-
కలిసిరాని యాసంగి
కోతలూ భారమే.. పంటలు కోతకు రావడంతో వరి కోత యంత్రాలు జిల్లాకు వస్తున్నాయి. యాసంగిలో ముందుగా నాట్లు వేసిన పంటలను కోస్తున్నారు. కోత యాత్రాల ధరలు గత సీజన్ కన్నా పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గంటకు రూ.1,600 తీసుకునే యంత్రాల యజమానులు ప్రస్తుతం టైర్లతో నడిచే యంత్రానికి రూ.1800 నుంచి రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. చైన్తో నడిచే కోత యంత్రాలకు గంటకు రూ.2500 నుంచి రూ.3 వేలు అద్దె వసూలు చేస్తున్నారు. దిగుబడి రాక నష్టాల్లో ఉన్న రైతులకు వరి కోత యంత్రాల ధరలు మరింత భారంగా మారాయి. లోకేశ్వరం: ఈ యాసంగి సీజన్ వరి రైతులుకు కలిసి రాలేదు. నాట్లు వేసిన రోజు మొదలుకొని పంట కోసే దాకా వరి పంటను తెగుళ్లు ఆశిస్తూనే ఉన్నాయి. రెక్కల పురుగు, మొగిపురుగు, ఉల్లికోడు, అగ్గి తెగులు, మెడవిరుపు లాంటి తెగుళ్లు వరి పంటలను దెబ్బతీశాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పరిమితికి మించి మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడక్కడా కొన్ని పంటలు మాత్రమే గట్టెక్కాయి. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. జిల్లా అంతటా వరి కోతలు మొదలయ్యాయి. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 28 క్వింటాళ్లు రావాల్సిన ధాన్యం కేవలం 20 నుంచి 22 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. నాలుగైదు క్వింటాళ్లు నష్టపోతున్నామని తెలిపారు. 1.25 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో యాసంగిలో 1.25 లక్షల ఎకారల్లో ఈ యాసంగిలో వరి పంటను సాగుచేశారు. తెగుళ్లు దాడి చేయడంతో దిగుబడిపై ప్రభావం పడింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి గింజలు నేల రాలాయి. దీంతో దిగుబడి మరింత తగ్గింది. దిగుబడి అంతంత మాత్రమే.. యాసంగిలో వరి సాగు చేసిన రైతులకు పెట్టుబడి ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు దెబ్బతీయడంతో ఖర్చులు మరింత పెరిగాయని పలువులు రైతులు తెలిపారు. ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గడంతో నష్టాలే మిగిలాయని రైతులు పేర్కొంటున్నారు. తగ్గిన పంట దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్లు కూడా రాని వైనం.. ఆందోళనలో అన్నదాతలు -
● గత ఎన్నికలతో పోలిస్తే రికార్డు ● అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా.. ● గణనీయంగా పెరిగిన ఓటింగ్ ● అత్యధికంగా ముధోల్లో నమోదు
నిర్మల్: జిల్లాలో లోక్సభ ఎన్నికలు రికార్డు పోలింగ్ను నమోదు చేశాయి. దాదాపు అసెంబ్లీ ఎన్నికల శాతంతో సమానంగా నమోదు కావడం గమనార్హం. సోమవారం పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మంగళవారం పోలింగ్శాతాన్ని ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ జిల్లాలో మొత్తం 73.20 శాతం నమోదైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 77.28 శాతం నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల్ల్లో 65 శాతం వరకు నమోదైంది. ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం పెంచడంలో అధికారయంత్రాంగ సఫలమైంది. కొత్త ఓటర్లూ ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో 73.20 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. ముధోల్లో అత్యధికంగా 75.63 శాతం, ఖానాపూర్లో 72.20 శాతం, నిర్మల్ నియోజకవర్గంలో 71.68 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాకేంద్రం ఉ న్న నిర్మల్ నియోజకవర్గం కంటే.. రూరల్ ఏరియాలు ఉన్న ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అధికంగా పోలింగ్ నమోదు కావడం విశేషం. పోలింగ్శాతం వివరాలు.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఓటేసిన ఓటర్లు ఓటింగ్ శాతం నిర్మల్ 2,58,314 1,85,168 71.68 ముధోల్ 2,54,579 1,92,546 75.63 ఖానాపూర్ 2,24,623 1,62,101 72.20 మొత్తం 7,37,516 5,39,815 73.20 -
కొండగట్టులో బీజేపీ నాయకుల పూజలు
ఖానాపూర్: మోదీ మూడోసారి ప్రధాని కావాలని, బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ భారీ మెజారిటీతో గెలవాలని మండలంలోని మస్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కొండగట్టులో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ నగేశ్ గెలుపును మోదీకి గిఫ్ట్గా ఇస్తామని నాయకులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో నాయకులు ఎనుముల స్వామి, పిట్టల భూమన్న, పుప్పాల ఉపేందర్, బాశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులపై దాడి సరికాదు నిర్మల్ రూరల్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో సోమవారం రాత్రి ఎన్నికల విధులు ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఎస్టీయూ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, పీఆర్టీయూతెలంగాణ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్, రాజేశ్నాయక్, వై.సాయన్న వేర్వేరుగా దాడిని ఖండించారు. రెమ్యూనరేషన్ విషయంలో ప్రశ్నించినందుకు పోలీసులతో లాఠీచార్జి చేయించడం సరికాదన్నారు. ఎన్నో ప్రయాసలకు ఓర్చి, ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన అధికారులకు ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఈ సంఘటనకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నిర్మల్చైన్గేట్: కార్పొరేట్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం పదో తరగతిలో 7.0 జీపీఏ, ఆపైన సాధించిన జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, మైనారి విద్యార్థిని విద్యార్థులుhttp:///telanganaepass. egg.gov.in వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపా రు. జూన్ 3న ఎంపిక, జూన్ 6న విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. -
గెలుపుపై ధీమా
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇన్ని రోజుల పాటు ప్రచారంలో బిజీబిజీగా గడిపిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు సేద తీరారు. బూత్ల వారీగా పార్టీకి పోలైన ఓట్ల విషయంలో నియోజకవర్గం వారీగా విశ్లేషణ సాగుతోంది. వాటి ఆధారంగా తమ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో లీడ్లో ఉందని, మరికొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీతో పోటాపోటీగా ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు పార్టీల భవితవ్యం తేలిపోనుంది. ఎవరి ధీమా వారిదే.. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆసిఫాబాద్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు కమలం పార్టీకే పట్టం కట్టారని విశ్లేషిస్తున్నారు. ఆసిఫాబాద్లో ప్రత్యర్థి పార్టీలతో పోటీ ఉందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక స్థానం ఖానాపూర్లో గెలిచి మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీల కంటే 2లక్షల ఓట్లు వెనుకబడ్డ తాము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసుకోవడమే కాకుండా అదనంగా ఓట్లు సాధించి గెలుపు వాకిట్లో ఉన్నామని కాంగ్రెస్ ఢంకా బజాయించి చెబుతోంది. ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో తమకు లీడ్ వస్తుందని బీఆర్ఎస్ అంటోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఫైట్ ఇచ్చామని పేర్కొంటున్నారు. కొద్దిపాటి మెజార్టీతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. ● అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ ఎన్ని కల పరంగా ఆయా నియోజకవర్గాల్లో పో లింగ్ శాతం పరిశీలిస్తే పార్లమెంట్ సెగ్మెంట్లో ముధోల్ రెండో స్థానంలో, ఆదిలాబాద్ నాలుగో స్థానం, నిర్మల్ ఆరో స్థానం, సిర్పూర్ ఏడో స్థానంలో నిలిచాయి. ●శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల పరంగా పోలింగ్ శాతాన్ని పరిశీ లిస్తే.. ఈ మొత్తం సెగ్మెంట్లోనే బోథ్ అధిక పోలింగ్ శాతంతో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆసిఫాబాద్ మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్కు తోడ్పడినట్టే ఈ ఎన్నికల్లో ఆదరించా రో.. లేదో అనేది ఫలితాల రోజే తేలనుంది. ● అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పరంగా సెగ్మెంట్లో ఐదో స్థానంలో నిలిచింది. ఇది హస్తం పార్టీకి ఎంత మేరకు ఉపయుక్తంగా ఉంటుందో తేలాల్సి ఉంది. అప్పుడు.. ఇప్పుడు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 14లక్షల 88వేల 353 ఓట్లకు గాను 10లక్షల 62వేల 895 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు 71.41 పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి 1లక్ష 61వేల 822 కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 74.03 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన కొత్త ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ఎన్నికల్లో పురుషులు, మహిళల మొత్తం ఓట్లలో పోలైన ఓట్ల పరంగా శాతంలో కొంత పురుష ఆధిక్యం ఉంది. అయితే సంఖ్యా పరంగా మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారు. ఈ లెక్కన వారి ఆదరణ కూడా ఎవరికి దక్కిందనేది ఈ ఎన్నికల్లో విజయానికి కీలకం కానుంది. ఎవరి అంచనాలు వారివే పోలింగ్ సరళిపై పార్టీల్లో మొదలైన విశ్లేషణ లక్ష మెజార్టీ సాధిస్తామంటున్న బీజేపీ గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్ ఆ లీడ్ కలిసివస్తుందంటున్న బీఆర్ఎస్ జూన్ 4న తేలనున్న భవితవ్యంపార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ వివరాలు మొత్తం ఓటర్లు : 16,50,175 పోలైన ఓట్లు: 12,21,563 (74.03 శాతం)పురుష ఓటర్లు: 8,04,875 పోలైన ఓట్లు: 5,99,108 (74.43 శాతం)మొత్తం మహిళా ఓటర్లు : 8,45,213పోలైన ఓట్లు : 6,22,420 (73.64 శాతం)ఇతరులు: 87 పోలైన ఓట్లు: 35 (40.23 శాతం)నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం.. సిర్పూర్ : 71.56 ఆసిఫాబాద్ : 75.49 ఖానాపూర్ : 72.20 ఆదిలాబాద్ : 73.89 బోథ్ : 78.16 నిర్మల్ : 71.68 ముధోల్ : 75.63 -
నిర్మల్
రైతులను దోచేస్తున్నారు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు పాటించడంలేదు. నిర్వాహకులు, రైస్మిల్లర్లు కుమ్మకై ్క రైతులను దోపిడీ చేస్తున్నారు.నిర్విఘ్నం.. ఎన్నికల యజ్ఞంబుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 20249లోu నిర్మల్: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అంటేనే ఓ మహాక్రతువు. కలెక్టర్ నుంచి వీఆర్ఏ దాకా ఎన్నో విభాగాలు, శాఖల అధికారులు, సిబ్బంది దీంట్లో భాగమవ్వాల్సి ఉంటుంది. నెలల తరబడి సమావేశాలు, శిక్షణలు, ఏర్పాట్లు ఉంటాయి. చివరకు ఒకరోజు ముందు ఏర్పాట్లు, పోలింగ్ రోజున దినమంతా కత్తిమీద సాములా సాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా పూర్తిచేసుకోవడంతోపాటు ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్రూమ్లోకి చేర్చేదాకా సాగే ఈ ప్రయాణంలో ఎంతోమంది భాగస్వామ్యం ఉంటుంది. వారందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే.. ఎన్నికల యజ్ఞం సజావుగా, ప్రశాంతంగా పూర్తవుతుంది. ఈసారి జిల్లాలో అదే పనిచేశారు.. ఒకట్రెండు చిన్నపాటి ఇబ్బందులు మినహా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేశారు. ‘కోడ్’కూయక ముందే.. ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే జిల్లాలో సంబంధిత ప్రక్రియ మొదలైంది. జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది, జిల్లాలోని ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్యూనిట్ల పరిస్థితి.. ఓటర్ల జాబితా.. పోలింగ్ కోసం అధికారులు, సిబ్బంది.. ఇలా ఎన్నికల కమిషన్ అడిగే ప్రతీ విషయాన్ని జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి నివేదికలు పంపించారు. సంబంధిత నివేదికలు, జిల్లాలో ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి వ్యక్తంచేయడం, లేదంటే మార్పులు చేర్పులు సూచించడం చేస్తే వాటికి అనుగుణంగా మళ్లీ మార్పులు చేయడం చేశారు. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల పర్యవేక్షణ, వారికి అనుమతులు ఇవ్వడం, శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రచారతీరును గమనించడం వంటి అదనపు బాధ్యతలను మోశారు. మీటింగ్లు.. ట్రైనింగ్లే.. దాదాపు మూడు నెలల ముందు నుంచే జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లాలో రోజూ సమావేశాలు లేదంటే ఎన్నికల సిబ్బంది శిక్షణలు కొనసాగుతూనే వచ్చాయి. పోలింగ్లో పాల్గొనే సెక్టార్, రూట్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర సిబ్బంది అందరికీ వివిధ దశలలో శిక్షణలు ఇచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పనితీరును తరచూ పరిశీలించారు. కుటుంబానికి సమయమివ్వక.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఈ కాలమంతా కుటుంబానికి అంతంత మాత్రంగానే సమయమిచ్చారు. పొద్దున వెళ్తే.. ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకునే వారు. కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లే కాదు.. ఓ స్థాయి ఉన్న అధికారులు, సిబ్బంది కూడా కుటుంబానికి సమయమివ్వలేని పరిస్థితి. తమ కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల శుభకార్యాలకూ వెళ్లలేని పరిస్థితి. పకడ్బందీగా బందోబస్తు.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తికావడంలో పోలీసుశాఖ పాత్ర కీలకంగా పనిచేసింది. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో గొడవలు మినహా.. ఇతరత్రా ఎక్కడా ఓ చిన్న ఘటనకూ తావు ఇవ్వకుండా పోలింగ్ను ప్రశాంతంగా పూర్తిచేశారు. ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తుతో పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలనూ తరచూ పర్యవేక్షిస్తూ.. పారామిలటరీ బలగాలతోనూ కవాతు చేయిస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. కుటుంబ సభ్యులతో సరదాగా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా గడిపిన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మంగళవారం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. – వివరాలు 8లోu న్యూస్రీల్ జల్లాలో మహాక్రతువు.. విజయవంతం మూడునెలలుగా.. ప్రతిఒక్కరూ పనిలోనే.. ఫలించిన అధికారయంత్రాంగం శ్రమ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ రికార్డుస్థాయిలో ఓటెత్తిన జిల్లా..పనిచేసిన ‘స్వీప్’.. జిల్లా ఓటర్లలో అవగాహన కల్పించడం, ఓటుహక్కు వినియోగించుకునేలా చేయడంతోపాటు కొత్త ఓటర్ల నమోదు విషయంలో ‘స్వీప్’(సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) బాగా పనిచేసింది. కలెక్టర్ ఆశిష్సంగ్వాన్తోపాటు స్వీప్ ఇన్చార్జిగా ఉన్న డీఆర్డీవో విజయలక్ష్మి వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఈనెల 7న స్వీప్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ వివిధ అవగాహన సమావేశాలు, కార్యక్రమాలను చేపట్టారు. ఇవన్నీ జిల్లాలో పోలింగ్శాతం పెరిగేందుకు దోహదపడ్డాయి. -
గృహజ్యోతి డౌన్
● పెరుగుతున్న విద్యుత్ వినియోగం ● తగ్గుతున్న లబ్ధిదారులుజీరో బిల్లు రాలే మాకు తెల్ల రేషన్కార్డు ఉంది. జీరో బిల్లు కోసం ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నం. కానీ మాకు జీవో బిల్లు రావడం లేదు. నెలనెలా కరెంటు బిల్లు కడుతున్నం. జీరో బిల్లు వచ్చేలా చూడాలి. – ఆకుల లక్ష్మి, ధర్మోరఎన్నికల తర్వాత కొత్తవారికి.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అవసరమైన ధ్రువపత్రాలు సమర్చించ లేదు. వారంతా మార్చిలో మళ్లీ దరఖాస్తును చేసుకున్నారు. అర్హత ఉన్నవారికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో బిల్లుల జారీ చేస్తాం. – శివకుమార్, విద్యుత్ ఏఈనిర్మల్చైన్గేట్/లోకేశ్వరం: గృహజ్యోతి వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఎండలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో మార్చితో పోలిస్తే ఏప్రిల్లో 200 యూనిట్ల కంటే అధికంగా 37,190 మంది విద్యుత్ వినియోగించారు. దీంతో వారంతా ఈ పథకానికి అర్హత కోల్పోయారు. తగ్గిన లబ్ధిదారులు.. జిల్లాలో 1,96,128 విద్యుత్ కనెక్షన్లు ఉండగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి గృహజ్యోతి కింద లబ్ధి పొందే వారు 99,126 మంది ఉన్నట్లుగా విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వెంటనే దాన్ని అమలు చేస్తూ అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేశారు. కొంత మంది కనెక్షన్ల వివరాలు తప్పుగా రాయడం, ఆధార్ వివరాలు జత చేయకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందడం లేదు. తాజాగా పెరిగిన ఎండలతో గతంలో జీరో బిల్లులు పొందిన లబ్ధిదారులు సర్కారు రా యితీకి దూరమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లు వినియోగించే వా రికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పరిమితి దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెరి గిన విద్యుత్ వినియోగంతో ఈ లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన మూడు నెలల్లో 40,604 మంది తగ్గిపోయారు. ఏప్రిల్లో 3,795 మంది తగ్గిపోగా మేలో 8వ తేదీ వరకు 56,365 మందికి జీరో బిల్లులు జారీ చేశారు. ఇంకా బిల్లులు జారీ చేయాల్సి ఉన్నందువల్ల ఎంతమంది తగ్గుతారనేది వెల్లడి కాలేదు. జీరో బిల్లులు రాని వారంతా బిల్లులు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రెట్టింపైన వాడకం... జిల్లాలో మార్చితో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీలకు చేరువయ్యాయి. వడ గాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. నెల లబ్ధిదారులు పంపిణీ అయిన బిల్లులు వచ్చిన బిల్లు(రూ.ల్లో) మార్చి 99,126 96,969 260.20 లక్షలు ఏప్రిల్ 99,041 93,174 334.50 లక్షలు మే 61,851 56,365 219.41 లక్షలు -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్..
నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 926 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించడమే కాక పలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఓటు మనకు వరం నిర్మల్చైన్గేట్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ అన్నారు. నిర్మల్ పట్టణం జెడ్పీ కార్యాలయంలోని 237వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూస్రీల్ -
మూడంచెల భద్రతతో ప్రశాంతంగా పోలింగ్
● ఎస్పీ జానకీషర్మిలనిర్మల్టౌన్: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్, పోలింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సోమవారం పరిశీలంచారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగా లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జి ల్లా స్పెషల్ పార్టీ, సెంట్రల్ అర్మడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో గస్తీ నిర్వహించామన్నారు. ఈవీఎంల తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొడవలు జరిగితే ప్రతిఘటించేలా క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేలా పనిచేశారని అభినందించారు. ఎస్పీ వెంట నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు అనిల్, నవీన్ ఉన్నారు. ఖానాపూర్/సోన్: ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా ఎస్పీ జానకీషర్మిల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఖానాపూర్ మండలం గోసంపల్లె, రాజురా, అడవి సారంగాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. సోన్ మండలం సోన్, న్యూవెల్మల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేశారు. ఆమె వెంట సీఐలు సైదా రావు, నవీన్కుమార్, ఎస్సై రవీందర్ ఉన్నారు. -
ఓటేసిన ప్రముఖులు..
నిర్మల్చైన్గేట్: లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అధికారులు, ప్రముఖ నాయకులు సోమవారం ఓటు హక్కు విని యోగించుకున్నారు. కొందరు నాయకులు కు టుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓట్లు వేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ జెడ్పీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్ పట్టణం గాజులపేట్ బూత్ నంబర్ 192లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామడ మండలం దిమ్మదుర్తిలోని 77 బూత్లో జెడ్పీ చైర్పర్సన్ విజ యలక్ష్మి ఓటు వేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఓటు వేశారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లో మాజీ మంత్రి ఐకేరెడ్డి ఓటు వేశారు. కుటుంబసభ్యులతో ఓటు వేసిన మహేశ్వర్రెడ్డి భైంసాలో ఓటువేసిన ఎమ్మెల్యే రామారావుపటేల్ -
‘స్ట్రాంగ్రూం’లో భవితవ్యం
నిర్మల్: పార్లమెంట్ ఎన్నికల మహాక్రతువును జిల్లా అధికారులు ప్రశాంతంగా పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 926 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకూ పోలింగ్ సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. ఎట్టకేలకు జిల్లాలో పోలింగ్పర్వాన్ని ప్రశాంతంగా ముగించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయమిచ్చారు. ఆరుగంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి సమయం దాటినా ఓటువేసే అవకాశమిచ్చారు. దీంతో కొన్ని కేంద్రాల్లో ఆలస్యమైంది. కేంద్రాలలో ఉన్న ఓటర్లతో ఓట్లు వేయించి, తమకు అప్పగించిన పోలింగ్ సామగ్రిని తీసుకుని సిబ్బంది పంపిణీ కేంద్రాలకు వద్దకు వచ్చేసరికి రాత్రయ్యింది. స్వీకరించిన అధికారులు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో, ముధోల్లో బాలుర గురుకులంలో, ఖానాపూర్కు సంబంధించి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లో సిబ్బంది పోలింగ్ సామగ్రిని తిరిగి జాగ్రత్తగా అప్పజెప్పారు. అధికారులు వీరి కోసం పోలింగ్ కేంద్రాల నుంచి స్వీకరణ కేంద్రాల దాకా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది తీసుకువచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని సరిచూసుకుని తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు మళ్లీ వాటిని స్ట్రాంగ్రూమ్ల్లో పెట్టారు. ఈప్రక్రియను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అమ్మద్ పరిశీ లిచారు. అర్ధరాత్రి బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈవీఎంలు స్వీకరించిన అధికారులు బందోబస్తు మధ్య ఆదిలాబాద్ తరలింపు -
నిర్మల్
మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024నిర్మల్ జూనియర్ కళాశాలలో బారులుతీరిన ఓటర్లు ఓటేసిన ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కూతుళ్లు మొరాయించిన ఈవీఎంలు.. యథావిధిగా ఈ ఎన్నికల్లోనూ పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. చాలా గ్రామాల్లో పొద్దున్నే వచ్చిన ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టాయి. పలుచోట్ల ఓటర్లు నిరీక్షించే ఓపిక లేక వెనుదిరిగి, మళ్లీ వచ్చారు. సమయం వృథా కావడంతో కొంతమంది పోలింగ్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడటం కనిపించింది. ● భైంసాలోని 130 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ●ముధోల్ మండలం చించాల గ్రామంలో 30 నిమిషాలపాటు ఈవీఎం మొరాయించింది. ●లక్ష్మణచాంద మండలం పొట్టపల్లిలో ఈవీఎం రెండుసార్లు మొరాయిచింది. టెక్నికల్ అధికారులు వచ్చి, మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. ●భైంసాలోని గుజిరిగల్లీ 157 పోలింగ్ కేంద్రంలో సాంకేతిక సమస్యతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ●నిర్మల్లోని 238వ పోలింగ్ కేంద్రంలో గంటపాటు ఈవీఎంలు మొరాయించడంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. ●దిలావర్పూర్ మండలం కాల్వ, దిలావర్పూర్ కేంద్రాల్లో కొద్దిసేపు ఈవీఎంలు పనిచేయలేదు. ● లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో భారీగా పోలింగ్ ● గత ఎన్నికలకంటే అధికంగా నమోదు ● సహకరించిన వాతావరణం ● ఉత్సాహంగా ఓటేసిన యువఓటర్లు ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ● పర్యవేక్షించిన ఉన్నతాధికారులునిర్మల్: లోక్సభ ఎన్నికలకు జిల్లా ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి చైతన్యం పెరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక తొలి ఓటు వేసేందుకు యువతరం ఆసక్తిగా తరలివచ్చింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 69.59 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 64.61శాతం కాగా, ఈసారి ఆరు శాతం పెరిగింది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, అల్లంపల్లి, బాబానాయక్తండావాసుల ఆందోళనలు మినహా.. మొత్తంమీద లోక్సభ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయడంతోపాటు పకడ్బందీగా బందోబస్తు, అనుక్షణం పర్యవేక్షణ చేయడం కనిపించింది. నిండు వేసవిలోనూ పోలింగ్రోజు ఎండ ప్రభావం కూడా లేకపోవడంతో ఓటర్లు రోజంతా ఓటేశారు. ఈసారి కూడా పట్టణ ఓటర్ల కంటే పల్లెవాసులే నయమనిపించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. రోజంతా పోలింగ్.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి రోజంతా ఒకేరీతిన కొనసాగింది. ఎండ ఎక్కువగా లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండటంతో ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓట్లు వేస్తూ వచ్చారు. గతంలో మధ్యాహ్నం ఓటింగ్ తక్కువగా నమోదయ్యేది. ఈసారి అలాకాకుండా రోజంతా ఒకేలెక్కన నమోదయ్యింది. వేకువజామున 5 గంటల నుంచి 7 గంటల వరక సిబ్బంది మాక్పోలింగ్ చేపట్టారు. అప్పటికే చాలా గ్రామాల్లో క్యూలైన్లు నిండిపోయాయి. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. మొదటి రెండు గంటల్లోనే 13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల వరకే దాదాపు 32 శాతం పోలింగ్ పూర్తయింది. ఇక ఒంటిగంటకే జిల్లాలో 50 శాతం ఓట్లు పడటం విశేషం. ప్రతీ రెండు గంటలకు 10–12శాతం చొప్పున పోలింగ్ నమోదవుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 69.59 శాతం పోలింగ్ నమోదైంది. చివరిగంటలోనూ చాలా గ్రామాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పల్లెలే నయం.. మరోసారి పట్టణ ఓటర్లు ఓటు వేయడంలో కాసింత నిరాసక్తతనే కనబర్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటామని ప్రల్లె ప్రజలు మరోసారి చాటారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సాయంత్రం 5 గంటల వరకు ఖానాపూర్ నియోజకవర్గంలో 67.02 శాతం నమోదుకాగా, ముధోల్లో ఏకంగా 72.73 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే నిర్మల్ నియోజకవర్గంలో 69.03 శాతం నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. వసతులు భేష్.. లోక్సభ ఎన్నికలకు జిల్లా అధికారులు కల్పించిన వసతులు పర్వాలేదనిపించాయి. ఎండలో వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మినహా చాలా కేంద్రాల్లో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం వాహనాలను, వీల్చైర్లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చేవారికి సులువుగా ఓటు చూసుకునేలా ఓటర్ హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏఎన్ఎంతోపాటు దివ్యాంగులకు సహకరించడానికి వలంటీర్లను, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను నియమించారు. అధికారుల పర్యవేక్షణ.. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికను పూర్తిచేసేందుకు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలోని జిల్లా అధికారబృందం, సిబ్బంది సమష్టిగా శ్రమించారు. పోలింగ్రోజు జిల్లా ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కలెక్టర్ కంట్రోల్రూమ్ నుంచి అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించారు. -
తడిసిన ధాన్యం కొంటాం
ఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిషోర్బాబు శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తడిసి న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను విన్నవించారు. కొనుగోలు కేంద్రం నిర్వహణ సక్రమంగా లేదని, నిర్వాహకులు పట్టించుకోవ డం లేదని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో ఆశన్నతోపాటు రైతులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కుంటాల/నర్సాపూప్(జి): లోకసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. కుంటాల మండలం అంబకంటి, కుంటాల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను, నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 299, 300, 303, బమ్ని(బి) గ్రామంలోని 79 పోలింగ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. విద్యుత్, తాగు నీరు, మూత్ర శాలలు, ర్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రహీం, పంచాయతీ కార్యదర్శులు ఉత్తం, రాజబాపు, రమ్య, వీణారెడ్డి, గంగాజల ఉన్నారు. అసత్య ప్రచారం చేయొద్దు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: సమాజంలో అలజడి సృష్టించేందుకు అసత్య ప్రచారం చేయొద్దని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. ఈనెల 9న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భైంసాలో నిర్వహించిన రోడ్ షోలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపినట్లు చెప్పారు. కేటీఆర్ వెళ్లిపోయిన తర్వాత జన సమూహంలో ఇద్దరిపై కర్రలతో, ప్లకార్డుకు ఉన్న ఇనుప రాడ్లతో దాడి జరిగిందని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించి 23 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో హనుమాన్ మాలధారులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై అస త్య ప్రచారం చేయొద్దని సూచించారు. కేటీఆర్ పై దాడి చేయడంతో అరెస్టు చేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. -
బీజేపీతో భరోసా
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిసారంగపూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అందరూ భరోసాగా ఉంటారని, నిరుపేదల బతకులు బాగుపడతాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు తప్పవని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని స్వర్ణ గ్రామంలో శనివారం ఉపాధిహామీ కూలీలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తు కు ఓటువేసి ఎంపీగా గోడం నగేశ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, రాజేందర్రెడ్డి, అబ్దుల్ హదీ, విలాస్, తిరుమలచారి, చెన్న రాజేశ్వర్, రాంశంకర్రెడ్డి, మధు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఖానాపూర్/కడెం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలి స్తేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో, కడెం మండలం అంబారిపేట్ గ్రామం నుంచి పాండ్వపూర్, కొండుకూర్, కడెం మీదుగా ఖానాపూర్ వరకు బైక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి శనివారం ర్యాలీ, రోడ్షో నిర్వహించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగం పరిరక్షించాల న్నా, రిజర్వేషన్లను కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి,రాహుల్గాంధీని ప్రధానిని చేయాలన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో మండలంలోని గోసంపల్లె పంచాయతీ పరిధిలో గల నడింపల్లె గ్రామానికి చిప్ప దేవన్నతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కడెం మండల అధ్యక్షుడు మల్లేశ్, యూత్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, నాయకులు భూషణ్, వెంకటేశ్, శంకర్, లచ్చన్న, చిన్నం సత్యం, దయానంద్, నిమ్మల రమేశ్, షబ్బీర్పాషా, కావలి సంతోష్, శంకర్, సత్యం, వెంకాగౌడ్, రాజేందర్, రాజేశ్వర్, శ్రీనివాస్, గంగాధర్, గంగనర్సయ్య, అమానుల్లాఖాన్, సత్యనారాయణ, సురేశ్, సచిన్, జహీర్ అహ్మద్, లక్ష్మీపతి, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
● కేంద్రాల వారీగా కేటాయింపు ● పార్లమెంట్’ పరిధిలో 10,548 మందికి విధులు కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలు, మైక్రోఅబ్జర్వర్స్ లోకేషన్ చివరి ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం చేపట్టారు. సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే , నిర్మల్ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ సమక్షంలో ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,200 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు. 2,637 మంది పీవోవోలు, 2,637 మంది ఏపీవోలు, 5,274 మంది ఓపీవోల చొప్పున మొత్తం 10,548 మందిని ఆ యా నియోజకవర్గాలకు నియమించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గానికి 1,400 మందిని కేటాయించగా, బోథ్ నియోజకవర్గానికి 1,468, ఆసిఫాబాద్కు 1,708, సిర్పూర్కు 1,536, నిర్మల్కు 1,468, ఖానాపూర్కు 1,476, ముధోల్కు 1,492 మందిని కేటాయించారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఎన్నికల అధికారులు, ఈడీఎంలు పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు.. నియోజకవర్గం పోలింగ్కేంద్రాలు పీవోలు ఏపీవోలు ఓపీవోలు ఆదిలాబాద్ 292 350 350 700 బోథ్ 306 367 367 734 ఆసిఫాబాద్ 356 427 427 854 సిర్పూర్ 320 384 384 768 నిర్మల్ 306 367 367 734 ఖానాపూర్ 309 369 369 738 ముధోల్ 311 373 373 746 -
నిర్మల్
మమతల తల్లీ... ‘అమ్మ’ తన ఆయుష్షును తనయుల కోసమే దారబోస్తుంది. నేడు ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’ సందర్శంగా కథనం. నిస్వార్థ సేవకులు ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించే నిస్వార్థ సేవకులు నర్సులు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20242లోu ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు నియమ నిబంధనలపై శనివారం అవగహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించే అన్నిరకాల రిజిస్టర్లు, ఫారాల గురించి తెలియజేశారు. ఆదివారం ఉదయం ఈవీఎంల పంపిణీ కేంద్రానికి వచ్చి అన్నిరకాల ప్రక్రియలు పూర్తిచేసి మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో నిర్దేశించిన డేటా ఎంట్రీ యాప్లో పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు పంపాలన్నారు. ఈవీఎం యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి పోలింగ్ నిలిచిపోతే పోలింగ్ను తిరిగి త్వరితగతిన ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు, సిబ్బందికి ఎన్ని కల విధులపై అవగహన కల్పించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న పార్లమెంట్ పోరులో ప్రచారపర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం నిర్వహించే ఓట్లపండుగకు ఆదివారం ఉదయం నుంచే అసలు కథ మొదలవుతోంది. పార్టీలు, అభ్యర్థులు జోరుగా తిరగడం, ప్రచారాన్ని హోరెత్తించడం ఒకెత్తయితే.. ఆదివారం, సోమవారం ఈ రెండురోజులపాటు ఓపికతో, ప్రశాంతంగా ఎన్నికల సిబ్బంది పనిచేయడం మరో ఎత్తు. అభ్యర్థులు, నాయకులు విజయం కోసం శ్రమిస్తే.. అధికారులు, సిబ్బంది ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసేందుకు రెండురోజులు నిర్విరామంగా పనిచేస్తారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పోలింగ్ సామగ్రిని, ఈవీఎంలను అందించడానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 926 పోలింగ్ కేంద్రాలు.. లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 926 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఇందులో 149 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ పీవో, ఏపీవో, ఓపీవోలతోపాటు అదనంగా 106 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అదనపు పోలీసు బలగాల పర్యవేక్షణ కూడా ఉండనుంది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 7,37,416 మంది ఓటర్లు.. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,37,416 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 3,82,107 మంది, పురుషులు 3,55,259 మంది, ఇతరులు 50 మంది ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే 26,848 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ.. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశారు. నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో, ముధోల్లో గురుకుల విద్యాలయంలో, ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఉట్నూరు కేబీకాంప్లెక్స్లో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలింగ్ సామగ్రినంతా ఒకే బ్యాగ్లో పెట్టి సిబ్బందికి అందించే ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పంపిణీకి సిద్ధం చేశారు.న్యూస్రీల్ జిల్లాలో 926 పోలింగ్ కేంద్రాలు.. అందులో సమస్యాత్మకం.. 149 జిల్లాలో ఓటర్ల సంఖ్య..7,37,416 సన్నద్ధమవుతున్న పోలింగ్ సిబ్బంది నేడు నియోజకవర్గకేంద్రాల్లో ‘సామగ్రి’ పంపిణీ వివరాలు: మొత్తం ఓటర్లు: 7,37,416 పురుషులు: 3,55,259 మహిళలు: 3,82,107 ఇతరులు: 50 పంపిణీ/స్వీకరణ కేంద్రాలు : 03(ముధోల్, నిర్మల్, ఉట్నూర్) మొత్తం పోలింగ్ కేంద్రాలు: 926(నిర్మల్:306 ముధోల్:311 ఖానాపూర్ :309) సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 149మహిళా పోలింగ్ కేంద్రాలు : 03మోడల్ పోలింగ్ కేంద్రాలు : 03పీఓ, ఏపీఓ, ఓపీఓలు : 4,436మైక్రో అబ్జర్వర్లు : 106 ప్రశాంతంగా పూర్తిచేసేలా.. జిల్లాలో లోక్సభ ఎన్నికలనూ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ఈ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలూ సహకరించాలి. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. –ఆశిష్సంగ్వాన్, కలెక్టర్పకడ్బందీగా బందోబస్తు.. జిల్లా మొత్తం ఇప్పటికే పోలీసుల రక్షణ వలయంలో ఉంది. జిల్లా అంతటా పోలీసు బలగాలను సిద్ధం చేశాం. పోలింగ్ ప్రక్రియకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలుగకుండా పోలీసులను మోహరిస్తున్నాం. ప్రజలు కూడా ప్రశాంత పోలింగ్కు సహకరించాలని కోరుతున్నాం. –జానకీషర్మిల, ఎస్పీరెండురోజులు.. నిర్విరామంగా.. జిల్లాలో మొత్తం 1,109 మంది చొప్పున పీవోలు, ఏపీవోలు, 2,218 ఓపీఓలు ఉన్నారు. వీరంతా ఆదివారం ఉదయం కచ్చితంగా తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఆదేశించారు. ఇక ఈ ఎన్నికల యుద్ధాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తూ.. విజయవంతంగా పూర్తిచేసే బాధ్యత పోలింగ్ సిబ్బందిపైనే ఉంటుంది. వీరంతా ఆదివారం సామగ్రి తీసుకోవడం, పరిశీలన చేసుకోవడం, అనంతరం తమ బృందంతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, అక్కడ ఏ రాత్రయినా.. ఏర్పాట్లు చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. సోమవారం ఉదయం 5 గంటలకే మాక్పోలింగ్ చేపట్టాలి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ను సజావుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం అన్నీ సరిచూసుకుని మళ్లీ ఈవీఎంలతో పాటు పోలింగ్ సామగ్రిని తిరిగి కేంద్రాల్లో అప్పజెప్పాలి. ఏరాత్రయినా.. ఓపికతో ఈ పనులన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బంది కూడా మానసికంగా సన్నద్ధమవుతున్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ నిర్మల్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి వికాస్రాజ్ ఎన్నికల నిర్వహణ, పో లింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్నిరకాల స్క్వాడ్ సిబ్బందిని మరింత అప్రమత్తంగా చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు మీడియా మానిటరింగ్ అండ్ సర్టిఫికేషన్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే రూట్ ఆఫీసర్ల సమక్షంలో ఈవీఎం యంత్రాల తరలించాలాన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలింగ్ సామగ్రి తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం రిపోర్టులను సమయానికి పంపాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక ల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, డీఆర్వో భుజంగరావ్, ఆర్డీవో రత్నాకళ్యాణి, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీపీవో శ్రీనివాస్, ఇతర జిల్లా నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట నిఘా ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచి, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలోకి పోలీసు బందోబస్తుతో తరలించారు. అనంతరం వివిధ రాజకీ య పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాంకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస్, నాయకులు శ్రావణ్రెడ్డి, రవికుమార్, గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, ఎంబడి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ జానకీషర్మిలభైంసాటౌన్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. భైంసాలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం భైంసాలో కేటీఆర్పై దాడి ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఆధారంగా 23 మందిని గుర్తించామన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భైంసాలో ప్రశాంత వాతవరణం ఉందని, నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రెచ్చగొట్టే పుకార్లను నమ్మొద్దని, సంయమనం పాటించాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ డి.రాజారెడ్డి ఉన్నారు. ‘హనుమాన్ స్వాముల అరెస్ట్ సరికాదు’ కేటీఆర్ రోడ్షో సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపిన హనుమాన్ స్వాములను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్ ఖండించారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో శుక్రవారం మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడంతోపాటు, పోలీసులను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్పై చర్య తీసుకోకుండా, మాలధారణలో ఉన్న స్వాములను అర్ధరాత్రి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిపాండే, అసెంబ్లీ సంయుక్త కన్వీనర్ సుమన్, నాయకులు బాలాజీ సూత్రావే, రావుల పోశెట్టి, దశరథ్ ఉన్నారు. -
జిల్లాకు చేరుకున్న పోలీసు బలగాలు
నిర్మల్టౌన్: ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన బీఎస్ఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి నిర్మల్కు చేరుకున్నాయి. అంతేకాకుండా పలు జిల్లాల నుంచి సుమారు 1000 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల విధులపై డీఎస్పి గంగారెడ్డి, పట్టణ సీఐ అనిల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో పట్టణ సీఐ అనిల్, బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. -
ప్రతీ హామీ అమలు చేస్తాం
● డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుమామడ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. మండలంలోని పరిమండల్, పొన్కల్, పోతారం, బండలఖానాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధిహామీ కూలీలకు రోజు వేతనం రూ.400 చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు జైసింగ్, సంతోష్, రమణారెడ్డి, లింగారెడ్డి, శేఖర్, లింగన్న, గంగారెడ్డి, నర్సారెడ్డి, అజాం, బాపయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు. సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో.. మండలంలోని నల్దుర్తి, దిమ్మదుర్తి, కప్పన్పల్లి, పొన్కల్ గ్రామాల్లో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజేశ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సత్తన్న, చిన్నరాజన్న, రవి, రాజమణి, బక్కన్న పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
నిర్మల్/సారంగపూర్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరుగ్యారంటీల హామీ ఇచ్చి, ఐదింటిని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. నిర్మల్ ఎంఎస్ ఫంక్షన్హాల్లో అర్భన్ కార్యకర్తలతో, సారంగాపూర్లోని అల్లోల మురళీధర్రెడ్డి కాంప్లెక్స్లో మండల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో శుక్రవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి సంపదను బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఓనిరుపేద గిరిజన మహిళ ఆత్రం సుగుణను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టామని తెలిపారు. ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన గ్యారంటీలతోపాటు అభివృద్ధికిపాటుపడే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, నాయకులు అల్లూరి మల్లారెడ్డి, రామలింగం, ధర్మాజీ రాజేందర్, పాకాల రాంచందర్, అయిర నారాయణరెడ్డి, నల్ల వెంకట్రామిరెడ్డి, మోకుదెబ్బ నాయకులు నర్సాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి -
● ఆడబిడ్డను ఆశీర్వదించండి..
ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి తొలిసారి పోటీచేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డ, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోరారు. కాంగ్రెస్ బైక్ ర్యాలీ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైంది. మధ్యలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మాటలు చెప్పే మోదీ సర్కారు వద్దని, ఇక చేతల్లో అభివృద్ధిని చూపే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిద్దామన్నారు. తాము సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ర్యాలీకి అనుమతి తీసుకున్నామన్నారు. బీజేపీ పోటీగా ర్యాలీ తీయడం దారుణమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి సీతక్క -
● బీజేపీకి ఓటేద్దాం.. మోదీని గెలిపిద్దాం..
కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ ప్రభుత్వం రావా లంటే బీజేపీకి ఓటేద్దామని ఎంపీ అభ్యర్థి నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహేశ్వర్రెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అవినీతిరహిత ప్రభుత్వం కోసం మళ్లీ కమలం గుర్తుకు ఓటేయాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్లకు ఢోకా ఉండదన్నారు. రాష్ట్రంలో మెజార్జీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి మెడలు వంచి పనులు చేయిస్తామన్నారు. ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పెద్దపల్లి ఇన్చార్జి రావుల రాంనాథ్, సీనియర్నేత సత్యనారాయణగౌడ్, భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాలీలో ఎంపీ అభ్యర్థి నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement