Hyderabad
-
Miss World 2025: మిస్ వరల్డ్ చువాంగ్శ్రీ
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్–2025గా థాయ్లాండ్ భామ ఒపల్ సుచాత చువాంగ్శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిష్టినా పిష్కోవా ఆమెకు రూ. 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించింది. ఈ విజయంతో ఆమె దాదాపు రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీతోపాటు లండన్లో ఏడాదిపాటు నివాసం, డిజైనర్ దుస్తులు, నగలు వంటి బహుమతులు, ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్ హోటళ్లలో ఉచిత బస వసతి పొందనుంది. మొదటి రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె అడ్మాస్సు, రెండో రన్నరప్గా పోలాండ్కు చెందిన మజా క్లాజ్డా, మూడో రన్నరప్గా మార్టినిక్కు చెందిన ఆరేలీ జోచిమ్ నిలిచింది. భారత సుందరి నందినీ గుప్తా టాప్–8 జాబితాలో కూడా చోటుదక్కించుకోలేకపోయింది. అందరూ వచ్చి.. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. సాయంత్రం ఐదున్నరకే కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్ కార్పెట్ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్ కుంభర్ అమెరికా–కరేబియన్, ఆసియా–ఓసియానియా, ఆఫ్రికా, యూరప్.. ఇలా నాలుగు భాగాలుగా విభజించి దేశాలవారీగా పోటీదారులను పరిచయం చేశారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో పోటీపడే టాప్–40 మందితో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. గత మూడు వారాలుగా జరిగిన ఐదు చాలెంజ్ల విజేతలైన 16 మందితోపాటు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 24 మందిని వేదికపైకి ఆహ్వానించి మొత్తం 40 మందితో కూడిన బృందాన్ని సిద్ధం చేశారు. దీంతో పోటీ నుంచి వైదొలిగిన మిగతా వారు వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్థానాల్లో ఆసీనులయ్యారు. పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్.. వారి చాతుర్యం.. మాటతీరు ఆధారంగా కేటాయించిన మార్పుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున ఉండే టాప్–20 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున టాప్–8 మందిని (ఆఫ్రికా: నమీబియా, ఇథియోపియా, యూరప్: పోలాండ్, ఉక్రెయిన్, ఆసియా–ఓíÙయానియా: ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, అమెరికా–కరీబియన్: బ్రెజిల్, మార్టినికా) షార్ట్ లిస్ట్ చేశారు. భారత సుందరి నందిని గుప్తా ఈ దశలోకి చేరుకోలేక నిష్క్రమించింది. ‘మీరే ఎందుకు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నారు?’ టాప్–8 మంది సుందరీమణుల్లోంచి టాప్–4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలు కీలక భూమిక పోషించాయి. గతంలో వారు పొందిన మార్కులు.. ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మందిని ప్రజెంటర్ సచిన్ కుంభర్ అడిగిన ‘మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయ్లాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులను ఎంపిక చేశారు. ఉత్కంఠభరితంగా తుది పోరు... నలుగురు మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన తరుణంలో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నత నెలకొంది. న్యాయ నిర్ణేతలైన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే, నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని ఒక్కొక్కరికీ సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోనూసూద్ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయ్లాండ్ సుందరి ఒపల్ సుచాత చువాంగ్శ్రీ మిస్ వరల్డ్–2025గా ఎంపికైంది. సోనూసూద్కు మానవతావాది పురస్కారం కోవిడ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిరుపేద కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా వసతి కల్పించిన సినీనటుడు సోనూసూద్కు మిస్ వరల్డ్ మానవతావాది’ పురస్కారాన్ని మిస్వరల్డ్ సంస్థ ప్రకటించింది. ఆయనకు రానా దగ్గుబాటి బంగారు గ్లోబ్ను అందించారు. -
‘సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అనాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్.. జై తెలంగాణ అనే నినాదాన్నే పలకలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని నినదించాలి అని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రజలపై రేవంత్ అక్కసు ఎందుకని ప్రశ్నించారు కవిత. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ తెలంగాణ నినాదాన్ని ఇప్పటివరకూ పలకలేదన్నారు.గోదావరి జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్.. కాళేశ్వర కమిషనా.. లేక కాంగ్రెస్ కమిషనా అనే అనుమానం ఉందన్నారు.తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి సంస్థ భాగమైందని, 18 ఏళ్ల క్రితమే జాగృతి సంస్థను స్థాపించామన్నారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థను ఏర్పాటు చేశామన్నారు కవిత. కవిత ఏమన్నారంటే..తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. మన కర్మ ఇప్పుడు జై తెలంగాణ అనని సీఎం పరిపాలనలో ఉంది. జూన్2 న అయిన సీఎం జై తెలంగాణ అనాలి. అమర వీరులకు నివాళులు అర్పించాలి..అని డిమాండ్ చేస్తున్న. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు. రాజీవ్ తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలి. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత చారి లాంటి వారి పేరు పెట్టాలి. గోదావరి కావేరీ లింక్ పేరుతో గోదావరి నీరు తెలంగాణ కు దూరం కాబోతున్నాయి. 200 TMC నీళ్ల హక్కు కోసం cm మాట్లాడారు. నీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి..Kcr కు ఎందుకు నోటీసు లు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషనా?, జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జూన్ 4 న మహా ధర్నా చేపడుతున్నాం..కాంగ్రెస్ కాళేశ్వరం పై కుట్రలను ఎండగడుతున్నాం.. బిజెపి బీసీ బిల్లును డీ ఫ్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరుపున మళ్ళీ పోరాటం చేస్తాం. విద్యార్థులు, మహిళల కోసం, మైనార్టీల కోసం ఇచిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. కెసిఆర్కి బీఆర్ఎస్ ఒక కన్న అయితే మరో కన్ను జాగృతి.. బిజెపికి 8 ఎంపీల ఉంటే ఒక్క అంశం గురించి మాట్లాడారు.. బిజెపికి కాంగ్రెస్కి జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం’ అని కవిత హెచ్చరించారు. -
మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత
Miss World 2025 Grand Finale Updates:👉మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరిమిస్ వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాతవిజేత ఓపల్ సుచాతకు బ్లూక్రౌన్ అలంకరించిన క్రిస్టినామిస్ వరల్డ్ 1వ రన్నరప్గా ఇథియోపియా సుందరి అడ్మాస్సుమిస్ వరల్డ్ 2వ రన్నరప్గా పోలాండ్ సుందరి మాజా క్లాజ్డ్మిస్ వరల్డ్ 3వ రన్నరప్గా మార్టినిక్ భామ అరోలి జోచిమ్👉మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ ప్రారంభంజడ్జీలు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్ల సమాధానాలువాటికి మార్కుల ఆధారంగా విజేత👉మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్న సోనూ సూద్కోవిడ్ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించిన మిస్ వరల్డ్ నిర్వాహకులురానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేతస్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహ పరిచిన సోనూ సూద్తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పిన సోనూసూద్👉టాప్-8 లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసిన నిర్వాహకులు👉మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..అమెరికా ఖండం నుంచి మార్టినిక్ఆఫ్రికా నుంచి ఇథియోపియాయూరోప్ నుంచి పోలెండ్ఆసియా నుంచి థాయిలాండ్👉మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తాఆసియా నుంచి టాప్-2లో చేరిన థాయ్లాండ్నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నతో 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశంఅభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు 👉మిస్ వరల్డ్ ఫినాలే నుంచి మిస్ ఇండియా ఎలిమినేట్ఎలిమినేటైన మిస్ ఇండియా నందిని గుప్తాటాప్-8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోఫియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్, థాయ్లాండ్లు 👉ఆసియా నుంచి టాప్ 5లో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తాకు చోటు👉మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధా రెడ్డి నియామకంజ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీచాలా ఆనందంగా ఉందన్న సుధా రెడ్డిఅద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపిన సుధా రెడ్డి👉జడ్జిలుగా..జూలియా మోర్లీ నటుడు సోనూ సూద్సుధా రెడ్డి రానా దగ్గుబాటిజయేష్ రంజన్ మనూషి చిల్లర్ నమ్రత శిరోద్కర్ డోనా వాళ్ష్కరినా టర్రెల్👉అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్కుటుంబ సమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్హాజరైన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్.. ఫినాలే ఈవెంట్ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.బ్యూటీ విత్ ఎ పర్సస్లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్గా నిలిచారు. -
ఆద్యకళను అడ్డుకోవడమా?
‘ఆద్యకళ’ పేరిట ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు గత కొన్నేళ్లుగా వివిధకేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పురావస్తు ప్రదర్శనలు విశేష ఆదరణ పొందు తున్నాయి. జానపద పరిశోధకుడిగా ఆయన దశాబ్దాలుగా సేకరిస్తూ, ప్రద ర్శిస్తున్న వేలాది ఆదివాసీ కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్యాలు, లోహ ప్రతిమలు, సాంస్కృతిక చిహ్నాలు వెలకట్టలేనివి. అయితే వీటిసంరక్షణ తన శక్తికి మించిన పని అవుతోందనీ, వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనీ తిరుమలరావు ఎంతో కాలంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొన్నింటి భద్రత, ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా ఉస్మా నియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న అధ్యాప కుల నివాస స్థలాల్లో రెండు గృహాలను ఈ పురా వస్తు సంరక్షణ, ప్రదర్శన, భద్రత కోసం అధికారికంగా అప్పగించారు. అయితే ఆ నివాసాలు శిథిలావస్థలో ఉన్నందున వాటికి ప్రభుత్వం మరమ్మతు పనులు చేయిస్తుండగా విద్యార్థి సంఘాలకు చెందినవారు ‘ప్రయివేటు వ్యక్తులకు ప్రొఫెసర్ క్వార్టర్లు కేటాయించడం కుదరదు. తక్కువ రెంటుతో లబ్ధి పొందుతున్నారు’ అని అభ్యంతరం చెబుతూ నిర్మాణ సామగ్రిని కూలదోసి, చిందరవందర చేశా’రని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో చాలా కాలం పని చేసినవారే. ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు ఎవరితోనైనా చేతులు కలిపి పని చేసేందుకు తాను సిద్ధమే అనేది ఆయన ప్రతిపాదన. రెండేళ్ల క్రితం పురాతత్త్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై తిరుమల రావు ప్యారిస్ వెళ్లారు. అప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల ప్రతి నిధులు వాటిలో కొన్నింటిని తమ మ్యూజియాలలో భద్రపరుస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశ సంపద అని వారి ప్రతిపాదనను ఆయన ఒప్పుకోలేదు. గత ఏడాది ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలో వీటికి గౌరవం దక్కింది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది! కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ చాలా కాలంగా తిరుమలరావుకు బాసటగా నిలబడి, ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకై ప్రభుత్వాలకు ఎన్నో వినతులను సమ ర్పించారు. చివరకు ప్రదర్శనశాల ఒక కొలిక్కి వస్తున్న దశలో అశని పాతంలా వచ్చి పడిన ఈ విద్యార్థి సంఘాల వారి బెదిరింపు ఖండనార్హం. – బద్రి నర్సన్ -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.ఈ ప్రాంతాల్లో డిమాండ్ కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.ఎక్కడ చూసినా గ్రీనరీనే.. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. -
హైదరాబాద్లో ఇంటి సెంటిమెంట్..
ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్: ది పల్స్ ఆఫ్ హోం బయింగ్’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..ఇల్లు కొనాల్సిందే..సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి. సొంతిల్లు ఎందుకంటే.. సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు. -
చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా శునక రాజా... ఆకట్టుకుంటున్న హైదరాబాద్ కంపెనీ
పెట్స్ పేరుకే పెంపుడు జంతువులు కానీ వాటిని సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లే ఎక్కువ. వాటికి పేర్లు పెట్టి, పుట్టినరోజులు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇంటిలో పెట్స్ను పెంచుకోవడం మామూలే కానీ ఒక ఆఫీసులో స్ట్రెస్ రిలీవర్గా.. చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా ఒక ఉత్తమజాతికి చెందిన శునకాన్ని నియమించింది ఒక స్టార్టప్ కంపెనీ. అది ఎక్కడో కాదు... హైదరాబాద్లోనే. ఆఫీసులో పని ఒత్తిడి సర్వసాధారణం. ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను బయట పడేయడం ఎలా? ఆఫీస్లో రిక్రియేషన్ క్లబ్ పెట్టడం కన్నా ఓ మేలుజాతి శునకాన్ని రిక్రియేషన్ ఆఫీసర్గా నియమిస్తే కాస్త వెరయిటీగా ఉంటుంది కదా అని ఆలోచించింది ఆ స్టార్టప్ కంపెనీ. ఇంకెందుకాలస్యం.... వెంటనే డెన్వర్ అనే ఒక శునకాన్ని కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా నియమించేసింది. ఇంతకూ ఈ డెన్వర్ ఉద్యోగుల ఒత్తిడిని ఎలా తొలగించగలదు? సంతోషాన్ని ఎలా ఇవ్వగలదనే కదా సందేహం? అక్కడికే వద్దాం... ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఉద్యోగులందరి దగ్గరకూ వరసబెట్టి వస్తారు ఈ ఆఫీసర్గారు... అందరినీ ప్రేమగా పలకరిస్తారు. స్నేహపూరితంగా షేక్ హ్యాండ్ (సారీ... ఇక్కడ లెగ్ అనాలి కాబోలు) ఇస్తారు. వీలయితే తనతో ఆడుకోవడానికి రమ్మని బాల్ తెచ్చి ఇస్తారు. ఆడుకున్న వారికి ఆడుకున్నంత సంతోషం. అన్నట్టు గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ కూడా తన స్ట్రెస్ బస్టర్ అయిన పెంపుడు శునకాన్ని తనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తారట. ఒత్తిడిగా అనిపించినప్పుడు దానితో ఆడుకుంటారట. మరో విషయం... డెన్వర్కు లింక్డ్ ఇన్లో ప్రొఫైల్ కూడా ఉంది.. ఫలానా కంపెనీలో చీఫ్ హ్యానీనెస్ ఆఫీసర్గా పని చేస్తున్నట్లుగా.. బాగుంది కదూ...ఇంట్లో పెట్స్ ఉన్నవాళ్లు ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంటారని, ఎక్కువ పని చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దానిని వాకింగ్కి తీసుకెళ్లడం, ఫుడ్ పెట్టడం వంటి వాటివల్ల బీపీ, షుగర్ వంటివి దరిచేరవట. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి పెట్స్తో సహా ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయట! బాగుంది కదూ..చదవండి: కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి? -
ఇవాళే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే
-
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్
జీడిమెట్ల(హైదరాబాద్): పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్కు చెందిన బాలాజీ, మెదక్ జిల్లా, అల్లాదుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్లోని ఓ కాంప్లెక్స్లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్ పెపర్లపై నోట్ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచి్చన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది. ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్ మార్కెట్ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకులను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా 1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుసాక్షి,సిటీబ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో అర్హులైన డాక్టర్లు , అనుమతి పొందిన స్కానింగ్ మిషన్లు మాత్రమే ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలపై డేకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 15 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సికింద్రాబాద్ లోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేసి యాజమాన్యంపై సు నమోదు చేయాలని, సైదాబాద్లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసినందుకు రూ.2లక్షలు జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్ సెంటర్లకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు జిల్లా ప్రోగ్రాం అధికారులు అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల సమాచారంపై టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3366 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, టి నరసింహ, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు. -
నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?
అందం అంటే ఆత్మవిశ్వాసం.. అందం అంటే ఓ సామాజిక బాధ్యత.. అందం అంటే సాధికారత.. అందం అంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్.. అనే అందమైన నిర్వచనాలను స్థిరపరుస్తూ సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ వేదికైంది! ఈ పోటీలు ఫైనల్కి వచ్చాయి. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కనుందో తేలేది నేడే! నూటఎనిమిది దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడుతున్న ఆ బ్యూటీ పాజెంట్ ఫైనల్ ఎలా ఉండబోతోంది, మిస్ వరల్డ్గా ఎంపికైన సుందరి ఏడాదంతా ఏం చేస్తుంది లాంటివి ఆసక్తిని రేకెత్తిస్తాయి.హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సాయంత్రం ఆరున్నరకు మొదలవనున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకను మిస్ వరల్డ్ 2016 స్టెఫనీ డెల్ బాయే ( Stephanie del valle), యాంకర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సచిన్ కుంభార్.. ఇద్దరూ కలిసి హోస్ట్ చేస్తున్నారు.ఎంపిక ఇలా.. ముందుగా 108 దేశాల సుందరీమణులు వేదిక మీదికి వస్తారు. అమెరికా– కరిబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా– ఓషియానియాల నుంచి ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మందిని క్వార్టర్ ఫైనల్కిసెలెక్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే రకరకాల పోటీల్లో ఈ నాలుగు ఖండాల నుంచి పద్దెనిమిది మంది క్వార్టర్ ఫైనల్కి చేరుకున్నారు. మిగిలినవారిని పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసిన జ్యూరీ ఈ రోజు వాళ్ల పేర్లను ప్రకటించి వేదిక మీదికి ఆహ్వానిస్తుంది. ఈ నలభై మందిలోంచి ప్రతి ఖండానికి టాప్ ఫైవ్ చొప్పున, మళ్లీ అందులోంచి ప్రతి ఖండానికి టాప్ 2 లెక్కన సెలెక్ట్ చేస్తారు.ఫైనల్గా.. ఫైనల్రౌండ్ వచ్చేసరికి మొత్తం నలుగురు మాత్రమే మిగులుతారు. ఈ నలుగురిని జ్యూరీ ఓ ప్రశ్న అడుగుతుంది. ఆ జవాబును బట్టి మిస్ వరల్డ్ను ఎంపిక చేస్తారు. విజేతకు కిందటేడు మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని తొడుగుతుంది. జ్యూరీలో నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లండ్ 2014 డాక్టర్ కెరీనా టరెల్, మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే సభ్యులుగా ఉంటారు.గెలిచిన తర్వాత.. మిస్ వరల్డ్ టైటిల్ విజేత తన దేశం తరపున ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక వేడుకలు, సంబరాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పలు చారిటీ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్లో పాల్గొంటుంది. మిస్ వరల్డ్ సంస్థ తరపున ప్రపంచ యాత్ర చేస్తూ ఆ సంస్థ లక్ష్యాలను ప్రచారం చేస్తుంది. అక్షరాస్యత, పలు సామాజిక అంశాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటుంది.ఇంకా... → మిస్ వరల్డ్ విజేతకు తొడిగే అందాల కిరీటం ధర రూ. 85 లక్షల పైచిలుకే! 18 క్యారట్ల గోల్డ్తో చేసిన ఆ కిరీటం మధ్యలో 62. 83 క్యారట్ల డైమండ్ చుట్టూ 1770 చిన్న చిన్న డైమండ్స్ ΄÷దిగి ఉంటాయి. వాటన్నిటి బరువు 175.49 క్యారట్లుంటాయి. దీన్ని ఆ విజేత ముఖ్యమైన ఈవెంట్స్లో మాత్రమే ధరిస్తుంది. ప్రపంచ యాత్రలో అసలైన కిరీటాన్ని పెట్టుకోదు. మిస్ వరల్డ్ విజయానికి చిహ్నంగా విజేతకు రెప్లికా క్రౌన్ను ఇస్తారు. అసలు కిరీటం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ దగ్గరే ఉంటుంది. ఈ పోటీలకు వయోపరిమితి 17 ఏళ్ల నుంచి 27 ఏళ్లు. → టర్మ్ అవకముందే మిస్ వరల్డ్ హోదాకు రాజీనామా చేసిన తొలి మిస్ వరల్డ్ 1974 సంవత్సర విజేత హెలెన్ మోర్గన్. టైటిల్ గెలిచిన నాలుగు రోజులకు ఆమె ఏడాదిన్నర బిడ్డకు తల్లి అని తెలిసిందట. మిస్ వరల్డ్ పోటీల్లో అవివాహితలు మాత్రమే పాల్గొనాలనే నియమాన్ని ఉల్లంఘించినందువల్ల ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. → అమెరికా – వియత్నాం యుద్ధంలో అప్పటి మన ప్రభుత్వం వియత్నాం పక్షాన నిలబడింది. దీనికి విరుద్ధంగా మన తొలి మిస్ట్ వరల్డ్ రీటా ఫారియా అమెరికన్ ఎంటర్టైనర్ బాబ్ హోప్తో కలిసి అమెరికా సైనికులను ఎంటర్టైన్ చేసిందని ఆమె చర్య పట్ల అప్పుడు మన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. → మిస్ వరల్డ్ పోటీలు మొదలైన నాటి (1951) నుంచి ఈరోజు దాకా మన దేశం ఆరుసార్లు కిరీటాన్ని గెలిచి రికార్డ్ సృష్టించింది. → విజేతల్లో ఐశ్వర్యా రాయ్ను మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిస్ వరల్డ్గా చెబుతుంటారు. → ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనలకు నో చెప్పిన తొలి మిస్ వరల్డ్గా డయానా హెడెన్ (మిస్ వరల్డ్ 1997)ను ప్రస్తావిస్తారు. ‘నా ఒంటి రంగు పట్ల నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. ఛాయ తక్కువగా ఉండటాన్ని నేను ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించలేదు. ఆ స్కిన్టోన్తోనే నేను మిస్ వరల్డ్గా గెలిచాను. నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం. కాబట్టి దాన్నే ప్రమోట్ చేస్తాను ఫెయిర్నెస్ క్రీమ్స్ని కాదు’ అని చెప్పింది డయానా. → అందాల పోటీల్లో చమత్కారం, సునిశిత దృష్టి గల జవాబులకు ప్రియాంక చోప్రాపెట్టింది పేరుగా ఖ్యాతినార్జించింది. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలబోతోంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలె (ఫైనల్స్) శనివారం రాత్రి జరగబోతోంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోనున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిష్కోవా (చెక్ రిపబ్లిక్) దాదాపు రూ.6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించనుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు రూ.ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 10 మందికి బెర్తులు ఖరారు తుది పోటీ 40 మంది మధ్య సాగనుంది. ప్రస్తుతం పోటీలోఉన్న 108 దేశాల సుందరీమణులను నాలుగు ఖండాల వారీగా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు చాలెంజ్ల ద్వారా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మందిని షార్ట్ లిస్టు చేస్తారు. సెమీ ఫైనల్స్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. వీరినుంచి విజేతను, మొదటి, రెండు, మూడో రన్నరప్లను ప్రకటిస్తారు. అలరించనున్న బాలీవుడ్ తారలు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు సోనూసూద్కు ఈ సందర్భంగా మానవతావాది పురస్కారాన్ని మిస్ వరల్డ్ సంస్థ అందించనుంది. కోవిడ్ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. సోనూసూద్ కాకుండా, ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. వివిధ చాలెంజ్ల ద్వారా ఎంపికైన వారు వీరే.. స్పోర్ట్స్ చాలెంజ్: విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా టాలెంట్ చాలెంజ్: విజేత మిస్ ఇండోనేసియా మొనికా కెజియా సెంబిరింగ్ హెడ్ టు హెడ్ చాలెంజ్: విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్–టొబాగో, మిస్ జాంబియా ఫైనల్ పోటీలో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బ్వాల్వా, అమెరికా–కరీబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్ నుంచి వేల్స్ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. టాప్ మోడల్ చాలెంజ్: విజేతలు: మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ మారి్టనిక్, మిస్ ఐర్లాండ్ రెండు రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా చాలెంజ్లో ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ఇస్సీ ప్రిన్సెస్, అమెరికా నుంచి డొమినిక్ రిపబ్లిక్ నుంచి మాయ్రా డెల్గాడో, ఏషియా–ఓíÙయానియా నుంచి థాయ్లాండ్ ముద్దుగుమ్మ సుచతా చౌంగ్శ్రీ, యూరప్ నుంచి మోంటెనిగ్రో సుందరి ఆండ్రీ నికోలిక్లు విజయం సాధించారు. మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ చర్యలు: జయేశ్ రంజన్ పోటీల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి పోటీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ న్యాయపరంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. లండన్ కోర్టులో కేసు దాఖలు చేసిందని వెల్లడించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆమెపై చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. 2న రాజ్భవన్కు కొత్త ప్రపంచ సుందరి హైటెక్స్లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జయేశ్ రంజన్ తెలిపారు. శనివారం విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్కే్వర్పై తెలంగాణ సోయగం సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రఖ్యాత టైమ్స్సే్క్వర్పై తెలంగాణ సంస్కృతి తళుక్కున మెరిసింది. ’తెలంగాణ– జరూర్ ఆనా’ అంటూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ –2025 పోటీల వీడియోను టైమ్స్స్క్వేర్పై ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ వీడియో న్యూయార్క్ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. -
హైదరాబాద్లో ఇల్లు కడుతున్నారా.. ఇది తెలుసుకోండి
‘మూడు వందల చదరపు గజాలకుపైగా ఉన్న ప్రతీ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంత తప్పనిసరి. లేనిపక్షంలో ప్రత్యేక కార్యాచరణకు దిగుతాం’ – ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వ్యాఖ్యసాక్షి, హైదరాబాద్: సీవరేజీ ఓవర్ఫ్లో కట్టడి, మోటార్ ఫ్రీ వాటర్ సరఫరా స్పెషల్ డ్రైవ్లతో సత్ఫలితాలు సాధిస్తున్న జలమండలి.. తాజాగా భూగర్భ జలాల పెంపు కోసం 90 రోజుల వర్షాకాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రతి ఇంటా ఇంకుడు గుంత’ నిర్మించుకునే విధంగా స్పెషల్ డ్రైవ్కు సిద్ధమైంది. నలుదిశలా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరం పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా మారుతుండటంతో వర్షం చినుకు భూమిలో ఇంకే పరిస్థితి లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సిటీజనులకు తాగునీరే కాదు.. నిత్యావసరాలకు వినియోగించే నీళ్లకు కూడా కష్టాలు తప్పడం లేదు. దీంతో వాటర్ ట్యాంకర్ల సరఫరా జలమండలికి తలకు మించిన భారంగా పరిణమించింది. పెరుగుతున్న జనావాసాలకు తగ్గట్లు ప్రధాన జలాశయాల నుంచి నీటి కేటాయింపు లేకున్నా.. తరలిస్తున్న నీటినే సర్దుబాటు చేస్తూ వస్తున్న జలమండలి ఇక ప్రతి ఇంటా ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక నుంచి తప్పనిసరి.. మహా నగర పరిధిలో భూగర్భ జలాల పెంపొందించేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది. సుమారు 300 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన సముదాయాలకు ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ డే (World Water Day) సందర్భంగా ఇంకుడు గుంతల సర్వే కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. గృహ సముదాయాల క్యాన్ నంబర్ల ఆధారంగా ఇంకుడు గుంతలపై సర్వే నిర్వహించింది. చదవండి: హైసిటీ పనుల్లో మరో ముందడుగువాల్టా చట్టం ప్రకారం.. 300 చదరపు గజాలు.. అంతకంటే ఎక్కువ విస్తీరణంలోని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపటాల్సిందే. మరోవైపు జలమండలి నల్లా కనెక్షన్ల అనుమతి పత్రంలో సైతం ఇంకుడు గుంతల ఏర్పాటు షరతు ఉంటుంది. భవన నిర్మాణ సమయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నా.. వాటిపై నిర్లక్ష్యం, కాలక్రమేణా వాటిని పునరుద్ధరించకపోవడంతో భూగర్భ జలాల అడుగంటే పరిస్థితి నెలకొనడం అనివార్యంగా తయారైంది. మరికొన్ని గృహ సముదాయాల్లో అసలు ఇంకుడు గుంతల నిర్మాణమే చేపట్టని పరిస్థితి కూడా లేకపోలేదు. కనిపించని ఆసక్తి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పథకంలో భాగంగా ‘ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ అనే పేరుతో అవగాహన కల్పించినా.. నివాస సముదాయాలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చివరకు ఇంకుడు గుంతలు లేని గృహ సముదాయాలకు గడువు విధించి నోటీసులు జారీ చేయగా.. అందులో కొందరే స్పందించగా.. మిగతావారి నుంచి స్పందన లేకుండా పోయింది. నోటీసు అందినా ఇంకుడు గుంతను నిర్మించుకోని భవన యజమానులు ట్యాంకర్ బుకింగ్ చేస్తే రెట్టింపు చార్జీ విధించాలని భావించినా.. వేసవి కాలంలో నీటి అత్యవసరం దృష్ట్యా మానవతా దృక్పథంతో జలమండలి వెనుకడుగు వేసింది. ప్రతి వేసవిలో సుమారు 42 వేలపైగా గృహ సముదాయాల నుంచే అత్యధికంగా ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలో మాత్రం ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణాలపై అవసరమైతే కఠిన నిర్ణయాలు సైతం అమలు చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది.భూగర్భ జలాలను పెంచేందుకే.. భూగర్భ జలాల పెంపు కోసమే ప్రతి ఇంటా ఇంకుడు గుంత తప్పనిసరి చేశాం. 90 రోజుల వర్షాకాల కార్యాచరణలో ప్రత్యేకంగా ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రోత్సహిస్తాం. కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ఇంకుడు గుంతల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చివరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
హైదరాబాద్: దాబాలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. కిలోన్నర హెరాయిన్ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ సమీపంలోని ఓ డాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హెరాయిన్తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశారు. రూ.3 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ను ఎస్వోటీ స్వాధీనం చేసుకుంది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వివరాలను మీడియాకు వెల్లడించారు. కుక్గా పని చేసే వికాస్ సోహు.. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. డాబాకు వచ్చే కస్టమర్లకు మాత్రమే మాత్రమే అమ్ముతున్నారని సీపీ తెలిపారు.నిందితుడు ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని.. అతని కాంటాక్ట్ ఆధారంగా కస్టమర్స్పై దృష్టి పెట్టామని సీపీ వెల్లడించారు. మధ్యప్రదేశ్, హైదరాబాద్కు చెందిన వ్యక్తులతో లింక్స్ ఉన్నాయని.. ఈ కేసులో రూ.89,700 నగదు, రూ. 30 వేల విలువైన మూడు మొబైల్ ఫోన్లు, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ కవర్ ప్యాకెట్ సీజ్ చేశామని సీపీ తెలిపారు. ధూల్పేట్కు చెందిన సలీమ్, మహేశ్వరానికి చెందిన రాజు, మధ్యప్రదేశ్కి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. -
Hyd: ఫ్లై ఓవర్పై వాహనదారుడికి ఫిట్స్.. మంత్రి సీతక్క మానవత్వం
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు తన శైలి ఒకటేనని మరోసారి నిరూపించుకున్నారు మంత్రి సీతక్క. గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రజలు కష్టాలు పడ్డ సమయంలో సీతక్క ఉదారతను చాటుకున్న సంగతి మనకందరికీ సుపరిచితమే. అయితే అప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండి, మంత్రి పదవిలో ఉన్న సీతక్క.. ఓ వాహనదారుడి పట్ల మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద ఓ వాహనదారుడు ఫిట్స్ వచ్చి పడిపోతే, అటువైపుగా వెళ్తున్న సీతక్క దానిని గమనించారు. వెంటనే ఆ వాహనదారుడి వద్దకు వెళ్లి తాళం చెవిని చేతిలో పెట్టారు. అంతేకాకుండా ఆ వాహనదారుడు తేరుకునే దాకా అక్కడే ఉండి అతన్ని పర్యవేక్షించారు. అతను తేరుకున్న తర్వాత ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు సీతక్క. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. రెసిడెన్షియల్ బిల్డింగ్లో పేలిన ఏసీ కంప్రెసర్లు
సాక్షి, హైదరాబాద్: మధురానగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఏసీ కంప్రెసర్లు పేలిపోయాయి. G+5 బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు.నగర వాసులను వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఈ నెలలోనే చార్మినార్ గుల్జార్హౌస్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.అంతకుముందు పాతబస్తీలోలోని మహారాజ్గంజ్లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ(Milla Magee) సంచలన ఆరోపణల వ్యవహారంపై విచారణ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సాక్షితో శుక్రవారం మాట్లాడారు.‘‘మిస్ ఇంగ్లండ్ మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. అయితే ఆమె విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్ వరల్డ్ నిర్వాహకులు లండన్లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్ చర్యలు తీసుకుంటుంది’’ అని జయేష్ రంజన్(Jayesh Ranjan) స్పష్టం చేశారు.వ్యక్తిగత, నైతిక కారణాలను చూపుతూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీల నుంచి నిష్క్రమిస్తూ మిల్లా మ్యాగీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆపై ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తెలంగాణపై గౌరవం పెరిగింది. అక్కడి అతిథ్యం బాగుంది. కానీ, మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలు?’’ అని ఆమె అన్నట్లు సదరు టాబ్లాయిడ్ కథనం ఇచ్చింది.అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆమె పోటీ నుండి వైదొలగాలని అభ్యర్థించారని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు.. గౌరవం, బ్యూటీ విత్ ఏ పర్పస్ విలువలకు కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.అయితే ఈ వ్యవహారంపై తెలంగాణాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
రేపే మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్
-
అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్ చేయమంటావా..
సాక్షి, బంజారాహిల్స్: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడు లంచ్కు తన ఇంటికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనంతరం, ఆమె ఫోటోలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తూ కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో, బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది.వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–7లో నివసించే మహేంద్రవర్ధన్ అనే యువకుడికి ఫేస్బుక్లో ఓ యువతి పరిచయమైంది. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినని మహేంద్ర ఆమెను పరిచయం చేసుకున్నాడు. 2023 ఆగస్టు 15న ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి లంచ్ కోసం వచ్చారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇవ్వడంతో నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మెళకువ వచ్చి చూసుకునేసరికి బాధితురాలు జరిగిన విషయాన్ని గమనించి షాక్కు గురైంది.ఈ విషయంలో మహేంద్రవర్ధన్ కొంతకాలంగా ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె రూ.20 లక్షల వరకు చెల్లించుకుంది. ఫోటోలు బయటపెడతానని, బండారం అందరికీ తెలియజేస్తానని రోజురోజుకు నిందితుడి వేధింపులు పెరిగిపోవడంతో పాటు ఇటీవల రూ. కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ 64(1), 308 (2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Miss world 2025 పెరిగిన ఇమేజ్!
హైదరాబాద్ ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా మారడంతో తెలంగాణ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఏప్రిల్ నెలలో పెట్టు బడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ సమ్మిట్’ను రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాదులో ఘనంగా నిర్వహించింది. దాదాపు వంద దేశాల నుంచి 400మంది పైగా ప్రతి నిధులు హాజరయ్యారు. తెలంగాణను ప్రత్యక్షంగా చూసిన వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ‘మిస్ వరల్డ్’ పోటీలో పాల్గొంటున్నసుందరీమణులు తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలను తెలుసుకునేందుకు ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదంతో నిర్వహించిన ప్రపంచసుందరీమణుల పర్యటన కార్యక్రమం మనరాష్ట్రం ఓ పెద్ద ప్రపంచ పర్యాటక కేంద్రంగా అవతరించేందుకు వీలు కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో సుందరీమణుల ఆట పాటలు, పర్యటన విశేషాల ప్రత్యక్ష ప్రసారం... ఆ యా దేశాల పర్యా టకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడమే కాక స్థానిక ఉత్పత్తులకు మంచి ప్రచారం కలించాయి. స్పెయిన్కు చెందిన కీమో ఫార్మా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరా బాద్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం ఈ సందర్భంగా గమనార్హం. పోటీల సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తుల వాడకం... స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్ను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. చదవండి: Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయం– జి. లక్ష్మణ్ కుమార్ సమాచార–పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ -
స్టడీ అండ్ సర్వీస్ : గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో యువత సేవలు
చదువులు, ఉద్యోగాలు ఆ తర్వాత జీవితపు బాధ్యతలలో తలమునకలవడంతోనే సరిపెట్టుకోకూడదు అనుకుంటుంది నవతరం. సమాజసేవను బాధ్యతగా తీసుకుంటూ చదువు–సేవ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా దాదాపు తొంభై మంది యువ విద్యార్థులు నగరంలోని స్లమ్స్తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తూ ‘మేమున్నాం’ అని బాసటగా నిలుస్తున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నది మహాత్ముని మాట. ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ యువత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సేవాకార్యక్రమాలతో మారుమూలస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ కాలేజీల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు తమ సేవలను అందిస్తున్నారు. ‘యువతలో సాధికారత, సామాజిక మార్పు’ అనే నినాదంతో వీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇరువైపులా అవగాహనఇప్పుడు మేం చేస్తున్నది రెవల్యూషనరీ సీజన్. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సోలార్ పవర్, శుభ్రత పట్ల అవగాహన, మంచినీటి సౌకర్యం, ఆహార వ్యర్ధాన్ని నిరోధించడం, వాటర్ వీల్ డిస్ట్రిబ్యూషన్... మొదలైన వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఇందులో దాదాపు 90 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాం. నగరంలోని స్లమ్స్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని సమస్యలను గుర్తించడం, పరిష్కార దిశగా చేసిన ఆలోచలను మూడు నెలలకు ఒకసారి అందరం కలిసి, చర్చిస్తాం. ఎక్కడ ముందస్తు సేవ అవసరం అవుతుందో దానిని ప్రధానంగా తీసుకుంటాం. వీటి ద్వారా చదువొక్కటే కాకుండా సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కూడా కలుగుతుంది. బాధ్యత పెరుగుతుంది. – లాస్య వంకదారి,ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్ పర్సన్ప్రాజెక్ట్ రిపోర్ట్తో: ప్రతి సీజన్లో ఎనిమిది ప్రధాన సమస్యలపై వర్క్ చేస్తుంటాం. ముందుగా అందరం కలిసి, చర్చించుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మెంబర్స్ అందరం అమ్మానాన్నలు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఫండ్ సేకరిస్తాం. ఆ మొత్తాన్ని యూత్ అసెంబ్లీ ద్వారా ఒక మంచి పనికోసం కేటాయించి, సేవలో పాల్గొనడం సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్కి సంబంధించి ఈవెంట్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న తాండాల వారికి, గర్భవతులకు, పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేలా ప్లాలాన్ చేస్తున్నాం. నవజాత శిశువులకు అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తున్నాం. కిందటిసారి ములుగులో చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. – విజయ్, బిటెక్ ఫస్టియర్, కరియర్ గైడెన్స్లో అవగాహన: హైదరాబాద్స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు వర్క్ చేశాను. ఇప్పుడు యూత్ అసెంబ్లీ నుంచి సేవలు అందిస్తున్నాను. పట్టణాల్లో ఉన్న నిరుపేదల జీవనశైలిని మార్చే ప్రయత్నం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, స్కూల్స్కు వెళ్లి కెరియర్ గైడెన్స్ వంటివి చేస్తున్నాం. సిద్దిపేటలోని కిష్టాపూర్, ములుగు ప్రాంతంలోని తక్కెళ్లగూడెంలో సోలార్ ΄్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, డిజిటల్ అవేర్నెస్... వంటివి చేశాం. – చంద్రశేఖర్, బీటెక్ థర్డ్ ఇయర్, ఇంబ్రహీంపట్నం -
బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్న వన్యప్రాణుల చిత్రాలు..!
వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం బేగంపేట ప్రకాశ్నగర్ ఫ్లైఓవర్ పిల్లర్స్ను వన్యప్రాణుల చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను వన్య ప్రాణుల బొమ్మలు కట్టిపడేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిరుతలు, పులులు, ఏనుగులు, ఎగులుబంట్లు, జాతీయ పక్షి నెమళ్లు, జింకలు, సింహాలు.. ఇలా రకరకాల వన్యప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను అటుగా వెళ్లే ప్రయాణికులకు గుర్తుచేస్తున్నాయి. భారత జులాజికల్ సర్వే(జెడ్ఎస్ఐ) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి వన్య ప్రాణులను సంరక్షించుకోవడం ద్వారా అటవీ సంపదను కాపాడిన వారమవుతామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పర్యావరణ వేత్తలు నిత్యం పలు రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా బేగంపేట ప్రకాష్నగర్(ఎయిర్పోర్ట్ ఎదురుగా) ఫ్లైఓవర్ పిల్లర్స్కు వేసిన చిత్రాలను చూస్తే అద్భుతమనిపిస్తోంది. సందేశాత్మక థీమ్తో అబ్బురపడేలా వేసిన చిత్రాలు ఒక దానికి మించి మరొకటి ఉంది. (చదవండి: డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..) -
కొబ్బరి చిప్పలతో వాటర్ బాటిల్స్..!
వ్యర్థానికి కూడా అర్థాలు చెప్పవచ్చంటూ ఓ విద్యార్థి తనదైన శైలిలో కొబ్బరి చిప్పలతో ‘కోకోనట్ షెల్ వాటర్ బాటిల్’ తయారు చేసి తన సత్తాను చాటారు. ఏదైనా వినూత్నంగా వెదురుబొంగు, కొబ్బరి, బనానా ఫైబర్, తాటాకుల సహాయంతో నూతనంగా ప్రజావసరానికి అనుగుణంగా వినియోగించే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోకోనట్ షెల్తో ఈ వాటర్ బాటిల్ రూపొందించినట్లు విద్యార్థి స్పష్టం చేశారు. రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ (ఎఫ్డీడీఐ–హైదరాబాద్) బి.డెస్ (లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీస్ డిజైన్)ఎల్ఎల్పీడీ విభాగం కోర్సులో మూడో ఏడాది చదివే మత్తగుంజ అనిరుద్ ప్యాకేజ్ డిజైన్ రూపకల్పనలో భాగంగా ఈ వాటర్ బాటిల్ను తయారు చేయడం విశేషం. (చదవండి: ఫ్యాషన్కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..) -
GHMC: హైసిటీ పనుల్లో మరో ముందడుగు
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కింద ఇప్పటికే దాదాపు రూ.1740 కోట్ల మేర ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, రహదారుల అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ.. తాజాగా రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్పాస్ పనుల కోసం టెండర్లు పిలిచింది. ఒకే ప్యాకేజీగా ఈ మూడు పనులకు టెండర్లు ఆహ్వానించింది. అంచనా వ్యయం రూ.368 కోట్లు. జూన్ 18న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. దీంతో హైసిటీ పనుల్లో మరో అడుగుపడినట్టయింది. బంజారాహిల్స్ ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద జీవీకే వైపు రెండు లేన్లతో ఫ్లై ఓవర్, టీవీ 9 జంక్షన్ వద్ద రెండు లేన్ల అండర్పాస్, మూడు లేన్లతో ఫ్లై ఓవర్ పనులకు ఈ టెండర్లు ఆహ్వానించింది. ఎంపికయ్యే ఏజెన్సీయే సర్వే, డిజైన్తో సహ మొత్తం పనులు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే చేయాల్సి ఉంటుంది. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్వద్ద నిర్మించే ఫ్లై ఓవర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వైపు నుంచి జీవీకే మాల్వైపు వెళ్తుంది. 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లై ఓవర్ క్యారేజ్వే 7.5 మీటర్లు ఉండేలా నిర్మించాల్సిందిగా టెండరు నోటిఫికేషన్లో పేర్కొంది.టీవీ9 జంక్షన్ వద్ద రెండు లేన్లతో ఒక అండర్పాస్ నిర్మిమస్తారు. ఇది ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీవైపు వెళ్లే వారికి ఉపకరిస్తుంది. పది మీటర్ల వెడల్పుతో నిర్మించే దీంట్లో క్యారేజ్వే 7.5 మీటర్లుగా ఉండనుంది. ఫుట్పాత్లతోపాటు రెండు లక్షల నీటి సామర్ధ్యంతో భూగర్భ సంప్ కూడా ఉంటుంది. టీవీ9 జంక్షన్ వద్దే బంజారాహిల్స్ ముగ్ధ జంక్షన్నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు మూడులేన్లతో మరో ఫ్లై ఓవర్ను కూడా నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్ వెడల్పు 12 మీటర్లు కాగా, క్యారేజ్వే 11 మీటర్లు. ఈ ప్యాకేజీలోని మూడు పనుల్లోనూ ప్రయాణ మార్గం ఒకేవైపు ఉంటుంది. రీ టెండర్.. విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీ తాజాగా రెండో సారి టెండర్లు పిలిచింది. ఈ పని అంచనా వ్యయం రూ. 150 కోట్లు. జూన్ 11 ఈ టెండర్ల దాఖలుకు చివరితేదీగా పేర్కొన్నారు. రూ. 5,942 కోట్ల పనులకు అనుమతులు.. రాష్ట్ర ప్రభుత్వం హై సిటీ కింద వివిధ ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, రహదారుల అభివృద్ధి, తదితర పనుల కోసం రూ. 5,942 కోట్ల పనులకు గత డిసెంబర్లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఐదు ప్యాకేజీల్లో 32 పనుల్ని 23 ప్రాజెక్టుల కింద టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీకి అనుమతినిచ్చింది. రద్దీ ఎక్కువ ఉండే ఈ ప్రాంతాల్లో పనులు త్వరితంగా పూర్తయ్యేందుకు స్టీల్ ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.గతంలో టెండర్లు పిలిచినవి.. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్ రోడ్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్. ఐఎస్బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్. డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ రోడ్ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో ఫ్లై ఓవర్. గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరులేన్లతో అండర్పాస్.ఖాజాగూడ జంక్షన్ వద్ద.. నానక్రామ్గూడ – టోలిచౌకి రోడ్ వరకు ఫ్లై ఓవర్. టోలిచౌకి రోడ్– బయోడైవర్సిటీ వరకు అండర్పాస్. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్వద్ద ఒక అండర్పాస్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్. యూసుఫ్గూడ రోడ్ నుంచి రోడ్నెంబర్ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్ వద్ద జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ వరకు అండర్పాస్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. ముగ్ధ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రెన్స్ రోడ్ నుంచి పంజగుట్ట రోడ్ వరకు అండర్పాస్. చదవండి: హైదరాబాదీలకు అందుబాటులో మరో ఫ్లై ఓవర్రోడ్ నెంబర్–45 జంక్షన్ వద్ద ఫిల్మ్నగర్ రోడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు అండర్పాస్. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ నుంచి రోడ్నెంబర్ 45 వరకు ఫ్లై ఓవర్. ఫిల్మ్నగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్నెంబర్ 45 జంక్షన్ వరకు అండర్పాస్. ఫిల్మ్నగర్ రోడ్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి ఫిల్మ్నగర్ రోడ్ వరకు అండర్పాస్. ఫిల్మ్నగర్ రోడ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు ఫ్లై ఓవర్. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు అండర్పాస్. మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వరకు ఫ్లై ఓవర్. -
హైదరాబాద్లో జియోస్టార్ రోడ్షో
హైదరాబాద్: తెలుగు ఆడియెన్స్కు, దక్షిణాదిలో ప్రకటనకర్తలకు మరింత చేరువయ్యే క్రమంలో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించినట్లు జియోస్టార్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ప్రతి నెలా ప్రాంతీయంగా 90 శాతం మంది తమ స్టార్ మా, స్టార్ మా మూవీస్ తదితర చానల్స్లో కంటెంట్ను వీక్షిస్తున్నట్లు వివరించింది.దీంతో పెద్ద ఎత్తున వీక్షకులకు చేరువ కావడానికి ప్రకటనకర్తలకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొంది. నటులు ఆమని, శ్రీముఖి, అవినాష్, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24,000 గంటల తెలుగు ఎంటర్టైన్మెంట్, 1,800 పైగా టైటిల్స్తో జియోహాట్స్టార్ వద్ద అత్యధిక స్థాయిలో కంటెంట్ ఉన్నట్లు జియోస్టార్ రెవెన్యూ హెడ్ అజిత్ వర్గీస్ తెలిపారు. -
Heat : మహిళల్లో పెరుగుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI)
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో.. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (urinary tract infection) (యూటీఐ) పెరుగుతున్నాయి. బయట విపరీతమైన వేడి, డీహైడ్రేషన్, జీవనశైలి అలవాట్ల నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు సంభవిస్తున్నవారు ఆరోగ్యాన్ని ఆయా సీజన్లలో జాగ్రత్తగా చూసుకోవాలని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు చెందిన మహిళా యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు.“ఈ సీజన్లో ప్రతి 10 మంది మహిళల్లో ముగ్గురికి యూటీఐ బారిన పడుతున్నారు. ఇదే సంవత్సరం మిగిలిన సీజన్లతో పోలిస్తే ఇది ఎక్కువగానే ఉంది” అని డాక్టర్ సారిక చెప్పారు.వేసవితో సంబంధమేంటిశారీరకంగా చూసినప్పుడు మహిళలకు మూత్రనాళం చిన్నగా ఉండడంతో వారికి యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వేసవిలో ముప్పు కారకాలు మరింత అధికంగా ఉంటాయి. “డీహైడ్రేషన్ ప్రధాన కారణం. మహిళలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి, అదే సమయంలో తగినంత నీళ్లు తాగరు. దానివల్ల మూత్రం బాగా చిక్కగా అవుతుంది. ఇది ఒకరకమైన తేమ వాతావరణాన్ని సృష్టించి, బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుంది. ఈతకొలనులో ఎక్కువసేపు తడి దుస్తులతో ఉండడం, బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, ప్రయాణాలు లేదా బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి” అని డాక్టర్ పాండ్యా వివరించారు.గమనించాల్సిన లక్షణాలు“యూటీఐ లక్షణాలలో ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో మంటపుట్టడం, తరచు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం దుర్వాసన రావడం, పొత్తికడుపులో అసౌకర్యం, నీరసం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాలు ఏమైనా ఒక రోజుకంటే ఎక్కువ ఉంటే సొంత మందులు వాడకుండా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ముందస్తు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తపడాలి” అని ఆమె చెప్పారు.వేసవిలో జీవనశైలి సమస్యలువేసవికాలంలో కొన్నిరకాల ప్రవర్తనల వల్ల యూటీఐ ముప్పు పెరుగుతందని డాక్టర్ సారికా పాండ్యా అన్నారు. “ప్రధానంగా.. ఈతదుస్తుల్లో ఎక్కువసేపు ఉండిపోతే బ్యాక్టీరియా పెరుగుతంది. బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ముఖ్యంగా లోపలి భాగాల్లోవేడి, చెమట ఎక్కువవుతాయి. మహిళలు బయట ఉండే మరుగుదొడ్లు ఉపయోగించరు. మూత్రాన్నిఎక్కువసేపు ఆపుకోవడం ప్రమాదకరమైన అలవాటు. కాటన్ లోదుస్తులు ధరించడం, తరచు మూత్రానికి వెళ్లడం, ముఖ్యంగా లైంగిక చర్య తర్వాత, అలాగే ఎక్కువసేపు బయట ఉన్న తర్వాత వెళ్లడం అవసరం” అని వివరించారు.నీళ్లు తాగడం, పరిశుభ్రత, ఆహారంయూటీఐని నివారించడానికి సులభమైన మార్గం.. నీళ్లు తాగడమేనని డాక్టర్ పాండ్యా చెప్పారు. “తాగగలిగినన్ని ద్రవాలు తాగండి. దానివల్ల మూత్రం రంగు సాధారణంగా ఉంటుంది. తీపి పానీయాలు, కెఫిన్ వాడకూడదు. అవి తాగితే బాగున్నట్లు అనిపిస్తుంది గానీ, బ్లాడర్ను అవి ఇరిటేట్ చేస్తాయి. ఆహారంలో కూడా యూటీఐని నియంత్రించేవి తీసుకోవాలి. క్రాన్బెర్రీ జ్యూస్ లేదా టాబ్లెట్ల వల్ల బ్లాడర్ గోడలకు బ్యాక్టీరియా అతుక్కోకుండా ఉంటుంది. అవి రాకుండా ఆపుతాయి. ఒకసారి లక్షణాలు మొదలయ్యాక వాటిమీద ఆధారపడకూడదు” అన్నారు. చికిత్స, దీర్ఘకాల నిర్వహణతరచు ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలకు తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు వెజైనల్ ఈస్ట్రోజన్ ఇస్తామని, అలాగే.. తగిన సమయానికి మూత్రవిసర్జన చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ సారిక తెలిపారు. కొందరికి లైంగిక చర్య తర్వాత యాంటీబయాటిక్స్ వేసుకోవడం, లేదా సొంత మందులతో కొంత ఉపశమనం ఉండచ్చు. కానీ వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. యాంటీబయాటిక్స్తో తగ్గించడం కంటే దీర్ఘకాలం పాటు రాకుండా చూసుకోవడం, శరీర లక్షణాలు గమనించడం ముఖ్యం” అని ఆమె సూచించారు.అవగాహన ముఖ్యంయూటీఐల విషయంలో చాలామందిక అవగాహన ఉండట్లేదని, పైగా అపోహలు ఉంటున్నాయని డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు. “హైదరాబాద్లో చాలామంది మహిళలు లైంగికచర్య వల్లే యూటీఐ వస్తుందనుకుంటున్నారు. ఇంటి చిట్కాలతో దాన్ని కడిగేయొచ్చని కూడా భావిస్తున్నారు. మరికొందరు దానిగురించి బయటకు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు, క్లినిక్ల లాంటిచోట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం. మనం పోషకాహారం గురించి, రుతుక్రమ శుభ్రత గురించి మాట్లాడినట్లే యూరినరీ ఆరోగ్యం గురించి చర్చను కూడా సాధారణం చేయాలి” అని చెప్పారు. -
SHE Teams: మేముంటాం అండగా!ధైర్యంగా ముందుకు రండి..
బంజారాహిల్స్: మహిళలు, చిన్నారుల కోసం బీఎన్ఎస్లో ఓ బలమైన చట్టాలను ఏర్పాటు చేశారని వాటి పట్ల మహిళలకు అవగాహన ఉండాలని షీ టీమ్స్, భరోసా ఏసీపీ ప్రసన్న లక్ష్మి అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్డు నం. 12లోని సీఎంటీసీ భవన్లో జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలోని మహిళా సమాఖ్యలకు షీటీమ్స్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసరావు, భరోసా సెంటర్ అడ్మిన్ మేరీతో కలిసి మహిళలు, చిన్నారుల చట్టాలతో పాటు పాష్ యాక్ట్, పోక్సో యాక్ట్, వరకట్న వేధింపు చట్టం, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. ఎన్నోసార్లు ఏదైనా ఘటన జరిగినప్పుడు అది ఎవరికి చెప్పాలి.., ఎలా చెప్పాలి, అసలు అది తప్పా కాదా అనే మహిళలకు అవగాహన ఉండటం లేదని వారు అన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ లావణ్య సూచనల మేరకు అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో మహిళా సమాఖ్యలు, అనుబంధంగా పని చేసే రిసోర్స్ పర్సన్లకు ఈ చట్టాల పట్ల అవగాహన ఉండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు సరైన మార్గంలో వెళ్తారని వారు సూచించారు. నగరవ్యాప్తంగా 13 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, షీ టీమ్స్ ఉన్నాయని ప్రత్యేకంగా భరోసా సెంటర్ కూడా ఉందని వారు తెలిపారు. భరోసాతో కౌన్సెలింగ్ ... ఏదేని క్రైం వల్ల బాధితులయ్యే మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని అన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారికి ఒక్కోసారి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా భరోసా అండగా ఉంటుందని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే పోష్ యాక్ట్ ప్రకారం వారు శిక్షార్హులు అవుతారని ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని అలాగని వాటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో తిరిగే మహిళా సమాఖ్యల ప్రతినిధులు బాల్య వివాహాలు ఎక్కడ, ఎవరు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి సరైన విద్యతో పాటు కౌన్సెలింగ్ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. చిన్నారులను వేధిస్తే... 1090 షీటీమ్ 9490616555, 040–27852355 మహిళలందరికీ అవగాహన కలిస్తాం చాలా మంది మహిళలకు చట్టాలపై అవగాహన లేదు. చట్టాలపై అవగాహన అనేది ఎంతో అవసరం. ఏ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి.. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అనే విషయాలను మహిళలకు వివరిస్తున్నాం. త్వరలోనే నగర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. – ప్రసన్న లక్ష్మి, షీటీమ్స్, భరోసా ఏసీపీ క్షేత్ర స్థాయిలో వివరిస్తాం : పోలీసు అధికారులు చెప్పిన ఎన్నో చట్టాలను మహిళా సమాఖ్యల ప్రతినిధులు తెలుసుకున్నారు. వీటిపై మేం కూడా క్షేత్ర స్థాయిలో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తాం. మా సర్కిల్ పరిధిలో మహిళా సమాఖ్యలతో అనుసంధానమైన 8 వేల మందికిపైగా మహిళలు ఉన్నారు. వారందరికీ చట్టాలపై అవగాహన కల్పిస్తాం. – ఆషా విరానిక, డీపీవో, సర్కిల్ –18 బస్తీల్లోనూ అవగాహనకల్పిస్తాం.: చట్టాలపై అధికారులు పెట్టిన ఈ సమావేశంతో ఎన్నో విసయాలు తెలుసుకోగలిగాం. బస్తీల్లో చాలా మంది మహిళలు జరిగిన విషయాలను మా వద్దకు వచ్చి చెప్తుంటారు. ఈ చట్టాలను వినియోగించి వారికి న్యాయం జరిగేందుకు సహకరిస్తాం. - పద్మ, మహిళా సమాఖ్య ప్రతినిధి -
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్లో దారుణం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశి్నంచింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. View this post on Instagram A post shared by Meenal Meenu (@itsmemeenal_) -
Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..!
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న దేశం అనే రికార్డ్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ టైటిల్స్ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్ గెలుచుకుని నెంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్ – రెండూ చెరో 3 టైటిల్స్ గెలుచుకున్నాయి.నగరంపై నజర్ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్ను నందిని గెలిస్తే అది భారత్ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?) -
అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)
-
ఫుల్స్టాప్ ఉండకూడదు
72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్కు హాజరైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ చారిటీ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.కిందటేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా బ్యూటీ విత్ ఎ పర్పస్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటించింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ స్థాపించి దానిద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు దూరం కాకూడదన్న సంకల్పంతో టాంజానియాలో స్కూల్ను ప్రారంభించింది. సోంటా ఫౌండేషన్ ద్వారా చెక్ రిపబ్లిక్లోని వికలాంగులకు మద్దతు ఇస్తుంది. చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో పుట్టింది క్రిస్టినా. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్లో స్థిరపడింది. న్యాయశాస్త్రంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్పై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, పోలిష్, స్లోవాక్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. లండన్లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్లో చేరి, అందాల పోటీలో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంది. మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని, తొలిప్రయత్నంలోనే కిరీటం దక్కించుకుంది.సాధించగలం అనే నమ్మకంమ్యూజిక్, ఫ్యాషన్, ఆర్ట్ అంటే ఇష్టపడే క్రిస్టినా తన సక్సెస్ గురించి వివరిస్తూ –‘‘జీవితంలో పుల్స్టాప్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కామాలే ఉంచాలి. నేను మ్యూజిక్ నేర్చుకున్నా, ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్నా, మోడలింగ్ చేసినా... ఏ లక్ష్యం కోసం పనిచేసినా దానికి సంబంధించి సమస్యలు, ఒత్తిళ్లు వస్తూనే ఉండేవి. ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొన్నాను. నేను ఈ స్టేజీకి రావడం వెనకాల పెద్ద పోరాటమే చేశాను. కానీ, కలలను సాధించే క్రమంలో చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత పొందిన ఫలితాలతో చాలా ఆనందాన్ని పొందాను. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏడాది పొడవునా శ్రమిస్తూనే ఉండాలి. ఏ లక్ష్యం కోసం పాటుపడుతున్నామో దానిని వదిలిపెట్టకూడదు. ఇతర భాషౖలపెనా పట్టు సాధించాలి.మంచి మార్పుకు ఉదాహరణగా! అందాల పోటీ అత్యుత్తమమైనది. ప్రపంచవ్యాప్తం గా అవసరంలో ఉన్న పిల్లలకు ఆశను, ఆనందాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది ఎంత ఛాలెంజింగో అంత పెద్ద బాధ్యత కూడా. మంచి మార్పుకు ఉదాహరణగా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, ముఖ్యమైన అంశాలపై అవగాహన తీసుకువచ్చేలా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి.మరచిపోలేని అద్భుతంతెలంగాణలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు ఉత్సాహభరితమైన సంస్కృతి ఎంతో ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్కిటెక్చర్, రాజరికపు వారసత్వానికి ఆభరణంగా నిలిచిన చౌమహల్లా ΄్యాలెస్, తెలంగాణ వంటకాలు, ఇక్కడి సంప్రదాయం.. ఇదంతా ఒక అద్భుత ప్రయాణంగా మారిపోయింది. విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడం, వారి కథలు వినడంతో వారితో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నాం’’ అని తెలిపారు క్రిస్టినా. – నిర్మలారెడ్డి ఫొటోల: ఎస్. ఎస్. ఠాకూర్ -
వేడుకగా బ్యూటీ విత్ చారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి అంటే అత్యంత అందమైన అమ్మాయనే కాదు.. అంతకు మించిన మానవీయ విలువలున్న హృదయం, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అని మిస్ వరల్డ్ వేదిక నినదిస్తోంది. బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్ వేదికగా నిర్వహించిన ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’చారిటీ ఈవెంట్ అలాంటి వ్యక్తిత్వాలను, మనస్సులను ప్రతిబింబించింది. మిస్ వరల్డ్ పోటీదారులతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా.. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ సంస్థల సహకారంతో ప్రభుత్వ బాలసదన్లకు చెందిన 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో చిన్నారికి పాఠ్య పుస్తకాలు, పోషకాహారం, ప్రోటీన్ పౌడర్, సప్లిమెంట్లు, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్వెటర్లు, రెయిన్ కోట్లు, డ్రెస్సులు, స్కూల్ కిట్లు (స్కూల్ బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్లు), టాయిలెట్రీలు, డిజిటల్ వాచ్లు, విద్యా సంబంధిత ఆట బొమ్మలు, వ్యక్తిగత వస్తువుల కోసం ట్రాలీ బ్యాగ్లతో కూడిన ఒక్కొక్కటి దాదాపు రూ.25 వేల విలువైన 200 కిట్లను చిన్నారులకు అందించి సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ఐసీడీఎస్ బాలసదన్ల చిన్నారులకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కిట్లు అందించడంతో పాటు ఆ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ పసి హృదయాల సంతోషాన్ని, బాధను పంచుకున్నారు. కష్టాలను అధిగమించి తమలాగే ప్రపంచ వేదికలపై ప్రత్యేకతను చాటుకునేలా ఎదగాలంటే చదువొక్కటే మార్గమని, ఆ దారిలో విశ్వాన్ని చదివేయొచ్చనే సందేశాన్ని తెలియజేశారు.పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు ‘థింక్ బిగ్, థింక్ డిఫరెంట్.. అచీవ్ గోల్స్’అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. కాగా 200 మంది విద్యార్థులకు కిట్లతో పాటు ఏడాది పాటు అన్ని విధాలా సహకరించేందుకువ వీలుగా రూ.2 కోట్ల చెక్కును మిస్ వరల్డ్ క్రిస్టీనా చేతుల మీదుగా దాతలు అందజేశారు. విక్టోరియా మెమోరియల్ పాఠశాల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కూడా దాతలు ముందుకు వచ్చారు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీఎస్ బాలసదన్లలోని అనాథ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కలిసే అవకాశం చిన్నారులకు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’పేరిట ఈ చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లో చాలవరకు సామాజిక సేవలో ఉన్నవారు కాబట్టి ఈ పసి హృదయాలతో ఆత్మీయంగా ముచ్చటించారు. లైవ్ బ్యాండ్ అందించింన సంగీతానికి, తెలుగు పాటలకు వారు చిన్నారులతో కలిసి నృత్యం చేయడం హైలెట్గా నిలిచింది. కొందరైతే చిన్నారుల దగ్గర స్టెప్స్ నేర్చుకుని మరీ నర్తించారు. నేటి చారిటీ కార్యక్రమం బ్యూటీ విత్ పర్పస్ సారాన్ని ప్రతిబింబించింది. మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో మమేకమైన తీరు వారి సేవా నిబద్ధతను చాటింది. ఈ పోటీల్లో భాగంగా ఇంతటి ప్రభావవంతమైన సేవా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. – జూలియా మోర్లే, మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈఓ.మిస్ వరల్డ్ సంస్థతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. రూ.2 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నాం. దశల వారీగా ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. – డాక్టర్ రామకృష్ణ, ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ చైర్మన్ -
‘మిస్ వరల్డ్’ మళ్లీ భారత్లోనే..?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను వరసగా మూడోసారి భారత్లోనే అందునా మళ్లీ హైదరాబాద్లోనే నిర్వహించాలన్న దిశలో మిస్వరల్డ్ సంస్థ యోచిస్తోంది. గతేడాది జరిగిన 71వ ఎడిషన్కు ముంబై వేదిక కాగా, ఈ ఏడాది 72వ ఎడిషన్ హైదరాబాద్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు భారత్ అనువుగా ఉందనే ఉద్దేశంతో 73వ ఎడిషన్కు కూడా భారత్నే ఎంచుకోవాలని మిస్ట్ వరల్డ్ సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభిస్తోంది. మరోసారి హైదరాబాద్లో నిర్వహించే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనుందని సమాచారం. అదే సమయంలో హైదరాబాద్ సహా దేశంలోని పది నగరాలను పరిశీలించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు తన మనసులోని మాటను మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్ జూలియా మోర్లే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న 72వ ఎడిషన్ కోసం దేశంలోని మరో పది రాష్ట్రాలు పోటీలో నిలిచా యి. ఇప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు తదుపరి ఎడిషన్ నిర్వహణ కోసం అడుగుతున్నాయని మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని ఇతర దేశాలు కూడా రేసులో చేస్తున్నప్పటికీ, మరోసారి భారత్లోనే నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయంతో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. భారత్లోనే ఎందుకు..? » యూరప్, అమెరికా దేశాలు, చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం భారత్లో చాలా తక్కువ. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయం రూ.57 కోట్లుగా అంచనా వేసినట్టు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇందులో మిస్ వరల్డ్ భరించే మొత్తం రూ.28.5 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా సగం మాత్రమే. మిగతా దాదాపు సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇలా భారత్లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మొత్తాన్ని భరిస్తున్నాయి. చాలా విదేశాల్లో ఈ వెసులుబాటు లేదు. మొత్తం ఖర్చు మిస్ వరల్డ్ సంస్థనే భరించాల్సి వస్తోంది. ఇక యూకే సహా యూరప్ అమెరికాల్లో ఈ వ్యయం మూడు నాలుగు రెట్లు ఎక్కువ. » స్పాన్సర్షిప్ రూపంలో మిస్ వరల్డ్ సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కలను ఆ సంస్థ పూర్తి గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, ఆ మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం ఉంది. స్థానికంగా చారిటీ కార్యక్రమాలు, కొన్ని వితరణలు మినహా మిగతా మొత్తం ఆ సంస్థనే తీసుకుంటుంది. కానీ కొన్ని దేశాల్లో అయితే, స్థానిక ప్రభుత్వాలకు ఇందులో వాటా ఇవ్వాల్సి వస్తోంది. భారత్లో ఈ సమస్య లేకపోవటంతో ఆ సంస్థకు బాగా కలిసి వస్తోంది. » గత ఎడిషన్ పోటీలప్పుడు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాయి. ఆ పోటీల నిర్వహణకు గౌరవంగా భావించాయి. పోటీదారులు పర్యటించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో చేపట్టాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అవి మిస్ వరల్డ్ పోటీలను వ్యాపార కార్యక్రమంగానే పరిగణిస్తున్నాయి. ఈ పోటీల రూపంలో అయ్యే ఖర్చును మిస్ వరల్డ్ సంస్థే భరించాల్సిన పరిస్థితి ఉంది. » యూరప్, అమెరికా, యూకేలాంటి చోట్ల పర్యాటక రంగం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఆ దేశాలు ఈ పోటీల కోసం పెద్దగా పాకులాడటం లేదు. కానీ భారత్.. ఈ పోటీల నిర్వహణ ద్వారా లభించే ప్రచారంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలో ఉంటున్నాయి. » మిస్ వరల్డ్ పోటీలకు కావాల్సిన మౌలిక వసతులు మన దేశంలోని చాలా నగరాల్లో ఉన్నాయి. పోటీలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాయి. ఇది ఆ సంస్థకు బాగా కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఫైవ్/సెవన్ స్టార్ హోటళ్లు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు సరిపడా వేదికలు, పోటీదారులు పర్యటించేందుకు అనువైన ప్రాంతాలకు కొదవ లేదు. హోటళ్లు, వేదికల అద్దెలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. » ముఖ్యంగా వరసగా రెండు పర్యాయాలు నిర్వహించినప్పటికీ, ఇండియాలో పోటీలపై పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. కొన్ని దేశాల్లో నిరసనల వల్ల అప్పటికప్పుడు పోటీలను వేరే చోటకు మార్చుకున్న సందర్భాలున్నాయి. -
తేజస్ యుద్ధ విమానంలో హైదరాబాద్ ‘మార్క్’1ఏ
శంషాబాద్: భారతదేశం అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ప్రధాన భాగాన్ని (సెంట్రల్ ఫ్యూస్లేజ్) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెమ్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. దీనికి ‘మార్క్1ఏ’గా నామకరణం చేసింది. రక్షణ రంగంలోని వివిధ పరికరాల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో తొలుత అభివృద్ధి భాగస్వామిగా సెంట్రల్ ఫ్యూస్లేజ్ (సీఎఫ్)ను తయారుచేసి సక్సెస్ కావడంతో ఉత్పత్తి భాగస్వామిగా మారింది. 3 నెలల్లో తొలి సీఎఫ్ విజయవంతంగా పూర్తి చేసి హెచ్ఏఎల్కు అందించేందుకు సిద్ధమైంది. యుద్ధవిమానంలోని సీఎఫ్ను తయారుచేసిన దేశీయ మొదటి ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది.ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. నెలకు ఒకటి తయారీ హెచ్ఏఎల్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన బృందంతో 3 నెలల్లో తొలి సీఎఫ్ తయారు చేశాం. వివిధ దశల్లో హెచ్ఏఎల్ క్లియరెన్స్తో దీనిని పూర్తి చేశాం. ఇకపై నెలకొకటి చొప్పున అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హెచ్ఏఎల్ పర్యవేక్షణతో వారి క్లియరెన్స్తో వీటి తయారీ జరుగుతుంది. ప్రస్తుతం 20 సీఎఫ్ల తయారీకి హెచ్ఏఎల్ అనుమతినిచ్చింది. – సీహెచ్వీ రామారావు, జీఎం, వెమ్ టెక్నాలజీహైదరాబాద్లో... హైదరాబాద్లోని వెమ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సీఎఫ్ తయారీలో 25 మంది ఇంజనీర్లు, 35 మంది టెక్నీషియన్ల బృందం పాల్గొంది. దీనికోసం మొత్తం 1,595 కాంపోనెంట్స్ వాడారు. వివిధ భాగాలను అనుసంధానించేందుకు సంస్థలో జిగ్ (పరికరాలను బిగించే ప్రాంతం) ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సంస్థలో రెండు జిగ్లున్నాయి. వెమ్ టెక్నాలజీ సంస్థ తన తొలి సీఎఫ్ మార్క్1ఏ ను శుక్రవారం హెచ్ఏఎల్కు అప్పగించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి సంజీవ్కుమార్, హెచ్ఏఎల్ సీఎండీ డాక్టర్ డీకే సునీల్, హెచ్ఏఎల్ డైరెక్టర్ కె.రవి హాజరు కానున్నారు. -
హైదరాబాదీలకు అందుబాటులో మరో ఫ్లైఓవర్
సాక్షి,హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్ (ఓఆర్ఆర్) నుంచి కొండాపూర్ వరకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ప్రయాణించే వారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. శిల్పా లేఔట్ రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నారు. దీంతో నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యం కలగనుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. ఇదీ ప్రాజెక్ట్ ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద రూ.178 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఆరు లేన్లతో ఉన్న దీని పొడవు 1.2 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2గా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. త్వరితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఎస్సార్డీపీ (SRDP) కింద నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇది 23వది. ఈ ఫ్లై ఓవర్ను త్వరితగతిన పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపుతున్న కమిషనర్ కర్ణన్ దీంతోపాటు ఫలక్నుమా, శాస్త్రిపురంల ఆర్ఓబీలు సైతం త్వరగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. ఈ రెండు ఆర్ఓబీలతో ఎస్సార్డీపీ కింద చేపట్టిన పనులు 39 పూర్తవుతాయి. హై సిటీగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాజెక్టుల పనులను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కింద చేస్తున్నారు. దీని ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో కొత్తగా 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్పాస్లు, 4 ఆర్ఓబీలు, 3 ఆర్యూబీలతోపాటు పది మార్గాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులున్నాయి. వీటిల్లో కొన్ని పనుల్ని వచ్చే నెలలో చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ (GHMC) పేర్కొంది.చదవండి: ఫతేనగర్ వంతెన మెట్ల కూల్చివేత -
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: సీఎం రేవంత్
హైదరాబాద్: సమ సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్సష్టం చేశారు. తమ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు. దళితులు చెప్పులు కుట్టుకోవాలా?, యాదవులు గొర్రెలు కాసుకోవాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరైనా బాగా చదవుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు సీఎం రేవంత్.హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 59 వేల ఉద్యోగాలిచ్చిందని, గత ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ల ఇవ్వలేదని సీఎం రేవంత్ నిలదీశారు. 2011 తర్వాత గ్రూప్౧ పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతిని సీఎం రేవంత్ గుర్తు చేశారు.‘ఇవాళ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలి. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారు. కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు?, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా?, కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోంది. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండి. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. కష్టపడండి… సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం. వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు. చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
Mangoes ఆర్గానిక్..ఆన్లైన్కే సై.. ధరలు డౌన్.. సేల్స్ అప్..!
భాగ్య నగరం మామిడి ప్రియత్వంతో ఉవ్విళ్లూరుతోంది. పండ్ల సీజన్ ఫుల్ స్వింగ్లో ఉంది. విభిన్న రకాల మామిడి వెరైటీలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. మామిడి విక్రయాల విషయంలో ఆఫ్ లైన్ మార్కెట్తో ఆన్లైన్ పోటీపడే స్థాయికి చేరుకోవడం ఈ సీజన్ విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర మామిడి మార్కెట్ స్థితిగతుల పై ఓ విశ్లేషణ.... – సాక్షి, సిటీబ్యూరో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మామిడి పండ్లతో పాటు, హిమాయత్, దాసేరి, బెనిషాన్, అల్ఫోన్సో, రసాలు వంటి రకాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నగరానికి వస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తాకాయి. ఇది నగర ప్రాథమిక మామిడి సరఫరాదారులపై తీవ్ర ప్రభావం చూపింది. హోల్సేల్ మార్కెట్లను పండని, పక్వానికి రాని పండ్లు ముంచెత్తడానికి కారణమైంది. ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్ధరలు డౌన్.. సేల్స్ అప్.. నగరంలోని మామిడి కేంద్రమైన బాటసింగారం, పీక్ సీజన్లో ప్రతిరోజూ 3,000 నుంచి 5,000 క్వింటాళ్ల పండ్ల క్రయవిక్రయాలు నిర్వహిస్తోంది. సగటు ధరలు క్వింటాకు రూ.2,345గా ఉన్నాయి. మరో మార్కెట్ అయిన జాంబాగ్, సీజన్ ప్రారంభ రోజుల్లో 500–800 క్వింటాళ్లు ఏప్రిల్లో 1,000–1,500 క్వింటాళ్లు ప్రాసెస్ చేస్తుంది. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే సీజన్ ప్రారంభంలో పండ్ల ధరలు కిలో రూ.200, రూ.400 వరకూ పలికాయి. అయితే రానురానూ తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం మామిడి విక్రయాలు బాగా ఊపందుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ధరలు స్థిరంగా ఉన్నాయి. రకాన్ని బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.200 వరకూ ఉన్నాయి. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాపచ్చడి మామిడిదీ అదే దారి..‘గతానికి భిన్నంగా పచ్చడి, ఇతర అవసరాల కోసం కూడా సిటిజనులు ఆన్లైన్ను ఆశ్రయిస్తుండడం కనిపిస్తోంది. ‘ఈ సీజన్లో పచ్చి మామిడి పండ్ల అమ్మకాలు రోజుకు 30–40 సంచుల నుంచి 20 సంచులకు తగ్గాయి. దీనికి కారణం నగరవాసులు నేరుగా ఆంధ్రాకు వెళ్లి తెచ్చుకోవడమే.. లేకుంటే ఆన్లైన్లోనే పచ్చళ్లు ఆర్డర్ చేస్తున్నారు’ అని కూకట్పల్లి రైతుబజార్లో పండ్ల దుకాణం యజమాని పవన్ చెబుతున్నారు. ఊరగాయల కోసం టాంజీ, తెల్లగులాబి, షెల్ఫ్ లైఫ్ కోసం కొత్తపల్లి కొబ్బరి, సీజన్ చివరి రుచి కోసం జలాలు.. వంటివన్నీ నూజివీడు, కాకినాడ, విజయవాడ నుంచి వస్తాయి. ఆర్గానిక్.. ఆన్లైన్లో క్లిక్.. కృత్రిమంగా పండించడం గురించిన ఆందోళనలు నగరవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త కొత్త విక్రయ మార్గాలను తెరుస్తోంది. అదే క్రమంలో పొలం నుంచి నేరుగా ఇంటికి వచ్చే ప్రత్యామ్నాయాలను ఇష్టపడే వినియోగదారులు కూడా పుట్టుకొచ్చారు. పెరిగిన డిమాండ్తో రిటైల్ దుకాణాలు సేంద్రీయ బంగినపల్లి రకాన్ని కిలోకు రూ.150 నుంచి రూ.400 చొప్పున విక్రయిస్తుండగా ఆన్లైన్లో అంతకన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్ నడుపుతున్న రాఘవేంద్ర, తాను 2011లో ఆన్లైన్లో మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించానని అంటున్నారు. ఆయన సదాశివపేట, షామిర్పేట నుంచి మామిడి పండ్లను సేకరించి నగరంలోని ఇళ్లకు డెలివరీ చేస్తున్నాడు. ఇతర నగరాలకు ఆర్డర్లు కార్గో బస్సుల ద్వారా సరఫరా చేస్తున్నాడు. ‘ఆన్లైన్ సేవలు విశ్వసించగల సురక్షితమైన, సేంద్రీయ పండ్లను అందిస్తాయి’ అని అత్తాపూర్కు చెందిన కస్టమర్ తహ్సీన్ ఫర్హా అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ మార్కెట్ ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం సామాన్యులకు సైతం ప్రత్యేకమైన పండూరి వంటి తక్కువ–తెలిసిన రకాలను కూడా అందిస్తోంది. -
Vishwanath Karthikey అమ్మమాటతో శిఖరాలకు, అరుదైన రికార్డు
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), కోసియస్కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్అమ్మ మాటే ప్రేరణ..ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాఈ తరానికి స్పూర్తి.. ఈ పయనంలో విశ్వనాథ్కు శిక్షణ ఇచ్చిన కోచ్లు భరత్, లెఫ్టినెంట్ రోమిల్ బారాథ్వల్ (ఇండియన్ ఆర్మీ రిటైర్డ్) పాత్ర కీలకం. రోమిల్ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం. -
పచ్చని కొండల్లో పరవశం.. లక్స్గ్లాంప్!
సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషన్ను ఎలా ఎంచుకోవడం? మానసిక ప్రశాంతతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ముఖ్యమే కదా! ఆ రెండింటికీ గమ్యం పూంబారై! హిమాలయాల సరిహద్దుల్లోని హిల్స్స్టేషన్లలో యుద్ధభయం ఇంకా వీడకపోగా, దక్షిణాన ఉన్న నీలగిరితో పాటు ఇతర అన్ని హిల్ స్టేషన్స్ జనాలతో కిటకిటలాడుతూ పట్టణ, నగర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అందుకే సిమ్లా, కులూ, మనాలి నుంచి ఊటీ, కొడైకెనాల్ వరకు దేన్ని చూసినా అమ్మో.. వాటికన్నా ఇల్లే నయమనిపించేలా చేస్తున్నాయి. కానీ పూంబారై అలా కాదు. కొడైకెనాల్కి 25 కిలోమీటర్ల పైన పచ్చటి కొండల ఒడిలో.. జలజల పారే జలపాతాల మధ్య.. మూడు కాలాలకూ సూటయ్యే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరి ఉందీ ఊరు! మిగిలిన హిల్ స్టేషన్లలో ఉన్నట్లు కిక్కిరిసిన హోటళ్లు.. జనసందోహంతో నిండిన రిసార్ట్స్ లేవు. ప్రకృతి వీక్షణ, ఆస్వాదనకు వీలుగా కొండవాళ్లలో ప్రైవసీ ప్రాధాన్యంగా డోమ్స్ నిర్మాణాలుంటాయి. ఇంత దూరం వచ్చి మళ్లీ సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్లో మునిగిపోకుండా ఉండటానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ను దృష్టిలో పెట్టుకుని వైఫై కనెక్టివిటీ ఇవ్వలేదు ఈ డోమ్స్కి. శారీరక, మానసిక రిలాక్సేషన్ కోసం జకూజీ, స్విమ్మింగ్ పూల్, ఆవిరి స్నానాల పెట్టె, ఆరుబయట షవర్ వంటి సౌకర్యాలన్నింటితో క్యాంపింగ్ తరహా బసలివి. అదే లక్స్గ్లాంప్ ఎకో రిసార్ట్స్! దీంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పర్యాటకులు పూంబారై బాట పడుతున్నారు. ఈ రిసార్ట్స్ నిర్మాణానికి పూర్వం పూంబారైలో సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు. వీటి నిర్మాణంతో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అంతేకాదు స్థానిక యువత, మహిళలకు ఈ రిసార్ట్స్ ఉపాధినీ కల్పిస్తున్నాయి. స్థానికంగా పండే పంటలు, కూరగాయలను ఇక్కడి రెస్టారెంట్స్ కొనుగోలు చేస్తున్నాయి. మూడుకాలాలు పూర్తి ఆక్యుపెన్సీతో ఉండే ఈ రిసార్ట్స్ వల్ల స్థానిక యువత నుంచి రైతుల వరకు అందరికీ ఏదోరకంగా ఉపాధి అందుతోంది. అంతేకాదు దీనివల్ల రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో స్థానికుల చదువు, వ్యాపార వాణిజ్యాలూ ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయి. దీంతో పూంబారై ఆర్థిక చిత్రం మారిపోయింది. లగ్జరీ, క్యాంపింగ్ కలిసేలా.. లక్స్గ్లాంప్ ఈ డోమ్ తరహా రిసార్ట్స్ను ఇదే లక్స్గ్లాంప్ సంస్థ మున్నార్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మంచి ఫలితాలను ఇవ్వడంతో పూంబారైలోనూ నిర్మించింది. ఆ సంస్థ యజమాని కేరళ త్రిస్సూర్కు చెందిన ఆంటోనీ థామస్. బిజినెస్ డెవలపర్. వృత్తిరీత్యా దుబాయ్లో ఉంటున్నారు. ఈ రోజుల్లో కాలుష్యం లేని ప్రకృతిలో గడిపే అవకాశం రావడం నిజంగానే లగ్జరీనే. అలాంటి లగ్జరీ.. క్యాంపింగ్ రెండూ కలిసేలా ఈ రిసార్ట్స్కి లక్స్గ్లాంప్ అని పేరు పెట్టామని చెబుతారాయన. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే.. ‘నాకు చిన్నప్పటి నుంచీ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. నాతో పాటే ఆ ఆసక్తీ పెరుగుతూ వచి్చంది. లక్కీగా మా ఆవిడ ఎలీనా థామస్కు పర్యటనలంటే ఇష్టం ఉండటంతో ఏ కాస్త టైమ్ దొరికినా ఇద్దరం ప్రపంచ దేశాలను సందర్శిస్తూంటాం. దీనివల్ల పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం దొరకడమే కాదు. మా బిజినెస్ డెవలప్మెంట్కి కొత్త ఐడియాలూ వస్తుంటాయి. అలా ఒకసారి యూరప్ వెళ్లినప్పుడు అక్కడ చాలా చోట్ల గ్లాస్ క్యాబిన్ల నుంచి ఆలైప్ లాడ్జెస్, డోమ్స్, బబుల్ రిట్రీట్స్ చాలా కనిపించాయి. వాటిల్లో బస చేశాం. వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్ అలాంటిది మన దగ్గర కనిపించలేదు. క్యాంపింగ్కి కనీస వసతులు కూడా లేని గుడారాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కుటుంబంతో కలిసి క్యాంపింగ్ చేయాలంటే భద్రత, సౌకర్యాలు ప్రధానమవుతాయి కదా! వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మేము యూరప్లో ఎక్స్పీరియెన్స్ చేసిన గ్లాస్ క్యాబిన్, డోమ్స్ పర్ఫెక్ట్ అనిపించాయి. వాటిని దక్షిణ భారతంలో ప్రవేశపెట్టాలనుకుని ముందు పైలట్ ప్రాజెక్ట్గా 2018లో మున్నార్లో స్టార్ట్ చేశాం. పూంబారైలో మా లక్స్గ్లాంప్ ఎకో రిసార్ట్స్ ప్రారంభంతోనే ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా చాలా వసతులు ఏర్పడి ఈ ఊరికి ఓ కొత్త కళ వచి్చంది. భవిష్యత్లో మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ తరహా కట్టడాలతో పర్యాటక ప్రియులకు సౌకర్యవంతమైన, పర్యావరణప్రియ బసను అందించాలనుకుంటున్నాం’అని ఆంటోనీ థామస్ తెలిపారు. -
టెర్రస్ గార్డెన్స్ : ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్
నగరంలో టెర్రస్ గార్డెనింగ్(మిద్దె పంట) ఒక ట్రెండ్గా, సరికొత్త జీవనశైలిగా మారిన విషయం విధితమే. ఇందులో భాగంగానే నగరంలోని భవనాలు పచ్చదనం అల్లుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ ఇంటిపై చిన్న తోట ఉండాలనే ఆకాంక్ష ఒక్కొక్కరి హృదయంలోనూ నాటు వేస్తోంది. ప్రస్తుతం నగరంలోని మిద్దె తోటల ప్రేమికులువర్షాకాలాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే కురవడం, ఈ తొలకరి జల్లులు వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడానికి అనువైన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి విత్తన సేకరణ మొదలుపెట్టారు. -సాక్షి, సిటీబ్యూరో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా విత్తనాల సేకరణ మొదలైంది. పాత కాలపు ‘నువ్వు ఇస్తే.. నేను ఇస్తా‘ పద్ధతిలో విత్తనాల మారి్పడి జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విత్తన మారి్పడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ యాప్స్లో వందలు, వేల మందితో ఉన్న మిద్దెపంట గ్రూపులు ఈ విత్తన సేకరణపై దృష్టి సారించాయి. ప్రముఖ సోషల్ మీడియా గ్రూపులు వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ విత్తనాల మారి్పడి సంస్కృతి మొక్కల కోసం మానవ సంబంధాలు పెరిగే సూచికగా మారాయి. ఈ గ్రూపుల సభ్యులు తమ వద్ద ఉన్న హెయిర్లూమ్ సీడ్స్, దేశీ విత్తనాలను ఇతరులకు పంచిపెడుతున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా జెనెటిక్ డైవర్సిటీని నిలబెట్టే పద్ధతుల వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. సిటీలో పచ్చదనపు స్పర్శ టెర్రస్ గార్డెనింగ్ నగరానికి కొత్త కాకపోయినా, కోవిడ్ తర్వాత ఈ సంస్కృతి విస్తృతమైంది. ఇంటింటా పిల్లలకు మొక్కల తాలూకు పరిచయం కలిగిస్తూ, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా కిడ్స్ సీడ్ స్వాప్ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పాత తరం జీవితానికి దగ్గరగా చేరే ఒక మార్గం కావడంలో సందేహం లేదు.‘‘ఇది మాకు ఆహారం కోసం మాత్రమే కాదు, మనశ్శాంతి కోసం కూడా’’ అని అంటున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మిద్దె పంట ప్రేమికురాలు సూర్యప్రభ. శ్రమకోర్చి నాటిన విత్తనాలు తర్వాత మొలక వేసిన మొక్కను చూడటం, తన చేతులతో పండించిన కూరగాయలను ఇంట్లో వండుకోవడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు. మీట్స్తో పాటు అవగాహన ఈ నెలాఖరులో నగరంలోని బేగంపేటలో ఒక సీడ్ స్వాప్ మీట్ను నిర్వహించనుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లావాదేవీలు ఉండవు. ఇది పూర్తిగా మార్పిడి పద్ధతిపై ఆధారపడిన సదస్సు. దీనితో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో విత్తన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు గ్రూపుల్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మీట్లో విత్తనాల మార్పిడితో పాటు విత్తన భద్రతా పద్ధతులు, కంపోస్టింగ్ టెక్నిక్స్, ఇండోర్ ప్లాంట్స్ గురించి అవగాహన, జీరో వేస్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై చిన్న చిన్న సెషన్లు కూడా నిర్వహిస్తారు. విత్తనాల మార్పిడి ద్వారా కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధాలు కూడా నాటుతున్నారు. ఇంటికి అనువైన మొక్కలు ఈ వర్షాకాలంలో మిద్దె తోటల ప్రేమికులు ప్రధానంగా కూరగాయలు, పూల మొక్కలు, హెర్బ్స్ను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గోంగూర, బీరకాయ, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, టమోటా వంటి కూరగాయలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూహీ, చామంతి, గులాబీ, హిబిస్కస్ వంటి పూల మొక్కలతో పాటు తులసి, కరివేపాకు, వెల్లుల్లి కాడ, ధనియాల మొక్క, అలవేరా వంటి హెర్బ్స్ పెంచడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ స్థలంలో, కంటైనర్లలో సులభంగా పెరగడం ఈ మొక్కల ప్రత్యేకత. అలాగే ఈ మొక్కల వాసన, ఆకృతి, వండినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మిద్దె తోటల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. -
జూన్ 6న ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరుసగా 71వ సంవత్సరం మహాగణపతిని ఖైరతాబాద్లో ప్రతిష్టంచనున్నామని చెప్పారు. మూడు నెలల ముందే ప్రతి సంవత్సరం వినాయక విగ్రహ తయారీ పనులను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఆగస్ట్ 27న వినాయక చవితి ఉండటంతో జూన్ 6న సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ నిర్వహించి పనులను ప్రారంభించనున్నారు. -
డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య
మియాపూర్(హైదరాబాద్): కుటుంబ సమస్యలతో పాటు ప్రేమ విఫలమై ఓ డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కైలాసపూరికి చెందిన సాగర్ కుమార్ (17) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచి్చన అతను మియాపూర్లోని గ్లోకుల్ ప్లాట్స్ని డెలయిట్ డాన్స్ స్టూడియోలో డ్యాన్స్ మాస్టర్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న రాత్రి స్టూడియో మూసివేసిన తర్వాత స్టూడియో యజమాని పరమేష్ అతడికి ఫోన్ చేసి స్టూడియో డోర్లను లాక్ చేయాలని సూచించాడు. సోమవారం మధ్యాహ్నం యజమాని పరమేష్ స్టూడియోకు వెళ్లి చూడగా సాగర్ కుమార్ ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాగర్ కుమార్ స్టూడియోకు వచి్చనప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని పది రోజుల క్రితం స్టూడియో యజమాని వంగాల పరమేష్ ఈ విషయమై అతడిని ప్రశి్నంచగా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓ అమ్మాయిని ప్రేమించి విఫలమైనట్లు తెలిపాడన్నారు. స్టూడియో యజమాని పరమేష్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
KTR:కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తాను. The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E caseAs a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassmentAs I have planned to leave for the UK & USA for…— KTR (@KTRBRS) May 26, 2025ఇప్పటికే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే వారి ముందు హాజరవుతాను. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపాను’అని అన్నారు. అదే సమయంలో 48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. ఆ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడ లేదు’ అని ప్రశ్నించారు. -
దోమకుట్టినట్టైనా లేదు
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురుగు నీటితో గుంతలుగా మారి కంపు కొడుతున్నాయి. ఓనర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఇటీవలి వర్షాలతో నగరంతో పాటు శివారు మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలోని పురపాలికల్లో మురుగు సమస్య తీవ్రంగా పరిణమిచ్చింది. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం, మురుగు నీరు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీల వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరోఅపరిశుభ్రతకు నిలయాలుగా.. పురపాలిక చట్టం ప్రకారం ఖాళీ స్థలాల్లో ఎలాంటి ముళ్ల పొదలు పెరగకుండా, అపరిశుభ్రత లేకుండా స్థల (ప్లాట్ల) ఓనర్లు చూసుకోవాలి. లేదంటే పుర అధికారులు స్థలం యజమానికి నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలి. కానీ.. శివారు జిల్లాల పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిళ్లతో సహా 29 పురపాలికల్లోని పలు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. భావి అవసరాల దృష్ట్యా కొందరు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అలాగే ఖాళీగా వదిలేస్తున్నారు. ఆయా కాలనీల్లో గృహ నిర్మాణాలు ఊపందుకుని, ప్లాట్లకు విలువ పెరిగిన తర్వాత చూద్దాంలే అనుకొని ఏళ్ల తరబడి వదిలేయడంతో చెత్త, ముళ్లకంప చెట్లు పెరిగి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. నగర శివారు జిల్లాల్లోని మేడ్చల్, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర మున్సిపల్ సర్కిళ్లతో పాటు జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర 29 పురపాలక సంఘాల్లో ఇటీవల కురిసిన వర్షం జల్లులతో కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి దోమలు పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లోనూ.. ప్రైవేటు ప్లాట్ల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు,డంపింగ్ యార్డులు అంతర్గత, ప్రధాన రహదారుల వెంట ఉన్న గ్రీన్ బెల్టు తదితర స్థలాలు చెత్తకుండీలుగా, మురుగునీటి నిలయాలుగా మారుతున్నాయి. పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నిర్మాణ వ్యర్ధాలను, భోజన, ప్లాస్టిక్ వ్యర్థాలను డంపు చేస్తున్నారు. ప్రతి ఏటా పట్టణ ప్రగతి, ఇతర ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు సందర్భంగా వీటిని శుభ్రం చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. కరువైన పర్యవేక్షణ.. స్థల యజమానులు తమ ప్లాట్లలో మురుగు, వర్షం నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన్నప్పటికీ, పట్టించుకోవటం లేదు. దీన్ని పర్యవేక్షించాల్సిన పురపాలిక అధికారులు.. అటువైటు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్తాచెదారంతో ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సంబంధిత ఓనర్లకు పురపాలక సంఘాలు అడపాదడపా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నాయి. కొందరి పాట్ల ఓనర్ల వివరాలు తెలియక నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
ఛాతి ఎముకలను తొలగించి .. అరుదైన శస్త్ర చికిత్స
శంషాబాద్: ఛాతి ఎముకల వెనుక ఏర్పడిన క్లిష్టమైన కణితిని ఆర్కన్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆస్పత్రి వైద్య బృందం మీడియాకు వెల్లడించింది. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణ ఏడాది కిందట పొలంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. కొద్ది కాలం తర్వాత ఛాతి వెనుక తీవ్రమైన నొప్పి వస్తుండటంతో పలుచోట్ల వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. ఇటీవల ఆర్కన్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సింగపూర్లో వైద్య విద్యనభ్యసించిన ప్రముఖ కార్డియోథొరాసిక్ వాసు్కలర్ సర్జన్ అరుణ్ కనాల నేతృత్వంలో ప్లాస్టిక్ సర్జన్ మధువినయ్, ఆర్థోపెడిక్ వంశీమోహన్, క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు ఖాద్రీ, ఆస్పత్రి ఎండీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యనిపుణులు చంద్రకాంత్ల బృందం శస్త్ర చికిత్స ద్వారా గుండె, ఊపిరితిత్తులకు ఇబ్బందులు కలగకుండా ఛాతి ఎముకలను తీసి వెనుక ఉన్న కణితిని తొలగించారు. అక్కడ ప్రత్యేక లేయర్ను అమర్చినట్లు వైద్య బృదం వివరించింది. ఆరు రోజుల్లో రోగి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తావైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి నార్సింగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్యాదవ్మణికొండ: ఆస్పత్రులు, సేవా సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత ఆరోగ్య శిబిరాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని ప్రతి ఒక్కరూ సది్వనియోగం చేసుకోవాలని నార్సింగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె.దశరథ్యాదవ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్ టౌన్షిప్లో ఆదివారం ధన్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్, రిథమ్ స్పెషాలిటీ క్లినిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవటంతో చాలామందికి పలు రోగాలు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలలో వాటిని ముందుగా తెలుసుకుని వైద్యుల సలహాలు పాటించి నయం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రోగం ముదిరి పరిస్థితి చేతుల దాటకముందే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి.బాల్రెడ్డి, ధన్వీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఎండీ కె.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్లు, సిబ్బందితో పాటు వందలాది మంది టౌన్షిప్ వాసులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చదవండి: Bio diversity park కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం పట్టించుకోదు.! -
కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం పట్టించుకోదు.!
హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సుకు స్మారకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన బయో డైవర్సిటీ పార్కు పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. స్థాయి అంతర్జాతీయమే కానీ గల్లీ పార్కు కన్నా అధ్వానంగా మారుతోందనేది వాస్తవం. అందరూ వ్యాఖ్యానించే స్థాయికి చేరిందని చెప్పక తప్పదు. పన్నెండున్నరేళ్లు అయినా ఎలాంటి ఎదుగు బొదుగు లేని పార్కుగా దీనిని చెప్పక తప్పదు. రాయదుర్గంలోని సర్వే నం.83 నాలెడ్జి సిటీ ప్రాంతంలోని 15 ఎకరాల విశాల స్థలంలో కాప్–11 సదస్సుకు చిహ్నంగా పైలాన్, పార్కును కూడా నిర్మించారు. పచ్చదనం కోసం ప్రపంచంలో అరుదుగా లభించే 200 మొక్కలు నాటి పెంచడం, లాన్లు ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ నేడు కళావిహీనంగా మారిపోతున్నాయి. ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తాఅప్పట్లో ఏపీఐఐసీ, అటవీశాఖ, బయో డైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏడు కోట్లతో నిర్మించిన దీన్ని అక్టోబర్ 16, 2012న అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆరంభంలో పైలాన్, మొక్కలను పరిశీలించేందుకు పలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడకు వచ్చి అన్ని విషయాలు గమనించి సేద తీరి వెళ్లేవారు. ఒక ఏడాది తర్వాత రావడం మానేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహరం సమయంలో కొంత హడావుడి చేసి అనంతరం చేతులెత్తేశారు. ఇక జీహెచ్ఎంసీ పరిస్థితి చెప్పనక్కర్లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయి జీవవైవిద్య సదస్సుకు స్మారకంగా ఈబయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దీని పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. కేంద్రం పట్టించుకోదు.. రాష్ట్ర అసలు ముట్టుకోదు.. ఇక జీహెచ్ఎంసీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. నగరంలో పలు పార్కులు, ముఖ్యంగా థీమ్పార్కులను కూడా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ దీనిని పట్టించుకోవడమే లేదు. మాకు ఈ పార్కుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెబుతున్నారని అనుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇది కాస్తా ఎవరికీ పట్టని పార్కుగా మారిపోయిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. పన్నెండున్నరేళ్లుగా నిర్వహణను టీజీఐఐసీ సంస్థకు వదిలేసి చేతులు దులుపుకున్నారని అందరూ అంటున్నారు. బయో డైవర్సిటీ పార్కు, పైలాన్ ఇదే మొదటిది.. కాప్ సదస్సులను హైదరాబాద్లో నిర్వహించే వరకు 11దేశాల్లో నిర్వహించినా,ఎక్కడా సదస్సు చిహ్నంగా పార్కు, పైలాన్ నిర్మించలేదు. మొదటి సారిగా మనదేశంలోనే నిర్మించడం ఈ సదస్సు ప్రత్యేకతని అధికారులే పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా 200 దేశాలకు విభిన్న రకాల మొక్కలను ఆ దేశ చిహ్నంగా నాటాలని నిర్ణయించామని అందులో 101 దేశాల ప్రతినిధులు మొక్కలు నాటారు. ఆతర్వాత నాలుగేళ్ళకు అప్పటి పాకిస్తాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ వచ్చి మొక్కను పరిశీలించి, పార్కు, పైలాన్ ప్రాధ్యాన్యతను తెలుసుకున్నారు. నాటి నుంచి వాటి ప్రగతిని బట్టి ఫొటోలు తీసి వెబ్సైట్లో ఉంచడంతో పాటు ఐక్యరాజ్య సమితిలోని కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సంస్థకు, ఆయా దేశాలకు కూడా పంపుతున్నట్లు అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ వీటిని పరిశీలించిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని బయో డైవర్సిటీ పార్కులో 2016 వరకు రోజూ ఇలానే విద్యార్థులు పరిశీలనకు వచ్చేవారు ఆ తర్వాత ఎవరూ ఈ దిక్కు చూడడం లేదు (ఫైల్) ఈ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్... బయో డైవర్సిటీ పార్కు నిర్వహణ బాధ్యతను ఇటీవల ఫీనిక్స్ గ్రూప్కు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్లో మరింతగా ఆకర్షించేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పార్కులో ఈ క్రింది సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పచ్చదనం మరింతగా పెంచి ఆకట్టుకునేలా చుట్టూరా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలి క్యాంటిన్ సౌకర్యం,ఆక్వేరియం, మ్యూజియం, సేద తీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. నిర్మాణం చేసి తాళంవేసి ఉంచిన బాత్రూమ్, ల్యాట్రిన్లు అందుబాటులోకి తేవాలి ప్రతి వీకెండ్స్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలి ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకరావాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించాలి పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి వీకెండ్స్లో అందరూ సేద తీరేలా థీమ్ పార్కులలాగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయాలి. బయో డైవర్సిటీ పార్కుకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలోనే రూ. 100 కోట్లతో జీవవైవిద్య మ్యూజియం, రూ.100 కోట్లతో ప్రత్యేక అక్వేరియం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ అంశాన్ని స్వయంగా అప్పట్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అక్టోబర్ 22, 2012న జూబ్లీహిల్స్లో కమ్యూనిటీహాల్కు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రకటించారు. అంతేగాక అక్టోబర్ 18, 2012న అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి చటర్జీ రూ. 100కోట్లతో ఆక్వేరియం, మ్యూజియాన్ని న్యూఢిల్లీలో మొదట్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ సదస్సు నిర్వహించిన హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఇది కాస్తా అప్పటి నుంచి ప్రకటనలకే పరిమితమైంది. -
Eesha Rebba బంగారం లాంటి వేడుక
గచ్చిబౌలి: కొత్తగూడలోని శరత్సిటీ క్యాపిటల్ మాల్ లోని ఓ జ్యువెలరీ స్టోర్లో కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టాలివుడ్ నటి ఈషా రెబ్బ (Eesha Rebba)సందడి చేశారు. నిత్యం సందర్శకులతో సందడిగా జరుగుతున్న ఈ చాలెంజ్లో ఈషా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ బంగారం లాంటి వేడుక నిర్వహించారని, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. గోల్డ్–సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్లో పాల్గొని సందర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపొందిన వారికి బంగారు, వెండి నాణేలు బహుమతిగా అందజేశారు. రజతాభరణాల్లో మోడల్స్ తళుకులు- వెండి వెలుగులు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.9లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ హబ్లో మోడల్స్ వెండి ఆభరణాలను ధరించి హొయలు పోయారు. బంగారం ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో నగర ప్రజలు సిల్వర్ జ్యువెలరీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో సిల్వర్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో సిల్వర్ జ్యువెలరీతో పాటు గృహాలంకరణలోనూ వెండితో చేసిన వస్తువులు వినియోగిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాదీ మోడళ్లు అబ్బురపరిచే వెండి కళాకృతులు.. క్రాఫ్టెడ్ జ్యువెలరీని ప్రదర్శించారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్తో అందాల ముద్దుగుమ్మలు వెండి వెలుగులు నింపారు. 100 ఏళ్ల తమ వారసత్వానికి ఈ షోరూమ్ మళ్ళీ మద్దతు ఇచ్చే ఒక అద్భుత అవకాశమని, గచ్చిబౌలిలోని తమ హబ్, బషీర్బాగ్లోని జ్యువెలర్స్ వలే నాణ్యతకు, సంప్రదాయ డిజైన్లకు, ఆధునికతకు నిలువెత్తు ఉదాహరణ అని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ప్రతి వెండి కళాకృతి నగర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, సంప్రదాయ రూపకల్పన నుంచి ఆధునిక డిజైన్లకు వేదికగా నిలుస్తుందని వివరించారు. నీల మేఘ శ్యామనృత్య రూపకం గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో నిర్వహణ మోతీనగర్: ప్రముఖ కూచిపూడి నృత్యకళా సంస్థ సుమధుర ఆర్ట్స్ అకాడమీ సమర్పణలో గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో సంస్థ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నీల మేఘ శ్యామ’ నృత్య రూపకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. సుమారు 200 మంది నృత్య కళాకారులు పాల్గొని అహూతులను అలరించారు. వీక్షకుల సమక్షంలో జనరంజకంగా నిర్వహించిన ప్రదర్శనలో కృష్ణ భగవానుని లీలామృతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రధానంగా చేసుకొని గురు శ్రవ్య మానస భోగిరెడ్డి తన శిష్య బృందంతో అద్భుతంగా రూపకల్పన చేశారు. కూచిపూడి విద్యార్థులందరూ చక్కని హావభావాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రవికుమార్ దూళిపాట, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ నటులు, శ్రీనివాస భోగిరెడ్డి ప్రదర్శనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్రావు, ఐఏఎస్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ కె.లక్ష్మీ, ఐఏఎస్లు, ప్రముఖ సినీ, టీవీ దర్శక, నిర్మాతలు పాల్గొన్నారు. -
మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!
-
Hyderabad: అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు..
సికింద్రాబాద్: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్ ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్ తీసుకువచి్చన వెంకటేశ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్ నంబర్ సరిగా ప్రింట్ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్లైన్ టికెట్లో ప్రింట్ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. -
వచ్చే నెలలో ‘పీఎం ఈ–డ్రైవ్’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నుంచి ఆర్టీసీ డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించే ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకు అవసరమైన 2,800 బస్సులను కేంద్రప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా అందించనుంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఇందులో 2 వేల బస్సులను మంజూరు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. మిగతావాటిని తదుపరి మంజూరు చేయనుంది. మంజూరైన బస్సులకు వచ్చే నెలలో టెండర్లు పిలవబోతోంది. నాలుగు ప్రాంతాల్లో అనువైన స్థలాలు ప్రస్తుతం సిటీలో దాదాపు 2,500 బస్సులు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు సమకూరిన తర్వాత డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర డిపోలకు బదలాయిస్తారు. ఉన్న బస్సులు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నందున, ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలని, అదనంగా 300 బస్సులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బస్సుల సంఖ్య పెరిగితే ఉన్న డిపోలు సరిపోవు. చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సాధారణ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సులకు ఎక్కువ స్థలం అవసరం. దీంతో నగరంలో అదనంగా మరో పది డిపోలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.టెండర్ల ప్రక్రియ పూర్తయిన మూడు నెలల్లో బస్సుల రాక మొదలవుతుంది. దీంతో కొత్త డిపోల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. శంషాబాద్, శామీర్పేట, తుర్కయాంజాల్, హయత్నగర్ ఇలా.. పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి ఉన్న సొంత స్థలాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో సొంత భూములను అనువుగా ఉన్నట్టు గుర్తించింది. ఒక్కో డిపోలో 60–80 వరకు బస్సులు ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం నగరంలో 550 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా, విడతల వారీగా 275 బస్సులు వచ్చాయి. కానీ, ప్రస్తుతం చైనాతో మన దేశానికి సంబంధాలు సానుకూలంగా లేకపోవటం మిగతా బస్సుల సరఫరాపై ప్రభావం చూపుతోంది. డిసెంబర్ వరకు గానీ మళ్లీ సరఫరా ఉండకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవం: జయష్ రంజన్
సాక్షి, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యలు నిరాధారమన్నారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు’’ అని జయేష్ రంజన్ చెప్పారు.‘‘నేను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలస్ డిన్నర్లో మాత్రమే పాల్గొంది. ప్రతి టేబుల్లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించాం. అలాంటిది జరగలేదని చెప్పారు’’ అని జయేష్ రంజన్ పేర్కొన్నారు.మిస్ వరల్డ్ వివాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..మరోవైపు, మిస్ వరల్డ్ వివాదంపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశించింది. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, ఐపీఎస్ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. -
బ్యూటీకి కేరాఫ్గా భాగ్యనగరం..!
ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ నగరం పాతికేళ్లకు ముందే ఈ పోటీల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది. దేశానికి విశ్వసుందరి, ప్రపంచ సుందరి రెండు కిరీటాలనూ అందించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. హేడెన్ హైదరాబాదీయే.. నగరానికి చెందిన ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో 1973వ సంవత్సరం మే 13న జని్మంచిన డయానా హేడెన్.. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైసూ్కల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె 13 సంవత్సరాల వయసులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నగరంలో ఆమె మోడలింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎన్ కోర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేశారు. అనంతరం గ్లామర్ రంగంలో అడుగుపెట్టి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యారాయ్ దక్కించుకున్న తర్వాత 3వ సారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్ దక్కించుకున్నారు. అంతేకాదు హైదరాబాద్ను కూడా చరిత్రకు ఎక్కించారు. ఈ 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్గా నిలిచారు. ఆ తర్వాత సినిమా, టీవీ రంగంలో ఆమె స్థిరపడ్డారు.విశ్వసుందరిని అందించిందీ మనమే..మిస్ యూనివర్స్ కిరీటాన్ని దేశానికి అందించిన సుషి్మతాసేన్ కూడా హైదరాబాదీనే. ఆమె 1975వ సంవత్సరంలో నవంబర్ 19న నగరంలోని బెంగాలీ బైద్య కుటుంబంలో జన్మించారు. భారత వైమానిక దళం మాజీ వింగ్ కమాండర్ షుబీర్ సేన్, ఆభరణాల డిజైనర్ అయిన సుబ్ర సేన్లు ఆమె తల్లిదండ్రులు. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. అనంతరం 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచి, బాలీవుడ్లో స్థిరపడి పలు హిందీ చిత్రాల్లో పనిచేశారు. నగరంలో తాను స్థాపించిన ఐయామ్ షి పోటీల సందర్భంగా పలుమార్లు ఆమె నగరాన్ని సందర్శించారు. (చదవండి: 44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్తో టచ్లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
అన్యాక్రాంతంలో హెచ్ఎండీఏ భూములు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భూములకు రక్షణ కొరవడింది. వివిధ జిల్లాల్లో హెచ్ఎండీఏకు చెందిన భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. కానీ అనేక చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారులు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మియాపూర్, జవహర్నగర్, శంషాబాద్ (Shamshabad) తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. చివరకు పోలీసులు, రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన యంత్రాంగాలు రంగంలోకి దిగి కొన్ని చోట్ల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ దశాబ్ద కాలంగా పెద్ద సంఖ్యలోనే భూములను కోల్పోయినట్లు సమాచారం. భద్రత ఏర్పాటు చేయకపోవడంతో.. మియాపూర్లోని 100, 101 సర్వే నంబర్లలోని సుమారు 500 ఎకరాల భూములను కాపాడుకొనేందుకు గత ఏడాది పోలీసులు కబ్జాదారుల నుంచి హెచ్ఎండీఏకు అప్పగించారు. శంషాబాద్లోనూ హెచ్ఎండీఏకు ఉన్న సుమారు 200 ఎకరాల భూముల్లో 50 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో ఏకంగా కొన్ని భవనాలను కూడా కట్టించారు. వీటి రక్షణ కోసం హెచ్ఎండీఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుతో భూమిని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన భవనాలను సైతం తొలగించారు. ఇలా ఎక్కడో ఒక చోట కబ్జాకు గురైనట్లు హెచ్ఎండీఏ దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే అధికారులు జోక్యం చేసుకొని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి భద్రత ఏర్పాటు చేయకపోవడంతో హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుమారు 2,000 ఎకరాల భూములకు రక్షణ లేకుండాపోయింది. కొన్ని చోట్ల సరైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.కాగితాల్లోనే ప్రతిపాదనలు.. మరోవైపు భూములను కాపాడేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా సమస్యగా మారింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టేట్ విభాగాల మధ్య కొంతకాలంగా సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జవహర్నగర్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణకు గురి కాగా.. మరో 1,300 ఎకరాల భూములు హెచ్ఎండీఏ ఖాతాలోఉన్నాయి. ‘హెచ్ఎండీఏకు చెందిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే సంగతి తెలియదు. పై అధికారుల సూచనల మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం వరకే పరిమితమయ్యాం’అని హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.కబ్జా కోరల్లో చిక్కుకున్న మియాపూర్ (Miyapur) భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తరహాలో మిగిలిన చోట్ల కూడా ఇలాగే చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నా.. అమలుకు మాత్రం నోచుకోవడంలేదు. ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం కారణంగానే ఫెన్సింగ్ పనులు కొనపాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని విలువైన భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిఘాను బలోపేతం చేయాలని ప్రతిపాదించినా అన్ని చోట్ల ఈ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రత్యక్షంగా భద్రత సదుపాయం కల్పించలేని ప్రాంతాల్లో జియోఫెన్సింగ్ ద్వారా భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని భావించినా ఆ ప్రణాళికలు ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉండటం గమనార్హం.చదవండి: ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్సీడీఏ పర్మిషన్లు -
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో భారీ వర్షం కురిసింది. అలాగే సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, టోలీచౌకీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా చిరు జల్లులు పడుతుండగా.. రేపు భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి(Southwest Monsoon) రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. Ameerpet metro station 🌧️ #HyderabadRains#Hyderabad pic.twitter.com/svyXFaOb0b— Rajesh (@bekindtoevery_1) May 24, 2025#24MAY 7:30PM⚠️Pouring So Heavily in Northern & Western Parts of the City #Hyderabadrains pic.twitter.com/gNR0GD4WZc— Hyderabad Rains (@Hyderabadrains) May 24, 2025 -
ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్సీడీఏ పర్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఔట్లు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్సీడీఏ (FCDA) అనుమతులు మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమలు, ఐటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్ట్లకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్సీడీఏనే నిర్వహించనుంది.హెచ్ఎండీఏ నుంచి ఎఫ్సీడీఏకు.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ (fourth city) అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాలోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త అనుమతులు, ఆమోదాలను నిలిపివేయడం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూ యజమానులలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో అథారిటీ ఏర్పాటు వేగంగా జరిగినా.. రెండు నెలల పాటు కార్యకలాపాల నిర్వహణ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో స్థిరాస్తి ప్రాజెక్ట్లు, అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడింది.మార్చి వరకూ ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో భవనాలు, లేఔట్ల అనుమతులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ (హెచ్ఎండీఏ), స్థానిక సంస్థలు మంజూరు చేశాయి. తాజాగా ప్రభుత్వం అధికారాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఎఫ్సీడీఏ పరిధిలో లేఔట్లు, నిర్మాణ అనుమతుల అధికారాలను హెచ్ఎండీఏ (HDMA) నుంచి ఎఫ్సీడీఏ కమిషనర్కు బదిలీ చేశారు. దీంతో శ్రీశైలం హైవే వెంబడి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి వీలు కలగనుంది.ఫ్యూచర్ సిటీ పేరు మార్పు? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీసు స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పేరు మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలలో సీఎం తన ప్రసంగాలలో దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)గా ప్రకటించారు. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీ విస్తీర్ణం: 765.28 చ.మీ ఎకరాలు: 2,01,318 జనాభా: 1,31,733చదవండి: హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే -
హైదరాబాద్తో అనుబంధం పెంచుకున్న మిస్ వరల్డ్ తారలు
గ్లోబల్ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు.. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం, విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నగరానికి వచి్చన విషయం విధితమే. ఈ ప్రయాణంలో అందాల తారలు నగరానికి ముగ్దులైపోతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు.. కానీ ఈ మిస్ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. ఈ నేపథ్యంలో పలువురు మిస్వరల్డ్ పోటీదారులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు.. బెల్జియం చాక్లెట్లు మావే.. వచి్చనప్పటి నుంచి చూస్తున్నా.. ఎంతో ఆతీ్మయత, ప్రేమ నింపుకున్న మనుషులు మీరంతా..?! నాకు చాలా సంతోషంగా అనిపించింది. అధునాతన జీవన విధానం బాగా నచ్చింది. దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోంది. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించాను.. ఎంత అందమైన నగరమో. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను చూశాను. ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక మా దేశమే. హైదరాబాద్లో షాపింగ్ చేయడం మరచిపోలేని అనుభూతి. – కారెన్ జాన్సెన్, మిస్ బెల్జియంఅమ్మా నాన్నలను తీసుకొస్తా.. ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్ వరల్డ్ బృందంతో పాటు అవన్నీ సందర్శించాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడటానికి మళ్లీ హైదరాబాద్ వస్తా. వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నా ఫేవరెట్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరింది. నగరం చూట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచి్చంది. – ఎమ్మా మోరిసన్, మిస్ కెనెడామరో ఇల్లులా అనిపించింది.. భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ తారసపడ్డాయి. ఈ వైవిధ్యాన్ని చూడటానికి భారత్ మొత్తం తిరగాల్సిన పనిలేదు. కేవలం హైదరాబాద్ వస్తే చాలు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాక్ వెళితే మరోలా.., ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్కతా (బెంగాల్) వెళితే మా బంగ్లాదేశ్ మూలాలు కనిపిస్తాయి. ఇవన్నీ హైదరాబాద్లో చూశా. ఇది ఒక మినీ ఇండియా. నాకైతే హైదరాబాద్ మరో ఇల్లులా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మీయ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. నాకు నచి్చన స్పైసీ ఫుడ్ లభిస్తుంది. వారసత్వ వంటకాలు బాగున్నాయి. నేను తిన్న కొబ్బరి చట్నీ అయితే సూపర్బ్. – అక్లిమా అతికా కొనికా, మిస్ బంగ్లాదేశ్అమ్మాయిలకు అనువైన నగరం.. ఇక్కడి అమ్మాయిలను చూస్తే సంతోషంగా ఉంది. వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. మా దేశం జింబాబ్వే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం.. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్ల డిజైనింగ్ ఇక్కడ చూసి సంతోషం అనిపించింది. ఒక మోడల్గా గర్వపడుతున్నా. విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెడ్గా మారుతోంది. మేమంతా వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలుగా మాకు వేర్వేరు నమ్మకాలున్నాయి. కానీ ఇక్కడి సంస్కృతిక సమ్మేళనం, వైవిధ్యం ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమాంతర వ్యవస్థ ఉండటం అద్భుతం. రంగు, రూపం వంటి అంశాలతో భిన్నంగా ఉన్న స్త్రీలను ఈ వైవిధ్యం విజేతను చేస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. –కోర్ట్నీ జాంగ్వే, మిస్ జింబాబ్వే మొదటి సారి పానీ పూరీ తిన్నా.. వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పానీ పూరీ గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆ్రస్టేలియా వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్ వచ్చాకే పానీ పూరీ మొదటి సారి తిన్నా. వీటి రుచిని మాటల్లో చెప్పలేను. మొదట్లో వీటిని సరిగా తినలేకపోయాను. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీపూరీ ఎలా తినాలో చూపించింది.. అప్పటి నుండి తినడం అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే మొదట పానీపూరీనే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఆతీ్మయంగా పలుకరిస్తారు. నేను బసచేసే హోటల్ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపిస్తోంది. చారి్మనార్ వీధుల్లో కొన్న వస్తువులు వియాత్నాం తీసుకెళతాను. ఎయిర్పోర్ట్లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం నాకెంతో నచి్చంది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. – హూన్ త్రాన్ నీ, మిస్ వియాత్నాం -
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరోస్థలాల కొరతే కారణం.. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం,అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
తెలంగాణలో ‘తృణధాన్య పరిశోధన సంస్థ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్తగా మూడు కేంద్ర సంస్థలు మంజూరయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’నుకేంద్ర వ్యవసాయ శాఖ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇప్పటికే ఐసీఏఆర్, ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్పై పరిశోధనలు జరుగుతున్నాయని, వీటిని మరింత విస్తృతం చేసే దిశగా ఈ సంస్థ తోడ్పడుతుందని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫామ్లు, ట్రైనింగ్ రూమ్లు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఉంటాయని వివరించారు. అలాగే జీనోమ్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వికసిత్ భారత్ కింద రూ.60 వేల కోట్లతో ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం హైదరాబాద్తో పాటు భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లుథియానాలో ‘ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్’సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‘సంస్థను రూ.300 కోట్లతో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చందని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలి.. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నట్టు కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీటలు పడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలా మారిందని అన్నారు. కుటుంబ పార్టీలు అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో డాడీ–డాటర్ లేఖ ఒక డ్రామా అని కొట్టిపారేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ’ట్రిపుల్ ఆర్ ట్యాక్స్’ పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, అంతకంటే ఎక్కువ సేకరించినా పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని హామీ ఇచ్చారు. -
ట్రక్స్అప్ ఆధ్వర్యలో ఉచిత కంటి వైద్య శిబిరం
ట్రక్స్అప్ హైదరాబాద్లో పూర్తి స్థాయి డిజటల్ సేవల తోపాటు ట్రక్కర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఈ మేరకు గురుగ్రామ్కు చెందిన ఎఫ్టీ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ట్రక్స్అప్ మే 21, 2025న హైదరాబాద్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు శ్రీ పి. శ్రీనివాస్ నేతృత్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. భారతీయ రవాణా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యం తోపాటు చిన్న ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్పోర్టర్లకు, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించే దిశగా ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలతో భారతదేశ లాజిస్టిక్స్ వెన్నెముక అయిన ట్రక్కర్ల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ట్రక్స్అప్ నిబద్దతను నొక్కి చెబుతోంది. టెక్నాలజీ పరంగానే కాకుండా వాహనాలు నడిపే వ్యక్తుల జీవితాలను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టడం అనేది అభినందించదగ్గ విషయం అని హైదరాబాద్ లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు పి. శ్రీనివాస్ అన్నారు. అలాగే ఈ కంటి వైద్య శిబిరం ట్రక్కర్ల శ్రేయస్సు, భద్రత పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబించిందని ట్రక్స్హబ్ని కొనియాడారు. కాగా, ఈ ట్రక్స్ హబ్ భారతదేశపు విశ్వసనీయ ట్రక్ మార్కెట్ ప్లేస్ మాత్రమే గాక వాణిజ్య వాహనాల కొనుగోలు, అమ్మకం, మార్పిడిని సులభతరం చేసే ప్రత్యేక వేదిక. (చదవండి: టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్.. ) -
జై హనుమాన్, వాడవాడలా హనుమజ్జయంతి వేడుకలు
చంపాపేట: చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ లావణ్య పర్యవేక్షణలో సింధూర అభిషేకం, ఆకుపూజ, అర్యనలు తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మన్సూరాబాద్లో.. మన్సూరాబాద్: మన్సూరాబాద్లో పలు ప్రాంతాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్నగర్లో.. నాగోలు: హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేట డివిజన్ మోహన్నగర్లో హనుమాన్ యువసేన అధ్యక్షుడు యశ్పాల్గౌడ్ ఆధ్వర్యంలో హోమం, హనుమంతుడికి అభిõÙకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మధుసూదన్రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నాయకులు భరత్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, మహిపాల్ రెడ్డి, బొక్కబాల్ రెడ్డి, లింగాల నాగేశ్వరరావు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్సదన్, సైదాబాద్ డివిజన్లలో.. సైదాబాద్: ఐఎస్సదన్, సైదాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ఆలయాలు ఆధ్యాతి్మక శోభతో వెల్లివిరిసాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సైదాబాద్ శంకేశ్వరబజార్లోని శివాలయంలో నిర్వహించిన హోమంలో ఐఎస్సదన్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు జంగం శ్వేతామధుకర్రెడ్డి పాల్గొన్నారు. సైదాబాద్ పూజలబస్తీలోని శ్రీశివాంజనేయ స్వామి దేవాలయంలో సుభాష్చందర్జీ పూజల్లో పాల్గొన్నారు. రామకృష్ణపురం డివిజన్లో.. దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆర్కేపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ దేప సురేఖ భాస్కర్రెడ్డి పాల్గొని మాలధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, పున్న నిర్మల గణేష్ బండి మధుసూదన్ రావు, తలాటి రమేష్ నేత, సురేష్ పాల్గొన్నారు. ఘనంగా హనుమాన్ జయంతి గోల్కొండ: హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. షేక్పేట్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా గోల్కొండ రిసాలబజార్లోని హనుమాన్ ఆలయంలో మహంకాళి ఆలయ పూజారి బి.సురేష్చారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి నిర్వహించారు. పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన... చాంద్రాయణగుట్ట: రాజన్నబావి ప్రాంతంలోని భవానీ శంకర ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గురువారం 21 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సర్వధర్మ సనాతన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్టించారు. శ్రీమఠం నరసింహాచార్య కాకునూరి రవి నారాయణ శర్మ, శ్రీ కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారికి వాయుస్తుతి పునశ్చరణతో అభిషేకం, 108 కలశాలతో పంచుముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం, అష్టోత్తర శతనామావళి, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె.వెంకటేష్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షుడు మధుసూదన్ రావు, ఫ్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజు ముదిరాజ్, మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా తమలపాకు పూజ.. హనుమాన్ జయంతి సందర్భంగా లాల్దర్వాజా పూల్బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకట మోచన హనుమాన్ స్వామికి అభిషేకం తమలపాకు పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాశెట్టి లెనిన్బాబు దంపతులు, ట్రస్టీ వెంకటేశ్వర రావు, ప్రధాన అర్చకులు మోహనాచార్యులుతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోషామహల్లో.. అబిడ్స్: హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గుప్తా పాల్గొని పూజలు చేశారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గోషామహల్, జాంబాగ్, ఆగాపురా, ఆసిఫ్నగర్, బేగంబజార్, ధూల్పేట్ తదితర ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
Hanuman Jayanti 2025 భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
రాయదుర్గం: హనుమంతుడి జయంతిని ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీపీఆర్ఏ క్వార్టర్స్లోని రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి, గచ్చిబౌలోని శివసాయిక్షేత్రంలో ఆంజనేయస్వామికి, ఇందిరానగర్లోని ఇంటర్నేషనల్ శ్రీహనుమాన్ ధామ్ ఆశ్రమ్ ఆలయంలో, మధురానగర్, ఖాజాగూడ, నానక్రాం గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, గోపన్పల్లి, టెలికామ్నగర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిõÙకాలు, అర్చనలు, ఆకుపూజ, ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలావుండగా గచ్చిబౌలిలోని శివసాయిక్షేత్రంలో హనుమాన్ హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ, వడమాలతో అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మియాపూర్లో.. మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణనగర్కాలనీ, మియాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గాం«దీ, కార్పొరేటర్ శ్రీకాంత్ను సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలో.. చందానగర్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్యాదవ్, సాంబశివారావు, బృందరావు, అంకరావు, సత్యం, రామకృష్ణ, వెంకటేష్, రవి, అప్పలరాజు, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగిపై దాడి..
సాక్షి, బంజారాహిల్స్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే ఉద్యోగిపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు ఉద్యోగిపై అక్కడి మాజీ ఉద్యోగి తన స్నేహితుడితో కలిసి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలోని టీడీపీ కార్యాలయంలో బొడ్డుపల్లి ప్రశాంత్ వీడియో ఎడిటర్గా పనిచేస్తున్నాడు. గతంలో అదే కార్యాలయంలో ప్రవీణ్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అక్కడి వెళ్లిపోయిన తర్వాత ప్రవీణ్ తనతో పాటు పనిచేసిన ఓ యువతి ఫోన్ నెంబర్ తన స్నేహితుడు శశికిరణ్కు ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా శశికిరణ్ సదరు యువతికి మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయం ఆమె.. ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం అతను శశికిరణ్కు ఫోన్ చేసి అతడిని నిలదీశాడు. ఇకపై ఆమెకు ఫోన్ చేయవద్దని హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న శశికిరణ్ తన స్నేహితుడు ప్రవీణ్తో కలిసి అదే రోజు రాత్రి మాట్లాడదామని ప్రశాంత్ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్క గల్లీలోకి పిలిపించాడు. ప్రశాంత్ అక్కడికి రావడంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో శశికిరణ్, ప్రవీణ్ అతడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడమేగాక చంపేస్తామంటూ బెదిరించారు. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్లో ‘థగ్ లైఫ్’ చిత్రం మీడియా మీట్ (ఫొటోలు)
-
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్కు తరలించారు. -
కొత్త మెట్రో లైన్లు.. ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో లైన్లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ సిద్ధమయ్యాయని.. ఫేజ్-2పై ఎటువంటి సందిగ్ధత లేదని స్పష్టంర చేశారు.మెట్రో రెండో దశ డీపీఆర్లు పూర్తి స్థాయిలో సిద్ధం. ప్రస్తుతం డీపీఆర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం వరకు గోప్యత ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
ప్లాస్టిక్ కాలుష్యం అంతం : చిన్నారుల పెయింటింగ్స్ అద్భుతం
సనత్నగర్: చిన్నారులు అద్భుత చిత్తరువులతో అమూల్య సందేశాన్ని అందించారు. ప్లాస్టిక్ భూతంతో పర్యావరణాన్ని మనమే హరించేస్తున్నామంటూ ఆ చిన్ని మస్తిష్కాలు హెచ్చరించాయి. ఇకనైనా మేల్కోకపోతే భవిష్యత్తు తరాలు ప్రశ్నార్థకం అంటూ ఆ చిట్టి బుర్రలు గీసిన చిత్రాలు స్ఫూర్తిని నింపాయి. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటూ వెళ్తుండటం మానవ మనుగడకు శ్రేయస్కరం కాదంటూ బొమ్మలతో మేల్కొల్పే ప్రయత్నం చేశారు. చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీజీపీసీబీ(తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో సనత్నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు జవహర్ బాలభవన్లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి కదిలి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే అంశంపై ఆలోచింపజేసే చిత్రాలను గీశారు. దాదాపు 250 మంది విద్యార్థులు పర్యావరణ సంబంధిత అంశాలపై అందమైన చిత్రాలను గీసి పెయింటింగ్ వేశారు. ముఖ్యంగా భూమి, నీరు, గాలి, ప్లాస్టిక్ కాలుష్యం, ఎనర్జీ సేవింగ్, నీటి సంరక్షణ, మ్కొలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు, కాలుష్యం నుంచి భూమిని రక్షించే అనేక అంశాలపై చిత్రాలను గీశారు. విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు వచ్చేనెల 5న పర్యావరణ దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ ధర్మేందర్, డ్రాయింగ్ మాస్టర్లు నరేందర్, రాములు, మల్లేశం, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్ -
ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!
నగరం కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. విభిన్న రుచుల సంగమం. శతాబ్దాలుగా బిర్యానీ పరిమళాలతో పేరుగాంచిన మన నగరం, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. బిర్యానీ, హలీం వంటి క్లాసిక్ వంటకాలు ఎప్పటికీ చిరపరిచితమైనవే అయినా, ఇప్పుడు కొత్త తరహా ఫ్యూజన్ ఫుడ్, ఇంటర్నేషనల్ వంటకాలతో నగర వీధులు ఘుమఘుమలకు వేదికలుగా మారిపోయాయి. ఫుడ్ అంటే కేవలం తినేది కాదు.. ఇప్పుడు అది అనుభవించే జీవనశైలి భాగంగా మారింది. దీనికి ఫుడ్ బ్లాగింగ్ మరింత ప్రాచుర్యాన్ని కలి్పస్తోంది. విదేశీ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్టూర్లో భాగంగా నగరంలో సందడి చేస్తున్నారు. వారి వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్గా మారుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోలైఫ్స్టైల్ ఫుడ్కి కొత్త నిర్వచనం.. ఇప్పుడు ఫుడ్ తినడం కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఫ్రెండ్స్తో రాత్రివేళ స్ట్రీట్ టూర్కు వెళ్లడం, కొత్త స్టాల్ కనుగొనడం, అందులో ప్రత్యేకమైన ఐటెం రుచి చూసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇవన్నీ ఒక లైఫ్స్టైల్గా మారిపోయాయి. ‘నేడు ఏ స్ట్రీట్ ఐటెం ట్రై చేయాలి?’ అనే ప్రశ్న, ప్రతీ ఫుడ్ లవర్ డైలీ రొటీన్లో భాగం అయ్యింది. ఇప్పటి యువత కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. వీధుల్లో అందుబాటులో ఉన్న కొత్త రుచుల కోసం క్యూ కడుతున్నారు. చిన్న చిన్న బండ్లపై కనిపించే పైనాపిల్ డోసా, బబీ బాట్స్, ఫైర్ పానీపూరీ, ఐస్ మలై టిండి వంటి ప్రయోగాత్మక ఐటెమ్స్ ఇప్పుడు హాట్ ట్రెండ్స్. సికింద్రాబాద్ మటన్ కీమా దోసా, హిమాయత్నగర్ తిబ్బటన్ మోమోస్, గచ్చిబౌలి కొరియన్ స్ట్రీట్ఫుడ్ – ఇవన్నీ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదాఫుడ్ బ్లాగింగ్ ట్రెండ్.. ఈ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఫుడ్ బ్లాగింగ్. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వేదికలపై హైదరాబాదీ యువత ఫుడ్ రీల్స్, రివ్యూలతో వైరల్ కంటెంట్ సృష్టిస్తున్నారు. బండి వద్ద కూర్చొని తినే ఒక చిన్న వీడియో లక్షల వ్యూస్ను తెచ్చిపెడుతోంది. ఫుడ్ బ్లాగర్ల ప్రసారం వల్ల చిన్న స్టాల్స్కు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడం విశేషం. ‘‘అవి కేవలం బండ్లు కావు, అవి డ్రీమ్ టేస్టీ హబ్స్‘గా మారుతున్నాయి. ఎక్కడికైనా కొత్తగా ఓ వెరైటీ వంటకం కనిపిస్తే క్యూ కడుతున్నారు. ఇలా బ్లాగర్ల దృష్టిలో పడితే చిన్న ఫుడ్ స్టాల్స్కు కూడా గుర్తింపు వస్తోంది.హైదరాబాదీ ఫుడ్ అదుర్స్.. ఈమధ్య యూఎస్ఏకి చెందిన క్రిష్ లూయిస్ ఫుడ్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి స్పైసీ ఫుడ్, స్వీట్లు, పరోటా, చికెన్–65, రోడ్సైడ్ మిర్చి తనకు ఎంతో నచ్చాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కొంతమంది విదేశీ ఫుడ్ వ్లాగర్లు హైదరాబాద్కు వచ్చి ఇక్కడి వీధి వంటకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పానీపూరీ బండ్ల దగ్గర నిలబడి, ‘ది బెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్!’ అంటూ ఇంగ్లిష్లో చెప్పే మాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాయి. వీధి వంటల అద్భుత రుచితో ఇక్కడి ఆతిథ్యం, సరదా వాతావరణం వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో విదేశీయుల కళ్లలో కూడా నగరం ఒక ఫుడ్ డెస్టినేషన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఫుడ్ వ్లాగర్లు హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్ను మరింతగా ప్రచారం చేస్తున్నారు. ‘ఇంత అతంటిక్ ఫుడ్ వీధుల్లో దొరుకుతుందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఫుడ్ క్రియేటివిటీతో.. హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక కట్టడాల నగరమే కాదు. ఇది రుచుల పండుగలా మారింది. స్ట్రీట్ఫుడ్ ద్వారా స్థానికులు తమ క్రియేటివిటీని చూపిస్తూ, జీవనశైలిని కొత్త కోణంలో నిర్వచిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్లు, ఫుడ్ ప్రియులు, ప్రయాణికులు అందరూ కలిసి ఈ నగరాన్ని ఒక రుచుల ప్రయాణ కేంద్రంగా మార్చేశారు. -
హైరేంజ్లో హైదరాబాద్
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్ స్పేస్కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది. -
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
-
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా మరికొన్ని యూనిట్లకు జూన్ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే. అయితే.. రేషన్ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం.. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది: టీ–హబ్లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు. వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. ⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు. ⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంటుంది. ⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు. ⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. -
RRR దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ రంగానికి సరికొత్త దిశా నిర్దేశం చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా సమగ్ర బిల్డింగ్ బైలాస్ (Building Bye Laws) రూపకల్పనకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పలు దేశ విదేశాలకు చెందిన మెట్రోపాలిటన్ నగరాల్లోని బిల్డింగ్ బైలాస్పై అధ్యయనం చేసి మహా నగర అవసరాలకు అనుగుణంగా బైలాస్ను (నియమ, నిబంధనలు) రూపకల్పన చేసేందుకు ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను స్వీకరించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.మహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్రోడ్డు (Regional Ring Road) వరకు మౌలిక, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ, పచ్చదనం పెంపు, నీటివనరుల సంరక్షణ తదితర అంశాలపై మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణాలకు శాస్త్రీయమైన బైలాస్ను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేపట్టింది. దీనివల్ల నిర్మాణ సంస్థలకు అనుమతులను అందజేయడంలో అనవసరమైన జాప్యాన్ని నివారించడమే కాకుండా అడ్డదిడ్డ నిర్మాణాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆకాశ హర్మ్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు..నగరంలో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. గత పదేళ్లుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. ప్రస్తుతం 57 నుంచి 65 అంతస్తుల హైరైజ్ భవనాలు నిర్మాణమవుతున్నాయి. అదేక్రమంలో విశాలమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు విస్తరిస్తున్నాయి. కానీ కచ్చితమైన నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఒక భవనానికి మరో భవనానికి ఒకేలా నిబంధనలు అమలు కావడం లేదు. మరోవైపు డీవియేషన్స్ సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్ఎండీఏ (HMDA) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి డీవియేషన్లను (ఉల్లంఘనలను) గుర్తించినపప్పటికీ వాటిని సవరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఈ ఉల్లంఘనల వల్ల అనుమతులను ఇవ్వడంలో కూడా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్డింగ్ బైలాస్ రూపకల్పనపై దృష్టి సారించారు. వివిధ నగరాలపై అధ్యయనం.. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బిల్డింగ్ బైలాస్ అమల్లో ఉన్నాయి. నివాస భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి భవనాలకు ప్రామాణికమైన నిబంధనలను పాటిస్తున్నారు. భవనాల నిర్మాణం, భద్రత, పర్యావరణ పరిరక్షణ,నగర అభివృద్ధి వంటి అంశాలను లక్ష్యాలుగా చేసుకొని ఈ నిబంధనలు రూపొందించారు.ఇందుకోసం ముంబయిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), ఢిల్లీలో ఫ్లోర్ రేషియో ఏరియా (ఎఫ్ఏఆర్) వంటి ప్రామాణికమైన పద్ధతులను అమలు చేస్తున్నారు. నిర్మాణ వైశాల్యం, ప్లాట్ వైశాల్యం ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: హైదరాబాద్లో ఇక పక్కాగా 'వరద' నివారణ ఒక్కో ప్రాంతంలో ఎఫ్ఎస్ఐ ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ ముంబైలో ఎఫ్ఎస్ఐ 1.33 శాతం ఉంటే, సబర్బన్ ప్రాంతాల్లో 2.7 శాతం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 5.32 శాతం చొప్పున ఉంది. ఢిల్లీలోనూ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎఫ్ఏఆర్ను నిర్ణయించారు. ఇదే తరహాలో హైదరాబాద్లో నిర్దిష్టమైన ప్రమాణాలు రూపొందించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. భవనం చుట్టూ ఖాళీ స్థలం (సెట్బ్యాక్), భవనం ఎత్తు, ఓపెన్ స్పేస్ ఏరియా వంటివి కూడా కచ్చితమైన ప్రమాణాలతో రూపొందించాలి. అలాగే.. జపాన్, అమెరికా, యూరప్ దేశాల్లోని బిల్డింగ్ బైలాస్పైనా అధ్యయనం చేసి ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాల కంటే మరింత మెరుగైన ప్రమాణాలను, నియమ నిబంధనలను రూపొందించేందుకు కసరత్తు జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.తుది దశలో మాస్టర్ప్లాన్.. రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ సమగ్ర మాస్టర్ప్లాన్ రూపకల్పన చేపట్టింది. ముసాయిదా ప్రణాళికలను త్వరలో ప్రకటించనున్నారు. మాస్టర్ప్లాన్ ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ముసాయిదా అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్నగర్, కార్వాన్, మలక్పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్నగర్లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్మెంట్స్లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..) -
Ananya Nagalla : అలరించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!గ్లోబల్ డిజైన్స్.. వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్కు అనుగుణంగా డిజైన్స్ను రూపొందిస్తున్నాం. – దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు -
Hyderabad: ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ రాజ్భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్భవన్లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. -
తెలంగాణ రాజ్భవన్లో చోరీ.. హార్డ్ డిస్క్లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్లను అపహరించారు.14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు. -
విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహా్మన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా సిరాజ్, సమీర్లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్స్టా్రగామ్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్లో సమీర్ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్ అప్పగించాడు. యూట్యూబ్లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ అమెజాన్లో ఆర్డర్ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్ గురించి ఆరా.. సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్న సమీ ర్.. బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్స్టా్రగామ్ గ్రూప్ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్కు టచ్లో ఉంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్తో కాంటాక్ట్లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. -
Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్గా, స్టోర్ మేనేజర్గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే! -
Telangana Police: తెలంగాణలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్హౌస్ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్హౌస్ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. -
గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీలో గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. భవన భద్రత , విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలపై హెచ్ఆర్సీ స్పందించింది. ఘటనలో 17 మంది దుర్మరణం కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
దారుణం, ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన యువతి.. పోలీసుల అదుపులో నిందితురాలు
సాక్షి,హైదరాబాద్: అమీన్పూర్లో దారుణం జరిగింది. సోమవారం అమీర్పూర్లో మహేశ్వరీ అనే యువతి కారు నేర్చుకుంటూ చిన్నారులపైకి ఎక్కించింది. ఈ దుర్ఘటనలో పదేళ్ల మణిధర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏకవాణి మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గుల్జార్హౌస్ ప్రమాదం.. అడుగడుగునా నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్/చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ‘మోదీ పెరల్స్, శ్రీకృష్ణ పెరల్స్’సహా మొత్తం తొమ్మిది దుకాణాలు, నివాస గృహాలతో కూడిన ఈ భవనంలో అడుగడుగునా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు లేకపోవటం వల్లనే నిప్పంటుకున్న విషయాన్ని అందులోనివారు సకాలంలో గుర్తించలేకపోయారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి నివాస గృహాలతో కూడిన మార్కెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో వాటి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. నిబంధనల ప్రకారం ఇలాంటి వాణిజ్య, నివాస సముదాయాల్లో ఉండాల్సిన వ్యవస్థలు, అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిన భవనం వద్ద ఉన్న పరిస్థితి ఇదీ..అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ వన్గా, రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ టూ విధానంలో విడివిడిగా నిర్మితమైంది. మొత్తం భవన విస్తీర్ణంలో 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ఖాళీ స్థలం మాట అటుంచితే కనీసం రాకపోకలు సాగించడానికి అవసరమైన స్థాయిలో దారి, మెట్లు కూడా లేవు. భవనం చుట్టూ అగ్నిమాపక శకటాలు స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ముందు వైపు ఉన్న ప్రధాన రహదారి తప్ప మరెక్కడికీ ఫైర్ ఇంజిన్ కాదు కదా.. ద్విచక్ర వాహనం కూడా పోలేని విధంగా ఉంది.ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపలి వైపు కూడా మెట్లు ఉండాలి. ఈ భవనానికి ప్రధానంగా ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉంది. మరొకటి ఉన్నప్పటికీ అది కేవలం ఒక అడుగు వెడల్పుతో ఉంది. ఇవి తప్ప మరో మార్గం లేదు. మంటలార్పేందుకు భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. ఈ భవనంలో కనీసం ఇసుక బక్కెట్లు కూడా లేవు. భవనంలో విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఇక్కడ ఈ రెండూ కనిపించట్లేదు.ఇక్కడ అనుమతులు ఉండవు హైదరాబాద్లోని పాతబస్తీలో భవన నిర్మాణాల్లో చాలావరకు భద్రతా చర్యలు పాటించరనే అపవాదు ఉంది. 10–20 గజాల్లో అగ్గిపెట్టె లాంటి గృహ నిర్మాణాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ అనుమతులు అసలే ఉండవు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనాలు పెళ్లేందుకు దారులు కూడా సక్రమంగా ఉండవు. దీంతో శకటాలను ప్రధాన రోడ్లపైనే దూరంగా నిలిపి సందుల్లోకి పైపులతో నీటిని తరలించాల్సి వస్తోంది. 10–20 గజాల్లో ఐదారు అంతస్తుల వరకు భవనాలను నిర్మించటంతోపాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లను సైతం నిర్మించి వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు.గుల్జార్ హౌస్, పటేల్ మార్కెట్, ఘాన్సీ బజార్, కోకర్ వాడి, మీరాలం మండి, పురానీ హవేలి, కోట్లాఅలీజా, రైన్ బజార్, డబీర్ పురా, తలాబ్ కట్ట, భవానీనగర్, గంగానగర్, యశ్రబ్ నగర్, నర్కీపూర్బాగ్, సుల్తాన్ షాహి, అల్ జుబేర్ కాలనీ, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బహదూర్పురా, కోకాకి తట్టి, దూద్ బౌలి, పురానాపూల్ (Puranapool) తదితర ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల వరకే అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుంటోంది. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.భవనం పటిష్టతను పరీక్షించాలన్న ఎంపీ అసద్సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కార ణాలు, ఇతర వివరాలు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిని అడిగి తెలుసు కున్నారు. ఆ భవనం నివాస యోగ్యమా, కాదా? అంటూ ప్రశ్నించారు. భవనం పటిష్టతను పరీక్షించాలని సూచించారు. ఆ కుటుంబీకులు ఎవరైనా మళ్లీ అదే భవనంలో ఉండటానికి ప్రయత్నిస్తే, జరగరానిది జరిగితే భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని నాగిరెడ్డి చెప్పారు. చదవండి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే.. ఇలా చేస్తే సేఫ్.. -
‘అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి’
సాక్షి,హైదరాబాద్: అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి హితువు పలికారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దురదృష్టకరం.హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం.నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని’ అన్నారు. -
సైబర్ మోసాలు : చదువుకున్నవారే ఎక్కువగా..!
హాస్టళ్లలో దొంగతనాలు ఎక్కువ ప్రధాన కూడళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలుమాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ మాదాపూర్: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి.విజయ్నాయక్ తెలిపారు. సోషల్ మీడియా, ఫెడెక్స్ మోసాలు, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యాప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినపుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. ఈ నేరాలపై ప్రధాన కూడళ్లలో, కళాశాలల్లో, జన సమ్మర్ధం ఉన్నచోట వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. మాదాపూర్ డిటెక్టివ్ టీంలో 10 మంది ఉన్నారు. సైబర్ క్రైంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవారు ఇద్దరున్నారు. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.ఇదీ చదవండి: టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో ప్రశ్న: మాదాపూర్ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇన్స్పెక్టర్: సైబర్ నేరాలతో పాటు ఎక్కువగా హాస్టళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల రూంలలోకి చొరబడి ల్యాప్టాప్స్, ఫోన్స్, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్నారు. 24 గంటల పాటు సెక్యూరిటీని నియమించాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారు తప్పని సరిగా ఐడీ కార్డులను చూపాలనే నిబంధన ఉండాలి. అప్పుడే దొంగతనాలను అరికట్టవచ్చు. ప్ర: ఫెడెక్స్ మోసం గురించి? జ: గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఎయిర్పోర్టు నుంచి పార్సిల్ వచి్చందని అందులో డ్రగ్స్ ఉన్నాయని.. మీరు ఫలానా పోలీస్స్టేషన్కు రావాలని భయపెడతారు. కొంత సమయం తరువాత మీరు డబ్బు చెల్లిస్తే కేసు కొట్టివేస్తామని చెప్పి వారివద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఫోన్లను స్విచ్చాఫ్ చేస్తారు. ఇలాంటి మోసాల బారిన విద్యావంతులేపడుతున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్ర: ట్రాన్స్జెండర్స్, సోషల్మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? జ: ఖాళీ ప్రదేశాల వద్ద, ప్రధాన కూడళ్లలో ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. వారి వద్ద ఆగవద్దు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కి డయల్ చేయాలి. అమ్మాయి, అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు వారు విడిపోయిన తరువాత మారి్ఫంగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ప్ర: బెట్టింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలు ఏమిటి..జ: ప్రస్తుతం బెట్టింగ్కి అలవాటు పడ్డారంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. చిన్న చిన్న బెట్టింగ్లు కట్టినప్పుడు తిరిగి డబ్బును చెల్లించి ఆసక్తి కలిగిస్తారు. అలవాటు అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు పోతాయి. ఇలాంటి అలవాట్లతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. నష్టపోయాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్బర్డ్స్ వీడియో వైరల్ మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే..
నిర్దేశిత లోడు కంటే ఎక్కువ కరెంట్ను వినియోగించడం.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంతర్గత కేబుళ్లను ఇప్పటికీ మార్చక పోవడం.. కేబుల్ సామర్థ్యానికి మించి ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం.. వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండటం.. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తుతుండటం.. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ఒవెన్లు, ఐరన్ బాక్సులు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు రోజంతా ఆన్లోనే ఉంచడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించడానికి ఇవే కారణాలు. వీటివల్లనే కేబుళ్లు హీటెక్కి, మీటర్, జాయింట్ల వద్ద నిప్పు రవ్వలు (స్పార్క్లు) చెలరేగుతున్నాయి. ఇలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల ఫలితంగా మాల్స్, దుకాణాలు, ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. కొన్ని ఘటనల్లో అగ్నికీలల్లో చిక్కు కోవడం, పొగతో ఊపిరాడకపోవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హైదరాబాద్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు లైన్లు, వైర్లు, ప్లగ్ లు, ఎంసీబీలు, ఎర్త్రాడ్ల పని తీరును పరిశీలించి, దెబ్బతిన్న కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవాల్సి ఉన్నా వాణిజ్య, గృహ వినియోగదా రులు పట్టించుకోవడం లేదు. పాతబస్తీలోని పురాతన భవనాల్లోనే కాకుండా, కొత్తగా సీఈఐజీ అనుమతి పొందిన హైరైజ్ భవనాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు (Short Circuit) జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీ అయినా.. కొత్త హైరైజ్లైనాపాతబస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోనే కాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్రాంగూడల్లో కొత్తగా నిర్మించే హైరైజ్ బిల్డింగ్స్లోనూ విద్యుత్ లైన్లు సరిగా ఉండటం లేదు. భవిష్యత్తు అవసరాల మేరకు లోడు ఎంపిక మొదలు..లైన్ల ఏర్పాటు వరకు అన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆలోచనకు, అవసరాలకు భిన్నంగా ఆ తర్వాత ఇంట్లోకి అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో తక్కువ సామర్థ్యంతో లైన్లు, కేబుళ్లు వేయడం జరుగుతోంది. నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కనీస అనుభవం, అర్హత లేని ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. వీరు భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలిక అవసరం కోసం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్లు, ఎంసీబీలు వాడుతున్నారు. కంటికి కన్పించే ప్లగ్లు, స్విచ్ బోర్డులు, లైట్లు మినహా గోడలు, స్లాబులో వాడే వైర్లు నాసిరకంగా ఉంటున్నాయి. సరైన ఎర్తింగ్ ఉండటం లేదు. మరోవైపు ఒకే ప్లగ్/ వైరు నుంచి మల్టిపుల్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఒకే సాకెట్ నుంచి ఒకటికి మించిన ఏసీ కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా సామర్థ్యానికి మించి ఏసీలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ఎక్కువగా వినియోగించడం వల్ల బలహీనంగా ఉన్న కేబుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. కేబుళ్ల జాయింట్ల వద్ద స్పార్క్లు చెలరేగుతున్నాయి.పేలుతున్న ఏసీ కంప్రెషర్లుఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించే ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. ప్రస్తుతం సాధారణ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి ఇందుకు దోహదపడుతోంది. ప్రతిఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగినట్టుగా తయారీ కంపెనీలతో పాటు పలు బ్యాంకులు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాయి. వాయిదా పద్ధతుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలాచోట్ల 60 నుంచి 100 గజాల స్థలంలోనూ ఐదారు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు కింద షాపులను ఏర్పాటు చేసి, పైన నివాసానికి వీలుగా చిన్న చిన్న గదులను నిర్మిస్తున్నారు. నివాసితులు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఏసీలూ వినియోగిస్తున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు ఏసీలు ఉంటున్నాయి. అయితే ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండటం లేదు. వైరింగ్ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి కరెంటు వాడటం, మండే ఎండల్లో రోజంతా ఏసీలు ఆన్లో ఉంటుండటం వల్ల కంప్రెషర్లు పేలిపోతున్నాయి.బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని..కిటికీ, డోర్ కర్టెన్లు, పరుపులు, దుస్తువులకు నిప్పు అంటుకుని వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు ఇరుకైన దారి ఉండటం, తలుపులకు తాళాలు వేసి ఉండటం, ఇతరత్రా కారణాలతో బయటకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మొన్న అఫ్జల్గంజ్లోని మూడంతస్తుల భవనం, తాజాగా చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్హౌస్, మైలార్దేవ్పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇలాంటి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది.ఇలా చేస్తే సేఫ్...⇒ బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలనే భవనాల్లో ఉపయోగించాలి. ⇒ విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే చేయించాలి. ⇒ అతుకుల తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరం. ⇒ విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్, ఓవెన్లను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలి. ⇒ అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న 3 పిన్ సాకెట్లను వాడాలి. ⇒ ల్యాప్టాప్, మొబైల్ చార్జింగ్ (Mobile Charging) బెడ్ దగ్గర పెట్టకూడదు. ⇒ విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే నీళ్లతో ఆర్పవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు. ⇒ వెంటనే విద్యుత్ను ఆఫ్చేసి, పొడి ఇసుకతో లేదా కార్బన్ డయాక్సైడ్ ఎక్ట్సింగ్విషర్తో మంటలను ఆర్పాలి.చదవండి: పాతబస్తీ ప్రమాదంలో విస్తుపొయే విషయాలు.. అక్రమ కనెక్షనే కారణమా?⇒ ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి ఏర్పాటు చేయాలి. ⇒ ప్రతి అంతస్తులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతపై సైన్ బోర్డులు ప్రదర్శించాలి. స్మోక్ అలారం (Smoke Alarm) ఏర్పాటు చేయడంతోపాటు ఏటా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ⇒ ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఉండాలి. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలి. ⇒ అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలి. లిఫ్టులకు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలి. ⇒ మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని, పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలి. ⇒ మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలి. -
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట. చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి. లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు. వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి. -
పాతబస్తీలో అంతులేని విషాదం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు.. ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక.. ఎటు వెళ్లాలో అర్థంకాక.. అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు.విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి.. ‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు. రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది! సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్సుఖ్నగర్లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్బాగ్లోని మొఘల్ కోర్ట్లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది. మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చార్మినార్తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. నిబంధనలు... వాస్తవాలు... 1. నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగ్నిమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు. అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగ్నిమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్లోనే ఉంది. వీటికి తోడు అగ్నిమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.పేరులోనే ఫైర్! సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం. పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది. శిక్షలు తక్కువే.. ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు.ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.ఏళ్లుగా నిరీక్షణ.. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగ్నిమాపక శాఖ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్లో అగ్నిమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
ట్యాంక్ బండ్పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్గంజ్లోని శాంతి ఫైర్ వర్క్స్లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్గంజ్లోని శాంతి ఫైర్ వర్క్స్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్మన్తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్ఘాట్లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ -
హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు
-
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. -
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సాక్షి, హైదరాబాద్/చార్మీనార్/దూద్బౌలి: అది హైదరాబాద్ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. అంతా బంధువులే... రాజస్తాన్కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ, దేవనాథ్ మోడీ, సునీల్ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్ హౌస్లోని చార్మీనార్ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్ మోడీ అత్తాపూర్, దేవనాథ్ మోడీ హిమాయత్ నగర్లో ఉంటున్నారు.గుల్జార్ హౌస్లోని దుకాణాల (జీ ప్లస్ వన్) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్లో ఉండే సునీల్ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్ హౌస్లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు. మీటర్ వద్ద మొదలైన మంటలు ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్పుర నుంచి మొదటి ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు. భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్ కేస్) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్ (చెక్క) పార్టీషన్తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. అపస్మారక స్థితిలో..సెల్ఫోన్ లైట్ వెలుగుతూ.. సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ లైట్ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్ పైకి వెళ్లే స్టెయిర్ కేస్కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రహ్లాద్ కుటుంబం అంతా మృత్యువాత ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్ మోడీ మరో సోదరుడైన బంకట్ మోడీ టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్ మోడీతో పాటు రాజేందర్ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. కిషన్రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్ జుల్పికర్ అలీ, అహ్మద్ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖపై కిషన్రెడ్డి ఫైర్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్ వచి్చందని, మొఘల్పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్ కేస్ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మృతులు వీరే: ప్రహ్లాద్ మోడీ (70), మున్ని (70), రాజేందర్ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాంచ్ (4), ఇరాజ్ (2), అరుషి (3), రిషబ్ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఇద్దూ (4). మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్హౌస్ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది. – మీర్ జాహెద్, గుల్జార్ హౌస్ వద్ద గాజుల వ్యాపారి -
తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు
-
పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు
-
తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
వారాంతంలో సరదా సరదాగా ఈ స్కిల్స్ నేర్చుకుందాం..!
వారం రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపేస్తున్న హైదరాబాద నగర ప్రజలు వారాంతంలో మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆకట్టుకోవడానికి వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీ, పెయింటింగ్స్, బేకింగ్, క్యాండిల్ తయారీ, రెసిన్ ఆర్ట్ తదితర రంగాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత సమయం కేటాయిస్తున్నారు. ప్రవేశ రుసుముగా కొంత నామమాత్రపు ఫీజు సైతం వసూలు చేస్తారు. కొన్ని చోట్ల నిర్వాహకులే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్షాప్లు నడుస్తాయి. మట్టి పాత్రల తయారీమట్టి పాతల్ర తయారీపై హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆదివారం వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలి హార్ట్కప్ కాఫీ, లాస్ట్ హౌస్ కాఫీ, హౌస్ ఆఫ్ గౌర్మెట్, తదతర ప్రాంతాల్లో లైవ్ వర్క్షాప్లు ప్రారంభమవుతాయి. మట్టితో మమేకం కావడం, ప్రకృతితో కలిసిపోవడం, ప్రశాంమైన వాతావరణంలో మట్టితో పాత్రలు తయారు చేయడం అనేది ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక్కో వ్యక్తికి గంట నుంచి 3 గంటల పాటు పాత్రలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. తయారు చేసిన కుండలు, ఇతర పాత్రలు ఏవైనా మన వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఇవి తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మట్టి, యంత్రాలు, అన్నీ నిర్వాహకులే సమకూర్చుతారు.కొవ్వొత్తుల తయారీలో శిక్షణజూబ్లీహిల్స్లోని మకావు కిచెన్ అండ్ బార్లో హేండ్ మేడ్ కొవ్వుత్తుల తయారీపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనకు నచి్చన డిజైన్, మోడల్స్లో కొవ్వుత్తులు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్షాప్ ఉంటుంది. రెసిన్ ఆర్ట్రంగులు కలపడం, కొత్త డిజైన్లకు అంకురార్పన చేయడం, ఆర్ట్తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అద్భుతమైన, మెస్మరైజింగ్ రెసిన్ ఆర్ట్ వర్క్షాప్ను మాకోబ్రూ వరల్డ్ కాఫీ బార్, అమోరోసో హైదరాబాద్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాలు కొనసాగుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేక్ తయారీపై.. నార్సింగిలోని మైథూస్ బ్రేవ్ పబ్ అండ్ కిచెన్ ఆధ్వర్యంలో కేక్ తయారీపై ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. తయారీ విధానంలో మెలుకువల నేర్చుకోవచ్చు. తదుపరిఇంటోనే కొత్త రుచులను పర్ఫెక్ట్గా సిద్ధంచేసుకునే కాని్ఫడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. (చదవండి: -
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్ (67)అభిషేక్ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్ (17)శీతల్ జైన్ (37)ఇరాజ్ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్అన్య మోదీపంకజ్ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్ప్రథమ్ అగర్వాల్ప్రాంశు అగర్వాల్. -
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
2000 హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పదమూడు నెలల వయసున్న సాకీ అనే రాయల్ బెంగాల్ జాతి ఆడపులిని కొందరు దుండగులు చంపేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటన 2000 అక్టోబర్ 5న జరిగింది. ఈ సంఘటనపై బహదూర్పుర పోలీస్స్టేషన్లో నమోదైన కేసు సీఐడీ వరకు వెళ్లింది. తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చింది. దీనిపై అనేక రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో పోలీసులు సాకీ హంతకుల సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ప్రకటించారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు కప్పు కాఫీతో యాదృచ్ఛికంగా కొలిక్కి వచ్చింది.మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సలావుద్దీన్ హైదరాబాద్కు వలసవచ్చి, రియాసత్నగర్లో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్గా పనిచేస్తూ, జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం చిన్న చిన్న చోరీలతో నేరజీవితం ప్రారంభించాడు. వీరప్పన్ స్టోరీలు విన్న ఇతడి కన్ను గంధపు చెక్కలపై పడింది. హైదరాబాద్లోని జూ పార్క్లో గంధపు చెట్లు ఉన్నట్లు తెలుసుకుని, వాటిని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వెన్నెల లేని చీకటి రాత్రుల్లో జూ పార్క్ ప్రహరీ గోడ దూకి లోపలకు వెళ్లేవాడు. అక్కడున్న గంధపు చెట్లను నరికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో అతడికి ‘హైదరాబాదీ వీరప్పన్’ అనే పేరు వచ్చింది. సలావుద్దీన్ ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్స్ కూడా చేసేవాడు. చోరీ సొత్తు పంపిణీ వివాదంలో ఒక సహచరుడిని హత్య చేసిన ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. గంధపు చెట్ల కోసం ఎప్పటిలాగే 2000 అక్టోబర్లో జూ పార్క్లోకి వెళ్లాలని భావించిన సలావుద్దీన్తో అతడి స్నేహితుడైన ఇస్మాయిల్ ఓ చాలెంజ్ చేశాడు. ‘జూలో ఉన్న పులిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆ పని చేసి చర్మం, గోళ్లు తేగలవా?’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో సలావుద్దీన్ అదే నెల 4 రాత్రి తన అనుచరులైన అహ్మద్, సమద్లతో కలసి జూపార్క్ వెనుక ఉన్న మీర్ఆలం ట్యాంక్ వైపు నుంచి లోపలకు ప్రవేశించాడు. సఫారీకి సమీపంలోని పులుల ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తొమ్మిది బోనుల్లో 14 పులులు ఉండగా, వాటిలో సాకీని ఎంపిక చేసుకున్నాడు. బోనులో ఉన్న దాని మెడకు ఉరి బిగించి చంపేసిన సలావుద్దీన్– తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించి దాని చర్మం, గోళ్లు ఒలిచేశాడు. ఈ ఘాతుకాన్ని చూసిన మిగిలిన పులులు తీవ్ర షాక్కు గురయ్యాయి. కొన్ని రోజుల పాటు అవి ఆహారం సైతం తీసుకోలేదు. సాకీ హత్యపై బహదూర్పుర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. జూ పార్క్లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఐడీ అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, చిన్న క్లూ కూడా లభించలేదు. సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించినా ఫలితం దక్కలేదు. ఈలోగా సాకీ హత్య రాజకీయ రంగు పులుముకుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత క్షుద్ర పూజల కోసం ఇక్కడి కొందరు పెద్దలే సాకీని చంపి, దాని చర్మం, గోళ్లు పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాకీని చంపిన తర్వాత సలావుద్దీన్ సైతం చోరీ, స్నాచింగ్ తదితర కేసుల్లో మూడుసార్లు పోలీసులకు చిక్కినా నోరు విప్పలేదు. 2005 నాటికి సాకీ కేసు కూడా కొలిక్కి చేరని కేసుల జాబితాలోకి చేరిపోయింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ మీద పోలీసుల కళ్లు ఉండేవి. 2005 ఫిబ్రవరిలో సలావుద్దీన్ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అప్పట్లో రాజీవ్ త్రివేది హైదరాబాద్ నేర విభాగానికి అదనపు పోలీసు కమిషనర్గా ఉండేవారు. సాధారణంగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ప్రతి ఘరానా దొంగనూ ఆయన ఎదుట హాజరుపరచే వాళ్లు. అధికారులు సలావుద్దీన్ను అలానే హాజరుపరచారు. అతడి నేర చరిత్ర తెలుసుకున్న ఆయన ‘ఇంక మారవా?’ అంటూ కాస్సేపు ముచ్చటించారు. తాను కాఫీ తాగే సమయం కావడంతో సలావుద్దీన్ను కూర్చోబెట్టి, అతడికీ కాఫీ ఇచ్చారు. దీంతో రాజీవ్ త్రివేదీతో సలాదుద్దీన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక ఇంకేమేం నేరాలు చేశావంటూ రాజీవ్ త్రివేదీ ప్రశ్నించగా, ఐదేళ్ల కిందట జూపార్క్లో సాకీని తానే చంపానని బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే షాక్కు లోనైన పోలీసులు సలావుద్దీన్ అరెస్టు ప్రక్రియను వాయిదా వేశారు. అతడు చెప్పే మాటలపై నమ్మకం కుదరకపోవడంతో పదేపదే ప్రశ్నించారు. దీంతో తన మాట మీద నమ్మకం లేకపోతే అనుచరులను పట్టుకుని ప్రశ్నించాలని, మహారాష్ట్రలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూస్తే సాకీ చర్మం, గోళ్లు లభిస్తాయని చెప్పాడు. మహారాష్ట్ర వెళ్లిన బృందం వాటిని రికవరీ చేశాక పోలీసులు సలావుద్దీన్ను, అతడి అనుచరులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల సమక్షంలోనే తాను జైలు నుంచి పారిపోతానని, మళ్లీ నేరాలు చేస్తానని సవాల్ చేశాడు. దీనికి స్పందించిన రాజీవ్ త్రివేది ‘నిన్ను చర్లపల్లి జైలులో పెడుతున్నాం. ఎస్కేప్ కాగలిగితే రూ.లక్ష ఇస్తా’ అని అన్నారు. ఈ మాటనూ సలావుద్దీన్ సీరియస్గా తీసుకున్నాడు. 2005 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్న అతడు పారిపోవడానికి అదను కోసం ఎదురు చూశాడు. చివరకు 2006 నవంబర్ 24న జైలు నుంచి తప్పించుకున్నాడు. దుప్పట్లను తాడుగా చేసుకుని, వాచ్టవర్ పైనుంచి దాని సాయంతో దిగుతూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి నడుము విరగడంతో ఎక్కువ దూరం వెళ్లలేక సమీపంలోని పొదల్లో దాగుండిపోయాడు. మర్నాడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జైలు సిబ్బందికే చిక్కాడు. జైలు అధికారులు సలావుద్దీన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తనను కలసిన మీడియాతో ‘రాజీవ్ త్రివేది సాబ్ చేసిన సవాల్లో నేనే నెగ్గా. గాయం వల్ల ఆగిపోయినా, జైలు నుంచి అయితే ఎస్కేప్ అయ్యా. ఆయనకు ఈ విషయం చెప్పి రూ.లక్ష ఇప్పించండి. వైద్య ఖర్చులకైనా పనికొస్తాయి’ అని చెప్పి అవాక్కయ్యేలా చేశాడు. ఆ తర్వాత తన పాత పంథా కొనసాగిస్తూ చోరీలు, గంధపు చెట్ల నరికివేత చేసిన సలావుద్దీన్ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్నాడు. శ్రీరంగం కామేష్ (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
Mirchowk Fire Accident: ప్రమాదానికి అసలు కారణాలు ఇవే!
-
మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం
-
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్లో షార్ట్ సర్క్యూట్స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్ఫ్లోర్లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్ఫ్లోర్కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది. -
Telangana: రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
కృష్ణా: తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కూసుమర్తి గ్రామీ సమీపంలోని భీమా నదిలో శనివారం మధ్యాహ్నం మొసలి ఒక రైతుపై దాడి చేసి నీటి మడుగులోకి లాక్కెళ్లింది.వివరాలివి.. కూసుమూర్తికి చెందిన రైతు జింకల తిప్పన్న(55), శివప్ప గౌడకలిసి తిప్పన్న వరి నారుమడి పోవడానికి .. తన పొలం పక్కన ఉన్న భీమా నదిలో మోటారు బిగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మడుగులో మోటార్ వద్ద చెత్త ఉండటంతో.. దానిని తొలగించడానికి నీటిలోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మొసలి తప్పణ్ణపై దాడి చేసింది.ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మొసలి తిప్పణ్ణను పూర్తిగా నీటిలోకి లాక్కెళ్లింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. -
హైదరాబాద్లో మెట్లైఫ్ టెక్నాలజీ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ మెట్లైఫ్ తాజాగా హైదరాబాద్, పుణెలో టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. ఇవి సొల్యూషన్స్ డెలివరీని మెరుగుపర్చడంతో పాటు సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ మేగ్రైషన్, ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణ మొదలైన అంశాల్లో తోడ్పాటు అందిస్తాయని కంపెనీ తెలిపింది.ఈ రెండింటితో పాటు నోయిడా, జైపూర్లో ఇప్పటికే ఉన్న హబ్లతో కలిపి భారత్లో తమ కార్యకలాపాల విభాగాన్ని మెట్లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (ఎంజీసీసీ)గా వ్యవహరించనున్నట్లు వివరించింది. కంపెనీ వృద్ధికి దోహదపడటంతో ఉద్యోగులకు అవకాశాలను మెరుగుపరచే సాంకేతికత ఆధారిత సర్వీసులు, పరిష్కారాలపై తమ దృష్టి నిరంతరం ఉంటుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఆశిష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. -
మంత్రి శ్రీధర్బాబుపై నమోదైన కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది.శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ వాదించారు. వాదనలకు ఏకీభవించి నాంపల్లి కోర్టు.. కేసు కొట్టివేసింది. -
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్లో వైరల్గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్షిప్ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్లకు కోచ్గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. -
హైదరాబాద్లో జియో టాప్.. ట్రాయ్ టెస్ట్లో బెస్ట్
హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్వర్క్లో 240.66 Mbps సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్ను ఆస్వాదించేలా చేస్తుంది.ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్వర్క్గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్ల మధ్య డేటా ప్యాకెట్లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్లకు అత్యంత అవసరం.మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
నమ్మించి ముంచేసిన నగల వ్యాపారి: రూ.10కోట్ల నగలతో పరార్
కేపీహెచ్బీ/నిజాంపేట్: బాచుపల్లి ప్రగతినగర్లో బంగారం వ్యాపారం నిర్వహిస్తూ నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన మోసగాడి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. గురువారం ఇద్దరు వ్యాపారులు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధరాణి అనే మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అశోక్ కుమార్ జైన్ అనే వ్యక్తి 30 ఏళ్లుగా కేపీహెచ్బీ కాలనీలో రిషబ్ జువెల్లరీ పేరుతో బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు. ప్రగతినగర్లో చేతన్ జువెల్లరీ పేరుతో వ్యాపారం చేస్తున్న నితీష్ జైన్ నాలుగేళ్లుగా అశోక్ కుమార్ జైన్ వద్ద బంగారం తీసుకుని వ్యాపారం చేసేవాడు. గత నెల 8న, ఈ నెల 10న నితీష్ జైన్ అతని భార్య స్వీటీ జైన్లు అశోక్ కుమార్ నగల షాపుకు వచ్చి రెండుమార్లు సుమారు అరకేజీ బంగారు నగలును తీసుకున్నారు. డబ్బులు త్వరలో చెల్లిస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. ఎప్పుడు డబ్బులు అడిగినా త్వరలోనే ఇస్తామని నమ్మబలికేవారు. ఇదే కోవలో ఐడీపీఎల్ కాలనీలోనీ దీపక్ జైన్కు చెందిన జ్యోతి జువెల్లరీలోనూ సుమారు 860 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు. చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్అయితే ఈ నెల 10 నుంచి ప్రగతినగర్లోని నితీష్ జైన్కు చెందిన చేతన్ జువెల్లరీ దుకాణాన్ని తెరవకపోవడంతో అతనికి బంగారం ఇచి్చన వ్యాపారులు, బంగారం కుదువపెట్టిన వారు, వివిధ స్కీంల పేరుతో డబ్బులు కట్టినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ, ఐడీపీఎల్ కాలనీలకు చెందిన ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు! -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!
కేపీహెచ్బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్ పవన్ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్సింగ్ నగర్ఫేస్–1లో నివాసముంటున్నారు. ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్ పవన్న్ పరారీలో ఉండగా గురువారం రిమాండ్కు తరలించామన్నారు. -
హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్గంజ్లోని సౌత్వెస్ట్ జోన్ మహిళా పోలీస్స్టేషన్కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్స్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
‘హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అత్యధికంగా 17, 162 మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు.2025- 26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారబోతోంది.హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు..హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..
హైదరాబాద్ నగరంలో బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్స్ ఊపందుకుంటున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని కుంచెకు పనిచెప్పే చిత్రకారులు సృష్టిస్తున్న చిత్రాలు కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో ఆ తరహా చిత్రకళా నైపుణ్యం అందించే వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్లో ఉన్న ట్రైలింగ్ ఐవీ కేఫ్ ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ జరగనుంది. ఔత్సాహికులకు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ మెళకువలను నేర్పేందుకు శనివారం మధ్యాహ్నం 12.గంటలకు ఈ వర్క్షాప్ ప్రారంభం కానుంది. దాదాపు 2గంటల పాటు కొనసాగే ఈ కళాశిక్షణపై ఆసక్తి కలిగినవారు బుక్ మై షో ద్వారా ఎంట్రీలు పొందవచ్చు. (చదవండి: Araku Aroma : హైదరాబాద్ టు యూఎస్..తొలి బ్రాండ్గా అరుకు అరోమా..!) -
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్నగర్ అహ్మద్నగర్కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్లోని ఓ కేఫ్కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో అరకు రుచులు..
అరకు కాఫీ రుచిని యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు. క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్లలో అరకు అరోమా గ్రీన్ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్ కాఫీ, అరబికా ప్రైమ్ ఉన్నాయన్నారు. యూఎస్ఏలో రిజిస్టర్డ్ బ్రాండ్ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు.. ) -
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్కు పసందు..
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది. ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్బీర్ సింగ్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి.. అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. ప్రత్యేక దినుసులు.. ఫెస్ట్లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్ను ఆస్వాదిస్తారు. (చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట) -
హైదరాబాద్లో ఇక పక్కాగా 'వరద' నివారణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో వానొస్తే రోడ్లు, కాలనీలు అని తేడా లేకుండా వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. నగరంలో వరదనీటి కాలువల (నాలాల) సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునికీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద మొదటి దశలో రూ.985 కోట్ల పనుల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసుల వంటి అవాంతరాలతో మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో దశ కింద కూడా కొన్ని పనులు చేపట్టారు. నిధుల కోసం.. ఈ పనులు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ), తదితర పనుల కోసం చేసిన రుణాలకే ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీకి వరదనివారణ ప్రాజెక్టులకు రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనులకు మన కరెన్సీలో రూ.5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులందనున్నాయి. ఏయే పనుల కోసం.. వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల (నాలాల) ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాలపరిమిది దాదాపు ఎనిమిదేళ్లు. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది పట్టనున్నట్లు సమాచారం. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టరు ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్ల వరకు పట్టనున్నట్లు తెలుస్తోంది. జైకా నుంచి అందే రుణం (రూ.5135.15 కోట్లు)తో హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్యూఏ) వరకు 450 కి.మీ.ల మేర వరదకాలువల ఆధునీకరణ, కొత్తవాటి నిర్మాణం, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం తదితరమైనవి చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్యూఏగా వ్యవహరిస్తున్నారు. 2036 విజన్తో.. హెచ్యూఏ (HUA) పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా, 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందనే అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ సొరంగాలుగా.. వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల (నాలాలు) నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలనే యోచనలో అధికారులున్నారు. జపాన్ (Japan) రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఇటీవల జపాన్లో పర్యటించి రావడం తెలిసిందే. ఎన్ని కాలువలు ఉన్నా.. నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, మూడు పెద్ద చెరువులు (హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, హుస్సేన్సాగర్) ఉన్నప్పటికీ 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో, మున్ముందు సదరు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టారు. చదవండి: అనుమతులు లేక స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు..జపాన్లో అలా.. జపాన్లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశముంటుందా అనే దిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జి–కేన్స్ ప్రాజెక్ట్గా ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగమార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్ధ్యం ఉంది. ఐదు ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లున్నాయి. -
గామా నైఫ్.. మెదడు చికిత్సల్లో సరికొత్త విప్లవం
మెదడులో వచ్చే సమస్యలు.. ప్రధానంగా క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందులో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పంపుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతాదులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత కచ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు. చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. మెదడులో వచ్చే కణితులు (క్యాన్సర్, ఇతరాలు), రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, పిట్యుటరీ కణితులు, విపరీతమైన నొప్పి తదితరాలకు ఇది బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స. దుష్ప్రభావాలు చాలా తక్కువ, విజయాల రేటు ఎక్కువ.రోగులకు ప్రయోజనాలివీ.. మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. మెదడులో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలను పాడుచేయకుండా సమస్యను మాత్రమే కచ్చితంగా తొలగిస్తుంది. చాలావరకు ఒకే సెషన్లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్లచ్చు. ఇప్పటివరకు గామా నైఫ్ చికిత్సలు ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా రోగులు పొందారు. మన దేశంలో ఇప్పటివరకు 8వేల ప్రొసీజర్లు చేశారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90% విజయాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు. దీనికి సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24-48 గంటల్లోనే 90% రోగులు తమ పనులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ కణితులు, రక్తనాళాల్లో సమస్యలు.. లాంటి 20 రకాల సమస్యలకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. కిమ్స్ ఆస్పత్రిలో పెట్టినది ఒకే సెషన్లో పలు కణితులను కూడా నయం చేస్తుంది. దాంతో చికిత్స సమయం తగ్గుతుంది. న్యూరాల్జియా సమస్యకు దీంతో చికిత్స చేస్తే 48 గంటల్లోనే నొప్పి బాగా తగ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్రమే కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి. సంప్రదాయ మెదడు శస్త్రచికిత్సల కంటే ఇందులో దుష్ప్రభావాలు దాదాపు లేనట్లే. -
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం -
హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం
-
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్..!
హైదరాబాద్ నగరంలో ఎన్ని కాంటినెంటల్ వంటకాలున్నా తెలుగు రుచులకున్న ప్రత్యేకతే వేరు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే అతిథులు ప్రత్యేకంగా ఆంధ్రా వంటకాలను రుచి చూసే వెళతారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నగరంలోని లీలా వేదికగా వివిధ సంస్కృతుల రుచులను నగరవాసులకు, అతిథులకు రుచి చూపిస్తు్తన్న ‘రీన్ – ది చెఫ్స్ స్టూడియో’ ఈ సారి ఆంధ్రా వంటకాలను ప్రదర్శిస్తోంది. ఎకోస్ ఆఫ్ ఆంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్ట్ ఈ నెల 18వ తేదీ వరకూ ఆంధ్రా పసందైన రుచులను చేరువచేస్తోంది. అంతేకాకుండా ప్రముఖ చెఫ్ ‘మీరా’ ఈ ఎకోస్ ఆఫ్ ఆంధ్ర ఫెస్ట్లో తన పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో తెలుగు రుచులతో విడదీయరాని అనుబంధమున్న మామిడి వంటకాలను సైతం ప్రత్యేకంగా వండివారుస్తున్నారు. ‘ఎకోస్ ఆఫ్ ఆంధ్ర అనేది నా చిన్ననాటి ఆహారానికి నా ప్రేమలేఖ’..!! ఇవి నన్ను పెంచిన, లాలించిన రుచులు, తరతరాలుగా వారసత్వంగా వచ్చిన వంటకాలు. ప్రస్తుత తరుణంలో విభిన్న, వినూత్న రుచులుగా మోడ్రన్ డైనింగ్ టేబుల్ పైకి రావడం మళ్లీ ఇంటికి వెళ్లిన అనుభూతిని తీసుకువస్తుంది. ఆంధ్రా గొప్ప పాక సంప్రదాయాలకు గుర్తుగా రూపొందించిన క్యూరేటెడ్ థాలీని ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన వారసత్వ వంటకాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ప్రాంతం ఆహార సంస్కృతిని ఇక్కడికి విచ్చేసే అతిథులకు చేరువ చేస్తూ ఆ ఘుమఘుమలను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ముఖ్యంగా మామిడి అంటే ఒక నోస్టాల్జిక్ అనుభూతి. ఈ వారసత్వ థాలీ కుటుంబాలు, పండుగలు భూమి లయల కథను చెబుతుంది. ఆనాటి పచ్చడి మొదలు నేటి కూరలు ఆధునిక రుచుల వరకూ సృషిస్తుంది ఈ వేదిక. ఈ పాప్–అప్ ద్వారా కాంటినెంటల్ వంటకాలను మైమరపించే రుచలను అందంచడమే లక్ష్యంగా రీన్ చెఫ్స్ స్టూడియో సిద్ధమైంది అని చెబుతున్నారు ప్రముఖ చెఫ్ మీరా (చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
హైదరాబాద్ లో వివాహిత మహిళా ఆత్మహత్య
-
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
HYD: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్గంజ్లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోందివివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్ గోడౌన్కు మంటలు వ్యాపించాయి. అనంతరం, మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ డీఎఫ్ఓ వెంకన్న సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రమాదం జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. సెకండ్ ఫ్లోర్ లో ముగ్గురు బిల్డింగ్ పైన ఐదుగురు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చాము. మంటలు అదుపులోకి వచ్చిన ఇంకా స్మోక్ భారీగా వస్తుంది. బేగంబజార్లో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఇంట్లోనే గోదాం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు.బట్టలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో స్మోక్ ఎక్కువగా వస్తుంది. మరో గంటల్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం. మనుషులు వెళ్లలేని చోటికి లేటెస్ట్ గా వచ్చిన రోబోను పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని అన్నారు. -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బల్దియాలోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి వివరాలను అధికారులు తెలిపారు. -
‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’
హైదరాబాద్: నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?, మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశాం. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ. అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారుగతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు.తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
TSRTC city bus : అత్యంత రద్దీగా బస్సులు...అసలు కారణాలివీ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు! మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
ప్రయాణికులు 100 శాతం బస్సులు 60 శాతమే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది.కొత్త సర్వీసులేవీ.. నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల విని యోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు, తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్ర యాణ సదుపాయం అందుబాటులోకి వచి్చన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయాణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు.2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు,సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సులవైపు మళ్లారు.మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి.దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి,రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి.దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్సీటర్ ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది.కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
#MissWorld2025: బ్యూటీ విత్ ఫన్..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)
-
Miss World 2025: బ్యూటీ విత్ ఫన్..
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్ యాక్టివిటీస్తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్ డెన్మార్క్, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్ మీడియా యాప్స్ కోసం సెల్ఫీ మోడ్లో రీల్స్ చేస్తూ సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్లను ఎప్పటికప్పుడు వారి ఇన్స్టా, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మిస్ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్లోని స్విమ్మింగ్ ఫూల్ పరిసరాల్లో చేసిన క్యాట్ వాక్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్ సెల్వడోర్ వంటి దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు. -
చార్మినార్ దగ్గర మిస్ వరల్డ్ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)
-
18న గోశాల నిర్వాహకులు, గోపోషకుల సదస్సు
సాక్షి, హైదరాబాద్: మండే ఎండలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గోశాలలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలు కనుగొనే లక్ష్యంతో ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లకడీకాపూల్లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో రాష్ట్రస్థాయి గోశాలల నిర్వాహకులు, గోపోషకుల సదస్సు నిర్వహిస్తున్న సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు 'విజయ్ రామ్' మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోని గోశాలల నిర్వాహకులు, గో పోషకులను ఈ సదస్సుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా నుంచి గోశాలల నిర్వాహకులు 9052286688 నంబరుకు ఫోన్ చేసి పేర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సుభాష్ పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఆవులను పంపిణీ చేసే ఆలోచన ఉందని విజయ్ రామ్ తెలిపారు. పచ్చిగడ్డి, వరి గడ్డి కొరతతో పాటు వైద్యం, తాగునీరు కూడా గోశాలలకు పెను సమస్యలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
చౌమహల్లా ప్యాలెస్లో సుందరీమణులు
'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 120 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్కు చేరుకున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా చౌమహల్లా ప్యాలెస్కు చేరుకున్నారు. ఇక్కడే మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటక ప్రాంతం గురించి తెలిపే ఫోటో గ్యాలరీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.చౌముల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని వారు అన్నారు. -
HMDA: ‘అనుమతులు’ ఎప్పుడిస్తరు?
సాక్షి, సిటీబ్యూరో: ట్రిపుల్ఆర్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరించినప్పటికీ ఇంకా లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం ప్రారంభం కాలేదు. దీంతో నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. హెచ్ఎండీఏ విస్తరణకు ముందు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ప్లానింగ్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) నుంచి అనుమతులు లభించేవి. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలోని ప్రాంతాలన్నీ హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. రెండు నెలల క్రితమే ఈ బదిలీ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవలసి ఉంది. కానీ రెండు నెలలుగా దీనిపైన ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిర్మాణ సంస్థల్లో గందరగోళం నెలకొంది. రూ.కోట్లల్లో అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ఇటు డీటీసీపీ నుంచి అటు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించకపోవడంతో సందిగ్ధంలో పడ్డాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సైతం ఇది ఆటంకంగా మారినట్లు నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రీజనల్ రింగురోడ్డు వరకు మారిన సీన్... హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అన్ని రకాల అనుమతులు, ప్రొసీడింగ్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్త ప్రాంతాలను హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని 6 జోన్లలో చేర్చారు. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించినప్పటి నుంచి ఆ పరిధిలో డీటీసీపీ అనుమతులను నిలిపివేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్ఎండీఏ నుంచి కొత్తగా ఎలాంటి అనుమతులు లభించలేదు. హెచ్ఎండీఏ వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం డీటీసీపీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్డ్నౌ పోర్టల్ సేవలను డీటీసీపీ ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ గతంలో ఉన్న 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు లభిస్తుండగా, కొత్తగా చేరిన 3,215 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్న గ్రామాలు, మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతులు మొదలు కాకపోవడం గమనార్హం.మ్యాపింగ్లో జాప్యమేల... హెచ్ఎండీఏ కొత్తగా విస్తరించిన ప్రాంతాల మ్యాపింగ్లో జాప్యం వల్లనే అనుమతుల ప్రక్రియను ఇంకా ఆరంభించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మ్యాపింగ్ తుదిదశకు చేరిందని, త్వరలోనే పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రిపుల్ఆర్ వరకు రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు సైతం హెచ్ఎండీఏ కసరత్తును చేపట్టింది. దీంతో నిర్మాణరంగంపైన స్పష్టత కొరవడినట్లు రియల్వర్గాలు పేర్కొంటున్నాయి. ‘షాద్నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు నెలల నెంచి ఎదురుచూస్తున్నాం. కానీ ఈ మ్యాపింగ్ పూర్తయిన తరువాత అనుమతినిస్తారా లేక, కొత్త మాస్టర్ప్లాన్ వచ్చేవరకు నిలిపివేస్తారా తెలియడం లేదు.’ అని ఒక రియల్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ మెగామాస్టర్ప్లాన్ అమల్లోకి వచ్చే వరకు అనుమతులు లభించకపోతే తాము తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని పేర్కొన్నారు. భారీ లే అవుట్లే కాకుండా అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలకు సైతం ఇబ్బందులు తలెత్తనున్నాయి.హెచ్ఎంఏ డెవలప్మెంట్ ప్లాన్..హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్ధిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ఈ హెచ్ఎంఏ (HMDA) పరిధిలో ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలతో మాస్టర్ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు చేపట్టారు. ఈ ప్రణాళికలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముసాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి సరికొత్త మాస్టర్ప్లాన్ రానుంది. చదవండి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!ఈ క్రమంలో నిర్మాణరంగానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతులను ఎప్పటి నుంచి ఇస్తారనేది సందిగ్ధంగా మారింది. బ్లూన్గ్రీన్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) వరకు చెరువులు, కుంటలు, తదితర నీటివనరులను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలను చేపట్టవలసి ఉంది.దీంతో అప్పటి వరకు వేచి ఉండవలసిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. -
చార్మినార్ దగ్గర సందడి చేసిన అందాల భామలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి (చార్మినార్) నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.రాత్రికి చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు. అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఏమిటీ హెరిటేజ్ వాక్? హైదరాబాద్ నగరం, చారిత్రక నేపధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ‘ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్‘ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించి, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్ వాక్లో భాగంగా, పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రక కట్టడాలలో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, బద్షాహీ అషూర్ఖానా, ఖిల్వత్ ముబారక్, లాడ్ బజార్ వంటివి ఉన్నాయి. ఇవి హైదరాబాద్ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.సందర్శకులకు స్థానిక గైడ్ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు.