక్కడ సన్సెట్ టైమ్లో తీసిన రీల్స్ లక్షల్లో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్స్టా, ఫేస్బుక్ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.నగరంలో బెంగళూరియన్స్ రీల్స్? ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ నగరంలోని ప్రముఖ స్పాట్స్లో రీల్స్ (Reels) షూట్ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్ బ్యాక్డ్రాప్స్, నాచురల్ లైటింగ్, కల్చర్ ప్లస్ మోడర్నిటీ మిక్స్.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో కొత్త రీల్ క్యాపిటల్గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.చదవండి: అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ -
తల్లీపిల్లల ఆత్మహత్య కేసు.. వెలుగులోకి CCTV దృశ్యాలు
-
అంతుచిక్కని తల్లీపిల్లల ఆత్మహత్య కేసు
-
పిల్లి తెచ్చిన తంటా!
సాక్షి, హైదరాబాద్: పిల్లి తెచ్చిన తంటా పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. వివరాలు... వనస్థలిపురానికి చెందిన పెండ్యాల శాంభవిదేవి మూడేళ్లుగా మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. అనారోగ్యం కారణంగా గతేడాది ఆగస్టు 27న అల్కాపురిలోని స్నిఫర్స్ పెట్ క్లినిక్కు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ క్రాంతికుమార్ పిల్లిని పరీక్షించి, మూత్ర సంబంధిత సమస్య ఉందని చెప్పారు. ఆమె అంగీకరించడంతో అదేరోజు శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ సమయంలో పిల్లి కదలడంతో దాని శరీరంలో వేసిన పైపు పక్కకు జరిగిందని చెప్పి మళ్లీ శస్త్రచికిత్స చేశారు. అనంతరం చికిత్స ఖర్చులను శాంభవి చెల్లించి పిల్లిని తీసుకొని ఇంటికెళ్లింది. అయినా పిల్లి ఆరోగ్యం కుదుటపడకపోగా విషమంగా మారింది. డిసెంబర్లో మళ్లీ క్లినిక్కు తీసుకెళ్లగా డాక్టర్ క్రాంతి పిల్లికి మరో సర్జరీ చేశారు. మూడు శస్త్రచికిత్సల తర్వాత కూడా దాని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శాంభవి కుంగిపోయింది. ఈ విషయమై క్లినిక్కు వెళ్లి ప్రశి్నంచగా డాక్టర్ క్రాంతి ఆమెను అసభ్యపదజాలంతో దుర్భాషలాడారు. ఇంకోసారి క్లినిక్కు వస్తే చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేశారు. గత నెల 31న డాక్టర్ క్రాంతి కుమార్కు ఆమె ఫోన్ చేయగా, ఇకపై దానికి చికిత్స చేయనని, ఇంకోసారి ఫోన్ చేయొద్దని దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో మంగళవారం బాధితురాలు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్లో ఎంగేజ్మెంట్ మేనేజర్ 'కోమల్ ఝా'.కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్లో ఎంగేజ్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.తొమ్మిదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు. -
World Cancer Day: ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి
హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు ప్రజలు 040-6905 9100 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.కుటుంబంలో ఒకరు, అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వారసత్వ కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది.సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశమున్నప్పటికీ, సుమారు 10 శాతం క్యాన్సర్లు వారసత్వ జన్యు మార్పుల కారణంగా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు, తక్కువ వయస్సులో క్యాన్సర్ రావడం, తరతరాలుగా కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ కనిపించడం వంటి అంశాలు జన్యుపరీక్షలకు కీలక సూచికలని వివరించారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా లక్ష్యిత స్క్రీనింగ్, నివారణ చర్యలు మరియు వ్యక్తిగత వైద్య సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.కామినేని ఆసుపత్రి జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.కామినేని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ, “చాలామంది కుటుంబ చరిత్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. లక్షణాలు కనిపించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వచ్చి, తమ ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం, బోర్డు సర్టిఫైడ్ జన్యు కౌన్సెలర్లతో పాటు ఆంకాలజీ తదితర విభాగాల వైద్యులతో కలిసి సమగ్ర ప్రమాద అంచనా మరియు వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. -
ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: ఏఐఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు. అనారోగ్య సమస్యతో గతేడాది నవంబర్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి చివరికి తుదిశ్వాస విడిచారు.పాషా ఖాద్రీ ఏఐఎంఐఎంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న నేత. 2004లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2018లో యాకుత్పుర నియోజకవర్గం నుంచి గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. పాషా ఖాదద్రీ ఏఐఎంఐఎం వ్యవస్థాపకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ సహచరుడిగా గుర్తింపు పొందారు.2008లో ఏఐఎంఐఎం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన పాషా ఖాద్రీ, పార్టీని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్లోని ముస్లిం ఓటర్లలో ఏఐఎంఐఎం స్థిరమైన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, పార్టీ విస్తరణలో చేసిన కృషి ఏఐఎంఐఎంకు బలమైన పునాది వేశాయి.సుమారు 60 ఏళ్ల వయసులో ఖాద్రీ మరణం ఎంఐఎంకు పెద్ద లోటు. చార్మినార్, యాకుత్పురా నియోజకవర్గాల్లో ఆయనకు ఉన్న బలమైన పట్టు, ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీకి అమూల్యమైందని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని సహచర నేతలు చెబుతున్నారు. సయ్యద్ పాషా ఖాద్రీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(MCH)లో కార్పొరేటర్ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సయ్యద్ పాషా ఖాద్రీ మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు రైతులు మృతి
సాక్షి,మల్లాపూర్: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు రైతులు మృతి చెందారు. స్థానికులు వివరాల మేరకు.. మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
Garam Garam Varthalu: పోలీసుల ముందే తోక జాడించిన ఆటో డ్రైవర్
-
Hyderabad: హైస్పీడ్ హబ్.. ‘ట్రయాంగిల్ డైమండ్’
సాక్షి, హైదరాబాద్: నేలపై విమానాలు దూసుకెళ్తున్నాయా.. అనుకునేంత హైస్పీడ్తో నడిచే రైళ్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వేగం గంటకు సుమారు 350 కి.మీ. ఉండనుంది. మహానగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ‘ట్రయాంగిల్ డైమండ్’ వచ్చి చేరనుంది. నగరం నుంచి చెన్నై, బెంగళూర్, పుణెలకు హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ మూడు కారిడార్లను కలిపేవిధంగా దక్షిణ మధ్య రైల్వే భారీ టెర్మినల్ను నిర్మించనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థలమిస్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోగానీ, ఫ్యూచర్ సిటీలోగానీ (Future City) టెర్మినల్ రూపుదాల్చనుంది. పుణె నుంచి ముంబై వరకు కూడా హైస్పీడ్ కారిడార్ విస్తరించనున్న దృష్ట్యా హైదరాబాద్ నుంచి పుణె మీదుగా ముంబైకి రాకపోకలకు అవకాశం లభించనుంది. ఈ డైమండ్ ట్రయాంగిల్ కారిడార్లు దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సమన్వయానికి దోహదం చేస్తాయి. ఫలితంగా విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఎయిర్పోర్టును తలపించేలా.. ఎయిర్పోర్టు తరహాలోనే హైస్పీడ్ రైల్వే టెర్మినల్ నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను కూడా విమానాశ్రయం తరహాలోనే పునరాభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే అత్యాధునిక సాంకేతిక హంగులతో హైస్పీడ్ రైల్ టెర్మినల్ నిర్మించనున్నారు. దీనికోసం ఎన్ని వందల ఎకరాల భూమి అవసరమవుతుందనే అంశంతోపాటు విధివిధానాలపై త్వరలో కసరత్తు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి హైస్పీడ్ రైల్వే టెర్మినల్ (High Speed Train Terminal) అందుబాటులో ఉంటే ప్రయాణికులకు రెండు రకాల ప్రయాణ సదుపాయాలు సమాంతరంగా లభించే అవకాశం ఉంటుంది. రెండున్నర గంటల్లో ముంబైకి.. కారిడార్ల సామర్ధ్యం గరిష్టంగా 350 కి.మీ. వరకు ఉన్నప్పటికీ హాల్టింగ్ స్టేషన్లు, మలుపులు, తదితర సాంకేతిక అవసరాల దృష్ట్యా రైళ్ల వేగం కొంతవరకు తగ్గనుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి 12 నుంచి 13 గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైల్లో 2.55 గంటల్లో చేరుకోవచ్చు. బెంగళూరుకు 2 గంటలు, పుణెకు 1.55 గంటల్లో చేరుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి పుణె మీదుగా ముంబైకి హైస్పీడ్ రైలులో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రతిరోజు 5 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. చెన్నై, ముంబైకి కూడా రోజుకు సుమారు 2,500 నుంచి 3 వేలకుపైగా మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. బస్సులు, విమానాలు, సొంత వాహనాల్లో వెళ్లేవారిని కలిపితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం రైళ్లు, విమానాల్లో ఎక్కువగా ప్రయాణించేవారు భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. పునరాభివృద్ధికి మరో ఏడాది... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) పునరాభివృద్ధి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టనుంది. వచ్చే మార్చి నాటికి స్టేషన్ పదో నెంబర్ వైపు పనులు పూర్తవుతాయని, ఒకటో నెంబర్ వైపు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.750 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేట్టిన సంగతి తెలిసిందే. నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించనున్నట్లు జీఎం పేర్కొన్నారు. ప్రయాణికులకు పారదర్శకమైన సదుపాయం లభించేవిధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
చిరంజీవిని కలిసిన కొండాసురేఖ
సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్కు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో మా కుమార్తె కొండా సుస్మితతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/JUMYDVAaaA— Konda Surekha (@iamkondasurekha) February 2, 2026 -
పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలన్మవరణం కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. తన పిల్లలిద్దరితో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె బలన్మవరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారనే దాని గురించి ఇంకా వెల్లడి కాలేదు. దీంతో విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్ను సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. అందులోని సమాచారం బయటకు వస్తే కారణం తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే డీఎస్పీ జావిద్ సోమవారం సాక్షి టీవీతో చెప్పారు. ''ఇలాంటి ఘటన జరగటం బాధాకరం. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలని తీసుకుని జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వచ్చారు. స్టేషన్కు వచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏమి లేవనీ తెలుస్తుంది. ఏదో బలమైన కారణంతోనే ఆమె బలన్మవరణానికి పాల్పడి ఉంటారు. పార్కింగ్ స్లిప్ వెనకాల రాసిన సూసైడ్ నోట్ ఆమె కారులో మాకు దొరికింది. 28వ తేదీన విజయశాంతి రెడ్డి- సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు అని తెలిసింది. 31 తేదీ సురేందర్ రెడ్డి పుట్టిన రోజు అని తెలిసింది. మరింత లోతుగా విచారణ చేస్తున్నామ''ని రైల్వే డీఎస్పీ జావిద్ తెలిపారు.ప్లీజ్.. చనిపోవద్దు మంచి ఉద్యోగం, కుటుంబం ఉన్న విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తనతో పాటు పిల్లల ప్రాణాలు తీయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. చదువుని, ఉద్యోగం చేస్తున్న ఆమె ఇలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడాలని, కనీసం పిల్లల కోసమైనా ఆలోచించాల్సిందని అంటున్నారు. అయితే ఒంటరితనం కారణంగా ఆమె ఎంతో బాధ అనుభవించి ఉండొచ్చని, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయానికి ఉండొచ్చని కొంతమంది పేర్కొన్నారు. ఏదేమైనా బతికి సాధించాలని, చావుతో సమస్యలు పరిష్కారం కావని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.సూసైడ్నోట్ ఏం రాశారంటే..? -
తెలంగాణకు గుడ్న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. రూ.5,454 కోట్ల నిధులు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే బుల్లెట్ ట్రైన్కు హైదరాబాద్ హబ్గా మారుతుందన్నారు.ఈ సందర్బంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చాం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్గా నిర్మిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. బుల్లెట్ ట్రైన్కు హైదరాబాద్ హబ్గా మారుతుంది. ఇది సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు. అలాగే, 10,134 కోట్ల రూపాయల బడ్జెట్ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేటాయించాం. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైలుతో 2:55 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు వెళుతుంది అని చెప్పుకొచ్చారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనది. సిబ్బంది మొత్తం మార్చాల్సిన అవసరం ఉంది. కంట్రోల్స్, కమాండ్, టైం టేబుల్ కూడా మార్పు జరగాలి. ఇదంతా కూడా చాలా జటిలమైన ప్రక్రియ. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో మూడు నాలుగు ఏళ్ళు పట్టేది. ఈసారి మేము చాలా ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తున్నాం. సజావుగా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేందుకు పనిచేస్తున్నాం. సౌత్ కొస్టల్ జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు (రెండు గంటల జర్నీ)హైదరాబాద్-చెన్నై(2:55 గంటల జర్నీ)హైదరాబాద్-పుణె (1:45 గంటల జర్నీ)హైదరాబాద్-చెన్నై ,కోల్కతా-చెన్నై. -
తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్ తన్నేసిన భర్త
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది. మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్కు చెందిన కొండల్ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది. కాగా, కొండల్ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కొండల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్ వేసుకొని సీలింగ్ ఫ్యాన్కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పె ట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్ స్టూల్ను తన్నాడు. దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్ చె ప్పా డు. అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్ త న్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ ఎందుకలా చేసిందో..!
హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇంటర్ చదివే కుమారుడు, కూతురుతో కలిసి ఆ తల్లి రైలుకింద పడి బలవన్మరణం చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలవన్మరణం కేసు మిస్టరీ ఆదివారం రాత్రి వరకు వీడలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గంటల కొద్దీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్ఫోన్ సందేశాలలో పోలీసులకు రెండు అనుమానాస్పద సందేశాలు లభించాయి. ఈ రెండు సందేశాలను పంపించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను రైల్వే పోలీసు లు సికింద్రాబాద్ రప్పించి విచారించారు. ఒకరు సారీ మేడం ఇటువంటి తప్పు మరోమారు జరగదు అని, మరోకరు మేడం గుడ్మార్నింగ్ అని సందేశాలు పంపించారు. ఇవి రెండు సందేశాలు కార్యాలయ సమాచార నిమిత్తం పంపినవని పోలీసులు తమ విచారణలో ధృవీకరించుకున్నారు. సహచరులను పోలీసులు సంప్రదించినా విజయశాంతిరెడ్డి తన కార్యాలయంలో చురుకుగా ఉండే తీరును మాత్రమే పోలీసులకు వివరించారు. ఎప్పుడూ తను ఆందోళన చెందుతున్నట్టు కానీ... భయపడుతున్నట్టు కానీ కనిపించేది కాదని చెబుతున్నట్టు జీఆర్పీ ఇన్స్సెక్టర్ జీ.సాయీశ్వర్గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి పుట్టింటివారు, మెట్టింటికి చెందిన పలువురు సమీప బంధువులను కూడా పోలీసులు విచారించారు. వారి నుంచి కూడా పోలీసులు ఆశించిన సమాచారం అభించలేదు. సురేందర్రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులది ఆదర్శవంతమైన జీవనమని బంధువులు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విజయశాంతిరెడ్డి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకునేంతటి పరిస్థితులు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్మాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్ను సైబర్ క్రైం పోలీసులకు పంపించినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారం రోజుల్లో ఈ వివరాలు వచ్చే అవకాశముంది. డేటా వస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు వారు చెప్పారు. -
హైదరాబాద్ : నుమాయిష్ ఎగ్జిబిషన్.. ఫుల్ రష్ (ఫొటోలు)
-
హైదరాబాద్ పై వరాల జల్లు, 7 హైస్పీడ్ రైళ్లు
-
హైదరాబాద్కు హై-స్పీడ్ రైళ్లు..
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా హైదరాబాద్ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది. -
హైదరాబాద్ 631 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: బ్యాటర్లు దంచికొట్టడంతో రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 415/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 154 ఓవర్లలో 631 పరుగులకు ఆలౌటైంది. ప్రజ్ఞయ్ రెడ్డి (126; 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... క్రితం రోజే శతకం పూర్తి చేసుకున్న హిమతేజ (258 బంతుల్లో 171; 18 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాగాలాండ్తో సావోమిలో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 267/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 130 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (227 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. శశికాంత్ (138 బంతుల్లో 60; 5 ఫోర్లు), త్రిపురాన విజయ్ (94 బంతుల్లో 58; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకారం అందించారు. అనంతరం నాగాలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. -
రియల్ఎస్టేట్: 12 నెలలు.. 65 లక్షల చదరపు అడుగులు
హెచ్–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ హాట్ ఫేవరెట్గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది హైదరాబాద్లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్ రిపోర్ట్ వెల్లడించింది.గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.వేకెన్సీ 18.2 శాతం.. ఏటేటా హైదరాబాద్లో కార్యాలయ స్థలాల మార్కెట్ సరికొత్త రికార్డ్లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్ క్వార్టర్లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్కేర్ అండ్ లైఫ్సైన్సెస్ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.97 శాతం ఆఫీసు స్పేస్ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ వంటి (పెరిఫెరల్ బిజినెస్ట్ డిస్ట్రిక్ట్) పీబీడీ–వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్ స్పేస్ ఆఫీసులలో హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ.9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులో గుర్తించారు. ఏడుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా, నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు.హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది.హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. -
Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య (శనివారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైలట్ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయ(38), కూతురు చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. చేతన ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, విశాల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిసింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటున్నాడని పోలీసులు నిర్ధారించారు. విజయ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని.. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందని పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
కోఠిలో కాల్పుల కలకలం.. గన్ తో కాల్చి రూ.6 లక్షలతో పరార్
-
సందడిగా వింగ్స్ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)
-
‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’
హైదరాబాద్: నేను రోడ్డెక్కలేదు.. నా బండి నంబర్ రికార్డు చేసుకోండి.. నేను ఊదనంటే.. ఉద.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులకు ఓ వాహనదారు చుక్కలు చూపించాడు. ఎంతసేపు వారించినా బ్రీత్ ఎనలైజర్లో ఊదనంటే ఊదనంటూ అరగంట పాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి బైక్ను వదిలేసి వెళ్లాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లో ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. స్కూటర్పై ఓ యువకుడు రావడంతో ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని.. అందులోకి ఊదాల్సిందిగా పోలీసు సిబ్బంది అతడికి సూచించారు. ‘నేను అసలు రోడ్డే ఎక్కలేదు.. నేనెందుకు ఊదుతా’నంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్కు సహకరించకుండా అరగంట పాటు పోలీసులతో వాదించాడు. చివరకు బైక్ను వదిలేసి పారిపోయాడు. పోలీసులు బైక్ను సీజ్ చేశారు. -
నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)
-
ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం
ఢిల్లీ: కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పాల్గొన్న తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. ‘ తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశాం. రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చాం. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశం కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు.తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశం ఈరోజు(శుక్రవారం. జనవరి 30వ తేదీ) జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం.. సుమారు రెండు గంటల పాటు సాగింది.ప్రధానంగా పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సీపీ గౌస్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందిఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్ సీపీ గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్ది సేపటి క్రితం ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
‘కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్రెడ్డి. తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్ కాట్ చేయాలి’’ అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.కాగా, ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్లు విలువైన విదేశీ గంజాయిని పట్టుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది.హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. -
బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)
-
కేసీఆర్ లేఖపై సిట్ స్పందన
హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు.ఇవాళ.. కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
నిప్పులు చెరిగిన సిరాజ్
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్ఘడ్తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్తో పాటు రక్షన్ (9.3-1-28-2), తనయ్ త్యాగరాజన్ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్ యాదవ్ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్ఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ప్రతీక్కు వికల్ప్ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్ సెంచరీకి చేరువైన వికల్ప్ తివారిని ఔట్ చేసి ఛత్తీస్ఘడ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్, ప్రతీక్ మినహా ఛత్తీస్ఘడ్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్ పాండే 11, అనుజ్ తివారి 4, సంజీత్ దేశాయ్ 1, కెప్టెన్ అమన్దీప్ ఖారే 16, మయాంక్ వర్మ 3, సహబాన్ ఖాన్ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్ ఆదిత్య సింగ్ 16 పరుగులకు ఔటయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్రావ్ 32, అభిరథ్ రెడ్డి 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
అనుమానం వస్తే కాల్ చేయండి.. సజ్జనార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.‘‘హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా… pic.twitter.com/fOmkk80ie7— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2026 -
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు గుర్తింపు ట్యాగ్లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. జాతర కోసం ఆర్టీసీ తీసుకున్న చర్యలు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సురేష్ కుమార్, ఉప్పల్ ఇన్స్పెక్టర్ కె. భాస్కర్, పరిపాలనా సబ్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చిరంజీవి, వినయ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అదరహో అనేలా.. బేగంపేట ఎయిర్ షో
-
హైదరాబాద్లో అపోలో అంతర్జాతీయ హెల్త్ డైలాగ్–2026
హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ (IHD–2026) ఈ నెల 30, 31 తేదీల్లో హెచ్ఐసీసీ–నోవోటెల్, హైదరాబాద్ వేదికగా జరగనుంది. ‘గ్లోబల్ వాయిసెస్.. వన్ విజన్’ అనే థీమ్తో నిర్వహించే ఈ సదస్సులో రోగి భద్రత, డిజిటల్ హెల్త్, ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్ ఫలితాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీతా రెడ్డి మాట్లాడుతూ, “ఏఐ, డేటా, డిజిటల్ టెక్నాలజీలను మానవీయత, సహకారంతో మేళవిస్తే భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ మరింత సమగ్రమవుతుంది. ఈ వేదిక గ్లోబల్ స్థాయిలో ఆలోచనలు, ఆవిష్కరణలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది,” అన్నారు.ఈ సదస్సులో నైజర్, పాపువా న్యూగినియా, కాంగో దేశాల ఆరోగ్య మంత్రులు సహా అంతర్జాతీయ నిపుణులు పాల్గొననుండగా, రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా హాజరై ప్రసంగించనున్నారు. -
బేగంపేట్ : అట్టహాసంగా వింగ్స్ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)
-
స్నేహితుల ఆనంద ప్రయాణం… విషాదాంతం
మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్ (23), సాయివరుణ్ (23), వెంకట్ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ బీటెక్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్యూవీ 700 కారులో బోడుప్పల్ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్తో పాటు సాయివరుణ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం
సాక్షి హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో చేపట్టిన బదిలీల రద్దుపై అధికారులకు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఎసీ నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న రాత్రి వరకూ మింట్ కాంపౌండ్ లో ఎర్రగడ్డ స్కాడా ఆఫీసులో చర్చలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లో బదిలీలను వాయిదా వేసేది లేదని యాజమన్యం స్పష్టం చేయడంతో రాజీకి అంగీకారం కుదరలేదు.దీంతో విద్యుత్ జేఏసీ నేతలు మహా ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు( గురువారం) నుంచి జిల్లాలో / సర్కిళ్లలో రిలే దీక్షలు చేపడతామని తెలిపారు.ఈ చర్చలలో యాజమాన్యం తరపున సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, డైరెక్టర్ చక్రపాణి ఐఏఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ పాల్గొనగా జేఏసీ తరపున ఎనిమిది మంది నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్ఎఫ్ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్వర్క్లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్హాఫెన్, స్పెయిన్లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బీఏఎస్ఎఫ్ డిజిటల్ హబ్ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్ప్లేస్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్ అండ్ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
లోహ విహంగం.. విన్యాసాల వైభోగం..
మొన్నటివరకూ పతంగుల పండగ.. ఇప్పుడు విహంగాల పండగ వచ్చేసింది. నగరం మరోసారి అతిపెద్ద విమానాల ప్రదర్శనకు సిద్ధమైంది.. బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా రెండేళ్లకు ఓమారు జరిగే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన అయిన వింగ్స్ ఇండియా–2026 షో మళ్లీ వచ్చేసింది. నాలుగు రోజుల పాటు నగరవాసులను లోహ విహంగాలు అబ్బురపరిచే విన్యాసాలతో కనువిందు చేసేందుకు ఇప్పటికే రన్వేపై కొలువుదీరాయి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకూ జరిగే షోలో వివిధ విమాన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దీనికి తోడు వైమానిక విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ ఎయిరోబాటిక్ టీమ్ మార్క్ జాఫ్రీస్ అద్భుత విన్యాసాలకు రెడీ అవుతున్నారు. నాలుగు రోజుల పాటు మొత్తం 13 సార్లు ఆయా ఎయిరోబాటిక్ టీమ్లు నింగిలో అద్భుతాలను ఆవిష్కరించనున్నాయి. ప్రారంభం రోజు మార్క్జాఫ్రీస్ బృందం అదనంగా మరో ‘షో’తో పాటు డ్రోన్ షో కూడా సందర్శకులను కట్టిపడేయనుంది. అర్కా ఏవియేషన్, హెచ్ఏఎల్, శక్తి ఏవియేషన్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దస్సాల్ట్ ఏవియేషన్, ఎయిర్బస్, ఎబ్రాయెర్, యూఏసీ, టెక్నాం, పిలాటస్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ తదితర కంపెనీలు స్టాటిక్ డిస్ప్లేలో పాల్గొంటున్నాయి. అలాగే ఎగ్జిబిషన్లో విమానయాన రంగానికి చెందిన ప్రతి ఉత్పత్తినీ తయారీ సంస్థలు ప్రదర్శించనున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు వింగ్స్ ఇండియా వేదికగా జరిగే ‘ఇండియన్ ఏవియేషన్ : పేవింగ్ ది ఫ్యూచర్–ఫ్రం డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇన్క్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సొసైటీ టు సస్టెయినబులిటీ’ అంశాలపై సదస్సు జరుగనుంది. భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హాజరుకానున్నారు. 2024లో సారంగ్.. ఇప్పుడు సూర్యకిరణ్.. 2024లో జరిగిన వింగ్స్ ఇండియా షోలో సారంగ్ టీమ్ హెలికాఫ్టర్లు నగరవాసులను మంత్రముగ్ధులను చేయగా.. ఈసారి సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ టీమ్ కనువిందు చేయనుంది. భారత్ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) అధికారిక ఎయిరోబాటిక్స్గా సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ వెలుగొందుతోంది. మొట్టమొదటిసారి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే వింగ్స్ ఇండియా–2026లో వైమానిక విన్యాసాలకు రెడీ అవుతున్నారు. 52వ స్కాడ్రన్కి చెందిన ఈ టీమ్ ‘సదైవ సర్వోత్తమ్’ నినాదంగా ముందుకుసాగుతుంది. కర్ణాటక బీదర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ కేంద్రంగా ‘సూర్యకిరణ్’ టీమ్ సేవలందిస్తోంది. 1996లో ఆవిర్భవించిన సూర్యకిరణ్ మొదటిసారి కోయంబత్తూర్లో 1996 సెప్టెంబర్ 15న మొదటి ప్రదర్శన ఇచ్చారు. 1998 నుంచి 9 విమానాల ఫార్మేషన్ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టీమ్ ప్రస్తుతం బీఏఈ హాక్ ఎంకే–132 జెట్ ట్రైనర్లను ఉపయోగిస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఎయిరోబాటిక్ కోసం స్మోక్ సిస్టమ్తో మార్చబడ్డాయి. మొత్తం 13 మంది ఫైలెట్లు ఉన్నప్పటికీ ప్రతి ప్రదర్శనలో 9 మంది పైలెట్లు మాత్రమే విమానాలు నడిపిస్తారు.సందడే సందడి..స్టాటిక్ ప్రదర్శనలో ఉంచే లోహ విహంగాలు బేగంపేట ఎయిర్పోర్ట్ రన్ వేపై ఇప్పటికే వాలిపోయాయి. ఇందులో ప్రధానంగా ఎయిర్ బాలి్టక్ (ఎయిర్బస్ ఏ 220–300), యూఏసీ ఐఎల్ 114–300 రీజనల్ టర్బోప్రోప్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (737–8), సంజయ్ గోదావత్ గ్రూప్కు చెందిన స్టార్ ఎయిర్ (వీటీ–జీఎస్జే), ఆదానీ గ్రూపుకు చెందిన బాలి్టక్ (వీటీ–కేజీఏ), న్యూజనరేషన్ (ఓకే–జేఆర్పీ), హెచ్ఏఎల్కు చెందిన హిందూస్థాన్–228, ధ్రువ్ ఎన్జీ, ఎస్జే–100, శక్తి ఎయిర్ విమానాలు, హెలికాఫ్టర్లు రన్వేపై కొలువుదీరాయి. మంగళవారం రాత్రికి మరిన్ని విమానాలు, హెలికాఫ్టర్లు వింగ్స్ ఇండియా–2026కి రానున్నట్లు షో వర్గాలు పేర్కొన్నాయి.మరోసారి మార్క్ జాఫ్రీస్ బృందం.. లండన్లో ఎయిరోబాటిక్ విన్యాసాలు చేసే మార్క్ జాఫ్రీస్ బృందం ఈ సారి కూడా గగనంలో అద్భుత వైమానిక విన్యాసాలకు సిద్ధమయ్యారు. వైమానిక విన్యాసాల్లో మార్క్ జాఫ్రీస్ది ఐదు దశాబ్దాల అనుభవం. ప్రపంచ ప్రఖ్యాత ఎయిరోబాటిక్ పైలట్. ఎల్–39 ఆల్బట్రోస్ జెట్ విమానాలతో అద్భుత షోలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎయిర్ షోలు జరిగినా ఈ టీమ్ వైమానిక విన్యాసాలు ఉండాల్సిందే. హైస్పీడ్ జెట్ ఫ్లైపాస్ట్, లూప్స్, రోల్స్, క్రాస్ ఫ్లైట్ మేనూవర్స్, ఫార్మేషన్ ఫ్లయింగ్, నైఫ్ ఎడ్జ్ పాస్, మిర్రర్ ఫ్లైయింగ్Š వంటి రిస్కీ స్టంట్స్కు ప్రసిద్ధి. 2014లో ఈ బృందం మొదటిసారి ఇండియన్ ఏవియేషన్ షోలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి వింగ్స్ ఇండియా షోలో విన్యాసాలు చేస్తుటుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ టీమ్ సభ్యులైన మార్క్జాఫ్రీస్, క్రిస్ హేమ్స్, జాన్ రావెన్్రస్కోప్ట్, క్రిజ్ బర్కెట్ల బృందం బేగంపేట ఎయిర్పోర్ట్కు మంగళవారం చేరుకున్నారు. -
వన మేడారానికి జనసాగరం
సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఉప్పల్ రింగ్రోడ్డు వద్ద అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. కార్లు, మ్యాక్సీ క్యాబ్లు బారులు.. ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు తదితర ప్రైవేట్ వాహనాల్లోనే కాకుండా సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో ఉప్పల్– వరంగల్ మార్గంలో రద్దీ పెరిగింది. రహదారులపై పెద్ద ఎత్తున కార్లు తదితర వాహనాలు బారులు తీరాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగనుంది. బస్సులు, రైళ్లు తదితర వాహనాల్లో మేడారం జాతర కోసం సుమారు 10 లక్షల మందికిపైగా నగరవాసులు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా.ఎంజీబీఎస్లో చిన్నారులకు రిస్ట్ బ్యాండ్ అఫ్జల్గంజ్: లక్షలాది మంది భక్తులు తరలివెళ్లే మేడారం మహా జాతరలో పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మహాత్మా గాంధీ బస్స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ తెలిపారు. వోడాఫోన్ ఐడియా సహకారంతో రూపొందించిన రిస్ట్ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రుల సంపూర్ణ సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. పిల్లలు తప్పిపోయిన పక్షంలో సమీపంలోని వలంటీర్ల సహకారంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ అదనపు డీసీపీలు కృష్ణగౌడ్, శ్యామ్బాబు, గోషామహల్ డివిజన్ ఏసీపీ సుదర్శన్, అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి, టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత పాల్గొన్నారు. -
బేగంపేట ఎయిర్పోర్ట్లో నేటి నుంచి వింగ్స్ ఇండియా షో (ఫొటోలు)
-
సింగరేణి కుంభకోణం.. ఆధారాలతో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడు అని భావించే పరిస్థితి తలెత్తిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సింగరేణిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొద్ది సేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు లోక్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు.సీఎం అంటే అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో. సింగరేణి సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. వాటిని ఫుట్ బాల్ ఆటకి వినియోగించారు. సీఎం రేవంత్ సింగరేణి సంస్థకు తీరని అన్యాయం చేశారని అన్నారు. -
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్
హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రూ. 16.20 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారు వీరు. అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం సైతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, కొరియర్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశాలకు నగదు తరలిస్తున్నారు. వీరి బారిన పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న నగదును పోగొట్టుకుంటున్నారు. -
TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు. 👉ఎన్నికల షెడ్యూల్ వివరాలు.. ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ పాపం ఎవరిది?
మూసాపేట (హైదరాబాద్): చైనా మాంజాకు ఓ నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో సంతోషంగా బైక్పై వెళుతున్న ఓ చిన్నారి గొంతుకు చైనా మాంజా తగిలి గొంతు తెగటంతో మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోనసీమ, అంబాజీపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామ్సాగర్, పద్మావతిలు కేపీహెచ్బీ కాలనీలోని గోకుల్ ప్లాట్స్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నిష్విక దర్యా (4) లండన్ కిడ్స్ స్కూలులో ఎల్కేజీ చదువుతోంది. వీరు ఇటీవల కాజీపల్లిలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు.సోమవారం సెలవు కావటంతో తమ కొత్తింట్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు కుటుంబ సభ్యులు బైక్పై వెళ్లి వస్తున్నారు. కూకట్పల్లి, వివేకానందనగర్లో పిల్లర్ నంబర్ 781 వద్ద డివైడర్ పక్క నుంచి వస్తుండగా పాప ఒక్కసారిగా గట్టిగా అరిచింది. తండ్రి వెంటనే వాహనాన్ని ఆపి చూడగా పాప గొంతు నుంచి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసి తండ్రి అక్కడే పడిపోయాడు. పాప మెడకు మాంజా దారం చిక్కుకుని ఉండటాన్ని గమనించి వెంటనే మాంజాను తొలగించారు. అటు నుంచి బైక్పై వెళుతున్న మరో వ్యక్తి పాపను బైక్పై సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. గొడవపడి.. బైక్ ముందు కూర్చుని.. కాజిపల్లి నుంచి బయలుదేరేటప్పుడే తన అక్కతో ముందు నేను కూర్చుంటానని గొడవపడి నిష్విక ముందు కూర్చుంది. జేఎన్టీయూ వద్ద యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చాలా ముందుకు వచ్చారు. పిల్లర్ నంబర్ 781 వద్ద పాప గొంతుకు మాంజా తగిలింది. వాహనం ఆపడానికి వీల్లేక పోవడం.. అలాగే ముందుకు రావటంతో పాప గొంతు లోతుగా తెగింది. కాగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతోనే పాప చనిపోయిందని వైద్యులు రఘురాం తెలిపారు. మెదడు నుంచి గుండెకు, గుండె నుంచి మెదడుకు రక్తాన్ని పంపు చేసే రెండు ప్రధాన నరాలు గొంతులో తెగిపోయాయని ఆయన చెప్పారు.కేసు ఎవరి మీద?జేఎన్టీయూ వద్దే యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని పాప తల్లిదండ్రులు రోదించారు. కూకట్పల్లి పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ.. కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగురవేశారనేది గుర్తించడం కష్టమని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది చైనా మాంజా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది రెండోదని గుర్తు చేశారు. -
నెక్లెస్ రోడ్డు వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ (ఫొటోలు)
-
‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్్కఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. -
రేపట్నుంచి ఆకాశాన విన్యాసాలు
హైదరాబాద్: రంగురంగుల పొగలు.. తీరొక్క ఆకృతులు.. రకరకాల విన్యాసాలు.. ఇవీ నగర గగనతలంలో రేపట్నుంచి కనువిందు చేసే దృశ్యాలు. కేంద్ర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నాయి. విన్యాసాలను వీక్షించేందుకు మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్యవేత్తలకు, తరువాతి రెండు రోజులు సామాన్యులకు అనుమతిస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్, మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు నాలుగు రోజులపాటు ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలు చేయనున్నాయి. విమాన విన్యాసాల వేళలు... నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11.00–11.30 గంటల వరకు సూర్యకిరణ్ టీమ్, మధ్యాహ్నం 12.00–12.30, సాయంత్రం 4.00–4.30 వరకు మార్క్జెఫ్రీ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ప్రారంభ రోజైన బుధవారం మాత్రం అదనంగా రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు మార్క్ జెఫ్రీ బృందం ప్రదర్శనతో పాటు సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు డ్రోన్ షో కనువిందు చేయనుంది. మొత్తంగా 13 సార్లు విమాన విన్యాసాలు, ఒక డ్రోన్ షో నిర్వహించనున్నారు. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వింగ్ ఇండియా–2026 వర్గాలు పేర్కొంటున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఇండియన్ ఏవీయేషన్–2026ను ప్రారంభించనున్నారు. 200లకు పైగా ప్రధాన కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్బస్, సీఎస్ఐఆర్–ఏఎన్ఎల్, ఆర్కా ఏవియేషన్ దస్సాల్ట్ తమ విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనకు రానున్నాయి. -
నృత్య సేవే దైవారాధన
‘సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు శాస్త్రీయ నృత్యం ద్వారా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను’ అని చెప్పారు తెలంగాణ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ కళాకారిణి ఐదున్నర దశాబ్దాలుగా నృత్య సేవ చేస్తున్నారు. దీపికారెడ్డి చేస్తున్న కృషికి ఈ యేడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ కళా సేవ గురించి తమ జీవన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు..పాశ్చాత్య హోరులో మునిగిపోతున్న మన చిన్నారులకు, యువతకు మన దేశ నృత్య కళలు తెలియాలి. కళలకు గుర్తింపు లభించి, ఇలాంటి అవార్డులు రావడం ద్వారా రాబోయే తరాలకు ప్రేరణ కలిగిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక క్రమ శిక్షణ అలవడుతుంది. మెదడు చురుకుగా, శక్తిమంతం అవుతుంది. నృత్యం ద్వారా వచ్చే మనశ్శాంతి, సంతోషం మనల్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. మా విద్యార్థుల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. నృత్య ప్రదర్శనల్లోనూ పాల్గొంటారు. ఇందులో ఒక టీమ్ వర్క్ ఉంటుంది. అందరి ప్రోత్సాహంతో...నాలో ఈ నాట్య తపనను వెలిగించింది మా అమ్మ రాధికారెడ్డి. తను భరతనాట్య నృత్యకారిణి. ఆమె 1961లో రవీంద్రభారతి ప్రారంభోత్సవానికి చిత్రాంగద బ్యాలె ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అమ్మ సాధనను చూసి, నేనూ స్ఫూర్తి పొందేదాన్ని. నాట్యంపై నాకున్న ఆసక్తి గమనించిన అమ్మ నాచేత గజ్జె కట్టించారు. అలా అమ్మ మొదటి గురువు, ఆ తర్వాత నాట్యంలోని మెళకువలతో ముందుకు తీసుకెళ్లింది గురువు సుమిత్ర కౌశల్. అటు నుంచి ఎంతో మందిని నృత్యకారులుగా తీర్చిదిద్దిన వెంపటి చినసత్యంగారు గురువుగా లభించడం నాకు ఓ వరం. 1976లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు వంటి ప్రముఖులు కూచిపూడి నృత్యానికి టార్చ్బేరర్ అని ప్రశంసించారు. పదకొండేళ్ల వయసులో పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా అదృష్టమే. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. నాన్న వి.ఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో అందరికీ శాస్త్రీయ నృత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. అలా వారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. పెళ్లి తర్వాత నా భర్త శ్యామ్గోపాల్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. పిల్లలు అభినవ్, శ్లోక పుట్టిన తర్వాత కూడా నృత్యం చేస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ నుంచి నృత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటే నా కూతురు శ్లోక కూడా మా బాటలోనే నడిచింది. అలా మూడుతరాల శాస్త్రీయ నృత్యకారులు మా ఇంట్లో ఉన్నారు. మూడు తరాల నృత్యంమహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజునే గంగా పండాల్లోని పెద్ద స్టేజీపైన ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివ సతీయం, గంగావతరణం కథలను దాదాపు గంటసేపు నా కూతురు శ్లోకారెడ్డి, శిష్యబృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చాను. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్యసేవలో ఉండటం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులు శాస్త్రీయ నృత్యకారులుగా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్నారు. నృత్యసేవ అంటే భగవంతుని ఆరాధనే. దేవాలయాల వద్ద, వేదికలపైన నృత్యప్రదర్శనలు ఇస్తున్నప్పుడు దివ్యానుభూతికి లోనవుతుంటాం. ఎంతో మంది ఆ ఆనందంలో మమేకం అవుతుంటారు. ప్రదర్శన తర్వాత కలిసి తమ అనుభూతిని తెలియజేసిన వారెందరో. మొదటి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు చూపిన ఎంతోమంది చూపిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి గౌరవం అందుకునేలా చేసింది’’అని ఆనందంగా వివరించారు ఈ నృత్యకళాకారిణి. సామాజిక అంశాలపై సందేశంఅభినయం అనేది నాటి సినిమా నటీనటుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు నృత్యం నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. కూచిపూడి నృత్యం అనగానే చాలామంది పౌరాణిక గాథలు అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ, ప్రతి నెలా ఒక సామాజిక అంశంతో కొత్త కాన్సెప్ట్ని తీసుకుంటాం. అందులో యువతరపు ఆలోచనలనూ ముందుకు తీసుకువస్తున్నాను. దీంట్లో భాగంగా పర్యావరణం, పర్యాటకం, హ్యాండీక్రాఫ్ట్స్, మహిళల సమస్యలు, మన సంస్కృతికి వన్నెతెచ్చే అంశాలు తీసుకుంటూ సందేశాత్మకంగా ప్రేక్షకుల ముందుకు నృత్యరూపకంగా తీసుకువచ్చాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఎలా పొందవచ్చు అనేవి నృత్య రూపకం ద్వారా చూపించగలిగాను. – నిర్మలారెడ్డి -
HYD: బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
సాక్షి హైదరాబాద్ : కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకొని గాయాలు కావడంతో ఓ బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న ఓ బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళుతుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తికి సైతం మంజా తగిలి గోంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమయ్యింది. కర్ణాటకలో ఓ వ్యక్తి చైనా మాంజా ప్రమాదంలో మృతి చెందారు. అయితే చైనా మాంజాపై రాష్ట్ర పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంజాను అమ్మినా కొన్నా వారిపై కేసులుపెడతామని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పెద్దమెుత్తంలో మాంజాను పట్టుకొని సీజ్ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకులు ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.ఆ చిన్నారి చావుకు బాధ్యులెవరు..?చైనా మాంజాతో గాలి పటాలు ఎగరేయకండని, అవి ప్రమాదమని చెప్పినా ఇంకా ప్రాణాలే పోతున్నాయ్కూకట్పల్లిలో ఓ చిన్నారి తండ్రితో పాటు బైక్పై వెళుతూ ప్రాణాలు కోల్పోయిందినాన్నా.. నాన్నా అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్ర గాయమైందిఆస్పత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదుఆ చిన్నారికి చావుక ఎవరు బాధ్యులు.. మనకి మనం మారదాం.. మనకు మనం తెలుసుకుందాంఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకొచ్చేదెవరూ..?ఆ కుటుంబం అరణ్య రోదనకు కారణం ఎవ్వరూ..?మనం మారాలి.. ఈ సమాజం మారాలి. సరదా కంటే ప్రాణం ముఖ్యమనే సంగతి తెలుసుకోవాలి -
20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం
-
రూ. 26 వేలకే కారు.. తీరా చూస్తే?
సాక్షి హైదరాబాద్: మల్లాపూర్లో తప్పుడు ప్రచారంతో తమను బురిడీ కొట్టిద్దామని చూసిన నిర్వాహకులకు ప్రజలు దేహశుద్ధి చేశారు. మల్లాపూర్లో రూ.26 వేలకే కారు అందిస్తామని కొద్దిరోజుల ఇన్స్టాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నమ్మిన ప్రజలు ఈ రోజు ( సోమవారం) పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది. దీంతో ఆగ్రహాం చెందిన ప్రజలు కర్రలతో నిర్వాహాకులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతిపజేశారు. అనంతరం నిర్వాహకులను అదుపులోకి తీసుకొని నాచారం పీఎస్కు తరలించారు. -
విద్యార్థిని ప్రాణం తీసిన గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం
సాక్షి,కామారెడ్డి: బాన్సువాడ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆటో నుంచి కిందకు దూకి ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని మృతికి ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీతే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన సంగీత బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత ఇంట్లో ఓ శుభకార్యం కోసం విద్యార్థినులే పాఠశాల ఫర్నిచర్ తరలించారు. తిరిగి ఫర్నిచర్ తీసుకొస్తున్న సమయంలో విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా జారి పడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. తలకు తీవ్ర గాయాలు రావడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.తల్లిదండ్రుల ఆందోళనసంగీత మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సునీత ఇంటి కార్యక్రమం కోసం విద్యార్థులను పనుల్లో ఉపయోగించడం, ఫర్నిచర్ తరలింపులో పాల్గొనడం వంటి చర్యలపై తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు.పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోవడంతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపించింది. సంగీత మృతి కుటుంబాన్ని, సహ విద్యార్థులను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ దూసుకెళ్లి..
రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ కిలోమీటర్ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు సిబ్బందితో సాగర్ హైవేపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్పైనే ఉండి కిలోమీటర్ దూరం వెళ్లిన ఎస్ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ్, హయత్నగర్కు చెందిన శ్రీకర్, నితిన్లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్సిటీ సీపీ సు«దీర్బాబు సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధుతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. -
కర్రెగుట్టలో ఐఈడీ పేలుళ్ల కలకలం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో బీజాపూర్ జిల్లా, కర్రెగుట్ట కొండల అటవీ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజ్లు (IEDs) పేలాయి. ఐఈడీలు పేలడంతో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో పదిమంది డీఆర్జీ సిబ్బంది, ఒకరు కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు డీఆర్జీ సిబ్బంది కాళ్లకు గాయాలు కాగా, మరో ముగ్గురి కంటికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్సనందిస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతం గతంలో నక్సల్స్కు సురక్షిత స్థావరంగా ఉండేది. 2025 ఏప్రిల్-మే నెలల్లో 21 రోజులపాటు జరిగిన విస్తృత ఆపరేషన్లో 31 మంది నక్సల్స్ హతమయ్యారు. ఆ సమయంలో భద్రతా బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, వైద్య సరఫరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది నవంబర్లో భద్రతా బలగాలు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది.కాగా,తాజాగా ఐఈడీ పేలుళ్ల ఘటన మరోసారి నక్సల్స్ వ్యూహాత్మక దాడుల తీవ్రతను చూపించింది. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నప్పటికీ, ఐఈడీ దాడులు వారికి ప్రధాన సవాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. -
ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్ తేడాతో..
సాక్షి, హైదరాబాద్: యువ బౌలర్ ధ్రుతి కేసరి ఐదు వికెట్లతో సత్తా చాటినా... హైదరాబాద్ జట్టుకు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం ఏఓసీ సెంటర్లో జరిగిన హోరాహోరీ వన్డే ప్రాక్టీస్ మ్యాచ్లో ఉత్తరాఖండ్ జట్టు 1 వికెట్ తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. మొదట హైదరాబాద్ 44.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. సంధ్య గోర (50; 9 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్ జట్టు 37 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. నందిని కశ్యప్ (63 బంతుల్లో 39; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్ కేసరి ధ్రుతి 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ధ్రుతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అతికష్టంపై ఛేదించి గెలిచింది. ఇదీ చదవండి: అనాహత్ ఓటమి న్యూఢిల్లీ: భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ న్యూయర్క్ వేదికగా జరిగిన ‘స్పోర్ట్ టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ రెండో రౌండ్లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ అనాహత్ 11–6, 11–6, 2–11, 8–11, 6–11తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సతోమి వటనాబె (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్ల్లో అది్వతీయ ప్రదర్శనతో సంచలనం నమోదు చేసేలా కనిపించిన 17 ఏళ్ల అనాహత్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది.


