breaking news
Hyderabad
-
మాదాపూర్లో దారుణం.. బెట్టింగ్ ఆడ్డొదన్న తండ్రిని చంపేశాడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో దారుణం జరిగింది. బెట్టింగ్ ఆడొద్దని మందలించిన తండ్రిని కుమారుడు చంపేశాడు. కొడుకు చదువు కోసం ఆరు లక్షలు ఇవ్వగా.. కొడుకు బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టాడు. దీంతో మందలించిన తండ్రి హనుమంత్ని హత్య చేసిన కుమారుడు రవీందర్.. ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. వనపర్తికి తీసుకెళ్లి తండ్రి మృతదేహానికి కర్మకాండ చేసే ప్రయత్నం చేశాడు.బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రవీందర్ని అదుపులోకి తీసుకున్న విచారించారు. తండ్రిని తానే చంపానని రవీందర్ ఒప్పుకున్నాడు. రవీందర్ను రిమాండ్కు తరలించారు. -
పేలింది డ్రయ్యర్ ఛాంబర్!
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదానికి రియాక్టర్ పేలుడో, బాయిలర్ పేలుడో కారణం కాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అక్కడ పేలింది స్ప్రే డ్రయ్యర్ బ్లాక్ అని చెబుతున్నారు. ఔషధ మాత్రల తయారీలో ప్రధాన ఔషధానికి సహాయకారిగా ఉపయోగించే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, దీనివల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదని చెబుతున్నారు. రికార్డుల్లో చూపిస్తున్నదానికి భిన్నంగా మరేదైనా ఉత్పత్తి జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడంతస్తుల భవనం పిల్లర్లు కూడా కూలిపోయేలా విస్ఫోటనం జరగడానికి మరేదో బలమైన పేలుడు పదార్థం కారణం కావచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన దాఖలాలు లేవని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీస్థాయిలో పేలుడు జరగడం తమకు కూడా దిగ్భ్రాంతి కలిగిస్తోందని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉన్నతాధికారులు అంటున్నారు. అసలు విషయంలో దర్యాప్తులోనే తేలుతుందని చెబుతున్నారు. మరోవైపు పేలుడులో కూలిపోయిన భవనంపై మూడు డ్రమ్ముల్లో ఏదో రసాయనాలు నిల్వచేశారని, ప్రమాదం తీవ్రత పెరగటానికి ఆ రసాయనాలే కారణం అయి ఉండవచ్చని అక్కడ పనిచేస్తున్న బిహార్కు చెందిన సమీర్ అహ్మద్ తెలిపాడు. -
శంషాబాద్ రావాల్సిన విమానాలు మళ్లింపు.. బెంగళూరులో ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్కు రావాల్సిన పలు విమాన సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. ల్యాండింగ్కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్కు రావాల్సిన విమానాలను బెంగళూరుకు తరలించారు. దీంతో, విమాన ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావలసిన పలు విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను బెంగుళూరు ఎయిర్ పోర్టుకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ముంబై-హైదరాబాద్, వైజాగ్-హైదరాబాద్, జైపూర్-హైదరాబాద్, లక్నో నుంచి రావలసిన విమానాలు బెంగళూరులో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను విజయవాడకు దారి మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. -
ట్రాన్స్ ఈక్వాలిటీ ఫర్ సొసైటీ..!
సమాజం తమను చిన్న చూపు చూస్తున్నా.. మిగతావారితో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నా వారంతా. ఆత్మగౌరవంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ ఇతరులకు దీటుగా బతికి చూపిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల తమ కష్టానికి ఫలితం లభించింది. తమతో పాటు తోటి ట్రాన్స్జెండర్లు కూడా తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అండగా నిలబడుతున్నారు. అనుకున్నతదే తడవుగా ఆలోచనలను ఆచరణలో పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఆ కార్యాచరణకు ఇతర సంస్థలు సైతం మేమున్నామంటూ మద్దతు తెలిపి భుజం తట్టాయి. ట్రాన్స్జెండర్స్ అనుకున్న లక్ష్యం నేరవేరేలా చేశాయి. నలుగురూ వారిని ఎగతాళి చేసినా.. అవహేళనకు గురవుతున్న ట్రాన్స్జెండర్లు తామేమీ తక్కువ కాదంటూ ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. సూరారం కాలనీకి చెందిన ట్రాన్స్జెండర్ రాపేటి జాస్మిన్. తన తోటివారికి అండగా నిలిచేందుకు ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ అనే సంస్థను 2020లో స్థాపించి ట్రాన్స్జెండర్లను డ్వాక్రా గ్రూప్, స్కిల్ డెవలప్మెంట్, టైలరింగ్, బ్యుటీషియన్, కంప్యూటర్ కోర్స్, జ్యూట్ మేకింగ్ వంటి వివిధ రంగాల్లో రాణించేందుకు కార్యాచరణ రూపొందించారు. ముంబై నుంచి ట్రైనర్స్.. ముంబైకి చెందిన గౌరవ్, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ సంస్థలు తోడుగా నిలవడంతో ‘సాక్ష్యం 3.0 ఫ్రైడ్ ఈవెంట్’ అనే ప్రాజెక్టు పేరిట వందరోజుల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని సోమవారం సూరారం కాలనీ ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఎస్ఐ రాజు చేతుల మీదుగా 100 మంది సర్టిఫికెట్లను అందుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పదిమందికి ఉపాధి కల్పిస్తా..ఇటీవల శిక్షణలో భాగంగా బ్యుటీషియన్లో నూతన విధానాలను నేర్చుకున్నా. స్థానికంగా సొంత బ్యూటీ పార్లర్ ఏర్పాటుచేసి పదిమందికి ఉపాధి కల్పించాలనేదే నా ఉద్దేశం. నగరంలో ఇతర కార్యక్రమాలకు ఎక్కడైనా బ్యుటీషియన్ ఈవెంట్స్కు వెళ్లేలా మా టీమ్ తయారు చేస్తా. మాకు కూడా సంఘంలో మహిళలతో సమానంగా గౌరవం అందాలి. – అంజలి బ్యుటీషియన్కంప్యూటర్పై పట్టు సాధించా..కంప్యూటర్ శిక్షణలో పలు మెళకువలు నేర్చుకున్నా. టైపింగ్ నుండి మొదలుకొని ఫొటో ఎడిటింగ్ వరకూ నేర్చుకున్నా. ఇప్పుడు నేను పదిమందికీ నేరి్పంచే విధంగా పట్టు సాధించా. నా కాళ్లపై నేను నిలబడగలననే ధైర్యం వచ్చింది. మున్ముందు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మరింత తెలుసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడతా. – నవీన లేటెస్ట్ మోడల్ టైలరింగ్ నేర్చుకున్నా.. క్రమం తప్పకుండా టైలరింగ్లో శిక్షణ ద్వారా పట్టుసాధించా. లేటెస్ట్ మోడల్ డిజైనింగ్లోనూ ప్రావీణ్యం పొందాను. సొంతగా టైలరింగ్ షాపు ఏర్పాటు చేసి తోటి వారికి ఉపాధి కల్పిస్తా.. – శరణ్య, టైలర్ (చదవండి: 35 మంది ఆడబిడ్డల తండ్రి..! 'దయ'కు సరైన నిర్వచనం..) -
పాక్ నటిగా పరిచయమై టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)
-
బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)
-
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్లో నిన్న (సోమవారం) రాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రచయితగా, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఖైరతాబాద్ నివాసంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. రేపు (బుధవారం) ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు.బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్ షాపులు నిర్వహించారు. -
Pashamylaram: అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కారి్మకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కారి్మకులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది.ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. -
భర్త దారుణ హత్య.. ఇంటికి తాళం వేసి భార్య పరార్..!
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. -
రిమోట్ కోసం తమ్ముడితో గొడవ పడి.. బాలిక ఆత్మహత్య
సైదాబాద్: టీవీ రిమోట్ కోసం తమ్మడితో గొడవ పడిన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వినయ్నగర్ కాలనీకి చెందిన మల్లిక, వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన వారి పెద్ద కుమార్తె ధృతి చందన (16) ఆదివారం రాత్రి తన తమ్ముడుతో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన ధృతి తమ్ముడిని కొట్టి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఇంటికి వచి్చన ఆమె తండ్రి వెంకన్న గది తలుపులు కొట్టినా ధృతి స్పందించకపోవడంతో తలుపులు పగుల కొట్టి లోపలికి వెళ్లి చూడగా ధృతి చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నావనెక్కి.. 'నేవీకి చేరి'..!
చిన్ననాటి విషాదాలను, పేదరికాన్ని జయించి సెయిలింగ్లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు యువకులు భారత నౌకాదళంలోని స్పోర్ట్స్ కంపెనీలో చేరనున్నారు. ఈ ముగ్గురు నవీన్, సాత్విక్ ధోకి, రిజ్వాన్ మహమ్మద్.. వారి జీవితం ఎలా ఉన్నా అద్భుతమైన సెయిలింగ్ ప్రతిభతో భవిష్యత్ ప్రయాణాన్ని సుగమం చేసుకున్నారు. ఈ యువ హైదరాబాదీ సెయిలర్లు గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎంవైఎస్సీ)కి ఎంపికయ్యారు. తార హోమ్ నుంచి యువ తారగా.. ప్రకాశం జిల్లాలోని లక్ష్మప్ప గ్రామానికి చెందినవాడు 13 సంవత్సరాల నవీన్. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తప్పిపోయి నగరంలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు దొరికాడు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తార హోమ్ అనే అనాథ శరణాలయానికి చేరుకున్నాడు. ఇలాంటి దయనీయమైన గతం నుంచి ఈ తరం యువతకు స్ఫూర్తి నింపేలా తను భవిష్యత్తును రూపుదిద్దుకున్నాడు. జాతీయ స్థాయి మేటి సెయిలర్గా.. 15 ఏళ్ల రిజ్వాన్ మహమ్మద్ ప్రస్తుతం దేశంలోనే నెం.1 సెయిలర్గా ఉన్నాడు. హైదరాబాద్లోని పాట్టిగడ్డ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో నివసించే రిజ్వాన్ ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో వంట మనిషిగా పనిచేస్తుంది. కాసింత ప్రోత్సాహం అందితే చాలు అనుకునే పరిస్థితి నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ సెయిలర్గా మారడంలో తన కృషి, నిబద్ధత, అంకితభావం ఎలాంటిదో ఊహించవచ్చు. కూలీ కుటుంబం.. వరంగల్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు 14 సంవత్సరాల సాత్విక్. అతని తండ్రి హైదరాబాద్ మోండా మార్కెట్లో కూలీగా, తల్లి ఓ ఇంటి పనిమనిషిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన సాత్విక్ భారత నౌకాదళంలో చేరనుండటం తనకే కాదు తన కుటుంబానికి సైతం గర్వకారణం. నేనున్నాననీ..ఈ ముగ్గురు యువకుల ప్రస్థానంలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) కీలక పాత్ర పోషించింది. ఆరేళ్ల నవీన్ తప్పిపోయి అనాథ శరణాలయం ‘తార హోమ్’కు చేరుకున్న సమయంలో.. వైసీహెచ్ అతన్ని గుర్తించి సెయిలింగ్ శిక్షణ కోసం ఎంపిక చేసింది. నవీన్ లాగే, పేద కుటుంబాల నుంచి వచ్చిన సాత్విక్, రిజ్వాన్ కూడా వైసీహెచ్ మార్గ దర్శకత్వంలోనే శిక్షణ పొందారు. కోచ్ సుహీమ్ షేక్ పర్యవేక్షణలో ఈ యువకులు సెయిలింగ్లో కఠోర శిక్షణ తీసుకున్నారు. అంకితభావం, పట్టుదల జాతీయ స్థాయి పోటీల్లో ఉన్నత స్థానాలకు చేర్చాయి. రిజ్వాన్ మహమ్మద్ అయితే స్థిరంగా పతకాలను సాధిస్తూ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ యువకుల అసాధారణ ప్రతిభ, క్రీడా స్ఫూర్తిని గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ, వారిని తమ జట్టులోకి తీసుకుంది. (చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..) -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, గోల్కొండ, మెహిదీపట్నం, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, రాజేంద్రనగర్, వికారాబాద్, వెంకటగిరి, యూసుఫ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. -
Hyderabad: ఓఆర్ఆర్పై ఒకదానికొకటి ఢీకొన్న10 కార్లు..
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. 10 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి చెన్నమ్మ హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న 10 కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
పూర్ణ భార్య సంచలన వీడియో విడుదల
-
పచ్చదనానికి 'మియావాకీ'..
నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ ప్రాంగణాలను పచ్చగా మార్చేందుకు శ్రద్ధ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జపనీస్ టెక్నిక్ అయిన మియావాకీ అత్యుత్తమ అనుసరణీయ విధానంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ విధానం ఊపందుకోవడంతో నగరం నలుదిశలా ఇప్పుడు పచ్చగా ప్రతిఫలిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు వాతావరణంలో ఏర్పడుతున్న సమతుల్యత వెరసి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చదనం ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది.. దీంతో విస్తారంగా మియావాకీ అడవుల పెరుగుదలకు దోహదపడుతోంది. తనను తాను పోషించుకునే, పెంపొందించుకునే సత్తా ఉన్న మియావాకీకి స్వల్పకాలం మాత్రమే పోషణ అవసరం. దీంతో పచ్చని ప్రదేశాలను విస్తరణ కోసం మియావాకీ అటవీకరణ విధానం ప్రస్తుతం విస్తృతంగా ఆదరణ పొందుతోంది. జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ అభివృద్ధి చేసిన డెన్స్ నేటివ్ మినీ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఈ విధానంలో భాగంగా ఒక చిన్న ప్రాంతంలో వివిధ రకాల స్థానిక చెట్ల జాతులను దగ్గరగా నాటడం జరుగుతోంది. ఫలితంగా దట్టమైన, వేగంగా పెరిగే అడవులు ఏర్పడనున్నాయి. దీనిని విజయవంతంగా అనుసరిస్తూ నగరంతో పాటు చుట్టుపక్కల అనేక మియావాకీ అడవులు పచ్చగా వరి్థల్లుతున్నాయి. జయహో గ్రీనరీ.. ప్రభుత్వ హరితహారం కార్యక్రమంతో పాటు, పెద్ద ఎత్తున అటవీకరణ ప్రాజెక్టుల కోసం అనేక ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు మియావాకీ పద్ధతిని అవలంభిస్తున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్నటువంటి పలు కంపెనీలు మియావాకీ తోటల పెంపకంలో తాము కూడా పాల్గొంటున్నాయి. ప్రముఖ బయోఫిలిక్ డెవలపర్ ఎకో–రియాల్టీ ఫర్మ్గా పేర్కొంటున్న స్టార్టప్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్, ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అటవీప్రాంతాన్ని శంషాబాద్లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని అదనంగా 100 ఎకరాల్లో విస్తరించనున్నారు. రాచకొండ పోలీసులు 40,000 మొక్కలతో మియావాకీ తోటను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దట్టమైన అడవిగా పెరిగింది. కొత్తపేటలో 10 ఎకరాల మియావాకీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వే కాలనీలోనూ ఈ పద్ధతిలో మొక్కలు నాటారు.. దీనిలో సే ట్రీస్ ఎరాన్మెంటల్ ట్రస్ట్ అనే ఎన్జీఓ కూడా భాగం పంచుకుంది. హైదరాబాద్ యూనివర్సిటీలో 4వేల మొక్కలతో మినీ ఫారెస్ట్ను సృష్టించారు. రెండేళ్లలో స్వయం పోషకంగా.. వ్యక్తిగత ఆసక్తితో బెంగళూరులో దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 15 ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్నాను. మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఇవి స్వయం పోషకాలుగా మారతాయి. ఆ తర్వాత వాటి పరిరక్షణకు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ విధానానికి తగినట్టుగా మొక్కలు పెంచే స్థలంలో పలు రకాల మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ విధానంలో తొలి దశలో వ్యయప్రయాసలు కూడా ఎక్కువే ఉంటాయి. – మహేష్ తలారి, ఎన్జీఓ ఎవర్గ్రీన్ ఎగెయిన్, మియావాకీ నిపుణులు మియావాకీ విశేషాలు.. మియావాకీ పద్ధతి తక్కువ సమయంలో దట్టమైన అడవులను సృష్టించగలదు. ఈ విధానంలో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి అంతేకాక ఈ అడవి సంప్రదాయకంగా నాటిన అడవుల కంటే 30 రెట్లు దట్టంగా ఉంటాయి. ఈ చిన్న అడవులు వివిధ జాతుల పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర వన్యప్రాణులను ఆకర్షించడానికి జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. ప్రధాన మియావాకీ సూత్రాలను అనుసరిస్తూ స్థానిక నేల వృక్షజాతులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తున్నారు. -
‘బేగంపేట’.. ఉత్కంఠ!
హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో గౌరవ విమానయాన శాఖ ముందస్తు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. పౌర విమానాల రాకపోకలకు అడ్డుగా ఉండే భవనాలు చెట్ల తొలగింపులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ’భారతీయ వాయుయాన్ అదినీయం’, 2024 (16 ఆఫ్ 2024)లో కీలక సవరణలు చేపట్టింది. ఈ చట్టంలోని సెక్షన్ 34 పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు నోటీసుల జారీ ప్రక్రియలో పలు సవరణలు చేశారు. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ రూల్స్తో ఈ నెల 18న ప్రత్యేక గెజిట్ ప్రచురించింది. ఈ గెజిట్ ప్రచురితమైన 21 రోజుల తర్వాత సంబంధిత రూల్స్ వినియోగంలోకి రానున్నాయి. ఈ గడువులోపు సంబంధిత రూల్స్పై అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో బస్తీలు, కాలనీల్లోని వేలాది నిర్మాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. రసూల్పురా, అన్నానగర్ పరిధిలోని వేలాది నిర్మాణాలు పూర్తిగా ఎయిర్పోర్టు స్థలాల్లోనే వెలసినవి కావడం గమనార్హం. కంటోన్మెంట్ పరిధిలోని కాలనీల్లో నిర్మాణాలకు ముందస్తుగానే ఎయిర్పోర్టు అథారిటీ ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది.ఏమిటీ సవరణలు.. ⇒ ‘భారతీయ వాయుయాన్ అదినీయం’, చట్టం సెక్షన్ 18 (1), (3) ప్రకారం సంబంధిత అధికారి విమాన యాన రాకపోకలకు అడ్డంకిగా ఉండే భవనాలు, చెట్ల తొలగింపు నోటీసు జారీ చేస్తారు. ⇒ నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు సంబంధిత భవనం, చెట్ల యజమాని పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును మరో 60 రోజుల వరకు పెంచే వెసులుబాటు ఉంది. ⇒ నిర్దేశిత గడువులోపు సంబంధిత యజమాని కోరిన వివరాలు సమరి్పంచకపోతే, అధికారులు ఇచ్చిన సమాచారాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ విమానయాన రాకపోకలకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించిన ఏదైనా భవనం లేదా చెట్టును సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నివేదిక రూపొందిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు యజమానులు పూర్తిస్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. ⇒ పౌర విమానయాన శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు స్పందించని యజమానులపై జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేసి, తదుపరి చర్యలు చేపడతారు. ఆ బస్తీల మనుగడ ప్రశ్నార్థకం ఈ నిబంధనలపై విమానాశ్రయాల సమీపంలోని భవనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని యజమానులు నిరసన వెలిబుచ్చుతున్నారు. కంటోన్మెంట్లో భవన నిర్మాణాలకు పౌర విమాన యాన శాఖ నుంచి ముందస్తుగానే ఎన్ఓసీలు తీసుకుంటారు. వారు సూచించిన ఎత్తుకు లోబడే మెజారిటీ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని నిర్మాణాలు మాత్రమే నిర్దేశిత ఎత్తుకంటే ఎక్కువ మోతాదులో ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయం చుట్టూ ఉన్న కంటోన్మెంట్ పరిధిలోని నిర్మాణాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే వేలాది నిర్మాణాలకు ఎయిర్ పోర్టు ఎన్ఓసీ నిబంధన అమల్లో లేదు. పౌర విమానయాన శాఖ తాజా ఉత్తర్వులతో బేగంపేట ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్న వేలాది నిర్మాణాలు పాక్షికంగా కూలి్చవేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నగరం నడి»ొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయంలో సాధారణ పౌరుల విమానాల రాకపోకలు కొన్ని ఏళ్ల క్రితమే నిలిచిపోయాయి. కేవలం చార్టెడ్ ఫ్లైట్లు, రక్షణ శాఖ విమానాలు మాత్రమే బేగంపేటకు వస్తున్నాయి. వీటి కోసం వేలాది భవనాలను కూల్చివేసే బదులు, ఈ విమానాశ్రయాన్నే తరలించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టును తరలించండి: వికాస్ మంచ్ సామాన్య పౌరుల రాకపోకలు నిలిచిపోయిన బేగంపేట ఎయిర్పోర్టును పూర్తిగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చార్టెడ్, వివిధ సంస్థలకు చెందిన విమానాల కోసం మాత్రమే వినియోగిస్తున్న బేగంపేట ఎయిర్పోర్టును దుండిగల్ లేదా హకీంపేటకు తరలించాలని కోరారు. -
బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బన్సీలాల్పేట్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి బోనాల వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఫి షరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి ఘటం తయారీ వస్తువులు, ఆభరణాలను ఫౌండర్ ట్రస్టీ ఫ్యామిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల వేడుకల సందర్భంగా ఆ లయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవా దాయ, పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్తు, సాంస్కృతిక, రవాణా, వైద్య ఆరోగ్య విభాగాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిష నర్ వెంకట్రావు, ఈవో మనోహర్ రెడ్డి ఉన్నారు.డప్పుల దరువులకు స్టెప్పులేసిన పొన్నం..మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు చప్పుళ్లకు ఆనందంతో పోతురాజుల ఈరగోళలను తీసుకొని నృత్యం చేశారు. మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అంతకు ముందు అమ్మవారి ఆలయాన్ని శ్రీ విద్యా శంకర భారతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి ఘటం ఉత్సవాల ఎదుర్కొలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సనత్నగర్ కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ కోట నీలిమ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
గోల్కొండ బోనాలు కోటకు వెల్లువెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
ఎక్సలెన్సియా అద్భుత విజయం.. Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కైవసం
సాక్షి, మొయినాబాద్: డెక్కన్ అరేనాలో జరిగిన 2025 Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఎక్సలెన్సియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గార్డియంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 1,000 మంది అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారతదేశ పాఠశాల క్రీడల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.ఆట ప్రారంభంలో గార్డియం ఆధిక్యత ప్రదర్శించినా, ఎక్సలెన్సియా పట్టుదలతో నిలబడి తొలి అర్ద భాగంలో గోల్స్ పడకుండా 0-0తో ముగించింది. సగం సమయం విరామంలో ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన ఆహార స్టాల్స్, ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల సందడితో స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం రెండో అర్ద భాగం 58వ నిమిషంలో నిమిష్ 30 అడుగుల యార్డ్ నుంచి కొట్టిన అద్భుతమైన షాట్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క గోల్తో ఎక్సలెన్సియా 1-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి విజిల్ మోగగానే ఎక్సలెన్సియా అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మూడు నెలల క్రితం క్వాలిఫైయర్స్తో మొదలైన ఎక్సలెన్సియా ప్రస్థానం ఛాంపియన్షిన్ కైవసం చేసుకోవడంతో ముగిసింది.మ్యాచ్ అనంతరం నిమిష్కు బ్యాలన్ డి'ఓర్(Ballon d’Or), గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. అభిమానులు రాత్రంతా నిమిష్ పేరుతో విజయ నినాదాలు చేశారు. ఇది కేవలం ఒక చివరి ఆట మాత్రమే కాదు. Varsity అనే ఒక కొత్త క్రీడా ఉద్యమం ఆవిర్భావం అని చెప్పొచ్చు. -
పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్లో నానక్రాంగూడ ప్రధాన హాట్స్పాట్గా నిలిచింది. లాంచింగ్స్లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్స్పాట్గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్స్పాట్గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. -
రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా..? భయపెడుతున్న టాప్ హీరోయిన్స్ అనుభవాలు
దక్షిణాదిలో పలువురు సినిమా షూటింగ్స్ కోసం ఎంచుకునే హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉన్నాయా? తరచుగా సినీతారలు ఆ ఫిలిం సిటీ గురించి ప్రకటిస్తున్న భయాలు, అనుభవాలు దేనికి సంకేతం? విశేషం ఏమిటంటే, సదరు ఫిలిం సిటీలో తాము ఎదుర్కున్న భయానక అనుభవాలు వెల్లడిస్తున్న వారు కూడా ఏదో చిన్నా చితకా నటీమణులు కాకపోవడం, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యంత పేరున్న ప్రముఖ తారలు కావడమే విశేషం. హైదరాబాద్ శివార్లలో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీ హంటెడ్ స్థలం అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్స్ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాలలో గడిపాపనని, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుంటుందని భావించానని కాజోల్ చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని పేర్కొన్నారు, ‘‘అది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించవచ్చు’’ అన్నారామె. అయితే, అదృష్టవశాత్తూ తనకు ఏ దయ్యమో భూతమో లాంటివి తనకు కనపడలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఒక ప్రముఖ సీనియర్ నటి, అదే విధంగా అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్ కితాబిచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం కాజోల్ మాత్రమే కాకుండా గతంలోనూ టాలీవుడ్ కి చిరపరిచితమైన రాశి ఖన్నా తాను అక్కడ బస చేసినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్ధం వినిపించింది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మరో అగ్ర తార తాప్సీ పన్ను కూడా అక్కడేదో అసహజ వాతావరణ ఉంది అంటూ మాట్లాడారు. అదే విధంగా తమిళ దర్శకుడు సుందర్ సి వంటి సెలబ్రిటీలు సైతం తమకు అక్కడ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకోవడం... గమనార్హం. ఫిలింసిటీ...హారర్కి అడ్రెస్సా?రామోజీ ఫిల్మ్ సిటీని వందల ఎకరాల్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మూఢనమ్మాకాలను వ్యాప్తి చెందించడం మంచిది కాదనేది నిజమే అయినప్పటికీ, ఎన్నో రకాల అనుభవాలను చవి చూసిన ధైర్యవంతులైన సినీ తారలు వ్యక్తం చేసే అభిప్రాయాలను కొట్టిపారేయలేం. మూఢనమ్మకాల సంగతెలా ఉన్నా, ఆయా తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నిర్మాణం.. మరింత భారం
సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి.2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. -
‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం’.. ఎంపీ రఘనందన్కు మరో బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత వారం బెదిరింపు కాల్గత వారం ఎంపీ రఘునందన్కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
జూబ్లీహిల్స్లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి. హైదరాబాద్లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది. ‘పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు. మీడియాతో పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్మరోవైపు పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్ను పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు. -
రియల్ఎస్టేట్లోకి ‘కొత్త’ కస్టమర్లు..
హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ కస్టమర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్తతరం కస్టమర్లకు విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లను కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగినట్టుగానే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రధాన నగరంలో కష్టమే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్య, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లలు సంపాదన కూడా తోడైంది. 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని, దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
గోల్కొండ కోటలో బోనాల సందడి
-
‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’
హైదరాబాద్: చక్కటి సందేశాన్నిచ్చే జ్యోతిరావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈరోజు(శనివారం, జూన్ 28) పంజాగుట్ట పీవీఆర్ సినిమాస్లో జ్యోతిరావు ఫూలేచిత్రాన్ని చూసిన మహేష్ కుమార్ గౌడ్.. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లుగా పూలే చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే జ్యోతి రావు పూలే తన భార్యను చదివించాడు. మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి నూతన ఒరవడి సృష్టించారు. నేడు బహుజనులు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చామంటే జ్యోతి రావు పూలే కృషి వల్లే. పూలే చిత్ర నిర్మాతలు డైరక్టర్ చిత్రంలోని నటీనటులకు అభినందనలు. రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పులే చిత్రాన్ని వీక్షిస్తున్నారు. మన రాష్ట్రంలో పులే చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. మన భవిష్యత్తుకు ఆనాడు పూలే ఎంత కృషి చేశారో ఈ చిత్రం ద్వారా అర్ధం అవుతుంది’ అని అన్నారు. -
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో 51 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతోంది. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.మేడ్చల్ క్లస్టర్ హవా.. నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, శామీర్పేట్, పటాన్చెరు ఇండ్రస్టియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్నగర్.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. 👉 ఇదీ చదవండి: హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..మేడ్చల్ క్లస్టర్లో వేర్హౌస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. డిమాండ్ ఎందుకంటే.. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ న్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. -
కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా సున్నం చెరువు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని సున్నం చెరువు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. అందులోని నీరు మరిగించినా తొలగిపోని కారకాలతో నిండిపోయింది. ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేస్తు న్నారు. ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుర్తించింది. నమూనాలు సేకరించి, కాలుష్య నియంత్రణ మండలితో (పీసీబీ) పరీక్షలు చేయించి మరీ నిర్థారించింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన... సున్నం చెరువు శేరిలింగంపల్లి–కూకట్పల్లి మండలాల సరిహద్దులో ఉన్న గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం కాలుష్య కాసారంలా మారిన ఈ చెరువు సమీపంలోకి వెళ్లినా భరించ లేని దుర్వాసన ఉంటోంది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి దరు ఆ నీటిని తాగునీటిగా పేర్కొంటూ ట్యాంకర్ల ద్వారా పరిసరాల్లోని విక్రయిస్తున్నారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా పరీక్షలు... నగరంలోని తమ్మిడికుంట, బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, బుమ్రకుద్దీన్ దౌలా చెరువులతో పాటు సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. సున్నం చెరువులో మంచి నీరు నిలువ ఉండేలా చేయడానికి దాదాపు రూ.10 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తోంది. ఆ చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడి భూగర్భ జలాల నమూనాలు సేకరించి, పీసీబీ ద్వారా పరీక్షలు చేయించింది. తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలకూ పరీక్షలు చేయించింది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిలో నికెల్, కాడ్మియం. సీసం లోహాల మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిన మోతాదులో కాకుండా.. 2 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పీసీబీ నివేదిక రూపొందించింది.ప్రమాదకర స్థాయిలో సీసం... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో సీసం 0.01 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో ఇది 0.073 నుంచి 0.122 వరకు ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఇలాంటి నీరు పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపి, వారి జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుందని, రక్తహీనతకు కారణం అవుతుందని హైడ్రా స్పష్టం చేసింది. లీటరు నీటిలో కాడ్మియం 0.003 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు పరిసరాల్లోని బోర్ల నీటిలో ఇది 0.007 నుంచి 0.010 మిల్లీ గ్రాముల వరకు ఉన్నట్టు వెల్లడైంది. ఇలా అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.చదవండి: బిల్డ్నౌతో వేగం పెరిగినా.. తగ్గని పైరవీలు లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల వరకు నికెల్ ఉండొచ్చు. ఈ నీటిలో ఇది 0.038 నుంచి 0.046 మిల్లీ గ్రాముల వరకు ఉంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరగబెట్టినా ఫలితం ఉండదు... సాధారణంగా నీటిని మరగబెట్టి, చల్లార్చి తాగితే అందులో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు కొన్ని కాలుష్య కారకాలు పోతాయి. అయితే సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రమాదమే అని వైద్యులు చెప్తున్నారు. మరగటం వల్ల అందులోని సూక్ష్మక్రిములు పోయినా... సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద బోర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించింది. -
హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్బీ)లో నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కేపీహెచ్బీలో చదరపు గజం ధర రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.ఐటీ హబ్కు చేరువలో ఉండటం వల్లే ఈ భూములకు అత్యధిక డిమాండ్ ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఐటీ నిపుణులు, సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ఇన్వెంటరీ, అందుబాటుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో బ్రాండెడ్ డెవలపర్లు కానీ ప్రాజెక్ట్లలో కూడా అపార్ట్మెంట్ల ధరలు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మెరుగైన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల విస్తరణ, కనెక్టివిటీ, కొత్త మెట్రో లైన్లు, ఎక్స్ప్రెస్ వేస్, ఐటీ పార్క్లతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతో నగరంలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తుండటంతో కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.👉 ఇదీ చదవండి: మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్ -
హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ కార్యాలయం
హైదరాబాద్: నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీఎన్) హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో తన అత్యాధునిక కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా మానవ వనరుల అభివృద్ధి విషయంలో మరింత ముందుకు వెళ్లడం, ఎక్స్లెన్స్, సృజనాత్మకత, సుస్థిరాభివృద్ధి దిశగా తన కృషిని చాటడంలో ఎన్హెచ్ఆర్డీఎన్ నిబద్ధతకు ఒక నిదర్శనం.నాయకత్వం, అభివృద్ధి, వృత్తిగత సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర కార్యాలయంగా రూపొందుతుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం ప్రారంభించిన ఈ కలల ప్రాజెక్టు సూచిస్తోంది. అందరికీ ఉపయోగపడే ప్రాంతం, చర్చలకు ప్రోత్సాహం, నిరంతర అభ్యాసం, వివిధ రంగాల్లోని హెచ్ఆర్ నిపుణుల మధ్య పరస్పర విధానాల మార్పిడి లాంటి వాటన్నింటికీ ఇది ఒక చక్కటి వేదికగా నిలిచేలా అద్భుతంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు.దేశంలో బలమైన మానవ పెట్టుబడి పునాది వేయడానికి తమ సమిష్టి కృషికి నిదర్శనంగా ఈ కొత్త కేంద్రం నిలుస్తుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు. హెచ్ఆర్ వృత్తినిపుణులకు ఇది ఒక డైనమిక్ వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మారుతున్న పని వాతావరణం నేపథ్యంలో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పంచుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్ఆర్ నిపుణులు వృత్తిపరంగా ఎదిగేందుకు తాము గణనీయంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కొత్త భవనం వల్ల కలిగే విస్తృత ప్రభావం గురించి ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయాధ్యక్షుడు ప్రేమ్ సింగ్ ఇలా వివరించారు. "నైపుణ్యాలు, నాయకత్వాలను పోషించాలన్న ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయ నిబద్ధతను ఈ హైదరాబాద్ కార్యాలయ ప్రారంభం ప్రతిబింబిస్తుంది. హెచ్ఆర్ వృత్తి నిపుణులకు సాధికారత కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తద్వారా ఇది వివిధ సంస్థలను, దేశవ్యాప్తంగా సమాజాన్ని కూడా బలోపేతం చేస్తుంది" అని చెప్పారు.ఎన్హెచ్ఆర్డీఎన్ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్డీఎన్ మాజీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు , ఇంకా పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 1.2 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్) ఫ్లైఓవర్ను శనివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఫ్లైఓవర్ విశిష్టతలు.. ఫైనాన్షియల్ డిస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనాఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు వెడల్పు 12 మీటర్లు ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా -
‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ బాస్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్ లేదా జవహర్గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025 -
మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
-
బిగ్ ట్విస్ట్.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు
గాంధీభవన్లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి చిట్చాట్ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్చాట్లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్ను గౌరవిస్తాను. రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు. -
ఔటర్లో అడ్రస్ ఉంటేనే ఆటో
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో నివాసం ఉండే డ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. కొత్త ఆటోరిక్షాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ 65 వేల పరి్మట్లను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10 వేల సీఎన్జీ ఆటో పర్మిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రోఫిట్మెంట్లు అమర్చు,కొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు కొత్త ఆటో పరి్మట్లపై రవాణా కమిషనర్ కె.సురేంద్రమోహన్ తాజాగా విధివిధానాలు విడుదల చేశారు. డాక్యుమెంట్లు తప్పనిసరి... ఆటో కొనుగోలు చేసే వ్యక్తి ఔటర్ పరిధిలో తన అడ్రస్ను నిర్ధారించే రెండు డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. కొనుగోలుదార్ల అడ్రస్ నిర్ధారణ బాధ్యత డీలర్లదేనని తెలిపారు. దరఖాస్తుదారు పూర్తి వివరాలతో పాటు ఆటో లేదా కారు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పుట్టిన తేదీ, ఔటర్ పరిధిలో రెండు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలతో ఆటోరిక్షా డీలర్లను సంప్రదించాలి. ఈ మేరకు డీలర్లు సీఎఫ్ఎస్టీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను ఆర్టీఏకు అందజేయాలి. ఇలా డాక్యుమెంట్లతో సహా తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి 24 గంటల్లో ఆర్టీఏ అధికారులు అనుమతులు అందజేస్తారు. అనుమతుల ఆధారంగా డ్రైవర్లు 60 రోజుల్లో కొత్త ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ గడువు ప్రకారం కొనుగోలు చేయలేకపోతే ఆ అనుమతులకు చెల్లుబాటు ఉండదని కమిషనర్ తెలిపారు. కొత్తగా 65 వేల పరి్మట్లను విడుదల చేసిన దృష్ట్యా పాత పర్మిట్లను రద్దు చేశారు. ఈ మేరకు పాత ఎల్పీజీ, డీజిల్, సీఎన్జీ పర్మిట్లపై కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు వీలులేదని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్కు తెరపడేనా? ఆటో పర్మిట్లు నగరంలోని ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సుమారు 80 వేల పాత ఆటో పరి్మట్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న వ్యాపారులు ఒక్కో పరి్మట్ను రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాత పరి్మట్లపైనే ఆటోడ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఏటా భారీ ఎత్తున అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వం ఈసారి ఏకంగా 65 వేల కొత్త ఆటోలకు అనుమతినిచి్చన దృష్ట్యా ఇప్పటికైనా ఫైనాన్షియర్ల దోపిడీ ఆగిపోవాలని ఆటో సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి. -
Hyderabad: కోడలితో అఫైర్.. ప్రాణం తీసింది
కుషాయిగూడ(హైదరాబాద్ ): వరుసకు కోడలయ్యే యువతితో సన్నిహితంగా ఉన్నాననే విషయం బయట పడిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్ (30) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. దమ్మాయిగూడకు చెందిన పెయింటింగ్ కాంట్రాక్టర్, వరుసకు బావ అయ్యే వ్యక్తి వద్ద పని చేస్తూ చర్లపల్లి ఐజీ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బావ కూతురితో పరిచయం పెరిగి ఆమెకు సన్నిహితమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి, అతడి భార్య గురువారం రాత్రి భానుచందర్కు ఫోన్ చేసి మందలించారు. ఈ విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టామని భార్యాభర్తలిద్దరూ హాజరు కావాలని చెప్పినట్లు మృతుడి భార్య పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భానుచందర్ శుక్రవారం పిల్లలను స్కూల్ పంపి పంచాయితీకి వెళ్దామంటూ భార్యకు చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్లింది. దీంతో బాత్రూం బయట నుంచి గడియ పెట్టిన భానుచందర్.. నలుగురిలో తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. బాత్రూం తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరు గు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా భానుచందర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న భానుచందర్ను కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
RTC బస్సును ఢీకొన్న బైక్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తికర వాతావరణల నెలకొంది. హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పు పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.జీహెచ్ఎంసీ కార్యాలయానికి రెండు వైపులా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం, ఆఫీసు గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి అన్నపూర్ణ క్యాంటీన్ ముద్దు.. ఇందిరమ్మ క్యాంటీన్ వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించి నినాదాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..‘హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే GHMC కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు..అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు?. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు. -
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య
-
హైదరాబాద్ : నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
పీజేఆర్ ఫ్లైఓవర్పై.. రయ్ రయ్
గచ్చిబౌలి: ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ విశిష్టతలు.. ూ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ూ శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ూ ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా ూ ఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ూ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ూ ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు ూ త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు ూ క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ ూ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు ూ వెడల్పు 12 మీటర్లు ూ ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా ఫ్లైఓవర్ పరిశీలన.. శుక్రవారం పీజేఆర్ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాం«దీ, అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్రావు, ప్రాజెక్ట్ సీఈ భాస్కర్రెడ్డి, ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ, ఇతర అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్కు కృతజ్ఞతలు పీజేఆర్ సతీమణి ఇందిర శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లై ఓవర్కు దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి పేరు పెడుతున్నట్లు జీఓ విడుదల చేయడంతో ఆయన సతీమణి సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచి్చందన్నారు. ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవానికి వచ్చి సీఎం, మంత్రులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోతున్నానని ఆమె తెలిపారు. మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం హర్షణీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద మరో ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటం సంతోషంగా, గర్వంగానూ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం పీజేఆర్ (శిల్పా లే ఔట్ ఫేజ్–2) ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఫ్లై ఓవర్ వీడియోను శుక్రవారం ఆయన షేర్ చేశారు. ఎస్సార్డీపీలోని 42 ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. -
అడుక్కోవద్దు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరోసారి బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోంలకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బల్దియా ప్రకటించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలమేరకు ఇప్పటికే అన్ని సర్కిళ్లలో.. ప్రధానంగా బషీర్ బాగ్, సెక్రటేరియట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లోని జంక్షన్లలోని యాచకులు, ఫుట్పాత్లపై ఉండేవారిని గుర్తించి జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని తమ సొంత ఊళ్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నా రు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం అందుకొని, వారిని వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. 221 మంది గుర్తింపు.. ఇప్పటి వరకు 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలకు తరలించగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారివారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్పాత్లపై ఉండేవారిని షెల్టర్ హోంలకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా.. తాజాగా నాంపల్లి మెట్రోస్టేషన్,ఎస్సార్నగర్ మెట్రో జంక్షన్, శిల్పారామం, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువ మందిని గుర్తించారు. సాగేనా.. ఆగేనా? నగరాన్ని బెగ్గర్ ఫ్రీ చేయడమనేది ప్రహసనంగా మారింది. గతంలోనూ ప్రయత్నాలు చేసినా మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. 2017 నవంబర్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న (ప్రస్తుతం సైతం ఆయనే) డొనాల్డ్ ట్రంప్ కుమార్తె నగరానికి వచ్చే ముందు యాచకులు లేకుండా చేశారు. మున్ముందు బిచ్చగాళ్లు అనేవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించి కొన్ని నెలల వరకు కొనసాగించారు. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో యాచన చేస్తున్న వారిని నగర శివార్లలోని చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. ఈ వృత్తిని నిర్మూలిస్తామని అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ప్రకటించారు. వారిలో చాలామంది ఫేక్ అని, దాదాపు మూడువేల మంది పసిపిల్లలతో దందా నడిపిస్తున్నారని, దాన్ని అరికడతామన్నారు. నిజంగా యాచన తప్ప ఏపనీ చేయలేని అసహాయులను అన్నివిధాలా ఆదుకుంటామని, పనిచేసే శక్తి ఉన్నవారికి అవసరమైన వారికి తగిన శిక్షణ నిప్పించి ఉపాధి కలి్పస్తామన్నారు. కానీ.. అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి బెగ్గర్ ఫ్రీ నగరంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఏమవుతుందో కొన్నాళ్లయితే కానీ తెలియదు. రూ. 300 కోట్లకు పైగా సంపాదన వివిధ సర్వేల మేరకు నగరంలోని యాచకులు ఏటా రూ. 300 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.నకిలీలే అధికం.. గ్రేటర్లో ఇరవై వేల మందికి పైగా ఈ వృత్తిలో ఉండగా, వీరిలో కేవలం పదిశాతం మాత్రమే నిజంగా అశక్తులు. బిహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా వీరిలో ఉన్నారు. జంక్షన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు వీరి అడ్డాలు. వీరిలో చాలామందికి మద్యం, ఇతరత్రా మత్తుపదార్థాల వ్యసనం ఉంది. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున రూ. 500 వరకు ఆర్జిస్తున్నారు. ఈ పని చేస్తున్న మహిళల్లో కొందరు పగటి పూట యాచన చేస్తూ, రాత్రి వేళల్లో సెక్క్ వర్కర్లుగా మారుతున్నారు. యాచకుల్లో 90 శాతానికి పైగా పునరావాసం కలి్పస్తామన్నా, వృద్ధాశ్రమాలు/విద్యాసంస్థలు/ ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో చేరుస్తామన్నా నిరాకరిస్తున్నట్లు వివిధ సర్వేల్లో వెల్లడైంది. -
ఐఏఎంసీకి భూకేటాయింపు చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నంబర్83/1లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనా ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్టు బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికా రం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధన క్లాజ్ 6 (డీ)ను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు బట్టింది.తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ చెల్లింపును తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్స్–1975ను ఈ భూ కేటా యింపు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్ట బద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని.. అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చిచెప్పింది. గత నాలుగేళ్లలో ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవి ష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని (అందులో 11 అనుకూలంగా)... 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమి త్తం ఏటా రూ. 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమ తిస్తూ జారీ చేసిన జీవోలు 76, 365లను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించినా.. ఓ ప్రైవేట్ సంస్థకు అది శాశ్వతంగా ఉండ కూడదని హితవు పలికింది. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది.ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవీ.. ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటా యిస్తూ 2021 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు 76, 365లను, కేసుల కేటాయింపునకు జీవో 6ను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొనేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఎ.వెంకట్రామిరెడ్డి, వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను దాఖలు చేశారు.ఓ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సెంటర్కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని.. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్లపై జనవరిలో వాదనలు ముగించిన జసిŠట్స్ కె.లక్ష్మణ్, కె.సుజన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.వాదనలు సాగాయిలా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రూ. 350 కోట్లకుపైగా విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం రాష్ట్రానికి తీరని నష్టం. ఓ ప్రైవేట్ ట్రస్ట్కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడమే కాకుండా నిర్వహణ పేరిట ఏటా రూ. 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేట్సంస్థకు భూకేటాయింపు జరిపారు’ అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదిస్తూ ‘ఐఏఎంసీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ఇలాంటి వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నాయి. ఐఏఎంసీతో వివాదాలు పరిష్కారమైతే కోర్టులపైనా భారం తగ్గుతుంది. ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఐఏఎంసీ ట్రస్ట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయీ దుర్వినియోగం కాలేదు’ అని నివేదించారు.ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయిందన్న ధర్మాసనం‘ప్రభుత్వాల నుంచి నిరంతర ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) తన లక్ష్యాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో మేము ఎత్తి చూపాలనుకుంటున్నాం. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి 1995లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఏడీఆర్ ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది. దాని ప్రారంభం నుంచి ఐసీఏడీఆర్ 49 మధ్యవర్తిత్వ కేసులనే స్వీకరించిందని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక పేర్కొంది.ఆర్థిక సహాయం ఉన్నా కేసుల పరిష్కారం నామమాత్రంగానే ఉన్నందున ఐసీఏడీఆర్ను స్వాధీనం చేసుకోవాలని.. దానికి మంజూరు చేసిన శాశ్వత లీజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎంసీ అలా మారదని మేము ఆశిస్తున్నాము. అయితే మూడేళ్లుగా ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం, ఉచిత కార్యాలయ స్థలాన్ని అందించినా ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన మేరకు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే సంకేతాలను చూపించలేకపోయింది. ఐఏఎంసీ ప్రారంభానికి మద్దతు సమర్థనీయమే.కానీ అలాంటి సంస్థలకు నిరంతర, శాశ్వత ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఐఏఎంసీ పనితీరును ఏటా సమీక్షించి, దాని ఖాతాలను తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) లేదా మరే ఇతర సమర్థ అధికారి ద్వారా ఆడిట్ చేయించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. గత ఒప్పందం మేరకు ఐదేళ్ల తర్వాత ఐఏఎంసీ పనితీరుకు లోబడి నిధుల విడుదల ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిధుల కేటాయింపునకు పనితీరే కొలమానం..‘ప్రభుత్వ వివాదాలన్నీ ఐఏఎంసీలోనే పరిష్కరించుకునేలా ఇచ్చిన జీవో సమర్థనీయమే అయినా.. పలు సూచనలు చేయాల్సి ఉంది. రూ. 3 కోట్లకుపైగా విలువైన అన్ని వివాదాలను ఐఏఎంసీకి మధ్యవర్తిత్వం కోసం సూచించాలనే ప్రభుత్వ నిర్ణయం విధానపరమైనది. అయితే ప్రజాధనంతో ఈ అంశం ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి సూచించడం, దానికయ్యే ఖర్చులను పరిశీలించాల్సి ఉంటుంది. ఐఏఎంసీ ద్వారా మధ్యవర్తిత్వ ఖర్చు ఎక్కువగా ఉందని.. ఖజానాపై గణనీయమైన భారం పడుతున్నట్లు గురిస్తే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత పిల్లను పాక్షికంగా అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది.మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాలి..‘కేంద్ర న్యాయ శాఖ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఐసీసీ కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ), లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ (ఎల్సీఐఏ), హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (హెచ్కెఐఏసీ)ల మాదిరిగానే మధ్యవర్తిత్వ సేవలను అందించే సంస్థలను స్థాపించాలని సిఫార్సు చేసింది.సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను వివరించింది. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సులభతరం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మధ్యవర్తిత్వ సంస్థల నిర్వహణకు ప్రారంభ మూలధనం అవసరమని.. దాన్ని ప్రభుత్వం అందించవచ్చని పేర్కొంది. మధ్యవర్తిత్వ సంస్థలకు ప్రభుత్వాలు మద్దతివ్వడం సంతృప్తికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
యువ ఇన్నోవేటర్స్ను ప్రోత్సహించేలా హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డీట్) గుర్తింపు ఫౌండేషన్, వీవ్ మీడియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైడియాథన్ పోస్టర్ లాంచ్ స్థానిక డీట్ ఆఫీసు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో డీట్ డైరెక్ట్ ఈ ఆర్ జనార్దన్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ పీఆర్ వంశీ, వీవ్ మీడియా టీం లాంచ్ చేశారు. వీ హబ్ సీఈఓ సీత చేతుల మీదుగా వీ హబ్లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 18-30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, యువ ఇన్నోవేటర్స్ ఈ కాంపిటీషన్ పాల్గొనవచ్చని ఫౌండేషన్ డైరెక్టర్ నరేంద తెలిపారు. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు , అప్ స్కిల్లింగ్, ఇంకుబేషన్ సపోర్ట్, ఫండింగ్ సపోర్ట్ అందిస్తున్నామని ‘గుర్తింపు ఫౌండేషన్’ డైరెక్టర్ నరేంద తెలిపారు. -
HMDA: బిల్డ్ నౌతో వేగం పెరిగినా..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రణాళికా విభాగంలో పారదర్శకత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సకాలంలో అనుమతులు లభించకపోవడం వల్ల దరఖాస్తుదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొని ఉండగా, మరోవైపు కన్సల్టెంట్లు, లైజనింగ్ సిబ్బంది ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రమే త్వరితగతిన మోక్షం లభిస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను మరింత వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా ఇచ్చేందుకు కొత్తగా బిల్డ్నౌ సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ జాప్యాన్ని నివారించ లేకపోవడం గమనార్హం.బిల్డ్నౌ (BuildNow) వెబ్సైట్ ద్వారా క్షణాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం లభించింది. కానీ, ఫైళ్లను పరిష్కరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు అందజేయడంలో మాత్రం జాప్యం కొనసాగుతోందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అనుమతుల్లో ఉద్దేశపూర్వకమైన జాప్యాన్ని అరికట్టేందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకొనేవారు. జరిమానాలు విధించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడం వల్ల కూడా పారదర్శత కనిపించడం లేదు. మరోవైపు ఈ పరిణామం వల్ల నిజాయతీగా పని చేసే అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సైతం అప్రతిష్టను మూట గట్టుకోవలసి వస్తోందని ప్రణాళికా విభాగానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు.రియల్ పరుగులు... కొంతకాలంగా నగరంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయి. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ వెలుపల బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. అదే సమయంలో భారీ లే అవుట్లు సైతం వెలుస్తున్నాయి. దీంతో అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తులు కుప్పలుగా వస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది నిర్మాణ రంగంలో అనుమతులు రెట్టింపు అయినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. శంషాబాద్, అమీన్పూర్, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి (Bachupally) తదితర ప్రాంతాల్లో హైరైజ్డ్ టవర్లు, బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగినట్లు అంచనా. మరోవైపు టీజీ బీపాస్ కంటే బిల్డ్నౌ వెబ్సైట్లో వెంటనే ‘కీ’లు లభించడం వల్ల కూడా దరఖాస్తు ప్రక్రియ సులభతరమైంది. వివిధ రకాలుగా వచ్చిన మార్పులు ఇటు కన్సల్టెంట్ల రూపంలో ఉండే మధ్యవర్తులకు, లైజనింగ్ సిబ్బంది పేరిట పైరవీలు చేసేవారికి చక్కటి అవకాశంగా మారింది.ట్రిపుల్ ఆర్ వరకు అనుమతులు హెచ్ఎండీఏ (HMDA) పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. గతంలో డీటీసీపీ నుంచి అనుమతులు పొందిన ప్రాంతాలన్నీ ఇప్పుడు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్తగా విలీనమైన 11 జిల్లాల పరిధిలోని 3,550 గ్రామాల్లో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి నిర్మాణ సంస్థలకు ఊరట లభించింది. చదవండి: సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలుఇదివరకు డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న అపరిష్కృత ఫైళ్లు సైతం హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. అన్ని విధాలుగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, నిర్మాణరంగంలో మార్పులు చోటుచేసుకొని వేగం పెరిగింది. అదేస్థాయిలో హెచ్ఎండీఏకు వచ్చే ఫైళ్లు సైతం గణనీయంగా నమోదవుతున్నాయి. అందుకనుగుణంగానే హెచ్ఎండీఏ కార్యాలయంలో ప్రణాళికా విభాగం కొలువుదీరిన నాలుగు, ఐదు, ఏడో అంతస్థులు పైరవీకారులతో సందడిగా మారడం గమనార్హం. -
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు?
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు నియామకానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరో మూడు నెలల్లోపే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి స్థానంలో మరొకరి పగ్గాలు అప్పగించేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్లు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు, వచ్చే నెల ఒకటో తేదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 30వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. అదే సమయంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా జరుగనుంది. ఈ రెండు నామినేషన్ల ప్రక్రియ ఈనెల చివరన నిర్వహించే జూలై 1వ తేదీన కొత్త అధ్యక్షుల్ని ప్రకటించే యోచనలో ఉన్నారు. తెలంగాణ బిజెపి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండ్లాంజె నియమించగా, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించారు. -
‘మిసెస్ ఆసియా వరల్డ్–2025’ విజేత రేవతి
యుఎస్తో పాటు భారత్లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గానూ ‘మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్–2025’ కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్ రేవతి దక్కించుకున్నారు. ఈ విషయాన్ని మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు గురువారం తెలిపారు. జూన్ 22న దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సీఈఓగా పనిచేశాసిన, తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు తెలిపారు. (చదవండి: నేషనల్ కాదు ఇంటర్నేషనల్..! లగ్జరీ బ్రాండ్లతో జత కట్టిన అందాల భామలు వీరే) -
'అమేయ డబ్లి' పాన్ ఇండియా టూర్.
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్తో పాటు భారత్లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. ప్రదర్శనలో 25 శాతం వారికే.. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. అనాది నుంచి హైదరాబాద్కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది. – సింగర్ అమేయ డబ్లి -
మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాల జాతర (ఫొటోలు)
-
రైల్వే ట్రాక్ పై కారుతో దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణం ఇదే!
-
ఇంటి నుంచి తల్లిని గెంటేసిన కుమారులు.. షాకిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మచ్చలా నిలుస్తోంది. చివరికి తమను కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తుంది. అయితే వృద్ధాప్యంలోనూ తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు ఓ తల్లి తగిన బుద్ధి చెప్పింది. జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో ఎట్టకేలకు తన సొంతింటిని తాను సొంతం చేసుకుంది.మూసారాంబాగ్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన శకుంతులా బాయి (90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన నివాసంలో కొడుకులతో కలిసి ఉండేది. కొంత కాలం తర్వాత తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తల్లిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపేశారు. దాంతో గత్యంతరం లేక వృద్ధురాలు ఏడాదిన్నరగా సైదాబాద్లోని చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటుంది.తన బాగోగులు చూడని కొడుకులు తన ఇంట్లో ఉండ కూడదని నిర్ణయించుకుంది. సీనియర్ సిటిజెన్స్ అసోషియేషన్ ప్రతినిధులతో కలిసి వెళ్లి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను 2024 ఫిబ్రవరిలో తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆర్డీఓ ఆమె ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంటిని తల్లికి ఇవ్వడానికి మొదట ఇద్దరూ అంగీకరించారు. అయితే నెలలు గడుస్తున్నా వారు ఇంటిని ఖాళీ చేయడం లేదు.ఆర్డీఓ ఆదేశాల మేరకు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించ లేదు. దాంతో తహసీల్దార్ మూడు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఫైనల్ నోటీసులు ఇచ్చారు. దాంతో వారు ఇంటికి తాళం వేసి సమాచారం ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయారు. గురువారం సైదాబాద్ తహసీల్దార్ సిబ్బందితో వచ్చి ఇంటిని సీజ్ చేసారు. శకుంతలా బాయికి ఇల్లు అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు. -
హైదరాబాద్లో యాంటీ డ్రగ్ డే ప్రోగ్రామ్ (ఫొటోలు)
-
సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలు
ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం.. ఇప్పుడు ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’గా ప్రసిద్ధి చెందుతోంది. ఇంటిపంట కొత్త పుంతలు తొక్కుతోంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ, విదేశాలకు విస్తరించింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే సుమారు 70 వేల మందికి పైగా టెర్రస్ గార్డెనర్స్ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్లు అంచనా. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్లపై ఆరోగ్య సిరులు కురిపిస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆ్రస్టేలియా తదితర దేశాల్లోని తెలుగువాళ్లు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటిపంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్య దాటింది. వందల కొద్దీ వాట్సాప్ గ్రూపులు ఇంటిపంటల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను పరిచయం చేస్తున్నాయి. ఇంటిపంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. స్ట్రాబెర్రీ గ్రూపుతో ఆరంభం.. ‘మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం’ అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో ‘స్ట్రాబెర్రీ’ గ్రూప్ ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను టెర్రస్లపై పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హార్కర కన్వీకర్గా, ఈదల సరోజ కో– కన్వీనర్గా ఈ గ్రూపు సేవలు మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. స్ట్రాబెర్రీ గ్రూపు వేగంగా విస్తరించింది. ఈ సమూహమే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)గా అవతరించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్ తదితర నగరాలతో పాటు విదేశాలకు విస్తరించింది. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకొనేందుకు అవగాహనను పెంచుకొనేందుకు వేలాది మంది ఆసక్తి కనబర్చారు. సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో పాటు కూరగాయల్లోనే ఎంతో విలువైన ఆగాకర, కాసర దుంపలు, పెన్సిల్ దొండ పాదులు వంటి వెరైటీ మొక్కలను సీటీజీ హైదరాబాద్ గార్డెనర్స్కు పరిచయం చేసింది. వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరలలో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు.ఎన్నెన్నో వెరైటీలు.. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (city of terrace gardens) ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కింది. గ్రీన్ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన రెండు రకాల యాపిల్ మొక్కలను పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధ్రువీకరించిన లక్డంగ్ పసుపు హైదరాబాద్లో మిద్దెతోటలపై పండుతోంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవ రూప ఎరువులు సిటీ ఆఫ్ గార్డెనర్స్ అందజేస్తోంది. నగర వాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకొనేలా సీటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గార్డెన్ విజిట్స్, ఫార్మ్ విజిట్ ట్రిప్స్, ఫీల్డ్ ట్రిప్స్, సీడ్ బాల్స్ వంటి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పది పాదులు ఉంటే చాలు.. ‘కేవలం పది పాదులకు సరిపడా కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావాల్సినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకొనేలా ప్రత్యేమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు సీటీజీ కో– కన్వీర్ సరోజ. కొత్తగా ఇంటిపంట ప్రారంభించేవారికి శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ శిక్షణ దోహదంచేస్తోందని ఆమె చెప్పారు. కేబీఆర్ పార్కు, పబ్లిక్ గార్డెన్స్, అగ్రి–హార్టీకల్చరల్ సొసైటీ, తెలంగాణ ఉద్యానశాఖ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచాయి. సీటీజీ సమావేశాల్లో రిటర్న్ గిఫ్ట్ల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు.చదవండి: తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వున్న గింజలుఇంటింటా ఓ మిద్దెతోట.. నగరంలో మిద్దెతోట (Midde Thota) చాలాకాలంగా విస్తరిస్తోంది. కేవలం కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచితో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ధాన్యం పండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటిపంటల పట్ల అభిరుచి ఉన్నవాళ్లందరిని ఒక గొడుగు కిందకు తెచ్చి ఇంటిపంట సంస్కృతికి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నూతన ఒరవడిని తెచ్చింది.చాలా వెరైటీలు పెంచుతున్నారు హైదరాబాద్లో అన్నా వెరైటీ, హెచ్ఆర్ఎం యాపిల్ మొక్కలు పెంచారు. స్ట్రాబెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ దాల్చిన చెక్క ఆల్ స్పైసెస్ ప్లాంట్ వంటివి మన టెర్రస్లపై గుబాళిస్తున్నాయి. 2021 వరకు కూడా 5000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే 70 వేల మందికి పైగా చేరారు. – ఈదల సరోజ, కో– కన్వీనర్, సీటీజీ -
డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: యువత డ్రగ్స్కు బానిస అయితే దేశ మనుగడ కష్టమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామన్నారు. ఈరోజు(గురువారం, జూన్ 26) యాంటీ డ్రగ్ డేలో భాగంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. మరి అటువంటి తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.సే నో టు డ్రగ్స్.. సే యస్ టు స్పోర్ట్స్ : పుల్లెల గోపీచంద్సే నో టు డ్రగ్స్కు స్వస్థి చెప్పి.. సే యస్ టు స్పోర్ట్స్కి నాంది పలికాలన్నారు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్. ‘తెలంగాణలో స్పోర్ట్స్ కి చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి అనే ట్రైల్ ఎప్పుడూ వేయకండి. నా జీవితంలో ఒక్కసారి కూడా తప్పు బాటలో లేను’ అని తెలిపారు.ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే చట్ట రీత్యా నేరమే..డ్రగ్స్ను సేవించడమే కాదు.. డ్రగ్స్ను తీసుకున్నా నేరమేనన్నారు టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఒక్క గోవా లోనే ఒక్కో హవాలా ఆపరేటర్ 2 రోజుల్లో 50 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను అమ్ముతున్నారు. గతం లో డ్రగ్స్ కన్స్యూమర్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వాళ్ళం, కానీ పాలసీ లో మార్పులు తెస్తున్నామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కస్టడీకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాము. కన్స్యూమర్లును డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తాం’ అని తెలిపారు.రైజింగ్ తెలంగాణ స్పూర్తినిస్తుంది: రామ్ చరణ్కొన్ని సంవత్సరాలు క్రితం స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారనీ విన్నాను. 2014 లో 3, 4 క్లాస్ చదివే పిల్లలకు ఐస్ క్రీమ్ లలో డ్రగ్స్ ఇచ్చారని తెలిసి పేరెంట్స్ ధర్నాలు చేశారు. డ్రగ్స్ అంత డీప్ గా వెళ్లిపోయాయి. ఫిజికల్ వర్క్ అవుట్, ఒక షూటింగ్, కుటుంబంతో క్వాలిటీ టైమ్, స్పోర్ట్స్ ఒక రోజుకి ఇది చాలు. పిల్లలని స్కూల్స్ కు పంపాలంటే భయమేసే పరిస్థితులు ఉండకూడదు.. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బావున్నాయి. ప్రభుత్వానికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మా తోడ్పాటు ఉంటుంది’ అని రామ్చరణ్ తెలిపారు.ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదు: విజయ్ దేవరకొండఒక దేశాని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిషత్ నీ నాశనం చేయాలి అనుకుంటున్నారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే కోలుకోవడం కష్టం. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండండి. డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండండిడ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం: దిల్రాజుఇక మీదట ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న సినిమా రంగానికి చెందిన వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తున్నారని, ఇక్కడ కూడా త్వరలో అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో పీజీఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ అరుణ కుమారి విడుదల చేశారు. 25, 335 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 22,983 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 16 నుంచి 19 వరకు పరీక్షలు జరిగాయి. ఉత్తీర్ణత శాతం 90.72 శాతంగా నమోదైంది.ఆర్కిటెక్చర్ ప్లానింగ్ విభాగంలో తురియా దీక్షిత్, ఏరోస్పెస్ ఇంజినీరింగ్లో శివ చరణ్, బయో మెడికల్ ఇంజినీరింగ్లో హరిణి, బయో టెక్నాలజీలో తనుజా, సివిల్ ఇంజినీరింగ్లో వెంకటేష్, కెమికల్ ఇంజినీరింగ్లో అశుతోష్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షభిస్తా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో శివ ప్రసాద్ మొదటి ర్యాంక్లు సాధించారు.ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మహేష్, ఇన్స్ట్రునెంటేషన్ ఇంజినీరింగ్లో చంద్రసేన్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో ఉజ్వల, ఫుడ్ టెక్నాలజీలో నిఖిల్ కుమార్, జియో ఇంజినీరింగ్ జియో ఇన్ఫార్మటిక్స్లో డిలైట్, మెకానికల్ ఇంజినీరింగ్లో సతీష్, మైనింగ్ ఇంజినీరింగ్ లో అనిల్, మెటాలర్జికల్ ఇంజినీరింగ్లో శ్రీ హర్షిణి, నానో టెక్నాలజీలో సాయి కృష్ణ, ఫార్మసీలో షేక్ అర్షియా కౌనేను, టెక్స్టైల్స్ టెక్నాలజీలో వర్ష మొదటి ర్యాంక్లు సాధించారు. -
తెలంగాణ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్తో పాటు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపించివేశారు. ఆర్టీఏ బ్రోకర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అవినీతికి పాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై ఏసీబీ రెండోసారి సోదాలు చేపట్టింది. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్స్ ద్వారా జరుగుతున్న పలు అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. అక్రమాలకుపాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై డేగ కన్ను వేసిన ఏసీబీ.. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన ఆర్టీఏలపై దృష్టిసారించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లను సైతం ఏసీబీ విచారిస్తోంది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో ఇద్దరు క్లర్క్లతో పాటు 10 మంది ఏజెంట్లు, ఉప్పల్లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్ లైన్ లో దంపతుల గలీజ్ దందా
-
17వ అంతస్తు నుంచి దూకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37)కు తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకుంటున్న నిఖిల్ మదన్.. అదే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి
-
Bonalu Festival 2025: సంబురాలు మొదలాయె..!
ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తగానే మోగిన డప్పు వాయిద్యాలు.. పోతరాజు విన్యాసాలు.. అమ్మా, కాపాడమ్మా.. అంటూ సాగే అడుగులన్నీ అమ్మవారి ఆలయం వైపుగా కదులుతుంటే.. దారులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళ కళలాడతాయి. ఆ కళ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించేంత సంబురంగా జరుగుతుంది తెలంగాణ బోనాల పండగ. తెలంగాణ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలవుతూనే ఆరంభం అవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ .. ఈ ఏడుగురు అమ్మ తల్లులు ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మతల్లుల ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబు అవుతాయి. నేటి నుంచి మొదలయ్యే ఈ వేడుకలో తెలంగాణ ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటారు. బెల్లం కలిపి వండిన అన్నాన్ని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించిన మట్టి లేదా ఇత్తడి పాత్రలలో ఉంచుతారు. పైన పెట్టిన మూతలో దీపాన్ని ఉంచి, ఆ పాత్రను జాగ్రత్తగా తలపైన పెట్టుకుని, అమ్మవారి దేవాలయాలకు వెళతారు. ఈ పండుగలో భక్తి, కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా కనిపిస్తాయి. బోనాలతోపాటు, పొట్టేళ్ళ, ఘటం ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తారు. (చదవండి: బోనాల పండుగకు వేళాయె)హైదరాబాద్లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ పండగ మొదలవుతుంది. ఈ రోజు(గురువారం జూన్ 26) నుంచి బోనాలు ప్రారంభకానున్నాయి. వెయ్యేళ్లకు పైగా ఈ ఆచారం ఉన్నట్టు, కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు చారిత్రక కథనాలు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, తరువాతి వారంలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలలో ఉన్న అమ్మవార్లకు వరసగా బోనం సమర్పించే ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చివరి వారం రంగం, భవిష్యవాణిలతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. జులై 21తో ముగిసే ఈ జాతర ఉత్సవాలు పిల్లలూ పెద్దలలో ఆనందోత్సహాలను నింపుతుంది. (చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని #apsdma ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/b65VwqYbHE— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 25, 2025ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు.. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.What a Day & Night (Yesterday) in TG 🌧️🌧️Adilabad, Karimnagar, Siddipet, Nizamabad, Nirmal, Medak, Warangal, Hanumakonda, Sircilla districts was observed Heavy to Very Heavy Rains. Still Adilabad district continuing Rains‼️Hyd got light rains at few places in the Overnight— Weatherman Karthikk (@telangana_rains) June 26, 2025 -
నేటి నుంచే గోల్కొండ కోట బోనాలు
గోల్కొండ: గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు. మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా అలంకరించిన దేవతా విగ్రహాల వాహనాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. జానపద కళాకారులు ప్రత్యేకంగా పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరుస్తారు. గోల్కొండ ప్రధాన రహదారి నుంచి తొట్టెల ఊరేగింపు వైభవంగా ప్రారంభమవుతుంది. కోటలోని జగదాంభిక, మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాధిగా భక్తులు తరలిరానున్నారు. వీరికి దారి పొడవునా దేవాదాయ శాఖ వారు స్వాగత వేదిక ఏర్పాట్లు చేశారు. ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు.. బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి విన్యాసాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి వీక్షిస్తుంటారు. ఓవైపు పోతరాజుల గీంకారాలు, కొరఢా చప్పుళ్లు మరోవైపు శివసత్తుల పునకాలతో మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకోనున్నాది. మెట్టు మెట్టుకు బొట్టు.. బుధవారం అమావాస్యను పురస్కరించుకుని కోట మెయిన్ గేటు నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను మహిళలు బొట్టు పెట్టి అలంకరించారు. నగరం నలుమూలల నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో మెట్లతో పాటు మెట్లను ఆనుకుని ఉన్న కోట గోడలకు సైతం బొట్లు పెట్టి అలంకరించారు. -
రీల్స్ మోజులో దుస్సాహసాలు!
సాక్షి, సిటీబ్యూరో: కంచన్బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రి మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. బేగంపేట–ప్రకాష్ నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేశారు. రేసింగ్తో పాటు వీళు చేసిన ఫీట్లు సోషల్మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. శంషాబాద్–రాజేంద్రనగర్ మార్గంలో ఈ–బైక్పై ప్రయాణించిన ఎనిమిది మంది రహదారిపై ఫీట్లు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి చేసిన ఈ దుస్సాహసం దాని ద్వారానే పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ...ఇవన్నీ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన స్టంట్లు. అయితే వీరి దృష్టిలో పడకుండా అనునిత్యం నగరంలోని అనేక ప్రాంతాల్లో యువత రెచ్చిపోతున్నారు. వాహనాలపై తిరుగుతూ ప్రమాదకరమైన స్టంట్లు, ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సోషల్మీడియా ప్రభావంతో రీల్స్ చేసి, లైక్స్ర్స్ పొందడానికి ఎక్కువగా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ... నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు రాజేంద్రనగర్, రాయదుర్గం, మాదాపూర్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన సరీ్వస్ రోడ్డులోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు. జరిగిన తర్వాతే పట్టుకుంటున్నారు... ఈ స్టంట్ల విషయంలో పోలీసులు అవసరమైన స్థాయిలో ‘ముందస్తు’ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శ ఉంది. ఎప్పుడో అడపాదడపా మినహా ఎక్కువ సందర్భాల్లో ఫీట్లు పూర్తయిన తర్వాతే అది పోలీసుల దృష్టికి వెళ్తోంది. ఈ ఫీట్లు, స్టంట్లలో ఒకే వాహనంపై ఎక్కువ మంది ప్రయాణించడం, వెనుక చక్రంతో రోడ్డుపై రాపిడి కలిగిస్తూ పొగ వచ్చేలా చేయడం (వీలింగ్), వాహనం స్టాండ్తో పాటు ఇతర భాగాలు రోడ్డుకు తాకేలా చేసి, వేగంగా దూసుకుపోతూ నిప్పు రవ్వలు రప్పించడం (స్పార్కింగ్), ఆటోను ఓ వైపునకు ఎత్తేసి ప్రమాదకరంగా నడపటం వంటివి ఎక్కువగా జరుగున్నాయి. ఈ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారిన తర్వాతే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. దీంతో ఆయా వాహనాల నెంబర్ల ఆధారంగా ముందుకు వెళ్తున్న పోలీసులు వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ల సాయంతో నిఘా ఉంచితేనే... స్టంట్లు చేయడం పూర్తయిన తర్వాత వీడియోలు, సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యుల్ని పట్టుకోవడంతో ఫలితం లేదనే వాదన వినిపిస్తోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని, ఈ నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాలను ముందే గుర్తించి అణిచివేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం స్టంట్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ సిబ్బందితో పాటు డ్రోన్ల సాయంతో నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ నియంత్రణకు రెండు డ్రోన్లు వాడుతోంది. వీటిని రేసులు, స్టంట్ల నిరోధానికి వాడాలని కోరుతున్నారు. ఈ డ్రోన్లు గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతాయని, ‘28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి ద్వారా స్టంట్లకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్కు సంబంధించి బాధ్యులపై బీఎన్ఎస్తో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. -
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను చీఫ్ కంట్రోలర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చీఫ్ కంట్రోలర్ వేధింపులను భరించలేక మంత్రి సీతక్కకు ఆ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. అర్ధరాత్రి వీడియో కాల్స్, జిల్లా టూర్లతో వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.చీఫ్ ఇంజనీర్ వేధింపులు భరించలేక పలువురు మహిళలు ఉద్యోగం మానేసినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా మంత్రి శాఖలో మహిళలపై వేధింపుల అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్లపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
సాక్షి,హైదరాబాద్: లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే తమ భాగస్వామితో కలిసి జీవిస్తున్నారు. దీనిని లివింగ్ రిలేషన్ షిప్ అని అంటారు.తాజాగా, ఈ లివింగ్ రిలేషన్ షిప్పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లివింగ్ రిలేషన్ షిప్ వల్లే ప్రేమ హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ వీహెచ్ మీడియాతో మాట్లాడారు.‘హై టెక్ సిటీలో కొలివింగ్ను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నా. ఒకే హాస్టల్లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు.హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలి. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం వీటి మీద దృష్టి పెట్టాలి. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి. ఇప్పుడు సొంత భర్తను, కూతురు తల్లిని చంపడం అనేది దారుణం. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుతున్నాయి. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్. సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుంది.నక్షలైట్ల హత్యల విషయంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు మాట్లాడుతారు. ప్రేమ హత్యలపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇలాంటి ప్రేమ హత్యల్ని హ్యూమన్ రైట్స్ టేక్ అప్ చేయాలి. సైకాలజిస్టులు, ఇంటలెక్చవల్స్ ఆలోచన చేయాలి. ఎక్కడో తప్పు జరుగుతుందో తెలుసుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. -
Formula-E Race Case: ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్.. ఈనెల 30వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. -
హైదరాబాద్: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.సీలింగ్ ప్యాన్కు కర్టన్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు
-
జీడిమెట్ల కన్నతల్లి హత్య కేసులో పోలీసుల అదుపులో హంతకులు
-
ఎనిమిది నెలల ఇన్స్టా పరిచయం.. కుమార్తె రాసిన మరణ శాసనం!
సాక్షి, జీడిమెట్ల: ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ నంటూ ప్రియుడిని బెదిరించిన పదో తరగతి బాలిక.. కన్నతల్లినే హత్య చేయించిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం కలకలం రేపింది.ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి 16 ఏళ్ల క్రితం దమ్మన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి కూతురు (15) ఉంది. 13 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మనస్విని (12) అనే కూతురు జన్మించింది. రవి సైతం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంజలి కొన్నేళ్లుగా తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కళాకారిణిగా పని చేస్తూ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడు నెలలుగా షాపూర్నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది. షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పెద్ద కుమార్తె 10వ తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇన్స్టాలో పరిచయంతో.. అంజలి పెద్ద కుమార్తె (15)కు నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)కు ఇన్స్ట్రాగాంలో పరిచయం ప్రేమకు దారితీసింది. 8 నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో అంజలి తొలుత అంగీకరించి.. ఆ తర్వాత వద్దని వారించింది. తమ ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడంతో బాలిక ఈ నెల 19న శివతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు అంజలి తన కూతురు కనిపించడం లేదంటూ శివపై అనుమానం వ్యక్తం చేస్తూ జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు అమ్మాయిని తీసుకుని స్టేషన్కు రావాలని చెప్పడంతో ఈ నెల 21న శివతో పాటు బాలిక పీఎస్కు వచ్చారు. బాలికను తల్లితో ఇంటికి పంపించారు. ప్రేమను నిరాకరించిందని.. ఇంటికి వెళ్లిన తర్వాత శివను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కూతురును అంజలి బెదిరించింది. శివపై కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ కొట్టింది. తమ ప్రేమకు అడ్డొస్తోందనే కసితో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఆమెను చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తాను అనుకున్నట్లుగానే తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని శివను కోరింది. చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో యువకుడు ఒప్పుకోవడంతో.. బాలిక తన చెల్లెలిని మరో ఇంటికి పంపించింది.సోమవారం సాయంత్రం 5 గంటలకు శివ, తన తమ్ముడిని (16) తీసుకుని షాపూర్నగర్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే కురీ్చలో కూర్చున్న అంజలిని ఒక్కసారిగా తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్నీ బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. శివ సోదరుడు అంజలి చేతులు పట్టుకోగా శివ చున్నీతో మెడకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తన తల్లి కిందపడి తలకు దెబ్బతగలంతో చనిపోయిందని అందరినీ నమ్మించాలని బాలిక పథకం పన్ని, శివను, అతని సోదరుడిని పంపించేసింది. బతికే ఉందని.. మళ్లీ రప్పించి.. కొద్దిసేపటి తర్వాత అంజలి మెల్లగా కదలసాగింది. అప్పటికే చిన్న కుమార్తె మనస్విని ఇంటికి రాగా.. అమ్మ ఇంట్లోకి రావొద్దని చెప్పిందంటూ సోదరిని బాలిక బయటే కూర్చోబెట్టింది. 108కు కాల్ చేసినట్లు నటిస్తూ విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది. నల్లగొండ వెళ్లేందుకు ఎల్బీనగర్లో ఉన్న శివ మళ్లీ తన సోదరుడిని తీసుకుని రాత్రి 7.30 గంటలకు షాపూర్నగర్ వచ్చాడు. ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నిన్ను కాపాడతాను ఆంటీ’ బాలిక మనస్విని ముందు నటించాడు. వేరే ఆంటీని పిలుచుకు రావాలంటూ ఆమెను ఇంట్లోంచి పంపించారు. తిరిగి అంజలి మెడకు చున్నీ బిగించారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.రాత్రి 10 గంటలకు తన తల్లి చనిపోయిందని పెద్ద కుమార్తె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేశ్కు విషయం తెలిసింది. ఈ నెల 19న బాలిక అదృశ్యమైన కేసు జీడిమెట్లలో నమోదు కావడంతో ఇది కచి్చతంగా హత్యేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెండు బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడి(15)ని హైదరాబాద్ సంతోష్ నగర్లోని ఓ చికెన్ సెంటర్లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారణ చేయగా.. అంజలిని తామే చంపివేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లిని పూర్తిగా చంపే వరకు ఇంటి బయటే కాపలా కాసిందని, తల్లి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ‘క్షమించు మమీ’ అంటూ నిందితురాలు బాలిక రోదించిందని స్థానికులు తెలిపారు. అంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కాదు.. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మకు దూరపు బంధువే తప్పా మునిమనవరాలు కాదని కుటుంబ సబ్యులు తెలిపారు. దీనిపై మీడియాలో వార్తలు నిజం కావన్నారు. -
జీహెచ్ఎంసీ ఆస్తులెన్నంటే..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీకి ఎన్నో ఆస్తులున్నాయి. వాటిల్లో కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు, చెరువులు, పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, ఆటస్థలాలు, ఫంక్షన్హాళ్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితరమైనవెన్నో ఉన్నాయి. అయినా తమకున్న ఆస్తులేమిటో, ఏవి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఏ దుస్థితిలో కునారిల్లుతున్నాయో, ఏ అక్రమార్కుల కబ్జాలో చిక్కుకున్నాయో, ఎక్కడ ఏ ప్రైవేటు పెత్తనంతో ఉన్నాయో కూడా జీహెచ్ఎంసీ అధికారులకు తెలియదు.అంతెందుకు ఒక పార్కు సమీపంలోని స్థలం కబ్జా అయితే అది జీహెచ్ఎంసీదా, కాదా, అనేది మేయర్కు సైతం తెలియలేని పరిస్థితుల్లో ఆ ఆస్తులున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆస్తులను గుర్తించే పని చేపడుతోంది. ఆస్తిపన్ను ఆదాయం పెంచుకునేందుకు ప్రజల ఆస్తుల సర్వే చేపట్టిన జీహెచ్ఎంసీ (GHMC).. తమ ఆస్తుల్ని కూడా తెలుసుకునేందుకు పనిలోపనిగా ‘డ్రోన్ బేస్డ్ జీఐఎస్ సర్వే’ను ప్రారంభించింది. వీటి సర్వే ఇలా... సర్వేలో భాగంగా ఆటస్థలాలు, పార్కులు, పబ్లిక్ టాయ్లెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల వివరాలు క్రోడీకరించి.. వాటిని జియో మ్యాపింగ్ కూడా చేశారు. అక్షాంక్ష, రేఖాంశాలతో సహ మ్యాపింగ్ చేయడంతో ఇక జీహెచ్ఎంసీ ఆస్తులు ఏ లొకేషన్లో, ఏ స్థితిలో ఉన్నాయో కూడా అధికారులు తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. కానీ, కమ్యూనిటీ హాళ్ల వంటి వాటి సర్వే ఇంకా చేపట్టలేదు. చాలా వరకు కమ్యూనిటీ సెంటర్లు స్థానిక లీడర్లు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడైనా జీహెచ్ఎంసీకి ఏదైనా అవసరం వచ్చినా వాటి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక వెతుక్కునే పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీ హాళ్ల విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.కట్టుదిట్టమైన చర్యలు మొత్తానికి జీహెచ్ఎంసీ ఆస్తుల్ని జీఐఎస్ పోర్టల్లో మ్యాపింగ్ చేస్తున్నారు. వాటిని కబ్జాల పాలు కాకుండా, జులాయిలు తిష్టవేయకుండా చూస్తామని, అద్దెల కివ్వడం, అవసరమైన సేవలందించడం ద్వారా ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్.. 1,48 గజాలు.. రూ.33 కోట్లు -
ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్ సీరియస్
హైదరాబాద్: ఇంచార్జ్ మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంచార్జ్ మంత్రులకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని చెబితే వాటిని భర్తీ చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని తెలిపిన సీఎం రేవంత్.. ఫండ్స్ను సైతం ఇంచార్జ్ మంత్రులు సరిగా ఉపయోగించట్లేదని మండిపడ్డారు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు. నిరసన తెలపడానికి ఓ పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు.ఈరోజు(మంగళవారం, జూలై 24) పీసీసీ రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలo గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి.. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వo అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లు,జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. -
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది. -
హైదరాబాద్.. తగ్గేదేలేద్..!
తగ్గేదే లేదు.. ఆఫీస్ స్పేస్ అయినా.. ఉద్యోగాలైనా.. టాప్ నగరాల్లో మన హైదరాబాద్ ఉండాల్సిందే. ‘వి ఆర్ సిటీ 2024’ పేరుతో ‘అన్ బాక్సింగ్బీఎల్ఆర్ ఫౌండేషన్ ’ రూపొందించిన నివేదిక ఇదే చెబుతోంది. ఖరీదైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కొత్తగా జత కూడిన ప్రధాన ఉద్యోగాల సంఖ్య పరంగా దేశంలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఆసక్తికర విషయం ఏమంటే.. 7 ప్రధాన నగరాల్లో 2018–23 మధ్య కార్మికుల్లో మహిళల వాటా అత్యధికంగా దాదాపు రెండింతలు పెరిగింది హైదరాబాద్లోనే. అలాగే 2019–23 మధ్య 6.3 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్ స్పేస్ తోడై టాప్–5 స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీయంగా అయిదేళ్లలో అత్యధికంగా 27 నగరాలు, పట్టణాలకు విమాన సేవలను బెంగళూరు విస్తరిస్తే, హైదరాబాద్ 18 కేంద్రాలతో టాప్–2లో పోటీపడుతోంది. ఇంటి రుణం సగటు అధికంగా ఉన్న టాప్–3 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పాటైన కంపెనీల సంఖ్య పరంగానూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. -
స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ (జూన్ 23, 2025న) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
‘నిన్ను సాయంత్రంలోగా చంపేస్తాం’.. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
దివిత్ రెడ్డికి కాంస్య పతకం
హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన అదుళ్ల దివిత్ రెడ్డి కాంస్య పతకం సాధించాడు. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత దివిత్తోపాటు మరో ఐదుగురు 8.5 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... దివిత్కు కాంస్య పతకం ఖరారైంది. 10 పాయింట్లతో సాతి్వక్ స్వయిన్ (ఒడిశా) విజేతగా అవతరించగా... 9.5 పాయింట్లతో ఆది్వక్ అభినవ్ కృష్ణ (కర్ణాటక) రన్నరప్గా నిలిచాడు. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో మాత్రమే ఓడిపోయాడు.గత ఏడాది నవంబర్లో ఇటలీలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్లో దివిత్ రెడ్డి అండర్–8 ఓపెన్ విభాగంలో... ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చాంపియన్షిప్ అండర్–8 ఓపెన్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. మరోవైపు బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సాయి అన్షిత 8.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది.వ్రిత్తి అగర్వాల్కు కాంస్య పతకంభువనేశ్వర్: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ పతకాల బోణీ చేసింది. తెలంగాణకు చెందిన వ్రిత్తి అగర్వాల్ మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫైనల్ను వ్రిత్తి 4 నిమిషాల 30.05 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 4ని:26.66 సెకన్లు) స్వర్ణ పతకం... అదితి సతీశ్ హెగ్డే (మహారాష్ట్ర; 4ని:29.48 సెకన్లు) రజత పతకం గెల్చుకున్నారు. -
విజయవంతంగా ‘సే నో టూ డ్రగ్స్ ..అండ్ ఎస్ టూఫ్ లైఫ్’ సైక్లోథాన్
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ విభాగం నిర్వహించిన సైక్లోథాన్ విజయవంతమైంది. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ సైక్లోథాన్ను నిర్వహించింది. నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 21న సే నో టూ డ్రగ్స్ అండ్ ఎస్ టూఫ్ లైఫ్ అనే నినాదంతో ఈ సైక్లోథాన్ను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నానక్ రామ్ గూడా స్టార్ ఆస్పత్రి నుంచి ఈ రైడ్ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైక్లోథాన్తో పాటు పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. -
ఇల్లే కాదు.. ఇంటి నిర్మాణ సామగ్రికీ గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: కాలం ఏదైనా సరే ఇంట్లో నీరు, విద్యుత్ వినియోగం తప్పనిసరి. వేసవికాలంలో అయితే వీటి బిల్లులతో కస్టమర్ల జేబుకు చిల్లులు పడటం ఖాయం. అందుకే హరిత నిర్మాణ సామగ్రితో నిర్మించే ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. హరిత భవనాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం 30–40 శాతం, నీటి వినియోగం 20–30 శాతం తగ్గుతుంది కూడా.విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు లేక శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. మార్కెట్లో 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటి వరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నీచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని అంచనా. -
హైదరాబాద్లో కమర్షియల్ స్థలం.. కొంటున్నారా?
వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
గచ్చిబౌలి స్టేడియంలో తొక్కిసలాట
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డేను పుసర్కరించుకొని ఏర్పాటు చేసిన అల్పాహారం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కింద పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా డే నిర్వహించారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. టోకెన్లు ఉన్న వారు టిఫిన్ కోసం వెళ్లగా అప్పటికే అయిపోయింది. మళ్లీ ట్రాలీ ఆటోలో టిఫిన్ తెప్పించడంతో టోకెన్లు ఉన్న వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజీమా(19) కింద పడిపోయి అస్వస్థతకు గురైంది. వెంటనే అంబులెన్స్లో కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగిని రెడ్డి ఆమెను పరామర్శించి విషయాలను అడి గి తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్తో పాటు అంబులెన్స్లో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించామని, అక్కడ సీటీ స్కాన్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే తెలిసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని పలువురు విమర్శించారు. -
Hyderabad: విలాసవంతమైన వసతిగా హెలీప్యాడ్
గ్రేటర్లో హైరైజ్ బిల్డింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్లూ పెద్దపెద్ద వెంచర్లు మొదలవుతున్నాయి. కస్టమర్లలోనూ హైరైజ్ నివాసాలపై ఆసక్తి పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు పోటాపోటీగా హైరైజ్ అపార్ట్మెంట్లను నిరి్మస్తున్నాయి. ఇక వీటిల్లో వసతులు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన వసతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు హైరైజ్ భవనాలపైన హెలీకాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన హెలీప్యాడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇది నగరంలో లగ్జరీ ట్రెండ్గా మారింది. సాక్షి, హైదరాబాద్: హైరైజ్ భవన నిర్మాణాలకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో వాటిల్లో విలాసవంతమైన వసతులు పెరుగుతున్నాయి. గతంలో కస్టమర్లు స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులనే లగ్జరీగా భావించేవారు. కానీ, ప్రస్తుతం మాత్రం విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయి వసతులను కోరుకుంటున్నారు. దీంతో గోల్ఫ్ కోర్ట్, హెలీప్యాడ్, స్కైవాక్ వంటి విలాసవంతమైన వసతులను సైతం నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఆకాశహార్మ్యం పైకప్పులపై హెలీప్యాడ్ల నిర్మాణానికి డెవలపపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ⇒ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో లగ్జరీ అపార్ట్మెంట్లు, హోటళ్ల పైకప్పులపై హెలీప్యాడ్లు సర్వసాధారణమైపోయాయి. లగ్జరీ, హోదా చిహ్నంగా ఇవి ఉన్నప్పటికీ..అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో నివాసితులను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయుక్తం. మన నగరంలో కోకాపేట, నానక్రాంగూడ, తెల్లాపూర్, పుప్పాలగూడ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్లోనే హెలీప్యాడ్ భవన నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి.ఇప్పటివరకు ఐదు ప్రాజెక్ట్లు.. హైరైజ్ బిల్డింగులపై హెలీప్యాడ్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఐదు సంస్థలు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాయి. వీటికి అనుమతి లభించింది. జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్, టౌన్ప్లానింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ చీఫ్ సిటీ ప్లానర్, రోడ్లు భవనాల విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ హెలిప్యాడ్ కోసం నిర్మాణ సంస్థల నుంచి వచి్చన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు కూకట్పల్లి, నానక్రాంగూడ, నియోపోలిస్ ప్రాంతాలలోని పలు లగ్జరీ అపార్ట్మెంట్లు, మాదాపూర్లోని ఓ హోటల్ పైకప్పుపై హెలీప్యాడ్ నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. లోధా, ఎల్అండ్టీ–ఫోనిక్స్, మంజీరా, మంత్రి, జీహెచ్ఆర్ వంటి సంస్థలు ఈ విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి. \\60 మీటర్ల కంటే ఎత్తయితే.. జాతీయ భవన నిర్మాణ నియమావళి (ఎన్బీసీ) నిబంధనల ప్రకారం 60 మీటర్ల కంటే ఎత్తయిన భవన నిర్మాణాలకు హెలిప్యాడ్లు తప్పనిసరి. 1999లో ఈ నిబంధన అమలులోకి వచ్చినప్పటికీ హైదరాబాద్లో 60 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలు పెద్దగా లేవు. 2007 నుంచి 60 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన ప్రాజెక్ట్లు వస్తుండటంతో హెలీ ప్యాడ్ల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) నియమాలు, నిబంధనల ప్రకారమే నిర్మాణ సంస్థలు హెలీప్యాడ్లను నిరి్మంచాల్సి ఉంటుంది. -
ఇద్దరు బాలికల బలవన్మరణం
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు. వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే!
వచ్చేదే అరకొర. పొదుపుగా వాడుకోవాలి. అందులోనే దాచుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురైతే ఎలా అని వెంటాడే ఆలోచనలు.. ఇదీ పైసా పైసా లెక్కబెట్టే ఓ సగటు దిగువ మధ్య తరగతి ‘జీవి’తం. దేశంలో దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సగటు ఆదాయం నెలకు రూ. 33,000. ఖర్చులు రూ. 20,000 వరకు ఉంటున్నాయి. మిగిలిన రూ.13 వేలల్లోనే వారి కలలు, ఆకాంక్షలు, నిర్ణయాలు అన్నీ ముడిపడి ఉంటున్నాయని ‘హోమ్ క్రెడిట్’ సంస్థ నివేదిక చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో నెలవారీ సగటు వ్యయాలూ పెరిగాయని వెల్లడించింది.దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది కస్టమర్లున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘హోమ్ క్రెడిట్ ఇండియా’ విడుదల చేసిన ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక ప్రకారం నెలవారీ వ్యయాలు పోను తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్న వారు 50% మంది మాత్రమే. ఖర్చులతోనూ వెళ్లదీస్తూ, ఆదా చేయలేకపోతున్నవారు 38% మంది ఉన్నారు. 12% మంది నెలవారీ అవసరాల కోసం అప్పు చేస్తున్నారు. ప్రాంతాలు, తరాల వారీగా ఆదాయాల్లో వ్యత్యాసం, కొనుగోళ్ల తీరు వేరుగా ఉందని ఈ నివేదిక తెలిపింది. ఆదాయం రూ.5 లక్షలలోపు..వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపుల ఆధారంగా 17 నగరాలలోని 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. వీరిలో పురుషులు 84%, స్త్రీలు 16% ఉన్నారు. జెన్ –జడ్ (13–28 ఏళ్లు) 19%, మిలీనియల్స్ (29–44 ఏళ్లు) 53, జెన్ –ఎక్స్ (44–59 ఏళ్లు) 28% ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో కార్మికులు 42 %, వ్యాపారులు 29, వేతన జీవులు 22, స్వయం ఉపాధి పొందుతున్నవారు 7% ఉన్నారు.పొదుపులో జెన్ –జడ్జెన్ –జడ్ తరంలో అత్యధికంగా 56% మంది పొదుపు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మిలీనియల్స్లో ఇది 53%. వీరితో పోలిస్తే జెన్ –ఎక్స్లో తక్కువగా 41% మంది మాత్రమే సేవింగ్స్కు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నవారిలో జెన్ –జడ్ తరం నుంచి 33% ఉన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక మార్గదర్శకులు కావాలని 58% మంది భావిస్తున్నారు. జెన్ –జడ్ విషయంలో ఈ సంఖ్య 65%, మిలీనియల్స్లో 59% ఉన్నారు. ఇక భారత్లో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక సగటు ఆదాయం రూ.38,600 నమోదు చేయగా, ఉత్తరాది, తూర్పున ఇది సగటున రూ.30,300గా ఉంది. బెంగళూరు రూ.45,700తో తొలి స్థానంలో నిలిచింది. రూ.39,200తో హైదరాబాద్, రూ.35,800 తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఆకాంక్షలతోపాటు ఆందోళనలు..వచ్చే అయిదేళ్లలో వ్యాపారం ప్రారంభించడం, విస్తరించాలని 23% మంది లక్ష్యంగా చేసుకున్నారు. ఇల్లు కొనుక్కోవాలని 23% ఆకాంక్షించారు. పిల్లల విద్యకు పొదుపు చేయాలని 15% మంది, రుణాల చెల్లింపు 11%, కారు కొనుగోలు 11%, విదేశీ టూర్ వెళ్లాలని 7% మంది భావిస్తున్నారు. దాదాపు 60% మంది తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. పిల్లల చదువులకు ఖర్చులు సరిపోవడం లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తగినంత పొదుపు లేదని, రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని, ఉద్యోగం లేదా ఆదాయ వనరు కోల్పోయామని, పదవీ విరమణకు సరిపడా డబ్బు లేవని ఆవేదన చెందుతున్నారు.దుకాణాలకు వెళ్లి..దుస్తులు, ఫ్యాషన్ , మొబైల్ ఫోన్ ్స, గృహోపకరణాలు, సరుకులు, మందులు.. ఈ విభాగాల్లో కస్టమర్లు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మొత్తం కొనుగోళ్లలో ఏకంగా 83–85% ఆఫ్లైన్ లోనే నమోదు కావడం గమనార్హం. బస్సు, రైలు టికెట్ బుకింగ్స్, ఫుడ్ ఆర్డర్స్లో ఆఫ్లైన్ వాటా 58–59%గా ఉంది. రుణాల చెల్లింపుల్లో 50%, బిల్ పేమెంట్స్లో 54% ఆన్లైన్లోనే చేస్తున్నారు.రూ.20వేల వరకు ఖర్చులకే సరిపోతోంది⇒ పొదుపు చేయగలుగుతున్న వారు 50% మంది⇒ భారీగా పెరిగిన పిల్లల చదువు వ్యయం⇒ గతేడాదితో పోలిస్తే 34% పెరుగుదల⇒ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు⇒ ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక⇒ కొనుగోళ్లలో సుమారు 85% ఆఫ్లైన్ లోనే -
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టులో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2 (బి) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైల్ ఫేజ్ 2 (బి) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. వారం క్రితం రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్.. పరిపాలన అనుమతులు ఇచ్చింది.మెట్రో రెండో దశ (బి) లో 86.1 కిలోమీటర్లు. 19,579 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం తో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో ఆర్జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కిమీ; రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుంచి మేడ్చల్ (24.5 కిమీ; రూ. 6,946 కోట్లు), జేబీఎస్ నుంచి షామిర్పేట (22 కిమీ; రూ. 5,465 కోట్లు). మొత్తం 86.1 కిమీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్ల పెట్టుబడి ఉంటుంది.గతంలో సమర్పించిన ప్లీజ్ 2 (ఎ) ప్రాజెక్ట్ ఐదు కారిడార్ల (76.4 కి.మీ) లాగానే, ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్ట్ను కూడా కేంద్ర, రాష్ట ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ JV ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం, ఫేజ్ 2 (బి) ఖర్చు రూ.19,579 కోట్లు. తెలంగాణ ప్రభుత్వ వాటా రూ. 5,874 కోట్లు (30 శాతం), భారత ప్రభుత్వం వాటా రూ. 3,524 కోట్లు (18 శాతం), అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం రూ. 9,398 కోట్లు (48 శాతం), చిన్న పీపీపీ భాగం రూ. 783 కోట్లు (4 శాతం) కలిగి ఉంటుంది. -
బాలాపూర్ అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం. -
రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు.. ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్మార్కింగ్లు, అడ్డగోలు రంబుల్స్ట్రిప్స్ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్ఎంసీ (GHMC) ట్రాఫిక్ విభాగం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు.. రోడ్ మార్కింగ్లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్ లేవు. అబిడ్స్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. లేన్ మార్కింగ్లెందుకు? బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్ మార్కింగ్లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్నెక్స్ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్ఘాట్. ఈ గుర్తులేవీ? అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్’, ‘నో యూ టర్న్’ ‘ముందుకు స్పీడ్బ్రేకర్’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్స్ట్రిప్స్ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్ఆర్ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్బీనగర్ – ఉప్పల్ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్స్ట్రిప్స్ ఐఆర్సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్తో 6 స్ట్రిప్స్ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్స్ట్రిప్స్ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి.ఏం చేయాలి ? లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్ టేక్ చేయవద్దు, స్పీడ్లిమిట్ వంటి సూచనలు రిఫ్లెక్లివ్ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్డౌన్ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్ క్రాసింగ్బటన్లు ఉండాలి. రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి.చదవండి: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఎకోపార్కుబస్బేస్, ఆన్స్ట్రీట్, ఆఫ్స్ట్రీట్ పార్కింగ్ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్ రోడ్లకు వేర్వేకు మార్కింగ్ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్ ఉండాలి. సెన్సర్ ఆధారిత రంబుల్ స్ట్రిప్స్ బదులు కాలం చెల్లిన స్టాటిక్ సిస్టమ్నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ (rumble strips) లొకేషన్స్, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవసరం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్బీ, హెచ్ఎంఆర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డు నిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఎకోపార్కు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్కు (Kothwalguda Eco Park) ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. హిమాయత్సాగర్కు చేరువలో, ఔటర్రింగ్ రోడ్డు అంచుల్లో ఆకుపచ్చ అందాలతో పార్కు రూపుదిద్దుకుంటోంది. 2022 అక్టోబర్లో 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్ల అంచనాలతో ప్రభుత్వం ఎకో పార్కు నిర్మాణం చేపట్టింది. ఎన్నో వైవిధ్యభరితమైన ప్రత్యేకతలతో ఏర్పాటు చేస్తోన్న కొత్వాల్గూడ ఎకోపార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితర ఉన్నతాధికారులు శుక్రవారం సందర్శించారు.పంద్రాగస్టు నాటికి పార్కును ప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. పార్కు ప్రవేశ ద్వారం వద్ద వెదురు అల్లికలతో అందమైన ఆర్చ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సహజత్వం ఉట్టిపడేలా ఈ ఆర్చ్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వెదురును థాయ్లాండ్ నుంచి తెప్పించనున్నారు. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వెదురు అల్లికల ఆర్ట్ పని పూర్తి కాగానే పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు.. ⇒ ఇటు ఐటీ కారిడార్ల నుంచి అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న వివిధ కాలనీలు, ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఒక అద్భుతమైన ఆటవిడుపు.⇒ అందమైన కాలక్షేపంగా ఎకో పార్కు కనువిందు చేయనుంది. పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి వేడుకలకు అవసరమైన వేదికలు, లగ్జరీ సదుపాయాలతో దీన్ని రూపొందించారు.⇒ పార్కులో ఏర్పాటు చేసిన ఏవియరి (పక్షుల గ్యాలరీ) సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. రకరకాల పక్షుల కిలకిలలతో ఆహ్లాదాన్ని పంచేవిధంగా దీన్ని ఏర్పాటు చేశారు.⇒ 2.5 కి.మీ.లతో ఎలివేటెడ్ వాక్ వేలను నిర్మించారు. నగరవాసులు ఉదయం, సాయంత్రం ఈ వాక్వేలపై నడకకు వెళ్లవచ్చు. విశాలమైన పచ్చిక బయళ్లతో పాటు, అందమైన పూల వనాలను ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్కు మరో ప్రత్యేకత. సీజనల్ ఉద్యాన వనాలు మరో ప్రత్యేకత. చదవండి: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి! -
మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఓపెన్ ప్లాట్లకూ రుణాలు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటి నిర్మాణ సంబంధమైన ప్రాపర్టీలకు బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లు గృహ రుణాలు ఇస్తుంటాయి. ఓపెన్ ప్లాట్లు, స్థలాల కొనుగోళ్లకు రుణాల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. పలు థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఓపెన్ ప్లాట్లకు సైతం రుణాలను మంజూరు చేపిస్తున్నాయి. ఓపెన్ ప్లాట్ల మార్కెట్ బాగుండి, మంచి అనుభవం ఉన్న డెవలపర్లకు ఫండింగ్ చేస్తుంటారు. ప్లాటింగ్ వెంచర్లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థలం కొన్న తర్వాత రోడ్లు, లైటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి ఖర్చులకు మినహా పెద్దగా వ్యయం కాదు. అందుకే స్థలం కొనేందుకు కూడా లోన్లను ఇస్తుంటారు.నాలుగు గోడలకు కాలం చెల్లింది.. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నిధుల కొరతతో రియల్టీ ప్రాజెక్ట్లకు రుణాలు అంత ఈజీగా దొరకడం లేదు. కొత్త ప్రాజెక్ట్లకు లోన్స్ సంగతి దేవుడెరుగు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లకూ ఫండింగ్ దొరకటం కష్టంగా మారింది. నాలుగు గోడల ఇంటికి కాలం చెల్లింది. కాంక్రీట్ భవనాలకు కొనుగోలుదారులు స్వస్తి పలికేశారు. సాంకేతికతను వినియోగించే టెకీ భవనాలు, ఆధునిక వసతులుండే విలాస గృహాలకు జై కొడుతున్నారు.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్! సౌర విద్యుత్, హోమ్ ఆటోమేషన్, ఎస్టీపీ, రెయిన్ హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉన్న గృహాల కొనుగోళ్లకే మద్దతు పలుకున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఈ తరహా ప్రాజెక్ట్ల పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. అందుకే డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ల నిర్మాణాలనే చేపట్టాలి. దీంతో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వస్తాయి. -
అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన రహదారిలోని ఓ ప్రాంతంలో ధర్నా, మరో రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ విషయం సీసీ కెమెరాలు, హైరైజ్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తుంది. కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకులకు తెలియదు. దీంతో వారు ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. అలా కాకుండా ముందే ఆ విషయం తెలిస్తే..మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళతారు. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కసరత్తు చేశారు. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా కూడా అమలు చేశారు. త్వరలో హైదరాబాద్ అంతా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. జంక్షన్లో మూడు, నాలుగు రోడ్లు సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోనూ మూడు, నాలుగు రోడ్లు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ ‘సిగ్నల్స్ సైకిల్’నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండదు. అలా ఉండాలంటే వాటిని క్షేత్రస్థాయి సిబ్బంది మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. ఇలాంటి అనేక సమస్యలకు గూగుల్ సంస్థ పరిష్కారం చూపనుంది. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కొన్ని జంక్షన్లు, రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విధానం త్వరలోనే నగరవ్యాప్తంగా అమలు కానున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రకటించారు. ఐటీఎంఎస్ సహకారంతో సిగ్నలింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్కు ఏ జంక్షన్లోని.. ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలుస్తుంది. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాఫ్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానం అమలవుతుంది. ఈ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంటుంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది.మ్యాప్స్ ద్వారానే అలర్ట్స్ కూడా...ఇప్పటికే గూగుల్ మ్యాప్స్లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న సెల్ఫోన్ల ద్వారా ఈ రద్దీని గూగుల్ సంస్థ గుర్తిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల డేటాతో గూగుల్ సర్వర్ అనుసంధానం చేస్తున్నారు. ఇలా నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు గూగుల్కు చేరతాయి. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, రోడ్డు ప్రమాదం జరిగినా, నిరసన కార్యక్రమం ఉన్నా కూడా తెలుస్తాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే గూగుల్ సర్వర్ మ్యాప్స్కు అనుసంధానం చేస్తుంది. తద్వారా ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకులను గుర్తించడంతోపాటు ట్రాఫిక్ జామ్పై అలర్ట్ ఇస్తుంది. దాదాç³# రెండుమూడు కిలోమీటర్ల ముందే ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాన్నీ సూచిస్తుంది. ఈ విధానం అమలులోకి వస్తే సిగ్నల్స్ అన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని (సీసీసీ) సర్వర్ ఆధారంగా పనిచేస్తాయి. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే జంక్షన్లను మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. -
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
సనత్నగర్(హైదరాబాద్): కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్ ప్రాంతానికి చెందిన మహిళ (26) బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న పనీశ్ (52) పరిచయమయ్యాడు. ఆమెను తన కూతురిలా భావిస్తున్నానని చెప్పేవాడు. అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో మహిళ హైటెక్ సిటీలోని మరో బ్యాంకులో పనిలో చేరింది. కాగా ఏప్రిల్ 2024 నుంచి మనీష్ ప్రవర్తనలో మార్పును బాధితురాలు గుర్తించింది. తరచూ ఆమెకు వాట్సప్లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా దూషిస్తూ వాట్సప్ సందేశాలు పంపేవాడు. ఆమె పనిచేస్తున్న బ్యాంక్కు వెళ్లి అక్కడి సిబ్బందికి బాధితురాలి గురించి చెడుగా ప్రచారం చేయగా వారు ఆమెను పనిలోకి రావద్దని చెప్పారు. దీంతో బాధితురాలు శనివారం బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా పనీ‹Ùపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Golconda: కోట టు టూంబ్స్.. ఆకాశ యానం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులను ఆకట్టుకొనే చారిత్రక గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు రోప్వే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తోన్న హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న కుతుబ్షాహీల సమాధుల వరకు రోప్వే నిర్మాణంపై దృష్టి సారించింది. పర్యాటకులతో కిటకిట.. ప్రతి రోజు దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో టూంబ్స్ వరకు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వైపులా రాకపోకలు సాగించేందుకు రోప్వేను ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా రోప్వే ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3 వేల మంది విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్వే ఏర్పాటు చేస్తే దేశ విదేశాలకు చెందిన పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో కన్సల్టెన్సీ .. రోప్వే ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. పీపీపీ పద్ధతిలో నిర్మాణం.. రోప్వేను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. 1.5 కిలోమీటర్లకు సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అంచనా. ప్రస్తుతం గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది. రోప్వే వల్ల కేబుల్ కార్లలో 10 నిమిషాల్లో రాకపోకలు సాగించవచ్చు. పైగా టూరిస్టులకు ఆకాశంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. ప్రస్తుత అంచనాల మేరకు రోజుకు 3000 మందికి పైగా రోప్వేను వినియోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరగవచ్చు. -
హైదరాబాద్లో వారణాసి!
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ను క్రియేట్ చేశారని తెలిసిందే.ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్లో యాక్షన్ సీక్వెన్స్లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. -
భాగ్యనగరంలో యోగా డే సంబరాలు : సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..
సాక్షి, సిటీబ్యూరో: కళాకారుని సృజనాత్మకతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించ వచ్చని.. అది అనాథ, నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని పలువురు కళాకారులు నినదిస్తున్నారు. ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల విద్యకు సహకారం అందించడమే లక్ష్యంగా పరోపకార –2025 కళా ప్రదర్శన (Art Exhibition) నిర్వహించ నున్నారు. నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నచికేత తపోవన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సమగ్ర విద్య, సాధికారత కోసం ప్రత్యేక నిధుల సేకరణ కళా కార్యక్రమంగా ‘పరోపకార–2025’ సగర్వంగా ఆవిష్కరిస్తున్నారు. కళ, లగ్జరీ రంగాల్లో వ్యాపారవేత్త అయిన సుష్మ తోట నిర్వహణలో నగరంలోని జూబ్లీ హిల్స్ ‘ది కులినరీ లౌంజ్’ వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. నా పదేళ్ల అనుభవం.. నచికేత తపోవన్ కోసం ఈ పరోపకార– 2025 భారీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టేలా చేసింది. ఈ ఏడాది పరోపకార ఫండ్ రైజింగ్ ప్రధానంగా అనాథ, పేద, గిరిజన, మొదటి తరం విద్యార్థులకు ఉచిత విద్యపై దృష్టి సారిస్తోంది. పరోపకార 2025లో ప్రదర్శించే కళాఖండాల కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి చిన్నారులు చదువుకోడానికి ఫీజులు, పుస్తకాలు, యూనిఫారŠమ్స్, ఆహారం అందించే నిధిగా వినియోగిస్తాం. కార్పొరేట్ సంస్థల కోసం ప్రత్యేకంగా ఎన్నో టీమ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలను రూపొందించిన అనుభవం ఉంది.. కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషం మరెక్కడా లభించదు. విద్య, ఆరోగ్యం అనేవి ప్రతి ఒక్కరి హక్కు.. కలిసొచ్చే అదృష్టం కాదు. – సుష్మ తోట, నిర్వాహకులు. ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శన.. ఉచిత విద్య, సామాజిక సేవ లక్ష్యంతో సుష్మ తోట సంకలనం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం.. కళను సమాజిక మార్పుకు నాంది పలికే విధంగా సరికొత్త లక్ష్యంతో మిళితం చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు తోట వైకుంఠం(Thota Vaikuntam), జోగెన్ చౌదరి, శక్తి బర్మన్, ఏలే లక్ష్మణ్(Laxman Aelay), రమేష్ గోర్జాల తదితరుల అద్భుతమైన కళాకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్న చిన్నారుల ఆధ్వర్యంలో కూడా హృదయాన్ని హత్తుకునే ప్రదర్శనలు ఉంటాయి. ఈ వేదికగా రెండు రోజుల ప్రదర్శనలో ప్రసిద్ధ కళాకారులతో సమావేశాలు, విద్యార్థులతో సంభాషణలు ఉంటాయి. -
నా జీవితంలో యోగాది ముఖ్యపాత్ర: హీరోయిన్ మీనాక్షి చౌదరి
-
సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్ -
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతిచెందిన యువతిని సుష్మ(27)గా గుర్తించారు.వివరాల ప్రకారం.. దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి పైనుంచి సుష్మ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బుధవారం హైటెక్ సిటీలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రాత్రి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆమె మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. -
బేగంపేటలో ఆగమాగం!
హైదరాబాద్: బేగంపేట ప్రధాన రహదారి అంటే వీఐపీ, వీవీఐపీల రాకపోకలకు ప్రధాన రాస్తా. ఒక్క నిమిషం ట్రాఫిక్ ఆగిందంటే.. క్షణాల్లో వాహనాలు బారులుదీరుతాయి. దీనికి కారణం వాహన విస్ఫోటానికి తగ్గట్లుగా రహదారుల అభివృద్ధి జరగం లేదు. రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప రహదారుల విస్తరణ మాత్రం అలాగే ఉంటోంది. ఫలితంగా నత్తకు నడక నేరి్పస్తున్నట్లుగా తయారైంది వాహనదారుల ప్రయాణం. ఇక చినుకు పడిందంటే చాలు.. ట్రాఫిక్ చిక్కులు చుక్కలు చూపిస్తాయి. ఈ పరిస్థితి బేగంపేట ప్రధాన రహదారిలో సర్వసాధారణంగా మారింది. వీఐపీలు.. వీవీఐపీలతో.. బేగంపేట రహదారి అంటేనే వాహనదారులు వామ్మో అనాల్సిందే. సికింద్రాబాద్, హైదరాబాద్లను కలిపే బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య దినదిన గండం నూరేళ్లాయుష్షుగా మారింది. ప్రధానంగా ఢిల్లీతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే వీవీఐపీలు, వీఐపీలు ఎక్కువగా బేగంపేట విమానాశ్రయాన్నే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో సాధారణంగానే ఈ రహదారి రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నారంటే ముందుగానే ట్రాఫిక్ను ఆపేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క నిమిషం ట్రాఫిక్ ఆగినా చాంతాడంత వాహనాల క్యూ నిలిచిపోతుంది. ఈ ప్రభావం కొన్ని గంటల పాటు ఉంటుంది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు కూడా నానా కష్టాలు పడాల్సిందే. వర్షాకాలంలో అయితే ఈ దారిలో ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే. ఎందుకంటే చినుకు పడిందంటే చాలు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి నరకం అంటే ఏమిటో వాహనదారులు చవిచూస్తున్నారు. అటు సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట మీదుగా అమీర్పేట, పంజగుట్ట, బల్కంపేట, సనత్నగర్ వైపు వెళ్ళే వాహనాలు, ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలతో ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తుంది. ఈ రహదారిలో ఫ్లైఓవర్లు ఉన్నా ప్రస్తుత రవాణా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా బేగంపేట పీ అండ్ టీ ఫ్లైఓవర్ వద్ద, రసూల్ ఫురా మెట్రో స్టేషన్ వద్ద ఒకవైపు మెట్రో పిల్లర్లు రోడ్డు మధ్యలో ఉండడం, మరోవైపు బాటిల్ నెక్ను తలపించేలా ఉండడంతో ఇక్కడకు వచ్చేసరికి వాహనాల వేగం ఒక్కసారిగా కుంటుపడుతుంది. దీంతో ఆ ప్రభావంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితులకు దారితీస్తోంది. ఇక ఏదైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యం.. వాహనదారుల అవసరాలను ఇక్కడ ఫ్లైఓవర్లు, రహదారులు తీర్చలేకపోతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రసూల్పురా చౌరస్తా నుంచి పాటిగడ్డ మీదుగా గతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినా అది ప్రతిపాదనలకే పరిమితమైందే తప్ప పట్టాలెక్కలేదు. ఈ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారా పంజగుట్ట వైపు వెళ్లే వాహనదారులకు సులువవడంతో పాటు బేగంపేట రహదారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనపై ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టిసారించడం ముదాహవం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే బాగుంటుందని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
HYD: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానం తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో, అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పీజేఆర్ జ్ఞాపకార్థం కొండాపూర్లో ప్లై ఓవర్.. 28న సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. (ఫొటోలు)
-
HMDA: ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీ.. ఇక ఈజీ
సాక్షి, హైదరాబాద్: ఇక ఈజీగా భూ వినియోగ ధ్రువీకరణ పత్రాలు లభించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లోనే అందజేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. చెరువులు, పార్కులు, వ్యవసాయ, అటవీ భూములను సైతం కొన్నిచోట్ల నివాసయోగ్యమైనవిగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లను జారీ చేశారు. మూడేళ్ల క్రితం వరకు నగరం చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ల్యాండ్యూజ్ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిజాయతీగా, అన్ని విధాలా అర్హత ఉన్న భూములకు సైతం సకాలంలో ల్యాండ్యూజ్ సర్టిఫికెట్లు లభించకపోవడంతో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. తీవ్రమైన జాప్యం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు.అక్రమాలను నివారించేందుకు.. రియల్ ఎస్టేట్ భూమ్ బలంగా ఉండి అనేక చోట్ల భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆకాశహర్మ్యాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో భూ వినియోగ ధ్రువీకరణ పెద్ద వ్యాపారంగా కొనసాగింది. ఇలాంటి అక్రమాలను నివారించి పారదర్శకంగా అందజేసేందుకు హెచ్ఎండీఏ (HMDA) అధికారులు కసరత్తు చేపట్టారు. దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించి పత్రాలను పొందవచ్చు. ‘ఆన్లైన్లో అందజేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తుదారులకు సకాలంలో సర్టిఫికెట్లు లభిస్తాయి’ అని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఇందుకనుగుణంగా త్వరలో కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ వరకు మ్యాపింగ్... హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ (RRR) వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో 7 జిల్లాల్లో 7250 చ.కి.మీ ఉన్న హెచ్ఎండీఏ కొత్తగా 10,472 చ.కి.మీ. వరకు పెరిగింది. 11 జిల్లాలకు విస్తరించి ఉంది. దీంతో ట్రిపుల్ ఆర్ వరకు కొత్తగా హెచ్ఎండీఏలో విలీనమైన 1,355 గ్రామాల్లోని భూములను సైతం జియో మ్యాపింగ్ చేయనున్నారు. ఈ దిశగా ఇప్పటికే మెగా మాస్టర్ప్లాన్ రూపకల్పనకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల భూముల వాస్తవ స్థితిగతులు మారాయి. కొన్నిచోట్ల అనేక రకాలుగా ఆక్రమణకు గురయ్యాయి. నిర్దిష్టంగా ఏ భూమి ఏ రకమైన వినియోగంలో ఉందనే విషయంలో స్పష్టత కొరవడింది.చదవండి: ఈవీలకు వైర్లెస్ చార్జింగ్ఈ క్రమంలో అన్ని ప్రాంతాల్లో భూములను జియో మ్యాపింగ్ చేస్తారు. తద్వారా దరఖాస్తుదారులు కోరిన విధంగా ల్యాండ్యూజ్ సర్టిఫికెట్లను అందజేసేందుకు అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూములను నివాస యోగ్యమైనవిగా మార్చుకొనేందుకు కూడా వెసులుబాటు లభించనుంది. ‘శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో మెగా మాస్టర్ప్లాన్ అతికీలకమైన మైలురాయి కానుంది. 2050 వరకు హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను ఇందులో రూపొందిస్తున్నామని హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఈ మాస్టర్ప్లాన్ ఆధారంగానే దరఖాస్తుదారులు కోరినవిధంగా సేవలను సులభంగా అందజేయవచ్చని పేర్కొన్నారు.లే అవుట్లు, నిర్మాణాల్లో కీలకం..భూ వినియోగ ధ్రువీకరణ పత్రాలతో పాటు లేఅవుట్లు, భవన నిర్మాణాల్లో సైతం వివిధ రకాల భూముల మ్యాపింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సమగ్రమైన మ్యాపులు అందుబాటులో లేకపోవడంతో అధికారులు రకరకాల మ్యాపులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ కారణంగా కొత్తగా చేరిన ప్రాంతాల్లో లేఅవుట్ అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. వివిధ కేటగిరీలుగా భూములను మ్యాపింగ్ చేసిన అనంతరం కొత్తగా చేరిన ప్రాంతాల్లో కూడా లే అవుట్ ప్రొసీడింగ్లు సులభతరం కానున్నాయి. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిలోని భూముల మ్యాపింగ్పై రెండు రోజుల క్రితం అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి చేసి అనుమతులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. -
హనీ ట్రాప్కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్ బుక్లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తల్లి టైలర్ అంటూ సదరు ఆ మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ మహిళ.. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్తో మాట్లాడిన బాధితుడు రూ.10 వేలు పంపించాడు.అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు.కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్.. తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ కేబుల్ ఆపరేటర్ చెప్పగా.. సరేనన్న వృద్ధుడు.. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ బాధితుడికి సందేశం పంపాడు.బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్ఐకి లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్ఐ వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటూ మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో మరో ఏడు లక్షలను ఆ వృద్ధుడు పంపించాడు. ఇలా మొత్తం 38.73 లక్షలు ఆ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేసేశారు. -
భాగ్యనగరంలో మధ్యధరా-ఆసియా రుచులు..
భాగ్యనగరానికి మధ్యధరా–ఆసియా ఫ్లేవర్లను తీసుకొచ్చేందుకు ‘కైమా’ రెస్టారెంట్ ఆరంభమైంది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని సత్వా నాలెడ్జి పార్కులో నగరంలో మొదటి సారిగా కైమా రెస్టారెంట్ మంగళవారం ప్రారంభించారు. మొదటి కైమా రెస్టారెంట్ ముంబయిలోనూ, రెండో రెస్టారెంట్ పుణెలోనూ, మూడో రెస్టారెంట్ను హైదరాబాద్ నాలెడ్జి సిటీలోనూ ఏర్పాటు చేయడం విశేషం. సహజసిద్ధమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రాళ్లు, బంకమట్టితో నిర్మించిన గోడలను తలపించే రీతిలో యాంబియన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. టెర్రకోట, గిరిజన మూలాంశాలలోని కథలను వివరించేలా ఆకర్షణీయమైన అలంకరణతో, అబ్బురపరిచే లైటింగ్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ యజమానులు నిఖితాపూజారి, అంకితాపూజారి, నారాయణ్ పూజారి, మేనేజింగ్ పార్ట్నర్ నిఖిల్ రోచ్లాని, చెఫ్లతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం విభిన్న నగరమే కాకుండా వివిధ రకాల రుచులను ఆస్వాదించే ప్రజలకు అందుబాటులో ఉండేలా తమ కైమా రెస్టారెంట్ ఏర్పాటు చేశామని యాజమాన్యం తెలిపింది. ప్రత్యేకమైన వంటకాలతో.. కైమా రెస్టారెంట్లో వివిధ దేశాల సంప్రదాయ వంటకాలను ఆసియా రుచులతో అనుసంధానించేలా ఏర్పాటు చేశారు. నగరవాసులకు ప్రాన్స్రూబియాన్, చికెన్షిఫ్ తవూక్, ఈజిప్షియన్ కోషారీ, సిగ్నేచర్ క్లాసిక్ లెబ్నెహ్ షగ్, కాటేజ్ చీజ్ పాకెట్స్ వంటి వాటిని ఆహారప్రియులైన నగరవాసులు ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆసియన్ వంటకాల్లో కిమ్చి–జ్జిగే సూప్, తాజా రుచికరమైన ట్రిపుల్–ఇ స్పినాచ్ ఆస్పరాగస్ సలాడ్, సిట్రస్–ఫార్వర్డ్ సాల్మన్ టిరాడిటో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ట్రిపుల్–ఇ ఎడామామ్ మనీ బ్యాగ్, గొర్రె లేదా జాక్ఫ్రూట్తో మసాలా రెండాంగ్ గ్యోజా, బోల్డ్ స్పైసీ మష్రూమ్ చెయుంగ్ఫాంగ్, ఇటాలియానో సాల్మన్ రోల్, క్వినోవా అవోకాడో రోల్ వంటి సుషీ వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు సాల్మన్ టామ్యమ్, చిలగడ దుంప– వాసబిమాష్, స్మోకీ–స్వీట్ లాంబ్ చాప్ బుల్గోగి, సామ్జియోప్సల్ ప్లాటర్ వంటి ప్రధాన వంటకాలు, బక్లావా చీజ్కేక్ నుంచి సుగంధ సాఫ్రాన్ మిల్క్ కేక్, కునాఫా వంటివి కూడా ఆహారప్రియులను అలరించనున్నాయి. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!) -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
హైదరాబాద్: గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్ 17) రాజాసింగ్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ‘పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?. కిషన్రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు, పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. విభజించడానికి కాదు.. ఐక్యత కోసం ఇక్కడ ఉన్నా. వ్యక్తిగత విభేధాలను విడిచిపెట్టి ఐక్యంగా పని చేద్దాం’ అని రాజాసింగ్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. -
గ్రామీణ సాంస్కృతిక కళా రూపం..'చేర్యాల చిత్రం'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేర్యాల నకాషి పెయింటింగ్స్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు ఆదరణ లేని ఈ చిత్రాలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో గ్రామీణ, సాంస్కృతిక ఇతివృత్తాలను తెలిపే చిత్రాలను వేస్తోంది బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్కు చెందిన ధనాలకోట వైకుంఠం నకాషి కుటుంబం. మహాభారతం, రామాయణం, వివిధ భారతీయ పురాణాలు వంటి హిందూ ఇతిహాసాలను చిత్రాల రూపంలో ఆలయాలు, మ్యూజియాల్లో, పలు ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ తరహా చిత్రకళపై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. నకాషి కళాకారులు 13వ శతాబ్దం నుంచి చిత్రకళను ప్రారంభించారు. రాజులు, జమీందారులు తమ ఇళ్లలో ఇంటీరియల్ డిజైన్ కోసం, వాహనాల రూపంలో ఈ తరహా పెయింటింగ్స్ చెక్కలతో చేయించుకునేవారు. అంతేకాకుండా గ్రామ దేవతల విగ్రహాలు, బొమ్మల కొలువులు, ఆవుపేడ, చింతపిక్కలతో చిన్న పిల్లలకు బొమ్మలు చేసేవారు. వందల సంవత్సరాల క్రితమే కథ చెప్పే సంఘాలు వీటిని దృశ్య సహాయంగా ఉపయోగించుకుని కథలు చెప్పుకుంటూ తెలంగాణ గ్రామాల్లో తిరిగేవారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అనేది ఆడియో – విజువల్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభ రూపాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ రాష్ట్రంలో నకాషి కులస్తులు మాత్రమే వీటిని తయారు చేస్తారు. ఎనిమిది కులాల పురాణాల చిత్రాలను వీరే వేస్తారు. దేశంలో పలు ఆలయాలు, మ్యూజియాల్లో చేర్యాల నకాషి చిత్రాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఉజ్జయినిలో శివపురాణం, దీనిని ఇటీవల ప్రధాని మోదీ సందర్శించారు. శివపురాణం ఆయనను ఆకట్టుకోగా, పెయింటింగ్స్ వివరాలు తెలుసుకుని గీసిన వైకుంఠం నకాషి గురించి మన్కీ బాత్లో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనంలో జైన్ మహావీర్ చరిత్ర ఏర్పాటు చేశారు. బొల్లారం రాష్ట్రపతి భవన్లో ఈ తరహా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. బీహారులోని తక్షశిల మ్యూజియంలో, అయోధ్యలోని తులసీదాస్ రామాలయం మ్యూజియంలో, భోపాల్లోని ఆదివాసీ లోక్ కళా చిత్రసమితి ప్రదర్శనలో ఉంచారు. స్విట్జర్లాండ్, చైనా, లండన్, మలేషియా, ఇటలీ, బెర్లిన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శనలో పెట్టారు. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ చేర్యాల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.నకాషి కళకు ప్రభుత్వాల సహకారం.. చేర్యాల నకాషి పెయింటింగ్స్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. వైకుంఠం నకాషి కుటుంబ సభ్యులు వనజ, రాకేష్ నిహారిక, వినయ్కుమార్, తన్మయ్, సారిక ఈ చేర్యాల చిత్రాలను వేస్తున్నారు. వైకుంఠానికి 2016లో జాతీయ అవార్డు, 1994, 1995లో నేషనల్ మెరిట్ అవార్డు, 1994లో రాష్ట్ర అవార్డు లభించాయి. (చదవండి: ఐదు పదులు దాటకా.. ఆ వైద్య పరీక్షలు తప్పనిసరి..!) -
కథక్ నృత్య కళాకారిణి మంగళాభట్ కన్నుమూత
బంజారాహిల్స్: ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి నాట్య గురు మంగళాభట్ (62) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు. ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్భట్ సతీమణి మంగళాభట్ విఖ్యాత జానపద కళా బ్రహ్మ గోపాల్రాజ్ పేరుతో గత 35 ఏళ్లుగా హైదరాబాద్లో ఎందరినో కథక్ నాట్యంలో తీర్చిదిద్దారు. ఆమె భర్త రాఘవరాజ్భట్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్గా సేవలు అందిస్తున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని మిథిలానగర్లోని ఆమె స్వగృహంలో కళా ప్రేమికులు, బంధుమిత్రులు సందర్శనార్థం ఉంచి, జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంగళా భట్ (మంగళా కులకర్ణి) మృతి పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు
జడ్చర్ల: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్కు మధ్య గొడవ జరగగా చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటు చేసుకుంది.సీఐ కమలాకర్ కథనం మేరకు.. హైదరాబాద్-2 ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కొల్లాపూర్ బయలుదేరింది. జడ్చర్లలోని శ్రీనివాస కాలనీకి చెందిన అనసూయ అనే ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కింది. బస్సు ఫుట్బోర్డుపై నిలబడడంతో బ్రేక్ వేస్తే కింద పడిపోయే ప్రమాదముందని డ్రైవర్ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఒక్కసారిగా డ్రైవర్పై మండిపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో బస్సును మార్గమధ్యలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆపి పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పోలీసులు ఇద్దరిని విచారించి బస్సును పంపించి వేశారు. -
మాజీ మంత్రి హరీష్రావుకు అస్వస్థత
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(జూన్ 16) సాయంత్రం సమయంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు అస్వస్థతకు లోనయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆచ్.. ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నిర్విహించిన సమావేశంలో హరీష్రావు స్వల్పపాటి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను అక్కడ నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హై ఫీవర్తో హరీష్రావు ఆస్పత్రిలో చేరారు.వైరల్ ఫీవర్, డి ఐడ్రేషన్తో బాధ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఉన్నారు.సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో హరీష్రావును జాయిన్ చేయగా, ఆయన్ను కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇస్తామన్న బీజేపీ కార్పొరేటర్లు. ప్రజా సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ మెమోరండం ఇచ్చేందుకు కార్పొరేట్లరు లోపలికి వెళ్తాన్నారు. దీంతో, 15 మందిని లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అందరినీ అనుమతించాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీసు ఎదుట బారికేడ్లు పెట్టి వారిని నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు, గేట్లను ఎక్కి ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కనీస సౌకర్యాలు ఇవ్వడం చేతకాదు కానీ.. అందాల పోటీలు పెట్టడానికి కోట్లు ఖర్చు చేశారు. అందాల పోటీలకు పెట్టే ఖర్చు పెడితే.. వీధి లైట్లు, నీళ్లు రావా?. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు కనీస అవసరాలైన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ..ఆకాశమంత ఆనందం! (ఫొటోలు)
-
ఘనంగా ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025 (ఫొటోలు)
-
కోరుట్లలో విషాదం.. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు
జగిత్యాల: కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాలు తరలిస్తుండగా ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో మృతులు బంటిసాయి,వినోద్లుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలాజీ కళా ఆర్ట్స్ విగ్రహాల తయారి యజమాని అల్వాల వినోద్, బంటి సాయి అనే ఇద్దరు యువకులు కోరుట్ల పట్టణం శివారులోని వినాయక విగ్రహాల తయారు చేస్తున్నారు. అయితే, ఆదివారం షెడ్డులో ఉంచిన విగ్రహాలు తడిగా ఉండటంతో ఎండలో ఆరబెట్టేందుకు పక్కనే ఉన్న మరో షెడ్డుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొండ్రికర్ల నుండి వచ్చే 133/11 కేవీ విద్యుత్ వైర్లకు 13అడుగుల వినాయక విగ్రహాం తగిలింది. దీంతో ఆరు నుంచి తొమ్మదిమందికి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్తో విలవిల్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు కర్రల సాయంతో కరెంట్ షాక్ ప్రమాదాన్ని నిలువరించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
నివాస విభాగాన్ని కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ కంటే ముందు వరకూ అపార్ట్మెంట్ విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అంటే ఫ్లాట్ ఏరియాలో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం ఎంత ఉందని చూసుకునేవారు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ఫ్లాట్లో నివాసితుడు వినియోగించే స్థలం కంటే క్లబ్హౌస్, పార్క్, గార్డెన్, లాబీ వంటి వసతులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారనే దానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టయిల్ను కోరుకునే యువ జనరేషన్ పెరుగుతుండటంతో అపార్ట్మెంట్లో కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గుతోందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఅపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ల స్థలంతో పాటు లిఫ్ట్, మెట్లు, క్లబ్హౌస్, పార్క్ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కలిపితే దాన్ని సూపర్ బిల్టప్ ఏరియాగా పేర్కొంటారు. ఇక, ఫ్లాట్లో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం(గోడ నుంచి గోడ వరకూ ఉండే స్పేస్)ను కార్పెట్ ఏరియాగా పేర్కొంటారు. కరోనా మహమ్మారి కంటే ముందు వరకూ గృహ కొనుగోలుదారులు కార్పెట్ ఏరియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కోవిడ్ తర్వాత నుంచి కార్పెట్ కంటే అపార్ట్మెంట్లోని వసతులకు(లోడింగ్) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1) నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ లోడింగ్ 40 శాతానికి చేరుకుంది. 2019లో ఇది 31 శాతంగా ఉంది. నివాస సముదాయాలలో అధునిక వసతులు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ల లోడింగ్(వసతులు)పెరుగుతోంది. విలాసవంతమైన జీవనశైలి కారణంగా గృహ కొనుగోలుదారులు అధిక వసతులు, సౌకర్యాలను కోరుతున్నారు.వసతులకు ప్రాధాన్యం దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలం కాగా మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతం. లిఫ్ట్, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్, వసతులు, ట్రెరస్ వంటి కామన్ ఏరియాలు. కరోనా కంటే ముందు వరకూ 30 శాతం కంటే తక్కువ లోడింగ్ సాధారణంగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి విలాసవంతమైన జీవనశైలి అలవాటైపోయింది. ప్రాజెక్ట్ చిన్నదైనా, పెద్దదైనా ఆధునిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసయోగ్యమైన స్థలం కార్పెట్ ఏరియా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు ప్రాథమిక జీవనశైలి సౌకర్యాలతో సంతృప్తి చెందడం లేదు. ఫిట్నెస్ కేంద్రాలు, క్లబ్ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్ లాబీలు ఉండాలని కోరుకుంటున్నారు.రీసేల్ విలువ పెరుగుదల.. లోడింగ్ పెరిగితే కమ్యూనిటీ నివాస యోగ్యత, రీసేల్ విలువలను కూడా పెరుగుతుంది. అయితే గృహ కొనుగోలుదారులు తమ అపార్ట్మెంట్లలో వాస్తవంగా ఉపయోగించే స్థలాన్ని కోల్పోతారు. ప్రతి ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లోని మొత్తం స్థలంలో గృహ కొనుగోలుదారులు వాస్తవంగా ఉపయోగించే స్థలం, సౌకర్యాల కోసం కస్టమర్లు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొనేలా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) నిబంధనలు రూపొందించాలి. దీంతో కస్టమర్లు చెల్లించే సొమ్ములో దేనికెంత వ్యయం అవుతుందో స్పష్టత ఉంటుంది.లోడింగ్ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే.. సూపర్ బిల్టప్ ఏరియా నుంచి కార్పెట్ ఏరియాను తీసి వేసి, కార్పెట్ ఏరియాతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని వందతో గుణిస్తే వచ్చేదే లోడింగ్ శాతం. ఉదాహరణకు.. హైదరాబాద్లో మీరు 1,500 చ.అ. అపార్ట్మెంట్ కొంటున్నారని అనుకుందాం. ఇందులో ఫ్లాట్లో కస్టమర్ వినియోగించే స్థలం 750 చ.అ.లే ఉంటుంది. మిగిలిన స్థలం లిఫ్టు, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్ వంటి కామన్ ఏరియాలు ఉంటాయి. అంటే ఫ్లాట్ ఖరీదులో కస్టమర్ వాస్తవంగా వినియోగించే కార్పెట్ ఏరియాతో పాటు కామన్ ఏరియా కూడా కలిపే ఉంటుందన్నమాట. నగరంలో లోడింగ్ 38 శాతం..హైదరాబాద్లో లోడింగ్(వసతులు) శాతం 2019లో 30 శాతంగా ఉండగా.. 2022 నాటికి 33కు, ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 38 శాతానికి పెరిగింది. 2025 క్యూ1 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అత్యధికంగా 43 శాతం లోడింగ్తో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లోనూ ఈ ఆర్థిక నగరంలో అత్యధిక లోడింగ్ 33 శాతంతో టాప్లో నిలిచింది. అత్యల్పంగా 36 శాతం లోడింగ్తో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 2019లో ఇక్కడ లోడింగ్ 30 శాతంగా ఉంది. ఏటేటా బెంగళూరులో అపార్ట్మెంట్ లోడింగ్ క్రమంగా పెరుగుతోంది. 2019లో ఇక్కడ 30 శాతం లోడింగ్ ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 41 శాతానికి పెరిగింది. 2022లో ఇది 35 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో బెంగళూరులో సగటు లోడింగ్ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. ఎన్సీఆర్ లో 2019లో లోడింగ్ శాతం 31 శాతం నుంచి 2025 క్యూ1 నాటికి 41 శాతానికి చేరింది. పుణేలో 32 శాతం నుంచి 40కు, కోల్కతాలో 30 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. -
తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విన్యాసాల వాయిద్యం.. మార్ఫా సంగీతం..
గణేష్ చతుర్థి ఊరేగింపులైనా.. పెళ్లి వేడుకలైనా.. నగరాన్ని సందర్శించే ప్రముఖులను స్వాగతించాలన్నా టక్కున గుర్తొచ్చేది మార్ఫా బ్యాండ్. ఈ ఉల్లాసభరితమైన సంగీతం లేకపోతే హైదరాబాద్ సంప్రదాయం అసంపూర్ణమే. పాతబస్తీలో అందాల రాణులతో నృత్యం చేయించి, కొడుకు పెళ్లిలో నాగార్జునతో డ్యాన్స్ చేయించి.. తరాలకు, ప్రాంతాలకు అతీతంగా అలరించే శక్తి తనదని నిరూపించుకుంటోంది మార్ఫా సంగీత వాయిద్యం.. ఆఫ్రో, అరబ్ సంప్రదాయం నుంచి శతాబ్దాల క్రితం వలస వచ్చిన ఈ సంగీతం భాగ్యనగర సంస్కృతిలో భాగమైపోయింది. నగరంలో జరిగే ప్రతి వేడుకలోనూ తన ప్రశస్తిని చాటుకుంటోంది.. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో అబ్బురపరుస్తున్న రిథమిక్ ట్యూన్స్సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా కుల, మత సంబంధం లేకుండా అభిమానులున్న నగరానికి చెందిన మార్ఫా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మధ్యప్రాచ్యంలో మార్ఫా ప్రదర్శనలు జరుగుతుంటే, మరోవైపు ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రదేశాల్లో ఔత్సాహికుల నృత్యాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహార్యం నుంచి వైవిధ్యం..తల చుట్టూ ఎర్రటి చెక్కిన స్కార్ఫ్లు చుట్టుకుని, తెల్లటి కుర్తాలు, లుంగీలను «మార్ఫా కళాకారులు దరిస్తారు. ఈ కళాకారులు రాత్రిపూట, నిర్విరామంగా మూడు నుంచి ఆరు గంటల పాటు నిలబడి ప్రదర్శనలు ఇస్తారు. మెడలో బరువైన ఢోలక్ మోస్తూనే లయకు అనుగుణంగా> నృత్యం చేయాలి. ఉత్సవాలు, ఊరేగింపుల్లో తీవ్ర అలసట కారణంగా మార్ఫా కళాకారుల నోటి నుంచి రక్తస్రావం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంటుంది. మార్ఫా బ్యాండ్లో సంప్రదాయంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు, బృందంలోని కొంతమంది సభ్యులు నృత్యం చేయవచ్చు. వారి సహచరులు వాయిద్యాలను వాయించేటప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డాగర్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక కళాకారుడు కత్తిని గాలిలోకి ఊపుతూ నర్తిస్తుంటే, ఇతర సంగీతకారులు క్రమంగా బీట్ టెంపోను పెంచుతారు.వైవిధ్యభరిత వాయిద్యాల సమ్మేళనం..మార్ఫా సంగీతంలో ‘మార్ఫా, సవారీ, నాగిన్, యాబు బక్కే రబు సాలా’ వంటి వివిధ శైలితో కూడిన రిథమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానికంటూ సొంత విలక్షణమైన వైవిధ్యంతో అలరిస్తాయి. ఈ సంగీతం అనేక వాయిద్యాల సహాయంతో పలకిస్తారు. ప్రధానంగా మార్ఫాలు (ధోలక్, డాఫ్ అని పిలుస్తారు). వీటిని సంగీతకారులు ‘థాపి’ అని పిలిచే చెక్క స్ట్రిప్లతో కొడతారు. వీరి పూర్వీకులు మేక చర్మంతో తయారు చేసిన మార్ఫాలపై కొట్టేవారు. నేటి కళాకారులు వాయించడం సులభం. ఖర్చు తక్కువ అవుతుందిని ఫైబర్ వాయిద్యాలు ఇష్టపడతున్నారు. కొన్ని విభిన్న వాయిద్యాలను కందూర, ముషాద్ జెట్టా, మార్ఫాలు, బిండియా పీటల్ అని పిలుస్తారు. వాటిలో ఎక్కువ భాగం ధోలక్ను పోలి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడాలుంటాయి. ‘కళాకారులకు వారు వాయించడానికి ఎంచుకున్న వాయిద్యం ఆధారంగా వేతనం చెల్లిస్తారు’ అని కళాకారులు చెబుతున్నారు.చరిత్రతో మమేకం.. ఈ మార్ఫా బ్యాండ్లు తరచూ జెండా మార్చ్ల వంటి కార్యక్రమాలకు నియమించుకుంటారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీదారుల పాతబస్తీ సందర్శన సందర్భంగా వారికి మార్ఫా సంగీతం స్వాగతం పలికింది. నిజాం పాలనలో నగరానికి చేరుకుందీ యెమెన్ కళారూపం. ఈ కళారూపాన్ని నగరానికి ఎవరు పరిచయం చేశారు? అనే దానిపై కొంత వివాదం ఉంది. ఇది తీసుకొచ్చింది సిద్ధిలు (ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు) అని కొందరు చెబుతుండగా, దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది యెమెన్ పూర్వీకులేనని కొందరు అంటున్నారు.కళాకారులు ఏమంటున్నారు? ‘నిజాం పాలనలో వేడుకల సందర్భాల్లో ఈ వాయిద్యాన్ని వినియోగించేవారు. నేటికీ గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మార్ఫా తప్పనిసరి’ అని మార్ఫా కళాకారుడు కయ్యూమ్ బిన్ ఒమర్ చెప్పాడు. గత 28 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఓమర్ ప్రారంభంలో 70–80 మంది మార్ఫా బృందం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కి తగ్గింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామనీ, తెలుగు రాష్ట్రాల వెలుపల కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నామని ఒమర్ అంటున్నాడు. డాగర్ డ్యాన్స్ హైలెట్.. సాంప్రదాయ యెమెన్ నృత్యరూపం డాగర్ డ్యాన్స్కు అత్యంత డిమాండ్ ఉందని అరబి మార్ఫా బ్యాండ్ యజమాని మొహమ్మద్ యూసుఫ్ చెప్పారు. అయితే, నిజమైన కత్తులకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా చెక్క కత్తులను వినియోగిస్తున్నారు. ‘గతంలో కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో కత్తులను లాక్కొని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కత్తుల వినియోగాన్ని నిషేధించింది, కానీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి చెక్క లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగిస్తున్నాం’ అని మహమ్మద్ చెప్పారు. కళను సజీవంగా ఉంచేందుకు.. ‘నా పేరు ఫిరోజ్. కానీ అందరూ నన్ను జాబ్రీ అని పిలుస్తారు. చిన్నతనం నుంచి అంటే 24 సంవత్సరాలుగా మార్ఫా ప్లే చేస్తున్నా. నగరంలో ముఖ్యంగా బార్కాస్ ఏసీ గార్డ్స్ వంటి ప్రదేశాల్లో మార్ఫా ప్రసిద్ధి చెందింది. నిజాంల కింద పనిచేసిన యెమెన్ సైనికుల ద్వారా 200 ఏళ్ల క్రితం మార్ఫా నగరానికి వచ్చిందంటారు. అదేమో గానీ మా పెద్దలు ఈ కళను నాకు అందించారు. దీనిని సజీవంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తున్నా. నా బృందంలో 20 మంది సభ్యులున్నారు. నగరం అంతటా వివాహాలు, వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తాం. మతాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటాం. కేవలం వారసత్వాన్ని సజీవంగా ఉంచాలన్నదే మా ఆలోచన. – ఫిరోజ్ మార్ఫా ఆర్టిస్ట్ (సోషల్ మీడియా పోస్ట్ నుంచి) -
అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక (ఫొటోలు)
-
ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..
వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది. -
హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్కు రానుంది. ఈ 8 మ్యాచ్ల కోసం జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేండ్రం, నాగ్పూర్ వేదికలను షార్ట్లిస్ట్ చేశారు. ఈ సిరీస్ల కోసం మరికొన్ని వేదికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుండగా... రెండో మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్టు ఆడనుంది. 22 నుంచి గువాహటిలో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్య సఫారీ జట్టుతో మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్లు వరుసగా రాంచీ, రాయ్పూర్, విశాఖపట్నంలలో జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. రోస్టర్ విధానంలో అన్ని నగరాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇవ్వడంలో భాగంగా... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే, టి20 సిరీస్ల కోసం హైదరాబాద్ వేదికను పరిశీలిస్తున్నారు. శనివారం జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కివీస్తో షెడ్యూల్ ప్రకటించనున్నారు. న్యూజిలాండ్తో సిరీస్ల అనంతరం ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
హైదరాబాద్-తిరుపతి వందే భారత్లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన రైలు
సాక్షి, నెల్లూరు: హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, వందే భారత్ రైలు నెల్లూరులో నిలిచిపోయింది. వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు నిలిపిపోయింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ'
ఆర్థిక అక్షరాస్యత కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ తరానికి ఇదొక తప్పనిసరి అవసరమని ఫిన్ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ అన్నారు. విద్యార్థులు మొదలు, వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ వరకూ ఆర్థిక విద్య (ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్)ను చేరువ చేయడానికి ఫిన్ఈ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్వర్సిటీని ప్రారంభించామన్నారు. నగరంలోని మెర్క్యూర్ హోటల్ వేదికగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విప్లవాత్మక ఫిన్వర్సిటీని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ప్రధానమైన అంశమని, మనం మరింత విజ్ఞానం, సాధికారత కలిగిన జనాభా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తును నిర్మించడమే ఈ వర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బ్లెసిడా బెన్నీ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. యువతతో పాటు నిపుణులలో ఆర్థిక అక్షరాస్యతలో గణనీయమైన అంతరం ఉందని, ఈ క్లిష్టమైన అంతరాన్ని తగ్గించే ప్రణాళికలు తమ లక్ష్యమని అన్నారు. ఫిన్వర్సిటీతో రానున్న రెండేళ్లలో 20 లక్షల మందిని మార్చుతూ.. ప్రపంచ ఆర్థిక నైపుణ్యాలతో సాధికారత కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్వి బద్రీనాథ్, ఫిన్ఈ డైరెక్టర్ నులకజోడు మధు వినయ్, నటులు శ్రీ తేజ్, అభిలాష్ శంకర, ప్రఖ్యాత గాయకుడు లక్ష నాయుడు, జబర్దస్త్ ఆర్టిస్టులు తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఆర్అండ్ఆర్ కమిషనర్గా శివకుమార్ నాయుడు, రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్.హనుమంతు, నిజామాబాద్ కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్కుమార్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను నియమించింది.తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా వల్లూరి క్రాంతి, హ్యూమన్ రైట్స్ కమిషనర్ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ, ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నిఖిల్ చక్రవర్తి, సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయక్, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఈ. నవీన్ నికోలస్, హన్మకొండ కలెక్టర్గా స్నేహశబరీష్, స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్గా శ్రీజన, ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్ కుమార్, ఐఅండ్పీఆర్ స్పెషల్ కమిషనర్గా చెక్క ప్రియాంక బదిలీ అయ్యారు. -
డిజిటల్ సాధికారత కలకు ఎస్టీపీఐ రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాతావరణాన్ని బలోపేతం చేయడంతో ద్వారా దేశ ‘డిజిటల్ సాధికారత’కలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మూలస్తంభంగా నిలుస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం (1991లో) ఏర్పాటైన ఎస్టీపీఐ దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో వృద్ధి, సాంకేతిక స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. ఎస్టీపీఐ ఇటీవలే 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కోవలోనే ఏర్పాటైన ఎస్టీపీఐ హైదరాబాద్ విభాగం తెలంగాణ, ఏపీలో ఐటీ, స్టార్టప్ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1.35 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్తో భారత ఐటీ పరిశ్రమను ఎస్టీపీఐ హైదరాబాద్ బలోపేతం చేస్తోంది.రూ. 4.76 కోట్ల ఎగుమతులతో.. దేశవ్యాప్తంగా ఎస్టీపీఐకి 14 చోట్ల డైరెక్టరేట్లు ఉండగా హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోని కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో కలుపుకొని మొత్తం ఐదు కేంద్రాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యంగా ఎగుమతుల యూనిట్లు (ఈఓయూ), తయారీ జోన్లు (ఈపీజెడ్)లను ఎస్టీపీఐ ఏర్పాటు చేసింది. 2023–24లో రూ. 1.23 లక్షల కోట్లు, 2024–25లో రూ. 1.42 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ భారత ఆర్థిక వృద్ధిలో కీలకంగా మారింది. 1992–93లో రూ. 4.76 కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ ‘ఇమేజ్ ’.. అక్కడ ‘కల్పతరు’ ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎస్టీపీఐ హైదరాబాద్ కొత్తగా ‘ఇమేజ్’, ‘కల్పతరు’ను ఏర్పాటు చేసింది. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ విజన్, ఏఐ స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం, సాంకేతిక మద్దతు, నిధుల సమీకరణ తదితరాల కోసం 2020లో హైదరాబాద్ ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇందులో సీవీ ల్యాబ్, గేమ్ ల్యాబ్తోపాటు స్టార్టప్లకు అవసరమైన పలు సమీకృత కార్యక్రమాలు చేపట్టింది. అలాగే విశాఖపట్నంలో ‘కల్పతరు’పేరిట సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ను స్థాపించారు. ఆవిష్కర్తలకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, మార్కెటింగ్ తదితరాలను కల్పతరు ద్వారా అందుబాటులోకి తెచ్చారు.ఐటీ ఊతానికి ఎస్టీపీఐలు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)కు శ్రీకారం చుట్టారు. ఐటీ సంస్థలకు అవసరమైన డేటా కమ్యూనికేషన్ సౌకర్యాలు, కంప్యూటర్లు, కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ఎస్టీపీఐకి అప్పగించారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడం, మార్కెటింగ్లో మద్దతు, ప్రాజెక్టులకు అనుమతులు, ఎగుమతులకు అవసరమయ్యే సర్టిఫికేషన్ తదితరాలన్నీ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారు. తొలుత బెంగళూరు, పుణే, భువనేశ్వర్లో ఎస్టీపీయూ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయగా ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, నోయిడా, గాందీనగర్, త్రివేండ్రం తదితర చోట్లకు విస్తరించారు.ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల వైపు దేశంలో ఐటీ రంగం శైశవ దశలో ఉన్న కాలంలో మూడు కేంద్రాలతో ప్రారంభమైన ఎస్టీపీఐ ప్రస్తుతం 67 కేంద్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. అందులో 59 కేంద్రాలు ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ఎస్టీపీఐలో నమోదైన ఐటీ పరిశ్రమల ద్వారా గతేడాది ఐటీ ఎగుమతులు రూ. 10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని 24 ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ (సీఓఈ)ల ద్వారా 1,400 స్టార్టప్లకు మద్దతు లభించింది. వాటికోసం ఇప్పటివరకు రూ. 574 కోట్ల నిధులను సేకరించింది. దేశ డిజిటల్, ఆవిష్కరణల వాతావరణానికి ఎస్టీపీఐ మూల స్తంభంగా నిలుస్తోంది. హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలోనూ ‘ఇమేజ్’, ‘కల్పతరు’ద్వారా 134 స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని అందించింది. – అర్వింద్ కుమార్, డైరెక్టర్ జనరల్, ఎస్టీపీఐ -
మేయర్ను దూషించిన నిందితుడి అరెస్టు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఆమె తండ్రి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును వ్యక్తిగతంగా దూషించిన కేసులో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐడీఏ బొల్లారం శ్రీరామ్నగర్ బస్తీలో నివసించే మజ్జిగ రమేష్ (36) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. బుకింగ్లో భాగంగా ఈ నెల 1వ తేదీన క్యాబ్లో ప్రయాణికులను తీసుకుని రాజమండ్రి వెళ్లాడు. ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ చూస్తుండగా బోరబండలో బీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులను తట్టుకోలేకనే మృతి చెందినట్లుగా చూశాడు. దీంతో అదే రోజు రాత్రి గూగుల్లో సెర్చ్చేసి బాబా ఫసీయుద్దీన్ నెంబర్ సేకరించి ఆయనను తిడదామని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచి్చంది. వెంటనే గూగుల్లో మరోసారి సెర్చ్ చేసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నెంబర్ను సేకరించాడు. అదే రోజు రాత్రి మేయర్కు ఫోన్ చేసి బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ మృతి ఘటనలో దోషులను మీరంతా రక్షిస్తున్నారని,కాంగ్రెస్లో చేరిన తర్వాత మీరంతా ఒక్కటయ్యారని అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తెల్లవారి రాత్రి కూడా మరోసారి మేయర్కు ఫోన్ చేసి ఆమెను, ఆమె తండ్రిని వ్యక్తిగత దూషణలతో వేధించాడు.మరోమారు ఈ నెల 5వ తేదీన కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా మూడు సార్లు ఫోన్ చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. దీంతో మేయర్ పీఆర్ఓ అఖిల్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుడి ఫోన్ నెంబర్తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గత మూడు రోజులుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టి శ్రీరామ్నగర్లోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుడు క్యాబ్ నడిపిస్తుంటాడని, సొంతంగా కారు ఉందని, బీఆర్ఎస్ అభిమానిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా మేయర్కు ఫోన్ చేసిన రోజు రాత్రి నిందితుడు పీకల దాకా మద్యం తాగి ఉన్నట్లు, మద్యం మత్తులోనే ఫోన్లు చేసినట్లుగా నిర్థారణ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర్ హైవేపై ఘోర ప్రమాదం
యాచారం(హైదరాబాద్): నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్కుమార్(26), వాస శివకుమార్, వాస సాయికుమార్(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్ పుట్టిన రోజు కావడంతో బీఎన్రెడ్డి నగర్కు చెందిన స్నేహితుడు శివకుమార్ గౌడ్తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మాల్ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్ గౌడ్, సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పారీ్టకి వెళ్లిన వారిలో పవన్కుమార్ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచి్చందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. -
మార్వ్లెస్. మాన్సూన్ వెడ్డింగ్స్..
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరుగిడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అంటూ సాగే పాత తెలుగు సినిమా పాటను గుర్తు చేసేలా నేటి వెడ్డింగ్ ప్లానర్లు ప్లాన్ చేస్తున్నారు.. సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే కాస్త ఇబ్బంది.. చిరాకే.. కానీ, పక్కాగా ప్లాన్ చేస్తే వానాకాలంలో పెళ్లి వేడుకలను మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవచ్చు.పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. మరోవైపు వేసవి ముగియకముందే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అంగరంగ వైభవంగా అలంకరించుకొని, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వర్షం పడితే ముందస్తు ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు చిరాకు పడటంతో పాటు రావాల్సిన బంధువులు రాలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే వానాకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కాసింత కష్టమే. కానీ, ఇవన్నీ పాత రోజులు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పెళ్లి వధూవరులకు మంచి అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు.హైబ్రిడ్ వేదికలు.. ఈమధ్య కాలంలో వర్షాకాలంలో వివాహాలు ట్రెండీగా మారాయి. పెళ్లి శుభలేఖల నుంచి మొదలుపెడితే వేదిక, మండపం అలంకరణ, అతిథుల ఆహ్వానం, ఫొటోగ్రఫీ, బరాత్ వరకూ అన్నీ ప్రత్యేకమైనవిగా ఉంటాయి. సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వధూవరులకు, అతిథులకు గొప్ప అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ పెళ్లి వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వాన ఇబ్బందుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.అన్ని రకాలుగా వేడుకలకు సిద్ధం చేయడమే ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి మండపమే కాదు టెర్రస్, లాన్, ఓపెన్ ఏరియా అన్నింటినీ గ్లాస్ కనోపీలతో కవర్ చేస్తారు. జర్మన్ హ్యాంగర్ టెంట్లు, వాటర్ ప్రూఫ్ డోమ్లు, ముడుచుకునే పైకప్పులతో వివాహ వేదిక, మండపాలు నిర్మిస్తారు. అకస్మాత్తుగా వర్షం కురిస్తే వాననీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్పరెంట్ పెళ్లి వేదిక, మండపాలతో వధూవరులకే కాదు అతిథులు కూడా వర్షం పడినా తడిసిపోకుండా వర్షపు జల్లులు, శబ్దాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతిని పొందుతారు.భద్రత కీలకమే.. నాన్స్లిప్ టైల్స్, మ్యాట్లు, తగినంత లైటింగ్తో పాటు వృద్ధులకు డ్రై జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో బరాత్లకు బదులుగా సన్నాయి మేళం, డోల్ చప్పుళ్లు, మ్యూజిక్ బ్లాస్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో అతిథులు గొడుగుల కింద నృత్యం చేసే వీలుంటుంది. విద్యుత్ అంతరాయం కలగకుండా బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్లను క్యారీ చేస్తారు. డీహ్యుమిడిఫయ్యర్లు, ప్లాస్టిక్ టార్ప్లిన్ ఏర్పాటు చేస్తారు. లాంతర్లు, షాండీలియర్ల వెలుగులో వధూవరులు గొడుగుల కింద లేదా వర్షంలో తడుస్తూనే రొమాంటిక్ ఫొటోలకు ఫోజులు ఇస్తారు.వర్షాన్ని ఆస్వాదించేలా.. శుభలేఖ కూడా మేఘాలు, వర్షం చినుకులను ప్రతిబింబించేలా ముద్రిస్తారు. అతిథులు పెళ్లి వేదికలో అక్కడక్కడ శుభ్రమైన చిన్న టవల్స్ను అందుబాటులో ఉంచుతారు. బగ్ స్ప్రే ప్యాచ్లు, త్వరగా ఆరిపోయే న్యాప్కిన్లు, వర్షంలో, బురదలో జారిపడిపోకుండా ఫ్లిప్ఫ్లాప్ పాదరక్షలు అందుబాటులో ఉంచుతారు. అతిథులు వర్షం మూడ్ ఆస్వాదించేందుకు వేడి టీ, కాఫీలు, మసాలా మాక్టెయిల్స్, ముల్లడ్ వైన్ కాక్టెయిల్స్తో బార్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వెల్వెట్, సిల్క్ వంటి బరువైన దుస్తులుహుందాగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల వర్షాకంలో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే అవి మరింత బరువుగా మారతాయి. పైగా వర్షం పడిన సమయంలో ఉక్కపోతకు ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి బదులు తేలికపాటి నేత వ్రస్తాలు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మృధువైన నైలాన్తో తయారైన వ్రస్తాలు, సిల్్క, సింథటిక్ ఫైబర్తో తయారైన జార్టెట్తో లెహంగాలను డిజైన్ చేస్తున్నారు. ఇవి నీటిని పీల్చుకోకపోవడంతో పాటు తేలికగా ఉండటమే వీటి ప్రత్యేకత. వాటర్ ప్రూఫ్ లైనింగ్, క్విక్ డ్రై దుపట్టాలను వధూవరులు ఎంచుకుంటున్నారు. -
కూకట్పల్లిలో గజం భూమి ధర రూ.2.98 లక్షలు
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలకు బుధవారం ఏర్పాటు చేసిన వేలం పాటలో భారీ స్పందన లభించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు హాట్కేక్ల్లా అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్లోని ప్లాట్ నంబర్ 22ను అత్యధికంగా గజానికి రూ.2.98 లక్షల చొప్పున దక్కించుకున్నారు. 151 గజాలున్న ఈ ప్లాట్ 4 కోట్ల 52 లక్షల 72 వేల 160 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అదే విధంగా 292 గజాలు ఉన్న 19వ నంబర్ ప్లాట్ గజానికి రూ.2.88 లక్షల చొప్పున వేలకు వేలం పాడారు. ఈ ప్లాట్ నుంచి 8 కోట్ల 40 లక్షల 96 వేల రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఉన్న మొత్తం 18 ప్లాట్లలోని 6,236.33 గజాలకు కలిపి 141 కోట్ల 36 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ.. బిగ్ బాస్ దివి రియాక్షన్
-
బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!
నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం... తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం.. ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం... పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్ చేస్తే మెదిలే ఇమేజెస్ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్లో జవహర్ నగర్ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్ నగర్ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్ సత్యార్థి. కానీ జవహర్ నగర్లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్నగర్కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్ లేబర్గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.మూడు లక్షల జనాభా...ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేదు. అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. చట్టం ఏం చెబుతోంది?ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.అమ్మాయిలే ఎక్కువ..ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్ నేషన్స్ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీఎస్) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు. ∙రెస్క్యూ, రిహాబిలిటేషన్ వీక్గా ఉందిజవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్ షాప్స్ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్, డొమెస్టిక్ హెల్ప్, సీజనల్ లేబర్కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్స్ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (డబ్ల్యూఎల్సీపీసీ) కూడా యాక్టివ్గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్ చాలా వీక్గా ఉంది. – హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త -
సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేలా తెలంగాణ విద్యాశాఖ అనుమతులిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో గ్రూప్1పై తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా పడింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటీషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్) చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలన్న పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని... నిపుణులతో మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 -
Latte లాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. ఏమిటీ ‘ చిత్రం’
పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళ కళ లాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాల ప్రియుల్ని అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులనూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాల నాటిదేనని ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళలను ఆవిష్కరిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో Latte Coffe చిత్రకారులు కాఫీపొడి, డికాక్షన్ వగైరాలతో పోట్రెయిట్స్, వన్యప్రాణుల చిత్రాలు, ల్యాండ్ స్కేప్లు, ఆబ్స్ట్రాక్ట్స్.. సృష్టిస్తున్నారు. ఆర్గానిక్ కలర్ ఉపయోగించడం కాఫీ ఆర్ట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రీయ లేత, ముదురు బ్రౌన్ కలర్ ఆధారిత షేడ్స్ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకుని బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా, అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి. సోషల్ మీడియా ప్రచారం.. మన దేశంలో ఈ కళ కొంత కాలంగా సోషల్ మీడియా ద్వారా బాగా విస్తరిస్తోంది. యువ కళాకారులు తమ ఇన్స్టా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కాఫీ ఆర్ట్ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో.. కాఫీతో పోట్రెయిట్స్ ఆవిష్కరించడం ద్వారా తమిళనాడుకు చెందిన ధనంజయన్ కాఫీ ఆర్ట్ ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్కు చిరునామాగా మారారు. నేను ఆర్కిటెక్ట్ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళల పాఠాలు మాత్రమే నేర్పించేవారు. కానీ చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాలిని. ఒక ఆర్కిటెక్ట్గా నన్ను నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించి ఇంకో కలర్గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్ బేస్డ్ కావడం, నాకు వాటర్ కలర్ పెయింటింగ్లో ఆసక్తి ఉండడం బెస్ట్ ఛాయిస్ అయ్యింది. పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆశక్తి, ఆ ఉల్లాసం..అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్ కోసం వాటర్ కలర్స్ కూడా కాఫీ పెయింటింగ్స్కి జోడించా. ఇటీవల పెయింటింగ్స్కి కాఫీతో బ్యాక్గ్రౌండ్ వేస్తూ, ఆపై వేరే రంగులతో పెయింట్ చేస్తున్నా. దీని వల్ల వింటేజ్ లుక్ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్ నేపథ్యంలో వేసిన పెయింటింగ్ చూసి హ్యారీ పోటర్ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్స్టా పేజ్లో షేర్ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. – జ్యోత్స్న మైథిలీ రెడ్డి, కాఫీ ఆర్టిస్ట్ నగరంలోనూ సందడి.. నగరంలోని జూబ్లీహిల్స్లో ఉన్న ఆర్ట్ హౌస్ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్న ఆర్ట్ స్టూడియోగా పేరొందింది. అలాగే నల్లగండ్లలోని కవి ఆర్ట్ స్టూడియో, గచి్చ»ౌలిలోని థర్డ్ వేవ్ కేఫ్, జూబ్లీహిల్స్లోని మాక్రో బ్రూ వరల్డ్ కాఫీ బార్, బంజారాహిల్స్లోని లాట్టే ఆర్ట్ కెఫేలో కాఫీ ఆర్ట్ వర్క్షాప్ల నిర్వహించడంతో పాటు కాఫీతో తయారు చేసిన పెయింటింగ్లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీహిల్స్లోని లైజురే ఆర్ట్ కేఫ్ కాన్వాస్, క్రేవింగ్స్, కెఫైన్ కాన్సెప్్టతో అతిథులను ఆకట్టుకుంటోంది. ఫిల్మ్ నగర్లోని బాగ్ బీన్స్ కాఫీ అండ్ ఆర్ట్లో కాఫీ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయంలాట్టే.. కాఫీకప్పు ఆకట్టే.. కాఫీని రంగుగా వినియోగించే ఆర్ట్ ఒకెత్తయితే, కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాట్టే ఆర్ట్గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీన్ని గతంలో కాఫీ షాప్స్లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతోంది. దీంతో కాఫీ ఆర్ట్ అంత కాకపోయినా అడపాదడపా లాట్టే ఆర్ట్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్ గౌడ్, రాధాకృష్ణ వంటివారు ఈ లాట్టే ఆర్ట్కు పేరొందారు. మరింత చేరువగా... దాదాపు నగరంలో పేరున్న కేఫ్స్ అన్నీ చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్ వంటి ఈవెంట్స్ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్ మరింత చేరువ అవుతోంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికవుతోన్న ఈ కాఫీ ఆర్ట్ ప్రపంచస్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించినా ఆశ్చర్యం లేదు. (పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!) -
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం. -
బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో ఉపాసన కొణిదెల (ఫొటోలు)
-
అనుమానంతో భార్యను అంతం చేశాడు
చైతన్యపురి(హైదరాబాద్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తన భార్యను మెడకు చున్నీ బిగించి హతమార్చాడు ఓ వ్యక్తి. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి వివరాలు వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీలో అమ్ములు (30), మరియదాస్లు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరియదాస్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా అమ్ములు ఇండ్లలో సనిచేస్తోంది. బార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి వివాహేతర సంబంధ అనుమానాలు ఉన్నాయి. కొంత కాలంగా ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరుగుతోంది.. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో గొడవ పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మరియదాస్.. అమ్ములు మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఇదే విషయాన్ని మరియదాస్ ఎదురు ఇంట్లో ఉండే మామ అర్జునుడుకి సమాచారం ఇచ్చాడు. దీంతో అర్జునుడు వారి ఇంటికి వెళ్లి చూడగా కూతురు విగతజీవిగా ఉండటం గమనించాడు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఫిలింనగర్(హైదరాబాద్): తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా అని తరచూ స్నేహితురాలికి చెబుతూ బాధపడుతున్న ఓ యువతి అదృశ్యమైంది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో నివసించే చంద్రయ్య, రేఖ దంపతులకు వసంత (19) అనే కూతురు ఉంది. ఏడో తరగతి చదువుకున్న వసంత తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్తుండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో బోర్ కొడుతుందంటూ ఎప్పుడూ స్నేహితురాలితో బాధపడేది. ఈ నేపథ్యంలోనే తాను బయటకు పని మీద వెళ్తున్నానని చెబుతూ తన చిన్నమ్మకు చెప్పి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చంద్రయ్య అన్న కొడుకు విజయ్తో తమకు కొంతకాలంగా గొడవలు ఉన్నాయని, తమ కూతురు అదృశ్యం వెనుక విజయ్ హస్తం ఉండి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8712569163 నెంబర్లో సంప్రదించాలిన పోలీసులు కోరారు. -
సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. హైడ్రాకు మరిన్ని బాధ్యతలు
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముంపు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. వర్షాకాలంలో వరద ముంపు సమస్యలు ఇపుడు హైడ్రా చూస్తుంది.మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్ఎంసీ నుండి హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావడం వల్ల పని ఈజీ అవుతుంది.వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత. వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుంది. వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్ఎంసీ చేస్తుంది. నాలాల రక్షణ, నాలాల్లో పూడిక తీత లేకుండా చూస్తాం. మొత్తం నగరాన్ని మార్చేస్తాం అని చెప్పను కానీ బెటర్ చేస్తాం. ఇప్పటికే విరిగిపోయి చెట్లను గుర్తిస్తున్నాం. ప్రమాదకర మ్యాన్ హోల్స్ను గుర్తిస్తున్నాం. నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తాం.మా దగ్గర 30 టీమ్స్,జీహెచ్ఎంసీ వద్ద దగ్గర 150 టీమ్స్, ట్రాఫిక్ 20 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీములు పని చేస్తున్నాయా లేదా చెక్ చేస్తాం. వరద నీరు సరిగా వెళ్లేలా టీమ్స్ పని చేస్తున్నాయా లేదా అని చూస్తాం.ఎంత వర్షం పడుతుందో దాని మీద పరిస్థితి ఆధారపడి ఉంటుంది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. -
మరోసారి.. కేసీఆర్తో హరీష్ రావు భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లిన ఆయన.. కేసీఆర్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. -
బంగారం కోసమే బాలమ్మ హత్య
మణికొండ(హైదరాబాద్): ఓ వృద్ధురాలి మెడలో, కాళ్లకు ఉన్న బంగారం, వెండిపై కన్నేసిన ఓ మహిళ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి హత్య చేసిన సంఘటనను నార్సింగి పోలీసులు చేధించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రామేశ్వరం బాలమ్మ(75) ఈ నెల 3వ తేదీన ప్రతిరోజు మాదిరిగానే వాకింగ్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవటం, ఆమె కోడలు ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా కోడలు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు..ఆమె అనుమానం వ్యక్తం చేసిన మహిళ అనిత కూడా అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో వెదకడం ప్రారంభించారు. 4వ తేదీనే బాలమ్మ మృతదేహం వికారాబాద్ జిల్లా చెన్గొముల్ పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించింది. అప్పటికే మృతదేహం గుర్తు పట్టరాకుండా ఉండటం, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో వారు స్పాట్లోనే పోస్టుమార్టం నిర్వహించి కండ్లపల్లి అడవిలోనే ఖననం చేశారు. అనిత చిక్కడంతో వెలుగులోకి.. నార్సింగి పోలీసులు విచారణ క్రమంలో అనితను ఈ నెల 7వ తేదీన ఆమె స్వస్థలం వికారాబాద్ జిల్లా పరిగి మండలం, మిట్టకోడూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తమదైన శైలిలో విచారించటంతో బాలమ్మను తానే బంగారం గురించి హత్య చేశానని, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి తస్కరించినట్టు అంగీకరించింది. మృతదేహం కండ్లపల్లి అడవిలో వదిలేశానని తెలిపింది. దాంతో చెన్గొముల్ పోలీసులను సంప్రదించటంతో గుర్తు తెలియని మహిళ శవంగా భావించి పోస్టు మార్టం నిర్వహించి అక్కడే పూడ్చివేశామని తెలిపారు. దాంతో పూడూర్ మండల తహసీల్దార్ అనుమతితో పాతిపెట్టిన బాలమ్మ మృతదేహాన్ని ఈనెల 7వ తేదీన వెలికి తీశారు. ఆమెను బాలమ్మగానే బంధువులు గుర్తించటం, హంతకురాలి వద్ద ఉన్న బంగారం, వెండి స్వా«దీనం కావటంతో అనితను అరెస్టు చేశారు. -
ఫోన్ మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): మొబైల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. ఏఎస్ఐ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ కుమార్తె తేజస్విని(19) గౌతమి కళాశాలో ఇంటర్ పూర్తి చేసింది. కాగా ఈ నెల 8వ తేది రాత్రి 11 గంటల ప్రాంతంలో యువతి ఫోన్లో మాట్లాడుతుండగా తల్లిదండ్రులు మందలించారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ డ్యూటీకి వెళ్లగా..ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటర్నెట్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి రాజేష్కుమార్ మొబైల్కు ఫోన్చేశాడు. అతను వెంటనే కుమార్తెకు ఫోన్ చేశాడు. ఆమె ఎంతకీ లేపకపోవడంతో పక్కింట్లో ఉండే లక్ష్మికి కాల్ చేసి చూడమని చెప్పాడు. దీంతో లక్ష్మి వెళ్లి చూడగా తేజస్విని చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.