breaking news
Nirmal
-
చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: మత్తు పదార్థాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సోమవారం టూటౌన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గుర్ని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. శనివారం రాత్రి రిమ్స్ ఆస్పత్రి పక్కన గల సాయిసేవ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డారని, ఒక సెల్ఫోన్తో పాటు రూ.200 నగదు, టర్మైన్ ఇంజక్షన్లు, మెడజాలమ్ ఇంజెక్షన్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారు మత్తులో ఉండటానికి ఇలాంటి ఇంజక్షన్ల చోరీకి పాల్పడినట్లు వివరించారు. ఈనెల 22న మోయిజ్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో, 23న దస్నాపూర్లోని దుర్గామాత మందిరంలో, 28న సాయిఫాస్ట్ఫుడ్ సెంటర్ పక్కన గల కిరాణ దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో న్యూహౌజింగ్బోర్డుకు చెందిన మహ్మద్ మోయిజ్, చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
ద్విచక్ర వాహనం చోరీ
తానూరు : మండల కేంద్రంలోని జాదవ్ వెంకటేశ్కు చెందిన (పల్సర్) ద్విచక్ర వాహనం చోరికి గురైనట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి వెంకటేశ్ తన ఇంటిముందు నిలిపి ఉంచాడు. ఆదివారం ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.రాయితీ బియ్యం పట్టివేత నార్నూర్: రాయితీ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి పేదలకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పీ.ప్రభాకర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం గాదిగూడ మండల కేంద్రంలో దాడులు నిర్వహించగా కూర శివాజీ దుకాణంలో 17.6 క్వింటాళ్లు, లోకారి–కే గ్రామంలో షేక్ జావిద్ కిరాణా దుకాణంలో 7.3 క్వింటళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం లభించినట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. -
ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఏఏసీ ఫైల్ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్)పీహెచ్డీ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్ మహేష్, డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, అన్ని విభాగాల హెచ్ఓడీలు, పీఆర్వో విజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజ సేవలో చంద్రదత్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన వైద్యుడు జీవీఎంఎస్ చంద్రదత్ ఐబీ సమీపంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. తరచూ ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు సైతం అందిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితినిబట్టి ఫీజులు తీసుకుంటున్నారు. అనవసరమైన టెస్టులు చేయకపోవడం, అవసరానికి మించి మందులు రాయడం వంటివి లేకపోవడంతో ప్రజలు నమ్మకంగా వస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ, వృద్ధాశ్రమంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఆశ్రమాలకు అవసరమైన సరుకులు, నగదు అందజేస్తున్నారు. – డాక్టర్ చంద్రదత్, జనరల్ మెడిసిన్ -
జీవితం పేదల కోసమే..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నా. పేదలకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశా. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నా. నిత్యం 300 నుంచి 400 మంది ఆయా సేవల నిమిత్తం వస్తుంటారు. చివరి పేషెంట్ వరకు ఏరోజుకు ఆరోజు స్కానింగ్ చేయడంతో పాటు రిపోర్టులు తయారు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. సేవలకు గుర్తింపుగా కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా. – నూతుల కళ్యాణ్రెడ్డి, ప్రొఫెసర్, రిమ్స్ ప్రజలకు సేవ చేయాలని.. ఆదిలాబాద్టౌన్: వరంగల్లోని కేఎంసీలో వైద్య విద్య అభ్యసించా. ఢిల్లీలో పీజీ పూర్తి చేశా. అక్కడే అంబేడ్కర్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించా. జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించాలని తండ్రి శ్రీరాములు కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యునిగా చేరారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నా. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. – డాక్టర్ ఆడె విఠల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్ -
25 ఏళ్ల అనుభవం..
1995లో గాంధీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, 1998లో ఎండీ, పిడియాట్రీషన్ పూర్తిచేశా. మూడేళ్లపాటు నిజామాబాద్లో పిల్లల వైద్యునిగా పనిచేశా. 2012లో నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైనప్పటి నుంచి వివిధ హోదాలలో సేవలు అందించా. గతేడాది నుంచి నిర్మల్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టా. ఈ 25 ఏళ్ల అనుభవంలో ఎంతో మందికి సేవలు అందించా. పేదలకు సేవ చేయడం గొప్పగా భావిస్తున్నా. – డాక్టర్ గోపాల్సింగ్, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆసుపత్రి, నిర్మల్ వైద్యసేవలు అందించాలనే.. పేదలకు వైద్యసేవలు అందించాలనే వైద్యవృత్తిని ఎంచుకున్నా. 25 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే వసతులు, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. వైద్యవృత్తి సేవా దృక్పధంతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసమే కాకుండా స్వచ్ఛందంగా వైద్య సేవలందించాలి. – డాక్టర్ కాశీనాథ్, సూపరింటెండెంట్, భైంసా ఏరియా ఆసుపత్రి -
విద్యుత్షాక్తో మహిళ మృతి
తలమడుగు: విద్యుత్షాక్తో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన జువ్వాక లక్ష్మి (48) ఆదివారం రాత్రి ఇంట్లోకి సరఫరా అయ్యే విద్యుత్ తీగపై ఆరేసిన బ ట్టలు తీస్తుండగా షాక్కు గురికావడంతో కిందపడిపోయింది. గమనించిన కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. మృతురాలికి భర్త పోచ్చ న్న, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
బైక్ల దొంగ అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ద్విచక్ర వాహనం దొంగలించిన ఆదిలా బాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన షేక్ నదీమ్ను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన మహ్మద్ షాబాద్ఖాన్ ఏప్రిల్ 11న బస్టాండ్లో పల్సర్ బైక్ పార్కింగ్ చేసి నిర్మల్కు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చిన ఆయన బైక్ కనిపించకపోవడంతో 15న టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఇందిరానగర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిందితుడు అటువైపు నుంచి బైక్పై వస్తుండగా అనుమానం వచ్చి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విచారించగా రెండు బైక్లు చోరీ చేసినట్లు తెలిపాడు. నిందితుడిపై ఇదివరకే రూరల్ పోలీసు స్టేషన్లో 2, టూటౌన్ పోలీసు స్టేషన్లో 2 చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు. -
సఫారీకి సెలవు
● జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేత ● అక్టోబర్ నుంచి పునఃప్రారంభం జన్నారం: కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్లో జంగల్ సఫారీకి అటవీశాఖ మూడు నెలలపాటు సెలవు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చదనం పంచుతున్న అడవి అందాలను తిలకించేందుకు పర్యాటకశాఖ జన్నారంలో హరిత రిసార్ట్లు ఏర్పాటు చేయగా పర్యాటకశాఖ రెండు సఫారీలు, అటవీశాఖ ఐదు సఫారీలు ఏర్పాటు చేశారు. జన్నారం వచ్చిన పర్యాటకులు సఫారీ ద్వారా దట్టమైన అడవిలోనికి వెళ్లి పచ్చని చెట్ల నడుమ పర్యటించడం వల్ల ఆహ్లాదం పొందుతున్నారు. అడవుల అందాలను, వన్యప్రాణుల పరుగులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మూడు నెలలపాటు నిలిపివేత అడవుల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మూడు నెలల పాటు సఫారీ ప్రయాణానికి అనుమతి లేదు. ఎందుకంటే వర్షాకాలంలో వన్యప్రాణులు ఎదకు వచ్చి బయట విచ్చలవిడిగా తిరుగుతాయి. సఫారీ ప్రయాణంతో వాటికి ఆటంకం కలుగుతుంది. వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దనే ఉద్దేశంతో మూడు నెలలు (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) అనుమతులు నిరాకరిస్తూ అటవీశాఖ అధికారులు పర్యాటకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. మూణ్నెళ్లు బంద్చేస్తాం ఎన్టీసీఏ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలలపాటు సఫారీ ప్రయాణం బంద్ చేయడం జరుగుతోంది. వర్షాల కారణంగా అడవిలో బురదలో వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్లో తిరిగి అనుమతులు ఇస్తాం. పర్యాటకులు గమనించాలి. – రామ్మోహన్, ఎఫ్డీవో -
మేమున్నామని..
వృత్తిలో తృప్తి రోగులకు వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో విజయాలు సాధించినప్పుడు కలిగే ఆనందం గొప్పది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా విధులు నిర్వహిస్తున్నా. వైద్య వృత్తిలో తృప్తి లభిస్తోంది. – శివకుమార్, కడెం పీహెచ్సీ నమ్మకమైన సేవలు అందించాలి అమ్మానాన్నల ప్రోత్సాహంతో వైద్య కోర్సు పూర్తిచేశా. వైద్యోనారాయణోహరి అనే నానుడిని నేడు కార్పొరేట్ ఆస్పత్రులు పూర్తిగా డబ్బులకు ఆశపడి మరిచిపోతున్నాయి. వైద్యులు రోగులకు నమ్మకమైన సేవలందించాలి. వైద్యరంగంలో రాణించాలనుకునే యువత ముందుగా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. వైద్యులు ముఖ్యంగా మాతాశిశు మరణాలు జరగకుండా ఆపగలిగితే మనదేశం అభివృద్ధిలో మరింత ముందుంటుంది. – డాక్టర్ ప్రత్యూష, లక్ష్మణచాంద పీహెచ్సీ -
ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్ కోరారు. ఫో రం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వ ద్ద శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శేఖర్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఒక కమిషన్ వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని కోరారు. ప్రతీ ఉద్యమకారునికి 25 చదరపు గజాల స్థలం, గృహ నిర్మాణానికి రూ.10 లక్షల సాయం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీ, రూ.25వేల పెన్షన్, ఉద్యమంలో సర్వం కోల్పోయిన విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనను నిరసిస్తూ జూలై 2నుంచి సెప్టెంబర్ 17వరకు ఫోరం ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా శాంతిదీక్ష చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఫోరం నాయకులు సామ కిరణ్రెడ్డి, పా కాల రాంచందర్, సామల వీరయ్య, వెంకట్రామ్రెడ్డి, నర్సయ్య, గోపి, గంగన్న, ఇస్మాయిల్, శివాజీ, దేవిదాస్, వినోద్, జగన్, షరీఫ్, సాయన్న, చంద్రశేఖర్, భూమేశ్, శంకర్, విద్యాసాగర్రెడ్డి, కిషన్, నవీన్కుమార్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
రంజనిలో ఎర్రచందనం సాగు
● పంట కాలపరిమితి పదిహేనేళ్లు ● అంతర పంటల సాగుకు అవకాశం ● లాభసాటి అంటున్న అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు నేను ఐదేళ్ల క్రితం ఎకరన్నరలోఎర్రచందనం మొ క్కలు నాటాను. ప్రారంభంలో ఉద్యానవనశాఖ, ఉపాధిహామీ అధికారులు వచ్చి చూశారు. కానీ.. ఇప్పటివరకు నయాపైసా రాలేదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతమంది రైతులు సాగు చేసేందుకు ముందుకువస్తారు. – సట్ల మహేందర్, రైతు, రంజిని కుభీర్: మండలంలోని రంజని గ్రామానికి చెందిన సట్లావార్ మహేందర్ మిగతా రైతుల కంటే భిన్నంగా ఆలోచించాడు. ఉద్యానవన, ఉపాధిహామీ అధి కారుల సూచనలు, సలహాలతో ఎకరన్నరలో ఎర్ర చందనం సాగు చేశాడు. ములుగు జిల్లా నుంచి తె చ్చిన 500 ఎర్రచందనం మొక్కలను 10 ఫీట్ల పొడ వు, వెడల్పుతో నాటాడు. మధ్యలో అంతరపంటగా సరుగు మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నాడు. ఎ ర్రచందనం పంట కాలపరిమితి 15 ఏళ్లు కాగా మొ క్కలు నాటి ఐదేళ్లవుతోంది. మరో పదేళ్లలో పంట చేతికి రానున్నట్లు రైతు మహేందర్ తెలిపాడు. సాగు విధానం ఇలా.. రెండు ఫీట్ల గోతిలో పశువుల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువు వేసి మొక్కలు నాటాలి. ప్రతీ ఆర్నెళ్లకో సారి సేంద్రియ ఎరువు వేయాలి. కలుపు ఎక్కువైతే గడ్డి మందు పిచికారి చేయాలి. వారానికోసారి నీటి తడులు ఇవ్వాలి. ఎర్రచందనం పరాన్న మొక్క కావడంతో మధ్యలో సరుగు మొక్కలు నాటాలి. దీంతో సరుగు మొక్కల వేర్ల నుంచి ఎర్రచందనం మొక్క ఆహారం తీసుకుంటుంది. దీనికి పూత వచ్చి కాయలు కూడా కాస్తాయి. చీడపీడలు ఏమీ ఉండవు. చె ట్టు కాండానికి రంధ్రం ఏర్పడుతుంది. అప్పుడు క్లో రిఫైయిడ్ మందును ఇంజక్షన్ ద్వారా రంధ్రంలో వే యాలి. ఈ పంటలో అంతరపంటగా కంది, పసుపు తదితర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. ఇవీ.. ఉపయోగాలు ఎర్రచందనాన్ని సబ్బులు, ఆయుర్వేద మందుల త యారీకి ఉపయోగిస్తారు. రక్తం శుద్ధి కావడానికి, కి డ్నీ సంబంధిత వ్యాధులను నయం చేసుకోవడానికి దీని ద్వారా తయారైన మందులు ఉపయోగిస్తారు. రష్యా, చైనాలో దీని కలపతో తయారైన వంటపాత్రలు వాడతారు. ఒక్కో చెట్టునుంచి సుమారు 15 నుంచి 20కిలోల ఎర్ర చందనం దుంగలు వస్తాయి. కిలో ఎర్రచందనం విలువ రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. ఏపీలోని రాయలసీమ, నల్లమల అడవుల్లో ఉండే ఈ చెట్లను ఇక్కడి రైతులు సాగు చేసేలా ఉద్యానవనశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. నర్సరీల్లో ఎర్రచందనం మొక్కలు పెంచి రైతులు సాగు చేసేలా చూస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ఒక్కో చెట్టుద్వారా రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుంది. లాభసాటిగా మారిన ఎర్రచందనం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. -
తనిఖీలకు కమిటీలు
నిర్మల్● పక్కాగా సర్కారు స్కూళ్ల పర్యవేక్షణ ● ప్రత్యేక బృందాల భర్తీకి ఉత్తర్వులు ● బోధన పర్యవేక్షణకు మరో వ్యవస్థ ● అభ్యంతరం తెలుపుతున్న సంఘాలు మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలి నిర్మల్టౌన్: సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల పోలీసు అధి కారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించి జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మా ట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రిటైర్డ్ ఎస్సైకి సన్మానం భైంసా టౌన్ ఎస్సైగా పని చేసి రిటైర్డయినా ఎండీ గౌస్ను జిల్లా కేంద్రంలోని ప్రధాన పో లీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల స త్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేంద్రరెడ్డి, రాజేశ్మీనా, ఏవో యూనిస్ ఆలీ, ఆర్ఐలు రామ్ నిరంజన్, శేఖర్, రమేశ్ ఉన్నారు. నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియ తీరును పర్యవేక్షించేందుకు మరో కొత్త వ్య వస్థ ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చు ట్టింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీ న్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, నోడల్ అ ధికారులు, డీఈవోలు, అకాడమిక్ మానిటరింగ్ అ ధికారులు, సెక్టోరియల్ అధికారులు వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విద్యాశాఖ పాఠశాలలవారీగా బోధన తీరు, విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించేందుకు ఉపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేయనుంది. పర్యవేక్షణ బృందాల విధులు విద్యాశాఖ తాజాగా నియమించనున్న తనిఖీ కమి టీ సభ్యులు తమ పరిధిలో పాఠశాలలను పరిశీలి స్తారు. బోధనాభ్యసన ప్రక్రియ తీరు, మౌలిక వసతులు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, విద్యావిషయాక అంశాల అమలు, విద్యార్థులు, ఉపాధ్యాయు ల హాజరు తదితర విద్యా సంబంధిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తనిఖీల్లో గుర్తించిన వివరాల ఆధారంగా నివేదికలు రూపొందించి ప్రతినెలా జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తారు. వీటిపై కలెక్టర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవీ.. మార్గదర్శకాలు విద్య నాణ్యత పెంపునకు పాఠశాలలపై పర్యవేక్షణ బలపరచాలి. తనిఖీకి రెండు శాతం ఉపాధ్యాయులతో పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఉపాధ్యాయులకు కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం తప్పనిసరి. శిక్షణ, టెక్నాలజీలపై సరైన పరిజ్ఞానం అవసరం. శిక్షణ ఫలితాలపై దృష్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. పాఠశాలల్లో పాఠ్యాంశాలు, లెసన్ ప్లాన్ల ప రిశీలన, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహపాఠ్య కార్యకలాపాలు, స్పోర్ట్స్, డిజిటల్ ఎడ్యుకేష న్, ఆరోగ్య తనిఖీలు, టాయిలెట్లు, తాగునీరు, ప్ర హరీ, విద్యుత్, ఆడిటోరియం, ఆటస్థలం పరిశీల న, విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ పరిస్థితి, ఫలితాలు, పాఠ్య ప్రణాళికల అమలుపై పరిశీలన చేయాలి. టీచర్స్ యూనియన్ల అభ్యంతరం పాఠశాలల పర్యవేక్షణ తనిఖీల కోసం ఇప్పటికే అనేక రకాల వ్యవస్థలు ఉండగా మళ్లీ ఉపాధ్యాయులతో కొత్త కమిటీలు నియమించే అంశంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్, మండల నోడల్ అధికారులు, మండల విద్యాధికారి, అకాడమీ మానిటరింగ్ ఆఫీ సర్, సెక్టోరియల్ అధికారులు లాంటి అనేక వ్యవస్థలు కొనసాగుతుండగా వీటికి సమాంతరంగా మరో కొత్త తనిఖీ వ్యవస్థ ఏర్పాటుపై అభ్యంతరం చెబు తున్నారు. ఉపాధ్యాయులను తనిఖీ కమిటీలోకి తీ సుకుంటే విద్యార్థులకు నష్టం చేకూరుతుందని, ఉ పాధ్యాయుల కొరత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వెంటనే పర్యవేక్షణ కమిటీ నియామక ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.న్యూస్రీల్ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, క్లస్టర్ల వివరాలుజిల్లా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మొత్తం మండలాలు క్లస్టర్లు నిర్మల్ 488 83 118 689 19 48 ఆదిలాబాద్ 455 102 109 666 21 71 మంచిర్యాల 480 95 108 683 18 51 కుమురంభీం 526 99 60 685 15 67 -
నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
లక్ష్మణచాంద: నాలుగు లేబర్ కోడ్లను వెంట నే రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్న కోరారు. మండలంలోని వడ్యా ల్ గ్రామంలో సోమవారం నిర్వహించిన స మావేశంలో మాట్లాడారు. కార్మికులకు నెలకు రూ.26వేల కనీస వేతనం ఇవ్వాలని, కనీస పె న్షన్ రూ.9వేలు ఇవ్వాలని కోరారు. బీడీ పరిశ్రమపై విధించిన 28శాతం జీఎస్టీ తగ్గించాలని, కోర్ఫా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చే శారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చే యాలని కోరారు. సమావేశంలో నాయకులు గంగన్న, సాయన్న, భీమేశ్, నారాయణ, శంకర్, రమేశ్, రాజేశ్వర్, మురళి, చిన్నక్క, లక్ష్మి, రాజమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి 105 అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని అధికా రులకు సూచించారు. అనంతరం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) పోస్టర్ ఆవి ష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫై జాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కలెక్టర్ కార్యాలయం నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో విద్యుద్దీపాలు వెలగకపోవడంతో వివిధ పనుల రీత్యా నిర్మల్ పట్టణానికి వెళ్లే మహాలక్ష్మివాడ, డబుల్ బెడ్రూం, నాగనాయిపేట కాలనీవాసులం రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నాం. వెంటనే సెంట్రల్ లైటింగ్కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించి సమస్య పరిష్కరించాలి. – నవీన్, మహాలక్ష్మివాడ ఉద్యోగమిప్పించాలి నేను 2024 డీఎస్సీలో పరీక్ష రాసి ఉత్తీర్ణుడనయ్యాను. తాండూరు మండలానికి చెందిన పాటిల్ అంబాదాస్ సంభాజీ ఐదోతరగతి నుంచి మహారాష్ట్రలో చదివాడు. 2012, 2018 డీఎస్సీలో అతడిని టీఎస్పీఎస్సీ నాన్ లోకల్ క్యాండెట్గా తిరస్కరించింది. కానీ, 2024 డీఎస్సీలో లోకల్ క్యాండెట్గా పరిగణించి నాకు రావాల్సి న ఉద్యోగం అతడికిచ్చారు. విచారణ చేపట్టి నాకు ఉద్యోగమిప్పించాలి. – బీ నాగనాథ్, జవ్లా బీ, తానూరు ● ప్యాకేజీ 27లో గొల్లమడ గ్రామం మీదుగా 5.3 కిలో మీటర్ల మేర డ్రైన్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టగా గ్రామానికి చెందిన దాదాపు పదిన్నర ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని గొల్లమాడ రైతులు తెలిపారు. బ్రిడ్జి నిర్మించి ఏడాదైనా పరిహారం అందలేదని పేర్కొన్నారు. వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు. ● బేస్తవార్పేట కాలనీలోని రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ● తమ గ్రామంలోని 249 సర్వే నంబర్లోగల ఎకరం భూమి చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి కేటాయించాలని ముధోల్ మండలం బోరిగం గ్రామ రజకులు కలెక్టర్ను కోరారు. ● రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడోబా అందేరి రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుతూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్–ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను గజిట్లో పేర్కొంటూ తీసుకువచ్చిన జీవో 49ని, కుమురంభీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ● అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి పెండింగ్ వేతనాలు ఇప్పించాలని జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటళ్లలో పని చేసే ఆరోగ్య మిత్రలు కోరారు. ఏజెన్సీ కాలపరిమితి పెంచి తాము ఉపాధి కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వినతుల్లో మరికొన్ని.. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణికి 105 అర్జీలు -
ఆసరా.. ఏదయా?
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు చవాన్ సోమల. కుభీర్ మండలం కసర గ్రామానికి చెందిన సోమల ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పింఛన్ తీసుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే పెన్షన్ విధానం తెచ్చింది. దీంతో సోమల పెన్షన్ కట్చేసి ఆయన భార్య తిత్రీబాయికి వితంతు పెన్షన్ రూ.2 వేలు మంజూరు చేసింది. సోమల బతికి ఉండగానే వితంతు పింఛన్ మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం తిత్రీబాయి మరణించింది. ఆమె తర్వాత తనకు వద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని సోమల అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. కానీ, ఆన్లైన్లో అతను చనిపోయినట్లు నమోదైంది. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
నిర్మల్చైన్గేట్: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో రాజేందర్ సిబ్బందిని కోరారు. డీఎంహెచ్వో కార్యాలయంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కు వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రై డే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని సూచించా రు. వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జా గ్రత్తల గురించి వివరించారు. ఆయుష్మాన్ ఆ రోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో కార్యక్రమ నిర్వహణాధి కారి డాక్టర్ రాజారమేశ్, డాక్టర్ సౌమ్య, డి ప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి భా రె రవీందర్, డీడీఎం ముత్యం, డీపీవో రామచందర్, పీహెచ్ఎన్వో విమల పాల్గొన్నారు. మాట్లాడుతున్న రాజేందర్ -
గోదావరిలో మట్టి కుప్పలు
● బాసర వద్ద తరచూ ప్రమాదాలు ● తొలగించాలని కోరుతున్న భక్తులు భైంసా: బాసర గోదావరినది స్నాన ఘట్టాలపై మ ట్టి పేరుకుపోతోంది. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు తర చూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బాసర వద్ద గోదావరిపై రెండు కొత్త వంతెనలు నిర్మిస్తుండగా ఇందుకోసం నదిలో నల్లమట్టితో తాత్కాలిక రోడ్లు వేశారు. నీటి ప్రవాహం పెరిగినప్పుడల్లా తాత్కాలిక రోడ్ల మట్టితోపాటు పిల్లర్ల కోసం తీసిన గుంతల్లోని మట్టి కూడా దిగువకు కొట్టుకువచ్చి స్నానఘట్టాల వద్ద పేరుకుపోతోంది. రెండేళ్లుగా ఇదే పరిస్థి తి ఉంటోంది. గోదావరినదిలో వివిధ రూపాల్లో కొ ట్టుకువచ్చిన మట్టి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో చేరి అందులో పూడిక పెరుగుతోంది. నదిలో వేస్తున్న వ్యర్థాలు, నల్లమట్టి, బండరాళ్లు కొట్టుకువచ్చి ఎస్సారెస్పీలో పూడికకు కారణమవుతున్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, పూడి క కారణంగా 80 టీఎంసీలకు పడిపోయింది. మంగళవారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతున్నారు. ప్రాజెక్ట్లోని నీరు గోదావరిలో చేరి ప్రవా హం మరింత పెరగనున్నందున వంతెనల వద్ద తా త్కాలిక రోడ్ల కోసం వేసిన నల్లమట్టి మరింత కొట్టుకువచ్చి బాసర గోదావరి స్నానఘట్టాలను ముంచెత్తనుంది. ఇప్పటికై నా అధికారులు నదిలో మట్టి, చెత్తాచెదారం వేయకుండా చర్యలు చేపట్టాలని, బాసర గోదావరినది స్నానఘట్టాల వద్ద ఉన్న మట్టి కుప్పలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. -
బైక్ దగ్ధం
కుంటాల: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపాన గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి బైక్కు నిప్పంటించారు. గ్రామానికి చెందిన అరిగెల గజ్జారాం వ్యవసాయ పనులు ముగించుకుని తన ఇంటి ముందు బైక్ వర్షానికి తడవకుండా టార్పాలిన్ కప్పి పార్క్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి గజ్జారాం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే టైర్లు పేలిన శబ్దం వచ్చి, బైక్ దగ్ధమైంది. ఘటన స్థలాన్ని ఎస్సై అశోక్ ఆదివారం పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థిని నృత్య ప్రదర్శన
బోథ్: మండల కేంద్రానికి చెందిన నాంపల్లి సాయిసాగర్–అనిత దంపతుల కుమార్తె వైష్ణవి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నిర్వహించే భక్తి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె నృత్యంపై మక్కువతో శిక్షణ తీసుకుంది. కాగా, టీటీడీ వద్ద నృత్యం చేయడానికి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వైష్ణవి చేసిన నృత్యం అందరినీ అలరించింది. తన కూతురికి అక్కడ నృత్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. -
బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్, వి శ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. మంచిర్యాలలోని చార్వాక భవన్లో జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సులో ఆ యన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన 30 రోజు ల వ్యవధిలో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అఖిలపక్షాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్పించే బాధ్యత కేంద్రానితే అని తెలిపారు. అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును అఘమేఘాల మీద చక్కబెట్టిన కేంద్రం అదే రీతిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో కుల గణన సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బీసీ మేధావుల ఫోరం అధ్వర్యంలో చేపట్టే పోరాటాలను ఉమ్మడి జిల్లా బీసీలు విజయివంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ బడి నిర్వాహకులు పిడికిలి రాజు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వీరస్వామి, అవ్వారు వేణుకుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కార్యదర్శి వేముల అశోక్, విశ్రాంత ఎంఈవో కొండయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
శెభాష్.. సింగరేణి
● వెలుగుల రికార్డులకు అవార్డులు ● జాతీయస్థాయిలో ఎస్టీపీపీకి గుర్తింపు ● పక్కాగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ● ఎస్టీపీపీలో సీఎండీ బలరాం మార్క్ ● సింగరేణికి తలమానికంగా ప్లాంట్ జైపూర్: సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన అనతికాలంలో ఉత్పత్తి, నిర్వహణలో దేశస్థాయిలో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక పీఎల్ఎఫ్(ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తోపాటు నిర్వహణలో జీరో వాటర్ యూటిలైజేషన్, యాష్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ పర్యావణహిత చర్యలు చేపడుతూ శెభాష్ సింగరేణి అనిపించుకుంటోంది. ఒకపక్కన థర్మల్ పవర్ ప్లాంటు, మరో పక్కన భూమిపై సోలార్, నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటు చేస్తూ జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకుంటోంది. ఇప్పటికే 54 అవార్డులు.. ఎన్టీపీపీ, జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ను తలదన్నేలా ఎస్టీపీపీ అత్యధిక పీఎల్ఎఫ్ సాధనలో దేశస్థాయిలో వరుసగా మొదటి వరుసలో నిలువడంతోపాటు అన్నివిభాగాల్లో అవార్డులు కై వసం చేసుకుంటోంది. ఎస్టీపీపీకి ఇప్పటికే 54 అవార్డులు వరించాయి. ఈ అవార్డులు అందుకోవడం పట్ల అధికారులు, ఉద్యోగులపై సంస్థ సీఎండీ ఎన్.బలరాం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీపీపీలో ఆయన మార్క్ చూపుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ హిత చర్యల్లో మేటి.. పర్యావరణహిత చర్యల్లో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సల్ఫర్ను ఎఫ్జీడీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్జీడీ) పద్ధతిలో జిప్సంగా మార్చే పనులు పూర్తయ్యాయి. ఇందుకు రూ.700 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగే సమయంలో గాల్లోకి సల్ఫర్ ఆకై ్సడ్ శాతం ఘనపు మీటర్కు 2 వేల మిల్లీగ్రాములు ఉంటోంది. దీంతో వాతావరణంలో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. 2,200 మిల్లీ గ్రాములకు తగ్గించడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎఫ్జీడీ నిర్మాణంతో బొగ్గు బూడిదను వందశాతం గాలిలో కలవకుండా నిలువరిస్తుంది. బొగ్గును మండిస్తే వెలువడే వేడి, నీటిని ఆవిరి రూపంలో మార్చే శక్తితో టర్బైన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తిప్రక్రియ చేపడుతారు. అయితే చివరకు వెలువడే బూడిద, విషవాయువులను శుద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్తో బూడిదను గాలిలో కలువకుండా చేస్తున్నారు. ఇలా వేరు చేసిన యాష్ను సిమెంట్, ఇటుకల నిర్మాణ రంగపరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా వందశాతం యాష్ వినియోగం చేస్తూ జాతీయస్థాయిలో బెస్ట్ఫ్లైయాష్ యుటిలైజేషన్, ఉత్తమ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఎనర్జీ ఎఫీషియంట్ ప్లాంటు, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్, పొల్యూషన్ కంట్రో అండ్ ఎక్విప్మెంట్, గోల్డెన్ అవార్డు ఇన్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్సీ, జీరో వాటర్ యుటిలైజేషన్లో ఇలా 54 అవార్డులు అందుకుంది. అవార్డులు రావడం గర్వకారణం సీఎండీ బలరాం దిశానిర్దేశఽంతో అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా పవర్ ప్లాంటు అన్నిరంగాల్లో ముందంజలో నిలుస్తోంది. కర్బన ఉద్గరాలు తగ్గించడానికి ఇప్పటికే ఎఫ్జీడీ నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభిస్తాం. అన్నివిభాగాల్లో జాతీయస్థాయిలో అవార్డులు రావడం అందరికీ గర్వకారణం. ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ ఎస్టీపీపీని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుపుతాం. – సీహెచ్ చిరంజీవి, ఎస్టీపీపీ ఈడీ -
● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ● ఎస్సారెస్పీలోకి గోదావరి ప్రవాహం
భైంసా:మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ని ర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1 నుంచి తెరుచుకోనున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వర కు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి చే రనుంది, దీనివల్ల నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రై తులకు తాగు,సాగునీటి అవసరాలు తీరనున్నాయి. త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో బాబ్లీ ప్రాజెక్టుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పో రాటాలు, కోర్టు వివాదాలు జరిగాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, వర్షాకాలంలో గోదావరి నది ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గేట్లు తెరిచి ఉంచాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు జూలై 1న గేట్లను ఎత్తనున్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం.. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1064.60 అడుగుల వద్ద 15.567 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్ల నుంచి విడుదలయ్యే వరద నీరు ఈ ప్రాజెక్టులోకి చేరనుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ నుంచి విడుదల చేస్తున్నారు. బాబ్లీ నుంచి వచ్చే నీరు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, బాసర మీదుగా ఎస్సారెస్పీకి చేరుతుంది. తెలంగాణ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉండగా, నీరు చేరడానికి కొంత సమయం పడుతుంది. రైతులకు ఉపయోగం.. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, బాబ్లీ గేట్ల విడుదలతో గోదావరి నది నిండుగా ప్రవహించనుంది. దీనివల్ల నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఎత్తిపోతల పథకాల కింద లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు పుష్కలంగా నీరు అందనుంది. రైతులు ఇప్పటికే వరి నారుపోసి, మరో వారంలో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బాబ్లీ నీటి విడుదల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏర్పాట్లు చేసిన నీటిపారుదల శాఖ.. బాబ్లీ గేట్ల విడుదల కోసం మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు జోరందుకునే ముందే గేట్లను తెరిచి, సహజ నీటి ప్రవాహాన్ని ఎస్సారెస్పీకి చేరేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ వర్షాకాలంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బాబ్లీ ప్రాజెక్టు(ఫైల్)ప్రాజెక్టు పేరు : బాబ్లీ నిర్మాణ స్థలం : గోదావరి నదిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద గేట్లు : 14 నీటి నిల్వ సామర్థ్యం : 2.74 టీఎంసీ గేట్లను పైకి ఎత్తే తేదీ : ప్రతియేట జూలై 1 నుంచి తిరిగి గేట్లను దించేతేదీ : ప్రతియేట అక్టోబర్ 28 దూరం : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్లు, బాసరకు 18 కిలోమీటర్లు -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రాటవెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలి పిన వివరాలు.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చేరుకుంది. కాగా, మండల కేంద్రంలో సర్వీసు రోడ్డు పనులు నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుకాల మరో బస్సు వేగంగా వస్తోంది. ట్రావెల్స్ డ్రైవ ర్ ఆ బస్సు వెళ్లడానికి దారి ఇచ్చేక్రమంలో హెచ్చరిక బోర్డు దాటగా సర్వీసు రోడ్డుపై మెల్లగా బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగా యాలు కాగా, అందులో జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన గాడిగు నరేంద్ర, అమరావతికి చెందిన ఇర్ఫాన్ మన్స్రీ, యవత్మాల్ జిల్లా ఘటానాకు చెందిన ఎండీ హర్భాజ్, అమరావతి పరత్వాడకు చెందిన ఆనంద్ అగ్రవాల్ ఉన్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. రిమ్స్లో క్షతగాత్రులను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరామర్శించారు. అయితే బస్సు వేగం తగ్గించడంతో మెల్లగా మట్టి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు. జాతీయ రహదారి 44పై గుడిహత్నూర్ వద్ద ఘటన నలుగురికి తీవ్ర, 28 మందికి స్వల్ప గాయాలు క్షతగాత్రుల రిమ్స్కు తరలింపు తప్పిన పెను ప్రమాదం -
ఘనంగా అకాడి పూజలు
ఆషాడమాసం ప్రారంభంతో ఆదివాసీ గ్రామాల్లో అకాడి పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడ మండలం బాదిగూడతోపాటు ఇంద్రవెల్లి మండలం సమాక, కేస్లాపూర్, పాటగూడ, ముత్నూర్ గ్రామాల ఆదివాసీలు పొలిమేరకు వెళ్లి వనదేవతలకు పూజలు చేశారు. సంప్రదాయ వంటలు తయారు చేసి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలతోపాటు పంటలు, పశుపక్ష్యాదులు బాగుండాలని మొక్కినట్లు గ్రామాల ఆదివాసీ పెద్దలు తెలిపారు. గ్రామాల పెద్దలు కొరెంగా యేశ్వంత్రావ్ మహారాజ్, పెందోర్ భగ్వంత్రావ్, జంగు, లక్ష్మణ్, సోయం భీంరావ్, గ్రామపటేల్ సిడాం లక్ష్మికాంత్, దేవారి పెందుర్ బండు, గ్రామస్తులు తులిసిరాం, చిక్రం దేవ్రావు, పంద్రం రాజు, మెస్రం అమృత్రావు, సిడాం మధుకర్ తదితరులు పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి/ఇచ్చోడ -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
● కార్మిక సంఘాల జేఏసీ పిలుపుశ్రీరాంపూర్: కేంద్రం కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లకు నిరసనగా జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, ఐఎఫ్టీయూ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడారు. కేంద్రం 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్లు జూలై నుంచి అమలు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇవి అమలైతే కార్మికవర్గం తమ హక్కులను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కోల్పోతారన్నారు. కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. దీనిని కార్మికవర్గం ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ఈ సమ్మె విజయవంతంతో కేంద్రం దిగివస్తుందన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్ బాజీసైదా, నాయకులు కొమురయ్య, కిషన్రావు, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగే స్వామి, ల్యాగల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కస్తూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ నివాస ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో కేశవపట్నానికి చెందిన షేక్ కలీం, ఇస్లాంనగర్కు చెందిన షేక్ ఫరీద్, జాదవ్ గజానంద్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కా ర్యాలయంలో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గత రెండునెలల క్రితం ఇస్లాంనగర్లో నివాసముంటున్నట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు నకిలీ ధ్రువపత్రాలు పొంది ఆర్మీ, బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందారు. నిందితులు ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన యువత నివాస ధ్రువపత్రాలు పొందే విషయంలో ఫేక్ ఇంటి నంబర్, ఆధార్కార్డులు ఇచ్చి సహకరించారు. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకున్నారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ విషయమై ఆర్మీ, బీఎస్ఎప్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో కొందరు మీ సేవ కేంద్రాల పేరుతో బోర్డులు పెట్టి ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు దానంమందమర్రిరూరల్: మంచిర్యాల మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని కు టుంబ సభ్యులు అప్పగించారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. వివరాలు ఇలా..మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల అమృతమ్మ(90) శనివారం రాత్రి మృతిచెందింది. తల్లి మృతి చెందినప్పటికి పది మందికి ఉపయోగపడాలని కుమారుడు శ్యాంసుందర్రెడ్డి ఆలోచన చేశాడు. తల్లి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల(ఐ బ్యాంక్)కు అప్పగించారు. మృతదేహాన్ని మంచిర్యాల మెడికల్ కళాశాల వారికి సదాశయ ఫౌండేషన్ ద్వారా అప్పగించారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య ఆదివారం వైకుంఠరథంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. మృతురాలికి భర్త రాజిరెడ్డి ఉన్నారు. -
రిలే దీక్ష విరమణ
భైంసాటౌన్: ముధోల్ మండలం బోరిగాంలో బుద్ధ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని నెలరోజులకుపైగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం విరమించా రు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ దీక్షాపరుల కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విగ్రహ పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో దీక్ష విరమించినట్లు చెప్పారు. దీక్షకు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దేవిదాస్ హస్డే, ఉపాధ్యక్షుడు దిగంబర్, శ్రీరాములు, శంకర్ చంద్రే, ప్రసంజిత్ ఆగ్రే తదితరులున్నారు. -
దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి
ఖానాపూర్: నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జూ లై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సు రేశ్ కోరారు. ఆదివారం మండలంలోని బీర్నంది గ్రామంలో నిర్వహించిన సీఐటీయూ మండల కమి టీ సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింద ని తెలిపారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు ప్ర యోజనం చేకూర్చేందుకు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. అంతకుముందు గ్రామంలో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగామణి, నాయకులు స్వప్న, లక్ష్మి, స్వామి, లత, రవి, వెంకటేశ్, నాగరాజు, మంగ, సుజాత పాల్గొన్నారు. -
పోరాటాలతోనే విద్యారంగం బలోపేతం
నిర్మల్ఖిల్లా: పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తపస్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, జిల్లా ఇన్చార్జి గోనెల శశిరాజ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ డీఏ విడుదల, 317 స్థానికత సమ స్య పరిష్కారం, సీపీఎస్ రద్దు, జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తదితర సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్కుమార్, సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జిలక రి రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, వాసుదేవారెడ్డి, కృష్ణవే ణి, అజయ్, అరుణ్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం
నిర్మల్చైన్గేట్: జాతీయ గణాంక దినోత్సవా న్ని ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గణాంక శాస్త్ర ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పీసీ మహాలనోబీస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి ల్లా ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం మా ట్లాడారు. దేశానికి బలమైన గణాంక మౌలిక వ్యవస్థను రూపొందించడంలో ప్రొఫెసర్ మ హాలనోబీస్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతీ సంవత్సరం ఆయన జయంతి జూన్ 29న జా తీయ గణాంక దినోత్సవంగా జరుపుకొంటా మని తెలిపారు. అనంతరం 2023–24 సంవత్సరానికి సంబంధించిన జిల్లా గణాంక హ్యాండ్బుక్ ఆవిష్కరించారు. రిటైర్డ్ గణాంక శాఖ అధికారులు మోహన్దాస్, హన్మాండ్లు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు రమేశ్, జిల్లా గణాంకశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. 680 అడుగులకు ‘కడెం’ నీటిమట్టంకడెం: కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం 680 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్లోకి ఆదివారం 769 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికా రులు తెలిపారు. గతేడాది జూన్ 29న ప్రాజెక్ట్ నీటిమట్టం 677.200 అడుగులుగా ఉంది. -
పోడు రైతులపై కక్షసాధింపు సరికాదు
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన పోడు రైతులపై అటవీ అధికారులు కక్ష సా ధింపునకు పాల్పడడం సరికాదని రైతు సంఘం రా ష్ట్ర కార్యదర్శి శోభన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన పోడు రైతు బోసు భూమన్న పంట పొలాన్ని సందర్శించారు. కొన్నేళ్లుగా రైతు పోడు సాగు చేస్తున్నా అటవీ అధికారులు అందులో జేసీబీతో గుంతలు తవ్వడం సరికాదని పేర్కొన్నారు. చెరువు ఆయకట్టు భూమిలో సాగు నీ టి కోసం వేసిన పైపులైన్ కూడా ధ్వంసం చేయడంతో పాటు గట్టుపై ఉన్న మామిడి చెట్లను తొలగించ డం హేయమైన చర్య అని తెలిపారు. పోడు సాగుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికా రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి, కార్యదర్శి నాగెల్లి నర్సయ్య తదితరులున్నారు. -
నిర్మల్
తెరుచుకోనున్న ‘బాబ్లీ’ గేట్లు గోదావరినదిపై మహారాష్ట్రలో అక్రమంగా ని ర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోనున్నా యి. త్రిసభ్య కమిటీ సభ్యులు రేపు 14 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 20258లోu గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జ లమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు అర్చకులు అభిషేకం, అలంకరణ, అర్చన, హా రతి నిర్వహించారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, అప్పారావుపేట్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్య లో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. గజ్జ లమ్మ పల్లకీ సేవలో పాల్గొన్నారు. తలనీలాలు, ఎత్తు బెల్లం, బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదం పంపిణీ చేశారు. నిర్మల్చైన్గేట్: ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పో టీ చేయాలనే ఆరాటం.. మరోవైపు తమకు పట్టున్న గ్రామం, వార్డు రిజర్వేషన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. ఇవన్నీ ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చే స్తున్నాయి. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. గ్రామపంచాయతీలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలియడంతో గ్రామ, మండ ల స్థాయి నాయకులంతా రిజర్వేషన్లు అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. 16 నెలలుగా ‘ప్రత్యేక’ పాలన 2019లో జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు ఎ న్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పా లకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెలలుగా పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇ టీవల హైకోర్టు సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించగా ఆ దిశగా ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి ఏడాది దగ్గర పడుతోంది. 2024 జూలై మొదటి వారంలో వీరి పదవీకాలం ముగిసింది. ఇప్పటివరకు పర్సన్ ఇన్చార్జీల పాలనలోనే జిల్లా, మండల పరిషత్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లో తేలనున్న లెక్కలు హైకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో వా ర్డులు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 400 గ్రామపంచాయతీ లున్నాయి. గత ఎన్నికల్లో 396 పంచాయతీలకు ఎ న్నికలు జరిగాయి. ఇటీవల కడెం మండలంలోని న్యూధర్మాజీపేట్, ఖానాపూర్ మండలంలోని రంగపేట, తానూరు మండలంలోని కళ్యాణి, కుభీర్ మండలంలోని రంజనీతండాను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మొత్తం 400 పంచాయతీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కు రిజర్వేషన్లు ఖరారయ్యాక గ్రామాల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది. త్వరలోనే ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించనున్న ట్లు తెలుస్తోంది. జిల్లాలోని 157 ఎంపీటీసీ స్థానా లకు 2019 మే నెలలో ఎన్నికలు నిర్వహించారు. మే 2024లోనే పాలకవర్గాల గడువు తీరిపోయింది. ఈ ఎన్నికలతో పాటే జిల్లాలోని 18 జెడ్పీటీసీ స్థానా లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. న్యూస్రీల్ఆశావహుల తంటాలు.. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని కీలక నాయకులు, మండలాల్లో పట్టు న్న నేతలు తమ అనుచరులను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఏ సామాజికవర్గానికి రిజర్వేషన్ వస్తుందో ఇప్పుడే తేలకపోవడంతో అన్ని సామాజికవర్గాలకు చెందిన అనుచరులను తమ వెంట తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే తానే బరిలోకి దిగేలా.. వేరే సామాజికవర్గానికి రిజర్వేషన్ వస్తే ఆ సామాజికవర్గానికి చెందిన తమ అనుచరుడిని రంగంలోకి దింపేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు! సమరోత్సాహంలో ఆశావహులు గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం రిజర్వేషన్ల కోసం తప్పని నిరీక్షణరిజర్వేషన్ల చిక్కుముడి వీడేనా? పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వార్డులు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల మార్పుతో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ చట్టం–2018ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా గత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరా రుపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుంది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. -
చిన్నారులతో ఆటవిడుపు
నిర్మల్ రూరల్/నిర్మల్ఖిల్లా: జిల్లా స్థాయి అధి కారి అంటేనే నిత్యం తనిఖీలు, సందర్శనలు, సమీక్షలతో బిజీబిజీగా ఉంటారు. డీఈవో రా మారావు ఆదివారం కూడా జిల్లా కేంద్రంలోని కురన్నపేటలోగల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసిపోయి వాలీబాల్ ఆడారు. వారితో ముచ్చటిస్తూ బడిలోని వసతులు, విద్యావిధానం గురించి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డ్యూటీ ఉ పాధ్యాయుడు రవి, వంట సిబ్బంది ఉన్నారు. -
‘గడ్డెన్న’ నీరు.. గోదారి పాలు
● నత్తనడకన ఆధునికీకరణ పనులు ● ఖరీఫ్నకు ప్రాజెక్ట్ నీరు అందేనా? ● ఆందోళనలో ఆయకట్టు రైతులులోకేశ్వరం: పద్నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్షంగా భైంసా సమీపంలో నిర్మించిన గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లోని నీరు గోదారి పాలవుతోంది. తమ భూముల్లో బంగారు పంటలు పండుతాయని ఆయకట్టు రైతులు కన్న కలలు కల్లలయ్యా యి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినా ‘లక్ష్యం’ నీరుగా రుతోంది. మూడేళ్లుగా ప్రాజెక్ట్లోకి సామర్థ్యానికి మించి నీరు వస్తున్నా ఆయకట్టు భూములకు మా త్రం చుక్క నీరు అందడం లేదు. దేవుడు వరమిచ్చి నా పూజారి కరుణించని చందంగా తయారైంది ఆ యకట్టు రైతుల పరిస్థితి. భైంసా, లోకేశ్వరం మండలాల్లోని 11గ్రామాల్లో 14వేల ఎకరాల బీడు భూ ములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్ట్ ప్రధా న కాలువ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను 2006 అక్టోబర్ 15న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. 42కిలోమీటర్ల పొడవున్న ఈకాలువపై 40 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించా రు. భైంసా మండలంలోని వాలేగాం, కుంసర, కా మోల్ గ్రామాల్లోని నాలుగు వేల ఎకరాలు, లోకేశ్వ రం మండలంలోని పుస్పూర్, పొట్పల్లి (ఎం), సా థ్గాం, హథ్గాం, బిలోలి, హవర్గ, లోకేశ్వరం, మ న్మద్, కిష్టాపూర్, భాగాపూర్, రాజూరా, ఎడ్ధూర్ తది తర గ్రామాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన కాలువకు గండ్లు పడి పి చ్చిమొక్కలతో అధ్వానంగా తయారైంది. దీంతో గ డ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీరు వృథాగా గోదావరిలో కలి సిపోతోంది. సంబంధిత అధికారులు ఏడేళ్లుగా చివ రి ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోయారు. డిస్ట్రిబ్యూటరీలు కనుమరుగు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కింద 40 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన ఈ డిస్ట్రిబ్యూటరీలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఫలానా చోట డిస్ట్రిబ్యూటరీ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిస్ట్రిబ్యూటరీ వెంట నిర్మించిన సిమెంట్ నిర్మాణా లూ కనిపించకుండా పోయాయి. పలుచోట్ల రైతులు వాటిని దున్ని సాగుభూమిలో కలుపుకొన్నారు. ప్రారంభించి 19 ఏళ్లయినా.. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రారంభించి 19 ఏళ్లయినా చి వరి ఆయకట్టు వరకు చుక్కనీరు అందలేదు. లోకేశ్వరం మండలం రాయపూర్కాండ్లీ, లోకేశ్వరం, హ థ్గాం, సాథ్గాం, కిష్టాపూర్, మన్మద్, రాజురా గ్రా మాల ఆయకట్టుకు నీరు అందడంలేదు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కాలువలకు గండ్లు పడ్డా యి. కాలువల ద్వారా వచ్చిన నీరు వృథాగా పో తోంది. ఈసారైనా ఖరీఫ్నకు సాగునీరు అందుతుందో.. లేదోనన్న సందిగ్ధంలో రైతులున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ -
ఘనంగా తాతాయి పండుగ
సారంగపూర్: మండలంలోని జామ్, స్వర్ణ, ధ ని, ఆలూరు, కంకెట, వైకుంఠాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం పూర్వీకులైన తాతా ఆ యిల పండుగలను ఘనంగా జరుపుకొన్నారు. కుమ్మరి కులస్తులు మట్టితో తాత ఆయి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తాతాయి ఆలయంలో వి గ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. వర్షాలు స మృద్ధిగా కురవాలని, పంటలు చక్కగా పండాలని వేడుకున్నారు. గ్రామ పెద్దలు రాజేశ్వర్, గ డ్డల అశోక్, వాసాల అశోక్, సుకానంద్, విలా స్, నలిమెల ముత్యం, రాజేశ్వర్, ఆడెపు మ హేందర్, గొల్ల మహేందర్ తదితరులున్నారు. -
కవ్వాల్కు కొత్త పులులు!
● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాకసంరక్షణ సవాలే..! కవ్వాల్లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్ గ్రామాలైన కడెం మండలం రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేట కారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. తాజాగా అధికారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్గా మారనుంది. సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనుంది. మరోవైపు పునరావాస గ్రామాల వాసులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్ కోర్ ప్రాంతాల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ జంతువు రక్షణకు ఇక్కడి అధికారులు మరింత శ్రమించాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్కు కొత్త పు లులు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ కోర్ ప్రాంతంలో నేటి కీ ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరుచుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించిన మేరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పులులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు దాకా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో కొన్ని పులులు శాశ్వత నివాసమేర్పర్చుకోగా, ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్కు కొత్తపులులు వచ్చే అవకాశాలున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది. చివరికి తరలింపునకే మొగ్గు మహారాష్ట్ర పులులు భవిష్యత్లో ఉమ్మడి జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో 13ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2వేల చ.కి.మీటర్లకు పైగా అటవీ భూభాగాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కోర్ ఏరియాలోనే పులులు నివాసమేర్పరుచుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహారాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరుకు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్కు పులులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. -
ఆషాఢం.. సాంస్కృతిక వైభవం
వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఏళ్లు గడుస్తున్నా.. ఏం మారలే సారంగపూర్ మండలం బీరవెల్లి–నుంచి దిలావర్పూర్ మండలం లోలం రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.8లోu ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 20259లోu ఆషాఢం.. తొలకరి వర్షాలతో ప్రకృతిని సౌందర్యవంతం చేస్తూ.. సంప్రదాయాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు ఆచారంగా మారింది. ఇక ఆషాఢం అనగానే గుర్తుకు వచ్చేది బోనాలు.. వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవతకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. కొత్తగా పెళ్లయిన ఆడబిడ్డలు పుట్టింటికి రావడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆషాఢ మాసం నేపథ్యంలో జిల్లాలో సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్సవాలపై ఆదివారం ప్రత్యేక కథనం. – నిర్మల్ఖిల్లా/లక్ష్మణచాంద/కుంటాలనిర్మల్లో కొలువుదీరిన అమ్మవారుఆషాఢం శూన్యమాసంగా పిలవబడినా పర్వదినా లు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, శాకంబరీ నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర వంటి పర్వదినాలతో ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తుంది. గురు పౌర్ణమి (జూలై 10)న వేదవ్యాసుని ఆరాధించి, గురువుల ఆశీస్సులు పొందుతారు. ఇక ఈ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. మహిళలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండలతో ఊరేగింపులు నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని, పాడి పశువులను కాపాడలని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆచారాల శాసీ్త్రయత ఆషాఢంలో కొత్తగా వివాహమైన యువతులను పుట్టింటికి పంపడం ఆచారం. ఈ మాసంలో గర్భం దాల్చితే, వేసవిలో ప్రసవం జరుగుతుంది, ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి హానికరం. ఈ ఆచారం శాసీ్త్రయ దృక్పథంతో రూపొందింది. అలాగే, వ్యవసాయ కుంటుంబాల్లో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లడం వల్ల కుటుంబం వ్యవసాయ పనులపై దృష్టి పెట్టగలుగుతుంది. జిల్లాలో వేడుకలు.. జిల్లాలో ఆషాడమాస సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలం ప్రారంభం సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను బలి ఇచ్చి గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా పండగలు నిర్వహించుకుంటారు. ఇప్పటినుంచే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయం, సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ, కుంటాల మండలంలోని గజ్జలమ్మ ఆలయాల్లో ఆషాఢమాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వనభోజనాలు.. ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. ముఖ్యంగా పల్లెల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటూ గ్రామ దేవతలకు, వన దేవతలకు పూజలు చేస్తారు. ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్యన వంటలు చేసుకుని అక్కడే సామూహికంగా వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. పర్వదినాలు ప్రారంభం గ్రామదేవతలకు బోనాలు పుట్టింటికి నవ వధువులు.. మెహందీ వేడుకలు..ఆరోగ్య, సౌందర్య రహస్యంనిర్మల్లో శుక్రవారం బోనాల వేడుకల్లో పాల్గొన్న పట్టణవాసులు వర్షాకాలంలో వాతావరణం చల్లబడినా, శరీరంలో వేడి అలాగే ఉంటుంది. గోరింటాకు ఈ వేడిని తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. లేత గోరింటాకు ఆకులను రుబ్బి అరచేతులకు, పాదాలకు రాస్తే ఎరుపు రంగు చర్మంలో ఇంకి సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. ఈ ఆచారం చర్మవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మకం. కొత్తగా వివాహమైన యువతులు ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుని శుభసూచకంగా భావిస్తారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన జడ్జి
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భైంసా ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.దేవేంద్రబాబు శనివారం సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్తో కలిసి వార్డులను పరిశీలించారు. ఓపీ, ఆపరేషన్ థియేటర్, రోగుల వార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలిసిస్ సెంటర్ నిర్వహణ గురించి అడిగి తెలు సుకున్నారు. రోగుల తాకిడి, వైద్యులు, సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. రోగులతో మాట్లా డి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. జడ్జి వెంట ఆస్పత్రి వైద్యుడు అనిల్, సిబ్బంది ఉన్నారు. -
పెండింగ్ వేతనాల కోసం పంచాయతీ కార్మికుల వినతి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. పెండింగ్ జీతాల విడుదల, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు కలెక్టరేట్ ఏవో, డీపీవోకు గ్రామపంచాయతీ కార్మికులు శనివారం నోటీసులు అందించారు. కేంద్రం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికవర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ఉపాధ్యక్షుడు రవి, మల్లేశ్, నాయకులు నర్సయ్య, మొగిలి, రాజేందర్, భూమన్న, వనిత, బుర్రవ్వ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
నిర్మల్చైన్గేట్: మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్లో కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ అధికారులు, పుర ప్రజలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమన్నారు. మాదకద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యసహాయం అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం తెలంగాణ సాంస్కతిక సారధి కళాజాత బృందాలు మాదకద్రవ్యాలపై చైతన్యం కలిగించే ప్రదర్శనలు ఇచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎకై ్సజ్ అధికారి ఎంఏ.రజాక్, డీఎంహెచ్వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీఆర్డీవో నాగవర్ధన్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, సీడీపీవోలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సుభాష్, ఐకేపీ మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● కలెక్టర్ అభిలాష అభినవ్ -
ట్రక్ షీట్నే పరిగణనలోకి తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పా టు చేసిన రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన సమయంలో ట్రక్ షీట్లలో నమోదుచేసి న ధాన్యం బరువునే పరిగణనలోకి తీసుకోవాలని భా రతీయ కిసాన్ సంఘ్ నాయకులు కోరారు. మిల్లర్లు తమకు నచ్చిన విధంగా తరుగు చూపిస్తూ, తమ ఇష్టా రీతిన వ్యవహరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు తరుగులో అక్రమాలను నిరసిస్తూ శనివారం కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యం అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రం వద్ద రాసిన ట్రక్ షీట్కి, రైస్ మిల్లర్లు ఇచ్చే ట్రక్ షీట్కి మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వ మోసాలను అరికట్టాలని కోరారు. నిరసనలో భారతీయ కిసాన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓస రవీందర్, కార్యదర్శి కె.శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి రాంగోపాల్రెడ్డి, సంపర్క్ ప్రముఖ్ కె.రాజేశ్వర్రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ ప్రయోజనాలు..
గోరింటాకుగా పిలుచుకునే ఈ మైదాకును శాసీ్త్రయనామం‘లాసోనియా ఇనెర్మిస్’. ఇది ‘లైథ్రేసియా’ కుటుంబానికి చెందిన ఔషధ గుణాలున్న మొక్క. దీని లేతఆకులను మహిళలు అరచేతులకు పాదాలకు పెట్టుకుంటారు. ఇది చర్మ సౌందర్యంతోపాటు ఎదుటివారిని ఆకర్షించే వర్ణం కలిగి ఉంటుంది. చూర్ణంగా చేసి పెట్టుకోవడం వల్ల ‘లావుసీన్’ అనే రసాయనం ఎరుపు రంగును ఇస్తుంది. ఇందులో చర్మ రోగాలను నివారించే గుణం ఉంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్ష శాస్త్ర నిపుణులు, నిర్మల్ -
పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు
ముధోల్: వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. ముధోల్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఆయా ప్రధాన కాలనీలకు వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో డయేరియా, డెంగీ, విష జ్వరాలు అపరిశుభ్రత, కలుషిత నీటి కారణంగా ప్రబలుతాయన్నారు. చెత్త డ్రెయినేజీల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట డీఎల్పీవో సుదర్శన్, ఎంపీడీవో శివకుమార్, పంచాయతీ ఈవో అన్వర్ అలీ ఉన్నారు. -
అర్థవంతంగా బోధించాలి
నర్సాపూర్(జి): విద్యార్థులకు అర్థవంతంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ సూచించారు. మండలంలోని బామ్ని(బి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ను శనివారం పరిశీలించారు. జీపీ రికార్డులు తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. కేంద్రంలో చిన్నారులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మివిశారద, పంచాయతీ కార్యదర్శి గంగజల, అంగన్వాడీ కార్యకర్త ఉన్నారు. -
పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్ బృందం
తానూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహమీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ పరిశీలకుల బృందం శనివారం పరి శీలించింది. మండలంలోని ఉమ్రి(కే), తొండా ల, దాగాం, కోలూరు, దౌలతాబాద్, ఖర్బాలా, ఎల్వత్, వాడవన గ్రామాల్లో పర్యటించి ఇంకుడు గుంతలు, ఫారంపాండ్, మినీ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. నివేదికను కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఏలు గంగాధర్, ప్రసాద్, పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిమితికి మించి ప్రవేశాలు వద్దు
● కేజీబీవీల్లో అడ్మిషన్లపై టీయూటీఎఫ్ అభ్యంతరం నిర్మల్ఖిల్లా: జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో పరిమితికి మించి బాలికలను చేర్చుకోవడంపై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన బృందం జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావును శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేసింది. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అబ్బడి మురళీమనోహర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా, పరిషత్ మండల పరిషత్ పాఠశాలల నుంచి ఏటా 4 వేల మంది విద్యార్థులు కేజీబీవీలు, వివిధ గురుకుల పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారని తెలిపారు. దీంతో నాణ్యమైన విద్య అందడం లేదని వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ తరగతి గదిలో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలన్న నిబంధన అమలు చేయాలని కోరారు. విద్యార్థులు పరిమితికి మించితే హాస్టళ్ల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ విషయంపై త్వరితగతిన మార్గదర్శకాలు జారీ చేయాలని డీఈవోను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి రవికాంత్, వాహీద్ఖాన్, రాష్ట్ర సహాధ్యక్షుడు లక్ష్మీప్రసాద్రెడ్డి, జిల్లా కోశాధికారి మేడారపు శ్రీనివాస్, మొయిజుద్దీన్, వినోద్రాజ్ ఆయా మండలాల బాధ్యులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
నిర్మల్ చైన్గేట్: ప్రజాపాలనలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో మాట్లాడారు. అంతకుముందు మంత్రికి కలెక్టర్ అభిలాష అభినవ్ మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసినట్లు తెలిపారు. దశలవారీగా ప్రతీ లబ్ధిదారుడికి ఇల్లు అందేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రైతు భరోసా పథకం 100 శాతం అమలైందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పారదర్శకంగా పథకాలు.. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో దివ్యాంగుల కోసం అలెంకో సంస్థ ద్వారా రూ.1.21 కోట్లు విలువ చేసే ఉపకరణాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 2,632 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని తెలిపారు. వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా మొత్తం 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వన మహోత్సవం సందర్భంగా దాదాపు 65 లక్షల మొక్కల నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపా రు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, మహిళా సంఘాలకు రూ.133 కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అందజేశారు. సమావేశంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్ట ర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఉన్నత అధి కారులు, ప్రజాప్రతినిధులు, పలు పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. మంత్రి ‘జూపల్లి’ -
మెడికల్ కాలేజీలో మానిటరింగ్ కమిటీ
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది లోపాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ నిర్మల్ వైద్య కళాశాలను శుక్రవారం సందర్శించింది. జిల్లా జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిని కూడా తనిఖీ చేసింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ అయిషా మస్రత్ ఖానమ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ నేతృత్వంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఎంసీఎంసీ సభ్యులు మెడికల్ కళాశాల, బోధన ఆస్పత్రిని సందర్శించారు. వార్డులు, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ, విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్ గదులను పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు దవాఖానలో సౌకర్యాలు తెలుసుకున్నారు. కల్పించాల్సిన సౌకర్యాల కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్, దవాఖాన సూపరింటెండెంట్లను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాల పనులను వేగంగా పూర్తి చేయాలని బృందం సూచించింది. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిసామని తెలిపింది. దవాఖానలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థుల రవాణా కోసం బస్సు, దవాఖాన, మెడికల్ కళాశాలలో భద్రత చర్యలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బృందం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్సింగ్, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరోజ, ఆర్ఎంవో సమత, నర్సింగ్ సూపరింటెండెంట్ వనజ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ లక్ష్మి, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. సమస్యలు, వసతుల తనిఖీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రకటన -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
● ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి నిర్మల్టౌన్: నిర్మల్ నుంచి ఏ పుణ్యక్షేత్రానికై నా ఆర్టీసీ బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ పండరి తెలిపారు. శుక్రవారం నిర్మల్ నుంచి రామేశ్వరా నికి బయల్దేరిన బస్సును ప్రారంభించారు. ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, పళని, పాతాళ శెంబు, ధనుష్కోటి, రామేశ్వరం వెళ్లి తిరిగి నిర్మల్కు జూలై 2న వస్తుందని పేర్కొన్నారు. మళ్లీ అరుణాచలం, రామేశ్వరం బస్సు జూలైలో ఉంటుందని తెలి పారు. జూలై చివరి వారంలో ప్రయాగ్రాజ్, వారణా సి, అయోధ్య, భద్రాచలం, అన్నవరం సమ్మక్క సారక్కల వద్దకు బస్సులు నడుపుతామని వివరించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
వికాసం.. ఆలస్యం!
నిర్మల్ఎట్టకేలకు వేతనాలు ఉద్యోగ నియామకం కోసం పరీక్ష రాసి ఎంపికై న తర్వాత 15 ఏళ్లకు నియామక ఉత్తర్వులు చేతికందాయి. విధుల్లో చేరిన నాలుగు నెలల తర్వాత వేతనాలు మంజూరయ్యాయి. శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025పుష్కర ఘాట్ల పరిశీలన బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల గోదావరి పుష్కరఘాట్ల వద్ద పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర ఆదేశాల మేరకు భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్, ఆర్అండ్బీ అధికారులు గోదావరి పుష్కర ఘాట్లను శుక్రవారం పరిశీలించారు. ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి మృతి చెందడంతో అప్రమత్తమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఘాట్ వద్ద జాలీలు, వాచ్ టవర్ నిర్మాణం, మైక్ సిస్టమ్తో అనౌన్స్మెంట్, గజ ఈతగాళ్లు నిరంతరం నది వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిర్మల్చైన్గేట్: యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.5 లక్షలలోపు రుణాలు అందించేలా ఈ పథకం రూపొందించారు. ఈమేరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో ఇప్పటికీ రుణాలు మంజూరు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 7,214 యూనిట్లు మంజూరు చేయాలనే లక్ష్యం ఉండగా, 35,177 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొంతమందికి మంజూరు పత్రాలు అందజేస్తారని ప్రచారం జరి గినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలిపివేసింది. అర్హుల ఎంపికకు ఆటంకాలు.. రుణ దరఖాస్తుల నుంచి మండల స్థాయిలో అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలను జిల్లా స్థాయికి పంపి, బడ్జెట్ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలి. అయితే, మండలస్థాయి కమిటీలు తుది జాబితాలను సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎంపీడీవో, డీఆర్డీఏ సిబ్బంది, బ్యాంక్ అధికారులతో కూడిన ఈ కమిటీలపై రాజకీయ ఒత్తిళ్లు కారణంగా జాబితాలు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. దీంతో దరఖాస్తుదారులు మంజూరు పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికలతో మరింత జాప్యం రాష్ట్రంలో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, రాజీవ్ యువ వికాసం పథకం అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొందరిని ఎంపిక చేసి, మరికొందరిని విస్మరిస్తే, మిగిలిన వారిలో అసంతృప్తి ఏర్పడి, ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. సబ్సిడీ వివరాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.50 వేల యూనిట్కు 100% సబ్సిడీ, రూ.లక్ష వరకు 90% సబ్సిడీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80% సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70% సబ్సిడీ అందిస్తారు. మొదటి ప్రాధాన్యం రూ.50 వేలు, రూ.లక్ష యూనిట్లకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదేశాలు రావాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. రూ.50 వేల రుణానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి న్యూస్రీల్ జూన్ 2న చెక్కుల పంపిణీ అంటూ హడావుడి అర్హుల ఎంపిక కూడా పూర్తికాని వైనం.. యూనిట్ల మార్పునకూ రాని అనుమతులు నిరుద్యోగులకు తప్పని నిరీక్షణనిర్మల్కు చెందిన పరమేశ్వర్ ఆటో కొనుగోలు చేసి సొంత వ్యాపారం ప్రారంభించాలనే కలతో రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని సిబిల్ స్కోర్ బాగుండటంతో బ్యాంకర్లు దరఖాస్తును ప్రాధాన్య జాబితాలో ఉంచారు. అయినా ప్రభుత్వం పథకం అమలును వాయిదా వేయడం, అమలు షెడ్యూల్ను ప్రకటించకపోవడంతో రుణం దక్కక అతడు ఆందోళనలో ఉన్నాడు. పెట్టుబడి లేకపోవడంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించలేదు. సిబిల్ స్కోర్కు ఉంటే.. దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. మండల కమిటీ ఆమోదం తర్వాత జాబితా జిల్లా కమిటీకి చేరుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో కార్పొరేషన్ల నుంచి లబ్ధి పొందినవారు, బ్యాంక్ రుణాలు చెల్లించక డిఫాల్టర్గా ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. సిబిల్ స్కోర్ను పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ, బ్యాంకర్లు దానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.కేటగిరీ మార్పుపై ఒత్తిడి.. మొదటి విడతలో రూ.లక్షలోపు రుణాలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, 3, 4 కేటగిరీలలో దరఖాస్తు చేసుకున్న చాలామంది తమను 1 లేదా 2 కేటగిరీలకు మార్చాలని అధికారులను కోరా రు. అయితే, కేటగిరీ మార్పుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలూ రాలేదని అధికారులు దరఖాస్తుదారులను తిరస్కరించారు.కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ నిధులు యూనిట్లు (రూ.కోట్లలో) ఎస్సీ 7,350 2,894 39.96 ఎస్టీ 3,627 2,325 25.35 బీసీ 17,286 3,876 41.00 ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90 మైనార్టీ 5,926 1,045 17.41 క్రిస్టియన్ 65 27 0.42 -
పాఠశాలల్లో బేస్లైన్ పరీక్షలు
● అభ్యసనస్థాయిల గుర్తింపునకు పరీక్షలు ● 2 నుంచి పదో తరగతి వరకు మదింపు ● సామర్థ్యమెంత.. తీర్చిదిద్దాల్సినదెంత? ● ఫలితాల ఆధారంగా బోధనాకార్యక్రమాలునిర్మల్ఖిల్లా: గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన కనీస అభ్యసన లక్ష్యాలను అంచనా వేసేందుకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ 2 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. జూన్ 25 నుంచి 30 వరకు ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల క్షేత్రస్థాయి సామర్థ్యాలను మదింపు చేసి, వారి అభ్యసన స్థాయిని పెంపొందించే ల క్ష్యాలను రూపొందించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం, 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. జిల్లాలోని 735 పాఠశాలల్లో దాదాపు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నపత్రాలతోపాటు, ఉపాధ్యాయులు, మండల, జిల్లాస్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. సామర్థ్యాల మదింపుఈ పరీక్షలు విద్యార్థుల ప్రస్తుత అభ్యసన సామర్థ్యాలను, వయసు, తరగతుల వారీగా అంచనా వేయడంతోపాటు, వాటిని మెరుగుపర్చడానికి అవసరమైన లక్ష్యాలను గుర్తిస్తాయి. ప్రాథమిక స్థాయి (1 నుంచి 5వ తరగతి) విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలను పరీక్షిస్తా రు. ఇందులో చదవడం, రాయడం, చదివినదాన్ని అర్థం చేసుకోవడం వంటి సూక్ష్మ సామర్థ్యాలు ఉన్నాయి. తెలుగు: సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదా లు, వాక్యాలు, పేరాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత సమయంలో చదవడం. గణితం: కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి చతుర్విధ ప్రక్రియలు, రెండు, మూడు అంకెల సంఖ్యలతో గణనలు. ఇంగ్లిష్: పదాలు, వాక్యాల చదవడం, అర్థం చేసుకోవడం. విద్యాప్రమాణాలు మరింత మెరుగు.. రాష్ట్రపాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు బేస్లైన్ టెస్టులను నిర్వహిస్తాం. ఈ మేరకు ఇప్పటికే తగిన మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ పరీక్షల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగు పడటమే కాకుండా ఫలితాల ఆధారంగా తగిన ప్రణాళికల రూపొందించడానికి అవకాశం ఉంటుంది. – పి.రామారావు, డీఈవో, నిర్మల్ఉన్నత తరగతులకు.. ఉన్నత తరగతులు (6 నుంచి 10వ తరగతి) విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తారు. వీటిలో విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పరిశీలిస్తారు. విద్యా సంవత్సరంలో మూడు దశల పరీక్షలు, ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలు, పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తోంది. బేస్లైన్ టెస్ట్: విద్యా సంవత్సరం ప్రారంభంలో (ఈ నెల 25 నుంచి 30 వరకు) గత ఏడాది నేర్చుకున్న సామర్థ్యాలను అంచనా వేస్తారు. మిడ్లైన్ టెస్ట్: మధ్యంతరంగా విద్యార్థుల పురో గతిని మదింపు చేస్తారు. ఎండ్లైన్ టెస్ట్: విద్యా సంవత్సరం చివరలో సామర్థ్యాల సాధన స్థాయిని గుర్తిస్తారు. ఫలితాల నమోదు, విశ్లేషణబేస్లైన్ పరీక్షల ఫలితాలను జూలై 15లోగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ప్రత్యేక యాప్లో విద్యార్థుల వారీగా నమోదు చేయాలి. ఈ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి, అభ్యసన లోపాలను సరిదిద్దేందుకు కార్యక్రమాలను రూపొందిస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా ఉన్నతాధికారులు విద్యార్థుల అభివృద్ధికి నిర్దేశిత లక్ష్యాలను రూపొందిస్తారు. -
బాసరలో మహాబండారా
బాసర: బాసర రైతులు తమ గ్రామంలో కొలువైన శ్రీజ్ఞానసరస్వతీదేవి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు శుక్రవారం మహా బండారా(అన్నదానం) కార్యక్రమం నిర్వహించా రు. ముగ్గురు అమ్మలకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఆవరణలోనే అన్నప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామస్తులకు అన్నప్రసాదం అందించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, గ్రామం సుభిక్షంగా 105 ఏళ్లుగా ఈ మహా బండారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉమ్మయి సంజీవరావు, ఓని నర్సింగరావు, బండారి ఆనంద్, నూకం రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు సక్రమంగా నిర్మించాలి
● హౌసింగ్ డీఈ దయానంద్ముధోల్: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయిన లబ్ధిదారులకు తాపీ మేసీ్త్రలు సక్రమంగా నిర్మించాలని హౌసింగ్ డీఈ దయానంద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తాపీ మేసీ్త్రలు ఇసుక, సిమెంటు సరైన మోతాదులో కలిపి నాణ్యత లోపించకుండా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు 65 గజాలలోపే ఇంటిని 600 చదరపు గజాల్లో నిర్మించేలా చూడాలన్నారు. ఈమేరకు మేసీ్త్రలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈలు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు అనర్థాలపై అవగాహన ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణినిర్మల్టౌన్: మాదకద్రవ్యాల వాడకంతో కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. మత్తు పదార్థాలను వాడినా, వాటిని సరఫరా చేసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ఏఎస్పీ రాజేశ్మీనా, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, న్యాయవాదులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అధికారుల తీరు సరికాదు
జిల్లాలో పోడు, రెవెన్యూ భూముల సమస్య ప్రత్యేక సర్వే నిర్వహిస్తేనే పరిష్కారమవుతుంది. కడెం, దస్తురాబాద్ మండలాల్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. పీపీ ల్యాండ్స్ సాగు చేస్తున్న గిరిజనేతరులకు గతంలో పహాణీల ద్వారా రుణాలందేవి. 30–40 ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజనేతరులకు ప్రత్యామ్నాయం చూపాలి. అటవీ అధికారులు అభివృద్ధి పనులు అడ్డుకుంటుండగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయలి. – వెడ్మ బొజ్జుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే -
కమిట్మెంట్తో పనిచేయాలి
ఆదివాసీలతో పాటు భౌగోళికంగా విస్తీర్ణం కలిగిన జిల్లాలో సమస్యలు అధికంగానే ఉంటాయి. వాటి పరి ష్కారానికి చొరవ చూపాలి. ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో పనిచేయాలి. గృహజ్యోతి సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో కౌంటర్ను ఏర్పాటు చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ తో ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి 100 ఇంటిగ్రేటేడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం. పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. గ్యాస్ సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలి. సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖల మంత్రి -
నిధులు పెండింగ్లో పెట్టొద్దు
కొలాం, తోటి వంటి పీవీటీజీల ఇళ్ల నిర్మాణాలకు ఈజీఎస్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.742 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 9,10వ తరగతుల విద్యార్థులకు ఎండీఎం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు. అర్హులైన గిరిజనులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు వెంటనే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలి. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ -
చిత్తశుద్ధితో పథకాలు అమలు
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి -
ప్రాణహిత, చేవెళ్ల ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
గోదావరి ఉన్నప్పటికీ సాగునీటి సౌకర్యం లేని నియోజకవర్గం మాది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా తలపెట్టిన 27, 28వ ప్యాకేజీల పనులు పూర్తి చేసి సాగునీటి సౌకర్యం కల్పించాలి. బాసర సరస్వతీ అమ్మవారి టెంపుల్కు గత ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించగా రూ.7 కోట్లే ఖర్చయ్యాయి. మిగతా రూ.43 కోట్లు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెంటనే విడుదల చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. 2027 జూన్లో రానున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన చర్యలు చేపట్టాలి. – రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
ప్రజాప్రభుత్వంలోనే ప్రగతి
● అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి ● దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ● మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ వివేక్ ● ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ● నాలుగు గంటలు కొనసాగిన సమావేశం సాక్షి, ఆదిలాబాద్/కై లాస్నగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించే బాధ్యత అధికారులేదనని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం ఆదిలాబాద్లోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తూ అధికా రులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మొదట వ్యవసాయ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించా రు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారికి జైలు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇక నుంచి జిల్లాల వారీగానే సమీక్షలు నిర్వహిస్తామని చెప్పా రు. అనంతరం మృతి చెందిన స్వయం సహాయక సంఘాల కుటుంబీకులకు మంజూరైన రూ.10లక్షల ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్జాదవ్, కోవ లక్ష్మి, పాల్వా యి హరీశ్బాబుతోపాటు నాలుగు జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకీ షర్మిల, కాంతిలాల్, అడిషనల్ కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. మంత్రులకు ఘన సన్మానం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుతోపాటు ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి జిల్లాకు చెందిన వివేక్ తొలిసారి జిల్లాకు రాగా, వీరిని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్జాదవ్, కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. సీఆర్ఆర్ ఇంటికి వెళ్లిన ‘జూపల్లి’ తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని శాంతినగర్లోగల మాజీ మంత్రి, దివంగత చిల్కూరి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మేనల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అలకసమావేశం ప్రారంభమయ్యాక కాసేపటికి వేదికపైకి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుర్చీ లేకపోవడంతో కొద్దిసేపు నిల్చునే ఉన్నారు. జెడ్పీ సిబ్బంది వెంటనే కుర్చీ తీసుకువచ్చి వేయగా ఆసీనులయ్యారు. ఈ తర్వాత ఏమనుకున్నారో తెలియదు గాని ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి వేదిక దిగి అధికారుల కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాలని కోరారు. మంత్రి కూడా ఆహ్వానించడంతో తిరిగి వేదికపైకి వచ్చి అనిల్ జాదవ్ సీట్లో కూర్చున్నారు. -
నిర్మల్
7డ్రగ్స్ అనర్థాలపై అవగాహన మాదకద్రవ్యాల నిరోధక దినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ అనార్థాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ టూర్ ప్యాకేజీలపై దృష్టి సారించింది. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. తక్కువ చార్జీలతో అవకాశం కల్పిస్తోంది. 8లోu9లోu శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 202532.2 /26.2గరిష్టం/కనిష్టం -
రుచికరమైన భోజనం అందించాలి
● ఆర్సీవో శ్రీధర్ ● లక్ష్మణచాంద, మామడ ఎంజేపీ గురుకులాల తనిఖీ లక్ష్మణచాంద: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. మండలంలోని రాచా పూర్ గ్రామంలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంట శాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న వంటను పరిశీలించారు. కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులు తనిఖీ చేశారు. ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన విద్యార్థి గోకుల్ నాయక్ను సన్మానించి అభినందించారు. నూతనంగా చేరిన విద్యార్థుల అకౌంట్లను త్వరగా తీయించాలని అందులోనే విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు జమవుతాయని తెలిపారు. విద్యార్థులకు నిత్యం పోషక విలువలు గల నాణ్యమైన, రుచికరమైన భో జనం అందించాలని సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు పుణ్యవతి, గంగజమున, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. మామడ కేజీబీవీ.. మామడ: మండల కేంద్రంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబందించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థికి బ్యాంకు అకౌంట్ తీయించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే కాస్మోటిక్ డబ్బులు విద్యార్థుల అకౌంట్లలో అందిస్తారని అన్నారు. కిచెన్లో మెనూను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. -
ధాన్యం దోపిడీపై విచారణ జరిపించాలి
వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్మిల్లర్ల వరకు సంచికి 5–6 కిలోల ధాన్యం దోపిడీ జరుగుతోంది. అధికారులు, గత ఇన్చార్జి మంత్రికి తెలిపినా ఫలితం లేదు. 12శాతం డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలి. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రైతుభరోసా నిధులు రూ.200 కోట్లు చెల్లించకుండా సంబరాలు చేసుకోవడం విడ్డూరం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులు బోర్లు వేసుకునేందుకు, కరెంట్ పొందేందుకు అనుమతించాలి. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే -
జూపల్లి.. పర్యాటకశోభ తెవాలి
● చూసేందుకు ఎన్నో ఉన్నా.. టూరిజం అభివృద్ధి సున్నా.. ● ‘బాసర’ నిధులూ.. వెనక్కి రావాలి.. ● సంక్షేమంతోపాటు.. టూరిజంపైనా దృష్టిపెట్టాలంటున్న జిల్లా వాసులు ● నేడు జిల్లాకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు రాకనిర్మల్: రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి శుక్రవారం నిర్మల్ జిల్లాలో అధికారిక పర్యటనకు వస్తున్నారు. కలెక్టరేట్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటా రు. జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించాలని స్థానికులు ఆశిస్తున్నా రు. గోదావరి నది, సహజ సిద్ధమైన జలపాతాలు, చారిత్రక స్థలాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నప్పటి కీ, జిల్లా పర్యాటక రంగం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ సందర్భంగా, మంత్రి జూపల్లి నాయకత్వంలో ఈ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన బాసరబాసర, దేశంలోనే ప్రముఖ చదువుల క్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశం. గోదావరి నది ఒడ్డున అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రం, పర్యాటక రంగంలో గణనీయమైన అభివృద్ధిని ఆశిస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం చేపట్టిన కొన్ని అభివృద్ధి పనుల తర్వాత, ఇక్కడ పెద్దగా పురోగతి కనిపించలేదు. గత ప్రభుత్వం కేటాయించిన రూ.50 కోట్ల నిధుల్లో కొంత భాగం మాత్రమే ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు, జూపల్లి ఇన్చార్జి మంత్రిగా నియమితులైన సందర్భంగా, ఈ నిధులను పునరుద్ధరించి, బాసరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిపాదనల్లోనే పోచంపాడ్ – బాసర బోటింగ్..గత ప్రభుత్వం టెంపుల్ టూరిజం భాగంగా, నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్లో బాసర క్షేత్రం వరకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. హామీగానే ‘గడ్డెన్న’ ప్రాజెక్టుభైంసా పట్టణాన్ని ఆనుకుని ఉన్న సుద్ధవాగుపై గడ్డెన్నవాగు ప్రాజెక్టు, బోటింగ్, పార్కు వంటి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా చెబుతున్నారు. కానీ, ఈ దిశగా ఇప్పటివరకు గట్టి చర్యలు తీసుకోలేదు, ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే అవకాశం..గతంలో ‘దక్షిణ కశ్మీరం’గా మార్చుతామని, ‘టూరి జం సర్క్యూట్’గా అభివృద్ధి చేస్తామని పలు హామీ లు ఇచ్చినా, అవి నీరుగారిపోయాయి. ఇప్పుడు, పర్యాటక శాఖ మంత్రిగా, జిల్లా ఇన్చార్జిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించడంతో, జిల్లా పర్యాటక రంగంలో కొత్త ఒరవడి సృష్టించాలని స్థానికులు కోరుతున్నారు. ‘జూపల్లిగారూ, పర్యాటకశోభ తీసుకురండి’ అని విన్నవిస్తున్నారు. ‘కడెం’ అందాల నిరాదరణవాస్తాపూర్ జలపాతం..చారిత్రక నిర్మల్..పచ్చని అడవుల మధ్య నిండుకుండలా ఆకర్షించే కడెం ప్రాజెక్టు, పర్యాటకులను ఆకట్టుకునే అనేక అందాలను కలిగి ఉంది. అయితే, రెస్టారెంట్, బోటింగ్ వంటి కనీస సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్కడి పర్యాటక రంగానికి అడ్డంకిగా మారింది. ఈ ప్రాంతాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మామడ మండలం వాస్తాపూర్ జలపాతం, పచ్చని అడవుల మధ్య సహజ సిద్ధమైన అందాలతో ఆకర్షిస్తుంది. కుటుంబ సమేతంగా సందర్శించడానికి అనువైన ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోవడం పర్యాటకులకు ఇబ్బందిగా మారుతోంది. రోడ్లు, వసతి గృహాలు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలను కల్పిస్తే, ఈ జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. చారిత్రక పట్టణమైన నిర్మల్లో బూరుజులు, గఢ్లు, శ్యాంగఢ్, బత్తీస్గఢ్, గజ్గఢ్, దసరా బూరు జు వంటి చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. అయి తే, ఈ స్థలాలు నిర్లక్ష్యానికి గురై, కొన్ని కబ్జాలకు లోనవుతున్నాయి. సర్ద్మహల్ వంటి ప్రత్యేక నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. 13 చెరువులు ఉన్న ఈ పట్టణంలో బోటింగ్ లేదా ఆహ్లాదకరమైన పార్కులు కూడా లేని దుస్థితి నెలకొంది. -
పీజీ లాసెట్లో ప్రతిభ
లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన పీజీ లా సెట్–2025 ఫలితాలలో లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సహస్ర చందన అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 190వ ర్యాంకు సాధించింది. మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ అధ్యాపకుడు ప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మంజుల దంపతుల కుమార్తె అయిన సహస్ర చందన హైదరాబాద్లోని ప్రఖ్యాత అంబేద్కర్ లా కళాశాలలో లా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పీజీ సెట్లో 190 ర్యాంక్ సాధించింది. తమ కుమార్తె రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు అనందం వ్యక్తం చేశారు. -
స్థలం కేటాయించాలని వినతి
నిర్మల్ఖిల్లా: తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయం కోసం స్థలం కేటా యించాలని సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్ అభిలాష అభినవ్ను కోరారు. బుధవా రం కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. టీజీవో సంఘం జి ల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజీ రెడ్డి, కార్యదర్శి దా త్రిక రమేశ్, అసోసియేట్ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, సంయుక్త కార్యదర్శి సుదర్శన్, ప్రచార కార్యదర్శి విష్ణువర్ధన్, కార్యాలయ కార్యదర్శులు రాజమల్లు, క్రాంతికుమార్, వినోద్కుమార్, శ్రీహరి, జీవరత్నం తదితరులున్నారు. -
స్థానిక సమరానికి సై!
నిర్మల్బోనాల పండుగకు వేళాయె బోనాల సందడి మొదలు కానుంది. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుండగా డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరూవాడా మార్మోగనున్నాయి. ● సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలనిరాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం ● ముందుగా పంచాయతా.. పరిషతా? ● పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● సర్వం సిద్ధం చేసిన యంత్రాంగంజిల్లాకు సంబంధించిన వివరాలు గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 20258లోu ‘ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం’ నిర్మల్టౌన్: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పేర్కొన్నారు. ఎమర్జెన్సీ రో జులకు నిరసనగా ‘సంవిధాన్ హత్య దివస్’ పే రిట బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి వీరు హాజరై మాట్లాడారు. ఎమర్జెన్సీ విధించిన జూ న్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్య దివస్’గా భా రత ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నా రు. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన వారందరికీ నివాళులర్పించారు. నాయకులు రావుల రాంనాథ్, అంజుకుమార్రెడ్డి, అయ్యన్నగారి భూ మయ్య, మెడిసేమ్మ రాజు, రాచకొండ సాగర్, రజిని, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని కలు పూర్తి చేయాలని హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో పల్లెల్లో అప్పుడే ఎ న్నికల కోలాహలం మొదలైంది. ఇన్నాళ్లుగా ఈ తీపికబురు కోసమే నిరీక్షించిన ఆశావహులు ఆనందపడుతున్నారు. కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసి ఏడాది న్నరవుతోంది. గతేడాది జనవరిలో సర్పంచులు, జూలైలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కా లం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం కూడా పూర్తయింది. స్థా నిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఆశావహుల హడావుడి ప్రస్తుతం వరుసగా అన్ని ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ టీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అ వకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగినట్లు ఆయా పార్టీలు నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులను చేస్తున్నాయి. పార్టీ ‘బీ’ ఫాంలతో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల విషయంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. సర్వం సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తిచేసింది. ఎలక్షన్ కమిషన్ ఎప్పు డు నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. గ్రామపంచా యతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలతోపా టు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ను అధి కారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కూడా సంసిద్ధులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చా రు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను ఆయా మండలాలకు ఇప్పటికే తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూస్రీల్మండలాలు : 18గ్రామపంచాయతీలు : 400వార్డులు : 3,368ఓటర్లు : 4,40,997మహిళా ఓటర్లు : 2,10,146 పురుష ఓటర్లు : 2,30,836ఇతర ఓటర్లు : 15ఎంపీటీసీ స్థానాలు : 157జెడ్పీటీసీ స్థానాలు : 18మండలాలవారీగా పంచాయతీలు, వార్డులు, ఓటర్లు మండలం జీపీలు వార్డులు మహిళలు పురుషులు ఇతరులు బాసర 10 90 7,427 7,956 01 భైంసా 30 258 15,970 17,269 02 దస్తూరాబాద్ 13 102 6,206 6,566 01 దిలావర్పూర్ 12 108 8,567 9,853 00 కడెం 29 242 13,739 14,761 01 ఖానాపూర్ 25 192 11,106 11,948 00 కుభీర్ 42 344 19,430 20,300 01 కుంటాల 15 134 9,112 9,726 00 లక్ష్మణచాంద 18 162 11,114 12,892 01 లోకేశ్వరం 25 224 13,492 15,465 03 మామడ 27 22 12,067 13,685 00 ముధోల్ 19 166 13,514 14,530 02 నర్సాపూర్ 13 120 9,298 10,413 01 నిర్మల్రూరల్ 20 170 10,515 12,085 00 పెంబి 24 152 5,265 5,581 00 సారంగపూర్ 32 282 17,917 20,582 02 సోన్ 14 132 10,067 11,498 00 తానూరు 32 268 15,340 15,726 00 -
సమన్వయం.. సవాలే!
● ‘హస్తం’లో గ్రూపు విభేదాలు ● నామినేటెడ్, పార్టీ కమిటీల నియామకాల్లో జాప్యం ● ముంచుకొస్తున్న ‘స్థానిక’ సమరం ● నేడు ఆదిలాబాద్కు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ● రెండు రోజుల పాటు ఇక్కడే.. ● ఆయన వెంట మంత్రి వివేక్ కూడా.. సాక్షి, ఆదిలాబాద్: ‘పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశపర్చొద్దు.. సమన్వయంతో ముందుకు సాగా లి.. ప్రభుత్వ పదవులను శ్రేణులకు ఇప్పించడంలో జాప్యం అయితే ప్రయోజనమేంటి.. ఆలయ, మా ర్కెట్ కమిటీలు వంటి పదవులు నేరుగా నేను ఇవ్వలేను.. ఇన్చార్జి మంత్రులు, షార్ట్లిస్ట్ చేసి పంపితే ఫైనల్ మాత్రమే చేయగలుగుతాను.. నామినేటెడ్తో పాటు పార్టీ కమిటీలు వేయడంలో ఇక ఆలస్యం వద్దు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలి.. అది జరిగితే త్వరగా ఫైనల్ చేయవచ్చు..’ ఇది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన టీపీసీ సీ పీఏసీ భేటీలో అన్న మాటలు. ప్రస్తుతం ఇవి ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ఇన్చా ర్జి మంత్రులకు ప్రస్తుతం పార్టీ పరంగా వీటన్నింటి ని సరిదిద్ది, గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎకై ్స జ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. నేడు, రేపు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఉమ్మడి జిల్లా అధి కారులతో సమీక్షతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నా రు. అలాగే ఇన్చార్జి మంత్రికి తొలుత పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేట్ పదవుల పందేరం, స్థాని క సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయ డం ముందున్న బాధ్యత. సీఎం ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు దృష్టి సారించాలని ఆదేశించ డం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నే పథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన తక్ష ణం దృష్టి సారించాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో గ్రూపు విభేదాలతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో మంత్రి వీటన్నింటినీ ఎలా గాడిలో పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కార్యకర్తల్లో తాము అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కని పించడం లేదు. అధికారుల వద్ద తమ పనులు కాకపోవడం కూడా ఈ నిరాశకు కారణం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం తీసుకురావడం ప్రస్తుతం ఇన్చార్జి మంత్రికి కీలకం కానుంది. సమన్వయం సాధించేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలున్నాయి. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది. గతంలో ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్క వీరందరినీ సమన్వయ పర్చడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా ఆమె అసలు పట్టించుకోలేదని నేరుగా జిల్లా నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముందు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావించా రు. ఆ సమయంలోనే తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించలేనని, తప్పుకొంటానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అ ప్పట్లోనే ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత పరిణామ క్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి గా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లిని ఆదిలాబాద్ కు, సీతక్కను నిజామాబాద్కు మార్చారు. ఈ పరి స్థితుల్లో మంత్రి జూపల్లి తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ఆయన ఎలా ముందుకెళ్తారనేది కీలకంగా మారింది. ఇక చెన్నూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంత్రి హోదాలో ఆయన కూడా గురువారం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి రానున్నారు. -
ఒకే ఉపాధ్యాయుడు.. 90 మంది విద్యార్థులు
ఖానాపూర్: మండలంలోని బీర్నంది ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో 94 మంది విద్యార్థులకు ఒకే ఉ పాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో రెండు పోస్టులు ఉన్నప్పటికీ మరో ఉపాధ్యాయురాలు శ్రీదేవి పాఠశాల ప్రారంభించిన రెండోరోజే ఆరు నెలల ప్రసూతి సెలవులో వెళ్లారు. బీ ర్నంది పంచాయతీ పరిధిలోని గ్రామాలతోపాటు రంగపేట గ్రామం నుంచి విద్యార్థుల సంఖ్య ఈ బ డికి గణనీయంగా పెరిగింది. ఐదు తరగతులు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. కాగా, మండలంలోని సుర్జాపూర్ పంచాయతీ పరిధిలోగల బుడగజంగంవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు న్నారు. మండలంలోని పలు చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
గంజాయి నిర్మూలన అందరి బాధ్యత
నిర్మల్టౌన్: గంజాయి నిర్మూలన అందరి బాధ్య త అని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మా ట్లాడారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చే యాలని, ‘మిషన్ గంజా గస్తీ’ ప్రోగ్రాంను పక్కగా అమలు చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే వెంటనే 8712659599 నంబర్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్పై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట ఆన్లైన్లో వీడియో కాల్ చేసి పోలీస్ అధికారులమంటే న మ్మవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురై తే గంటలోపే 1930కు కాల్ చేయాలని లేదా https:// www. cybercrime. gov. inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీ రోజు సాయంత్రం డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. వాహనాల ఫే క్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించా రు. అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్ మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీణ్కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, ఎస్హెచ్వోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ● నేర సమీక్షలో ఎస్పీ జానకీ షర్మిల -
‘ప్రైవేట్’కు దీటుగా విద్యనందించాలి
సోన్: ‘ప్రైవేట్’కు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం సోన్ కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, తరగతిగదులు, వసతి గృహం, మరుగుదొడ్లు, భోజనశాల, స్టోర్రూమ్ ను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినుల హాజరు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ప్రతీరోజు శుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్య మైన భోజనం అందించాలని సూచించారు. అంతకుముందు పదో తరగతి విద్యార్థినుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. పాఠ్యపుస్తకాలు, నో టుబుక్స్, యూనిఫాంలు అందాయా? అని ఆరా తీశారు. లక్ష్యంతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రామారావు, తహసీల్దార్ మల్లేశ్రెడ్డి, ఎంపీడీవో సురేశ్, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, సలోమి, లింబాద్రి, ప్రవీణ్, హెచ్ఎం లతాదేవి, ఉపాధ్యాయులున్నారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
నిర్మల్టౌన్: యువత మత్తు పదార్థాలకు బాని సై జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రజాక్ సూచించారు. ప్రొహిబిషన్, ఎకై ్స జ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై బుధవారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల కట్ట డికి పోలీస్, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు. -
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి ఎంపిక పోటీలు
నిర్మల్టౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి హ కీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతితో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. జి ల్లా నుంచి 46మంది బాలబాలికలు హాజరయ్యా రు. వీరికి తొమ్మిది విభాగాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారిని జూలై 1నుంచి హకీంపేట్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిక పోటీల స్టేట్ అబ్జర్వర్ శ్రీకాంత్, పెటా సెక్రటరీ భోజన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్గౌడ్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. -
ముందస్తు చర్యలు తీసుకోవాలి
నిర్మల్టౌన్: వ్యాధుల నియంత్రణకు ముందస్తు చ ర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా వై ద్యాధికారులతో సమావేశమయ్యారు. కాలానుగుణ వ్యాధుల నివారణ, టీబీ నిర్మూలన తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వానా కాలంలో వ్యాధులు విజృంభించే ప్రమాదమున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించా రు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వ్యాధి ని ర్ధారణ కిట్లు, ఔషధాలు సిద్ధంగా ఉంచాలని సూ చించారు. టీబీని నిర్మూలించేందుకు ‘టీబీ ముక్త భారత్’ కార్యక్రమం పరిధిలో అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. టీబీ బాధితులకు సమయానికి వైద్యసేవలు అందించి, వారిని ఆ రోగ్యవంతులుగా మార్చాల్సిన బాధ్యత వైద్యాధికా రులదేనని స్పష్టం చేశారు. జిల్లా వైద్యాధికారి రా జేందర్, డీసీహెచ్ డాక్టర్ సురేశ్, అధికారులు రవీందర్, రాజారమేశ్, ఆశిష్రెడ్డి, భోజారెడ్డి ఉన్నారు.మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావునిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగం పెంచాలని, వనమహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హై దరాబాద్లోని డాక్టర్బీఆర్.అంబేడ్కర్ సచివాల యం నుంచి మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వనమహోత్సవంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు. ఆయిల్పామ్ సాగుపై ప్ర త్యేక దష్టి సారించాలని, టీబీ ముక్త భారత్ లక్ష్యం సాధించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావే శ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష నిర్వహించారు. మొక్కల లక్ష్యం 69.55 లక్షలు..సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 69.55 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో గుంతలు తవ్వించి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగుకు ఎరువుల కొరత లేకుండా మండల స్థాయిలో నిల్వలపై రోజువారీ గా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ పూర్తయిన వెంటనే గ్రౌండింగ్ చేసి, యాప్లో నమోదు చేయాలన్నారు. వర్షాకాల వ్యాధుల నివారణకు వైద్య బృందాలు, ఫాగింగ్, ఆయిల్ బాల్స్, గంభూషియా చేపల వాడకం, డ్రైడే నిరంతరం కొనసాగించాలని తెలి పారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచాలని, డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టా లన్నారు. భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రి య పూర్తయిన వెంటనే అవసరమైన నోటీసులు సిద్ధం చేయాలన్నారు. సీఎంఆర్ రైస్ వేగవంతంగా పూర్తి చేసేలా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నా రు. మండలస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలపై తక్షణ మే స్పందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, డీఎఫ్వో నాగినిభాను, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఇన్చార్జ్ డీఆర్డీవో నాగవర్ధన్, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
పెద్ద నోట్లతో ఇబ్బంది..
ఇంతకుముందు బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే పెద్ద నోట్లతో చిల్లర లేక చాలా ఇబ్బందులు ఉండేవి. రూ.10 టికెట్కు రూ.500 నోటు ఇచ్చేవారు. రూ.15 టికెట్కు రూ.100 ఇచ్చేవారు. దీంతో చికాకు అనిపించేది. ఈ సమయంలో గొడవలు అయ్యేవి. కొన్నిసార్లు టికెట్ వెనుక రాసి ఇచ్చేవాళ్లం. దిగేటప్పుడు ఆ టికెట్ చూపించి చిల్లర తీసుకోమని చెప్పేవాళ్లం. వీటన్నిటికీ ఆర్టీసీ అధికారులు స్వస్తి పలికారు. ఈ కీలక నిర్ణయంతో డ్యూటీలో సంతృప్తి కలుగుతుంది. – భూలక్ష్మి (కండక్టర్) నిర్మల్ డిపో -
పంట పెట్టుబడికి రైతు భరోసా
నిర్మల్ రూరల్: పంట పెట్టుబడికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా వెన్నుదన్నుగా నిలుస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామ రైతువేదికలో మంగళవారం నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన రైతుభరోసా సంబరాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. హైదరాబాదులోని రైతునేస్తం వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రితోపాటు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు, యాంత్రికరణ పనుల కోసం అవసరమైన పెట్టుబడిసాయంతో రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 1,85,116 మంది రైతుల ఖాతాల్లో రూ.260.80 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, ఏవో వసంత్ కుమార్, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ అభిలాష అభినవ్ -
పరిష్కారమే మిగిలింది..
● జిల్లాలో ముగిసిన భూభారతి సదస్సులు ● 393 గ్రామాలు .. 16,217 దరఖాస్తులు ● కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియనిర్మల్చైన్గేట్: ధరణి పోర్టల్లోని లోపాలను సవరిస్తూ, మార్పులు, చేర్పులతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించారు. నిర్దేశిత గడువు జూన్ 20తో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 393 గ్రామాల నుంచి మొత్తం 16,217 దరఖాస్తులు వచ్చాయి. మామడ మండలంలో అత్యధికంగా 1,616 దరఖాస్తులు, పెంబిలో అత్యల్పంగా 198 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో 10,927 ఆన్లైన్లో నమోదు చేశారు. చట్టం సమర్థవంతంగా అమలు కోసం సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతోంది. సర్వేయర్ల శిక్షణ కొనసాగింపుభూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 19 మండలాలకు కేవలం 12 మంది రెవెన్యూ సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. దీంతో లైసెన్స్ సర్వేయర్లకు అవకాశం కల్పించగా, మీసేవ కేంద్రాల ద్వారా 212 దరఖాస్తులు అందాయి. ఎంపికై న అభ్యర్థులకు గత నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ కొనసాగుతోంది. అర్హతలు సాధించిన వారికి లైసెన్స్లు జారీ చేస్తారని అధికారులు తెలిపారు. గ్రామ పరిపాలన అధికారుల నియామకంభూ భారతి అమలు కోసం గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓల) నియామకానికి ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు అవకాశం కల్పించగా, 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మంది దరఖాస్తులు ఆమోదం పొంది, గత నెల 25న రాత పరీక్షకు హాజరయ్యారు. అయితే, అర్హత సాధించిన వారికి ఇప్పటి వరకు నియామక పత్రాలు అందలేదు. సీసీఎల్ఏకు నివేదిక..రెవెన్యూ సిబ్బంది రోజువారీ దరఖాస్తులను కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ స్థాయిలో సమస్యల వారీగా నివేదికలను రూపొందించి, సీసీఎల్ఎకు పంపించారు. రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు పాల్గొని, దరఖాస్తులను పరిశీలించడంతోపాటు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ విధంగా భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు మండలం దరఖాస్తులు ఆన్లైన్ బాసర 442 385 భైంసా 1,270 919 ముధోల్ 1,515 765 కుభీర్ 460 396 తానూరు 1,084 884 లోకేశ్వరం 1,054 600 నర్సాపూర్(జి) 265 244 దిలావర్పూర్ 1,003 685 సారంగాపూర్ 1,302 953 నిర్మల్ రూరల్ 1,219 700 నిర్మల అర్బన్ 208 208 సోన్ 638 348 లక్ష్మణచాంద 1,182 903 మామాడ 1,616 768 ఖానాపూర్ 729 519 పెంబి 198 171 కడెం 986 678 దస్తూరాబాద్ 1,046 801 ఆన్లైన్ నమోదు తర్వాత..రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత, సర్వేయర్లు ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు జారీ చేసి సర్వే నిర్వహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ లాగిన్లలో సమాచారం అందుబా టులో ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీవోలకు డిజిటల్ సంతకం అవకాశం కల్పించారు. అన్ని అంశాలు సవ్యంగా ఉంటే, రైతులకు పాస్బుక్తోపాటు భూమ్యాప్ కూడా అందజేస్తారు. సత్వర పరిష్కారం చూపుతాం రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశా యి. సదస్సుల నిర్వహణకు రైతులు సహకరించారు. రైతులు పెద్ద సంఖ్యలో సదస్సులకు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సత్వర పరిష్కారం చూపుతాం. సత్వర పరిష్కారానికి వీలుకాని దరఖాస్తులు ఉంటే అందుకు కారణాలను భూ యజమానులకు తెలియజేస్తాం. – అభిలాష అభినవ్, కలెక్టర్ -
జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్
నిర్మల్టౌన్: జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిభను వెలికితీసేందుకే జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలో మొట్ట మొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలన్నారు. అదేవిధంగా న్యాయ నిరూపణ జరగాలంటే సరైన ఆధారాలు సేకరించాలని సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్యూటీ మీట్లో పోలీస్ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి, వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్ లిఫ్టింగ్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్, ఫొటో, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీలలో రాణించిన వారిని జోనల్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐలు రామ్నిరంజన్, శేఖర్, రమేశ్, రామకృష్ణ, ఆర్ఎస్సైలు, డాగ్స్క్వాడ్ బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మత్తును తరిమేద్దాం..
● మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములవుదాం ● ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఎస్పీ జానకీషర్మిల పిలుపు నో డ్రగ్స్ అనే ఇంగ్లిష్ అక్షరాల ఆకృతిలో మానవహారంగా విద్యార్థులు..బాసర: సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రమాదకరమైన మహమ్మారి మత్తు, డ్రగ్స్ అని, మాదకద్రవ్యాలన నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ జానకీషర్మిల పిలుపునిచా ర్చరు. మాదకద్రవ్యాల నిర్మూలన వారోత్సవా ల్లో భాగంగా బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్ఐటీ)లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జీవి తంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఈ వయసులో ఆకర్షణలకు లోనుకావొద్దని సూచించారు. మత్తుకు బాని సై తే జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. ఆరోగ్యంతో పాటు కుటుంబాన్ని, కలలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. నిర్మల్ను గంజాయి రహిత జిల్లాగా చేసేందుకు పోలీస్శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. తర్వాత ట్రిపుల్ఐటీ విద్యార్థులతో ‘నో డ్రగ్స్’ అంటూ నినాదాలు చేయించారు. అక్షర రూపంలో మానవహారం ఏర్పాటు చేశా రు. అనంతరం భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, ఇన్చార్జి వీసీ గోవర్ధన్, మిగతా ప్రొఫెసర్స్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో పర్యటించా రు. విద్యార్థులతో మాట్లాడారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముధోల్ సీఐ మల్లేశ్, డీఎస్బీ సీఐ సమ్మయ్య, బాసర, ముధోల్ ఎస్సైలు శ్రీనివాస్, పెర్సిస్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘రైతు పక్షపాత ప్రభుత్వం’
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో ఉన్నది రైతు పక్షపాత ప్రభుత్వమని నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, అబ్దుల్ హాది అన్నారు. రైతు భరో సా నిధులు అన్నదాతల ఖాతాలో జమ కావడంతో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం రైతుభరోసా సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచారు. వివిధ మండలాల అధ్యక్షులు కుంట వేణుగోపాల్ , బొల్లోజి నర్సయ్య , మధుకర్రెడ్డి, ఒడ్నాల రాజేశ్వర్, భుజంగా శ్రీనివా స్రెడ్డి , తక్కల సాగర్రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ కొండ్రు రాంరెడ్డి, పీసీసీ సభ్యులు సాదా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో స్మార్ట్ జర్నీ
● అన్ని బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ● ప్రయాణికుల చిల్లర సమస్యకు చెక్ ● పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలోనూ స్మార్ట్ టిమ్స్ నిర్మల్టౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. వివిధ ఆఫర్లు, టూరిజం ప్యాకేజీలు, ఆక్యుపెన్సీ రేటును పెంచే లక్ష్యంతో సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. తాజాగా ప్రయాణికుల చిల్లర సమస్యను అధిగమించేందుకు డిజి టల్ చెల్లింపుల విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తూ స్మార్ట్ పేమెంట్స్కు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు టికెట్కు సరిపడా చిల్లర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్లతో ప్రయాణించే వారికి చిల్లర తిరిగి ఇవ్వడానికి కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఇది కండక్టర్ల కు, ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుంది. చాలాసార్లు గొడవలు పడిన సందర్భాలూ ఉన్నాయి. మహాలక్ష్మి పథ కం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. చిల్లర విషయంలో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చింది. సరళమైన టికెటింగ్ విధానంటీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, యూపీఐ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఈ విధానం చిల్లర సమస్యను పూర్తిగా తొలగించడమే కాకుండా, టికెటింగ్ ప్రక్రియను వేగవంతం అవుతుంది. ఇది కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలను తగ్గించి, ప్రయాణ అనుభవాన్ని సౌకర్యవంతంగా మార్చింది. స్వాగతిస్తున్న ప్రయాణికులు..ప్రయాణికులు ఈ డిజిటల్ చెల్లింపు విధానాన్ని స్వాగతిస్తున్నారు. చిల్లర సమస్యను తొలగించడమే కాకుండా, సమయాన్ని ఆదా చేస్తుంది. టీజీఎస్ఆర్టీ సీ ఈ చొరవ ద్వారా ఆక్యుపె న్సీ రేటును పెంచడం, సంస్థను లాభాల బాటలో నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ఉచిత ప్రయాణాలు పెరిగినా చెల్లింపు చేసే ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ డిజిటల్ చెల్లింపు విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అదనంగా, టూరిజం ప్యాకేజీలు, ఆఫర్లతోపాటు ఈ డిజిటల్ చొరవ సంస్థ సేవా నాణ్యతను మరింత బలోపేతం చేస్తోంది.నిర్ణయం బాగుంది.. ఆర్టీసీ బస్సుల్లో చిల్ల ర సమస్యకు చెక్ పెట్టేలా డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి తేవడం బాగుంది. ఆన్లైన్ పేమెంట్స్తో ఎటువంటి చిల్లర సమస్యలు ఉండవు. ఎలాంటి బ్బంది లేకుండా హ్యాపీగా ప్రయాణిస్తున్నాము. ఇలాంటి సేవలు తీసుకొచ్చిన ఆర్టీసీకి కతజ్ఞతలు – మహేష్, నిర్మల్యూపీఐ సేవల విస్తరణచిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా అమలులోకి తెచ్చింది. గతంలో గరుడ, రాజధాని, సూపర్లగ్జరీ, నాన్–స్టాప్ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇప్పుడు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు కండక్లర్లకు స్మార్ట్ టిమ్లు అందించింది. దీంతో ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, డెబిట్/క్రెడిట్ కార్డులు వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నిర్మల్ డిపోలోని 71 పల్లెవెలుగు, 36 ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఐదు రోజులుగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రయాణికులకు ఇబ్బంది లేని అనుభవాన్ని అందిస్తోంది. -
ప్రజావాణి.. పరిష్కారం ఏది?
● ఒకే సమస్యపై పదే పదే అర్జీలు ● వివిధ కారణాలతో కాలయాపన ● సోమవారం గ్రీవెన్స్కు 117 అర్జీలుసదరం సర్టిఫికెట్ ఇవ్వాలి.. మేము తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నాం. మాకు ఇంతవరకు సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు. పెన్షన్ రావడం లేదు. వేరే రాష్ట్రాలలో సదరం సర్టిఫికెట్ ఇస్తున్నారు. మాకూ కూడా సదరం సర్టిఫికెట్ ఇప్పించి ఆదుకోవాలి. – తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు నిర్మల్చైన్గేట్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తున్నా.. సమస్యల పరిష్కారంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తులు ఆన్లైన్లో నమోదై, సంబంధిత శాఖలకు వెళ్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిష్కారం విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వివిధ కారణాలు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు మళ్లీ మళ్లీ కలెక్టరేట్కు వస్తున్నారు. ఒకే సమస్యపై పలుమార్లు దరఖాస్తులు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాలు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 117 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ వానాకాలంలో శానిటేషన్, వన మహోత్సవవంలో మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సోన్ తహసీల్దార్పై ఫిర్యాదు సోన్: రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సోన్ తహసీల్దార్ మల్లేశ్రెడ్డిపై చర్య తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట కడ్తాల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భూసమస్యలపై కార్యాలయానికి వెళ్తే గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన రైతులను తెలిసినవారు కార్యాలయానికి తీసుకెళ్తే బ్రోకర్లు అంటూ చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే మీ సర్వే నంబర్లను రెడ్ మార్క్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 25 శాతం సీట్లు కేటాయించాలి విద్యాహక్కు చట్టం – 2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాలి. 2025– 26 విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి. – కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ నాయకులు అంగన్వాడీ భవనం నిర్మించాలి.. మేము ఖానాపూర్ మున్సిపాలిటీ మూడో వార్డు అంబేద్కర్ నగర్ వాసులం. మా కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం లేదు. నూతన భవనానికి స్థలం ఉంది. చిన్నారుల శ్రేయస్సు కోసం కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. అదే విధంగా కాలనీలోని బెల్ట్ షాపు, కల్లు దుకాణం తొలగించాలని కోరారు. – ఖానాపూర్ మూడోవార్డు వాసులు -
నిర్మల్
మలేషియా జైలు నుంచి.. ఉపాధికోసం మలేషియా వెళ్లిన లింగాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడి జైల్లో మగ్గారు. ఎట్టకేలకు వారు జైలు నుంచి తిరిగి స్వగ్రామానికి చేరారు. 8లోu మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025అన్నదాతకు బాసటగా ‘రైతు భరోసా’ నిర్మల్చైన్గేట్: వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి నిధులు ఖాతాల్లో జమ చేస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు. సోమవారం నాటికి జిల్లాలో మొత్తం రూ.260.80 కోట్లు జమయ్యాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,86,400 మంది రైతులు ఉండగా, 1,85,116 మంది ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు చేరాయని తెలిపారు. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమవుతాయని పేర్కొన్నారు. గుర్తించిన తయారీ కేంద్రంకొయ్య బొమ్మలు.. వ్యవసాయం.. నిమ్మ రాజుల చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ జిల్లా కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఒకవైపు మత్తు పదార్థాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. ఇంకోవైపు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు పెరుగుతున్నాయి. ఇక తాజాగా కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఇక మత్తు పదార్థాల తయారీకి కేంద్రంగా మారింది. జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామని కలెక్టర్, ఎస్పీ ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు దందా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. జిల్లా అధికారులు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా.. అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. – నిర్మల్ఇటీవల ఆల్ఫ్రాజోలంతో పట్టుబడిన నిందితులజిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. యువత గంజాయి, కొత్త డ్రగ్స్ మత్తులో మునిగి, వాటిని దందాగా మార్చుకుంటోంది. మత్తులో తామేం చేస్తున్నారో తెలియక, ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. గంజాయి దందా జిల్లా నలుమూలలకూ విస్తరించింది. యువతను బానిసలుగా, విక్రేతలుగా మార్చుతోంది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టినా ఈ అక్రమ దందాకు చెక్ పడడం లేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్లోరోహైడ్రేట్ తయారీ ఇక్కడే.. చెట్ల నుంచి సహజంగా రావాల్సిన కల్లు చేతుల్లోనే త యారవుతోంది. తాటి, ఈత చెట్లతో సంబంధం లే కుండానే సీసాల్లో చేరుతోంది. ఇప్పటిదాకా క్లోరో హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తుపదా ర్థాలను తీసుకువచ్చి, ఇక్కడ కృత్రిమ కల్లును త యారు చేసేవారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చి న విషయమేమంటే జిల్లాలోనే కల్లు తయారీకి ము డిపదార్థమైన క్లోరోహైడ్రేట్నే ఇక్కడే తయారు చే స్తుండటం. నిర్మల్రూరల్ మండలం చిట్యాలవద్ద వ్యవసాయక్షేత్రంలోని ఓ గదిలో గుట్టుగా క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు మూడురోజుల క్రితం దాడి చేశారు. బుర్ర రమేశ్గౌడ్, రామాగౌడ్తోపాటు శ్రీనివాస్గౌడ్, రాజశేఖర్గౌడ్, రాజుగౌడ్ దీనిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ముంబైలోని భీవండి ప్రాంతం నుంచి క్లోరో అనే ద్రవపదార్థాన్ని తీసుకువచ్చి, దానిని గడ్డకట్టించి, క్లోరోహైడ్రేడ్గా తయారుచేస్తున్నారు. చిట్యాలలో 425 కిలోల క్లోరోహైడ్రేట్, పదికిలోల వరకు ఆల్ఫ్రాజోలం పట్టుకున్నారంటే.. జిల్లాలో ఎంత భారీమొత్తంలో కల్తీకల్లు దందా నడుస్తుందో అర్థంచేసుకోవచ్చు. చైన్స్నాచింగ్లు, గంజాయి బ్యాచ్లు జిల్లాలో ఇటీవల కాలంలో కలవర పెడుతున్న మ రో రెండు విషయాలు చైన్స్నాచింగ్లు, గంజాయి అమ్మకాలు. పల్లె పట్నం తేడా లేకుండా అంతటా ఇ వి రెండూ పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా.. ఇవి కొనసాగుతూనే ఉండటం ప్రజలను కంగారు పెడుతున్నాయి. గంజాయి దందా జిల్లా నలుమూలలా విస్తరించి యు వతను మత్తుకు బానిసలుగా మార్చడమే కాకుండా, వారినీ విక్రేతలుగా మారుస్తుంది. ఇటీవల ఒకేరోజు భైంసా, నిర్మల్ రెండు మున్సిపాలిటీల్లో చైన్స్నాచింగ్లు కావడం సంచలనంగా మారింది. ఇలా ఏదో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులకు సవాల్.. ఒక దిక్కు కలెక్టర్, ఎస్పీ సహా అధికారులంతా మ త్తుపదార్థాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రు. మరోవైపు.. గంజాయి సహా అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరుగుతూ వారికి పెనుసవాల్గా మారుతున్నాయి. మత్తుపదార్థాలపై పోరు చేస్తున్న ఈవారంలోనైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్ రెచ్చిపోతూనే ఉన్న చైన్స్నాచర్లు ఇటీవల కొత్తగా కిడ్నాప్లు.. గంజాయి మత్తులో యువతరం తాజాగా వెలుగులోకి మత్తుమందు తయారీ.. పోలీసులకు సవాల్కొత్తగా కిడ్నాపులు.. జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా కొత్తగా కిడ్నాప్లూ జరుగుతుండడం కలవర పెడుతోంది. ఇటీవల మామడ మండలం పొన్కల్ నుంచి సీనియర్ నేత చిక్యాల హరీశ్రావును కిడ్నాప్ చేసిన ఆయన వాహనంలోనే తీసుకెళ్లడం, తూఫ్రాన్ టోల్ప్లాజా వద్ద ఆయన తప్పించుకోవడం, తీరా.. పోలీసుల విచారణలో గతంలో ఆయన వద్ద పనిచేసిన వ్యక్తే నిందితుడుగా తేలడం అంతా.. సినిమాను తలపించింది. ఇక మెదక్ జిల్లాలోనే భైంసా పోలీసులపై జరిగిన దాడి ఘటనలో పట్టణం నుంచి ఓ బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. కఠిన చర్యలు చేపడుతున్నాం.. గంజాయి, చైన్స్నాచింగ్ సహా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుశాఖ తరపున కఠినంగా వ్యవహరిస్తున్నాం. రెండు నెలల్లోనే 23 మందిపై కేసులు నమోదుచేశాం. పలువురు చైన్స్నాచర్లనూ పట్టుకున్నాం. మత్తురహిత జిల్లా కోసం శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. –జానకీషర్మిల, ఎస్పీ -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ జ్యోతి వెలిగించి, జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు ఈ రన్ సాగింది. అనంతరం అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ మా ట్లాడుతూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతా లలో క్రీడలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, ఏసీజీఈ పరమేశ్వర్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీధర్రెడ్డి, పెటా ప్రెసిడెంట్ భూక్యా రమేశ్, సెక్రెటరీ భోజన్న, ఎంఈవో నాగేశ్వర్రావు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్గౌడ్ పాల్గొన్నారు. -
చదువుకునే అవకాశం కల్పించాలి
నా చిన్నతనంలోనే అమ్మా నాన్నను కోల్పోయాను. నా పోషణ మా అమ్మమ్మ చూసుకుంది. ప్రస్తుతం ఆమెకు వయస్సు పైబడటంతో నా పోషణ భారంగా మారింది. నేను ఏడో తరగతి చదువుకోవాలనుకుంటున్నాను నాకు ప్రభుత్వ గురుకులం లేదా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించండి. – కోడె మనోజ్, నర్సాపూర్(జి) ఇల్లు క్యాన్సిల్ అయింది.. నేను దళితురాలిని. నాకు సొంతంగా ఇల్లు లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. లిస్టులో పేరు వచ్చింది. కొందరు నాయకులు కావాలనే మంజూరు అయిన ఇల్లు క్యాన్సిల్ చేయించారు. అధికారులు విచారణ న్యాయం చేయాలి. – హేమలత, పాత మద్దిపడగ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అందించాలి నా భర్త వెంకటేశ్ బహ్రైన్లో గతేడాది నవంబర్ 23 మరణించారు. ప్రభుత్వం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద వచ్చే సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు ఈ స్కీం కింద వచ్చే సొమ్మును మంజూరు చేసి నన్ను ఆర్థికంగా ఆదుకోవాలి. – లావణ్య, సారంగాపూర్ -
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవినిర్మల్ రూరల్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో డేస్స్కాలర్స్ విద్యార్థులను కూడా చేర్చాలని ప్రకటించడాన్ని ఖండించారు. ఇలా చేస్తే గ్రామాల్లో ఉన్న పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలను సెమీ గురుకులాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. బడుల్లో పర్యవేక్షణ భౌతిక వసతులు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కా ర్డులపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులు, సీపీఎస్ తదితర అంశాలపై ప్రభుత్వం స్టాండ్ తెలుపాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, నాగయ్య, రాజేశ్వర్, గోవర్ధన్రావు, గంగాధర్, షేక్ ఫాజిల్, శ్రీని వాస్, వీరేశ్, లక్ష్మణ్, రాథోడ్ గణపతి పాల్గొన్నారు. -
చెరువులు ఎడారి
తలాపు గోదావరి.. లోకేశ్వరం : గోదావరి నది సమీపంలో ప్రవహిస్తున్నా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక గ్రామాల చెరువులు నీటి చుక్క కోసం అలమటిస్తున్నాయి. ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నిండుగా ఉండి, నీరు దిగువకు ప్రవహిస్తున్నా, సమీప గ్రామాల చెరువులు ఎడారులను తలపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నీటి కొరత తప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుప్త పథకం విజయం... నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని చెరువులను నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం హయాంలో గుప్త ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం వల్ల నందిపేట్ చెరువులు నిండుగా ఉండి, జలకళను సంతరించుకున్నాయి. అయితే, ఇదే గోదావరి నీరు సమీపంలోని నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని చెరువులకు, కుంటలకు అందడం లేదు. ఈ ప్రాంతంలోని చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని ముథోల్ నియోజకవర్గంలో కూడా నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఎస్సారెస్పీ సమీపంలోనే నీటి కష్టాలు ఎస్సారెస్పీ సమీపంలో ఉన్న కుంటాల, లోకేశ్వ రం, బాసర, ముథోల్ మండలాల గ్రామాల్లో నీ టి సమస్య తీవ్రంగా ఉంది. గోదావరి నీరు ప క్కనే ప్రవహిస్తున్నా, ఈ గ్రామాల చెరువులకు నీరు చేరే మార్గాలు లేవు. దీంతో చెరువులు బో సిపోయి, ఎడారులను తలపిస్తున్నాయి. గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతంలో నిర్మిస్తామని గతంలో ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. రైతుల ఆకాంక్ష... ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ మండలాలపై దృష్టి సారించి, గుప్త వంటి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పైపుల ద్వారా గోదావరి నీటిని చెరువులకు చేర్చడం ద్వారా నీటి కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, ముథోల్ నియోజకవర్గం గ్రామాల చెరువులను జలకళతో నింపాలని రైతులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం ముధోల్ నియోజకవర్గంలో చెరువులు నింపేందుకు గోదావరి నది ఒడ్డున లిఫ్ట్ నిర్మించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతుల డిమాండ్ను కూడా నివేదిస్తాం. నిధులు మంజూరు నిర్మాణం పనులను చేపడుతాం. చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందిస్తాం. – అనిల్, ఇరిగేషన్ డీఈ లిఫ్ట్లు నిర్మించాలి.. గోదావరిలో పుష్కలంగా నీరున్నా మా మండలంలోని చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. లిఫ్ట్ల ద్వారా చెరువులకు గోదావరి జలాలను మళ్లించాలి. మండలంలోని చెరువులు కుంటలు నింపితే ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి. – గీజా భూమన్న, ధర్మోర చుక్క నీరు చేరలే లోకేశ్వరం చుట్టు పక్కల కుంటలు, చెరువులు కలిపి దాదాపు పది ఉంటాయి. చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. చెరువులు నిండితే ఆయకట్టు కింద పంటలు పండుతాయి. లోకేశ్వరం మండలంలోని చెరువులకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలిస్తే సమస్య అధిగమించ వచ్చు. – ఎల్లయ్య, వట్టోలి. ఎత్తిపోతల పథకం కోసం ఎదురుచూపులు గోదావరి జలాలతో చెరువులు నింపాలని డిమాండ్ -
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్చైన్గేట్: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కలెక్టరేట్ ఎదుట ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కొత్త పెన్షన్ విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తుందని పెన్షనర్ల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంసీ.లింగన్న ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో చేర్చి ఆకస్మాత్తుగా ఈ ఏడాది మార్చి 25న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. కొత్త పద్ధతి పెన్షన్ విధానాన్ని అడ్డుకోవాలని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించిందన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రికి లేఖలు పంపేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వేల సంఖ్యలో పెన్షనర్ల సంతకాలు సేకరించి వాటిని ప్రధానమంత్రికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్కు అందించారు. కార్యక్రమంలో పెన్షనర్లు విలాస్, లోలం గంగన్న, జనార్దన్, సత్మారాం, రాములు వివిధ మండలాల నుంచి వచ్చిన పెన్షనర్లు పాల్గొన్నారు. -
బతికుండగానే చంపేశారు..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు చవాన్ సోమల. కుబీర్ మండలం కసర గ్రామానికి చెందిన సోమల ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పింఛన్ తీసుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే పెన్షన్ విధానం తెచ్చింది. దీంతో సోమల పెన్షన్ కట్చేసి.. ఆయన భార్య తిత్రీబాయికి వితంతు పెన్షన్ రూ.2 వేలు మంజూరు చేసింది. ఈ సమయంలో సోమల బతికి ఉండగానే చనిపోయినట్లు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం తిత్రీబాయి మరణించింది. తనకు వృద్ధాప్య పెన్షన్ తనకు ఇవ్వాలని సోమల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు తాను చనిపోయాడని తిరస్కరించారని, తాను బతికుండగానే చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన గోడును కలెక్టర్కు చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చాడు. తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని అదనపు కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
సామాన్యులకు అండగా పోలీసులు
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం నిర్మల్టౌన్: డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ జాగ్రత్త మాదకద్రవ్యాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి‘ డ్రగ్స్ నో చెప్పండి’ అనే పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ‘ఐ యామ్ యాంటీ డ్రగ్ షోల్జర్‘ అనే సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగి ‘సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్’ అనే పోస్టర్పై సంతకాలు చేశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో నంబర్ 8712671111కు లేదా డయల్ 100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య , ఆర్ఐ రామ్ నిరంజన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బడిబాట @ 2,632
నిర్మల్అడవిలో యాంటీ పోచింగ్ షెడ్లు అడవిలో వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న యాంటీ పోచింగ్ సిబ్బందికి అటవీ శాఖ అధికారులు షెడ్లు నిర్మిస్తున్నారు. వారికి నివాస సౌకర్యం కల్పిస్తున్నారు.● జిల్లాలో ముగిసిన కార్యక్రమం ● ఆశించిన స్థాయిలో ప్రవేశాలు ● ‘ప్రైవేట్’ నుంచి 464 మంది.. సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 20258లోu గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యే భైంసాటౌన్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిశారు. రాజ్భవన్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. బాసర ఆలయ అభివృద్ధి, పుష్కరాలకు ఏర్పాట్లు, బాసర నుంచి మాహో ర్ వరకు జాతీయ రహదారి పొడిగింపు తదిత ర అంశాలను వివరించారు. ఆయన వెంట సి ర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీజే పీ లోకేశ్వరం మండలాధ్యక్షుడు సాయన్న, నాయకుడు గంగారెడ్డి తదితరులున్నారు. నిర్మల్ రూరల్: రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట ముగిసింది. జిల్లాలో ఈ నెల 6న ప్రారంభమై 19వరకు కొనసాగింది. ప్రతీరోజు రాష్ట్ర విద్యాశాఖ అందించిన ప్ర ణాళిక ప్రకారం పండుగలా నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో, అధికారులు, మేధావులు, యువ త ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో కంటే భి న్నంగా ఈసారి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్ర భుత్వ బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బడుల్లో వసతులు, ఏఐ బోధనతో తల్లి దండ్రులకు సర్కార్ బడులపై నమ్మకం పెరుగుతోంది. బడిబాట గడువు ముగిసినా.. ఈ నెలాఖరు వరకు మరిన్ని ప్రవేశాలు రాబట్టేందుకు జిల్లా వి ద్యాశాఖ అధికారులు, టీచర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు పేద విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోంది. ప్రతీ విద్యార్థికి ఏ టా రెండు జతల యూనిఫాంలు, పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తున్నారు. సన్నబియ్యంతో వండిన రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దూరప్రాంతాల విద్యార్థులకు రవాణా భత్యం చె ల్లిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి పూర్తి చేసినవారికి ట్రిపుట్ఐటీలో ప్రవేశాల సమయంలో అదనంగా గ్రేస్ మార్కులు కలుపుతున్నారు. సర్కా రు బడుల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపడానికి ఇవి కారణమవుతున్నాయి. బడిబాట కార్యక్రమం నిర్వహించి సర్కారు బడుల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి, బడీడు పిల్లల వివరాలు సే కరించారు. తల్లిదండ్రులను చైతన్య పరుస్తూ.. కరపత్రాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టర్లు అంటించారు. ప్రవేశం పొందిన విద్యార్థుల కు పుస్తకాలు, రాత పుస్తకాలు అందించారు. విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, యువ త, ఎస్హెచ్జీ సభ్యులు, ప్రజలను భాగస్వాముల ను చేసి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపట్టారు. అందరి ప్రో త్సాహంతో ప్రవేశాల సంఖ్య పెరిగింది. న్యూస్రీల్జిల్లాకు సంబంధించిన వివరాలుసోన్ మండలం మాదాపూర్లో బడిబాటలో పిల్లలతో ఉపాధ్యాయులు (ఫైల్) జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు : 896బడిబాటలో ప్రవేశాలు : 2,632మొత్తం ప్రవేశాల సంఖ్య : 4,125అంగన్వాడీల్లో ప్రవేశాలు : 1,493సమష్టి కృషితోనే.. ఉపాధ్యాయులు, అధికారులు, యువత, వీడీసీ సభ్యుల సమష్టి కృషితోనే జిల్లాలో బడిబాట విజయవంతమైంది. నెలాఖరు వరకు మరిన్ని ప్రవేశాలు వచ్చే అవకాశముంది. సర్కారు బడుల్లోని సౌకర్యాలు, ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశాం. తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై పెట్టుకున్న విశ్వాసం నిలుపుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. – రామారావు, డీఈవో -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధనే లక్ష్యం
ఖానాపూర్: ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరా బా ద్ మండలాలకు చెందిన ప్రజలందరి సమష్టి సహకారంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సా ధనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ కన్వీనర్ నంది రామయ్య, సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ వి శ్రాంతిభవనం ఆవరణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు సమాచార హక్కు చ ట్టం ద్వారా వివరాలు తెలుపుతూనే మరో వైపు తక్కువగా భూమి ఉందంటూ ప్రజలను తప్పుదో వ పట్టించడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే స్థలాభావం ఉందని తెలిస్తే భూమి కొనుగోలు చేసైనా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నాయకులు సాగి లక్ష్మణ్రావు, ఆకుల శ్రీనివాస్, బీసీ రాజన్న, కొండాడి గంగారావు, కొ క్కుల ప్రదీప్, గౌరీకార్ రాజు, ఎనగందుల నారా యణ, రాపెల్లి రవీందర్, ఉపేందర్, మహేందర్, సంతోష్, మనోజ్, శ్రావణ్ తదితరులున్నారు. -
ట్రిపుల్ఐటీకి 20,258 దరఖాస్తులు
భైంసా: 2025–26 విద్యాసంవత్సరానికి బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,258 దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతి లో ఉత్తీర్ణులైనవారి నుంచి ఈ నెల 21వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. కళాశాల లో 1,500 సీట్లుండగా ఒక్కో సీటుకు 14 మందికిపైగా పోటీపడుతున్నారు. క్రమంగా తగ్గుతున్న పోటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి క్రమంగా విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం 32వేల మంది, 2021–22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635, 2024–25లో 15వేలు, 2025–26 విద్యాసంవత్సరంలో 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 7నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. విద్యావిధానం ఇలా.. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ బోధిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు వివిధ బ్రాంచ్లలో సీట్లు కేటాయిస్తారు. బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్టాన్రిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు బోధిస్తారు. క్యాంపస్లో వసతులు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్ లు, యూనిఫాంలు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తా రు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు తరగతులు నిర్వహిస్తారు. క్యాంపస్లోనే ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బాసర ట్రిపుల్ఐటీ జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన -
నిత్యావసరాలు అందజేత
ఖానాపూర్: పట్టణంలోని వాసవీమాత ఆలయంలో వాసవీ, వనితా క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం ఓ ది వ్యాంగునికి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, నిత్యావసరాలు అందజేశారు. ఇద్దరు రైతులను సన్మానించి విత్తనాల ప్యాకెట్లు పంపిణీ చేశా రు. చెప్పులు కుట్టే పలువురికి గొడుగులు ఇచ్చారు. క్లబ్ల ఆధ్వర్యంలో డాన్ టూ డస్క్ కార్యక్రమాలు చేపడతామని క్లబ్ గోల్డెన్ స్టార్ అంచూరి శ్రీనివాస్, గవర్నర్ గట్టు రాణి తెలిపారు. మనోజ్, రాజేంద్రప్రసాద్, పవన్, జితేందర్, పద్మజ, రవీందర్, సతీశ్, సుధాకర్, స్వరూప, శ్రీలత, రమ ఉన్నారు. -
మినీ గురుకులాలుగా ఉన్నతీకరించాలి
నిర్మల్ రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలను మినీ గురుకులాలుగా ఉన్నతీకరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీజీహెచ్ఎంల ప్రమోషన్లను వెంటనే జరిపించాలని, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రమోషన్లతో భర్తీ చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం ప్రా రంభమైన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, నాగయ్య, నాయకులు పరమేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
రిక్త ‘హస్త’మేనా?
● జిల్లా ఆస్పత్రుల్లో భోజనాలకు టెండర్లు ● కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తారా? ● మహిళా సమాఖ్యలకు మొండిచేయేనా? ● వైద్యాధికారుల తీరుపై అనుమానాలు ● నోటిఫికేషన్ నిబంధనలపై సందేహాలు ● టీవీవీపీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరునిబంధనల ప్రకారమే.. జిల్లా ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర అధికారులు పేర్కొన్న నిబంధనల ప్రకారమే నిర్వహిస్తాం. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేకుండా పూర్తిచేస్తాం. – డాక్టర్ సురేశ్కుమార్, డీసీహెచ్ఎస్ నిర్మల్: రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు.. అధికారులు వాటిని జిల్లాలో అమలు చేస్తున్న తీరుకు పొంతన లేదు. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణ ఉత్తర్వులే ఉదాహరణ. సర్కారు దవాఖానాల్లో పేషెంట్లు, డ్యూటీ వైద్యులకు అందించే భోజనానికి సంబంధించిన టెండర్లను మహిళా సంఘాలకు అప్పగించాలని ఇటీవల తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. జిల్లాలో టెండర్ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని చిన్నగా పేర్కొన్నారన్న ఆరోపణలున్నాయి. ఈనెల 24తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. మహిళా సంఘాలకే ఇవ్వాలని.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవిధాన పరిషత్కు చెందిన ఆస్పత్రుల్లో పేషెంట్లకు అందిస్తున్న భోజనం (డైట్)పై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో డైట్ తీరును పరిశీలించారు. చాలాచోట్ల అధ్వానంగా ఉండటంతో ప్రభుత్వానికి అసంతృప్తి నివేదిక అందించినట్లు తెలిసింది. ఈ విషయంపై గతనెల 24న రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులు నిర్వహించిన సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఇదే సమావేశంలో గడువు ముగిసిన ఆస్పత్రుల్లో లోకల్/జిల్లా మహిళా సమాఖ్యలకు డైట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇదే విషయంపై మే 27న టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మహిళా సమాఖ్యలకే డైట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. సమాఖ్యలకు దక్కేనా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ప్రోత్సహిస్తోంది. స్వ యంసహాయక సంఘాలను కోటీశ్వరులను చేస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే వారికి అందుబాటులో ఉండే ప్రతీ పని వారికే దక్కేలా చూ స్తోంది. ఈక్రమంలోనే జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికశాతం ఐకేపీకే అప్పగించా రు. అలాగే కలెక్టరేట్తో పాటు మెడికల్ కాలేజీ వివి ధ చోట్ల క్యాంటిన్ల నిర్వహణ మహిళా సమాఖ్యలకే టెండర్ లేకుండానే ఇచ్చారు. తాజాగా టీవీవీపీ ఆస్పత్రుల్లోనూ డైట్ నిర్వహణ వారికే అప్పగించాలని పేర్కొన్నారు. కానీ.. జిల్లాలో ఇచ్చిన నోటిఫికేషన్ తీరుతో మహిళా సంఘాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం నేరుగా మహిళా సంఘాలకే ఇవ్వాలని చెబుతుంటే.. ఇక్కడ టెండర్లో అర్హత ప్రకారం అని చెప్పడంపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ డైట్ నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు దక్కుతుందా..? లేక పాత కాంట్రాక్టులకే చిక్కుతుందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. టెండర్లో మాత్రం ఇలా.. జిల్లాలో టీవీవీపీ ఆధ్వర్యంలో భైంసా ఏరియా ఆస్పత్రి, నర్సాపూర్, ముధోల్, ఖానాపూర్ ఆస్పత్రులున్నాయి. ఇందులో ప్రస్తుతం భైంసా, ముధోల్, నర్సాపూర్ ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణకు సంబంధించి ఇచ్చిన టెండర్లో కొంత గందరగోళం నెలకొంది. అందులో పేర్కొన్న తీరే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా సంఘాలకు ప్రాధాన్యత నివ్వాలని సూచిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అధికారులూ ఆస్పత్రుల్లో డైట్ బాధ్యతలు మహిళా సమాఖ్యలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో సూచించారు. కానీ.. జిల్లాలో ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్లో నేరుగా మహిళా సంఘాలు టెండర్ దరఖాస్తులు వేయాలని చెప్పకుండా, ముందుగా ఆసక్తిగల ‘సంస్థలు’ కార్యాలయ వేళల్లో సంప్రదించాలని సూచించడం గమనార్హం. నోటిఫికేషన్ చివరలో ‘అర్హత కలిగిన’ స్థానిక/ జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మహిళా సమాఖ్యలకు ఇవ్వడమే మొదటిసారి. అలాంటిది వారికి ఎలాంటి అర్హతలు, అనుభవం చూస్తారని మహిళా సమాఖ్యల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అకాడెమీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా నుంచి బాలుర విభాగంలో కౌశిక్రెడ్డి (–42), వేద్ (35), వినయ్ (40–), శ్రీనివాస్ (–45), బా లికల విభాగంలో అక్షయ (45), గీతాంజలి (42), కే దివ్య (–40), సుజల (55), నక్షత్ర (80), గంగా లక్ష్మి (44) ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో సహస్ర బాక్సింగ్ అకాడెమీ కోచ్ చందుల స్వామి, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్, చిరంజీవి, విజయ్, మనీషా, శ్రీజ పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
● ఫేస్ రికగ్నేషన్ ఆధారంగా పౌష్టికాహారం ● ప్రస్తుతం 3 ఏళ్లలోపు చిన్నారులకు.. ● జూలై నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా.. ● పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు లక్ష్మణచాంద: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అ య్యే గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు, ఇతర పోషకా హార పదార్థాలు పక్కదారి పడుతున్నాయనే అపవా దు ప్రజల్లో ఉంది. ఈ సమస్యను అధిగమించి, చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన స రుకులు పారదర్శకంగా, సక్రమంగా చేరేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భా గంగా, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ సమయంలో ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా ఐసీడీఎస్ అధికారులు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అందరికీ.. అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 3 నుంచి అందరికీ ఫేస్ రికగ్నేషన్ ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఇదివరకు అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న పోషణ్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి అమలులోకి రానుంది. నూతన విధానంతో ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్లో ఫొటోతోసహ నమోదు కానుండటంతో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉండదని అధికారులు అంటున్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహారం ఎలా అందుతుందో అనే వాటిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సులువు కానుంది. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు... అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందించే అన్ని రకాల సరుకులు, పోషకాహారం పంపిణీ చేసే సమయంలో ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి చేయడంతో చిన్నారుల తల్లులు, ఇటు బాలింతలు, గర్భిణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన అన్ని సరుకులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా చేరుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చిన్నారులకు.. ప్రస్తుతం ఈ ఫేస్ రికగ్నేషన్ విధానం 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్లు వంటి అదనపు పోషకాహార పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, చిన్నారి తల్లి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫొటో తీసుకుని, పోషణ్ ట్రాకర్ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతే సరుకులు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం సాధ్యమవుతోందని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. జిల్లా సమాచారం.... జిల్లాలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 926 నిర్మల్ డివిజన్లో 299 ఖానాపూర్ డివిజన్లో 246 భైంసా డివిజన్లో 201 ముధోల్ డివిజన్లో 180 మూడేళ్లలోపు చిన్నారులు 61,061 గర్భిణులు 5,916 బాలింతలు 6,012ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు అందించే సమయంలో ఫేస్ రికగ్నేషన్ ద్వారా నమోదు చేస్తున్నాం. జూలై 1 నుంచి బాలింతలు, గర్భిణులకు కూడా ఫేస్ రికగ్నేషన్ తర్వాతనే పోషకాహారం అందిస్తాం. ప్రభుత్వం సూచనల మేరకు అమలు చేస్తాం. – నాగమణి, సీడీపీవో నిర్మల్ -
యోగా జీవితంలో భాగం కావాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ దివ్య గార్డెన్ లో యోగా చేస్తున్న ఉద్యోగులు నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రజలంతా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవా లని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివా రం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జూమ్ ద్వారా మాట్లాడారు. ప్రతీరోజు కనీసం 45 నిమిషాలు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా సాధనతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశుమందిర్ విద్యార్థి రామ్కుమార్ మ్యాన్ కోడ్ ప్రక్రియ ద్వారా కళ్లకు గంతలు కట్టుకుని వస్తువులను గుర్తించిన విధానం విశేషంగా ప్రశంసలు అందుకుంది. రామ్ కుమార్ను అదనపు కలెక్టర్ సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, డీఈవో రామారావు, డీఎస్వో కిరణ్కుమార్, డీఎంహెచ్వో రాజేందర్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఆయుష్ అధికారులు నారాయణరావు, సంధ్యారాణి, వెంకటేశ్వర్లు, శ్రవణ్కుమార్, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. వృత్తిలో ఒత్తిడి దూరం.. నిర్మల్టౌన్: యోగా సాధనతో వృత్తిలో ఒత్తిడి తగ్గుతుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో యోగా దినోత్సవం నిర్వహించారు. 150 మంది సిబ్బందితో ఎస్పీ యోగా సాధన చేశారు. యోగా శిక్షకుడు, హెడ్ కానిస్టేబుల్ బాలాజీ పోలీస్ అధికారులకు, సిబ్బందితో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా, నడక వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐలు రామ్ నిరంజన్, రమేశ్, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు ఆధ్వర్యంలో...ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. యోగాతో మానసిక శరీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో కోర్టు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఆసనాలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంత అంతర్యం ఉందో.. అందులో యోగాకు ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
● గాంధీనగర్కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి ● నదిని నమ్ముకుని 350 కుటుంబాలు ● మత్స్యకారుల ఊరి కథ
గోదావరి నది తల్లి.. తనను నమ్మిన వారిని ఒడిలో చేర్చుకుని, వారికి ఆసరాగా నిలిచి, జీవనోపాధి అందిస్తూ కాపాడుతుంది. లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ సస్యశ్యామలం చేస్తున్న ఈ నది సోన్ మండలం గాంధీనగర్ గ్రామంలోని 350 కుటుంబాలకు జీవనాధారమైంది. చేపల వేటను ప్రధాన వృత్తిగా భావిస్తూ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో జీవనం సాగిస్తున్న ఈ మత్స్యకారుల జీవనంపై సండే స్పెషల్ స్టోరీ. – లక్ష్మణచాంద/సోన్నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, వారు తిరిగి వెళ్లకుండా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న గాంధీనగర్ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుటుంబాలే నేడు గాంధీనగర్ గ్రామ మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్నాయి. ఊరంతా చేపల వేటే.. గాంధీనగర్ గ్రామంలో మొత్తం 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఎవరికీ వ్యవసాయ భూములు లేవు. దీంతో, గ్రామంలోని అన్ని కుటుంబాలు చేపల వేటను ప్రధాన వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రతీరోజు ఉదయం 5 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తెప్పలపై చేపల వేటకు వెళ్లి, ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య తిరిగి వచ్చి, పట్టిన చేపలను గ్రామంలోని ఒక వ్యక్తికి అమ్ముతారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఈ విధంగా గ్రామస్తులంతా కలిసి రోజుకు సుమారు ఒక టన్ను చేపలు పట్టి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వారానికి ఒకసారి చెల్లింపులు గాంధీనగర్ మత్స్యకారులు తాము పట్టిన చేపలను కొనుగోలు చేసన వ్యక్తి వారం రోజుల తర్వాత, ఎవరు ఎన్ని కిలోల చేపలు అమ్మారో లెక్కించి డబ్బులు చెల్లిస్తారు. చేపల రకం, మార్కెట్ పరిస్థితులను బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.80 వరకు ధర లభిస్తుందని గ్రామస్తులు తెలిపారు. రోజుకు ఒకరికి సగటున 5 నుంచి 10 కిలోల చేపలు దొరుకుతాయని వారు చెబుతున్నారు. ఎండు చేపలతో అదనపు ఆదాయం ప్రస్తుతం, రోజూ పట్టిన చేపలను వెంటనే అమ్ముతున్నారు. అయితే, జనవరి నెలలో చేపలు ఎక్కువగా లభిస్తాయి. అప్పుడు కొన్ని చేపలు అమ్మి.. మిగిలిన చేపలను కోసి, ఆరబెట్టి అరుగుగా తయారు చేస్తారు. ఈ ఆరబెట్టిన చేపలను ఇంటి ముందు లేదా డాబాలపై ఆరబెడతారు. గ్రామంలో ఎటు చూసినా ఆరబెట్టిన చేపల తోరణాలే కనిపిస్తాయి. ఇది గాంధీనగర్ గ్రామానికి ప్రత్యేకతను తెలియజేస్తుంది. సహకార జీవనం.. గాంధీనగర్ గ్రామ మత్స్యకారుల జీవనం గోదావరి తల్లి ఒడిలో, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధారంగా సాగుతోంది. చేపల వేటను వృత్తిగా ఎంచుకుని, 350 కుటుంబాలు ఐకమత్యంతో జీవనోపాధిని పొదుతున్నాయి. ఈ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ, సహకార జీవనం, స్వావలంబన శక్తిని చాటుతోంది.రోజుకు 8 కేజీలు నేను రోజూ ఉదయం 6 గంటలకు చేపలు పట్టడానికి గోదావరికి వెళ్తాను.8 గంటల వరకు చేపలు పడతా. రెండు గంటల సమయంలో 8 కేజీల చేపలు పట్టుకుని తిరిగి ఇంటికి వచ్చి గ్రామంలోనే అమ్మేస్తా. కేజీ చేపలు రకంను బట్టి రూ.70 నుంచి రూ.80 వరకు ఇస్తారు. ఇలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. – బాలాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్ గోదారమ్మను నమ్ముకున్నాం.. చేపల వేట చాలా కష్టమైన పని. కానీ మాకు ఈ పని తప్ప వేరే పని లేదు.. రాదు. మాకు ఎటువంటి వ్యవసాయ భూములు లేవు. చేపల వేటనే జీవనోపాధిగా మల్చుకున్నాం. గోదారమ్మను నమ్ముకున్నాం. కుటుంబ పోషణ కోసం కష్టమైనా చేపల వేట తప్పడం లేదు. ఆదాయ తక్కువే అయినా చేపలవేటతో ఉపాధి పొందుతున్నాం. – సత్వాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్ -
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
● జిల్లా జడ్జి శ్రీవాణి భైంసాటౌన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబి రం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక, బైంసా కోర్టు జడ్జి డి.దేవేంద్రబాబుతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అ నంతరం శ్రీవాణి మాట్లాడుతూ.. వివిధ రంగా ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజలు తరచూ ఆ రోగ్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఇతర వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, పట్టణ వైద్యులు, న్యాయవాదులు, కోర్టు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ.గౌతమ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రెండోదశ ఇళ్లకు సంబంధించిన మార్కింగ్, గ్రౌండింగ్ పనులు నిత్యం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన స్థలాల్లో నిర్మాణం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) లబ్ధిదారుల ఓటీపీ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం వార్డుస్థాయి అధికారులకు నియోజకవర్గాలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, గృహనిర్మాణ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పగలు.. 13 గంటలు!
● శనివారం జిల్లాలో సుదీర్ఘ పగలు.. ● ‘వేసవి ఆయానంతం’గా పేర్కొంటారన్న నిపుణులునిర్మల్ లో శనివారం సాయంత్రం 6:50 గంటలకు సూర్యుని వెలుతురు సుదీర్ఘ పగలుకు కారణం ఇదే.. సాధారణంగా భూమి 23.5 డిగ్రీల వంపు తిరిగి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలోనే వేసవి ఆయనాంతం ఏర్పడుతుంది. సాధారణంగా జూన్ 21 రోజునే భూమి ఉత్తరార్థ గోళం సూర్యుడికి సమీపంగా రావడం వల్ల సూర్యుని కాంతి భూమిపై మరింత ఎక్కువ కాలం కేంద్రీకృతం అవుతుంది. దీంతో పగలు ఎక్కువగా ఉంటుంది. నిర్మల్ఖిల్లా: జిల్లాలో జూన్ 21న శనివారం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా రోజుకు 24 గంటలు ఉంటాయని తెలుసు. అందులో 12 గంటల సమయం పగలు, ఉంటే మరో 12 గంటలు రాత్రి. సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకారం పగలు రాత్రి వ్యవధుల్లో చాలా సందర్భాల్లో కాస్త తేడా ఉండటం సహజమే. అయితే శనివారం రోజున మాత్రం జిల్లాలో పగటి సమయం గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6:40 దాటిన సూర్యుడు అస్తమించలేదు. పగలు సుదీర్ఘంగా ఉండటం అనే దృగ్విషయాన్ని ‘వేసవి ఆయనాంతం’గా వ్యవహరిస్తారని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన భౌతికశాస్త్ర నిపుణులు రాఘవేంద్రవర్మ తెలిపారు. జిల్లాలో శనివారం ఉదయం 5:24 గంటలకు సూర్యోదయం కాగా, సూర్యాస్తమయం 7:09 గంటలకు జరిగింది. అంటే దాదాపు 13 గంటలకు పైగా పగలు ఉంది. ఇది ఖగోళశాస్త్రంలో ప్రత్యేకమైన రోజుగా వ్యవహరిస్తారని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా భిన్నత్వాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి
● డీపీవో శ్రీనివాస్ నర్సాపూర్(జి): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ ఆదేశించారు. మండలంలోని నర్సాపూర్(జి), కుస్లి గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులు, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రాలు, నర్సరీలను శనివారం పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని సూచించారు. వన మహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. డీపీవో వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాథోడ్ కై లాస్, కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ కన్వీనర్గా రామయ్య
ఖానాపూర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ కన్వీనర్గా నంది రామయ్యను అఖిలపక్ష నాయకులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని అర్అండ్బీ విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సాగి లక్ష్మణ్రావు, కోకన్వీనర్లుగా ఆకుల శ్రీనివాస్, బీసీ రాజన్న, కొండాడి గంగారావు, ప్రధాన కార్యదర్శిగా కాశవేణి ప్రణయ్, కోశాధికారిగా ఎనగందుల నారాయణ, ముఖ్య సలహాదారులుగా కొక్కుల ప్రదీప్, పడాల రాజశేఖర్, గౌరికార్ రాజు, శనిగారపు శ్రావణ్, పుప్పాల ఉపేందర్ ఎన్నికయ్యారు. అదనపు కలెక్టర్కు వినతి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ను జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే పలుశాఖలకు కేటాయించిన స్థలాల్లో ఆయా శాఖల కార్యాలయాలు మంజూరుకాలేదని గుర్తు చేశారు. ఆ స్థలాలను రద్దు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించాలని విన్నవించారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఆందోళన
ఖానాపూర్: అత్యంత వెనుకబడిన ఖానాపూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆకుల శ్రీనివాస్, నంది రామయ్య, లక్ష్మన్రావు, కొండాడి గంగారావు, గౌరీకార్ రాజు, కీర్తి మనోజ్ అన్నారు. ఈమేరు తహసీల్దార్ సుజాతను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని తిమ్మాపూర్ శివారులో ప్రభుత్వం మిగులు భూమి పోను 30 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అధికారులు సర్వే చేపట్టి మిగులు భూమి వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ వచ్చేవరకు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముఖానికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో కొక్కుల ప్రదీప్, రవీందర్, ప్రణయ్, ఉపేందర్, రమేశ్, ప్రణీత్, సతీశ్, నారాయణ, నసీర్, వెంకటేశ్, శ్రావణ్, వెంకటేశ్వర్రావు, మురళి, అజయ్, రవి, భీమన్న, సాయి తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ భారం కాదు.. భద్రత!
● చిన్నపారి నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ● నిబంధనలు పట్టించుకోని వాహనదారులు ● రాష్ డ్రైవింగ్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత నిర్మల్టౌన్: ఉరుకులు, పరుగుల జీవన గమనంలో వేగం కోసం పరుగెత్తే ప్రయత్నంలో భద్రతను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది భారీ మూల్యం చెల్లిస్తున్నారు. చిన్నపాటి అజాగ్రత్తతో నిండు ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, గాయాలయ్యే సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తప్పించవచ్చని రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే గమ్యానికి త్వరగా చేరాలనే ఆతృతలో హెల్మెట్ ధరించడాన్ని వాహనదారులు విస్మరిస్తున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 85 శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి. నామమాత్రపు తనిఖీలు.. పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెల్మెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. చట్టం ఇలా.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129, 177 ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది. పదేపదే హెల్మెట్ లేకుండా జరిమానా పడిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. రవాణా శాఖ హెచ్చరిక రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్ను నిరాకరిస్తున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధ రించకపోవడం వల్ల తమకు, తమ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతీ వాహనదారుడు ని యమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నాణ్యమైన హెల్మెట్తో భద్రత.. నాసిరకం హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించలేం. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రాప్ గడ్డం కింద సౌకర్యవంతంగా ఉండేలా, తలకు సరిగ్గా సరిపోయేలా ఎంపిక చేసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐఎస్ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లను ధరించాలని రవాణా శాఖ సూచిస్తోంది. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో తలకు గాయాల తీవ్రత 98 శాతం వరకు తగ్గుతుంది. అదనంగా, దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. హెల్మెట్ తప్పనిసరి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహన చట్టం కింద జరిమానా విధించడంతోపాటు, వాహనం సీజ్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడగలుగుతాం. – దుర్గాప్రసాద్, రవాణా శాఖ అధికారి తలకు గాయం.. ప్రాణాంతకం చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. టూ వీలర్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదాల సమయంలో 80 శాతం వరకు బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బీఎల్ఎన్.రెడ్డి, న్యూరో ఫిజీషియన్, నిర్మల్ -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమువుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్జీయూకేటీలో సైబర్ భద్రతపై అవగాహన బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటి)లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ భద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో సైబర్ భద్రతపై అవగాహన పెరిగిందన్నారు. కార్యక్రమంలో డిజిటల్ మోసాలు, సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే మోసాలు, సందేహాస్పద లింకులు, ఫోన్ కాల్ మోసాలు, ఫిషింగ్, గ్రిడ్ టెక్నిక్స్, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జోనల్ డైరెక్టర్ సత్యపాల్రెడ్డి, దీపక్ మల్హోత్రా మాట్లాడుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ 3ఇన్1 డిజిటల్ కార్డు గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, నాగరాజు, చీఫ్ వార్డెన్ శ్రీ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పుస్తక రచన అభినందనీయం భైంసాటౌన్: తెలంగాణ ఉద్యమంలో ముధోల్ నియోజకవర్గ పాత్రకు పుస్తకరూపమివ్వడం అభినందనీయమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనంలో శుక్రవారం పుస్తకం ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచనకు కృషిచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, రచయితలను అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి చాకేటి లస్మన్న, పుస్తక సంపాదకులు పుండలీక్రావు, నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందయోగం..
కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్ నిర్మల్ జిల్లాలో ఈనెల 15న సంచలనం సృష్టించిన కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ను బలోపేతం చేయాలి పార్టీకి కార్యకర్తలే బలమని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. 9లోu 8లోu యోగా.. రెండక్షరాల ఈ సాధనం నిండుజీవితాన్ని మార్చేస్తుంది. నిత్యసాధనతో ఎన్నో అద్భుతాలనూ చూపుతుంది. కొన్నిసార్లు మందులతో నయంకాని రోగాలనూ మాన్పుతుంది. విశ్వానికి మనదేశం అందించిన అద్భుత ఔషధం యోగా. విదేశీయులు సైతం మనదేశానికి వచ్చి యోగసాధన నేర్చుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. మనదైన ఈ యోగాభ్యాసాన్ని అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఏటా జూన్ 21న ‘ప్రపంచ యోగాదినోత్సవం’ నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోనూ చాలామంది యోగాకు కేరాఫ్గా మారారు. తాము సాధన చేస్తూ.. పదిమందితో సాధన చేయిస్తూ.. యోగానందం పొందుతున్నారు. – నిర్మల్జిల్లా కేంద్రానికి చెందిన ముధుల్కర్ అన్నపూర్ణది యోగా కుటుంబం. యోగాకు కేరాఫ్గా మారిన ఆమె తన కుటుంబ సభ్యులనూ యోగసాధనలో, శిక్షణలో భాగం చేశారు. భర్త చంద్రశేఖర్ ప్రోత్సాహంతో చిన్నప్పుడు నిజామాబాద్లో యోగాగురువు ప్రభాకర్ దగ్గర నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుతున్నారు. యోగాతోపాటు నేచర్క్యూర్నూ నేర్చుకున్న అన్నపూర్ణ ఆ రెండింటి సమ్మిళితంగా ఎన్నో వ్యాధులు, రోగాల నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు. అన్నపూర్ణతో పాటు కుమారులు సుమిత్, సాయికిరణ్, కోడళ్లు నవ్యశ్రీ, నమ్రత యోగా శిక్షకులుగా సేవలందిస్తున్నారు. నిత్యజీవితంలో ఓ భాగంగా.. యోగా అనేది నిత్యజీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. ప్రత్యేకంగా అని కాకుండా ప్రతిరోజూ సాధన చేయడం వల్ల జీవితాంతం మంచి ఫలితాలు ఉంటాయి. మా కుటుంబమంతా యోగా నేర్పించడంలో భాగం కావడం ఆనందంగా ఉంది. – అన్నపూర్ణ, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుయోగా కుటుంబం -
బాలాజీ.. యోగా గురూజీ
కుభీర్ మండల కేంద్రానికి చెందిన జంగిలి బాలాజీ 1996లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కానిస్టేబుల్గా చేసేవారు. ఒకరోజు ఆయన రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. పలుచోట్ల కాలు విరిగింది. తలలో రెండుచోట్ల రక్త గడ్డకట్టింది. మందులతో తగ్గకుంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ.. అప్పటికే తమ ఇచ్చోడ స్టేషన్ ఎస్సైగా చేసిన భీమన్న ప్రోద్బలంతో యోగా, ప్రాణాయామం నేర్చుకున్న బాలాజీ ఆపరేషన్కు ఒప్పుకోలేదు. నిత్యం.. యోగా, ప్రాణాయామంతోపాటు కపాలభాతి చేయడంతో ఏడాదిన్నర తర్వాత మళ్లీ తలకు చేయించిన స్కానింగ్లో రక్తం గడ్డకట్టిన(బ్లడ్క్లాట్) సమస్య కనిపించనే లేదు. అలా.. స్వయంగా తానే యోగసాధనతో కలిగిన ఫలితాన్ని అనుభవించిన బాలాజీ నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకున్నారు. దాదాపు 36 ఏళ్లుగా తాను యోగా చేయడం కాకుండా ఆసక్తితో వచ్చేవారికి నిత్యం ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ పోలీసు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్లోని వశిష్ట యోగాసంఘటన్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నిత్యసాధనతో సత్ఫలితాలు.. యోగాను ప్రతిఒక్కరూ చేయొచ్చు. దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా నిత్యం జిల్లాకేంద్రంలో ఉచితంగా యోగా నేర్పుతుండటం సంతృప్తినిస్తోంది. –జంగిలి బాలాజీ, క్లూస్టీమ్, నిర్మల్ -
నిర్మల్
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025మహిళా ప్రాంగణాన్ని సందర్శించిన ఆర్డీవో సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణాన్ని నిర్మల్ ఆర్డీఓ రత్నకళ్యాణి శుక్రవారం సందర్శించారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూవోకు సంబంధించి శిక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రాంగణంలో వసతి గదులు, భోజనశాలను పరిఽశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవో వెంట ప్రాంగణం అధికారి విజయలక్ష్మి ఉన్నారు. లక్ష్మణచాంద: ఆసనాలు వేస్తున్న బాలికలుతండ్రి చేస్తున్న యోగాసనాలను చూస్తూ పెరిగిన చైతన్య కేవలం ఐదేళ్లకే తానూ యోగా సాధన ప్రా రంభించింది. క్లిష్టమైన యోగాసననాలను సైతం సులువుగా వేస్తూ ఆకట్టుకుంది. తండ్రి ద్వారా నేర్చుకున్న విద్యలో పట్టు సాధించడమే కాకుండా పట్టా కూడా పొంది, పదిమందికి నేర్పిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వెంకటాద్రిపేట్కు చెందిన ద్యావరశెట్టి చైతన్య యోగా ఇన్స్ట్రక్టర్గా సేవలందిస్తున్నారు. నిజామాబాద్కు చెందిన చైతన్య తండ్రి ప్రభాకర్ యోగాచార్యులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రోత్సాహంతో యోగాలో స్వల్పకాలంలోనే కఠినమైన ఆసనాల్లోనూ పట్టుసాధించారు. నాసిక్లోని యశ్వంత్రావు చౌహాన్ యూనివర్సిటీ నుంచి డిప్లోమా ఇన్ యోగా పూర్తిచేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ పతకాలు సాధించారు. యోగాను మించింది లేదు.. నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న ప్రస్తుత సమాజంలో యోగాను మించిన ఔషధం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా తప్పనిసరి. తండ్రి వారసత్వంగా సమాజానికి యోగా అందించడం గర్వంగా ఉంది. – ద్యావరశెట్టి చైతన్యన్యూస్రీల్ఐదేళ్లప్రాయం నుంచే.. -
ఇబ్బందుల మధ్యనే..
లక్ష్మణచాంద: మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయగా ఇక్కడ ఒక తరగతి ఇండోర్ షటిల్ కోర్టులో నిర్వహిస్తుండగా, మూడు తరగతులు అసంపూర్తి భవనంలో నిర్వహిస్తున్నారు. ఉన్న గదులు శిథిలావస్థకు చేరి వర్షంకు ఉరుస్తాయని ఉన్నతాధికారుల ఆదేశాలే మేరకు అందులో తరగతులు నిర్వహించడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. పొట్టపెల్లి ప్రాథమిక పాఠశాల భవనం కూడా శిథాలావస్థకు చేరడంతో పై కప్పు రేకులకు రంద్రాలు పడ్డాయి. అసంపూర్తి భవనంలో తరగతులు -
అసంపూర్తి బడి
నిర్మల్ రూరల్ మండలం గంగా పూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో వరండాలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. గత విద్యా సంవత్సరం యూడైస్లో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా ఈసారి బడిబాటలో నలుగురు పెరిగి సంఖ్య పదికి చేరింది. ఒకే గదిలో అంగన్వాడీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు.నిర్మల్ రూరల్: సర్కారు బడుల్లో విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు చేపట్టినా ఇంకా పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు–మనబడి పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాక్షి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలను విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. – మండలంలోని రానాపూర్ ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా అందులో ఓ గదిని గ్రామపంచాయతీ కోసం, మరొక గది అంగన్వాడీ విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీ భవనం పెండింగ్లో ఉండడంతో పరిపాలన మొత్తం పాఠశాల నుంచే జరుగుతుంది. మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో పాఠశాల ఎదురుగా ఓ ఇంట్లో తయారుచేసి బడికి తీసుకువస్తున్నారు. డ్యాంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గురువారం సాక్షి విజిట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎవరూ లేరు. మధ్యాహ్న భోజన భోజనం తయారు చేసే ఓ మహిళ మాత్రమే ఉంది. అడిగితే సారు... కొత్త పుస్తకాలు తేడానికి చిట్యాల బడికి వెళ్లాడని సమాధానం ఇచ్చింది. ఇదే అదనుగా.. బడికి వచ్చిన విద్యార్థులంతా ఇంటికి వెళ్లిపోయారని పేర్కొంది. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాల లోనిది. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 244. ఇందులో 134 మంది బాలికలు ఉన్నారు. కానీ వీరందరికీ ఒకే ఒక టాయిలెట్ ఉండడంతో విద్యార్థినిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మూడేళ్ల క్రితం మన ఊరు– మనబడి లో కొత్త మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అవి కట్టే క్రమంలో ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు. ప్రస్తుతం పాడుబడ్డ ఓ టాయిలెట్ మాత్రమే ఉంది. -
పనులు నిలిపివేశారు....
సారంగపూర్: మండలంలోని జామ్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షలతో చేపట్టిన డైనింగ్ హాల్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.3 లక్షలు ఇంకా విడుదల కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేసే పరిస్థితి. జామ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో 50 లక్షలతో ఇటీవలే నూతన భవనం నిర్మించారు. పాతభవనం కూలడానికి సిద్ధంగా ఉంది. మంచినీళ్ల ట్యాంకు కోసం దానిని అలాగే ఉంచేశారు. అది కూలిపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. భైంసాటౌన్: పట్టణంలోని మదీనాకాలనీలోగల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, ఉర్దూ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. 265 వరకు విద్యార్థులు ఉన్నారు. పది తరగతి గదులు అవసరం. ఐదు గదులే అందుబాటులో ఉన్నాయి. మన ఊరు–మన బడి పనులు మధ్యలో నిలిచాయి. ఒకే గదిలో ఐదు తరగతులు.. కడెం: మండలంలోని ఉడుంపూర్ జీపీ పరిధి గండిగోపాల్పూర్ ప్రాథమిక పాఠశాలలో 23 మంది విద్యార్థ్దులు, ఇద్దరు టీచర్లున్నారు. ఐదు తరగతులు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. అదనపు గదులు అసంపూర్తిగా ఉన్నాయి. తరగతులు సరిపోక.. -
బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి
సోన్: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన కోట్ప చట్టాన్ని రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. ఈనెల 21, 22న నిజామాబాద్లో నిర్వహించే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సోన్ మండలం జాఫ్రాపూర్లో ఏర్పాటుచేసిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమతో ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో వీరికి ఉపాధి కరువవుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీవన భృతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి. ఎ.నవీన్, జమున, లక్ష్మి, విజయ, గంగమణి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
బాసరలో పోలీసుల మాక్ డ్రిల్ బాసర గోదావరి నదిలో ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. శివంగి, స్పెషల్ టీంలు సుమారు 2 గంటలు నదిలో మాక్ డ్రిల్ చేశారు. 10లోu శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025డిగ్రీలో ప్రవేశాలు సోన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, సోఫీ నగర్లో 2025 –26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్పీ(ఎంజెడ్సీ) ఎంఎస్సీఎస్, బీకాం, కంప్యూటర్, బీకాం జనరల్, బీఏ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి.కవిత తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు 9000599665, 9542556688 సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మద్యం, సిగరెట్లను దాటి యువత కొత్త మత్తుపదార్థాలకు బానిస అవుతోంది. గంజాయి ఒక్కటే సమస్య అనుకుంటే, ఇటీవల సరికొత్త మ త్తు రకాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెలలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్–రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల్లో వాడే మిడాజోలం ఇంజెక్షన్లను యువతకు అక్రమంగా అందజేస్తూ పట్టుబడ్డారు. ఈ మందు అతిమాత్రలో ప్రాణాంతకం. ఇక, ఖానాపూర్లో ‘బాటిల్షాట్’ అనే కొత్త పద్ధతిలో యువకులు గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని బాటిల్లో రంధ్రం చేసి, పెన్ను మూత ద్వారా పీలుస్తున్నారు. ఈ ప్ర మాదకర అలవాటు గురించి తెలియకనే యువ త దీనికి బానిస అవుతోంది. వైట్నర్, దగ్గుమందుల ను కూడా మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు, ఇది జిల్లా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోంది. అధికారుల చొరవ. ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ లక్ష్యంతో కలెక్టర్, ‘గాంజా గస్తీ’ కింద ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవగాహన కార్యక్రమాలు, పోలీసు దాడులు, కళాజాతలతో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి విక్రయాలు, మత్తు వాడకం తగ్గడం లేదు. జిల్లా కేంద్రం, శివారు ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతోంది. ప్రత్యేక వ్యూహం మత్తురహిత జిల్లా కోసం పోలీసు, అబ్కారీ శాఖలు, జిల్లా అధికారులు సమన్వయంతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామాల్లో అభివృద్ధి కమిటీల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. సమాచారం ఆధారంగా స్పందించే బదులు, మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలు అవసరం. యువతను ఈ ఉచ్చు నుంచి కాపాడేందుకు సమగ్ర విధానం తప్పనిసరి. ఇటీవల ఖానాపూర్ శివారు ప్రాంతాల్లో లభ్యమైన బోనోఫిక్స్ న్యూస్రీల్కొత్తకొత్త మత్తుల్లో... జిల్లా డ్రగ్ ఫ్రీ చేస్తామంటున్న అధికారులు కొత్త డ్రగ్స్ వినియోగిస్తున్న వ్యసనపరులు చర్యలు చేపడుతున్నా.. ఆగని గంజాయి‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ చేస్తామంటూ ఉన్నతాధికారులు చొరవ తీసుకున్నా.. జిల్లాలో మత్తుమందు వినియోగం ఏమాత్రం ఆగడం లేదు. పైపెచ్చు.. సరికొత్త మత్తులో యువత చిత్తవుతోంది. చాలాచోట్ల ఉదయం నుంచే గంజాయి మత్తులో జోగుతూ.. రోజంతా ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఓ యువకుడి మరణానికి కారణమైన మరో యువకుడు గంజాయి తాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ జిల్లాలో చాలామంది యువకులు ఇదేమత్తులో రోడ్డుప్రమాదాల బారిన పడి, తమ నిండుప్రాణాలను కోల్పోయారు. తమను కన్నతల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. – నిర్మల్మద్యం, సిగరెట్, గంజాయిని దాటేసి కొత్తకొత్త మత్తుల్లో యువత చిత్తవుతోంది. కొంతకాలంగా గంజాయి ఒక్కటే జిల్లాను కుదిపేస్తోందనుకుంటుంటే.. ఇటీవల సరికొత్త మత్తుపదార్థాల వాడకం వె లుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు ఇచ్చే మిడాజోలం అనే మత్తుమందు ఇంజెక్షన్లను యువతకు ఇస్తూ పట్టుబడ్డారు. ఈ మత్తు ఏమాత్రం ఎక్కువైనా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఖానాపూర్లో పలువురు యువకులు ‘బాటిల్షాట్’లకు అలవాటు పడటం కలవరం రేపుతోంది. ఒక బాటిల్లో గంజాయి, బోనోఫిక్స్ రెండు మిశ్రమంగా చేసి బాటిల్కి చిన్న రంధ్రం చేసి దానికి పెన్ను మూతను బిగించి గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని పీలుస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలియకుండానే పీల్చేస్తున్నారు. వైట్నర్, దగ్గుమందులనూ మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు. గంజాయితో పాటు ఇలా కొత్తకొత్త మత్తుల కోసం జిల్లా యువత పెడతోవలో పోతుండటం కలవరపెడుతోంది. -
డయేరియాపై యుద్ధం
● 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ● జిల్లాలో 73,715 మంది చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ మాత్రలు పక్కా ప్రణాళికతో.. జిల్లాలో గుర్తించిన 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందిస్తాం. 45 రోజులపాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ ఒక్కరూ డయేరియాతో మృతి చెందొద్దనే లక్ష్యంతో కృషిచేస్తున్నాం. – డాక్టర్ నైనారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్చైన్గేట్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ (ఐడీసీఎఫ్) కార్యక్రమం ఈనెల 16న ప్రారంభమై, వచ్చే నెల 31 వరకు 45 రోజులపాటు జరగనుంది. 5 ఏళ్ల చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నియంత్రణ లక్ష్యంగా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల ద్వారా పంపిణీ చేస్తారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో ప్రతీ చిన్నారికి ఈ సదుపా యం అందిస్తారు. వర్షాకాలంలో డయేరియా ప్రభా వం పెరగడంతో, ఓఆర్ఎస్ ద్రావణంతో శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ను పునరుద్ధరిస్తారు. చిన్నారుల గుర్తింపు జిల్లాలో 1,88,929 కుటుంబాల సర్వేలో 5 ఏళ్లలో పు 73,715 మంది చిన్నారులను గుర్తించారు. 160 ఏఎన్ఎంలు, 568 ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు ఇస్తారు. జింక్ మాత్రల ప్రయోజనాలు జింక్ మాత్రలు డయేరియా సంఖ్యను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 14 రోజుల వినియోగంతో నీళ్ల విరేచనాలు, న్యూమోనియా నివారణ సాధ్యమవుతుంది. డయేరియా వల్ల చిన్నారులు నీరసించకుండా, 13 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 38,429 జింక్ మాత్రలను సిద్ధం చేశారు. ఇటుక బట్టీలు, సంచార జాతుల ప్రాంతాల్లో వాహనాల ద్వారా సేవలు అందిస్తారు -
స్లాబ్ కిందే చదువులు
భైంసారూరల్: మండలంలోని కుంసర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్లాబ్ కిందే పాఠాలు నేర్చుకుంటున్నారు. మన ఊరు మన బడిలో నూతన భవన నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు చేశారు. మూడేళ్ల క్రితం స్లాబ్ వేశారు. ఏళ్లు గడుస్తున్న చుట్టు గోడలు నిర్మించలేదు. రోడ్డుపై వెళ్లే వాహనాల శబ్దంతో విద్యార్థులు పాఠాలు వినలేకపోతున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 45 మంది విద్యార్థులు ఉన్నారు. మాంజ్రి ప్రాథమిక పాఠశాల భవనానికి తలుపులు కిటికీలు లేవు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థులు ఉన్నారు. -
మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?
● అవినీతి పెరిగినందునే ఏసీబీ దాడులు ● అధికారులు నిబద్ధతతో పనిచేయాలి ● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్టౌన్: ‘అసలు నిర్మల్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..? అధికారులు ఏం పని చేస్తున్నారు..? వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతోంది. ప్రజలకు సేవలు అందించకుండా, చేస్తున్న పనులపై కనీసం అవగాహన లేకుండా, కేవలం సంపాదనపైనే దృష్టి పెడతామంటే కుదరదు. అలాంటి అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవచ్చు. అధికారులు సిబ్బంది నిబద్ధతతో పని చేయాల్సిందే..’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మున్సిపల్లో జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ఆయా శాఖలలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో జరుగుతున్న ఆయా పనుల పురోగతిపై కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. అవినీతిపై ఆగ్రహం... నిర్మల్ మున్సిపాలిటీ ఇటీవల ముద్రపడ్డ అవినీతికి కేరాఫ్గా మారిందంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు పనుల నిమిత్తం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఏం ఆశించకుండా పనులు చేయాలని సూచించారు. నిర్మల్లో సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీఈ హరిభువణ్, ఆర్వో అనుప్కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్ సారంగపూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని జామ్ గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరి శీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలకు కారణాలు తెలుసుకున్నారు. గ్రామంలో భూములకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నా యా అని గ్రామస్తులను అడుగగా 582 సర్వే నంబరులో ఉన్న భూసమస్యలను గురించి రైతులు, గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. 582 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో అసైన్డ్ పట్టాలు ఇవ్వడంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండా పోయిందని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు రశీదు ఇవ్వడంతోపాటు తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీదేవికి సూచించారు. అవసరమైతే సర్వేయర్ సహాయంతో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల తనిఖీ రెవెన్యూ సదస్సు పరిశీలన అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. స్టాఫ్ రూమ్కు వెళ్లి హాజరు రిజిష్టర్లు పరిశీలించారు. అక్క డి నుంచి మధ్యాహ్న భోజనం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన భోజనం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా పదోతరగతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించి పలు విషయాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు అభిలాష్ నెట్బాల్లో, రమ్య బేస్బాల్లో జాతీయస్థాయికి ఎంపికైన విషయం తెలుసుకుని అభినందించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఈవో రా మారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
భవనం ప్రారంభించక..
● వేధిస్తున్న అసౌకర్యాలు ● మరుగుదొడ్లు సరిపడా లేక అవస్థలు ● పెండింగ్లోనే తరగతి గదుల నిర్మాణ పనులు ● ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు ● సాక్షి విజిట్లో తేటతెల్లం ఖానాపూర్: మండలంలోని బాదనకుర్తి ప్రాథమికోన్నత పాఠశాలకు గత ఏడాది రూ.కోటి నిధులతో నిర్మించిన నూతన భవనం ఉన్నప్పటికీ దానిని ప్రారంభించకపోవడంతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామంలో పురాతన భవనం ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో మండల అధికారుల సూచన మేరకు ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతుల నిర్వహణను పురాతన భవనంలో కాకుండా సమీపంలోని ఇతర భవనాల్లో కొనసాగించాల్సి వస్తోంది. -
పొదుపు మహిళలకు అక్షర జ్ఞానం
● ‘ఉల్లాస్’తో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పథకం అమలు ● నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీవో సిబ్బంది నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని ప్రతీ మహిళ అక్షర జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దశలవారీగా అమలయ్యే ఈ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డీఆర్డీవో, విద్యాశాఖ సమన్వయంఉల్లాస్ కార్యక్రమం సజావుగా అమలు కావడానికి డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుంది. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ ఏపీఎం, గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, వీఏవో, సంఘాల అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు బాధ్యతలు నిర్వహిస్తారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సర్వే వివరాలను ఈ యాప్లో నమోదు చేస్తారు. చదువు మధ్యలో మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివేలా ప్రోత్సహిస్తారు. సంఘాల్లో చదువుకునేవారు లేకుంటే సభ్యు ల పిల్లలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సర్వే పూర్తయిన వెంటనే వాలంటీర్ల సాయంతో కార్యక్రమం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక సాధికారతఉల్లాస్ పథకం ద్వారా చదవడం, రాయడం నేర్ప డం ద్వారా సామాజిక సాధికారత సాధించడమే ప్రధాన లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం, మహిళా సంఘాల్లో 50 శాతం మంది మాత్రమే సంతకం చేయగలరు, మిగిలిన వారు వేలిముద్రలు వే స్తున్నారు. ఈ పథకం ద్వారా అందరికీ చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మా నేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, డిగ్రీ వరకు చదివించనున్నారు. అదనంగా, స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బ్యాంకింగ్లో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. వలంటీర్లుగా అక్షరాస్యులుడీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించిన తర్వాత, 15–20 మందితో గ్రూపులను ఏర్పా టు చేస్తారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్య మహిళలను వలంటీర్లుగా ఎంపిక చేసి, నిరక్షరాస్యులకు చదువు నేర్పే బాధ్యత అప్పగిస్తారు. వీరు ఎలాంటి పారితోషికం లేకుండా సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యాశాఖ నుంచి పుస్తకాలు, గ్రామస్థాయి ఉపాధ్యాయుల సహకారంతో ఈ పథకం విజయవంతం కానుంది. జిల్లా వివరాలుమండలాలు 1818 ఏళ్లు నిండిన సభ్యులపై దృష్టిఈ పథకం ప్రధానంగా 18 ఏళ్లు నిండిన మహిళా సంఘ సభ్యులపై దృష్టి సారిస్తుంది. జిల్లా స్థాయిలో డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే ప్రారంభించారు. ఇప్పటి వరకు 31,323 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించారు. సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులను వాలంటీర్లుగా నియమించి, నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం నేర్పిస్తారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు. గ్రామ స్థాయిలో సర్వే పూర్తి చేసి, నిరక్షరాస్యుల సంఖ్యను ఖరారు చేస్తారు.అవగాహన కల్పిస్తున్నాం.. 2030 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అక్షరాస్యత సాధించే దిశగా ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మహిళా సంఘంలోని నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యాశాఖ అధికారులు, డీఆర్డీవో ఆధ్వర్యంలో సమష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటాం. – తిరుపతిరావు, సహాయ ప్రాజెక్టు అధికారి -
భవన నిర్మాణం ఆపాలని ఆందోళన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్సీ కుల(మాల) సంఘ భవన నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ మాదిగ సంఘం సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్వారి మడిగెలు(రూములు) ఉండేవని, ఇటీవల అనుమతి లేకుండా ఎస్సీ మాల సంఘం సభ్యులు కూలగొట్టి అక్కడ మాల సంఘ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారన్నారు. నిర్మాణ పనులు నిలిపి వేసి తమకు న్యాయం చే యాలని కోరారు. అనంతరం తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధకు వినతిపత్రం అందజేశారు. -
సాగులో సవాళ్లు..!
నిర్మల్కేజీబీవీల్లో నూతన మెనూ కేజీబీవీల్లో బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో పలు మార్పులు చేసింది. ● వరి ధాన్యం మద్దతు ధర రూ.69 పెంచిన కేంద్రం ● పచ్చిరొట్ట ఎరువుల సబ్సిడీ 10 శాతం తగ్గించిన రాష్ట్రం ● దొడ్డు రకం వడ్లకు ఇప్పటికీ బోనస్ లేదు ● సన్న వడ్లు దిగుబడి రాదు.. ● అవసరానికి అంద ని రైతు భరోసాగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 20258లోu ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగించాలి నిర్మల్చైన్గేట్: దివ్యాంగుల సహాయ ఉపకరణాల దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతూ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న బుధవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపకరణాలకోసం ఈనెల 7 నుండి 18 వరకు కేవలం 11 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి మారుమూల ప్రాంత దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం, నాయకులు సముద్రాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. భైంసా : జిల్లాలో గోదావరి నది తీరంలో వరి పంట ప్రధాన వ్యవసాయంగా కొనసాగుతోంది. 53 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలో దాదాపు 70 వేల ఎకరాలకుపైగా వరి సాగవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 18 లక్షల ఎకరాల్లో సింహభాగం వరి పంటే ఉంది. అయితే, భారీ వర్షాలతో నది ఉప్పొంగి పంట నష్టం జరుగుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దీంతోపాటు, తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్ లేకపోవడం, పంటల బీమా అమలు చేయకపోవడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి. సబ్సిడీ తగ్గింపుతో భారం..సాగులో భూమి సారవంతం కోసం రైతులు జీలుగులు, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులను వినియోగిస్తారు. గతేడాది 60 శాతం సబ్సిడీతో 30 కేజీల జీలుగు బస్తా రూ.1,116, 40 కేజీల జనుము బస్తా రూ.1,448కి అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది సబ్సిడీని 50 శాతానికి తగ్గించడంతో 30 కేజీల జీలుగుబస్తా రూ.2,138, 40 కేజీల జనుము బస్తా రూ.2,510కి పెరిగింది. ఈ ధరల పెంపుతో రైతులు పచ్చిరొట్ట ఎరువులు కొనలేక, ప్రైవేటు దుకాణాల్లో పెసర బ్యాగులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దొడ్డు వడ్లకు ఇవ్వని బోనస్..నిర్మల్ జిల్లాలో వరి సాగులో 60 శాతం రైతులు దొడ్డు రకం వరిని పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, దొడ్డు రకానికి ఈ సౌకర్యం లేదు. సన్నరకం వరి సాగు చేసే రైతులు చీడపీడల నివారణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండగా, ఎకరానికి 14 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. అయితే, దొడ్డు రకం వరి ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడినిస్తుంది. అయినా దొడ్డు రకానికి బోనస్ లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్ లేకపోవడం వంటి సమస్యలు రైతుల ఆర్థికస్థితిని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం వరి రైతులకు న్యాయమైన మద్దతు ధర, సబ్సిడీలు, బోనస్ సౌకర్యాలను అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా ఆలస్యం.ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందించే పెట్టుబడి సాయం ఆలస్యం అవుతోంది. మొదటి ఏడాది చాలా మందికి రైతుభరోసా ఇవ్వలేదు. గత యాసంగిలో కూడా ఐదెకరాల లోపు మాత్రమే రైతుభరోసా చెల్లించింది. అదీ ఆలస్యమైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కోసం మళ్లీ అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు వరి రైతులకు ఈయేడు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్నాం. 30 కేజీల జీలుగు సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,138 చెల్లించి తీసుకెళ్లాలి. 40 కేజీల జనుము సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,510 చెల్లించి తీసుకెళ్లాలి. 30 కేజీల పచ్చిరొట్ట విత్తనాలు రెండున్నర ఎకరాలకు సరిపోతాయి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి పెసర వేస్తున్నాం పచ్చిరొట్ల విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏటా జీలుగు, జనుము చల్లేవాళ్లం. ఈ ఏడాది 30 కిలోల బస్తా రూ.2,138 చెల్లించాల్సి వస్తోంది. అంత మొత్తం పెట్టి ఏ రైతు కొనలేడు. – కొండ శ్రీనివాస్, న్యూపోచంపాడ్దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డురకం వరిధాన్యానికి బోనస్ ఇవ్వాలి. సన్నాలకు క్వింటాలుకు రూ.500 చెల్లిస్తుంది. అయినా సన్నాల సాగుకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిగుబడి తగ్గిపోతుంది. వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – రఘునాథ్, వాలేగాంమద్దతు ధర పెరగలేదు కేంద్ర ప్రభుత్వం వరి పంట మద్దతు ధర అంతగా పెంచలేదు. క్వింటాలుకు రూ.69 మాత్ర మే పెంచింది. దీంతో రైతులు నష్టాలపాలవుతారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా మద్దతు ధర అంతగా పెరగడంలేదు. – సుంకరి దత్తు, ఇలేగాంన్యూస్రీల్మద్దతు ధర నామమాత్రం పెంపుకేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరి ధాన్యం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని గతేడాదితో పోలిస్తే కేవలం మూడుశాతం మాత్రమే పెంచింది. సాధారణ వరిధాన్యం క్వింటాల్కు రూ.2,369, ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2,389గా నిర్ణయించింది, ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.69 పెరుగుదల మాత్రమే. ఇతర పంటలతో పోలిస్తే వరి ధర పెంపు అత్యంత తక్కువగా ఉందని రైతులు పెదవి విరుస్తున్నారు. మినుములపై రూ.400, కందులపై రూ.450, జొన్నపై రూ.328, మొక్కజొన్నపై రూ.175, సజ్జలపై రూ.150, రాగులపై రూ.579, వేరుశెనగపై రూ.480, సోయాబీన్పై రూ.436, పొద్దుతిరుగుడుపై రూ.441, పత్తిపై రూ.589, ఒలిసెలపై రూ.820 పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో బీజేపీ వరిధాన్యం క్వింటాల్కు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, తక్కువ పెంపుతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ
● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ● పెరిగిన మెస్చార్జీలతో విద్యార్థినుల హర్షంలక్ష్మణచాంద: నిరుపేద బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కేజీబీవీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025 –26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6 –10, ఇంటర్ విద్యార్ధులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1225లు ప్రభుత్వం అందించేది. కానీ నేడు నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2100లు అందించనున్నారు. నూతన మెనూ ఇదే.. ఉదయం..టమాట కిచిడి, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి పండు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం..టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం..ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ..వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి. ఉమ్మడి జిల్లా కేజీబీవీల సమాచారం.. జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఇంటర్ కాలేజీలు విద్యార్థుల సంఖ్య మొత్తం నిర్మల్ 18 3600 14 2240 5840 మంచిర్యాల 18 3786 15 1080 4866 ఆదిలాబాద్ 18 4800 13 680 5480 కుమురంభీం 15 3027 13 1069 4096 -
ఫిర్యాదులు చట్టపరంగా పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిలభైంసాటౌన్: అర్జీదారుల ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం భరోసా కేంద్రంలో షీ టీమ్ సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీల వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఓ వృద్ధ దంపతులు తమ కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఎస్పీని కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన ఎస్పీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపినాథ్, నైలు, మల్లేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలిభైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం డీఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన మాక్డ్రిల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఎఫ్ సిబ్బంది విపత్తుల సమయంలో ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐ గోపినాథ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికులు హక్కుల రక్షణకు ఉద్యమించాలి
నిర్మల్చైన్గేట్: కార్మికులు హక్కుల రక్షణకో సం ఉద్యమించాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రాజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీడీ ఫ్యాక్టరీలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో 44 చట్టాలను నాలుగు కోడ్స్గా మార్చి యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలు చేయడం అన్యాయమన్నారు. బీడీ పరిశ్రమపై విధించిన 28 శాతం జీఎస్టీ తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రాజు, మురళి, నరసయ్య, గంగామణి, లక్ష్మి, విజయ, కమల, కవిత, అరుణ, శ్రీనివాస్, చిన్నయ్య, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు వ్యక్తుల బైండోవర్
లక్సెట్టిపేట: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి కారణం లేకుండానే 100 నంబర్కు డయల్ చేస్తున్నారు. పలుమార్లు ఈవిధంగా డయల్ చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకున్నా ఫోన్ చేస్తున్నందున బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: జిల్లాలో వర్షాలు, వరదల వల్ల ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లడ్ మాన్యువల్పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ కేవలం స్పందనకే పరిమితం కాకుండా, ప్రమాద నివారణ, తీవ్రత తగ్గింపు, పునరావాసం, పునర్నిర్మాణం దశల్లో ముందస్తుగా ప్రణాళికలు ఉండాలన్నారు. వర్షాకాలానికి ముందు నదులు, వాగులు, కుంటలలో నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయాలని, పట్టణాల్లో డ్రెయినేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని, పాడైన రహదారులను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. రిజర్వాయర్ల గేట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు, గోదావరి పరీవాహక గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుల నీటిమట్టాలను నిరంతరం గమనిస్తూ దిగువ గ్రామాలకు సమాచారం అందించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలు, రహదారులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్యులు, సిబ్బంది స్థాని కంగా అందుబాటులో ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో పశువులను మేతకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మండలాల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్డీవో రత్నాకళ్యాణి, రెవెన్యూ, విద్యుత్, ఫైర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు బాసటగా రైతు భరోసా నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతులకు బాసటగా నిలుస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి జిల్లాలో 1,86,400 మంది రైతులకుగానూ మంగళవారం నాటికి డీబీటీ ద్వారా 1,33,135 మందికి రూ.112.86 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులు జమ కాబోతున్నట్లు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి సాయం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నిర్మల్చైన్గేట్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన బసండ్ల ముత్యం బుధవారం నిర్మల్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ డబ్బాతో కలెక్టరేట్కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. గమనించిన కార్యాలయ సిబ్బంది అతడి నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ అతడిని స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు. ముత్యం మాట్లాడుతూ గ్రామంలోని తన సొంత భూమిని వేరొకరు కబ్జా చేశారని ఆరోపించాడు. కబ్జాదారుడు మూడు రోజుల నుంచి తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. బౌలర్లదే జోరుమంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు. -
భూ వివాదంలో ఇరువర్గాల దాడి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులో జరిగిన భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన పనాస గణేశ్ ఆకెనపల్లి శివారు సర్వే నంబర్ 64లో ఉన్న భూమిని మంగళవారం సాయంత్రం దున్నే క్రమంలో పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన సింగతి హైమావతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లారీ ఢీకొని ఒకరు..
భెంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బెలతరోడకు చెందిన చెంచుల సాయినాథ్(37) బుధవారం బెల్తరోడ వెళ్లి బైక్పై భైంసా తిరిగి వస్తున్నాడు. సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగా, నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ గౌసుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు. సాయినాథ్కు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సారంగపూర్: కౌలురైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని ఆలూరులో సర్వే నిర్వహించి కౌలురైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో కౌలు రైతుల ఆధీకృత సాగుదారుల చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్రెడ్డి సర్కారు కౌలురైతుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుండడంతో పంటనష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి కౌలురైతుల చట్టాన్ని తీసుకుని వచ్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక సభ్యులు రమాకాంత్, రాకేశ్, షారూఖ్, శివాకర్, శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో గల పురాతన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించారు. భవనం శిథిలావస్థకు చేరిందని కూలితే విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇంజినీర్ అఖిలేష్తో కలిసి బుధవారం కూల్చివేత అనుమతుల కోసం కొలతలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న భవనం కూల్చివేస్తున్న విషయం తెలియగా పలువురు కలత చెందుతున్నారు. ఈ భవనాన్ని 1969లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఖానాపూర్ పోలీస్స్టేషన్కు కొణతం దిలీప్ఖానాపూర్: గతంలో సోషల్మీడియాలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్మీడియా రాష్ట్ర ఇన్చార్జి కొణతం దిలీప్పై నమోదైన కేసులో భాగంగా బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇది వరకే బెయిల్ మంజూరైనప్పటికీ ప్రతీ బుధవారం పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. ఈక్రమంలో పోలీసులు గంటల తరబడి ఆయన పోలీస్స్టేషన్లో నిరీక్షించేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్స్టేషన్ బయట పెద్దఎత్తున గుమిగూడారు. బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంకుభీర్: మండలంలోని బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంతో సమీప ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం బెల్గాం గ్రామ శివారులోని చేనులో పని చేసే వారికి ఎలుగుబంటి కన్పించడంతో వారు భయంతో కేకలు వేయగా సమీప అడవిలోకి పారిపోయింది. మండలంలోని బ్రహేశ్వర్, మార్లగొండ అడవుల్లో ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం ఉంది. ఎలుగుబంటి కనిపించిందన్న వార్త వ్యాపించడంతో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజలు అడవివైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారి లక్ష్మణ్ను బుధవారం వివరణ కోరగా ఐదు నుంచి ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని, అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. -
తల్లి మెడలో గొలుసు అపహరించిన కుమారుడు
మందమర్రిరూరల్: తల్లి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు దొంగిలించిన కుమారుడిని మందమర్రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వైపు నివాసం ఉండే విజయపురి పుల్లమ్మ అనే వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ మెడలో గొలుసు దొంగిలించినట్లు మనుమడు శివ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనలు, సాంకేతికత ఆధారంగా ఇంటి వారే దొంగతనం చేసి ఉంటారనే కోణంలో పుల్లమ్మ కుమారుడు శంకరయ్యపై నిఘా ఉంచారు. ఆయన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తానే దొంగిలించినట్లు నేరం అంగీకరించాడు. ఈ మేరకు శంకరయ్య వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజశేఖర్, క్రైంటీం కానిస్టేబుళ్లు మహేశ్, రాకేశ్లను ప్రత్యేకంగా అభినందించారు. -
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిసారంగపూర్: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జామ్ నుంచి బోరింగ్తండా వరకు రూ.3.20 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. అనంతరం సారంగాపూర్, బీరవెల్లిలో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు వేగంగా పనులు చేపడితే నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆందోళన మండలంలోని దుర్గానగర్కు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్పందించిన ఎ మ్మెల్యే వెంటనే పీఆర్ డీఈఈ తుకారాం, ఆర్అండ్ బీ అధికారులతో మాట్లాడారు. గురువారం పనులు ప్రారంభమవుతాయని, కానిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ వ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, తక్కల రమణారెడ్డి, రాజేందర్ రెడ్డి, విలాస్, తిరుమలాచారి, నారాయణ, కొరిపెల్లి రాజు, ఆర్వీ రమణ, తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి భూమిపూజ నిర్మల్చైన్గేట్: పట్టణంలోని బంగల్పేట్ కాలనీలో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్ల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, నాయకులు పాతర్ల గణేశ్, ఆనంద్, పాతర్ల హరీష్, యాటకారి సాయన్న, పాతర్ల వెంకటి, పరమేశ్, దేవిదాస్, జింక సూరి, జుట్టు దినేష్, గిల్లి విజయ్, గవాస్కర్, చరణ్ మౌర్య, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) అనే వ్యక్తి దేగాం గ్రామంలో బస్సు ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ –సుశీల దంపతులు బుధవారం బాసరకు వెళ్తున్నారు. దేగాం బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న క్రమంలో చంద్రశేఖర్ను భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేగాం చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
అర్చకులకు శుభవార్త
● బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు ● జిల్లాలో 273 మందికి లబ్ధి లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ధూప దీప నైవేద్యం (డీడీఎన్) అర్చకులకు బీమా, రిటైర్మెంట్ ప్ర యోజనాలతో కూడిన కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా అర్చకు లలో సంతోషాన్ని నింపింది. దీర్ఘకాలంగా ఆలయాల్లో సేవ చేస్తున్న వారి ఆర్థిక భద్రతను బలో పేతం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సాయం పెంపు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకం, అర్చకులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించబడింది. ప్రారంభంలో నెలకు రూ.2,500గా ఉన్న సహాయం, 2015లో రూ.6 వేలకు(పూజా ద్రవ్యాలకు రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు) అందించారు. 2023లో రూ.10 వేలు(పూజా ద్రవ్యాలకు రూ.4 వేలు, అర్చకుడికి రూ.6 వేలు) పెరిగింది. ఈ పెంపు అర్చకుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది. జిల్లాలో 273 మందికి లబ్ధి.. జిల్లాలో డీడీఎన్ పథకం కింద 273 ఆలయాలు ఉ న్నాయి. వీటిలో ఎ కేటగిరీలో 2, బి కేటగిరీలో 4, సి కేటగిరీలో 1 ఆలయం ఉన్నాయి. ఈ పథకం ద్వారా అర్చకులకు నిరంతర సహాయం అందుతోంది, అయితే కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. వేతనాలు ఆలస్యం జిల్లాలో డీడీఎన్ పథకం కింద సేవలందిస్తున్న అర్చకులు గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించి, బకాయిలను విడుదల చేయాలని అర్చకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రయోజనాలు ఇలా.. ప్రభుత్వం అర్చకులకు అందించే ప్రయోజనాలు విభిన్న రకాలుగా రూపొందించబడ్డాయి. రిటైర్మెంట్ గ్రాట్యూటీ: రెగ్యులర్ అర్చకులు: 20 ఏళ్లకుపైగా సేవలకు రూ.8 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.6 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.4 లక్షలు, 10 ఏళ్లలోపు మరణిస్తే రూ.2 లక్షలు. డీడీఎన్ అర్చకులు: 20 ఏళ్లకు పైగా సేవలకు రూ.4 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.3 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.2 లక్షలు. మరణానంతర సహాయం: అర్చకులకు ఎక్స్–గ్రేషియాగా రూ.50 వేలు, అంతిమ సంస్కారాలకు రూ.30 వేలు. ఉపనయనం గ్రాంట్: రూ.50 వేలు ఇంటి నిర్మాణం: డీడీఎన్ అర్చకులకు రూ.50 వేలు, రెగ్యులర్ అర్చకులకు రూ.4 లక్షల రుణ సహాయం. విద్యా పథకం: గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఏటా రూ.35 వేలు రీయింబర్స్మెంట్. మెడికల్ సహాయం: మెడికల్ బోర్డు సిఫారసుతో గరిష్టంగా రూ.2 లక్షలు. వివాహ పథకం: రెగ్యులర్ అర్చకులకు రూ.2 లక్షల రుణం, డీడీఎన్ అర్చకులకు రూ.1,01,116, మహిళా అర్చకులు/వారి కుమార్తెల వివాహానికి రూ.1,25,000. -
సర్వే నంబర్ 241..!
● ఉన్నది 40 ఎకరాలు.. 77 ఎకరాలకు పట్టాలు! ● యాకర్పెల్లిలో భూ వివాదం ● అధికారుల తప్పిదంతో రైతులకు శిక్ష ● ఏళ్లుగా భూముల కోసం గొడవలు.. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే.. ఇటీవల కలెక్టర్ ఆదేశించిన విధంగా సర్వేయర్లతో టీం ఏర్పాటు చేసి భూమి కొలతలు చేయిస్తాం. అలాగే మోఖాపై(సాగుచేసుకుంటున్న) రైతులు ఎవరు, సాగు చేయకుండా పట్టాలు పొందిన వారు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తాం. దాని ఆధారంగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తాం. అనంతరం ఒరిజినల్ పట్టాదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, తహసీల్దార్, సారంగాపూర్రెవెన్యూ వ్యవస్థలో లోపాలు 241 సర్వే నంబర్లోని భూ వివాదం రెవెన్యూ వ్యవస్థలోని పారదర్శకత, కచ్చితత్వం లోపాలను స్పష్టం చేస్తుంది. గతంలో అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో తప్పిదాలు ఈ సమస్యకు దారితీశాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు వాస్తవ భూ విస్తీర్ణంతో సరిపోలకపోవడం, అసైన్డ్ భూముల జారీలో అస్పష్టత వంటివి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్య రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాల అమలును కూడా అడ్డుకుంటోంది. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, క్షేత్రస్థాయి సర్వేలు, కఠినమైన పర్యవేక్షణ ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. సారంగపూర్: మండలంలోని యాకర్పెల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 241లోని అసైన్డ్ భూమి వివాదాల కేంద్రంగా మారింది. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 40.46 ఎకరాల భూమి ఉంది. ఈమేరకే రైతులకు పట్టాలు ఉండాలి. కానీ, భూమికి మించి అధికంగా పట్టాలు జారీ కావడంతో రైతులు, అన్నదమ్ములు, క్రయవిక్రయదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్కు సంబంధించిన ఫిర్యాదులు సర్వసాధారణమయ్యాయి. అధికారులు ‘‘241 సర్వే నెంబరా?’’ అని ఎదురు ప్రశ్న వేస్తూ కామన్ అన్నట్లు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భూ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పట్టాలు.. 241 సర్వే నంబర్లో వాస్తవంగా 40.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, గతంలో 32 మంది భూమిలేని రైతులకు అసైన్డ్ పట్టాలు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సర్వే నంబర్లో మరో 50 మందికి పైగా పట్టాలు జారీ అయ్యాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులలో ఈ భూమి విస్తీర్ణం 77.17 ఎకరాలుగా నమోదైంది, అంటే 36 ఎకరాల 21 గుంటలు అధికంగా నమోదు చేశారు. అక్రమ పట్టాలతో రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) సమస్య ఉత్పన్నమై, రైతులు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ఈ సమస్యకు మూల కారణం గతంలో పనిచేసిన వీఆర్వోలు. డబ్బులు తీసుకుని ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారని రైతులు భూమిని విక్రయించినప్పుడు కొనుగోలుదారుల పేరిట కొత్త పట్టాలు జారీ చేసినా, విక్రయించిన రైతుల పేర్లు రికార్డుల నుంచి తొలగించకపోవడం ఒక సమస్య. అలాగే, మరణించిన రైతుల పట్టాలను వారసుల పేరిట మార్పు చేసినప్పుడు పాత రికార్డులను తొలగించకపోవడంతో భూమి విస్తీర్ణం అధికంగా నమోదైంది. ఈ నిర్లక్ష్యం ఫలితంగా 241 సర్వే నంబర్లో నిత్యం పంచాయితీలు, గొడవలు జరుగుతున్నాయి. పరిష్కారం దిశగా అడుగులు కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల భూభారతి రెవె న్యూ సదస్సులో యాకర్పెల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సమయంలో రైతులు ఈ సమస్యను వివరించారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న కలెక్టర్, తహసీల్దార్ శ్రీదేవి నేతృత్వంలో సర్వేయర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమి టీ భూమి కొలతలు తీసి, వాస్తవంగా సాగు చేస్తు న్న రైతులకు మాత్రమే పట్టాలు జారీ చేయాలని సూచించారు. సాగులో లేనివారి పేర్లు తొలగించా లని పేర్కొన్నారు. రైతులు ఈ ప్రతిపాదనకు సమ్మ తి తెలుపడంతో, రెవెన్యూ సదస్సు తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సోన్: మండల కేంద్రంతోపాటు సిద్ధులకుంట, మాదాపూర్, సంఘంపేట్, న్యూవెల్మల్ గ్రా మాలలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. వివిధ గ్రామాలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, రాష్ట్ర ప్రభు త్వ నిధుల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం న్యూవెల్మల్ గ్రామంలో వీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీవో రాజేశ్వర్, డీఈ తుకారం, ఎంపీడీవో సురేశ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, గంగన్న, మండల అధ్యక్షుడు గంగారెడ్డి, మహిపాల్రెడ్డి, విజయ, సాగర్, బీడీసీ చైర్మన్ వేణు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పరిశుభ్రత పాటించాలి నిర్మల్చైన్గేట్: వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. పట్టణంలోని ఆదర్శనగర్లో మంగళవారం చేపట్టిన డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులు దరిచేరవని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ, ఐకేపీ సిబ్బందితో కలిసి ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడి యా అధికారి రవీందర్, డాక్టర్ తేజస్విని, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, మతిన్, ఆరోగ్య సహాయకులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిలోనే అన్నదాత చిత్తు!
నిర్మల్అడ్రస్ లేని అత్యవసర సేవలు బాసర అమ్మ చెంత అత్యవసర సేవలు అంద డం లేదు. గోదావరిలో మునిగినా, రోడ్డు ప్ర మాదం జరిగినా చికిత్సకు భైంసా లేదా నిజామాబాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.● జిల్లాలో నకిలీ విత్తనాలు.. నిషేధిత రసాయన మందులు ● డీఏపీ కొరతతో రైతులకు ఇబ్బందులు ● అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు ● నిద్రమత్తులో జిల్లా వ్యవసాయ శాఖ గుడిలో గుప్తనిధుల వేట కడెం మండలం కల్లెడ, దోస్త్నగర్ మధ్యన ఉన్న కొండపై వెలసిన లక్ష్మీనారసింహ ఆలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. 9లోu బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 20258లోu పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి రాధిక నిర్మల్టౌన్: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. తరగతి గదుల సౌలభ్యం, తాగునీరు వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పాముల బెడద లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు చదువు ప్రాధాన్యత తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది లింగగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, పీడీ భూమన్న, స్నేక్ స్నాచర్ వనీల్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు. భైంసాటౌన్: ఖరీప్ సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. భూములు సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే అదనుగా నకిలీ దందాకు తెరలేపారు వ్యాపారులు. రైతులు అడిగిన విత్తనాలు, ఎరువులు కాకుండా గుర్తింపు లేని కంపెనీల విత్తనాలు, ఎరువులు అంటగడుతూ ఆదిలో నే రైతులను చిత్తు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోతున్నారు. భైంసా మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన రైతు దండేకర్ రాందాస్, భైంసాలోని ఓ విత్తన డీలర్ వద్ద రవి ఉన్నతి రకం సోయా విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తనాలను విత్తే సమయంలో అవి చెడిపోయి ఉన్నట్లు గుర్తించాడు. వ్యా పారిని సంప్రదించగా, వారు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. సోమవారం రాందాస్ కొందరు రైతులతో కలిసి భైంసాలోని ఏడీఏ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు అందుబాటులో లేరు. చివరకు ఓ అధికారి వచ్చి, వ్యాపారితో ఫోన్లో మాట్లాడి మరో విత్తన సంచి సర్దుబాటు చేయాలని సూచించారు. డీఏవోను సంప్రదించినా ఇదే సమాధానం రావడం గమనార్హం. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దు కాణాల్లో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 575 సంచుల 20:20 ఎరువులు, 117 డీఏపీ బస్తాలు, 26 పొటాష్ బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక, సరైన బిల్లులు లేని 24.5 లీటర్ల నిషేధిత గ్లైఫోసెట్ మందును స్వాఽ దీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు జిల్లా వ్యవసాయ శాఖ మొక్కుబడి పనితీరుకు అద్దం పడుతోంది. డీఏపీ కొరత.. జిల్లావ్యాప్తంగా డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. జిల్లాకు 7 వేల టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 6 వేల టన్నుల స్టాక్ వచ్చింది. 90 శాతం అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో డీలర్లు డీఏపీ లేదని రైతులకు చెబుతున్నారు. తెలిసిన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు ఎరువులను తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కుభీర్ ప్రాంతంలో ఎరువుల లోడ్తో వెళ్తున్న వాహనం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. సహకార సంఘాలకు కూడా డీఏపీ పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో, రైతులు అధిక ధరలకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. న్యూస్రీల్అధిక ధరలకు విక్రయండీఏపీ రూ.1,450కి కొన్నా... డీఏపీ కొరత పేరుతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నేను భైంసాలోని ఓ దుకాణంలో 8 సంచులు కొన్న. ఒక్కొక్కటి రూ.1,450 చొప్పున ఇచ్చారు. బిల్లు అడిగితే ఇవ్వడం లేదు. కొందరికి రూ.1,350 ధర వేసి రశీదు ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయినాథ్, రైతు, భైంసా ఫిర్యాదు చేయాలి.. జిల్లాలో డిమాండ్ మేరకు ఎరువుల స్టాక్ ఉంది. మొత్తం 6 వేల టన్నులకుగాను 5 వేల టన్నులు జిల్లాకు చేరింది. ప్రస్తుతం డీలర్ల వద్ద మరో 1,600 టన్నులు అందుబాటులో ఉంది. డీలర్లు డీఏపీ స్టాకు లేదన్నా, అధిక ధరకు విక్రయించినా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారిభైంసా మార్కెట్లో కొందరు వ్యాపారులు డీఏపీ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా, రూ.1,400 నుంచి రూ.1,500కి, 20:20 బస్తా రూ.1,280కి ఉండగా, రూ.1,300 నుంచి రూ.1,350కి, 10:26:26 బస్తా రూ.1,800కి విక్రయిస్తున్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు స్టాక్ లేదనే సమాధానం వస్తోంది. ఈ నిర్లక్ష్య వైఖరి రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. -
సమస్యల పరిష్కారానికి వేదిక
ఖానాపూర్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందేలా చూడడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక పనిచేస్తుందని వేదిక చైర్మన్ ఇ.నారాయణ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలోని ఈఆర్వో ఆఫీస్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్–2, నిజామాబాద్) ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, మామడ మండలాలకు చెందిన వినియోగదారులు సదస్సులో పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక కార్యాలయాల్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అయినా పరిష్కారం కాకపోతే నిజామాబాద్లోని సీజీఆర్ఎఫ్ కార్యాలయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ వకీల్తో పాటు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి, బీజేపీ నాయకులు నాయిని సంతోష్, తదితరులు పలు సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను ఇచ్చారు. సమావేశంలో కన్జూమర్స్ ఫోరం టెక్నికల్ సభ్యుడు రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, ఎస్ఈ సుదర్శనం, డీఈఈ నాగరాజు, ఏడీ శ్రీనివాస్, ఏఈ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చి ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశాకే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో మంగళవారం మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజాకోర్టులోనే ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబితేనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల నిధులన్నీ ఎక్కువగా కేంద్రప్రభుత్వానివే అని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అప్పుల బాధ తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, పుప్పాల ఉపేందర్, కీర్తి మనోజ్, రవీందర్రెడ్డి, గిరి, వెంకట్రాములు, రమేశ్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
.. గోదావరిలో దీపమే! బాసర వద్ద గోదావరిలో భక్తుల ప్రాణాలకు భద్రత కరువైంది. పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రత, రణక్ష చర్యలు కానరావడం లేదు. మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025నిర్మల్ మెడికల్ కాలేజీ యోగా వాక్ నిర్మల్టౌన్: యోగాతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం ‘యోగా వాక్ ’ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారుల గుండా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎస్ఎంవో నారాయణరావు, డాక్టర్ సంధ్యారాణి, డీపీవో శ్రావణ్, డీపీవో నవీన్, ఆయుష్ విభాగం సభ్యులు, ఆశ వర్కర్లు, యోగా శిక్షకురాలు చైతన్య, ప్రదీప్పవిత్ర, పరికిపండ్ల స్వదేశ్, ఎస్పీ రవీంద్ర, అడప నవీన్ పాల్గొన్నారు. హాస్టల్ కొంత ఇబ్బందే.. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న భవనం సెకండియర్ వరకు పెద్దగా ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు. కానీ.. మూడోసంవత్సరంలోకి అడుగుపెడితే ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికీ ఇక్కడ విద్యార్థుల వసతికి కొంత సమస్యగానే ఉంది. బాలురకు కళాశాల భవనంలోనే హాస్టల్ వసతి కొనసాగిస్తున్నారు. బాలికలకు మాత్రం పాలిటెక్నిక్ కళాశాల భవనంలో వసతి ఏర్పాటు చేశారు. ఇద్దరికీ ప్రత్యేకంగా వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉంది.నిర్మల్: జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న మెడికల్ కాలేజీపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కత్తి వేలాడుతోంది. వైద్యకళాశాల రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా పాలకుల పట్టింపులేనితనంతో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. కాలేజీ అనుమతి రద్దు చేసేదాకా పరిస్థితి తెచ్చుకోవద్దని ఎన్ఎంసీ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 కాలేజీలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈనెల 18న నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)ని ఆదేశించింది. డీఎంఈతోపాటు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సైతం వర్చువల్గా అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. అదే భవనంలో.. రెండేళ్లలో 20 ఎకరాలలో రూ.166 కోట్లతో శాశ్వత మెడికల్ కళాశాల భవనాలు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాలు చేపడతామని మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సమయంలో అప్పటి పాలకులు తెలిపారు. రెండేళ్లు గడిచినా.. సెకండియర్ తరగతులు ప్రారంభమైనా భవనాల ఊసులేదు. ఇప్పటికీ కొత్త భవనాలకు అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం భీమన్నగుట్ట పక్కన కొనసాగుతున్న మెడికల్ కాలేజీ భవనం జిల్లా ఆస్పత్రి కోసం కేటాయించింది. ఐదెకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అనంతరం జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించడంతో అదేస్థలంలో రూ.40 కోట్లతో మొదటి సంవత్సరం విద్యార్థులకు సరిపోయేలా, వారి బోధనకు వీలుగా నిర్మాణం మార్చారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరానికి చేరుకున్నా.. కొత్త భవనాల జాడ కనిపించడం లేదు. బోధనా సిబ్బంది అవసరమే.. ఎన్ఎంసీ చేసిన హెచ్చరికల్లో ప్రధానంగా వైద్య విద్యార్థులకు కావల్సిన బోధనా సిబ్బంది లేరన్న విషయం ప్రధానంగా ఉంది. నిర్మల్ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం 62 మంది వైద్యులు ఉన్నారు. రాష్ట్రంలోని మిగతా మెడికల్ కాలేజీలతో పోలిస్తే ఇక్కడ సరిపడా బోధనా సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. మున్ముందు ఈ సిబ్బంది సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కనీసం వందమంది ఉండాల్సిన అవసరం ఉంది. సీఎం సమీక్ష.. ఎన్ఎంసీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోనే మెడికల్ కాలేజీల తీరుపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కళాశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని సూచించారు. మూడేళ్లలో అన్ని వసతులు సమకూర్చాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మరోవైపు బుధవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో నేషనల్ మెడికల్ కమిషన్ ఏం మాట్లాడుతుందో.. ఏం చర్యలు తీసుకుంటుందో..అన్న విషయంపైనే కొంత కలవరం నెలకొంది. న్యూస్రీల్పెద్దగా ఇబ్బంది లేదు.. రాష్ట్రంలోని మిగతా కాలేజీలతో పోలిస్తే నిర్మల్ వైద్యకళాశాలలో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇక్కడ భవనం, సిబ్బంది ప్రస్తుతానికి సరిపడా ఉన్నారు. ఎన్ఎంసీతో వర్చువల్ సమావేశానికి హాజరు అవుతాము. – శ్రీనివాస్, ప్రిన్సిపాల్, మెడికల్కాలేజీ -
ఊరిలోనే నాణ్యమైన విత్తనాలు
● గ్రామాల్లో ఉత్పత్తికి జయశంకర్ యూనివర్సిటీ శ్రీకారం ● నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం పేరుతో కార్యక్రమం ● ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతుల ఎంపిక ● వరి, కంది, పెసర విత్తనాలు పంపిణీనిర్మల్చైన్గేట్: రైతులు నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నారు. ఏటా వేల మంది నాసిరకం విత్తనాలు కొని నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా నకిలీ దందా ఆగడం లేదు. అమాయక రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. నకిలీ, కల్తీ విత్తనాల వల్ల పంట దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం‘ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం గ్రామీణ రైతులతో నాణ్యమైన వరి, పెసర, కంది విత్తనాలు ఉత్పత్తి చేయించి, వాటిని స్థానిక రైతులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించబడింది నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి.. రైతులు నాణ్యమైన విత్తనాలను పొందలేక, ప్రైవేట్ కంపెనీల నకిలీ విత్తనాల కారణంగా పంటలు తెగుళ్లకు గురై, దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన విశ్వవిద్యాలయం, స్థానిక గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం రైతులకు నామమాత్రపు ధరలకు నాణ్యమైన విత్తనాలను అందించడంతోపాటు, వారిని స్వయం సమృద్ధిలో భాగస్వాములను చేస్తుంది. శాస్త్రవేత్తల పర్యవేక్షణ.. ఈ కార్యక్రమంలో రైతులకు అందించిన విత్తనాలను వానాకాలం సీజన్లో సాగు చేయిస్తారు. విత్తన శుద్ధి నుంచి పంట దిగుబడి వచ్చే వరకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరంతర పర్యవేక్షణ సాగిస్తారు. నారు పోయడం, నాటు వేయడం, తెగుళ్ల నివారణ వంటి అంశాల్లో రైతులకు సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ ప్రక్రియ నాణ్యమైన దిగుబడిని నిర్ధారిస్తుంది. గ్రామీణ రైతులకు ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా ఉత్పత్తి అయిన వరి, పెసర, కంది ధాన్యాలను గ్రామంలోని ఇతర రైతులకు విత్తనాలుగా అందుబాటులో ఉంచుతారు. ఈ విత్తనాలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చు. దీనివల్ల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదనంగా, నకిలీ విత్తనాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. రైతులు నష్టాల నుంచి రక్షించబడతారు. ఈ కార్యక్రమం రైతుల స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తూ, వ్యవసాయంలో నాణ్యత, విశ్వసనీయతను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక గ్రామాల్లో నాణ్యమైన విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఈ కార్యక్రమం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని, వ్యవసాయ ఉత్పాదకతను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం వచ్చిన కిట్లు 1188 మొత్తం మండలాలు 19 కందులు 361 బస్తాలు వరి 355 బస్తాలు పెసర 334 బస్తాలుజూన్ 2న నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కార్యక్రమం అమలు.. ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం‘ కార్యక్ర మం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేసి, వారికి వరి, పెసర, కంది విత్తనాలను అందజేస్తారు. ఈ వి త్తనాలను విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు, ఇది నాణ్యతకు హామీ ఇస్తుంది. జిల్లాలో అమలు: నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 396 రెవెన్యూ గ్రామాల నుంచి మొత్తం 1,188 మంది రైతులను ఎంపిక చేశారు. వీరిలో.. 355 మందికి 10 కిలోల వరి విత్తన బస్తాలు.. 334 మందికి 4 కిలోల పెసర విత్తన బస్తాలు.. 361 మందికి 4 కిలోల కంది విత్తన బస్తాలు పంపిణీ చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల వారీగా ముగ్గురు రైతులను ఎంపిక చేసి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు పొందవచ్చు. పంట దిగుబడులు వచ్చాక విత్తనాలను మిగతా రైతులకు తక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. నకిలీ బెడద తప్పడమే కాకుండా మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 68 అర్జీలు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందించి, పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల స్థితిపై సమీక్షించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తక్షణమే స్పందించాలన్నారు. వానాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం జరుగకుండా చూడాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెత్త బండి రావడం లేదు.. మేము బంగల్పేట సమీ పంలో ఉన్న నాగనాయిపేట కాలనీవాసులం. ఏడాదిగా మా కాలనీకి చెత్త బండి రావడం లేదు. మున్సిప ల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ప్రజావాణిలో కూడా రెండుసార్లు ఫిర్యాదు చేశాను. చెత్త బండి రాక రోడ్డుపై వేసిన చెత్తను కోతులు, పందులు చిందరవందర చేస్తున్నాయి. దోమలు, ఈగలు, దు ర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. చెత్త బండి వచ్చేలా చూడండి. – నవీన్, నాగనాయి పేట్చేపల వేటకు అనుమతి ఇప్పించండి మేము దస్తురాబాద్ మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులం. 1974 నుంచి చేపల వేటకు లైసెన్సులు పొందుతూ చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నాం. రాంపూర్కు చెందిన మత్స్యకారులు అక్కడ చేపలు పట్టకూడదని మమ్మల్ని కర్రలతో కొట్టి, మా కళ్లలో కారంపొడి చల్లి, గొడ్డళ్లతో దాడి చేస్తున్నారు. 61 కుటుంబాలకు చెందిన మేము ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నాం. రాంపూర్ మత్సకారులపై చట్టరీత్యా చర్య తీసుకుని మాకు చేపల వేటకు అనుమతి ఇప్పించండి. – దస్తురాబాద్ మత్స్యకారులు నకిలీ నియామక పత్రంతో మోసం.. మాది పెంబి మండలం మందపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం ఖానాపూర్ మండలం రాజురాకు చెందిన కొల్పుల హరీశ్ నా కుమారునికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.ఆరు లక్షలు తీసుకున్నాడు. ఆదాయ పన్ను శాఖలో సహాయకునిగా నియమిస్తున్నట్టు చూపించే నియామక పత్రం అందజేశాడు. తనకు పరిచయం ఉన్నచోట కొన్ని రోజులు ఉద్యోగం చేయించి తొలగించారు. గత అక్టోబర్లో పెద్దమనుషులను తీసుకెళ్లి న్యాయం అడగగా డబ్బులు జనవరిలో తిరిగి ఇస్తానని కాగితం రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. – జల్ల నర్సయ్య, మందపల్లి కలెక్టర్ అభిలాష అభినవ్