హైదరాబాద్: బోరబండలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ కారును మైనర్ బాలుడు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతడి పేరును అలీ అహ్మద్(17)గా గుర్తించారు. అతడు కారుతో సృష్టించిన బీభత్సానికి ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు గాయాలయ్యాయి.
వారి పేర్లు రాజ్కుమార్ (60), ప్రభాకర్ (55). ఓ ఇంటిముందే ఈ ప్రమాదం జరిగింది. మైనర్ బాలుడు కారుపై అదుపుకోల్పోవడం, అతడికి డ్రైవింగ్లో ఏ మాత్రం అనుభవం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వేగంగా ఇంటి గేటును ఢీకొట్టే దిశగా వెళ్లింది. త్రుటిలో ఆ ఇంటి ముందు ఆగిపోయింది. లేదంటే ఇంటి ముందు గోడ కూడా ధ్వంసమయ్యేది.


