breaking news
Nirmal
-
అటవీ చట్టాలపై అవగాహన ఉండాలి
సారంగపూర్: అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వీటిని ఆచరణలో పెట్టేలా చూసుకోవాలని డెప్యూటీ రేంజ్ అధికారి నజీర్ఖాన్ అన్నారు. మండలంలోని జామ్ కేజీబీవీలో అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతీ విద్యార్థి తప్పకుండా అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన వివిధ చట్టాలు తెలుసుకోవాలన్నారు. అడవుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. అడవులను రక్షించుకోవాలని తెలిపారు. అటవీ జంతువుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ అన్నపూర్ణ, ఎఫ్ఎస్ఓ రశీద్, ఎఫ్బీఓలు వెన్నెల, సుజాత, భూమేష్, గురుకులం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముసాయిదా మార్చాల్సిందే!
● ఈనెల 8 వరకూ అభ్యంతరాల స్వీకరణనిర్మల్: జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఓటరు ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లే లేకపోవడం, వేరే వార్డులో రావడంపై మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే చేశారంటూ పలు పార్టీల నాయకులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదాలో ఓటర్ల మార్పుపై ఖానాపూర్లో బీఆర్ఎస్, నిర్మల్, భైంసాల్లో బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఐదేళ్లక్రితం జాబితాకు ప్రస్తుత ఓటరులిస్టుకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. మరోవైపు నాయకులు, ఆశావహులతోపాటు సామాన్య ఓటర్లూ తమ వార్డులు మారాయని, ఓట్లు రాలేవని మున్సిపాలిటీల్లో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఎలా మారుతాయంటూ.. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటు ఎక్కడ ఉన్నా.. పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి సంబంధిత వార్డులోనే ఓటు ఉండాలి. అలా లేకపోవడం ఓటరు కన్నా.. పోటీచేసే ఆశావహులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. తమ వార్డులో తమకు తెలిసినవారివి కాకుండా పక్కవార్డులు, గ్రామాల నుంచి ఓటర్లు ఉంటే తమకు ఓట్లు ఎలా వచ్చాయన్నదే వారి వాదన. నిర్మల్, ఖానాపూర్, భైంసాల్లో ముసాయిదాలో ఇదే జరిగింది. పక్క గ్రామాలతోపాటు భైంసాలోనైతే మహారాష్ట్రవాసుల ఓట్లూ ఉన్నట్లు అభ్యంతరాలు వస్తున్నాయి. మార్పులకు సన్నద్ధం.. మూడురోజులుగా ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలతో మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. ఈమేరకు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నారు. కొన్నివార్డుల్లో ఏకంగా వందల్లో ఓట్లు పెరగడం, తగ్గడం, మార్పులు, చేర్పులు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు మార్పులను చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాపై నిర్మల్లో 45, ఖానాపూర్లో 42, భైంసాలో 21 అభ్యంతరాలు వచ్చాయి. ఈనెల 8 వరకూ అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. 9న సరిచూసుకుని, 10న ఫైనల్ జాబితాను ప్రకటిస్తామని పేర్కొంటున్నారు. అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం.. ఓటరు ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. భారీగా అభ్యంతరాలు వస్తున్న వార్డులకు సంబంధించి ఇప్పటికే మార్పులు చేపడుతున్నాం. అభ్యంతరాలను సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ జాబితాలో పొందుపరుస్తాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
మహిళా విద్యకు సావిత్రీబాయి పూలే కృషి
నిర్మల్చైన్గేట్: మహిళా విద్యకు సావిత్రీబాయి పూలే చేసిన సేవలు గొప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే 195వ జయంతిని కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి పూలే అన్నారు. ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే సీ్త్ర ఉన్నతి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించారని వివరించారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారన్నారు. అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలనకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ గోడ ప్రతులు ఆవిష్కరించారు. టీజీఆర్ఎస్జేసీ సోఫీనగర్ విద్యార్థిని శ్రీజ తాను గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించారు. అంతర్జాతీయ ఆస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కేజీవీబీ విద్యార్థిని నక్షత్రను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, బీసీ సంఘం నాయకులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పోలీసులు విధులు మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏఆర్ కన్వర్షన్పై వచ్చిన 2013 బ్యాచ్ 7వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతనంగా నియామకం పొందిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకిత భావం ముఖ్యమన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. -
వ్యవసాయంలో డ్రోన్లపై అవగాహన
సారంగపూర్: మండలంలోని మలక్చించోలి గ్రామంలో ఆకిన్ అనలెటిక్స్ హైదరాబాద్ సేవాస్ఫూర్తి ఫౌండేషన్, జిల్లా వ్యవసాయ శా ఖల ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా పురుగుమందు ల పిచికారిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఆకిన్ అనలెటిక్స్ చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరికరాల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. డ్రోన్ ద్వారా ఎకరా పొలానికి 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో పురుగు మందులు, ఇతర మందులను పిచికారీ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. రైతులు ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మండల వ్యవసాయాధికారి వికార్అహ్మద్, స్థానిక సర్పంచ్ దాసరి విజయ, ఉపసర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యుడు నవీన్ ఉన్నారు. -
ఖనాపూర్లో బీఆర్ఎస్ ఫిర్యాదు
ఖానాపూర్: పట్టణంలోని 12 వార్డుల్లోని బోగస్ ఓట్లను ఏరివేయాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఓటర్లను చేర్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖలీల్, ఖానాపూర్ మాజీ ఉపసర్పంచ్ సుమన్, నాయకులు సుమిత్, ఇర్ఫాన్, సతీశ్, వాహబ్, నసీర్, రవి, సొయబ్, రాజు, కళావతి, నవీన్ ఉన్నారు. -
● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్తూ ‘మెస్రం’ పాదయాత్ర ● గత నెల 30న కేస్లాపూర్లో ప్రారంభం ● హస్తినమడుగు దారిలో 145మంది వంశీయులు
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు. -
● నిర్మల్ చేరిన ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతం ● జాకీలతో భవనం ఎత్తి తరలింపు
లిఫ్టింగ్.. షిఫ్టింగ్! నిర్మల్ఖిల్లా: నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్లో ఓ ఇంటిని కూల్చకుండా 5 అడుగుల ఎత్తుకు లేపుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతుండడంతో యజమాని హర్యానా నుంచి నిపుణులను పిలిపించారు. హైడ్రాలిక్ జాక్లు, స్టీల్ ఫ్రేమ్లతో ఇంటిని లిఫ్ట్చేసే పనులు జరుగుతున్నాయి. భవన పునాదికి జాక్లు అమర్చి మిల్లీమీటర్ స్థాయిలో సమతుల్యత కాపాడుతూ పైకి ఎత్తుతున్నారు. గోడలు, స్తంభాలకు పగుళ్లు రాకుండా పరిశీలిస్తున్నారు. లిఫ్టింగ్లోముందుగా భవన నిర్మాణ బలాన్ని పరీక్షించి, లోపల ఉండే గోడలు, స్తంభాలు, ఫౌండేషన్ సామర్థ్యాన్ని ఇంజనీర్లు విశ్లేషించారు. తర్వాత దశలవారీ ఎత్తడం, షిఫ్టింగ్లో ట్రాక్లపై కదలిక, కొత్త పునాదిపై అమర్చడం, సేఫ్టీ టెస్టులు జరుగుతున్నాయి. పాత భవనాల చారిత్రక విలువను కాపాడుతూ వర్షాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తున్న ఈ సాంకేతికత జిల్లా కేంద్రాల్లోకి చేరడం గొప్ప పరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి పరిష్కారాలు పెరిగే అవకాశం ఉంది. స్థానికులు ‘ఇంటికి ప్రాణం పోసినట్టు‘ అంటూ ప్రశంసిస్తున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు ఇల్లు మునిగిందని, మరో కాలనీలో తలదాచుకోవాల్సి వచ్చిందని యజమాని గుజ్జులవారి కిషన్ తెలిపారు. అందుకే ఐదు అడుగుల ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ.5 లక్షలతో ఇంటిని ఐదు అడుగులు పైకి ఎత్తినట్లు పేర్కొన్నారు. ‘ఏటా వర్షాకాలంలో ఇంట్లోకి వరద వస్తోంది. తమ కూతురు గర్భిణిగా ఉన్న సమయంలో ఇల్లు మునిగింది. అందుకే లిఫ్టింగ్ అవకాశం ఉందని తెలుసుకుని పనులు చేపట్టాం’ అని మరో ఇంటి యజమాని గంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నేడు కోర్టు భవనానికి భూమిపూజ నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు భవన సముదాయం నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. హైకోర్టు జడ్జీలు సృజన, లక్ష్మణ్, నర్సింగ్రావుతోపాటు న్యాయవాదులు కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. -
ప్రమాద రహితమే లక్ష్యంగా..
నిర్మల్టౌన్: దేశంలో డిజిటల్ పురోగతితోపాటు రోడ్లపై వాహనాలు విపరీతంగా పెరిగాయి. ప్రతీ వ్యక్తికి వాహనం అవసరంగా మారింది. కానీ అజా గ్రత్త, అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం తాగి నడపడం, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. 2025లో జిల్లాలో 568 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 154 మంది మరణించారు. 7,908 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. భద్రతా మాసోత్సవాలు ప్రారంభంప్రమాద రహితమే లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జనవరి నెలను భద్రతా మాసంగా ప్రకటించాయి. శుక్రవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మి ల, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ మాసోత్స వ పోస్టర్లు ఆవిష్కరించారు. రవాణా కార్యాలయంలో సిబ్బందితో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 31 వరకు అవగాహన.. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు రవాణా–పోలీస్ శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జిల్లా–మండల కేంద్రాలు, జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నియమాలు, మైనర్లు వాహనాలు నడపటం, డ్రంకెన్ డ్రైవింగ్పై ద్విచక్ర, ఆటో, కారు, లారీ డ్రైవర్లకు జాగ్రత్తలు చెబుతారు. ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు.భద్రత ప్రతీ పౌరుని బాధ్యత రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ప్రతీ వాహనదారుడు, ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సిట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలి. – జానకీషర్మిల, ఎస్పీనిబంధనలు పాటించాలి జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీట్బెల్ట్ పెట్టు కోవాలి. మద్యం తాగి, మొబైల్ మాట్లాడుతూ.. వాహనాలు నడపొద్దు, ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. – దుర్గాప్రసాద్, జిల్లా రవాణా అధికారి -
సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రికి వినతి
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని, సౌకర్యాలు మెరుగుపర్చాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ , జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ ఇంద్రకరణ్ విన్నవించారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మల్, భైంసా పట్టణాలకు మధ్యలో ఉన్న నర్సాపూర్(జి) 61వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను చికిత్స కోసం నిర్మల్, భైంసా ఆస్పత్రులకు తరలించడంతో వైద్యం ఆలస్యమవుతోందని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి, నాయకులు ఉమామహేశ్వర్, అజీమ్, ఫారూక్ పాల్గొన్నారు. -
యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
బాసర: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి అర్హత సాధించారు. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి కేఎల్ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. దేశంలోని ప్రము ఖ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు ఇందులో పా ల్గొంటారు. జాతీయస్థాయికి ఎంపికై న యూనివర్సిటీ జట్టును ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో, స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఇన్చార్జి రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్స్ శ్యాంబాబు, రవికిరణ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వసంత, స్వప్న పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు కేజీబీవీ విద్యార్థి
నిర్మల్ రూరల్: నిర్మల్ అర్బన్ కేజీబీవీ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చాకలి నక్షత్ర కిక్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ఎస్వో సుజాత తెలిపారు. ఖేలో ఇండియా గేమ్స్లో భాగంగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన 65 కిలోల విభాగం పోటీల్లో నక్షత్ర ప్రతిభ కనబర్చి మూడోస్థానంలో నిలిచింది. కాంస్య పతకంతోపాటు రూ.4 వేల నగదు బహుమతి సాధించింది. మార్చి లో తమిళనాడులో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ఎస్వో వివరించారు. ఉపాధ్యాయులు అభినందించారు. -
కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిర్మల్చైన్గేట్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ అభిలాష అభినవ్కు శుక్రవారం పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నోట్ పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్ఛాలు అందించారు. కేక్లు కట్ చేశారు. పలు శాఖల, ఉద్యోగ సంఘాలకు చెందిన డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికా రులు, ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులంతా ఉత్సాహంతో పనిచేస్తూ, జిల్లాను అన్నిరంగాలలో ముందు వరుసలో ఉంచాలన్నారు. కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, టీఎన్జీవో సంఘ నాయకులు, పలువురు మీడియా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వుషూ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
నిర్మల్చైన్గేట్: వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వూషూ ఫెడరేషన్ కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం కలెక్టరేట్లో అభినందించారు. విద్యార్థులకు పతకాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించా రు. విద్యార్థులు నర్వాడే రుద్ర, అబ్దుల్ రహ్మా న్, గోరా ఆనన్య డిసెంబర్ 24 నుంచి30వ తే దీ వరకు ఛత్తీస్గఢ్లో నిర్వహించిన పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముక్కుతున్న దొడ్డు బియ్యం..!
భైంసాటౌన్: ప్రభుత్వం తెల్ల రేషన్కార్డు దారులకు గతేడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు యూనిట్కు ఆరు కిలోల చొప్పున దొడ్డుబియ్యం అందించేది. అయితే, చాలామంది దొడ్డు బియ్యం తినకుండా విక్రయించుకునేవారు. దీంతో బియ్యం రీసైక్లింగ్ అయ్యేది. ఇది గుర్తించిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘పేదోడి కంచంలో సన్న బువ్వ’ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో, ఎంఎల్ఎస్ పాయింట్లలో 364.643 మెట్రిక్ టన్నులు, ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో 4338.431 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. దాదాపు పది నెలలకుపైగా బియ్యం సంచులు గోదాముల్లో నిల్వ ఉండడంతో ముక్కి పోయి బూజు పడుతున్నాయి. ప్రభుత్వం టెండర్ నిర్వహించేందుకు యత్నిస్తోందని, ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్ తెలిపారు. -
రేషన్ దుకాణాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్, విద్యానగర్, భర్కత్పుర్, అంబేడ్కర్నగర్, సుభాష్ నగర్తోపాటు మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన రేషన్ దుకాణాలను టాస్క్ ఫోర్స్ డీఎస్పీ శేఖర్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతీ దుకాణాంలో లైసెన్స్, దుకాణం బోర్డులు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీనెల సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో విధిగా శుభ్రత పాటించాలన్నారు. తనిఖీ సమయంలో మూసిఉన్న డీలర్లను హెచ్చరించారు. పలుచోట్ల 4 నుంచి 6 కిలోల బియ్యం తేడా వచ్చిందని డీలర్లు తెలిపారు. లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకోవద్దని తెలిపారు. ఆయన వెంట ఇన్చార్జి ఎన్ఫోర్స్మెంట్ డీటీ కార్తీక్రెడ్డి ఉన్నారు. -
తప్పుల తడక!
‘మావార్డుకు ఏమాత్రం సంబంధంలేని 125 మంది ఓటర్లు వచ్చారు. వార్డులో ఉండాల్సిన 58 మందిని వేరే వార్డులో వేశారు. ఇలాగైతే ఎలా.. రేపు ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఒకట్రెండు ఓట్లే గెలుపోటములను మార్చేశాయి. అధికారులు అభ్యంతరాలు తీసుకోవడమే కాకుండా పక్కాగా ఓటరు జాబితా ఉండేలా చూడాలి..’ అని జిల్లాకేంద్రంలోని ఓ వార్డు నుంచి పోటీచేసేందుకు సిద్ధమవుతున్న ఓ యువకుడి ఆవేదన. భైంసా పట్టణంలోని నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ చందూలాల్తోపాటు అతని కుటుంబీకులకు చెందిన దాదాపు మరో నాలుగు ఓట్లు ఏడో వార్డులో వేశారు. అంతేగాక, ఇదేవార్డులోని ఏపీనగర్కు చెందిన దాదాపు 292 మంది ఓటర్లను ఏడోవార్డులో వేసినట్లు గుర్తించారు. ఓవైసీనగర్, రాజీవ్నగర్, సుభాష్నగర్, శాస్త్రినగర్ కాలనీల ఓట్లు నాలుగోవార్డులో వేశారు. ఇదే వార్డులో నిజామాబాద్కు చెందిన అఫ్రోజ్ అనే ఓటరు పేరు ఉండడం విశేషం. కుంటాల మండలం ఓల, ముధోల్, టాక్లి, బీర్నంది, సోనాల, దేగాం, వాలేగాం, హథ్గాం గ్రామాల ఓటర్లు సైతం ఉన్నారు. ఏడో వార్డులో 1437 ఓట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 ఓట్లు వేరే వార్డుల ఓట్లు ఉన్నట్లు ఆ వార్డు మాజీ కౌన్సిలర్ అనిత బాలాజీ తెలిపారు. నిర్మల్/భైంసాటౌన్: మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా తప్పులతడకగా నెలకొంది. ఓ వార్డులోని ఓటర్లు మరో వార్డులో రాగా, కొన్ని వార్డుల్లో ఓ కాలనీకి చెందిన మొత్తం ఓట్లు వేరే వార్డులో పొందుపర్చినట్లు గుర్తించారు. ఇక, ఏకంగా ఇతర జిల్లా, ఇతర మున్సిపాలిటీల ఓటర్లు భైంసా పట్టణ ఓటరు ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. నిర్మల్, ఖా నాపూర్, భైంసా బల్దియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం తమవార్డులో ఉన్న ఓటర్లూ ఇతర వార్డులకు మార్చడంపై గల్లీనేతలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తమవార్డులకు సంబంధించి ఓటరు జాబితాలను చేతపట్టుకుని కూర్చున్నారు. జాబితాల్లో ఫొటోలు లేకపోవడంతో ఒక్కో ఓటరు పేరును సరిచూస్తున్నారు. అభ్యంతరం వ్యక్తంచేయాల్సిన వాటిని రాసి పెట్టుకుంటున్నారు. భారీగా మార్పులు, చేర్పులు..మున్సిపల్ ఓటరు ముసాయిదాల్లో మార్పులు చూ సి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐదేళ్లలో జాబితానే మారిపోయిందంటూ ఆరోపిస్తున్నారు. జాబితాలు చేతబట్టి..మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ జాబితా ముసాయిదా విడుదల కావడమే ఆలస్యం.. పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ వార్డుల్లో ఉన్న ఓటర్ల పేర్లను గాలిస్తున్నారు. చాలా వార్డుల్లో పాత ఓటర్లు మారడం, కొత్త ఓటర్లు చేరడంతో కంగారు పడుతున్నారు. మార్పులు చేయాలంటూ అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 4 వరకే అంటే.. కేవలం రెండురోజులే ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు ఉండడంతో ఆశావహులు తమ అనుచరులందరికీ ఓటరు జాబితాల కాపీలను అప్పగించారు. ఒకటికి రెండుసార్లు సరిచూడటం, ఓటర్ల మార్పులను గుర్తించడం వంటి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. తాము అనుకున్న దానికి భిన్నంగా ఓటరు ముసాయిదా రావడంతో ఖంగుతిన్న ఆశావహులు జాబితాలో మార్పులకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఓటర్లూ చూసుకుంటున్నారు..తమ ఓటు ఏ గల్లీలో వచ్చిందోనని.. సాధారణ ఓటర్లూ ముసాయిదాను చెక్ చేసుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాల ముసాయిదాలను అందుబాటులో ఉంచారు. అక్కడ నేతలు, ఆశావహులతో పాటు సాధారణ ప్రజలూ వచ్చి తమ ఓటు ఉందా..లేదా.. అని గాలిస్తున్నారు. వార్డుల్లో మార్పులు, జాబితాలో పేర్లు లేకపోవడం తదితర విషయాలపై అభ్యంతరాలు తెలిపేందుకు వారూ సిద్ధమవుతున్నారు.బల్దియా ఓటర్లు.. 1,67,106జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటరు జాబితాల ముసాయిదాలను ఆయా మున్సిపల్ కమిషనర్లు విడుదల చేశా రు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డుల్లో 98,295 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 50,878, పురుషులు 47,399, ఇతరులు 18మంది ఉన్నారు. భైంసాలో 26 వా ర్డుల్లో మొత్తం 51,118 మంది ఓటర్లలో మహిళలు 25,623, పురుషులు 25,486, ఇతరులు 9 మంది ఉన్నారు. ఖానాపూర్లో 12 వార్డుల్లో 17,693 మంది ఓటర్లుగానూ మహిళలు 9,169, పురుషులు 8,524 మంది ఓటర్లు ఉన్నారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి 1,67,106 మంది ఓటర్లు ఉన్నారు. -
నాణ్యమైన వైద్యం అందించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఏడాదిగా జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందించిన వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలు, ఇతర సదుపాయాలు, ఆస్పత్రుల్లో కల్పించిన మౌలిక వసతులపై సమీక్షించారు. అనంతరం జిల్లా వైద్యకళాశాలపై క లెక్టర్ సమీక్ష నిర్వహించారు. వైద్యకళాశాలలో మొ దటి సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మెరుగైన బోధన అందిస్తూ ఇలాంటి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రజల కోసం వారి నివాస ప్రాంతాల్లోనే క్షయ వ్యాధిని గుర్తించే పోర్టబుల్ ఎక్స్రే యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. యంత్రం పనితీరును అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధికారులు గోపాల్సింగ్, సరోజ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం’ మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 1న సంబంధిత నోటీసు బోర్డులపై ప్రచురించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలుంటే నిబంధనల ప్రకారం సకాలంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులకు తెలుపాలని సూచించారు. వారి ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించా లని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యా ణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, వివిధ పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రావణ్రెడ్డి, అజంబిన్ యహీయా, రాము, సయ్యద్ హైదర్, నాందేడపు చిన్ను, భరత్విజయ్, మజార్, వినోద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తదనం కనిపించాలె..
నిర్మల్: 2026.. కొత్తసంవత్సరం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త లక్ష్యాలు. కాలగమనంలో ఇలా ఎన్నో ఆంగ్ల సంవత్సరాలు మారినా.. ప్రతీసారి నయాసాల్ అంటే తెలియని ఉత్సాహం.. ఈ ఏడాదిలో కొత్తగా ఏదో సాధించేయాలన్న ఆరాటం.. ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అలాగే మన జిల్లాలోనూ మార్పులు తీసుకురావాలన్న ఆశలు కూడా అందరికీ ఉన్నట్లే పాలకులు, అధికారులకూ ఉంటాయి. జిల్లాను అన్నిరంగాల్లో సమప్రాధాన్యతతో అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. కొత్త ఏడాదిలో జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమూ ఉంది. గతేడాదిలో కొన్నిరంగాల్లో దూసుకెళ్తే.. మరికొన్నింట్లో అంతంత మాత్రంగానే అభివృద్ధి కనిపించింది. గత లోపాలను అధిగమించి పురోభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఏడాదిలో ఇటీవలే గెలిచిన సర్పంచులతో పాటు స్థానిక సంస్థలకూ కొత్తపాలకవర్గాలు రానున్నాయి. ఈనేపథ్యంలో 2026లో జిల్లా కొత్తదనంతో ఉత్సాహంగా ముందుకు సాగాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధికి అనుకూలం జిల్లాలో అభివృద్ధికి కావాల్సిన సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్–నాగ్పూర్ ప్రధా న మార్గమైన ఎన్హెచ్–44, మరోవైపు మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి పలు ప్రధాన నగరాల నుంచి జిల్లా మీదుగా జగిత్యాలవైపు వెళ్తున్న ఎన్హెచ్–61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణా విషయంలో ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బంది లేని, అలాగే అభివృద్ధికి ఉపయుక్తంగా ఉండే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సి న అవసరముందన్న వాదన కూడా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జిల్లా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధిస్తోంది. ఎప్పటి నుంచో ఆశిస్తున్న యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీలను జిల్లాకు తీసుకురావాల్సిన అవసరముంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలనూ జిల్లాకు తీసుకువస్తే ఉపాధి, ఉత్పత్తి పెరిగి రైతులకు మరింత లాభసాటిగా మారుతుంది. వేగం పెరగాలి బాసర నుంచి కడెం దాకా మొత్తం 19మండలాలతో నిర్మల్ జిల్లాగా ఏర్పడి పదేళ్లు కావస్తోంది. ఇప్పటి దాకా జిల్లా సాధించింది కొంతే. గతేడాదిలో పలు శాఖలు జాతీయస్థాయిలో జిల్లా అవార్డులు అందుకున్నా.. ఇంకా చాలారంగాల్లో పురోగతి అవసరం. కొత్త ఏడాదిలో అభివృద్ధిలో మరింత వేగం పుంజుకోవాలని జిల్లావాసులు ఆశిస్తున్నారు. మా రుమూల తండాలు, గూడేలకూ అభివృద్ధి ఫలాలు చేరాలి. ఇప్పటికీ జిల్లాలోని కడెం, పెంబి, ఖానాపూర్, సారంగపూర్, మామడ తదితర మండలాల్లోని గుట్ట, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలు, తండాలు, గూడేలకు సరైన రోడ్డుమార్గాలు లేవు. చాలావరకు ఆదివాసీ గూడేల్లో కరెంట్ కూడా లేదన్న విషయాన్ని గుర్తించి, వారికి విద్యుత్ వెలుగులు అందించాల్సిన అవసరముంది. ఈ కొత్త సంవత్సరంలో సదర్మాట్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపట్టిన ప్యాకేజీల పనులను ఈ ఏడాదిలోనైనా వేగంగా పూర్తి చేసి, రైతాంగానికి మరింత దన్నుగా నిలవాలి. మనదైన ముద్ర ఉండాలి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు మార్మోగాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో రాజకీ య కేంద్రంగా ఉన్న నిర్మల్ ఇక ముందు రాష్ట్రస్థాయిలో తన పేరును చాటుకోవాలని జిల్లావాసులు తపిస్తున్నారు. ప్రధానంగా క్రీడారంగంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగ గల క్రీడాకారులున్నా వారికి ప్రోత్సాహం కరువైంది. సరైన వసతులు లేక ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి రాలేక ఆగిపోతున్నారు. నత్తనడకలో సాగుతున్న మినీస్టేడియాలను కొత్త ఏడాదిలో ప్రారంభించి క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో వందశాతం అందేలా చూడాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. ఇలా అన్ని రంగాల్లో.. అన్ని అంశాల్లో జిల్లా మేటిగా నిలవాలని ఆశిస్తున్నారు. ఇందుకు 2026 నుంచే ఆరంభం కావాలని ఆకాంక్షిస్తూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. పర్యాటకంపై దృష్టి పెట్టాలి ఓరుగల్లును తలపించే నిర్మల్ గఢ్లు, రాంజీగోండు, గౌతమ బుద్ధుని శిష్యుల అడుగులు, మైమరిపించే కడెం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలు, బాసర మొదలుకుని ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు.. ఇలా పర్యాటక, చారిత్రక సొబగులను తనలో ఇముడ్చుకున్న జిల్లా మనది. దశాబ్దాల నాటి కట్టడాలు, అప్పటి నిర్మాణాలకు కొదవలేదిక్కడ. కేవలం ఉన్నవాటిని మెరుగులద్దుకుని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. గతంలో ప్రయత్నాలు చేసినా.. అవి మధ్యలోనే నిలిచిపోయాయి. కళ్లముందున్న ప్రకృతి అందాలు, కట్టడాలను అభివృద్ధి చేయాలని జిల్లావాసులు ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇక ఈ కొత్త ఏడాదిలోనైనా జిల్లాలో పర్యాటక శోభ విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. -
సంక్రాంతికి ‘భరోసా’!
నిర్మల్చైన్గేట్: జిల్లా రైతులకు రేవంత్రెడ్డి సర్కారు సంక్రాంతి కానుక ప్రకటించబోతోంది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయాలని ని ర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫ లితాలతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం.. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఈ సాయాన్ని సకాలంలో అందించి సానుకూలతను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఎన్నికల హామీ ఏమైంది? రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులకు అండగా నిలిచింది. ఎకరా కు రూ.6వేల చొప్పున రెండు పంటలకు రూ.12వే ల పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. గత అ సెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఒ క్కో సీజన్కు ఎకరాకు రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.6వేలే ఇస్తోంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు ఎటూ సరిపోవడం లేదు. ఈ ఖరీఫ్లో తొలుత ఎకరంలోపు ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడు, నాలుగు, ఐదు ఆపైనా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది. పెట్టుబడి సాయం అందడంతో రైతులు ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అధిక వ ర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయా రు. ఈసారి రబీ ఆదుకుంటుందని గంపెడాశతో ఉన్నారు. ఖరీఫ్లో పంటలు దెబ్బతిన్న కారణంగా చేతిలో చిల్లి గవ్వలేక పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తే అప్పుల బాధ ఉండదని అభిప్రాయపడుతున్నారు. జిల్లా రైతులకు రూ.268.85కోట్లు! జిల్లాలో 1,88,597 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హుత కలిగి ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం కింద సుమారు రూ.268. 85 కోట్లు అవసరం ఉంది. ప్రభుత్వం ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సాగులో ఉన్న భూములను కచ్చితంగా గుర్తించేందుకు వ్యవసాయశాఖ శాటిలైట్ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సర్వే విజయవంతమైంది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు సాగు వివరాలు సేకరిస్తున్నారు. గతేడాది యాసంగి మాదిరిగానే ఈసారి కూడా అదే విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, సాగు లెక్కలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ సంక్రాంతిలోపే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఖరీఫ్ రైతు భరోసా వివరాలు మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము భైంసా 15,721 రూ.26,52,87,944 కుభీర్ 18,306 రూ.30,52,16,087 కుంటాల 8,186 రూ.13,18,81,741 దస్తూరాబాద్ 5,385 రూ.5,79,71,675 కడెం 11,750 రూ.14,24,94,612 ఖానాపూర్ 9,721 రూ.10,04,45,998 పెంబి 6,032 రూ.9,47,66,837 బాసర 6,793 రూ.11,35,78,013 లోకేశ్వరం 12,772 రూ.17,11,59,230 ముధోల్ 12,499 రూ.20,70,79,416 తానూర్ 15,588 రూ.26,40,92,246 దిలావర్పూర్ 6,962 రూ.9,28,60,943 నర్సాపూర్ (జీ) 7,487 రూ.10,23,01,284 సోన్ 7,577 రూ.8,55,12,709 లక్ష్మణచాంద 9,066 రూ.9,95,38,344 మామడ 10,947 రూ.14,80,91,078 నిర్మల్ రూరల్ 9,119 రూ.9,85,59,549 నిర్మల్ అర్బన్ 561 రూ.42,57,472 -
వుషూ పోటీల్లో ప్రతిభ
భైంసాటౌన్: ఛత్తీస్గఢ్లో వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 24నుంచి 30వరకు నిర్వహించిన తొమ్మిదో జాతీయస్థాయి వుషూ పోటీల్లో జిల్లాలోని ఖేలో ఇండియా వుషూ కేంద్రం క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియ ర్ వుషూ ఫెడరేషన్ కప్ పోటీల్లో 12మంది పా ల్గొన్నారు. వీరిలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, గోరా అనన్య కాంస్య పతకాలు సాధించారు. వీరు వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహైల్ అహ్మద్ చేతుల మీదుగా అందుకున్నట్లు వుషూ ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం భైంసా ముఖ్య శిక్షకుడు శ్రీరాముల సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. -
న్యూ జోష్..
ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం అంటూ.. జనం బుధవారం అర్ధరాత్రి నుంచే కేక్లు కట్ చేశారు. పాత ఏడాది ముగింపు వేళ వీడ్కోలు పార్టీలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన హోటళ్లు, ప్రధాన రహదారి వెంట స్టాళ్లు ఏర్పాటు చేసి రాత్రి వరకు నాన్వెజ్ స్నాక్స్, కేక్లు విక్రయించగా జనం ఎగబడి కొనుగోలు చేశారు. మద్యం ప్రియులతో వైన్స్షాపులు, బార్లు కిటకిటలాడాయి. చాలాచోట్ల డీజే పాటలు పెట్టుకుని పిల్లలు, యువత డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు పటాకులు కాల్చుతూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ.. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం కేక్లు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మరోవైపు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. – నిర్మల్టౌన్ -
ఆందోళన విరమణ
భైంసాటౌన్: పన్నెండు రోజులుగా ఆందోళన చేపట్టిన భైంసా మున్సిపల్ కార్మికులు బుధవారం విరమించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కారానికి ఆమె హామీ ఇచ్చారు. జనవరి 1నుంచి మార్చి వరకు నెల కు రూ.2వేలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశా రు. ఏప్రిల్ 1నుంచి జీవో ప్రకారం వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని భైంసా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ అధికారులు కార్మికులకు ఉత్తర్వుల ప్రతి అందించారు. ఈ మేరకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆందోళన విరమించారు. -
అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యం
గతేడాది పోలీసక్క, నారీశక్తి, టీమ్ శివంగి, గాంజాగస్తీలు చేపట్టాం. ఈ ఏడాదిలో ప్రధానంగా యువత పక్కదోవ పట్టకుండా ప్రత్యేక దృష్టి పెడతాం. గతేడాదిలో గంజాయి, మత్తుమందులపై సీరియస్గా వ్యవహరించాం. పెద్దమొత్తంలో గంజాయి పట్టుకోవడంతో పాటు మత్తుమందు ముఠాలనూ అరెస్ట్ చేశాం. డ్రగ్స్ తీసుకుని యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రాణాలూ తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. గాంజాగస్తీ ద్వారా యువత భవిష్యత్ను కాపాడాలన్న లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోంది. డ్రంకెన్ డ్రైవ్పై సీరియస్ డ్రంకెన్ డ్రైవ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై సీరియస్గా దృష్టిపెడతాం. నిండు జీవితాలను నిలబెట్టేందుకు నిర్మల్ పోలీస్–మీపోలీస్ పేరిట మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. శాంతిభద్రతలతో పాటు సైబర్, సామాజిక నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రజాభద్రతపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా కృషిచేస్తాం. గతేడాది బాలశక్తి, అ మ్మరక్షిత లాంటి వినూత్న కార్యక్రమాలను వి జయవంత చేశాం. జిల్లాకు జాతీయస్థాయిలో పేరురావడం సంతోషాన్నిచ్చింది. వివిధ రంగాల్లోనూ సాధించిన ప్రగతితో జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నాం. 2026 సంవత్స రంలోనూ కొత్త కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి అన్ని రకాల పాటుపడతాం. ఈ ఏడాది వీటిపై ప్రత్యేకదృష్టి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ఈ ఏడాది వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. యువ త, విద్యార్థులకు కావాల్సి న క్రీడాభివృద్ధిలో భాగంగా కొత్త కార్యక్రమాలు, సైక్లింగ్ ర్యాలీ, టెన్నిస్కో ర్టులు ఏర్పాటు చేస్తాం. జిల్లాలో గతేడాది విజయవంతంగా నిర్వర్తించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ జనవరిలోనే నిర్వహిస్తాం. జి ల్లాకేంద్రాన్ని సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ జిల్లావాసుల సహకారం ఉండాలని కోరుతున్నాం. జిల్లావాసులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. కొత్తసంవత్సరం నేపథ్యంలో వారు ‘సాక్షి’తో ముచ్చటించారు. 2026లో చేపట్టనున్న పనులు, అనుకుంటున్న లక్ష్యాలు వారి మాటల్లోనే..అభిలాష అభినవ్, కలెక్టర్ -
సదర్మాట్ త్వరగా పూర్తిచేయాలి
మామడ: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆ దేశించారు. పొన్కల్ గోదావరి వద్ద బ్యారేజీ పనులను మంగళవారం తనిఖీ చేశారు. నిర్మాణ పనుల వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. మిగిలి ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యారేజీ విని యోగంలోకి వస్తే 18 వేల ఎకరాలకు సాగునీ రు అందుతుందని తెలిపారు. ఆయకట్టు రైతులకు అధికారులు బ్యారేజీ నిర్మాణం, ఆయక ట్టు వివరాలను మ్యాపుల ద్వారా వివరించా రు. స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో సుశీల్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ఫేర్
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ మానక్ పోటీలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి హాజరై విజేతలకు, రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు వచ్చే నెల 7, 8 తేదీలలో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో డీఈవో భోజన్న, సెక్టోరియల్ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ విభాగంలో రాష్ట్రస్థాయికి.. కులకర్ణి అరుణవ్(9వ, అల్ఫోర్స్ హైస్కూల్, నిర్మల్ ), రాథోడ్ కీర్తన (6వ, వాసవి హైస్కూల్, భైంసా), బైరి హర్షిక (9వ, పాత మద్దిపడగ హైస్కూల్ ), వంశీకృష్ణ (9వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), జి.సునీత (9వ, ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల), పి.వంశీకృష్ణ (10వ, జెడ్పీహెచ్ఎస్, కోర్టికల్ బి), పల్లవి (7వ, జెడ్పీహెచ్ఎస్, బోసి), అశ్వంత్(9వ, జెడ్పీహెచ్ఎస్ బోసి), సంజీవని(7వ, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, నిర్మల్), కావేరి(8వ, జెడ్పీహెచ్ఎస్, కోతులుగాం), జోహార్ అంజుమ్(10వ, ప్రిన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, నిర్మల్), రక్షిత( 9వ, జెడ్పీహెచ్ఎస్, బీరవెల్లి) సెన్స్ఫేర్ పోటీల విజేతలు వీరే.. సీనియర్స్ విభాగంలో.. ఏ.రవి (10వ, జెడ్పీహెచ్ఎస్ పీచర), రామ్చరణ్ (10వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), హర్ష మహేంద్ర(10వ, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్), విజయ్కుమార్(9వ జెడ్పీహెచ్ఎస్, వడ్యాల్), కె.నాగశ్రీ(8వ, ముధోల్ ఎంజేపీ), దివ్య(10వ, కుంటాల ఆదర్శ పాఠశాల), ముసిఫిరా మిరాజ్ (9వసెయింట్ థామస్ హైస్కూల్ నిర్మల్). జూనియర్స్ విభాగంలో.. అతిశయ (7వ, రవి హైస్కూల్ నిర్మల్ ), యశ్వంత్ (7వ, జెడ్పీహెచ్ఎస్, ముజిగి), షేక్ జయాన్ (8వ, హీరా మోడల్ స్కూల్ నిర్మల్), హసీబుద్దీన్ (8వ, వాసవి హైస్కూల్ నిర్మల్), జునేరా అంజుమ్(8వ, కుంటాల ఆదర్శ పాఠశాల), మదీనా(8వ, మొహమ్మద్ మహమ్మదీయ హైస్కూల్ నిర్మల్), శ్రేయ (8వ, సోఫీనగర్ గురుకుల పాఠశాల). -
పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు
నిర్మల్/నిర్మల్టౌన్: జిల్లాలో గతేడాదితో పోలిస్తే 2025లో నేరాలు తగ్గినా కేసుల సంఖ్య మాత్రం పెరిగింది. ఈఏడాది రోడ్లు రక్తంతో తడిసిపోయాయి. గాంజాగస్తీ పేరిట చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఇక పట్టపగలే చైన్స్నాచింగ్లు, చోరీలు జిల్లావాసులను కలవరపెట్టాయి. ఈఏడాది దొంగతనాలు భారీగా పెరిగాయి. చోరీ అయిన ఫోన్లను మాత్రం భారీగా పట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. నెత్తురోడిన రోడ్లు.. ఈఏడాది జిల్లా రహదారులు రక్తమోడాయి. గతేడాది మొత్తం 390 ప్రమాదాల్లో 133 మంది చనిపోయారు. 2025లో ఏకంగా 568 రోడ్డుప్రమాదాలు జరిగాయి. అందులో ఏకంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మద్యం తాగి వాహనాలను నడపడంతో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 3,606 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, ఈఏడాది ఏకంగా 7,908 కేసులు నమోదుచేశారు. ప్రాణాలు కాపాడిన డయల్–100.. డయల్–100కు స్పందన పెరుగుతోంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ఈ సంవత్సరంలో మొత్తం 22,327 డయల్–100 కాల్స్ స్వీకరించారు. బాసర గోదావరి నది, జిల్లాకేంద్రంలోని చెరువుల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన చాలామందిని డయల్–100ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు రక్షించారు. సైబర్క్రైమ్పై అవగాహన.. ఈక్రమంలో 2023లో సైబర్ మోసాలపై 17 కేసులు కాగా, 2024లో 49 అయ్యాయి. ఈఏడాది 52కు పెరిగాయి. మాయమాటలతో ఈ కేసులన్నిటినీ కలి పి ఏకంగా రూ.3,90,93,168 కొట్టేశారు. ఇందులో కేసులు నమోదైన తర్వాత పోలీస్ శాఖ బ్యాంకర్ల సహకారంతో రూ.81,82,678 ఫ్రీజ్ చేయించారు. బాధితులకు రూ.30,27,035 తిరిగి ఇప్పించారు. కలవర పెట్టిన చైన్స్నాచింగ్లు, చోరీలు 2024, 2025లలో నమోదైన కేసుల వివరాలు.. కేసులు 2024 2025 మర్డర్లు 16 14 దొంగతనాలు 466 517 రేప్ కేసులు 39 41 కిడ్నాప్ కేసులు 34 41 అట్రాసిటీ 40 22 డ్రంక్ అండ్ డ్రైవ్ 3,606 7,908 రోడ్డుప్రమాదాలు 390 568 సైబర్ క్రైమ్ 49 52 ఆపరేషన్ స్మైల్ 136 123 సీఈఐఆర్ 1,081 1,806 ఈ–చలాన్ 1,47,968 1,80,429 జీవితఖైదు 07 02 -
ఆర్జీయూకేటీలో అవగాహన సదస్సు
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) కరీంనగర్ విస్తరణ కేంద్రం సంయుక్తంగా ‘క్రాఫ్టింగ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్సెట్’ అనే అంశంతో అవగాహన సదసుస మంగళవారం నిర్వహించాయి. భారత ప్రభుత్వ ఎంఎస్ఎఈ మంత్రిత్వ శాఖ, డెవలప్మెంట్ కమిషనర్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్వయం ఉపాధి, ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలపై దృష్టి సారించింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ వ్యవస్థ, స్టార్టప్లకు అందే నిధులు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు, సాంకేతిక సహాయం, మార్కెట్ అవకాశాల గురించి వివరించారు. పోటీతత్వ ప్రపంచంలో విజయం కోసం రిస్క్ తీసుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని తెలిపారు. వైస్ ఛాన్స్లర్ ప్రోత్సాహం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులను ఉద్యోగ శోధకుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మర్చడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు అనుగుణంగా వ్యవస్థాపకతను అవలంబించాలని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఓఎస్డీ ప్రొఫెస్ మురళీదర్శన్ మాట్లాడుతూ విద్యా–పరిశ్రమల మధ్య అంతరాన్ని తణ్ణుపెట్టడంలో ఇటువంటి సహకారాలు కీలకమని ఉద్ఘాటించారు. సంస్థ స్థాపన, మూలధన సేకరణ, పారిశ్రామిక అనుభవాలపై దృష్టి సారించాలన్నారు. అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) డాక్టర్ కె.మహేశ్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎస్.విఠల్ (అసోసియేట్ డీన్, సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్), శేఖర్ శీలం (అసోసియేట్ డీన్, అకడమిక్స్), చరణ్ రెడ్డి (మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్), రాహుల్ అన్పత్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీ పోల్లో ఓటరు జాబితా
● ఎస్ఈసీ రాణి కుముదిని నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన టీ పోల్ నుంచి ఓటరు జాబితా డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇందులో పాల్గొన్నారు. టీ పోల్ నుంచి ఓటర్ జాబితా డౌన్ లోడ్ చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా రు. అనుమానాలు నివృత్తి చేశారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులు సహాయం చేస్తారన్నారు. ఈ జాబితా ఆధారంగా వార్డుల వారీగా కొత్త జాబితా సిద్ధం చేయాలన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా డ్రా ఫ్ట్ పబ్లికేషన్ చేసేందుకు పనులు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్ పాల్గొన్నారు. -
ఎయిర్ ప్యూరిఫయర్ టవర్
మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. దీనితో జీవరాశికి, పర్యావరణానికి హాని కలుగుతోంది. ఓజోన్ పొర సైతం దెబ్బ తింటుంది. ఈ గాలి కాలుష్యం ఎక్కువగా వాహనాల కారణంగా ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి ఎయిర్ ప్యూరిఫయర్ టవర్ తయారు చేశారు. దీనిని ఎక్కువగా వాహనాలు తిరిగే ప్రదేశాలైన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లేదా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం తగ్గించవచ్చు. ఓ అట్టముక్క, ఫైల్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, బ్యాటరీ, ఫిల్టర్ కాటన్, కొబ్బరి పీచు తదితర పరికరాలతో దీనిని తయారు చేసి వివరించారు. – వైష్ణవి,( జడ్పీహెచ్ఎస్ ముధోల్) -
ముక్కోటికి ముస్తాబు
నిర్మల్టౌన్: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం ఉపవాసం ఉండి లక్ష్మీసమేతుడైన మహావిష్ణువుని భక్తితో పూజించి, రాత్రి జాగరణ చేస్తారు. ఈ మేరకు ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు, దేవాలయాలకు విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. టెంట్లు వేసి మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 450 ఏళ్ల నాటి చారిత్రక దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆల య కమిటీ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి తులసి అర్చన వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పూర్తి.. ఏటా ధనుర్మాసం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ నాథుడి దర్శనానికి భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లను చేశాం. వైకుంఠ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. –ఆమెడ శ్రీనివాస్, దేవరకోట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ -
నిర్మల్
స్వీయ జాగ్రత్తలే రక్షఅర్జీలు త్వరగా పరిష్కరించాలి నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కిశోర్కుమార్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లా శాఖలకు సంబంధించి నూతనంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, యాక్టివేట్ చేసిన నూతన బ్యాంకు ఖాతాలను ఎల్డీఎం.రామ్గోపాల్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశ్న: ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా? – వెంకన్న, కుభీర్ డీఎంహెచ్వో: అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. పీహెచ్సీలు, సీహెచ్సీలలో వైద్యులను సంప్రదించి వైద్య సహాయం పొందవచ్చు. జీజీహెచ్లోనూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. నిర్మల్చైన్గేట్: ‘జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే సీజనల్ వ్యాధులబారినపడే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే చలి నుంచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు’ అని డీఎంహెచ్వో రాజేందర్ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్లో ప్రజల సందేహాలు నివృత్తి చేశారు. ప్రశ్న: చలికాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సోమేష్, నిర్మల్ డీఎంహెచ్వో: పిల్లల్లో చలి, వేడిని తట్టుకునే శక్తి తక్కువ. చలిలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. స్వెట్టర్లు వాడాలి. జలుబు, దగ్గు వంటివి వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయొద్దు. ప్రశ్న: వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సయ్యద్ ఖలీమ్, చాక్పల్లి డీఎంహెచ్వో: చలి, మంచు తగ్గేవరకు వృద్ధులు బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రొటీన్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. స్వెట్జర్లు, దుప్పట్లు వినియోగించాలి. ఇప్పటికే ఏదేని జబ్బుకు సంబంధించి మందులు వాడుతుంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి. ప్రశ్న: జలుగు, దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదు? – సురేశ్, కాల్వ డీఎంహెచ్వో: వాతావరణ పరిస్థితులు, చల్ల గాలులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్తో కూడా తగ్గడం ఆలస్యమవుతుంది. రోజుల తరబడి తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. ప్రశ్న: గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి? – రాజేశ్వర్, లక్ష్మణచాంద డీఎంహెచ్వో: పీహెచ్సీలు, సబ్ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ప్రశ్న: ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాజేశ్వర్, కుభీర్ డీఎంహెచ్వో: ఆస్తమా రోగులు చలిలో బయటకు రావొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రశ్న: చలికాలం ఏ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి? – అరుణ్, పెంబి డీఎంహెచ్వో: చలికాలం ప్రతీఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యేకంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ప్రశ్న: ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – విశాల్, భాగ్యనగర్ డీఎంహెచ్వో: వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి, కూల్ డ్రింక్స్, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్థాలు తీసుకోవాలి. ప్రశ్న: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? – వినోద్, కాండ్లీ డీఎంహెచ్వో: ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం అన్ని పీహెచ్సీలలో వైద్యులు ఉన్నారు. మందుల కొరత లేదు. సీజనల్ వ్యాధులకు మంచి వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్న: ఆరోగ్యం రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – సాయి, కౌట్ల డీఎంహెచ్వో: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. చల్లగాలిలో తిరగొద్దు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. తల, చెవి భాగాలు మఫ్లర్తో కప్పి ఉంచాలి. -
మిమిక్రీలో ప్రతిభ
లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండలం రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులు మిమిక్రీ పోటీల్లో ప్రతిభ కనబ ర్చారు. తెలంగాణ గురుకులాల సొసైటీ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేరెళ్ల మాధవ్ జ్ఞాపకార్థం హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పోటీలు నిర్వహించారు. ఇందులో రాచాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు అక్షయ్, శివకృష్ణ పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. వీరికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు నాగరాజు పాల్గొన్నారు. -
అవసరం మేరకు యూరియా అందించాలి
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో ప్రతీ రైతుకు పంటకు సరిపడా యూరియా తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, పంపిణీలో ఇబ్బందులు ఉండకూడదన్నారు. యూరియా బుకింగ్ కోసం, ఫర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా పంపిణీలో ఇబ్బందులు ఉంటే రాష్ట్రస్థాయి హెల్ప్లైన్ నంబర్ 18005995779 ను సంప్రదించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని తెలిపారు. అందుబాటులో ఉన్న యూరియా మొత్తాన్ని, రైతుల అవసరాల మేరకు పంపిణీ చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన అధికారి రమణ పాల్గొన్నారు. -
కొత్త ఆవిష్కరణలు చేయాలి
నిర్మల్ రూరల్: కొత్తకొత్త ఆవిష్కరణ చేస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు(సైన్స్ఫేర్)ను డీఈవో భోజన్నతో కలిసి ప్రారంభించారు. సైన్స్ మన జీవితంలో భాగం అన్నారు. సైన్స్ వెనక సైంటిఫిక్ సూత్రం దాగిఉందన్నారు. వీటిని విద్యార్థులు గ్రహించి వినియోగించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విద్యార్థులు దైనందిక జీవితంలో చేసే అంశాలపై ఆలోచన చేయాలన్నా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రయోగం వై పు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. డీఈ వో భోజన్న మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆలో చన విధానం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు. సైన్స్ఫేర్కు మొత్తం 843 ప్రదర్శనలు వచ్చాయన్నారు. ఇందులో 724 సైన్స్ ఫెయిర్ , 119 ఇన్స్పైర్కు వచ్చాయి. అనంతరం అదనపు కలెక్టర్, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రారంభంలో సోఫీనగర్ గురుకులం, నిర్మల్ కేజీబీ వీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి, జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వాటర్ వీల్తో విద్యుత్ ఉత్పత్తి
గతిశక్తి సహాయంతో కరెంటు ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న కరెంటు గ్రిడ్లలో తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేసే విధానం ఆకట్టుకుంది. డీసీఎం, మోటార్ వాటర్ పంప్, ఎల్ఈడీ లైట్ పరికరాలతో కరెంటు ఉత్పత్తి చేసే విధానం వివరించారు. ఈ విధానం ద్వారా గృహ అవసరాల కోసం, పంట పొలాలు, చిన్నచిన్న కమ్యూనిటీలకు నీరు అందించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ ద్వారా గతిశక్తి ప్రయోగంతో విద్యుత్ తయారవుతుంది. – సాయిచరణ్, విఘ్నేష్(10వ తరగతి, మంజులాపూర్ హైస్కూల్) -
కిక్బాక్సింగ్లో మెరిసిన విద్యార్థిని
మామడ: చదువుతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాలు పెంచుకుని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన రేఖ–రమేశ్ దంపతుల కూతురు నక్షత్ర. జిల్లా కేంద్రంలోని కస్తూరి బాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కిక్బాక్సింగ్లో ప్రత్యేకంగా రాణిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శనివారం జరిగిన ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ వెస్ట్జోనల్ విభాగంలో మూడోస్థానంలో నిలిచి పతకం సాధించింది. 2024లో జార్కంఢ్, 2025లో మహారాష్ట్రలోని పూణేలో జరిగిన పోటీల్లో ప్రశంసాపత్రం అందుకుంది. ఖేలో ఇండియా పోటీల్లో బంగారు పతకం సాధించింది. దిలావర్పూర్ కేజీబీవీ విద్యార్థిని..దిలావర్పూర్: దిలావర్పూర్ కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.అక్షయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండో స్థానింలో నిలిచి వెండి పతకం గెలుచింది. ఎస్వో అపర్ణ అక్షయను అభినందించారు. -
డీ–28 మరమ్మతులకు వినతి
ఖానాపూర్: మండలంలోని రాజూరా, బావాపూర్(ఆర్), సింగాపూర్ గ్రామాల పరిధిలో సరస్వతి కాలువ డిస్టిబ్యూటరీ–28కు మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ జలసౌధలో చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్కు విన్నవించారు. ఆయా గ్రామాల నాయకులు సీఈని సోమవారం కలిశారు. త్వరగా పనులు పూర్తిచేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బాస చిన్నరాజేశ్వర్, పుప్పాల పవన్, ఎరికారి శంకర్, బొంగురాల ప్రభాకర్, పొలాస హరీశ్, పులి దేవర, చెవుల సాంబయ్య, ఎరికారి రెడ్డి, పటేల్ కండేరావు, తిరుపతి ఉన్నారు. -
9849653126
‘పొట్టేలు’కు గద్దర్ అవార్డు నిర్మల్టౌన్: 2024 అక్టోబర్ 25న విడుదలైన పొట్టేలు సినిమా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుకు ఎంపికై నట్లు టీవీ, చలనచిత్ర కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడిచెర్ల రాజు అన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం దర్శక రచయిత నిర్మల్ ముద్దుబిడ్డ సాహిత్గౌడ్ కావడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ నెల 30న స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురుషోత్తం రావు, ప్రభాకర్, కోటగిరి నరసయ్య, డాక్టర్ కత్తి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి ప్రయోజనం
నిర్మల్చైన్గేట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వీటిపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం వీబీజీ రాంజీ (వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్)గా మార్చడంతో పాటు ఇటీవల చట్టంగా అమలులోకి తెచ్చింది. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి పథకం ద్వారా చేపట్టే ప నులను ప్రజలకు వివరించనున్నారు. వారం వ్యవధిలోనే గ్రామసభలు పూర్తి చేసి పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకోనున్నారు. 125 రోజులకు పెంపు.. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 100 రోజుల వరకు పని కల్పించేందుకు గ్యారంటీ ఉండగా ఇప్పుడు కేంద్రం ఈ పరిమితిని 125 రోజులకు పెంచింది. గతంలో ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించింది. ఇక నుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లోగా పని లభించకపోతే రోజూవారీ నిరుద్యోగభృతి చెల్లించేందుకు వీలు కల్పించారు. జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... మొత్తం 3.38 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో యాక్టివ్ కూలీలు 2.28 లక్షల వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. పథకంలో కీలక మార్పులు.. ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం మట్టి పనులను పూర్తిగా తొలగించింది. గతంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత, కందకాల తవ్వకం వంటి పనులను చేపట్టేవారు. అయితే వీటిలో ఆశించినంత పని జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జలసంరక్షణ పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్ షెడ్లు, కాల్వల నిర్మాణం, నీటిబావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు ఇకపై కొనసాగించనున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో సుమారు 2 నెలల పాటు పథకం పనులను నిలిపివేయనున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ పనికి జియోట్యాగింగ్.. గ్రామసభలను నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించిన ఫొటోలను జియోట్యాగింగ్ చేసి ఉపాధి హామీ పోర్టర్లో అప్లోడ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జిల్లా వివరాలు మండలాలు : 18 గ్రామ పంచాయతీలు : 400 జాబ్ కార్డులు : 1.77 లక్షలు కూలీల సంఖ్య : 3.33 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు : 1.30 లక్షలు యాక్టివ్ కూలీల సంఖ్య : 2.28 లక్షలుజలసంరక్షణకు ప్రాధాన్యం.. ఇకపై చేపట్టే పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాగు, సాగునీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, నీటివసతి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంచినీటి రౖపైడ్లెన్లు, సాగునీటి కాల్వలు, పొలాల్లో పిల్లకాల్వల తవ్వకాలు చేపట్టేందుకు వీలుకలుగనుంది. ఉపాధి హామీ పనిస్థలంలో కూలీలు (ఫైల్) -
నిర్మల్
జాతర సమీపిస్తున్నా.. నాగోబా జాతర జనవరి 18న ప్రారంభం కానుంది. గడువు సమీపిస్తున్నా ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. అధికారుల సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు.ఎన్నో కొత్త ఆశలతో సరిగ్గా పన్నెండు నెలలక్రితం 2025 ప్రారంభమైంది. ఎన్నో.. ఎన్నెన్నో సరికొత్త విషయాలు, సంఘటనలు, నియామకాలు, ముందడుగులు, ఉద్యమాలకు వేదికై ంది. ఒక్కోనెల ఒక్కో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయం మొదలు క్రీడా, కళారంగాల వరకు ఈ ఏడాది ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. – నిర్మల్ ఆ పార్టీలకు కొత్త సారథులు.. జిల్లా ఈ ఏడాది రాజకీయంగానూ పలుమార్పులకు వేదికై ంది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ, ఒక ఎమ్మెల్యేను గెలుచుకున్న కాంగ్రెస్ బలపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్రాథోడ్, నవంబర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నియమితులయ్యారు. తొలిసారి పంచాయతీ ఎన్నికలనూ ఇదే ఏడాదిలో వారు ఎదుర్కొన్నారు. సిందూర.. సంబురం.. పాకిస్థాన్ ముష్కరమూకలు చేసిన పహల్గాం మారణహోమాన్ని జిల్లా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అనంతరం మనదేశం మే నెలలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్ జరిగినన్ని రోజులూ ఊపిరి బిగబట్టి వార్తలను తెలుసుకుంది. విజయం తర్వాత గల్లీగల్లీలో పండుగలా జరుపుకుంది. ఆశల రైలుకు అడుగులు.. జిల్లా మీదుగా రైల్వేలైన్కు సంబంధించి ఈ ఏడాదిలో కీలక పరిణామం పూర్తయ్యింది. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు మూడు జిల్లాలను కలుపుతూ 136.50 కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూర్తి చేశారు. దీన్ని వెంటనే ఆమోదించాలని ఎంపీ నగేశ్ రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్కుమార్ను కలిశారు. ఇదేనెలలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తదితరులతో కలిసి బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసి విన్నవించారు. ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వస్తున్న పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రశాంతంగా ముగిశాయి. దస్తురాబాద్ మండలం పెర్కపల్లి మినహా మొత్తం 399 పంచాయతీలకు కొత్త సర్పంచులు వచ్చారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా మద్దతుదారులను గెలిపించుకున్నాయి. క్రీడలతో మానసికోల్లాసం నిర్మల్టౌన్: క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.వర్సిటీ కోసం ‘సాక్షి’ ప్రయత్నం.. ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు‘నిర్మల్ ఉత్సవాలు’ తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఆ జిల్లా పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ ఏడాది జనవరి 5, 6, 7 తేదీల్లో ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరిట ప్రారంభించారు. మూడురోజులు జనాల నుంచి విపరీతంగా స్పందన ఉండటంతో మరో రోజు అదనంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా చరిత్రనూ ప్రజల్లోకి తీసుకెళ్లారు.నేటి నుంచి ప్రజావాణి నిర్మల్చైన్గేట్: ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 29 నుంచి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి హాజరై నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. మౌంటెన్మ్యాన్.. ఐరన్మ్యాన్.. ఈ ఏడాది జిల్లాకు ఇద్దరు సూపర్మ్యాన్లు దొరికారు. గతంలో ఎవరెస్టును అధిరోహించిన జిల్లా కేంద్రానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ముక్క సాయిప్రసాద్ జూన్లో ప్రపంచంలో ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్నీ అధిరోహించి మౌంటెన్మ్యాన్గా నిలిచారు. ఇక జిల్లా కేంద్రానికే చెందిన డాక్టర్ బీఎల్ఎన్ రెడ్డి గోవాలో నిర్వహించిన క్లిష్టమైన అరేబియా సముద్రంలో ఈత, సైక్లింగ్, మారథాన్ల ఈవెంట్ను విజయవంతంగా ముగించి ‘ఐరన్మ్యాన్’ టైటిల్ దక్కించుకున్నారు. జిల్లాలో జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన ఉద్యమానికి ‘సాక్షి’ మీడియా బీజం వేసింది. ఈఏడాది ఆగస్టులో వివిధ వర్గాలు, మేధావులు, విద్యావంతులతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఈ కారణంగా జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి’ ఏర్పడింది. డ్రగ్ ఫ్రీ నిర్మల్ దిశగా.. జిల్లాలో విపరీతంగా వ్యాపిస్తూ యువతను పట్టి పీడిస్తున్న గంజాయి భూతాన్ని తరిమేసేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్వ్, ఎస్పీ జానకీ షర్మిల డ్రగ్ ఫ్రీ నిర్మల్ కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇదే ఏడాది జిల్లాలో గంజాయితో పాటు మత్తు మందు సిరంజీలనూ ఉపయోగిస్తున్నట్లు తేలడం కలవరపర్చింది. ఆ ముఠానూ పోలీసులు పట్టుకున్నారు. దసరా పండుగ సమయంలో ఎస్పీ జానకీ షర్మిల వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లి డ్రగ్స్, సైబర్ నేరాలు, తదితర సామాజిక అంశాలను వివరించేందుకు ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పిల్లలు పైలం
వైద్యుల సూచనలు నిర్మల్ఖిల్లా: జిల్లాలో రోజురోజుకూ చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంతో వైరస్లు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అధిక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో రద్దీ వైరస్ల కారణంగా జిల్లాలో చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో వారం రోజులుగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చలికి పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ క్లినిక్లలో చిన్నారుల తాకిడి పెరిగింది. వణికిస్తున్న చలి.. జిల్లాలో చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఉదయం సగటు ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలంతా చలి ప్రభావం ఉంది. దీంతో పిల్లల్లో సీజనల్ ఇన్ఫెక్షన్లు విస్తరిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యం.. శీతల గాలులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గాలిలో కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారుల్లో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. 8 ఏళ్ల లోపు పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పాఠశాలల వేళల్లో మార్పు.. తీవ్ర చలి నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు శనివారం (డిసెంబర్ 20) నుంచి పాఠశాల పని వేళలు మారాయి. ఉదయం 9:40 నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూళ్లు పనిచేస్తాయి. చిన్నారులు ఉదయ చలికి ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి, వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
నిర్మల్ రూరల్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఈమేరకు కేంద్రం చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికై న జుట్టు గజేందర్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా గజేందర్ ఎమ్మెల్యేకు పలు విద్యావిషయక అంశాలను వివరించారు. తమ సంఘంలో జిల్లా నుంచి రాష్ట్ర పదవికి అవకాశం రావడం ఇదే తొలిసారని తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్, పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, నా యకులు ఇర్ఫాన్ షేక్, వెంకటేశ్వరరావు, లక్ష్మీపతి, లింగయ్య, అజీజ్ తదితరులు ఉన్నారు. పోస్టర్లు విడుదల నిర్మల్ రూరల్: ఈనెల 28, 29 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సమావేశం పోస్టర్లను టీఎస్ యూటీఎఫ్ నాయకులు జిల్లా కేంద్రంలో శనివారం విడుదల చేశారు. జనగాం జిల్లాలో జరిగే రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఇందులో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్, రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, లక్ష్మణరావు, రమేశ్, పరమేశ్వర్, రాజేశ్వర్, నాగయ్య, గోవర్ధన్, శివరాణి, ఫాసిల్, రమేశ్, అంబటి నారాయణ, నారాయణవర్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవో 252 సవరించాలి
నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని టీయూడబ్ల్యూజే 143 యూనియన్ సభ్యులు అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై తీసుకువచ్చిన జీవోను సవరించాలని కోరుతూ.. కలెక్టరేట్లో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం జీవో 252 తీసుకురావడం అభినందనీయమన్నారు. అయితే ఈ జీవోలోని కొన్ని నిబంధనలతో ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు కలిగిన దాదాపు 10 వేల మందికి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్ట్ అన్న తేడా లేకుండా అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ నా యకులు లక్ష్మీనారాయణ, రాంమహేశ్, మహేశ్రావు, అల్లం అశోక్, రాంపెల్లి నరేందర్, అత్తర్, రంజిత్, కార్తీక్, రాజు తదితరులు ఉన్నారు. -
ప్రజల మెప్పు పొందాలి
నిర్మల్: ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కొత్తగా ఎన్నికై న సర్పంచులకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రెడ్డిగార్డెన్స్లో నిర్మల్ నియోజకవర్గ సర్పంచులకు శనివారం ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మంత్రి సర్పంచులను సన్మానించి, శుభకాంక్షలు తెలి పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గ్రామంలో పర్యటించాలని, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. విధిగా గ్రామసభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని తెలిపారు. హామీలు అమలు చేస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి సర్పంచులు ప్రజలకు వివరించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 1,551స్థానాల్లో కాంగ్రెస్ 820 స్థానాల్లో గెలిచిందని, బీఆర్ఎస్ 343, బీజేపీ 269, స్వతంత్రులు సుమారు 110 స్థానాల్లో విజయం సాధించారని వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలచారి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు మాట్లాడారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి నిర్మల్లో బీజేపీ 80 సర్పంచ్ స్థానాలను గెలిచిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్సే అధిక స్థానాలు సాధించిందని, త్వరలో మరిన్ని పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని, పీసీసీ బాధ్యులు ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నాయకులు, కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. -
విద్యార్థులకు విజ్ఞానం.. సైన్స్ ప్రయోగం..
మామడ: విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా సైన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇన్స్పైర్ ప్రాజెక్టులతోపాటు సైన్స్ ఎగ్జిబిషన్ను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొంటారు. 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9, 10వ తరగతులు, ఇంటర్ వరకు చదువుతున్నవారు సీనియర్ (వైజ్ఞానిక) విభాగంలో పాల్గొనవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, స్థానిక సంస్థలు, ఆశ్రమ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్లు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని 119 ప్రాజెక్టులు మేళాలో ప్రదర్శించబడతాయి. ప్రతీ పాఠశాల నుంచి అయిదు ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చు. ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించాలి జిల్లాలో 119 ప్రాజెక్టులు ఇన్స్పైర్కు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులతోపాటు సైన్స్ఫేర్ ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక విభాగాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చవచ్చు. – వినోద్కుమార్, జిల్లా సైన్స్ అధికారి సైన్స్పై ఆసక్తి పెంచేలా.. సైన్స్ఫేర్, ఇన్స్పైర్ వంటి సైన్స్ మేళాలతో విద్యార్థుల్లో సైన్స్పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – భోజన్న, డీఈవో ప్రదర్శన అంశాలు.. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ దేశం కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంతోపాటు మొత్తం 7 అంశాల్లో ప్రాజెక్టులు నిర్వహించబడతాయి. ’ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’ అంశంపై సెమినార్ నిర్వహిస్తారు. 1. సుస్థిర వ్యవసాయం 2. వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు 3. హరిత శక్తి, పునరుత్పాదక శక్తి 4. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు 5. వినోదభరితమైన గణిత నమూనాలు 6. ఆరోగ్యం, పరిశుభ్రత 7. నీటి సంరక్షణ, నిర్వహణ -
ట్రిపుల్ ఐటీలో వీర్ బాల దివస్
బాసర: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు బాసర ఆర్జీయూకేటీలో వీర్ బాల దివస్ వేడుకలు శుక్రవారం ఘనంగా మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా దేశ నిర్మాణంలో విద్యార్థుల సృజనాత్మకత, బాధ్యత, సామర్థ్యాన్ని చాటేందుకు వ్యాసరచన, వక్తృత్వం, చర్చాగోష్టి, క్విజ్, కవితల పోటీలు నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ వీర్ బాల దివస్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ విఠల్, ఎస్.శేఖర్, దిల్ బహార్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు, డాక్టర్ కాశన్న, శ్యామ్బాబు, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి
● హౌసింగ్ పీడీ రాజేశ్వర్ లక్ష్మణచాంద: నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలన్నారు. ఇంటి స్లాబ్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్లకు మించరాదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాధ,ఎంపీవో నసీరుద్దీన్, సర్పంచ్ ఓస కవిత, న్యూ కంజర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్ రూరల్: నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను శనివారం సన్మానించారు. జిల్లా గ్రంథాలయంలో చదువుకున్న 8 మంది అభ్యర్థులు గ్రూప్–2లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. నిరుద్యోగులు సమయం వృథా చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగుల కోసం అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సదుపాయాలు కల్పించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ జునేత్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మతిన్, సమరసింహారెడ్డి, లైబ్రరీ అధికారి రాథోడ్ మోహన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
లాభంలేని ఎవుసం
నిర్మల్కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే పూజలు లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో శనివారం మండల పూజ నిర్వహించారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అయ్యప్ప స్వామికి 41 రోజుల మండల కాలం(వృశ్చిక మాసం నుంచి ధనుర్మాసం వరకు) ముగింపు సందర్భంగా హరిహర పుత్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. స్వాములతో కలిసి ఎమ్మెల్యే భిక్షలో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ ఉన్నారు. నిర్మల్: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్. 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా ఎవుసం కలిసి రావడం లేదు. ఏటా రైతులు నష్టాలతోనే సాగుతున్నారు. ఈ ఏడాదీ సాగు అంత సాఫీగా సాగలేదు. రైతన్నకు అవసరమున్నప్పుడు రాని వాన, వద్దంటే పగబట్టినట్టే కురిసింది. తెల్లబంగారాన్ని నేలవాల్చింది. సోయాపంటను నీటముంచింది. పచ్చని పొలాల్లో ఇసుక మేటలేసింది. జిల్లాలోని 16 మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, పత్తి, సోయా వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్ల, భారీవర్షాలకుతోడు దాదాపు సీజన్ అంతా గోదావరి ఉప్పొంగడంతో తీరప్రాంత మండలాల్లో పంటలు నీటమునిగాయి. ఇక కొత్తపంటగా సాగులోకి వచ్చిన ఆయిల్పామ్ ఈ ఏడాది కోతకు వచ్చింది. సాగుచేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసింది. పంట సాగు విస్తీర్ణం పెంచడానికి మరింత భరోసానిచ్చింది. ముంచిన వానలు.. జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో మొత్తం 3,23,857 ఎకరాల్లో 1,77,066 మంది రైతులు పంటలు సాగు చేశారు. ఇక ఈఏడాది వర్షాకాలంలో 2,35,060 మంది రైతులు మొత్తం 4,37,897 ఎకరాల్లో పంటలు పండించారు. గతేడాది తీరునే ఈసారి కూడా ప్రకృతి వైపరీత్యాలు రైతన్నలను వెంటాడుతూ వచ్చాయి. ఖరీఫ్ సీజన్ మొదట్లో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 10,588 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అది మరిచిపోయేంత లోపే అక్టోబర్లో మోంథా తుపాన్ చుట్టుముట్టింది. వారాల తరబడి మబ్బుపట్టిన వాతావరణంతోపాటు కురిసిన వర్షాలకు జిల్లాలోని ఐదు మండలాల్లోని 36 గ్రామాల్లో 253 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక పంట నష్టపరిహారం కింద ఆగస్టు వైపరీత్యాలకు సంబంధించి రూ.10.69 లక్షలు విడుదలయ్యాయి. మోంథా తుపాన్ బాధితులకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. పెరిగిన సోయా.. తగ్గిన పత్తి.. జిల్లాలో గతంతో పోలిస్తే పలు ప్రధాన పంటల సాగులో ఈ ఏడాది కొంత తేడాలు కనిపించాయి. జిల్లాలో అత్యధికగా సాగు పంటగా వరి కొనసాగింది. యాసంగిలో 1,24,243 ఎకరాల్లో, వానాకాలం 1,41,667 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతేడాది సోయాపంటను 1,05 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1.21 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మరో ప్రధాన పంటగా ఉన్న పత్తి ఈఏడాది కొంత తగ్గింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 1.45 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు పత్తికి బదులుగా సోయాను నమ్ముకున్నారు. మిగతా మొక్కజొన్న, జొన్న, పసు పు పంటలు ఎప్పటి మోతాదులోనే సాగు చేశారు. వరదలతో పొలాల్లో ఇసుక మేటలు(ఫైల్) ఈఏడాది ప్రధాన పంటల సాగువివరాలు(ఎకరాల్లో).. పంటలు యాసంగి వానాకాలం వరి 1,24,243 1,41,938 సజ్జ 495 –– మొక్కజొన్న 98,723 16,163 జొన్న 41,033 10 సోయాబీన్ 59 1,21,693 పత్తి 57 1,51,265గోధుమ 543 –– శనగ 48,932 –– మినుములు 104 72 కంది 475 6,638 పెసర 0.39 87 నాలుగేళ్లక్రితం జిల్లాలోకి అడుగుపెట్టిన ఆయిల్పామ్ ఈ ఏడాది చేతికొచ్చింది. అనుమానాలను పటాపంచలు చేస్తూ మంచి దిగుబడితో కోతకొచ్చింది. జిల్లాలో మొత్తం 8,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఈ ఏడాది 600 ఎకరాల్లో కొత్తగా సాగుచేశారు. మొత్తం 36 నెలల పంటయిన ఆయిల్పామ్ నాలుగేళ్ల క్రితం సాగు ప్రారంభించిన రైతులకు చేతికొచ్చింది. మొత్తం 1,300ఎకరాల్లో పంట కోతకు రాగా, ఒక్కో గెల ఐదు నుంచి 8 కేజీలు ఉంది. మున్ముందు వచ్చే గెలల బరువు 20 కేజీల వరకూ ఉండనుంది. టన్నుకు రూ.19 వేల ధర పలుకుతుండగా, ఈఏడాదిలో మొత్తం 249 టన్నులను కోతకోశారు. ఇందుకు సంబంధించి మొత్తం 158 మంది రైతుల ఖాతాల్లో కొనుగోలు చేసిన కంపెనీ రూ.54 లక్షల పైచిలుకు జమచేసింది. -
‘పర్యాటకం’ పరిహాసమేనా..!
● నీటిమూటలుగానే పాలకుల హామీలుపర్యాటకుల లేక బోసిపోతన్న కడెం ప్రాజెక్టు నిర్మల్: ‘నాన్నా.. టూడేస్ హాలీడేస్ ఉట్టిగనే గడిచిపోయాయి. ఈసారి ఎటూ తీసుకెళ్లలేదు. కనీసం బయటకూ వెళ్లలేదు నాన్నా..’అని బిడ్డ హాసిని అడుగుతుంటే.. నెలాఖరులో డబ్బులు లేక, మరోవైపు జిల్లాలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలు లేక ఆ తండ్రి శ్రీనివాస్ సైలెంట్గా ఉండిపోయా డు. ఇలాంటి ఇబ్బందులు జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులకు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కార ణం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే. జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ఎలాంటి ముందడుగా పడడం లేదు. పక్కజిల్లాలకు వెళ్తున్నారు.. ఈ సీజన్లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతికి వ చ్చే సెలవుల్లో చాలామంది పిల్లలు పెద్దలు కలిసి ప్రశాంతమైన ప్రకృతిలో గడపాలని భావిస్తారు. కానీ.. కనీసం ఒకరోజు కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా గడపడానికి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రదేశం లేదు. ఉన్న ఒకట్రెండు పర్యాటక ప్రదేశాల్లోనూ కనీసం అభివృద్ధి కనిపించడం లేదు. చేసేది లేక.. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పక్కజిల్లాలకు, హైదరాబాద్, గోవాలకు వెళ్తున్నారు. రెండురోజుల పాటు ఆహ్లాదంగా గడపడానికి రూ.వేలు ఖర్చుచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మంత్రిగారూ.. దృష్టిపెట్టాలి.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగానూ ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లావాసులు కోరుతున్నా రు. స్థానిక పాలకులు, అధికారులు ఇప్పటికి చాలా సార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారే తప్ప.. వాటిని అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావ డం లేదన్న వాదనా ఉంది. జిల్లా పాలకులు, అధికారులు, ఇన్చార్జి మంత్రి కూడా పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నవిస్తున్నారు. -
పది పరీక్షలకు 78 రోజులే!
లక్ష్మణచాంద: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి 90% సిలబస్ పూర్తయింది. గ్రామపంచాయతీ ఎన్నికల విధులతో ఉపాధ్యాయులు 15 రోజులు పాఠశాలలకు దూరంగా ఉండటంతో మిగిలిన 10% పెండింగ్గా ఉంది. వచ్చే మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ సమీక్ష.. రెండు రోజుల క్రితం కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈవో భోజన్న, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కారణంగా సిలబస్ పూర్తి కాలేదని తెలిపారు. దీంతో జనవరి 10లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ పూర్తి తర్వాత అభ్యాస దీపికలు, వారాంత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 6,603 మంది విద్యార్థులు.. నిర్మల్ జిల్లాలో 168 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,603 మంది 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్ర త్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. డిసెంబర్ చి వరికి పూర్తి సిలబస్ లక్ష్యంగా పని కొనసాగుతోంది. సాధనతోనే మేలు.... 1. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు తమలో ఉన్న భయాన్ని వీడి, ఒత్తిడికి లోను కా కుండా గతంలోని మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల మేలు జరుగుతుందని విషయ నిపుణులు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 2. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఇంటి వద్ద టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 3. ఈరోజు చదవాల్సిన పాఠ్యాంశాలను అదే రోజు చదువుకోవాలని ఉపాధ్యాయులు సూచించిన సూచనల మేరకు సన్నద్ధం కావాలి. 4. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా సమాచారం... జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 168మొత్తం పదో తరగతి విద్యార్థులు 6,603 -
‘మోడల్’ ఠాణాకు మోక్షమెప్పుడో!
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో 2017లో ప్రారంభమైన మోడల్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం ప్రారంభించి ఏడేళ్లయినా పూర్తి కాలేదు. పురాతన భవనంలో ఇబ్బందులు పడుతూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణం నెమ్మదిగా కొనసాగుతోంది. పాత భవనం దెబ్బతినడంతో పోలీసులు కష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో 2017లో అప్పటి ప్రభుత్వం రూ.72 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనం మంజూరు చేసింది. మార్చి 8న పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక సౌకర్యాలతో ప్లాన్.. కొత్త భవనంలో ఎస్సై గది, పోలీసుల విశ్రాంతి గదులు, మహిళా పోలీసులకు ప్రత్యేక గది, ఫిర్యాదు హాల్, రిసెప్షన్, రికార్డు గది, ఇంటర్నెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కిటికీలు, విద్యుత్, డోర్లు, నీటి సౌకర్యాలు, పెయింటింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు. నిధుల విడుదలలో జాప్యం.. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. పాములు వచ్చే పాత భవనంలో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొంటున్నారు. ఉన్నతాఽ దికారులు త్వరగా స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. నూతన భవనం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంటున్నారు. -
సిరాల ఆయకట్టుకు సాగునీరు
భైంసారూరల్: యాసంగి పంటలకు సిరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అన్నారు. సిరాల ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.12 కోట్లతో పనులు పూర్తి చేయించామన్నారు. సిరాల ప్రాజెక్టు ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. చెరువుల నిర్మాణానికి, లిఫ్ట్ల పునఃప్రారంభానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్కుమార్, సిరాల, ఇలేగాం, దేగాం, చింతల్బోరి గ్రామాల సర్పంచులు కదం సునంద, సీరం రాజమణి, సీరం సుష్మారెడ్డి, పండిత్రావుపటేల్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని అన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేశామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయిని ప్రతినిధిగా పంపారని గుర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి రామగుండంలో జరిగిన కార్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచిది కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జిల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగోళ్లు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. జిల్లాకు ఎంత చేసినా తక్కువే..: మంత్రి జూపల్లి కృష్ణారావు వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రిమ్స్కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్ నర్సింగ్ పోస్టులను, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. రిమ్స్లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్లు మాట్లాడారు. రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, ఇచ్చోడ పీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్చాలన్నారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి వైద్యులకు రూ.5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిమ్స్లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఎల్ఐసీ స్కాలర్షిప్
బాసర: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థికసాయం అందించే ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్నకు బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వీహెచ్.సాయి మైథిలి ఎంపికై ంది. ఈ స్కాలర్షిప్ 10వ/12వ తరగతిలో మంచి మార్కులు సాధించి, తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారికి లభిస్తుంది. ఎల్ఐసీ ఉపకార వేతనానికి ఎంపికై న సాయి మైథిలిని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎస్.విఠల్, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు. విద్యార్థిని అభినందిస్తున్న ఇన్చార్జి వీసీ గోవర్ధన్ -
ఘనంగా సీపీఐ నూరేళ్ల వేడుక
ఖానాపూర్: సోషలిజం స్థాపన కోసం బలమైన విప్లవ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సీపీఐఎంఎల్ మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది వేడుకలు ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని బావపూర్, తర్లపాడు, జిలేడుకుంట, అ డవి సారంగాపూర్, పాత ఎల్లాపూర్, బీర్నంది, రంగపేట, చామనపల్లి, పాత తర్లపాడు, సతనపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. దేశంలో శ్రామిక పీడితవర్గాల విముక్తి కో సం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ గడిచిన 100 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన అనేక చరిత్రాత్మకమైన పోరాటాలు చేసిందని తెలి పారు. కార్యక్రమంలో జక్కుల రాజన్న, కూర్మ రాజన్న, పుసం లక్ష్మణ్, ఆత్రం భీంరావు, సోనేరావు, బీర్సావ్ గోరేబాయ్, మోహన్, మనోహర్, గంగారాం, శంకర్ పాల్గొన్నారు, చింతల్చాందలో.. లక్ష్మణచాంద్: మండలంలోని చింతల్చాంద గ్రామంలో సీపీఐ శతాబ్ది వేడుకలు నిర్వహించారు. జిల్లా నాయకుడు గంగన్న జెండా ఆవిష్కరణ చేశారు. శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1925 డిసెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన మహాసభలలో దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీని లాంఛనంగా స్థాపించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.లక్ష్మి, రాజవ్వ, లక్ష్మణ్, చిన్న గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల సాగులో..
జిల్లాలోని నిర్మల్ రూరల్, దిలావర్పూర్ మండలాలకు చెందిన కొందరు రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా వంటి కూరగాయలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్లో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. పాలకూర, మెంతి, క్యాబేజీ వంటి ఆకుకూరలతోపాటు కొందరు ఎకర భూమిలో కంది అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
కంది.. పోయింది
ఈ చిత్రంలోని రైతు పేరు జరోల్ల గంగాధర్. తానూరు మండలం బోరిగాంకు చెందిన గంగాధర్.. తనకున్న నాలుగు ఎకరాల్లో వానాకాలం సోయా సాగుచేశాడు. అంతరపంటగా కంది వేశాడు. మొదట పంట ఆశాజనకంగా కనిపించింది. పుత, కాత దశకు వచ్చేసరికి తెగుళ్లు కారణంగా పంట నిలువుగా ఎండిపోయింది. మరోవైపు అటవీ జంతువుల బెడదతో ఉన్న పంట చేతికి అందకుండా పోయింది. నాలుగు ఎకరాల్లో కనీసం మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తానూరు: ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు కోల్పోయిన రైతులు అంతర పంటగా వేసిన కందిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏపుగా పెరిగిన పంట ఎండు తెగుళ్లు (ప్యూజేరియం), క్రిమికీటకాలు పూత దశలో సోకి 50 శాతం పంట నిలువుగా ఎండిపోయింది. అడవి జంతువుల దాడులతో చేతికొచ్చిన దిగుబడి కూడా పోయింది. 9 వేల ఎకరాల్లో సాగు..జిల్లా వ్యాప్తంగా 9 వేల ఎకరాల్లో పత్తి, సోయాలో అంతరపంటగా కంది వేశారు. భైంసా డివిజన్లో ఎక్కువగా సాగు జరిగింది. ఒక ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చు చేశారు. సాధారణ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి రావాలని, తెగుళ్లు, వన్యప్రాణుల కారణంగా 1 నుంచి 2 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక..గతేడాది క్వింటాల్కు రూ.7,500 మద్దతు ధర, ప్రైవేటు మార్కెట్లో రూ.8 వేల వరకు లభించాయి. ఈసారి మాత్రం రూ.7,500 కే పరిమితం కావడంతో సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. క్వింటాల్కు రూ.9 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.తెగుళ్లతో పంట ఎండిపోయింది ఈ ఏడాది తొలుత కంది పంట బాగానే ఉంది. పూత, కాత దశలో ప్యూజేరియం ఎండు తెగులు సోకింది. పంట ఎక్కడికక్కడ ఎండిపోయింది. పగలు ఎండ, రాత్రి చలి తీవ్రత కారణంగా కూడా తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంది. తానూరు మండలంలో పంట నష్టం అధికంగా ఉంది. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఉప్పొంగిన భక్తిభావం
లోక రక్షకుడి జననం.. నిస్సీ ప్రార్థన మందిరంలో యేసయ్యను ఆరాధిస్తున్న యువతినిర్మల్టౌన్: కరుణామయుడు, లోక రక్షకుడు అయిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి కొవ్వొత్తులు వెలిగించి, కేక్లు కట్ చేశారు. పాస్టర్లు, బిషప్లు క్రీస్తు బోధనలు వినిపించారు. అనంతరం ప్రభువును స్తుతిస్తూ సామూహికంగా భక్తిగీతాలు ఆలపించారు. మత పెద్దలు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. పలు చర్చీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిర్మల్ సీఎస్ఐ చర్చిలో బిషప్ వ్యాస్ ధ్యానం అందించారు. వెంకటాపూర్లోని నిస్సీ చర్చిలో ఫాదర్ జయరాజ్ సందేశం ఇచ్చారు. గొల్లపేట్, సెయింట్ కాథలిక్, కర్మెల్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సీఎస్ఐ చర్చి వేడుకల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేశారు. మత పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. సోన్ మండలం మాదాపూర్ చర్చిలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సీఎస్ఐ చర్చిలో కేక్ కట్ చేస్తున్న పాస్టర్స్నిర్మల్ సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు -
వీధి వ్యాపారులకు మరో వరం..!
భైంసాటౌన్: పట్టణాల్లో వీధి వ్యాపారులకు చిన్నపాటి రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే తొలుత రూ.10 వేల రుణం మొదలుకుని, రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. దీంతో చాలామంది వీధి వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. అలాగే స్వల్ప వడ్డీ, సకాలంలో రుణం చెల్లిస్తే, తిరిగి మరింత రుణం పెంచి అందించారు. ఫలితంగా వీధి వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది. ఈసారి రూ.15 వేలు...తాజాగా పీఎం స్వనిధి కింద లోక కల్యాణ్ మేళా పథకం ప్రవేశపెట్టింది. పథకం పాతదే అయినా.. రుణ మొత్తం రూ.5 వేలు పెంచడంతోపాటు నూతనంగా మరింత మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈసారి కొత్తగా వీధి వ్యాపారులకు తొలుత యూనిట్కు రూ.15 వేలు అందించనున్నారు. గతంలో రూ.10 వేలు, రూ.20 వేలు పొంది సక్రమంగా చెల్లించిన వారికి రూ.25, రూ.50 వేలు అందించనున్నారు. ఐదేళ్లలో 3,500 యూనిట్లు లక్ష్యం..పీఎం స్వనిధి కింద ఈసారి జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కొత్తగా 701 యూనిట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029–30 వరకు ఐదేళ్లలో 3,506 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు రూ.15 వేల రుణం అందిస్తున్నాం. అర్హులైన వీధి వ్యాపారులు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఇతర వివరాలతో మున్సిపల్ కార్యాలయంలో మెప్మా విభాగంలో సంప్రదించాలి. -
ఘనంగా వాజ్పేయి జయంతి
నిర్మల్ రూరల్/భైంసాటౌన్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్, ముధోలో ఎమ్మెల్యే కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్ పాల్గొని వాజ్పేయికి నివాళులర్పించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ భద్రత, అభివృద్ధిలో వాజ్పేయి తనదైన ముద్ర వేశారన్నారు. భైంసాలో ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్ ఆధ్వర్యంలో దారాబ్జి ఫ్యాక్టరీలో వాజ్పేయి జయంతి నిర్వహించారు. సంతోషిమాత ఆలయ సమీపంలో నందు భయ్యా ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో నాయకులు మెడిసమ్మ రాజు,సాయి, అర్జున్, రాంశంకర్రెడ్డి, సాహెబ్రావ్, గంగా రెడ్డి, పద్మాకర్, విజయ్, నరేంద్రచారి, రంజి త్, భరత్, రాము, నారాయణ, విజయ్, చెన్న రాజేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
116 రోజులు 3.5 టీఎంసీల నీళ్లు
లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాకు సాగు, తాగునీటికి వర ప్రదాయినిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన సరస్వతి కాలువ ఉంది. ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు ఈనెల 24 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వారబందీ పద్ధతిలో..సరస్వతి కాలువ ద్వారా నిర్మల్రూరల్, సోన్, లక్ష్మ ణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబా ద్ మండలాలకు తాగు, సాగునీరు అందుతుంది. రెండో పంటకు వారబందీ పద్ధతిలో నీటిని విడుద ల చేస్తున్నారు. 8 రోజులు నీటిని విడుదల చేసి.. ఏడు రోజులు నిలిపివేయనున్నారు. 3.5 టీఎంసీలు...జిల్లాలోని ఏడు మండలాలకు సరస్వతి కాలువ ద్వారా రెండో పంటకు నిత్యం 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేస్తున్నారు. ఇలా ఈనెల 24 నుంచి విడుదలవుతున్న నీరు ఏప్రిల్ 18 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 116 రోజులు 3.5 టీఎంసీల నీటిని సరస్వతి కాలువ ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చెయనున్నారు. 33,622 ఎకరాల ఆయకట్టు...జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలో మొ త్తం సరస్వతి కాలువ కింద 33,622 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో యాసంగికి సరస్వతి కాలువ ద్వారా మీరు విడుదలవుతున్న నేపథ్యంలో 33,622 ఆయకట్టుకు సాగుకానుంది. అలాగే సరస్వతి కా లువ ద్వారా మండలంలోని వడ్యాల్ వద్ద ఎస్కేప్ కెనాల్ ద్వారా కనకాపూర్ వాగులోకి నీటిని విడుద ల చేసి సదర్మాట్కు తరలిస్తారు. దీనికింద మరో 13 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. -
పాడి రైతులకు తోడ్పాటు
కుంటాల: పంటల్లా కాకుండా, పాడి పరిశ్రమ రైతులకు నిరంతర ఆదాయాన్ని అందిస్తోంది. భూమి లే ని కుటుంబాలకు కూడా ఇది ప్రధాన ఆధారంగా మారింది. ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. బల్క్ మిల్క్ పాయింట్..తెలంగాణ పాడి పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని కల్లూరులో రూర్బన్ నిధులతో రూ.40 లక్షలు ఖర్చుపెట్టి బల్క్ మిల్క్ కూలింగ్ పాయింట్ను ఇటీవల ప్రారంభించారు. భైంసా, లోకేశ్వరం, కుంటాల మండలాల నుంచి పాలు సేకరించి ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఈ సౌకర్యంతో రైతులకు దూరభారం తగ్గుతుంది. పాల సేకరణ కేంద్రాల విస్తరణమండలంలో 12 పాల సేకరణ కేంద్రాలను ఏర్పా టు చేసి, వాటి నిర్వహణకు పాల మిత్రులను నియమించారు. గేదె పాలకు వెన్న శాతం బట్టి లీటర్కు రూ.42 నుంచి రూ.80 వరకు, ఆవు పాలకు రూ.36 నుంచి రూ.42 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీరోజు సుమారు 2 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. రైతుల ఖాతాల్లో 15 రోజులకు ఒకసారి ఆన్లైన్లో డబ్బులు జమ చేస్తున్నారు. రోజువారీ ఆదాయం.. పాల ఉత్పత్తి రైతులకు రోజువారీ ఆదాయంగా మారింది. వివిధ గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నాం. – డాక్టర్ నందకుమారి, డిప్యూటీ డైరెక్టర్, నిర్మల్, ఆదిలాబాద్ -
బస్సు కోసం ఆందోళన
సారంగపూర్: మండలంలోని కంకెట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వైకుంఠాపూర్–గొల్లమాడ రహదారిపై గు రువారం ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి కిలోమీటరు దూరం నుంచి వైకుంఠాపూర్ మీదుగా గొల్లమాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు నిత్యం మూడుపూటలా వెళ్తుందన్నా రు. అదే బస్సును కంకెట వరకు నడపాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళ బస్సు రాకపోవడంతో కిలోమీటరు దూరం వరకు చీకట్లో కాలినడకన గ్రామానికి చేరుకుంటున్నామన్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనబాట పట్టామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి తమ గ్రామాని కి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఆర్టీసీ డీఎం పండరికి సైతం ఫోన్ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. స్పందించిన డీఎం బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. -
గ్రామాల అభివృద్ధిపై ‘కొత్త’ ఆశలు
భైంసారూరల్: కొత్త సర్పంచులు కొలువుదీరారు. దీంతో ఇన్నాళ్లు నిలిచిపోయిన అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. గ్రామీణ అభివృద్ధి ఆగిపోయింది. పంచాయతీల తర్వాత పాలకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిర్వహణలో లోపాలు..రెండేళ్లు పంచాయతీల నిర్వహణ గాడితప్పింది. చెత్త సేకరణ ట్రాక్టర్లు డీజిల్ లేక నిలిచాయి. ప్రకృతి వనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. డ్రెయినేజీల నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి. మురుగునీరు నిలిచి దోమలు, ఈగలు పెరిగాయి. ఈ సమస్యలు కొత్త నాయకులకు ప్రధాన సవాల్గా మారాయి. కార్యదర్శులకు తప్పిన భారంపంచాయతీ కార్యదర్శులు ఇంతకాలం పాలనను పర్యవేక్షించారు. అత్యవసర పనులకు నిధులు లేకపోవడంతో అప్పులు చేసి చేపట్టారు. కొత్త సర్పంచులు రావడంతో కార్యదర్శులపై భారం తప్పింది. అయితే పాత బిల్లుల చెల్లింపు, కొత్త పనుల మధ్య సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం నిధుల విడుదల ఆధారంగా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. పరిష్కార మార్గాలు..కొత్త పాలకులు పారిశుధ్య నిర్వహణపై దృష్టి పె ట్టాలి. ఇంటింటా చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణ మెరుగుపర్చాలి. డ్రెయినేజీలు శుభ్రం చే యించాలి. ప్రభుత్వ పథకాలతో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామసభలు క్ర మం తప్పకుండా నిర్వహించి ప్రజల సమస్యలు తె లుసుకోవాలి. ప్రజల ఆకాంక్ష మేరకు చర్యలు తీసుకుంటూ అభివృద్ధి దిశగా సాగాలి. ఈ వ్యూహంతో గ్రామాలు మెరుగైన పరిస్థితికి చేరుకుంటాయి. -
నిర్మల్
వాతావరణం ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయి. పగలు కూడా చల్లగానే ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. మంచు అధికంగా కురుస్తుంది. తగ్గుతున్న పత్తి ధరలు పత్తి ధరలు తగ్గుతున్నాయి. ధర పెరుగుతుందని నిల్వ చేసుకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు తగ్గడంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది. విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న నిర్మల్ క్యాథలిక్ చర్చి నిర్మల్టౌన్: క్రైస్తవులకు అత్యంత ప్రియమైన క్రిస్మస్ పండుగ సందడి బుధవారం సాయంత్రం నుంచే మొదలైంది. నెల రోజులుగా సెమీ వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చీలలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త దుస్తుల్లో భక్తులు పిల్లలతో కలిసి చేరుకుని భక్తిగీతాలు ఆలపించారు. ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము వరకు బిషప్లు, పాస్టర్లు ఏసు బోధనలు వినిపించారు. కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిల అలంకరణ.. చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల ఆకృతులతో అద్భుతంగా అలంకరించారు. ఏసు జన్మకథకు సంబంధించిన ప్రతిరూపాలు, శాంతాక్లాస్ ఆకారాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఎరుపు దుస్తుల్లో శాంతా క్లాస్ సందడి చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. పురాతన సీఎస్ఐ చర్చి.. నిర్మల్ పట్టణం గాజులపేట్లోని సీఎస్ఐ చర్చి నిర్మాణం 1925లో ప్రారంభమైంది. 1930లో పూర్తయింది. దీనిని పీజేఎస్, అప్పదోరై నిర్మించారు. ఈ చర్చి 16 ఎకరాల ప్రాంగణంలో ఉంది. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి మేసీ్త్రలు, ఇంగ్లండ్ నుంచి రంగుచిత్రాలు తెచ్చారు. గురువారం ఉదయం 9:30 నుంచి ప్రార్థనలు మొదలవుతాయి. అనంతరం బిషప్ వాస్య ధ్యానం జరుగుతాయి. తర్వాత కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ, అనాథ ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్ పంచుతారు. అతిపెద్ద నిస్సీ చర్చి వెంకటాపూర్ శివారులో 2021లో పూర్తయిన నిస్సీ చర్చి పట్టణంలోని అతిపెద్దది. 1995–2021 వరకు శాస్త్రినగర్లో ఉండేది. పాస్టర్ జయరాజ్ నేతృత్వంలో నిస్సి ట్రస్ట్ అనాథ పిల్లల చదువు, దుప్పట్లు, దుస్తులు అందిస్తోంది. గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు, గీతాలు, నృత్యాలు జరుగుతాయి. 26వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. సెయింట్ థామస్, గొల్లపేట్ చర్చిలలో కూడా ప్రార్థనలు జరుగుతాయి. చరిత్రకు సాక్ష్యం సీఎస్ఐ చర్చి తెలంగాణలో రెండో పెద్ద చర్చి లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి. చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యం. చర్చి నిర్మించి 90 సంవత్సరాలు పూర్తయినా చెక్కు చెదరలేదు. -
అద్దె.. ఇక వద్దు!
● కార్యాలయాలు గాలిస్తున్న పలు శాఖలునిర్మల్: పేరుకు ప్రభుత్వ కార్యాలయం, ఉండేది మాత్రం ప్రైవేటు భవనంలో.. నెలకు వేల రూపాయల ప్రజాధనాన్ని అద్దె రూపంలో ప్రభుత్వం చెల్లి స్తోంది. అందుబాటులో ప్రభుత్వ భవనాలు ఉ న్నా.. ప్రైవేటు మోజులో పలుశాఖలు ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇకపై ఇలా ప్రజా ధనం వృథా చేయడం కుదరదు. ఈనెలాఖరు వర కు ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ కావాలంటూ ఆర్థికశాఖ స్పష్టం చేసింది. జనవరి నుంచి ఏరకంగానూ ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం కుదరదని తెలిపింది. దీంతో.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అధికారులు సొంత భవనాల వెతుకులాటలో పడ్డారు. తమకు అనుకూలంగా ఎక్కడైనా ప్రభుత్వ భవనం ఉందా..! అని చూస్తున్నారు. మరో నాలుగైదు రోజులైతే మళ్లీ కొత్త నెల ప్రారంభమవుతుంది. ఆలోపే భవనాలను చూసుకోవాల్సి ఉంటుంది. రూ.లక్షల్లో ప్రజాధనం వృథా.. జిల్లాలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉ న్నా.. పలు శాఖల కార్యాలయాలు ఇప్పటికీ ప్రై వే టు భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్నిజిల్లాలో సమీకృత కార్యాలయాల భ వనాలను నిర్మించింది. జిల్లాలోనూ ఎల్ల పెల్లి శివా రులో 15 ఎకరాల్లో రూ.56 కోట్లతో నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ కట్టిన తర్వాత చాలావరకు కా ర్యాలయాలు అందులోకే షిఫ్ట్ అయ్యాయి. కానీ కొ న్ని కార్యాలయాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో కొ నసాగుతున్నాయి. సమీకృత భవనంలో కేటాయింపులు లేక కొన్ని, ఉన్నా వెళ్లకుండా మరికొన్ని వేల రూపాయల అద్దె చెల్లిస్తూ ఆగిపోయాయి. ప్రభుత్వ భవనాల వేట కొత్త ఏడాదిలో అద్దెను ఏరకంగానూ చెల్లించేది లేదని ఆర్థికశాఖ స్పష్టంగా చెప్పడంతో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న శాఖలకు ‘షాక్’ తగిలినట్లయింది. ఉన్నపళంగా అధికారులు తమ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండని చెప్పారు. అలాగే కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు తమ పరిస్థితి వివరించారు. సమీకృత భవనంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా.. జిల్లా కేంద్రంలోనే ఏ శాఖ భవనమైనా ఖాళీగా ఉందా.. అని వెతుకుతున్నారు. ఈనెలాఖరులోపు ఎలాగైన కార్యాలయాలు ఖాళీ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలోనూ పలు శాఖలు.. జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పంచాయతీ, రెవెన్యూ, ట్రెజరీ తదితర శాఖల కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. రైతువేదికలు నిర్మించిన తర్వాత వ్యవసాయశాఖ ఆఫీసు కార్యకలాపాలు వాటి నుంచే నడిపిస్తున్నాయి. ఇక జిల్లాకేంద్రంలో ప్రధానంగా రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులు, పేఅండ్ అకౌంట్స్, చైల్డ్ వెల్ఫేర్ తదితర కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగే చైల్డ్ప్రొటెక్షన్ ఆఫీస్ కూడా ప్రైవేటు భవనంలోనే కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు స్థానిక దివ్యనగర్లో స్థలంతో కేటాయించారు. కానీ ఇక్కడ భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో అటవీ, ఇరిగేషన్ శాఖలు సొంతంగా భవనాలను నిర్మించుకున్నాయి. రెవెన్యూకు సంబంధించి జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోనే అర్బన్, రూరల్ తహసీల్ ఆఫీస్లు కొనసాగుతున్నాయి. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
సారంగపూర్: అడవులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఎఫ్ఆర్వో రామకృష్ణారావు అన్నారు. అడవి మధ్యలో ఉన్న మండలంలోని పెండల్ధరి గ్రామంలో అడవులు, అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రభావం అనే విషయంపై ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. అనంతరం గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాలకు పరోక్షంగా ప్రజలే కారణమన్నారు. బీడీలు, సిగరెట్లు కాల్చి వాటిని ఆర్పివేయకుండా పడేయడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి దట్టమైన అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టడం కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నజీర్ఖాన్, ఎఫ్ఎస్వో రషీద్, ఎఫ్బీవోలు వెన్నెల, సుజాత తదితరులు ఉన్నారు. -
నోటాకు ఓటేశారు
నిర్మల్చైన్గేట్: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1,416 మంది తమకు సర్పంచ్ అభ్యర్థి నచ్చలేదని నోటాకు ఓటు వేశారు. మొత్తం 4,31,791 మంది ఓటర్లల్లో 3,57,513 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 74,278 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో నూతన మార్పు గతంలో మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా నోటా ప్రవేశపెట్టారు. ఈసారి పంచాయతీల్లో బ్యాలెట్ పేపర్ చివరలో ఈ గుర్తును ముద్రించారు. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే తమ అసంతృప్తిని వ్యక్తీకరించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలోకి వచ్చింది. ముధోల్ మండలంలో అత్యధికంగా 178 మంది ఓటర్లు తమకు సర్పంచ్ అభ్యర్థులు నచ్చలేదని ఓటు వేశారు. దస్తూరాబాద్లో కేవలం ఒక్కరు మాత్రమే సర్పంచ్ నచ్చలేదని నోటాకు ఓటేశారు. భారీగా చెల్లని ఓట్లు.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో చాలా మంది అభ్యర్థుల ఫలితాలు తారుమారయ్యాయి. ఈవీఎంలకు అలవాటైన ఓటర్లు బ్యాలెట్ పద్ధతిని మర్చిపోయారు. అభ్యర్థి పక్కన బాక్స్లో సరిగ్గా ముద్ర వేయలేకపోయారు. మూడు విడతల ఎన్నికల్లో మొత్తం 5,489 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కుభీర్ మండలంలో అథ్యధికంగా 699 చెల్లని ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్(జి) మండలంలో అత్యల్పంగా 58 చెల్లని ఓట్లు పడ్డాయి. ఇవి ఎవరికీ లాభం లేకుండా పోయాయి. కొందరి గ్రామాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీని తగ్గాయి. కొన్ని గ్రామాల్లో గెలిచే అభ్యర్థిని ఓడిపోయేలా చేశాయి. మండలాలవారీగా నోటాకు వచ్చిన ఓటు, చెల్లుబాటు కాని ఓట్లు మండలం చెల్లుబాటు నోటాకు కాని ఓట్లు వచ్చిన ఓట్లు దస్తురాబాద్ 166 1 కడెం 405 100 ఖానాపూర్ 194 69 పెంబి 160 24 మామడ 337 86 లక్ష్మణచాంద 390 125 నిర్మల్ రూరల్ 310 56 సారంగాపూర్ 449 109 సోన్ 339 36 దిలావర్పూర్ 228 74 నర్సాపూర్(జి) 58 16 లోకేశ్వరం 487 88 కుంటాల 267 147 భైంసా 549 98 ముధోల్ 486 178 తానూర్ 531 85 బాసర 247 26 కుభీర్ 699 98 -
ఏఎంసీ వైస్చైర్మన్ రాజీనామా
సారంగపూర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు నెరవేర్చలేదని సారంగాపూర్ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవికి లక్కడి శంకర్రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీని కలిసిన టీయూటీఎఫ్ నేతలు నిర్మల్ రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తమ గళం వినిపించాలని కోరారు. విద్యారంగ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నడిపించిన అభిమానం
భైంసారూరల్: ఎన్నికల్లో ఎవరైనా తమ నాయకుడు గెలవాలని ప్రచారం చేయడం, ఓటర్లను మభ్యపెట్టడం మాములే. కానీ తమ నాయకుడు గెలిస్తే మీ చెంతకు పాదయాత్రగా వస్తానని దేవుళ్లను మొక్కుకునే అభిమానులు కొందరే ఉంటారు. భైంసా రూరల్ మండలం మహాగాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు అభ్యర్థి రాజ్యలక్ష్మి గెలవాలని అనుచరులు, అభిమానులు అయ్యప్పను వేడుకున్నారు. ఫలితం దక్కడంతో సర్పంచు రాజ్యలక్ష్మి భర్త రాకేశ్కు విషయం చెప్పారు. దీంతో బుధవారం యువకులతోపాటు గ్రామస్తులు మహాగాం నుంచి ఏడు కిలోమీటర్లు పాదయాత్రగా భైంసాలోని అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. -
‘కడెం’ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కడెం: ఉట్నూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కడెం ప్రాజెక్టు అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కాలువల మరమ్మతు, తదితర అంశాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. యాసంగి పంటల కోసం కడెం, సదర్మాట్ ఆయకట్టు రైతాంగానికి సాగు నీరందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అటవీ అనుమతులు కాలువల మరమ్మతుల ఆంశాలను సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు వేగవంతం చేస్తాం.... దస్తురాబాద్: గ్రామల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయని, రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేస్తామని బొజ్జు పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో సర్పంచ్ వర్ధెల్లి గోపాల్ అభినందన సభలో మాట్లాడారు. నూతన పింఛన్, మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి హామీ ఇచ్చారు. కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.అరుణ, ఎంపీవో రమేశ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, ఆయా గ్రామాల సర్పంచులు మహేశ్, నరేశ్, రాజేశ్, భూమేశ్, నరేశ్రెడ్డి, గంగన్న నాయకులు పాల్గొన్నారు. -
పండరీపూర్కు బయల్దేరిన బస్సు
నిర్మల్టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి గురుద్వారా, పండరీపూర్, తుల్జాభవాని ఆలయం వరకు ప్రత్యేక బస్సు బుధవారం బయల్దేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పండరి బస్సుకు పూజ చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి నాందేడ్లోని గురుద్వార్ చేరుకొని, తెల్లవారు జామున పండరీపూర్కు చేరుకుంటుంది. అక్కడ విఠలేశ్వరుని దర్శించుకుని, అదే రోజు తుల్జ్జాభవాని అమ్మవారిని దర్శనం చేసుకుని, మరుసటి రోజు నిర్మల్ చేరుకుంటుంది. జనవరి 1న శబరిమలకు బస్సు నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి శబరిమలకు జనవరి 1న సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి బుధవారం తెలిపారు. ఈ బస్సు అరుణాచలం, పలని, శబరిమల, మధురై వరకు వెళ్తుందని పేర్కొన్నారు. మొత్తం ఈ టూర్ ఆరు రోజులు ఉంటుందని, ఒకరికి టికెట్ రూ.7,250గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సరస్వతి కాలువకు నీరు విడుదల
లక్ష్మణచాంద: జిల్లాలోని వివిధ మండలాల వ రప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సరస్వతి కా లువకు అధికారులు బుధవారం నీటిని విడుద ల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నిర్మల్ జిల్లాలోని లక్ష్మ ణచాంద, నిర్మల్ రూరల్, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలకు సాగునీ రు అందించేందుకు రబీ పంటకు ప్రాజెక్టు డీఈ నరేశ్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించా రు. సరస్వతి కాలువ ద్వారా సాగునీరు వారబందీ పద్ధతిలో విడుదలవుతుందని తెలిపారు. -
కుష్ఠు సర్వే డబ్బులు చెల్లించాలి
నిర్మల్చైన్గేట్: కుష్ఠు సర్వేకు సంబంధించి పెండింగ్లో డబ్బులు చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత అన్నారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రలోని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర అధికారులు గతంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేర లేదన్నారు. పని భారం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి చాలీచాల ని పారితోషికాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, కోశాధికారి లక్ష్మి, రాంనగర్ పీహెచ్సీ అధ్యక్షురాలు గంగలక్ష్మి, కార్యదర్శి భార్గవి పాల్గొన్నారు. -
● జనవరి నుంచి విడుదలకు ప్రణాళిక ● ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
యాసంగి పంటలకు కడెం నీరు కడెం: యాసంగి పంటలకు కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కడెంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల రైతులతో చర్చించారు. జనవరి మొదటి వారంలో యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రేపు ‘రబతుకంతా బాల్యమే’ ఆవిష్కరణ నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖకవి, రచయిత చట్ల గజ్జరాం రచించిన ‘బ్రతుకంతా బాల్యమే(వచనకావ్యం)’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 25న(గురువారం) నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపుకిషన్ చేతులమీదుగా పుస్తకం ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. విశిష్ట అతిథులుగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు అప్పాల చక్రధారి, దామెర రాములు, తుమ్మల దేవరావు తదితరులు హాజరవుతారని వివరించారు. కార్యక్రమానికి జిల్లాలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలు హాజరు కావాలని కోరారు. ఈ–ఆఫీస్పై శిక్షణ భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులకు ఈ–ఆఫీస్పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లోని ఈ–విభాగం అధికారి మీర్జా షీఫీ మున్సిపల్ అధికారులు, ఉద్యోగులకు ఆయా విభాగాల పోర్టల్లు, వాటి వినియోగం, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఈ సంతోష్, టీపీవో అనురాధ, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి
నిర్మల్చైన్గేట్: ప్రజల ఉపాధిని దెబ్బతీసే జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన ప్రజల ఉపాధిని దెబ్బతీసే జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జిల్లా నాయకులు నందిరామయ్య, దుర్గం నూతన్కుమార్, ఎస్ఎన్.రెడ్డి, జే.రాజు, కె.రాజన్న, సురేశ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెల్లగా, ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్తగా జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం దేశంలోని పేద బడుగు బలహీనవర్గాల ఉపాధిని దెబ్బతీయడమేనని విమర్శించారు. చట్టంలో పని హక్కుని తీసి వేయడం, 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయించడం చూస్తుంటే రానున్న రోజుల్లో చట్టాన్ని, ఉపాధి హ క్కుని రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. జీ రామ్జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని, మెరుగైన ఉపాధి చట్టాన్ని సాధిస్తామన్నారు. నిరసనలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, మహమూద్, రామ్లక్ష్మణ్, బక్కన్న, సుజాత, వెంకటేశ్, నారాయణ, గంగన్న పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ట్రామాకేర్
నిర్మల్మహాపూజ ప్రచారయాత్ర నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ సమక్షంలో ప్రచార రథం నిర్వహణపై చర్చించారు. కలెక్టర్ను కలిసిన డీఎఫ్వో నిర్మల్చైన్గేట్: జిల్లా అటవీ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుశాంత్ సుఖ్దేవ్ బోబడే మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పూల మొక్క అందించారు. డీఎఫ్వోకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం జిల్లా అటవీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నిర్మల్చైన్గేట్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ’గోల్డెన్ అవర్’లో మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జిల్లాలో మొదటి విడతగా భైంసా ఏరియా ఆస్పత్రిలో ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొదట భైంసా ఏరియా ఆస్పత్రిలో.. జిల్లాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో భైంసా ఏరియా ఆస్పత్రి, ఖానాపూర్, నర్సాపూర్, ముధోల్లో సముదాయ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్ఖసీలు) ఉన్నాయి. మొదట భైంసా ఆస్పత్రిలో పనులు ప్రారంభిస్తారు. ఇక్కడ రోజూ వందలాది ఓపీడీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో రోడ్డు ప్రమాదాల కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బాధితులను హైదరాబాద్, నిజామాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోంది. ట్రామా సెంటర్లు ఏర్పడితే తక్షణ చికిత్స సాధ్యమవుతుంది. అధునాతన సౌకర్యాలు.. ట్రామా కేర్ సెంటర్లలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్, 5 ఐసీయూ బెడ్లు, 5 స్టెప్డౌన్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. ప్రమాదాల్లో గాయపడినవారిని మొదటి గంటలో (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి చేర్చితే ప్రాణాలు కాపాడవచ్చు. నిష్ణాత వైద్య సిబ్బంది, అధునాతన పరికరాలతో సమగ్ర చికిత్స అందిస్తారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సీఎం ప్రజావాణిలో వినతి
ఖానాపూర్: ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇంటిగ్రేటెట్ స్కూల్ సాధన సమితి ప్రధాన కార్యదర్శి కాశవేణి ప్రణయ్ కోరారు. ఈ విషయమై హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కార్యాలయంలోనూ వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు సరిపడా స్థలం లేదని అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఉట్నూర్కు తరలించారని పేర్కొన్నారు. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు. -
చిట్టిపొట్టి రైతులు..
జాతీయ రైతు దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులు రైతు వేషధారణలో వేడుకల్లో పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్లో విద్యార్థులు ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. మొక్కజొన్నలో కలుపు తీశారు. పంటకు నీరు పెట్టారు. మందు చల్లారు. ఖానాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. మస్కాపూర్ గ్రామంలోని విద్యార్థుల రైతు వేషధారణలో ఆకట్టుకున్నారు. – లక్ష్మణచాంద/ఖానాపూర్ -
కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నిర్మల్ న్యాయవాది
నిర్మల్చైన్గేట్: నిర్మల్కు చెందిన హైకోర్టు న్యాయవాది ఎస్.శ్రీనివాసాచారి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ వ్యవహారాలు, సాధికారిక శాఖ ద్వారా ఈ నియామక ప్రక్రియ జరిగింది. హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా నియమితులైన శ్రీనివాసాచారికి పాస్ పోర్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఎన్ఐఏ తదితర విభాగాలను కేటాయించారు. ఇప్పటికే శ్రీనివాసచారి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా కొనసాగారు. సంబంధిత శాఖ మరోసారి అవకాశం కల్పించింది. -
యాప్లోనే యూరియా
నిర్మల్చైన్గేట్: వానాకాలం పంటలకు సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బంది పడ్డా రు. చాలా మంది అదనుకు ఎరువు వేయలేకపోయారు. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ఇక చాలాచోట్ల రైతుల యూరియా కోసం రోడ్లెక్కారు. ఈ నేపథ్యంలో యాసంగిలో అలాంటి సమస్య రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్లో సకాలంలో ఎరువులు అందించడంతోపాటు వాడకాన్ని నియంత్రించేందుకు యూరియా బుకింగ్ యాప్ను తెచ్చింది. ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇంటి నుంచే బుకింగ్ చేసి సమీప దుకాణాల్లో ఎరువులు స్వీకరించవచ్చు. యాసంగి సాగు ఇలా.. జిల్లాలో యాసంగి సీజన్లో 2.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా. వరి 1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న లక్ష ఎకరాలు, శనగ 50 వేల ఎకరాలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. ఈ పంటలకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 11 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సరఫరాలు చేస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే.. రైతులు తమ అవసరాల ప్రకారం కాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే యూరియా పొందుతారు. యాప్లో పంట వివరాలు, ఎకరాల సంఖ్య నమోదు చేస్తే అవసరమైన బస్తాలు, సమయాలు సూచిస్తుంది. శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారం ఎకరానికి వరికి 2 బస్తాలు, మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్నకు 2 బస్తాలు, శనగకు 1 బస్తా కేటాయిస్తారు. బుకింగ్ తర్వాత సమీప దుకాణాల్లో స్వీకరించవచ్చు. యాప్ వినియోగం ఇలా.. మొబైల్లో యాప్ తెరిచి సిటిజన్ లాగిన్ ఎంపికలో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అ వ్వాలి. రాష్ట్ర, జిల్లా, సీజన్ (రబీ/ఖరీఫ్), పాస్ బుక్ నంబర్, పంటల వివరాలు నమోదు చే యాలి. ఆధారంగా బస్తాల సంఖ్య, 15 రోజుల్లో దశలవారీ సరఫరా వివరాలు కనిపిస్తాయి. పాస్బుక్ లేని కౌలు రైతులు ఆధార్తో నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ ఐడీతో దుకాణంలో డబ్బు చెల్లించి ఎరువులు పొందాలి. కొనసాగుతున్న శిక్షణ.. యూరియా బుకింగ్ యాప్పై మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులకు మొదట శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం డీలర్లు, పీఏసీఎస్ సీఈఓలకు శిక్షణ కొనసాగుతుంది. ఈ నెల 20 నుంచి యాప్ను ప్రారంభించాం. రైతులకు, డీలర్లకు అవగాహన కల్పిస్తున్నాం. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
పోస్టర్లు విడుదల
నిర్మల్చైన్గేట్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్’ పోస్టర్లను అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు బాహ్య ప్రపంచానికి తెలియని గమ్యస్థానాలను కనుగొనడం, ప్రకృతి, వన్యప్రాణి, ఆర్ట్, కల్చర్, హెరిటేజ్, వాటర్, రూరల్ ఏరియాలో బస, ఆధ్యాత్మికత, అడ్వెంచర్ వంటి అంశాలపై 3 ఫొటోలు సమర్పించాలన్నారు. కనెక్టివిటీ, దూరం, రవాణా, గూగుల్ లొకేషన్, 100 పదాలతో ప్రదేశం సందర్శించిన సమయం, బస, బడ్జెట్, సేఫ్టీ గురించి వివరణను 60 సెకన్ల వీడియోలో పొందుపరచాలని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు జనవరి 5లోగా సమర్పించాలని, గెలుపొందిన వారి వివరాలు సంక్రాంతి పండుగ రోజు వెల్లడిస్తామని తెలిపారు. మొదటి విజేతకు రూ.50 వేలు, రెండో విజేతకు రూ.30 వేలు, తతీయ విజేతకు రూ.20 వేలతోపాటు మరో 10 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని వివరించారు. 2 రోజులు ఉచితంగా హరిత హోటల్స్లో బస సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: ఈనెల 22న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన జోనల్స్థాయి సాఫ్ట్ బా ల్, బేస్ బాల్ అండర్–14 బాలుర, బాలికల పోటీల్లో జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సాప్ట్బాల్లో జి.రిశ్విక్, సాక్షి యాదవ్, బేస్ బాల్లో నిహారిక బి.సాయి తేజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ నాగభూషణం, ప్రిన్సిపాల్ మోహన్రెడ్డిలు విద్యార్థులను మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు గిరిప్రసాద్, కృష్ణవేణి, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆస్పిరేషన్ బ్లాక్ను సందర్శించిన సీపీవో
పెంబి: జిల్లాలోని ఆస్పిరేషన్ బ్లాక్ అయిన పెంబి మండలంలోని పలు గ్రామాలను మంగళవారం నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ ప్రత్యేక అధికారి శిల్పారావు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్తో కలిసి సందర్శించారు. నాగాపూర్, పెంబి, మందపల్లి, కోసగుట్ట, షెట్పల్లి, జంగుగూడ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. మందపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, భోజనం, మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా శిల్పారావు మాట్లాడుతూ.. ఆస్పిరేషన్ బ్లాక్తో పెంబి మండలం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళా సంఘాలతో ముఖాముఖి చర్చించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఆయిల్పాం క్షేత్రం, ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్టీ సంక్షేమ అధి కారి అంబాజీ, డీఈవో భోజన్న, ఎంపీడీవో సుధాకర్, ఐకేపీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఖోఖో పోటీలు
ముధోల్: మండలంలోని ఆష్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా ఎస్సై బిట్లా పెర్సిస్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో రాణించాలని సూ చించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన 30 మంది విద్యార్థులను జిల్లాస్థాయికి ఎంపిక చేసిన ట్లు ఎంఈవో రమణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆష్ట సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, ఎస్జీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారావు, పీఈటీఏ భోజన్న, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జీపీవోల నూతన కార్యవర్గం
నిర్మల్చైన్గేట్: జీపీవోల నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోనీ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.వెంకటి, ప్రధాన కార్యదర్శిగా ఓ.గంగాధర్, వైస్ ప్రెసిడెంట్లుగా పి.ఈశ్వర్, ఎం.సంతోష్, జాయింట్ సెక్రెటరీలుగా ఫిర్దోస్, అశోక్, క్యాషియర్గా అశోక్, మహిళా అధ్యక్షురాలిగా కే.రేఖ, కార్యదర్శిగా జి. ప్రనూష, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ. నర్సయ్య, ప్రచార కార్యదర్శిగా ఎండీ ఇస్మాయిల్, ప్రచార కార్యదర్శులుగా వెంకటరమణ, మక్కన్న, పలు వురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
ఫలితాలపై పోస్టుమార్టం
నిర్మల్పాన్ ఇండియా ప్రస్థానం! సింగరేణి ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలి నిర్మల్ రూరల్: విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలని డీఈవో దర్శనం భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీని సోమవారం ఆయన పరిశీలించారు. గణిత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గణిత అభివద్ధితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి గణితాభివృద్ధిని పరీక్షించారు. నిర్మల్: జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అతితక్కువ సమయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన సొంత నియోజకవర్గంలో అధికస్థానాలు సాధించిన నిర్మల్, ముధోల్లో కాంగ్రెస్ కొంత వెనుకంజలో ఉంది. డీసీసీగా పగ్గాలు చేపట్టడం, పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఆదివారం బొజ్జుపటేల్ హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. జిల్లాలో వచ్చిన ఫలితాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ సాధించిన స్థానాలపై సంతృప్తి వ్యక్తంచేస్తూనే, బీజేపీ ఆధిక్యతపై దృష్టిపెట్టాలంటూ నూతన డీసీసీ అధ్యక్షుడికి దిశానిర్దేశం చేశారు. గోదావరిపై మామడ మండలం పొన్కల్వద్ద సదర్మట్ బ్యారేజీ దాదాపు పూర్తికావడంతో ఫిబ్రవరిలో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు రానున్నారు. ‘స్థానికం’ వరకు బలపడాలి.. జిల్లాలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మంచి క్యాడర్, ప్రజల్లో ఆదరణ ఉందని సీఎం తెలిపినట్లు డీసీసీ పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల వరకు పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలని చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నేతలు, వారి మధ్య సమన్వయ లోపాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టికృషి, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ కంటే ఎక్కువ ఫలితాలను రాబట్టేలా ప్రణాళిక ప్రకారం వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సమన్వయమే అసలు సమస్య.. కాంగ్రెస్ పార్టీకి పల్లెల నుంచి పట్టణాల దాకా పక్కాగా క్యాడర్ ఉంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నేతలూ ఉన్నారు. కానీ.. చాలాచోట్ల బడాలీడర్ల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చాలా మండలాల్లో ఇద్దరు సీనియర్ నేతలకు చెందిన మద్దతుదారులు బరిలో నిలిచారు. సొంతపార్టీ నుంచే రెబల్స్ ఉండటం ఇద్దరినీ ఓడించింది. ప్రధానంగా నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య సమన్వయం, సఖ్యత లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్లు అధిష్టానం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సమస్యలను డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్ అధిగమించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సీఎం సూచనలతో పార్టీ బలోపేతం.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల్లో అధికస్థానాలు గెలిచేలా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో నేతలందరినీ కలుపుకొని, సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తాం. – వెడ్మ బొజ్జుపటేల్, డీసీసీ అధ్యక్షుడు ‘పది’కి ప్రత్యేక ప్రణాళికఫిబ్రవరిలో జిల్లాకు సీఎం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్రెడ్డి ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. ఫిబ్రవరిలో సీఎం జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆదివారం సీఎంను కలిసి ఇక్కడి సమస్యలను, అభివృద్ధి పనులను వివరించారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో తాను జిల్లాకు రానున్నట్లు తెలిపారని బొజ్జు తెలిపారు. మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ ఆనకట్ట ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనుల విషయంలో ముఖ్యమంత్రి రానున్నట్లు చెప్పారు. నిర్మల్, ముధోల్పై ఆరా.. జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలను గెలుచుకుంది. ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్ సొంత నియోజకవర్గం కావడంతో అక్కడి పంచాయతీలు అధికార పార్టీవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలపై హర్షం వ్యక్తంచేసిన సీఎం రేవంత్ బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి సొంత నియోజకవర్గమైన నిర్మల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఇక ముధోల్ నియోజకవర్గంలో పార్టీ చాలా పంచాయతీల్లో ఓడిపోవడంపై క్షేత్రస్థాయిలో ఆరా తీయాలని, ఓటమికి గల కారణాలను విశ్లేషించాలని డీసీసీకి సూచించారు. -
‘ఆస్పిరేషన్ బ్లాక్’ పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్చైన్గేట్: పెంబి మండలంలో నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రత్యేకాధికారి శిల్పారావు అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో సోమవారం ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ అమలుతీరుపై ఆమె కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, పోషకా హారం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అధికారులు సమన్వయంగా కృషి చేసి, భవిష్యత్తులో అన్ని రంగాల్లో పెంబి బ్లాక్ను అభివృద్ధి చేయాలన్నారు. సమీక్ష సమావేశానికి ముందు కలెక్టరేట్కు వచ్చిన ప్రత్యేకాధికారికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రి రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డీఈవో భోజన్న, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో శంకర్, పశువైద్యశాఖ అధికారి బాలిక్ అహ్మద్, ఎల్డీ ఎం రామ్ గోపాల్తో అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో ‘కొత్త’ జోష్
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. జిల్లాలోని 399 పంచాయతీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 2024 జనవరి 30న నాటి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతను అప్పగించింది. దీంతో 2 ఫిబ్రవరి 2024న గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఆయా శాఖలకు చెందిన గెజిటెడ్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఎట్టకేలకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. సమస్యల స్వాగతం.. కొత్తగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేకాధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 22నెలలుగా వారి పాలనలోనే పంచాయతీలు కొనసాగాయి. ఇంతకాలం పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. చెత్త నిర్వహణ కొరవడింది. తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. వీధి దీపాల కోసం వాడుకుంటున్న విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులొస్తేనే.. నూతన పాలకవర్గాల ఆశలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఉన్నాయి. పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత డెయినేజీలు తదితర పనులు అటకెక్కాయి. వీటిని పూర్తి చేయడంతో పాటు సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, బోర్ల నిర్వహణ ఖర్చులు.. ఇప్పుడు కొత్త సర్పంచ్లకు భారంగా మారనున్నాయి. త్వరలో శిక్షణ కార్యక్రమాలు.. కొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతనంగా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రామపాలన, సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, హరితహారం, గ్రామాభివద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రి, స్టేషనరీని సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సర్పంచ్గా బాధ్యతలు తీసుకుంటే తమ గ్రామాలు, వార్డులు బాగుపడతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.నిలిచిన కేంద్రం నిధులు.. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేక పోయింది. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులు మోయక తప్పలేదు. చాలా మంది అప్పుల పాలయ్యారు. కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పనుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైతేగానీ పంచాయతీల సమస్యలు పరిష్కరించడం సాధ్యమయ్యేపని కాదని పలువురు స్పష్టం చేస్తున్నారు. -
రేపు బాసరలో లక్ష దీపోత్సవం
బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ఈ నెల 24న బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రాజయోగి వెంకటస్వామి, ఆత్మానందాశ్రమం(నృసింహపురం), రుస్తుంపేట, మెదక్ జిల్లా ఆధ్వర్యంలో 41వ లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 24న హుండీ ఆదాయం లెక్కింపు... శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీ ఆదాయాన్ని ఈ నెల 24న అందరి సమక్షంలో లెక్కించనున్నట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సేవా భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఆలయానికి విరాళం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుజాత స్వరాజ్ అనే భక్తులు కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉచిత అన్నదానం కోసం రూ.2లక్షల 1వెయ్యి, గోశాల గ్రాసం కోసం రూ.25వేలు ఆలయ ఈవో అంజనాదేవికి చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు.అనంతరం ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. -
‘ఎస్ఐఆర్’ సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగమైన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఏఆర్వోలతో సోమవారం ఎస్ఐఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు దాదాపు 10వేల చొప్పున, వారం రోజుల లోపు మ్యాపింగ్ ప్రక్రియ నమోదు కావాలని ఆదేశించారు. నిర్ధిష్ట సమయంలోపు ఈ ప్రక్రియ ముగించాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు, ఓటరు జాబితాలో సరిగా లేని ఓటర్ల ఫొటోలు గుర్తించి, ఫారం నంబర్ 8 ద్వారా అసలైన ఫొటోలతో ఆధునీకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సరిపడినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకారం.. అభివృద్ధికి శ్రీకారం
లోకేశ్వరం: జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రమాణ స్వీకార వేడుకలే కాకుండా, పదవి చేపట్టిన తొలిరోజే పలు గ్రామాల్లో నూతన సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టారు. లోకేశ్వరం మండలంలోని రాయాపూర్ కాండ్లీ సర్పంచ్ బాతురి వెంకటేశ్ ప్రమాణ స్వీకరణ అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో వీది దీపాలను అమర్చారు. లోకేశ్వరం సర్పంచ్ దార్వాడి కపిల్ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పథకం ప్రీమియంను చెల్లించి కార్మికులకు కార్డులు అందజేశారు. ఏదైనా ప్రమాదంలో జీపీ కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.15లక్షల బీమా వర్తిసుందన్నారు. ధర్మోర గ్రామ సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి ప్రభుత్వం అందించే తన వేతనం నుంచి ఒక్క రూపాయి మాత్రమే తన సొంత ఖర్చులకు వాడుకుంటానని, మిగితా నగదు గ్రామంలో నిరుపేదలకు అందజేస్తానన్నారు. హథ్గాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతుండగా, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ రమేశ్ పాఠశాల వరకు పైప్లైన్ తవ్వించి తాగునీటి సౌకర్యం కల్పించారు. రూప్లైట్ల ఏర్పాటు ఖానాపూర్: మండలంలోని రాజూరా గ్రామానికి చెందిన చేగంటి మల్లేశ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రూ.50వేలకుపైగా తన సొంత డబ్బులతో గ్రామంలోని ప్రధాన రహదారి వెంట విద్యుత్ స్తంభాలతో పాటు పలు విగ్రహాలకు రూప్(బెల్ట్)లైట్లను ఏర్పాటు చేశారు. -
వావ్.. గ్రామం కోసం ఎలుగుబంటిలా
సాక్షి నిర్మల్: ఆ గ్రామంలో ప్రజల కష్టాలను తీరుస్తానని ఆ యువ సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. దీంతో అతని మాట నమ్మిన ప్రజలు తమ కష్టాలను తీరుస్తాడనే ఉద్దేశంతో అతనని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఇచ్చిన మాటను ఏలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రహించి దానిని అరికట్టడం కోసం ఏకంగా తానే ఎలుగుబంటి రూపం ధరించి కోతులను తరిమాడు.సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వారు గెలవగానే మర్చిపోతుంటారు. మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ వారికి ఆవాగ్దానాలు గుర్తుకురావు. కానీ నిర్మల్లో మాత్రం ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ గ్రామ బాగోగుల చూస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకోవడం కోసం ఏకంగా ఎలుగుబంటి రూపమే ధరించారు.నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గత రెండు, మూడు ఏళ్లుగా గ్రామ్ంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలంతా కలిసి చందాలు వేసుకొని వాటిని తరిమికొట్టేందుకు బోన్ల ఏర్పాటు చేశారు. వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్దగా ప్రభావం లేకుండా పోయింది.దీంతో ఏలాగైనా కోతులను గ్రామం నుంచి తరిమికొట్టాలని భావించిన గ్రామ సర్పంచ్ రంజిత్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతుల బెడదను నివారించడానికి ఎలుగుబంటి వేశం వేసి గ్రామంలో కలియతిరిగారు. వానరాలను బెదిరిస్తూ వాటిని అక్కడి నుంచి తరిమికొట్టారు. కోతులు సైతం ఆయనను చూసి నిజమైన బల్లూకమోనని భావించి ఆ గ్రామం నుంచి పరారవుతున్నాయి.Innovative solution to #monkey problem – young #sarpanch dressed as a bear.The new sarpanch dressed as a bear to drive away the monkey menace in the village. When he approached monkeys in bear getup,the monkeys ran away.#Nirmal District, Kadem Mandal – #Telangana pic.twitter.com/ICCs0i6z5P— Ramana Reddy (@RamanaR69561502) December 19, 2025దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో కోతుల బెడద కొంతమేర తగ్గిందని ప్రజలు అంటున్నారు. యువ సర్పంచ్ ఆలోచనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే తన ఆలోచనను గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు. -
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభఆదిలాబాద్టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారులు ప్రతిభ కనబర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని రైల్వే నిలయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.కారును ఢీ కొట్టిన లారీసాత్నాల: భోరజ్ మండలం తర్ణం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై గౌతమ్ పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అగర్వాల్ రామావతావర్ నిరాల గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఆదిలాబాద్కు కారులో తిరిగి వెళ్తున్నారు. తర్ణం సమీపంలో ఎదురుగా, అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. దీంతో కారు ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో పాటు అగర్వాల్ రామావతావర్కు గాయాలయ్యాయి. అగర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రూర్బన్ పరిశ్రమల పరిశీలన
కుంటాల: మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో భాగంగా నిర్మించిన ఆడిటోరియం, న్యాప్కిన్ సెంటర్, మార్కెట్ షెడ్, దాల్మిల్ను ఏపీడీ నాగవర్ధన్ ఆదివారం పరిశీ లించారు. వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఏపీఎంలు లక్ష్మణ్, బోస్, ఏపీవో జయదేవ్, సీసీ ముత్యం తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుఖానాపూర్: పట్టణంలోని కుమురంభీ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయలయ్యాయి. నిర్మల్ నుంచి కడెం మండలం కన్నాపుర్కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న లక్ష్మీనారాయణ కుక్క అడ్డుగా రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిపై కేసు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేసిన దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదివారం టూటౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం రాహుల్ 2024 ఏప్రిల్లో దుర్గం శేఖర్ సొసైటీకి చెందిన మహేందర్, మోహన్లకు రూ.40వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగానికి నెలకు రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పి ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని వారిని అడగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్నగర్కు చెందిన దుర్గం శేఖర్ను, కేఆర్కే కాలనీకి చెందిన కావటి మోహన్ను అరెస్టు చేయగా, మహేందర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరు ఇప్పటివరకు మరో ఆరుగురిని మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సంస్థ ద్వారా మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని వివరించారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే బ్రోకర్లు, నకిలీ సంస్థలను నమ్మవద్దని, డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులను ఎవరైనా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ట్రిపుల్ ఐటీని సందర్శించిన విద్యార్థులు
బాసర: విద్యా, విజ్ఞాన, అవగాహన యాత్రలో భా గంగా బాన్సువాడ, నస్రుల్లాబాద్ తెలంగాణ ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు 547 మంది, ఉపాధ్యాయులు 47 మంది బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ సందర్శనతో విజ్ఞా న సంబంధిత శాసీ్త్రయ దృక్పథం ఏర్పడుతుందన్నా రు. సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక త పెంపొందుతాయని తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ విద్యార్థులకు క్యాంపస్ సందర్శనతో వాస్తవ అనుభవం లభిస్తుందన్నారు. అకాడమిక్, సామాజిక, క్యాంపస్ సంస్కృతి, ల్యాబ్లు, లై బ్రరీలు, హాస్టల్స్ వంటి సౌకర్యాలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో అవగాహన కలుగుతుందన్నారు. అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, కె.మహేశ్, ఎస్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
ఖానాపూర్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.నరేంద్రబాబు, బీవీ.రమణారావు అన్నారు. పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం మండల అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు చట్ట సవరణ చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. విద్యా హ క్కు చట్టం ప్రకారం 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే దిశగా యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా దురిశెట్టి శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కోట వే ణు, పరమేశ్వర్రెడ్డి, రమేశ్రెడ్డి, ప్రేమ్దాస్, కార్గం ప్రవీణ్, గంగామోహన్, దాసరి నర్స య్య, వాల్గోట్ కిషన్, బెజ్జారపు మురళి, రాజాశ్రీనివాస్రెడ్డి, జాడి శ్రీనివాస్, రమాదేవి, శ్రీలత, గంగన్న, గంగనర్సయ్య, సుజా త, ప్రణయశీల తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య చైతన్యంతో ఫిట్ ఇండియా
నిర్మల్ఖిల్లా: ప్రతి వ్యక్తికి ఆరోగ్య చైతన్య అవసరమ ని తద్వారా ఆరోగ్య భారతం ఏర్పడి ‘ఫిట్ ఇండి యా’ కార్యక్రమం విజయవంతమవుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బి.శ్రీకాంత్రెడ్డి అ న్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ అనుమతితో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక శాఖ అధికారి నర్సింహారెడ్డి, నిర్మల్ సైకిల్ క్లబ్ సభ్యులు డాక్టర్ బీఎల్ఎన్.రెడ్డి, డాక్టర్ రఘునందన్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు భోజన్న, రాకేశ్రెడ్డి, భిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అంకురాలు 2’ ఆవిష్కరణ
లక్ష్మణచాంద: హైదరాబాద్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాల చెలిమి మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగిన జాతీయస్థాయి కథల పోటీల బహుమతి ప్రదానోత్సవం, గ్రంథాలయం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తె లంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సెక్రటరీ డాక్టర్ రావి శారద ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాల గొప్పతనాన్ని తెలియజేశారు. సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ప్రభు త్వ ఉన్నత పాఠశాల కు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కొండూరు పోతన్న సంపాదకత్వంలో విద్యార్థులు రచించిన అంకురాలు 2 కథల సంపుటిని బాల చెలిమి సంపాదకులు డాక్టర్ మణికొండ వేదకుమార్తో కలిసి ఆవిష్కరించారు. అంకురాలు 2 సంపాదకుడు కొండూరు పోతన్నను సన్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని బాల చెలిమి మాసపత్రిక సంపాదకులు 20 పాఠశాలలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయ డం జరిగింది. అందులో సోన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఎంపికై ంది. -
..అనే నేను
నిర్మల్7గజ్జలమ్మ దేవికి పూజలు కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకి సేవ నిర్వహించారు. మహా రాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. నిర్మల్చైన్గేట్: పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు ఉండగా, 399 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 399 మంది సర్పంచులు, 399 మంది ఉప సర్పంచులతోపాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల తర్వాత కొత్త పాలకులు..తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి 23 నెలలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. ఇన్నాల్లు పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయి. పంచాయతీ భవనాలకు రంగులు..కొత్త పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నాయి. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రిపేర్లు చేయించి రంగులు వేశారు. కొత్త ఫ్యాన్లు, ఫర్నిచర్ సమకూర్చారు. కొత్త సర్పంచులు సొంత నిధులతో వసతులు సమకూర్చుకున్నారు. ప్రభుత్వ ఫండ్స్ లేకపోయినా జనరల్ ఫండ్స్, సొంత ఖర్చులతో భవనాలు మెరుస్తున్నాయి. శానిటేషన్ పనులు వేగవంతమై, వీధులు శుభ్రం చేస్తున్నారు. ప్రమాణం ఇలా..అన్ని పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం సోమవారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు ‘గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన (విజేత పేరు) అను నేను.. శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రమాణం చేయాలి. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను స్వీకరిస్తారు. -
కడెం.. సరికొత్త రికార్డు
కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్లోనూ పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతోంది. గత ఐదేళ్లలో డిసెంబర్లో ఈ స్థాయిలో నీటిమట్టం లేదు. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎల్ (700 అడుగులు) చేరింది. సాగు నీటి ప్రణాళిక సిద్ధం కాకముందే ఆయకట్టు రైతులు యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు. రికార్డుస్థాయి నీటి మట్టం..గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజె క్టు రికార్డు స్థాయి నీటిమట్టం కలిగి ఉంది. రాష్ట్ర ప్ర భుత్వం రూ.9.26 కోట్లతో మరమ్మతులు చేయించడం, గేట్ల లీకేజీలను అరికట్టడం, అధికారులు, ఇంజినీర్ల కృషితో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం మెయింటేన్ అవుతోంది. రేపు నీటివిడుదలపై సమావేశంకడెం ప్రాజెక్టు ఆయకట్టుకు యాసంగి సాగునీటి విడుదలపై ఈనెల 23న, కడెం ఆయకట్టుకు రైతాంగంతో ఇరిగేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. రైతులతో చర్చించి ఆయకట్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. గత పదేళ్లలో డిసెంబర్లో కడెం నీటిమట్టం వివరాలు..సంవత్సరం నీటిమట్టం 2016 693.750 2017 687.650 2018 682.425 2019 699.075 2020 696.450 2021 698.925 2022 695.400 2023 683.700 2024 695.175 2025 700 కడెం ప్రాజెక్ట్: -
పది పరీక్షలపై రగడ
నిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలపై రగడ నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ ఈసారి మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజులపాటు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతీ పరీక్షకు 4 నుంచి 5 రోజుల వ్యవధి ఇవ్వడాన్ని విద్యాశాఖ సమర్థిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిస్తుందని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కొమురయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో రీ–షెడ్యూల్ అవకాశం ఉందని సంఘాలు తెలిపాయి. విద్యాశాఖ మాత్రం విద్యార్థుల ఒత్తిడి తగ్గించడం, పరీక్షలు సాఫీగా జరపడానికి సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల పద్ధతిని అనుసరిస్తున్నామని వాదిస్తోంది. నిర్వహణ సమస్యలు..నెల రోజులపాటు పరీక్షలు ఉపాధ్యాయులకు భారంగా మారతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల నుంచి పోలీసు స్టేషన్లకు, అక్కడి నుంచి కేంద్రాలకు రవాణా చేయడంలో ఎక్కువ కాలం పడటంతో లీకేజీ ప్రమాదం ఉందని, బాధ్యత తమపైనే పడుతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కొత్త షెడ్యూల్కు మార్చమని కోరుతున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విషయమై రాష్ట్ర శాఖ తరఫున ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. పరీక్షల షెడ్యూల్లో ఎక్కువ రోజులు విరామం రావడంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ మార్చాలి. – రమణారావు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అశాసీ్త్రయంగా పరీక్షల షెడ్యూల్ పదో తరగతి పరీక్షల షె డ్యూల్ అశాసీ్త్రయంగా ఉంది. హై స్కూల్ తరగతుల పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ మార్చా లి. ఏప్రిల్లో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా మూల్యాంకన ప్రక్రియలో జాప్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో లాగానే పరీక్షలు నిర్వహించాలి. – పెంట అశోక్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిజమాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి వచ్చిన హనుమాన్ భజనమండలి సభ్యులు ఆలయ మండపంలో ప్రత్యేక భజన నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శానికి తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్చార్జి ఈవో భూమయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ను సన్మానిస్తున్న ఆలయ సిబ్బందిఆలయ మండపంలో ఎమ్మెల్యే దంపతులు -
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపా టు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర విషయాలపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తదితరులను డీసీ సీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ ఆదివారం వేర్వేరుగా కలిశారు. అటవీ సమస్యలు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి డీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని సమష్టిగా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు తెలిపారు. గెలుపోటముల కారణాలను విశ్లేషించి, భవిష్యత్ వ్యూహరచన చేయాలని పేర్కొన్నారు. నాగోబా జాతర ఏర్పాట్లను సీఎంకు వివరించడంతోపాటు జాతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అదనపు నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. ఇందుకు రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. భట్టి విక్రమార్కను సన్మానిస్తున్న ఎమ్మెల్యే సీఎంకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే బొజ్జు -
లెక్క చెప్పాల్సిందే..
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు ఖర్చు వివరాలు ఎంపీడీవోలకు సమర్పించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఈ లెక్కలు సమర్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం..పంచాయతీ ప్రతినిధులుగా ఎన్నికై న వారు, మేమే గెలిచాం.. ఇక గ్రామానికి మేమే రాజులం అనే భావన వీడి.. సేవకులం అనే బాధ్యతను గుర్తించాలి. వారికి అధికారాలే కాదు.. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం మరిచినా.. కుర్చీకే ఎసరు రావచ్చు. పంచాయతీరాజ్ చట్టం –2018 స్థానిక పాలకులకు పగ్గాలు వేసి, అవి ప్రజల చేతికిచ్చింది. 5 వేల జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా తక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యు నికి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీవోకు నిర్దేశిత పద్ధతిలో లెక్కలు చెప్పాలి. సకాలంలో లెక్కలు చూపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడేళ్లు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తుంది. గెలిచిన వారు ఖర్చు వివరాలు ఇవ్వకుంటే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. మూడు విడతల లెక్కల సమర్పణఅభ్యర్థులు మూడు దశల్లో ఖర్చు వివరాలు అధికారులకు ఇవ్వాలి. ప్రచారం ప్రారంభంలో మొదటి విడత, ప్రచార మధ్యలో రెండో విడత, పోలింగ్కు ముందు రోజు మూడో విడతగా వివరాలు 45 రోజుల్లో పూర్తి లెక్కలు బిల్లులతో సమర్పించాలి. నామినేషన్ పత్రంలో పేర్కొన్న బ్యాంకు ఖాతా ద్వారానే ఖర్చులు నిర్వహించాలి. లెక్కల్లో చేర్చాల్సిన అంశాలుపోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రింట్/డిజిటల్ ప్రకటనలు, వాహన అద్దె, ఇంధనం, మైకులు, టెంట్లు, భోజనం, కార్యకర్తల వేతనాలు, టీ–షర్టులు, బ్యాడ్జీ లు, ప్రచార వాహనాల అలంకరణలు సహా అన్ని వివరాలు చేర్చాలి. ధరలు ఎన్నికల అధికారుల నిర్ణయం మేరకు ఉండాలి. మండల వ్యయ పరిశీలకులకు మాత్రమే లెక్కలు సమర్పించాలి. 1,858 మందిపై అనర్హత వేటు..2019 ఎన్నికల తర్వాత లెక్కలు చెప్పకపోవడంతో జిల్లాలో మొత్తం 1,858 మంది అనర్హతకు గురయ్యారు. వీరంతా 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో అనర్హత వేటు కాలపరిమితి ముగిసిపోయింది. -
నిర్మల్
క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ను సన్మానించిన ఎంపీడీవోలు నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ అభినాష్ అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్ను అన్ని మండలాల ఎంపీడీవోలు శనివారం కలెక్టరేట్లోని సన్మానించారు. మూ డు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎంపీడీవోలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహం గొప్పదని, ఆమె మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని తెలి పారు. అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవోలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు లక్ష్మీకాంత్, గజానన్, నీరజ్కుమార్, రాధ, అరుణ, రమాకాంత్ పాల్గొన్నారు. ఈ ఫొటో ఒక్కటి చాలు. నిండుగా పారుతున్న కడెం నదిని థర్మకోల్తో చేసిన తెప్పపై దాటి వెళ్తున్నారు. ఇందులో ఒకరిద్దరే మగవాళ్లు. మిగిలిన వాళ్లంతా మహిళలే. ఇంతకు ముందెన్నడూ వారికి ఇంతదూరం ఉన్న ఆ ఊరు తెలియదు. కఠినమైన ఈ దారీ తెలియదు. అయినా.. విధినిర్వహణ కోసం అలా వెళ్లారంతే. ఈనెల 11న నిర్వహించిన తొలివిడత పంచాయతీ ఎన్నికల కోసం పెంబి మండలంలోని కడెం నది అవతలివైపు ఉన్న అటవీగ్రామం యాపల్గూడ పంచాయతీకి మహిళ సిబ్బంది ఇలా ప్రమాదకరమైన తెప్ప ప్రయాణం చేశారు. వీరి పరిస్థితి తెలుసుకుని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషామస్రత్ ఖానం స్వయంగా వచ్చి జాగ్రత్తగా వెళ్లివచ్చేలా పర్యవేక్షించారు. నిర్మల్: జిల్లాలో పల్లెపోరు సాఫీగా పూర్తికావడం వెనుక ఎంతోమంది శ్రమ దాగిఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పడ్డ కష్టమూ ఉంది. దూరభారాన్ని, చలి వాతావరణాన్ని, కఠినమైన పరిస్థితులనూ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఒకరోజు ముందే వెళ్లి, రాత్రి అక్కడే బసచేసి, వేకువజామునే ఎన్నికలకు అన్నీ సిద్ధం చేశారు. పొద్దున ఏడింటి నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, మళ్లీ మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రిదాకా కౌంటింగ్, రీకౌంటింగ్లూ చేసి ఆ ఊళ్ల ఐదేళ్ల భవిష్యత్తును ప్రకటించి వచ్చారు. ఇలాంటి కఠినమైన పంచాయతీపోరును విజయవంతంగా నడిపించిన వారిలో ఉన్నతాధికారులతోపాటు సిబ్బందిలోనూ మహిళలే అధికంగా ఉండటం విశేషం. పంచాయతీలో మహిళాశక్తి.. జిల్లాలో మొత్తం 400 గ్రామపంచాయతీలు ఉండగా, దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో నామినేషన్లు రాని కారణంగా ఎన్నిక నిలిపివేశారు. మిగిలిన 399 జీపీల్లో 195 చోట్ల మహిళా అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. జనాభాలోనే కాకుండా పాలనలోనూ మహిళల శక్తి పెరుగుతోంది. రిజర్వేషన్ వచ్చిన పంచాయతీల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ మహిళ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి పంచాయతీ బరిలో దిగిన మహిళల్లో నిరక్షరాస్యులతోపాటు ఏకంగా డిగ్రీ, పీజీలు చదివినవారూ ఉన్నారు. ముగ్గురు ఉన్నతాధికారులూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ముందుండి నడిపించిన ముగ్గురు ఉన్నతాధికారులూ మహిళలే కావడం మరో విశేషం. కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిలతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం ఈ ముగ్గురు మహిళాఅధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తూ.. పంచాయతీలను పరిశీలిస్తూ.. విజయవంతం చేశారు. పిల్లలు, కుటుంబాలను వదిలి.. ఎన్నికల డ్యూటీలు నిర్వర్తించిన మహిళల్లో చాలామంది చిన్న పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను వదిలి విధులకు వచ్చారు. తూర్పు నుంచి పడమరకు, ఈ కొన నుంచి ఆ చివరనకు ఇలా చాలామంది మహిళలకు దాదాపు 100 కి.మీ. దూరంపైనే డ్యూటీలు పడ్డాయి. అయినా.. చాలామంది అతివలు దారి కూడా సరిగా లేని అటవీ గ్రామాలకూ వెళ్లారు. వణికిస్తున్న చలిలో రాత్రిపూట అలాంటి మారుమూల గ్రామాల్లో అరకొర వసతుల్లో బసచేశారు. వేకువజామునే పోలింగ్కు సిద్ధమై రోజంతా శ్రమించి విజయవంతంగా పూర్తిచేశారు. రాత్రి 10–11గంటల వరకూ కౌంటింగ్ చేసి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకున్నారు. ప్రజల సహకారంతో.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. అన్నిశాఖలు, అధికారులు, సిబ్బంది సహకారంతో పోలింగ్ విజయవంతంగా పూర్తిచేశాం. ఈ స్ఫూర్తితో రానున్న ఎన్నికలనూ పూర్తిచేస్తామన్న భరోసా ఏర్పడింది. –అభిలాషఅభినవ్, కలెక్టర్ సమష్టి కృషితో.. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేయడంలో సమష్టి కృషి ఉంది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కలిసి ప్రశాంతంగా ఎన్నికలను పూర్తిచేశాం. పోలింగ్ సాఫీగా పూర్తికావడానికి ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించారు. –జానకీషర్మిల, ఎస్పీ -
ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీ ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కుమ్మరి కృష్ణప్రసాద్కు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ కేవీ.రమణాచారి పర్యవేక్షణలో ‘సెల్ఫ్, సొసైటీ అండ్ ది మిడిల్ క్లాస్ ఇన్ ది సెలెక్టెడ్ నావల్స్ ఆఫ్ మంజుకపూర్’ అనే పరిశోధన అంశంపై కృష్ణ ప్రసాద్ సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి గాను తెలంగాణ విశ్వవిద్యాలయం ఈ పీహెచ్డీ ప్రదానం చేసింది. ఈ పరిశోధనలో భాగంగా కృష్ణప్రసాద్ పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడంతోపాటు, స్కోపస్ ఇండెక్స్డ్ ఎల్సివియర్ రీసెర్చ్ జర్నల్స్లో ఎనిమిది కంటే ఎక్కువ పరిశోధన వ్యాసాలను ప్రచురించి విశేష గుర్తింపు పొందారు. ఆయనను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎస్.విఠల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఆరోగ్యంగా ఎదగనిద్దాం
లక్ష్మణచాంద: చక్కటి పోషక పదార్థాలు, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించినప్పుడే పిల్ల లు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదుగుతారని డీఈవో భోజన్న అన్నారు. ప్రతీనెల మూడో శనివారం పాఠశాలల్లో నిర్వహించే పోషకుల దినోత్సవం సందర్భంగా సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ‘వంటల పండగ‘లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలను వంటగదికి పరిచయం చేసి ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలైన విటమిన్లు, కొవ్వులు, ఖనిజలవణాల ఆవశ్యకత తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు సమీకృత ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంతో ఉంటారన్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే చదువులో, ఆటల్లో ఉత్సాహం కనబరుస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రకరకాల వంటలను రుచి చూశారు. ఇందులో ఎంఈవో తోడిశెట్టి పరమేశ్వర్, హెచ్ఎం రాజులదేవి రమేశ్బాబు, పాఠశాల చైర్మన్ రాజవ్వ, ఉపాధ్యాయులు రాధ, మంగమ్మ, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మైదానాన్ని పరిశీలించిన స్పోర్ట్స్ అధికారి
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో స్థానిక యువకులు ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానాన్ని జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీకాంత్రెడ్డి శనివారం పరిశీలించారు. క్రీడా మైదానం ఏర్పాటు చేసిన స్థలం వివరాలు, ఇప్పటి వరకు యువకులు, గ్రామస్తులు మైదానం కోసం చేసిన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా యువకులు మాట్లాడుతూ తమకు అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున తాము ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానం అభివృద్ధి చేయాలని విన్నవించారు. స్పందించిన డీవైఎస్వో కనీసం 5 ఎకరాల స్థలం జిల్లా స్పోర్ట్స్ అథారిటీపేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తే తప్పకుండా మైదానం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడా పరికరాలు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ సామ్యూల్, యువకులు రాము, మాసురాజు, రెడ్ల వినయ్, బలాష్టు నవీన్, కరిపె ప్రశాంత్, వీడీసీ సభ్యులు ఆడెపు మహేందర్, సుకానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీర్లు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
బాసర: ఇంజినీర్లు వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆర్టీయూకేటీ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వ్యాపార ఆసక్తి పెంచేలా, విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగడానికి మౌలిక నైపుణ్యాలు అందించే ప్రేరణాత్మక సదస్సు విజయవంతమైంది. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల వినూత్న ఆలోచనలకు దోహదపడుతుందని మురళీ దర్శన్ పేర్కొన్నారు. ఇ2, ఇ3 విద్యార్థులను ఆకర్షణీయ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, తెరిచిన మార్కెట్లు, ఆర్థిక సమీకరణలతో యువ ఆవిష్కర్తలకు ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాపార ఆలోచనలు, ఎంట్రప్రెన్యూర్ పాత్ర, వ్యాపార స్థాపనలో రిస్క్లు తీసుకోవడం మధ్య తేడాలను స్పష్టం చేశారు. కీలక లక్షణాలు, నైపుణ్యాలు విజయవంతమైన వ్యాపారవేత్తలకు సృజనాత్మకత, పట్టుదల, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం, బాధ్యతాభావం, రిస్క్ తీరు అవసరమని వివరించారు. కమ్యూనికేషన్, సమస్యల పరిష్కారం, నిర్ణయ సామర్థ్యం, సాంకేతిక జ్ఞానం, మౌలిక వ్యాపార, మానవ సంబంధ నైపుణ్యాలపై దృష్టి సారించారు. సదస్సులో డిస్కవరీ, కాన్సెప్ట్ డెవలప్మెంట్, రిసోర్సింగ్, యాక్చువలైజేషన్, హార్వెస్టింగ్లతో ఐదు దశల వ్యాపార ప్రక్రియను వివరించారు. ఆలోచన నుంచి వృద్ధి వరకు మార్గదర్శకత్వం అందించారు. బిజినెస్ ప్లానింగ్, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక ప్రణాళిక, చట్టపరమైన అంశాలు, నిధుల సమీకరణ మార్గాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ (ఇంజినీరింగ్) డాక్టర్ కె.మహేశ్, ఐఐఈడీ కోఆర్డినేటర్ రాకేశ్రెడ్డి, ఎఫ్ఐడీ ఎక్స్టర్నల్ లింకేజెస్ దిల్బహార్ పాల్గొన్నారు. -
మాక్ డ్రిల్ ఏర్పాట్లు పరిశీలన
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీలో ఆదివారం నిర్వహించే విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ఏర్పాట్లను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ శనివారం పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమం జీఎన్ఆర్ కాలనీతోపాటు, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట స్టేషన్ అధికారి శివాజీ, సీపీవో జీవరత్నం, డీవైస్వో శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, ఉన్నారు. కొత్త భవనంలోకి రూరల్ ఠాణా నిర్మల్ రూరల్: నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ను నూతన భవనంలోకి మార్చారు. ఎల్లపల్లి శివారులో కొత్తగా నిర్మించిన ఆర్ఐ క్వార్టర్స్లోకి మార్చినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. కొత్త భవనాన్ని డీజీపీ శివధర్రెడ్డి ఇటీవలే ప్రారంభించారు. -
సురక్షిత డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ
నిర్మల్చైన్గేట్: సురక్షిత డ్రైవింగ్తో రహదారి ప్రమాదాలు నివారించవచ్చని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, లాఅండ్ఆర్డర్ డీజీ మహేష్ భగవత్తో అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుందన్నారు. రహదారి భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమాల్లో అధికారులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీల సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని తెలిపారు. తరచూ ప్రమాదాలు సంభవించే ప్రదేశాలను గుర్తిస్తూ, తగు రక్షణ చర్యలను చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ కేవలం నెల రోజులకే పరిమితం కాకుండా, అనునిత్యం నిర్వహించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చునన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సీట్బెల్ట్, హెల్మెట్, సురక్షిత డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పర్యవేక్షణ వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గుతాయని వివరించారు. విజయవంతానికి చర్యలు.. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులకు రహదారి నియమాలపై అవగాహన పెరిగేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, రవాణా అధికారి దుర్గాప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్లో ఫుల్ కిక్కు!
నిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికల ఉత్సాహం, చలి ప్రభావంతో జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 18 వరకు జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.42.57 కోట్ల ఆదాయం వచ్చింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో నెలాఖరులో మరో రూ.20 కోట్లు అదనంగా వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. . లిక్కర్కే మందుబాబుల మొగ్గు.. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ (విస్కీ, బ్రాండీ, రమ్) అమ్మకాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. 28వ తేదీ డేటా ప్రకారం 43,966 కేసులు అమ్ముడయ్యాయి. బీర్కు 33,481 కేసులు మాత్రమే. గ్రామీణ బెల్ట్ షాపులు కూడా ఈ పెరుగుదలకు కారణం. ఎన్నికల దావత్లలో హార్డ్ డ్రింక్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యర్థుల పోటీపై ఖర్చు పోటీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచే అభ్యర్థులు ఊరంతా మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు పోటాపోటీగా లిక్కర్ పంపారు. ప్రచారానికి వచ్చిన వారికి చుక్క, ముక్కతో దావత్లు ఏర్పాటు చేశారు. దీంతో అమ్మకాలు పెరిగాయి. నవంబర్ 26 నుంచి 650 బెల్ట్ షాపులు మూసివేశారు. ఎన్నికలకు 48 గంటల ముందు మద్య దుకాణాలు కూడా ఆగాయి. అయినా అభ్యర్థులు ముందుగానే స్టాక్ చేసుకుని, దూర ప్రాంతాల నుంచి లిక్కర్ తీసుకొచ్చారు. పోలీసు–ఎకై ్సజ్ నిఘా మధ్య కూడా అమ్మకాలు ఆగలేదు. ఈనెల 18 వరకు జిల్లాలో లిఫ్ట్ చేసిన మద్యం మొత్తం మద్యం షాపులు 47 జిల్లాలోని బార్లు 9 ఐఎంఎల్ 43,966 బాక్సులు బీర్లు 33481 బాక్సులు సెల్ వాల్యూ రూ.42,57,56,150 -
అన్ని పండుగలు జరుపుకోవాలి
నిర్మల్టౌన్: కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని పండుగలు జరుపుకోవాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. అన్ని మతాల ప్రజలు మత సామరస్యాన్ని పాటిస్తూ.. పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా పలువురు యేసు కీర్తిని చాటే పాటలు పాడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని అన్నారు. క్రిస్టియన్స్ అనేది ఒక మతం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపున వినాయక చవితి, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్తోపాటు అన్ని పండుగలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, కృష్ణ, నైలు, ఆర్ఎస్సైలు రవికుమార్, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విపత్తుల వేళ అప్రమత్తత అవసరం
నిర్మల్ఖిల్లా: ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ డ్రిల్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై సీఎస్ రామకృష్ణారావు, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) అధికారులతో కలిసి కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న నిర్వహించే విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని వివరించారు. వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమన్నారు. దాదాపు 35 శాఖలు సమన్వయంతో పని చేయాల ని సూచించారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీరు విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాల రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అనేవి వైపరీత్యాల సమయంలో అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహకారం అందిస్తాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. అన్నిరకాలుగా సిద్ధం.. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో విపత్తుల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈనెల 22న మాక్ డ్రిల్ విజయవంతం చేస్తామన్నారు. ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, విపత్తుల అంచనా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో నష్టాలు లేకుండా వరదలను ఎదుర్కున్నామని వివరించారు. ఇటీవల మండలానికి ఒకటి చొప్పున అత్యవసర సమయాల్లో ఉపయోగపడే వస్తువులతో కూడిన కిట్ను అందించామని చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
వరల్డ్ విజన్ సేవలు అభినందనీయం లక్ష్మణచాంద: వరల్డ్ విజన్ సేవలు అభినందనీయం అని డీఈవో భోజన్న అన్నారు. మండ ల కేంద్రంలోని కేజీబీవీలో వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 385 మందికి ఒక్కొక్కరికి రూ.480 విలువ చేసే మెటీరియల్ అందించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వరల్డ్ సభ్యులను కోరారు. ఇందులో ఎంఈవో అశోక్వర్మ, హెచ్ఎం రాజునాయక్, ఎస్వో నవిత, వరల్డ్ విజన్ జిల్లా కోఆర్డినేటర్ బ్రహ్మన్న, ఉపాధ్యాయులు హరిప్రసాద్, అశోక్ పాల్గొన్నారు. భైంసాటౌన్: ‘ఇందు కలదందు లేదన్న సందేహం వలదు..’ అన్నచందంగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు ఏసీబీకి పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉద్యోగులు, లంచావతారులు ఉ న్నా.. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడే ఇలాంటి ఏసీబీ దాడులు చేస్తోంది. వెలుగులోకి రాని వారెందరో ఇంకా ఆయా శాఖల్లో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్యులు మొదలు.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వరకు చేయి తడపనిదే ఏ పని జరగదన్నది బహిరంగ రహస్యం. ఇక, సొంత శాఖలోని ఉద్యోగులను సైతం వదలడం లేదు కొందరు లంచావతారులు. బాసర పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ భీమన్న తన తోటి ఉద్యోగి వద్ద రూ.9 వేలు ఫోన్పే ద్వారా పొందినందుకు ఏసీబీకి పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. పెరిగిన చైతన్యం.. అధికారుల్లో పెరిగిన అవినీతితో లేక ప్రజల్లో పెరిగిన చైతన్యమో కానీ.. ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగింది. విస్తృత ప్రచారం కూడా కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనం అందుతున్నా.. కొందరు ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. సామాన్యులు పనికోసం ప్రభుత్వ కార్యాలయానికి వస్తే పైసల కోసం వేధిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన సేవలు డబ్బులిచ్చి పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్, ఎకై ్సజ్, విద్యుత్, ఇంజినీర్, రెవెన్యూ, ఆర్టీఏ, మైనింగ్, అటవీ, విద్య, వైద్యం ఇలా.. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇటీవల జరిగిన ఏసీబీ రైడ్స్ వివరాలు.. పట్టుబట్టి కొలువు కొట్టారు గ్రూప్–3 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. మెరుగైన ర్యాంక్ సాధించి ప్రభుత్వ కొలువులు కొట్టారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయాలి.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలి. లేదా వాట్సాప్ నంబర్ 94404 46106 నంబర్ లేదా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – జి.మధు, డీఎస్పీ, ఏసీబీ -
● జిల్లా ఫలితాలపై అధిష్టానం ప్రశంసలు ● సర్పంచుల సన్మానానికి రాష్ట్ర అధ్యక్షుడు ● జిల్లాకు చెందిన 221 మందికి సన్మానం
బీజేపీలో ‘పల్లె’ జోష్.. నిర్మల్: పదేళ్ల క్రితం కనీసం వార్డు మెంబర్గా పోటీచేయడానికి కూడా పంచాయతీల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇక సర్పంచ్ పదవికి నామమాత్రంగా నామినేషన్లు పడేవి. ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లు కూడా దక్కేవికావు. ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి రెండు మూడు స్థానాలు మాత్రమే గెలిచేవి. పార్టీకి పల్లెల్లో కనీసం క్యాడర్ కూడా ఉండకపోయేది. అలాంటి బీజేపీ సిన్మా ఒక్కసారిగా మారిపోయింది. అరకొర కాదు, జిల్లాలోని 400 పంచాయతీల్లో ఏకంగా సగానికిపైగా సీట్లను కై వసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. తెలంగాణలో ఏ జిల్లాలో సాధించనన్ని జీపీలను కై వసం చేసుకోవడంతో ఆపార్టీ అధిష్టానం నిర్మల్పై దృష్టి పెట్టింది. జిల్లా కేంద్రంలోని రెడ్డిగార్డెన్స్లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ బలపర్చిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఉపనేత పాయల్ శంకర్, ముధోల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్బాబు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాలం చిన్నారెడ్డి, కరిపె విలాస్, నల్ల రవీందర్రెడ్డి, సీనియర్ నేతలు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్రెడ్డి తదితరులు హాజరయ్యారు. 221మందికి సన్మానం..! పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువ గెలిచారనేదానిపై జిల్లాలో పోటాపోటీగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 221 మంది సర్పంచులను సన్మానిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో నిర్మల్ నియోజకవర్గం నుంచి 80 మందిని, ముధోల్ 103 మందిని, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 38 మంది సర్పంచులను సన్మానించినట్లు పార్టీ పేర్కొంది. వీరితోపాటు ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లు, భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతోపాటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు మాట్లాడారు. పంచాయతీల్లో గెలిచినట్లే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
● తొలి సర్పంచ్గా చరిత్ర
ఆ నలుగురూ మహిళలే నిర్మల్చైన్గేట్: జిల్లాలో కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన నాలుగు గ్రామాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నలుగురూ మహిళా సర్పంచులే గెలిచి చరిత్ర సృష్టించారు. రెండేళ్ల క్రితం న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజనితండా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగాయి. తాజాగా ఎన్నికల్లో తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఖానాపూర్ మండలం రంగపేట తొలి సర్పంచ్గా పెట్టెం రాధ 109 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కడెం మండలం న్యూధర్మాజీపేట తొలి సర్పంచ్గా బాల సుమలత 12 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక తానూరు మండలం కళ్యాణి సర్పంచ్గా శంకాబాయిని గ్రామస్తులు 21 మెజారిటీతో గెలిపించారు. కుభీర్ మండలం రంజని తండా సర్పంచ్గా జాదవ్ కవిత 311 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
ఆన్లైన్లో ధ్యానం చేయండి
నిర్మల్టౌన్: ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని సామూహిక ధ్యాన కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈమేరకు పోస్టర్లను నిర్మల్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి 2024లో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిందని తెలిపారు. లాభాపేక్షా లేకుండా కమలేష్ దేశ్భాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కన్హ శాంతివనం నుంచి ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున సామూహిక ధ్యానం నిర్వహిస్తున్నామన్నారు. రాత్రి 8 గంటల నుంచి 20 నిమిషాలపాటు ఉంటుందని తెలిపారు. పోస్టర్ల మీద ఉన్న క్యూఆర్కోడ్ స్కాన్ చేసి పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా.. ఆ వివరాలను ప్రెస్మీట్లో వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూడా పాల్గొన్నారు. సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 41మంది 24ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఇద్దరే తెలంగాణకు చెందిన వారు కాగా, 24ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కేబీఎం కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు జన్నారానికి చెందిన ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్లో పని చేస్తున్న వారు ఉన్నారు. అజ్ఞాతం వీడేందుకేనా..? వచ్చే మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ పార్టీ కేడర్ను ఇతర ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. మనుగడ క్లిష్టంగా మారడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోకి కొందరు మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారిని గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్కు తరలించారు. వీరంతా ఛత్తీస్గఢ్ నుంచి ములుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పూర్ యూ మండలం కకర్బుడ్డి, బాబ్జీపేట పరిసరాల్లో సంచరిస్తున్నారు. పెద్దదోబ, చిన్నదోబ పరిధిలో అటవీ సమీపంలోని ఓ చేనులో ఉన్న గుడిసెలో తల దాచుకున్నారు. గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. వీరంతా ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాలు, కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ తనిఖీలను దాటి ఎప్పుడు, ఎలా వచ్చారనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో బలగాలు గుర్తించిన మావోయిస్టులే అజ్ఞాతం వీడారనేది ఉన్నతాధికారులు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
డప్పు కొట్టం.. చీపురు పట్టం
ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీసీలు ఎస్సీ కాలనీ వాసులపై వివక్ష చూపారని కాలనీ నివాసులు ఆరోపించారు. ఎస్సీ కాలనీలో గురువారం జరిగిన గ్రామసభలో పలు అభ్యర్థనలు తిరస్కరించడం, మాదిగలను ఉపేక్షించారని వెల్లడించారు. గ్రామంలో ఎస్సీ మహిళను సర్పంచ్గా ఎంపిక చేసి, కాలనీకి ఉపసర్పంచ్ స్థానం కూడా కేటాయించలేదని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత ఎస్సీ మహిళకు సర్పంచ్ అవకాశం రావడంతో తాము దళిత కాలనీకి రావాలా అని బీసీలు అవమానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో శుభకార్యాలు, అశుభ కార్యాలకు డప్పు, బ్యాండ్ కొట్టమని, రోడ్డు కూడా శుభ్రం చేయమని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో తమను ఎవరూ ఓటు అడగొద్దని హెచ్చరించారు. తమను వేరే గ్రామంలో కలపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాలనీ నుంచి ఎన్నికైన ముగ్గురు వార్డు సభ్యులు కట్ల పోశన్న, చిలుముల రాజ్కుమార్, సీహెచ్.రాజకళ రాజీనామా చేస్తారని, ఇద్దరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు దూడ మల్లయ్య, కొత్తురి లక్ష్మి విధులకు వెళ్లరని వెల్లడించారు. సమావేశంలో పెద్దలు కొత్తూరి గంగరాజం, గాజుల భూమరాజం, కోరుట్ల ఊశన్న, దూడ శంకర్, జూల రాజేశ్వర్, సిలుముల లింగన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి.. ఢోకాలేదు!
లక్ష్మణచాంద: ఈ ఏడాది వర్షాకాలం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. అక్టోబర్ చివరి వారం, నవంబర్ తొలివారంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జలాశయాల్లోకి డిసెంబర్ తొలి వారం వరకు ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. దీంతో యాసంగి సాగును రైతులు సంతోషంగా మొదలు పెట్టారు. జిల్లాలో పలు ప్రాజెక్టులు...జిల్లాలోని సాగుభూములకు శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సదర్మాట్ ప్రాజెక్టులు నుంచి సాగునీరు అందుతోంది. స్వర్ణ ప్రాజెక్టు కింద 9,400 ఎకరాలు, కడెం ప్రాజెక్టు కింద మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో 68,150 ఎకరాలు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 13,950 ఎకరాలు, సదర్మాట్ ప్రాజెక్టు కింద 13 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ అయిన సరస్వతి కెనాల్ ద్వారా జిల్లాలో ఏడు మండలాల పరిధిలోని 33,622 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధానంగా నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు ఉంది. మొత్తం 28 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. సరస్వతి కాలువ జిల్లాలో 47 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. రెండో పంటకు భరోసా..జిల్లా అన్నదాతకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టు నీటిమట్టం 1,182 అడుగులు ఉంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ప్రస్తుతం 358 అడుగుల నీరు ఉంది. కడెం పూర్తి సామర్థ్యం 7 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీరు ఉంది. అన్ని ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు భరోసాగా రెండో పంట సాగు చేస్తున్నారు. ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 24న సరస్వతి కాలు వకు నీటిని విడుదల చేయనున్నారు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నుంచి వారం రోజుల్లో నీటి విడుదలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సదర్మాట్ నీటి విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిండుకుండలా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపొట్టపెల్లి సమీపంలో వరి నారు మడిప్రాజెక్టుల నీటిమట్టాలు, ఆయకట్టు వివరాలు..ప్రాజెక్టు నీటిమట్టం ఆయకట్టు (ఎకరాల్లో) శ్రీరాంసాగర్ 1091 అడుగులు 33,622 గడ్డెన్నవాగు 358 అడుగులు 13,950 స్వర్ణ 1,182 అడుగులు 9,400 సదర్మాట్ –– 13,000ఈసారి నీటి కొరత లేదు.. వానాకాలం సాగు పూర్తయింది. రెండో పంట పనులు ప్రారంభించాం. సరస్వ తి కాలువ ద్వారా రెండోపంట సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో ఉన్నాయి. ఈసారి నీటి కొరత రాదు. – సాయన్న, రైతు పొట్టపల్లిసంతోషంగా ఉంది ఈసారి భారీ వర్షాలు కురవడంతో వరి పంట దిగుబడి అనుకున్నంత రాలేదు. రెండో పంట సాగుకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడం సంతోషంగా ఉంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. – ముత్యం, రైతు లక్ష్మణచాంద -
బీజేపీ కార్యాలయ ముట్టడికి
కాంగ్రెస్ యత్నంనిర్మల్చైన్గేట్: నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కేంద్రం వేధిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో గురువరాం ఆందోళన చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీపార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దాదాపు అరగంటకుపైగా అటు బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం సోనియాగాంధీ, రాహుల్గాంధీని వేధించడంపై మండిపడ్డారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ఎత్తివేసే కుట్ర..జిల్లా కేంద్రంలోని హోటల్లో బొజ్జు మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే మహాత్మాగాంధీ పేరును తొలగించిందని తెలి పారు. పేదలకు పని కల్పించాలన్న ఉద్దేశంతో 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది వరకు కేంద్రం వందశాతం ఫండింగ్ ఇచ్చేదని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ చేసే లా నిర్ణయం తీసుకుని పథకాన్ని నిర్వర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందినట్లు స్థానిక ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రానున్న పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, పీసీసీ కార్యదర్శి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
మామడ: మండలంలోని న్యూసాంగ్వి గ్రా మంలో గురువారం అంతర్జాతీయ వలసదా రుల దినోత్సవం ప్రవాసి మిత్ర లేబర్ యూ నియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యూని యన్ రాష్ట్ర అద్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల మా ట్లాడుతూ మనదేశం నుంచి ఉపాధికోసం వెళ్లి అక్కడ పనిచేసి విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపించి దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని విమర్శించా రు. తిరిగి వచ్చిన గల్ఫ్ కార్మికులకు పునరా వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అశ్విన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనసూయ, నాయకులు గంగాధర్, గీత, సుశీల, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఊరు ఏకమైంది.. పోరు తప్పింది!
నిర్మల్చైన్గేట్: గ్రామీణ ప్రాంతాల్లో శాంతి, సామరస్యం ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాయి. ఎన్నికల ఖర్చులను అభివృద్ధికి మళ్లించి, ప్రజల సౌకర్యం పెంచాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేశాయి. కానీ, ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించాల్సిన ప్రత్యేక నిధులు అందడం లేదు. గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ, సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా నజరానా అందలేదు. దీంతో ఈసారి ఏకగ్రీవానికి చాలా మంది మొగ్గు చూపలేదు. పోటీకే సై అన్నారు. మొత్తం ఏకగ్రీవాలు ఇవీ..జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు, 1,237 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2019తో పోలిస్తే ఈసారి 53 స్థానాలు తగ్గాయి. ఏకగ్రీవాల నజరానాలు రాకపోవడంతో గ్రామీణుల్లో నమ్మకం సడలింది. మండలాల వారీగా..కడెం మండలంలో 2019లో 29 పంచాయతీల్లో 9 ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. పెంబి మండలంలో 24 పంచాయతీలు ఉండగా 2019లో 19 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి కేవలం 4 పంచాయతీలు, 124 వార్డులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇక మామడ మంలంలో 13 పంచాయతీల నుంచి 5కి, ఖానాపూర్లో 10 నుంచి 5కి, సారంగాపూర్లో 11 నుంచి 5కి తగ్గాయి. మూడో దశలో..మూడో దశలో బాసర మండలం బిద్రెల్లి, ముధోల్ మండలం ఎడ్బిడ్ తండా, విట్టోలి తండా, తానూరు మండలం భామినితండా, హిప్నెలితండా, కోలూరు తండా, కుభీర్ మండలం జంగాంపల్లి, బ్రహ్మేశ్వర్ తండా గ్రామాలు, 333 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొదటి దశలో..తొలిదశలో దస్తూరాబాద్ మండలం బుత్కూర్, లక్ష్మణచాంద మండలం వడ్యాల్తండా, మామడ మండలం ఆరేపల్లి, బూరుగుపల్లి, లింగాపూర్, కప్పనపల్లి, వాస్తాపూర్, పెంబి మండలం జంగగూడ, కోస్గుట్ట, నాగపూర్, రామ్నగర్, ఖానాపూర్ మండలం ఆదివాసిగూడ, బాబాపూర్తండా, మేడంపల్లి, పాత తర్లపాడు, కొలాంగూడ 16 సర్పంచ్ స్థానా లు, 474 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో.. సారంగాపూర్ మండలం పెండల్దరి, మహావీర్ తండా, రామ్సింగ్ తండా, సాయినగర్తండా, లోకేశ్వరం మండలం బిలోలి, నర్సింహనగర్ తండా, సేవాలాల్ తండా, సోన్ మండలం లోకల్ వేల్మల్, సారంగాపూర్ స్వర్ణ (పొంకూర్), నిర్మల్ రూరల్ మండలం తల్వేద జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 10 సర్పంచ్ స్థానాలతోపాటు 430 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. -
నిర్మల్
7కోతిదేవుని జాతరకు వేళాయె.. లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం– పీచర గ్రామాల మధ్య వెలసిన కోతిదేవుడి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల19న శుక్రవారం రథోత్సవం, 20న నిర్వహించే జాతర జరుగుతుంది.ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం పెరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత అధికంగా ఉటుంది.టీచర్లకు ‘టెట్’షన్ ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలని ఉత్తర్వులు వచ్చాయి. జనవరి 3నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ టీచర్లు న్నద్ధమవుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
భైంసాటౌన్/బాసర: బాసర పీహెచ్సీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భీమన్న ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. భీమన్న బాసర పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తుండగా, తానూర్ పీహెచ్సీ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. అదే పీహెచ్సీలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి సంబంధించి జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు ముందుగా తయారు చేసినందుకు, అలాగే వైద్య చెల్లింపు బిల్లులకు భీమన్న రూ.9 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఫోన్ పే ద్వారా నగదు పొందినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం నిందితుడిని భైంసాలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పర్చనున్నట్లు వెల్లడించారు. అనంతరం బాసర పీహెచ్సీలో ఏసీబీ అఽధికారులు రాత్రి వరకు పలు రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఫలితాల పంచాయితీ
నిర్మల్: ‘గెలిచినవాళ్లలో సగానికి పైగా మావాళ్లే..’అని బీజేపీ ప్రకటిస్తుంటే.. కాదు కాదు.. ‘అత్యధిక స్థానాలు మాపార్టీ బలపర్చినవాళ్లు గెలిచినవే..’ అంటూ కాంగ్రెస్ లిస్టు చూపుతోంది. గుర్తులు లేని ఎన్నికలు కావడం, చాలామంది రెబల్స్, స్వతంత్రులూ గెలువడంతో జిల్లాలోని 400 పంచాయతీల్లో ఏపార్టీ మద్దతుదారులు ఎవరో ఇప్పటికీ తేలడం లేదు. పార్టీలు మాత్రం వాళ్లంతా మావాళ్లే.. అంటూ ప్రచారం చేసేసుకుంటున్నాయి. పార్టీల లొల్లి ఇలా ఉంటే.. ఊళ్లల్లో గెలిచిన, ఓడినవాళ్లు ఎక్కడ ఓట్లు రాలేదు.. ఎక్కడెక్కడి నుంచి వచ్చాయంటూ పోస్టుమార్టం చేస్తున్నారు. ప్రధానంగా విజయానికి దగ్గర దాకా వచ్చి ఓడిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందన్న లెక్కలు వేస్తున్నారు. చాలాగ్రామాల్లో కులాల ఏకీకరణే గెలుపోటములను డిసైడ్ చేసినట్లు తేలుస్తున్నారు. ఎందుకు ఓడిపోయామంటే..‘అరె.. గింతగానం కష్టపడ్డం. ఊరుఊరంతా తిరిగినం. ఇంటింటికీ పోయి ఓట్లడుగుడే కాదు.. మందు, మాంసం కూడా ఇస్తిమి. అయినా.. ఓడగొట్టిండ్రు..’ అంటూ ఓడిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘అట్ల గాదన్న.. దగ్గరి దాకా అచ్చిఓడిపోవుడే బాధనిపిస్తుందే..’ అని కొందరు బాధపడుతున్నారు. ఇక అభ్యర్థుల కుటుంబసభ్యులు, అనుచరులు ఏ వార్డులో ఓట్లు రాలేదు, ఎందుకు మనవైపు రాలేవు.. అంటూ ఆరా తీస్తున్నారు. కుల సమీకరణలతో తారుమారు..ఐదేళ్లక్రితంతో పోలిస్తే.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కుల సమీకరణలు బలంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. రిజర్వేషన్లు కలిసి రావడమే ఆలస్యం మొత్తం తమ కులస్తులను గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని మేజర్ గ్రామపంచాయతీల్లో కులాల ఏకీకరణ స్పష్టంగా కనిపించింది. పార్టీల ప్రభావం కంటే.. కూడా కులాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. కొన్ని ఊళ్లల్లో కులసభ్యులంతా కట్టుబాటుతో ఓటేసినట్లు తెలిసింది. ఇప్పటికై తే.. ఇండిపెండెంటే..జిల్లాలో మూడు విడతల్లో కలిపి 95–100 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో గతంలో కాంగ్రెస్, బీజేపీల్లో పనిచేసినవారే ఎక్కువగా ఉన్నారు. కానీ.. తమ గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు, తమ పార్టీల్లో నుంచే పోటీ ఎక్కువగా ఉండటం, కులాల సమీకరణలతో స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత ఎటు వెళ్లాలనే దానిపై చాలామందిలో స్పష్టత లేదు. ఓవైపు జిల్లాలో ముధోల్, నిర్మల్ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండటం ఈ గందరగోళానికి కారణం. ఎటువెళ్తే.. ఎవరు ఎలా వ్యవహరిస్తారో అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. అందుకే.. చాలామంది ‘ఇప్పటికై తే ఇండిపెండెంట్గానే గుర్తించండి..’ అంటున్నారు. పార్టీల పోటాపోటీ..జిల్లాలో మొత్తం 400 పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో తొలి విడత జరిగిన ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో కాంగ్రెస్ అధిక్యతను కనబర్చింది. బీజేపీతోపాటు ఈ మండలాల్లో బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపింది. ఇదే విడతలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో బీజేపీ పుంజుకుంది. రెండో విడతలో బీజేపీ అధిక్యత చాటినప్పటికీ కాంగ్రెస్ కూడా గణనీయంగా గెలుపొందింది. మూడో విడతకు వచ్చేసరికి ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ వార్ వన్సైడ్ అన్నట్లుగా ప్రభంజనమే సృష్టించింది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలోనూ బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. గుర్తులు లేకపోవడం, ఇటునుంచి అటు, అటునుంచి ఇటు పార్టీలు మారడం, స్వతంత్రులుగా, రెబల్గా పోటీచేయడంతో ఎవరు ఏ పార్టీ అనే స్పష్టంగా తేలడం లేదు. -
ఆలయ అభివృద్ధికి రూ.2.50 లక్షల విరాళం
● మతసామరస్యం చాటుకున్న గ్రంథాలయ చైర్మన్ నిర్మల్టౌన్: జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ మతసామరస్యం చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు గ్రంథాలయ చైర్మన్ను సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, సెక్రెటరీ ముప్పిడి రాకేశ్, కోశాధికారి సుద్దుల సత్యనారాయణ, మను సంఘం అధ్యక్షుడు జగదీష్, కోటగిరి గోపి, రవి, గణేశ్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నరేశ్, సజ్జనపు గణేశ్, సాగర్, ముత్యం, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా అమ్మ రక్షిత
నిర్మల్చైన్గేట్: జిల్లాలో నవజాత శిశు మరణాల నిర్మూలనకు అమలు చేస్తున్న అమ్మరక్షిత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అమ్మరక్షిత కార్యక్రమం అమలుపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. అమ్మరక్షిత కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిందన్నారు. దీంతో నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా వైద్యులను అభినందించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇందుకు తనవంత సహకారం అందిస్తానని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మొదలుకొని, జిల్లాస్థాయి ప్రసూతి ఆస్పత్రిలో వైద్యుల వరకు పర్యవేక్షణ, చొరవ ఉండాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్య సలహాలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన టెలిఫోన్ కాల్ సహాయ సదుపాయం నిరంతరం కొనసాగాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, వైద్యశాఖ అధికారులు గోపాల్సింగ్, సౌమ్య, సరోజ, అధికారులు పాల్గొన్నారు. -
హస్తం.. కమలం పోటాపోటీ
నిర్మల్: ముధోల్ పట్టె బీజేపీకి జైకొట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తూ పంచాయతీపోరులోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిపత్యం కనబర్చారు. ఐదు మండలాల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుచుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు సాధించని స్థానాలకు బీజేపీ గెలుపొందింది. అధికార కాంగ్రెస్ పార్టీ స్వతంత్రుల కంటే తక్కువ స్థానాలతో వెనుకబడింది. సరిహద్దు మండలాల్లో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఎమ్మెల్యేలుగా చేసిన సీనియర్ నేతలున్నా.. హస్తం గతవైభవాన్ని దక్కించుకోలేకపోయింది. పదేళ్లపాటు పల్లెల్లో రాజ్యమేలిన బీఆర్ఎస్ అంచనాకు ఐదు అన్నట్లు గెలిచింది. మూడు విడతల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా పంచాయతీలను కై వసం చేసుకున్నారు. కమలానికే మొగ్గు.. రాష్ట్ర సరిహద్దు మండలాలు బీజేపీ బలపర్చిన అభ్యర్థుల వైపే మొగ్గుచూపాయి. భైంసా, బాసర, ముధోల్, తానూరు, కుభీర్ ఐదు మండలాల్లో అత్యధిక స్థానాలు కమలంపార్టీకే కట్టబెట్టాయి. తానూరు మినహా మిగిలిన నాలుగు మండలాల్లో అధికార కాంగ్రెస్పార్టీకి డబుల్ డిజిట్ దక్కక లేదు. బీజేపీ భైంసా మండలంలో 18 చోట్ల గెలుపొందింది. ముధోల్లో 13 జీపీలను కై వసం చేసుకుంది. తానూరులో 14 చోట్ల, కుభీర్లో 13 జీపీల్లో, బాసరలో 3 స్థానాలు కై వసం చేసుకుంది. మొదటి విడతలో సత్తచాటిన కాంగ్రెస్ రెండోవిడతలో పర్వాలేదనిపించింది. మూడోవిడతలో 133పంచాయతీలకు కేవలం 28 స్థానాలకు పరిమితమైంది. 39 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ప్రభావం చూపని కారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఏ పల్లెలో చూసినా కారు జోరే. ముధోల్ నియోజకవర్గంలో మరోపార్టీకి అవకాశం లేకుండా బీఆర్ఎస్ హవా కొనసాగించింది. అలాంటి స్థితి నుంచి నామమాత్రంగానైనా పోటీఇవ్వని స్థాయికి దిగజారింది. ఐదు మండలాల్లో అంచనాకు అన్నట్లుగా ఐదు జీపీలకు పరిమితమైంది. పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు.. జిల్లాలో మూడు విడతల సర్పంచ్ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తొలివిడత ఎన్నికలు నిర్వహించిన ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు ఉన్నారు. ఆ నాలుగు మండలాల్లో కలిపి ఆపార్టీ 69 స్థానాలను దక్కించుకుని పైచేయి సాధించింది. బీజేపీ 22 స్థానాలకు పరిమితమైంది. రెండోవిడతలో నిర్మల్లోని ఐదుమండలాలు, ముధోల్లోని రెండు మండలాలు బీజేపీ ఎమ్మెల్యేలైన మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్ పరిధిలోనివి. మలివిడతలో ఏకంగా 51 స్థానాల్లో ఆధిక్యతను చాటింది. కాంగ్రెస్కు 49 జీపీలు దక్కాయి. మూడోవిడతలో ముధోల్ నియోజకవర్గంలో ఐదుమండలాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 61 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ను 28 స్థానాలకు పరిమితమైంది. విడతల వారీగా పార్టీలు గెలిచిన జీపీలు.. విడతలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వతంత్రులు మొదటి విడత 22 69 19 26 రెండోవిడత 51 49 01 30 మూడో విడత 61 28 05 39 మొత్తం 134 146 25 95 -
పెన్షనర్ల హక్కులు కాపాడాలి
నిర్మల్చైన్గేట్: పెన్షన్ల హక్కులను కాపాడాలని జాతీయ పెన్షన్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎంసీ లింగన్న అన్నారు. నిర్మల్లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. ఎంసీ.లింగన్న మాట్లాడుతూ ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. 2024 తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లందరికీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి రాధిక, సంఘం ట్రెజరర్ సరోజన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, పెన్షనర్లు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది. గంట గంటకూ పోలింగ్ ఇలా.. నిర్మల్చైన్గేట్: జిల్లాలో తుదివిడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. బాసర, భైంసా, కుభీర్, ముధోల్, తానూర్ మండలాల్లోని 124 సర్పంచ్, 791 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు మండలాల పరిధిలో 84.99 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా తానూర్ మండలంలో 90.28 శాతం మంది ఓటేశారు. బాసర మొత్తం ఓటర్లు: 143309 గంటల వరకు 3788(26.43) 11 గంటలకు 8997(62.78) 1 గంట వరకు 11875(82.87) భైంసా మొత్తం ఓటర్లు: 339709 గంటలకు 8,180(24.08) 11 గంటలకు 2,0527(60.43) 1 గంటలకు 28,501(83.90) కుభీర్ మొత్తం ఓటర్లు : 38,793 9 గంటల వరకు 9,437(24.33) 11 గంటల వరకు 24,609(63.44) 1గంటల వరకు 32,663(84.20) ముధోల్ మొత్తం ఓటర్లు : 27565 9 గంటల వరకు 7468(27.09) 11 గంటల వరకు 15513(56.28) 1 గంటల వరకు 22804(82.73) తానూర్ మొత్తం ఓటర్లు 30,3909 గంటల వరకు 9,111(29.98) 11 గంటల వరకు 20,315(66.85) 1 గంటల వరకు 27,435(90.28) -
ముగిసిన సంగ్రామం
నిర్మల్టాస్తో వరించిన విజయం కుభీర్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని బెల్గాంతండా సర్పంచ్ పదవికి పోటీపడిన ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో టాస్తో ఒకరిని పదవి వరించింది. మొత్తం 570 ఓట్లు ఉండగా 510 పోలయ్యాయి. ఇద్దరు అభ్యర్థులకు 192 చొప్పున పోలయ్యాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. జాదవ్ గోకుల్కు అదృష్టం వరించి సర్పంచ్ అయ్యారు. జిల్లా అటవీశాఖ అధికారిగా సుశాంత్ నిర్మల్టౌన్: జిల్లా అటవీ శాఖ అధికారిగా సుశాంత్ సుఖ్దేవ్ బోబడే బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన సుశాంత్ కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజ నల్ అధికారిగా పనిచేసి పదోన్నతిపై నిర్మల్ జి ల్లా ఫారెస్ట్ అధికారిగా వచ్చారు. ఇప్ప టి వర కు డివిజనల్ అధికారి నాగినిభాను ఇన్చార్జి జిల్లా అధికారిగా పని చేశారు. సుశాంత్కు బా ధ్యతలు అప్పగించారు. అధికారులు, సిబ్బంది కొత్త డీఎఫ్వోకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు అటవీ భూముల ఆక్రమణలు అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టిసారిస్తానని సుశాంత్ వెల్ల డించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధి కారులు శివకుమార్, రామకృష్ణారావు, రాథోడ్ రమేశ్, శ్రీనివాసరావు, రాథోడ్ అవినాష్, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం విజయవంతంగా ముగిసింది. మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఒకోవిడతకూ పోలింశాతం పెరిగింది. తుదివిడతలో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు మండలాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో 84.99 శాతం మంది ఓటు వేశారు. చలి వణికిస్తున్నా.. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. చివరి విడతలోనూ ఇద్దరిని ఒక్క ఓటు తేడాతో విజయం వరించింది. కోడలిపై అత్త మూడు ఓట్ల తేడాతో గెలిచింది. తుది విడత పోలింగ్ను కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అమ్మద్, కిశోర్కుమార్, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్మీనా, ప్రత్యేక పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం, డీపీఓ తదితర ఉన్నతాధికారులు పోలింగ్, కౌంటింగ్ను పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. మరింత పెరిగిన పోలింగ్.. మూడోవిడత బాసర, ముధోల్, తానూరు, భైంసా, కుభీర్ మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. ముధోల్లో పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. జిల్లా సరిహద్దు మండలమైన తానూరులో అత్యధికంగా 90.28 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ముధోల్ మండలంలో 82.73 శాతం నమోదైంది. తొలివిడతలో 80.42, రెండోవిడతలో 82.67 శాతం పోలింగ్ నమోద కాగా, తుదివిడతలో మరింత పెరిగి 84.99 శాతం నమోదైంది. కదలొచ్చిన పల్లెలు... మూడో విడతలో మొత్తం 1,45,048 మంది ఓటర్లు ఉండగా, 1,23,278 మంది ఓటేశారు. మొత్తం 21,770 మంది వివిధ కారణాలతో పోలింగ్కు దూరంగా ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో పురుషులు మొత్తం 70,338 మంది ఉండగా, 60,427 మంది ఓటేశారు. మహిళ ఓటర్లు 74,704 ఉండగా 62,849 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు మొత్తం ఆరుగురు ఉండగా, ఇద్దరు మాత్రమే ఓటేశారు. ‘పంచాయతీ’ విజయవంతం.. జిల్లాలో మూడువిడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈనెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నిర్మల్లోని రెండు మండలాలు తొలివిడతలో పూర్తయ్యాయి. రెండో విడతలో నిర్మల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ముధోల్లోని రెండు మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ముధోల్లోని ఐదుమండలాల్లో మూడోవిడత పోలింగ్ విజయవంతంగా పూర్తిచేశారు. మూడోవిడత పోలింగ్ వివరాలు.. మండలం మొత్తం పోలైన ఓట్లు మొత్తం పోలైన ఓట్లు మొత్తం పోలైనఓట్లు పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు శాతం బాసర 6,892 5,730 7,437 6,145 01 –– 87 భైంసా 16,320 13,654 17,648 14,846 02 01 83.90 కుభీర్ 18,928 16,633 19,864 16,029 01 01 84.20 ముధోల్ 13,257 10,862 14,306 11,942 02 –– 82.73 తానూరు 14,941 13,548 15,449 13,887 –– –– 90.28 మొత్తం 70,338 60,427 74,704 62,849 06 02 84.99 -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. రాత్రి మంచు ఎక్కువగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. పారదర్శకంగా విధులు నిర్వహించాలి నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీ ఉద్యోగులందరూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ అప్పిలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ షాహిద్మసూద్ సూచించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ప్రతీ విభాగాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య, వారు చేస్తున్న విధులు అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన షోయబ్ అహ్మద్ ప్రాపర్టీని ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా 23, అక్టోబర్ 2025న మ్యుటేషన్ చేశారని హైదరాబాద్ సీడీఎంకు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డీ తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదుదారుడు, అప్లికేంట్ ఇద్దరినీ పిలిపించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా 9100061766 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఆర్డీ వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవీదాస్, అధికారులు ఉన్నారు. -
కుష్ఠుకు చెక్ పెట్టేలా..
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుష్ఠు వ్యాధిని కట్టడి చేసేలా కొత్త చర్యలు చేపట్టింది. జాతీయ కుష్ఠు నివారణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 18(గురువారం) నుంచి 31 వరకు ఎల్సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ కంపైన్) పేరిట ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. మొదటి విడతలో 1,82,343 ఇళ్లను కవర్ చేసి 8 మంది రోగులను గుర్తించారు. గత మార్చిలో జరిగిన సర్వేలో 559 మంది అనుమానితులను గుర్తించి, పరీక్షల ద్వారా 8 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. రెండో విడతకు 559 ఆశా కార్యకర్తలు, 115 మంది సూపర్వైజర్లు సర్వేలో పొల్గొంటారు. ప్రతీ 10 మంది ఆశ వర్కర్లకు ఒక పర్యవేక్షకుడిని కేటాయించారు. ఈమేరకు వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. 18 పీహెచ్సీల్లోని కార్యకర్తలు రోజుకు 20 ఇళ్లకు వెళ్లి అనుమానితుల వివరాలు సేకరిస్తారు. గుర్తించినవారికి 15 రోజుల్లో పరీక్షలు చేసి చికిత్స అందిస్తారు. ప్రాథమిక లక్షణాలు మైకోబాక్టీరియం లెప్రే బ్యాసిలస్ కారణంగా వ్యాపిస్తుంది. చర్మంపై గోధుమ రంగు మొద్దుమచ్చలు, స్పర్శ లేని ప్రదేశాలు, తిమ్మిరి లేదా పాలిపోయిన మచ్చలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. 1 నుంచి 5 లోపు మచ్చలు కనిపిస్తే వారికి ఆరు నెలలు, 5 కంటే ఎక్కువ మచ్చలు గుర్తిస్తే వారికి ఏడాది పాటు చికిత్స అందిస్తారు. అనుమాన లక్షణాలు దాచకుండా సర్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. చికిత్స విధానం.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ) అందిస్తారు. రోగులు రోజుకు రెండు టాబ్లెట్లు తీసుకోవాలి. అంగవైకల్యం ఉన్నవారికి మైక్రోసెల్యులర్ రబ్బర్ పాదరక్షలు, రూ.12 వేల సహాయం, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఉచితం. చికిత్స చేయించుకోవాలి జిల్లాలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయనే సమాచా రాన్ని సేకరించి, వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం. కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సు లువుగా తగ్గించవచ్చు. అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో -
● 129 స్థానాల్లో 60 హస్తం ఖాతాలో.. ● జాబితా విడుదల చేసిన డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు
నిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. బీజేపీ నిర్మల్ నియోజకవర్గంలో 80 స్థానాలు కై వసం చేసుకున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు వచ్చాయని జాబితా విడుదల చేశారు. 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు పోను 19 స్థానాల్లో స్వతంత్రులు గెలిచారని, మిగతా 49 సర్పంచ్ స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్కు వచ్చాయని వివరించారు. ఎవరి స్థానాలు ఎన్నో వారే ప్రకటించాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వ పటిమ, సమర్థతకు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర్రెడ్డి సండే ఎమ్మెల్యే నుంచి మంత్లీ ఎమ్మెల్యేగా ప్రమోషన్ పొందాడని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని హితవు పలికారు. సమావేశంలో నిర్మల్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, అబ్దుల్ హాది, సర్పంచులు అక్షర, భూమన్న, ఇంద్రకరణ్రెడ్డి, సాయన్న, రమేశ్, రమేశ్రెడ్డి, ఇతర సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
నేనెవర్ని..?
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం తనిఖీకి మంగళవారం వచ్చిన రీజినల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారి షాహిద్ మసూద్ అన్ని విభాగాల్లో తిరుగుతూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. అనంతరం ‘నేనెవర్ని.. నా హోదా ఏంటి’ అని అందరినీ ప్రశ్నించారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. చివరకు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ను సైతం అడిగారు. తన పైస్థాయి అధికారి హోదాను కమిషనర్ కూడా చెప్పలేకపోయారు. ‘నా హోదా చెప్పినవారికి ప్రమోషన్ ఇప్పిస్తా’ అని మసూద్ పేర్కొన్నారు. చివరకు ఓ మహిళ ఉద్యోగి హోదా చెప్పడంతో ఆమెను అభినందించారు. మరోవైపు కార్యాలయ సిబ్బంది, కమిషనర్ పనితీరుపై ఆర్డీ అసహనం వ్యక్తం చేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
సమస్యలు పరిష్కరించాలి
● డీఎంహెచ్వోకు ఆశ వర్కర్ల వినతి నిర్మల్చైన్గేట్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించినా రెమ్యూనరేషన్ చెల్లించలేదని పేర్కొన్నారు. భైంసా పట్టణ ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న ఎల్సీడీసీ, పల్స్ పోలియో బకాయిలతోపాటు ఈనెల 18 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఎల్సీడీసీ సర్వే రెమ్యునరైజేషన్ అందేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి గంగమణి, ఉపాధ్యక్షురాలు కమల, జిల్లా నాయకులు లావణ్య, సుజాత పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
● సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ పెంబి: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని పెంబి, మామడ, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను పెంబి సబ్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఆయా మండలాల వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఈ సావలియ నాయక్, డీఈ నాగరాజు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్
పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. చాలా వరకు కొత్తవారికి ఛాన్స్ ఇస్తే.. కొన్ని గ్రామాల్లో పాత వారికి లేదా వారి కుటుంబీకులకు అవకాశం ఇచ్చారు. మేజర్ పంచాయతీ అయిన లోకేశ్వరం సర్పంచ్గా ఇక్కడి ఓటర్లు దార్వాడి కుటుంబానికే మరో ఛాన్స్ ఇచ్చారు. ఈనెల 14న జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా దార్వాడి కపిల్ను 56 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 1995 నుంచి 2000 వరకు దార్వాడి సైదులు సర్పంచ్గా పనిచేశారు. 2006లో సైదులు భార్య దార్వాడి లక్ష్మిని ఎంపీటీసీగా గెలిపించారు. ఆమె ఎంపీపీగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో సైదులు కోడలు, కపిల్ భార్య సౌజన్యను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఐదేళ్లు ఆమె సేవలందించారు. తాజాగా కపిల్ను గెలిపించారు. – లోకేశ్వరంసైదులు.. 1995లో సర్పంచ్లక్ష్మి.. 2006లో ఎంపీపీసౌజన్య.. 2019లో సర్పంచ్ కపిల్.. 2025లో సర్పంచ్ -
● వెయ్యి మందితో బందోబస్తు ● ఎస్పీ జానకీ షర్మిల
భద్రత విషయంలో రాజీ వద్దు భైంసాటౌన్/భైంసారూరల్: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల భద్రత విషయంలో రాజీ వద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో ఎన్నికల విధుల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. బుధవారం జరుగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వెయ్యిమంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు చెప్పారు. ఓటింగ్ ప్రారంభమైంది మొదలు కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడే తుది సమరం
నిర్మల్ప్రోత్సహిస్తే వీళ్లు ‘మెస్సీ’లే! ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యార్థులు ఫుట్బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతున్నారు.రాష్ట్రస్థాయి బాక్సింగ్కు నిర్మల్ క్రీడాకారులు నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అకాడమీలో మంగళవారం జిల్లాస్థాయి సీనియర్ బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వెంకటేశ్(50–55 కేజీల విభాగంలో) శ్రీకాంత్ (55–60 కేజీల విభాగంలో), ఎల్.శ్రీకాంత్(60–65 కేజీల విభాగంలో) ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 21న హైదరాబాద్లోని షేక్పేట్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, సెక్రెటరీ చందుల స్వామి, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ బాక్సర్లను అభినందించారు. నిర్మల్/భైంసారూరల్: పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతోంది. జిల్లాలోని భైంసా, ముధోల్, తానూరు, కుభీర్, బాసర మండలాల్లోని 124 గ్రామ పంచాయతీలు, 791 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆయా మండలాల్లోని పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తీసుకున్న సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్కు ఏర్పాట్లు చేసుకున్నారు. పంపిణీ, పోలింగ్ కేంద్రాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘ముధోల్’ ఓటెత్తాలె.. మొదటి విడతతో పోలిస్తే రెండోవిడతలో పోలింగ్శాతం పెరిగింది. అటవీ, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న తొలివిడతలో 80.42 శాతం నమోదైంది. మైదాన ప్రాంతమైన నిర్మల్ నియోజకవర్గంలో రెండోవిడతలో 82.67 శాతం నమోదైంది. తొలివిడతతో పోలిస్తే మరింత ఎక్కువ పోలింగ్ నమోదు కావాల్సి ఉన్నా.. రెండోవిడతలో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కానీ.. రాజకీయంగా చైతన్యంతోపాటు పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలుగా భావించే ముధోల్ ప్రాంతం ఓటుహక్కు వినియోగానికి పోటెత్తాల్సిన అవసరం ఉంది. ఈ విడతలో మొత్తం 1,50,593 ఓటర్లు ఉన్నారు. బరిలో 386 మంది అభ్యర్థులు.. చివరి విడతలో మండలాలు తక్కువగా ఉన్నా జీపీలు 133, వార్డులు 1,126 ఉన్నాయి. ఇందులో తొమ్మిది పంచాయతీలు, 333 వార్డులు ఏకగ్రీవం కాగా, భైంసా, కుభీర్లో ఒక్కో వార్డుకు నామినేషన్లు రాలేదు. మిగిలిన 124 జీపీలు, 791 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ స్థానాలకు 386 మంది, వార్డు మెంబర్ కోసం 2,151మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటాపోటీగా.. మూడోవిడత పోలింగ్ మొత్తం ముధోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీల్లోనే సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఈ మండలాల్లో రాజకీయంగా పోటీ నెలకొంది. చాలా జీపీల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరిద్దరు బరిలో ఉ న్నారు. బీజేపీ, కాంగ్రెస్లో వర్గాలు ఉండటమే ఇందుకు కారణం. బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గమైనా కాంగ్రెస్కు మాజీఎమ్మెల్యేలు నాయకులుగా ఉండటం ఇక్కడ పల్లెపోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యేక బలగాలు.... ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో మూడో విడత పల్లె సమరానికి ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. ఏఎస్పీ రాజేశ్ మీనా ఐదు మండలాల్లోని పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించా రు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. సమస్యాత్మక పంచాయతీల్లో అదనపు బలగాలను మోహరించారు. మాట్లాడుతున్న ఎస్పీ జానకీషర్మిల, చిత్రంలో ఏఎస్పీ రాజేశ్ మీనా కాంగ్రెస్కే స్పష్టమైన మెజారిటీపోలింగ్ అధికారుల వివరాలు.. ఇద్దరు సభ్యుల బృందాలు 980ముగ్గురు సభ్యుల బృందాలు 110నలుగురు సభ్యుల బృందాలు 36మొత్తం అధికారుల బృందాలు 1,126 మొత్తం పీవోలు 1,464మొత్తం ఓపీవోలు 1,700 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు మూడోవిడత ఎన్నికల వివరాలు.. మండలం మొత్తం మొత్తం ఏకగ్రీవ ఏకగ్రీవ ఎన్నికలయ్యే ఎన్నికలయ్యే సర్పంచ్ వార్డు జీపీలు వార్డులు జీపీలు వార్డులు జీపీలు వార్డులు అభ్యర్థులు అభ్యర్థులు భైంసా 30 258 –– 55 30 202 94 516 ముధోల్ 19 166 02 53 17 113 55 325 కుభీర్ 42 344 03 112 39 231 118 645 తానూరు 32 268 03 82 29 186 82 492 బాసర 10 90 01 31 09 59 37 173 మొత్తం 133 1,126 09 333 124 791 386 2,151 -
అంతుచిక్కని ఓటరు నాడి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఎన్నికలు ఈనెల 17న జరుగనున్నాయి. ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, ముధోల్, తానూర్, బాసర, కుభీర్ మండలాల్లోని 133 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, పది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో తుది విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటరు నాడి అంతుచిక్కక ఆందోళన చెందుతున్నారు. మొదటి, రెండో విడత ఫలితాల సరళి చూసి మరింత టెన్షన్ పడుతున్నారు. ఓటర్ల ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముగిసిన ప్రచారం.. మూడో విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో ప్రచా రం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్ కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మద్యం, మటన్, చికెన్, పిండి వంటలతోపాటుఉ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. గెలుపు కోసం ఖర్చు కు వెనుకాడడం లేదు. ప్రలోభాల జోరు పెంచుతున్నారు. పట్నం, వలస ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నా రు. గ్రామాల్లో ‘ఓటుకు నోటు’ టీంలు రంగంలోకి దిగాయి. ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ‘సైలెంట్ క్యాంపెయిన్’ పేరుతో ఓట్ల యుద్ధం సాగిస్తున్నారు. మద్యం పంపిణీ.. ఇక మద్యం పంపిణీకి ప్రత్యేక ప్రదేశాలను సిద్ధం చేసి ప్రచారం ప్రారంభించిన రోజు నుంచే పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం వరకు కొరత రాకుండా స్టాక్ సిద్ధం చేశారు. అనేక గ్రామాల్లో మందు బాటిళ్లు, పిండి, నూనె క్యాన్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ మొదలు పెట్టారు. మటన్–చికెన్ షాపుల్లో కిలో చొప్పున ప్యాక్ చేయాలంటూ ఆర్డర్లు వేసి అడ్వాన్సు కూడా చెల్లించారనే ప్రచారం ఉంది. వలస ఓటర్లకు బస్సు చార్జీలు, పెట్రోల్ ఖర్చులు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. -
పట్టభద్రులు పల్లె పాలకులు
నిర్మల్ఆధ్యాత్మిక శోభితం ఆధ్యాత్మిక మాసాల్లో ధనుర్మాసానికి ప్రత్యేక మాసంగా పేరుంది. ధనుర్మాసోత్సవాలు మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 భోగి రోజున ముగుస్తుంది. క్లాస్ మేట్స్.. సర్పంచ్, ఉప సర్పంచ్ దిలావర్ఫూర్: మండల కేంద్రమైన దిలావర్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్గా క్లాస్మేట్స్ ఎన్నికయ్యారు. ఇద్దరూ ఉన్న త విద్యావంతులు. సర్పంచ్గా పాల్దె అక్షర గెలిచారు. ఈమె ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచారు. మూడేళ్లు ఎంపీపీగా పనిచేశారు. గ్రామానికి చెందిన నడుకుడ సుఖేశ్ ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇతను ఎంఈడీ పూర్తిచేశాడు. ప్రైవేటు విద్యాసంస్థ నడుపుతున్నాడు. సర్పంచ్ అక్షర, ఉప సర్పంచ్ ఇద్దరూ పదో తరగతి వరకు క్లాస్మేట్స్. దిలావర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. దిలావర్పూర్ సర్పంచ్, ఉప సర్పంచ్తోపాటు వార్డు సభ్యులను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్నూరు కాపు సంఘం జిల్లా సభ్యులు సోమవారం సన్మానించారు. లక్ష్మణచాంద: రాజకీయాలంటే ఈ రోజుల్లో చదువుకున్నవారు దూరంగా ఉంటారు. జాబ్ చేసుకోవాలి.. కుటుంబాన్ని చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ, జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యువకులు, గ్రాడ్యుయేట్లు బరిలో దిగారు.. నిలబడి.. కలబడి గెలిచారు. గ్రామాల సేవ చేయాలనే సంకల్పంతో పలు గ్రామాల్లో విద్యావంతులు, యువకులు సర్పంచులుగా విజయం సాధించారు. ఈ నెల 11, 14 తేదీల్లో మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో, రెండో విడతలో నిర్మల్ రూరల్, లోకేశ్వరం, కుంటాల, సారంగాపూర్, దిలావర్పూర్, సోన్, నర్సాపూర్(జి) మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచులుగా గ్రామ అభివృద్ధిపై తమకు స్పష్టత ఉందని పేర్కొంటున్నారు. సర్పంచ్ పాల్దె అక్షర ఉప సర్పంచ్ సుఖేశ్ప్రజలకు న్యాయం చేయాలి.. కుంటాల: కుంటాలకు చెందిన జక్కుల గజేందర్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంబీఏ ఫైనాన్స్, ఎల్ఎల్బీ(ఎల్ఎల్ఎం) పూర్తి చేశాడు. హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచాడు. భారీ మెజారిటీతో విజయం సాధించాడు. సర్పంచ్గా గ్రామ ప్రజలకు, పదవికి న్యాయం చేస్తానని పేర్కొంటున్నాడు. – జక్కుల గజేందర్, సర్పంచ్, హైకోర్టు న్యాయవాది -
అధికారుల నిర్లక్ష్యంతో చేలల్లోకి నీరు
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజె క్టు అధికారుల నిర్లక్ష్యంతో తాము పంట నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు ఏఈ రాహుల్ను నిలదీశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలు వకు మూడుచోట్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా కాలువలోని నీరు బయట కు వెళ్లేలా గండి కొట్టించారు. దీంతో ఈ నీరంతా పక్కనే ఉన్న పంట చేలల్లోకి చేరింది. ఫలి తంగా చేలల్లో నీరు చేరి పంట నష్టపోయామని రైతులు అధికారులను నిలదీశారు. తమకు కనీసం సమాచారం లేకుండా కాలువకు గండి పెట్టారని పేర్కొన్నారు. అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
రేపే తుది సం‘గ్రామం’
నిర్మల్: జిల్లాలో పంచాయతీ పోరులో చివరి దశకు చేరుకుంది. మూడో విడతలోని బాసర, ముధోల్, తానూరు, భైంసా, కుభీర్ మండలాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు పోలింగ్ కేంద్రాలతోపాటు సామగ్రి పంపిణీ సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. చివరి విడతలోని ఐదు మండలాల్లో మొత్తం 133 గ్రామపంచాయతీలు, 1,126 వార్డులు ఉండగా, ఇందులో 9 జీపీలు, 333 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్ స్థానాలు, 793 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కుభీర్లో 42.. బాసరలో 10.. మొదటి, రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మండలాలు తక్కువగా ఉన్నా.. ఇక్కడ జీపీలు, ఓటర్ల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. జిల్లాలోనే అత్యధికంగా కుభీర్ మండలంలో 42 గ్రామపంచాయతీలు, 344 వార్డులు ఉన్నాయి. అత్యల్పంగా బాసరలో కేవలం 10 జీపీలు, 90 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,50,593 ఓటర్ల ఉండగా, ఇందులో 73,085 మంది పురుషులు, 77,502 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నేడు పోలింగ్ కేంద్రాలకు.. జిల్లా సరిహద్దు మండలాల్లో చివరి పోరాటానికి సర్వం సిద్ధమైంది. ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల కేంద్రాల్లో పంపి ణీ కేంద్రాలను, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. భైంసా, ముధోల్, కుభీర్ మండలపరిషత్ కార్యాలయాల్లో, తానూరు, బాసర మండల కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సామగ్రి పంపిణీ చేస్తారు. పోలింగ్ సిబ్బంది మంగళవారం ఉదయమే కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రానికి తమకు కేటాయించిన పంచాయతీలకు వెళ్లాలి. అక్కడే రాత్రి బసచేసి, బుధవారం ఉదయం పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో.. మొదటి, రెండో విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. ఇక చివరి విడతలో పల్లెతీర్పు ఎలా ఉంటుందో, ప్రజలు ఏవైపు నిలుస్తారోనన్న ఆసక్తి జిల్లావాసుల్లో నెలకొంది. రెండు విడతలను చూసుకుంటే మొదటి విడతలో కాంగ్రెస్, రెండో విడతలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు అధిక్యం కనబర్చరు. ఇక ఈ విడతలో ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న చర్చ నడుస్తోంది. ఈ ఐదు మండలాలు ముధోల్ నియోజకవర్గానికి చెందినవే కావడంతో స్థానిక నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడోవిడత జీపీలు, ఓటర్ల వివరాలు.. మండలం జీపీలు వార్డులు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు భైంసా 30 258 33,970 16,320 17,648 02 ముధోల్ 19 166 28,754 13,844 14,908 02 తానూరు 32 268 31,516 15,513 16,003 –– బాసర 10 90 15,728 7,572 8,155 01 కుభీర్ 42 344 40,625 19,836 20,788 01 మొత్తం 133 1,126 1,50,593 73,085 77,502 06


