breaking news
Nirmal
-
ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ–2026
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సాంకేతికత, సృజనాత్మకత, విద్యార్థుల ఉత్సాహం కలిసిన జాతీయస్థాయి అంతఃప్రజ్ఞ–2026 కార్యక్రమం ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన భారీ బ్యానర్ ఆవిష్కరణ, డ్రోన్ ప్రదర్శన, ఫ్లాష్మాబ్ ఆదివారం నిర్వహించారు. భారీ బ్యానర్పై అంతఃప్రజ్ఞ 2026 లోగోతోపాటు కార్యక్రమ వివరాలు ప్రదర్శించారు. డ్రోన్ ప్రదర్శనలో ఆకాశంలోకి ఎగసిన డ్రోన్ మహోత్సవాన్ని ప్రతిబింబించే చిన్న బ్యానర్ను విడుదల చేసింది. విద్యార్థుల ఫ్లాష్మాబ్ ఇక విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్మాబ్ ఆకట్టుకుంది. ఇది కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు రోజుల మహోత్సవానికి దేశవ్యాప్తంగా 25 వేల మందికిపైగా విద్యార్థులు, సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రతిభలకు జాతీయ వేదికగా నిలుస్తుంది. విద్యార్థి సమన్వయకర్తలు కె.వివేక్, జి.వంశీ, ఎం.వెంకటకృష్ణ పాల్గొన్నారు. -
పూరికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు
నిర్మల్ టౌన్: నిర్మల్ నుంచి ఆర్టీసీ బస్సు అన్నవరం, సింహాచలం, అరసవెల్లి, కోణార్క్ మీ దుగా పూరికి ఆదివారం బయల్దేరింది. డిపో మేనేజర్ పండరీ బస్సును ప్రారంభించారు. ఈ యాత్ర ఆరు రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్లో అయోధ్య, కాశీ, గోవాకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, సిబ్బంది శకుంతల, విజీ.రెడ్డి, రమణ, భక్తులు పాల్గొన్నారు. లక్కీ స్కీం నిర్వాహకులపై చర్య తీసుకోవాలి ఖానాపూర్: లక్కీ స్కీం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్య తీసుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలోని వ్యాపార సముదాయాన్ని విక్రయించేందుకు లక్కీ డ్రా పేరుతో బంపర్ ఆఫర్ పెట్టి మోసం చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లక్కీ డ్రా పేరుతో నిర్వాహకులు మోసం చేశారని బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేవలం ఒకరిపై నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రూ.వేయి చొప్పున వసూలు చేసిన వారందరికీ డబ్బులు తిరిగి ఇప్పించాలన్నారు. -
పుష్కరఘాట్ మంజూరు చేయాలి
ఖానాపూర్: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలోని గోదావరి వద్ద నూతన పుష్కరఘాట్ మంజూరు చేయాలని సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, ఉపసర్పంచ్ మాదస్తు నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు విన్నవించారు. ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సభ్యులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యేను ఆదివారం కలిశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు రాజశంకర్, భీంరాజ్, రాజేశ్వర్, ఎనగంటి హరి, రాజేందర్, ఎం.శంకర్ తదితరులు ఉన్నారు. -
పండుగలా వుమెన్స్ డే..
మహిళా పోలీస్లతో ఎస్పీ జానకీషర్మిల నిర్మల్/నిర్మల్టౌన్/నిర్మల్చైన్గేట్: ‘మనకంటూ ఒకరోజు. ఇది మనదైన రోజు..’ అంటూ మహిళా దినోత్సవాన్ని జిల్లా మహిళలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు. మహిళలందరికీ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ, సాధికారతకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ సంఘాలు, మహిళ గ్రూపులు, కిట్టీపార్టీల ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా అతివల సంబురాలు కొనసాగాయి. రోజంతా కలిసి ఆడుతూ, పాడుతూ.. కలిసి భోజనాలను చేశారు. కలిసికట్టుగా సీ్త్రల హక్కులనూ సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఐన్ కంటిదవాఖానా వైద్యుడు ఇర్ఫాన్ఫరాజ్ 31 మంది మహిళలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించారు. ప్రియదర్శినినగర్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి ఆధ్వర్యంలో వుమెన్స్డే నిర్వహించారు. అంగన్వాడీలు, ఆయాలు, ఆశ కార్యకర్తలను సన్మానించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వాసవి, ఉపాధ్యక్షురాలు గీత పాల్గొన్నారు. ట్రెండీగర్ల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా వుమెన్స్డే సంబురాలు నిర్వహించారు. సభ్యులంతా నల్లరంగు డ్రెస్కోడ్లో హాజరయ్యారు. ఒక్కొక్కరు తమలోని బలాన్ని పేపర్పై రాసిచూపుతూ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. అనంతరం కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో మహిళ ఉద్యోగులంతా కలిసి వుమెన్స్ డే నిర్వహించారు. ఇటీవల గెలుపొందిన మహిళ కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం తమ హక్కుల సాధన కోసం కలిసి సాగుదామని పిలుపునిచ్చారు. సంఘ బాధ్యులు ఆలియాసుల్తానా, రహత్నాజ్నీన్, ఆలియా ఫాతిమా, రోమాన, ఆయేషా, డాక్టర్ అమీనా తదితరులు పాల్గొన్నారు. -
బాలికలకు హెచ్పీవీ ఇప్పించాలి
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్: 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య తల్లిదండ్రులకు సూచించారు. నిర్మల్, భైంసా ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలను వేర్వేరుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన జీవన శైలి నేపథ్యంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్నారు. సర్వైకల్ క్యాన్సర్తోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. డీఎంహెచ్వో రాజేందర్ మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ను మొదటి దశలో జీజీహెచ్, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలరోజులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు నెలలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో నిర్మల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్, ఆర్ఎంవో డాక్టర్ రమేశ్, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వాణాధికారి డాక్టర్ నయనారెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ ప్రీతంరాజ్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, డిప్యూటీ డీఎంహెచ్వో ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
వంటింట్లో యుద్ధం మంట
భైంసాటౌన్: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మన వంటిట్లో మంట పెట్టింది. యుద్ధం కారణంగా చమురు సరఫరా మందగించింది. ఫలితంగా పెట్రోలియం ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచింది. 14.2 కిలోల గృహ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.929 ఉండగా, రూ.60 పెరిగి, రూ.989కు చేరింది. పెరిగిన ధరలు అన్నిరకాల కనెక్షన్లకు వర్తించనున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు తెలిపాయి. ఇక, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,029 ఉండగా, రూ.2,144 కు పెరిగింది. వీటికితోడు రూ.20 నుంచి రూ.30 వరకు డెలీవరీ చార్జీలు ఉండనే ఉన్నాయి. ఫలితంగా వంటగ్యాస్ వినియోగదారులపై ఆర్థికంగా భారం పడనుంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో హెచ్పీ, భారత్, ఐవోసీ కంపెనీలకు చెందిన 16 గ్యాస్ ఏజెన్నీలు ఉన్నాయి. వీటి కింద సాధారణ, ఉజ్వల, దీపం, సీఎస్ఆర్ వంటగ్యాస్ కనెక్షన్లు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో సింగిల్ కనెక్షన్లు 1,81,626 ఉండగా, రెండు నెలలకు ఒక వంటగ్యాస్ సిలిండర్ చొప్పున రూ.16.87 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.1.08 కోట్లకుపైగా అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ అందిస్తామని తొలుత సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమచేసింది. కొద్దినెలలుగా ఈ సబ్సిడీ జమకావడం లేదు. కేవలం కేంద్రప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.43 మాత్రమే జమవుతోంది. దీంతో ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద రూ.500లకు సిలిండర్ అందిస్తుందా లేదా స్పష్టత రావాల్సి ఉంది.జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా.. సాధారణ కనెక్షన్లు 1,39,430 దీపం కనెక్షన్లు 47,215 ఉజ్వల కనెక్షన్లు 37,249 సీఎస్ఆర్ కనెక్షన్లు 26,828 ఇతర కనెక్షన్లు 1063 మొత్తం కనెక్షన్లు 2,51,785 -
బాసరలో భక్తుల రద్దీ
బాసర : బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇన్చార్జి ఈవో విజయరామారావు. ఏఈవో గంగ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో వివిధ పాఠశాలల విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. పరీక్ష ప్యాడ్లు, హాల్ టికెట్లు, పెన్నులు అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేయించారు. వెయ్యి రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాసం 613, రూ.150 సాధారణ అక్షరాభ్యాసం 331, చండీహోమం, అభిషేక లడ్డూ, మహా ప్రసాదం, పులిహోర, మండప ప్రవేశం, అష్టోత్తర కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.13,69,090 ఆదాయం సమకూరినట్లు ఇన్చార్జి ఈవో తెలిపారు. -
గోదావరి తీరంలో ఆది మానవుల ఆనవాళ్లు
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రాచీన మెగాలిథిక్, మైక్రోలిథిక్ టూల్స్ తయారీ అవశేషాలు కనుగొనబడ్డాయి. చరిత్రకారుడు, కవి డాక్టర్ తుమ్మల దేవరావు ఈ ఆవిష్కరణను ప్రకటించారు. ఈ ఆధారాలు జిల్లా ప్రాచీన జీవన శైలిని వెలుగుపరుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరంలో ఈ అవశేషాలు గుర్తించారు. నదీ ప్రాంతాలు ఆహారం, నీరు అందించడంతో ఆదిమానవులు ఇక్కడ స్థిరపడి వేటకు యుధాలు తయారు చేసుకున్నారు. రాతి పరుపులపై గ్రూవ్స్(లోతైన గీతలు) ఈ కార్యక్రమానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తయారీ తంత్రం.. ఈ గీతల్లో రాతి గొడ్డళ్లను మెరుగుపరచి, ఆయుధాలకు, కత్తెరల్లా పరికరాలకు పదును పెట్టినట్లు తెలిపారు. మైక్రో బ్లేడ్లు, యారోపాయింట్లు(బాణ అంచులు), స్క్రాపర్లు(చర్మ తొలిచే పరికరం), కోర్ స్టోన్లు, జామెట్రిక్ మైక్రోలిథ్లు 0.4 నుంచి 1 సెం.మీ. పరిమాణంలో లభించాయి. గ్రూవ్స్ సమీపంలోనే ఈ పరికరాల సంగ్రహం ఎక్కువగా ఉండటం ఆసక్తికరం. క్రీ.పూ 10 వేల నుంచి 4 వేల సంవత్సరాల మధ్య.. క్రీస్తుపూర్వ 10 వేల సంవత్సరం నుంచి 4 వేల సంవత్సరాల వరకు ఈ ఆయుధ కళ ఊపందుకున్నట్లు అంచనా. వేట ఆధారిత మనుగడకు జంతు చర్మాలు, ఆయుధ అంచులు తయారీకి ఈ సాధనాలు ఉపయోగపడ్డాయి. పరిశోధనలో డాక్టర్ తుమ్మల దేవరావుతో అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, తుమ్మల సుజాత సహకరించారు. బహుళ కర్మాగారాలు ఉంటాయని..గోదావరి ప్రాంతంలోని వివిధ చోట్ల ఇలాంటి తయారీ కేంద్రాలు ఉండవచ్చని పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ ఆనవాళ్లు నిర్మల్ ప్రాచీన చరిత్రకు బలమైన సాక్ష్యాలు. గోదావరి ప్రాజెక్టు పరిధిలో ఇంతకుముందు కూడా సారవంతమైన కనుగొన్నవి ఉన్నాయి. పురావస్తు శాఖ, ప్రభుత్వం ఈ ఆధారాలను కాపాడాలని పరిశోధకులు కోరుతున్నారు. ఇవి ఆదిమానవ సంచారాలు, మనుగడ వ్యూహాలను, జిల్లా చరిత్రను, గతాన్ని పునరుద్ధరించడానికి కీలకం కానున్నాయి. -
నకిలీ హాజరుకు చెక్
నిర్మల్7నీతి ఆయోగ్ ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు పెంబి నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్వహించే ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ సెమినార్కు జిల్లాలోని పెంబి ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికై నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే ఉన్నతస్థాయి సెమినార్లో పెంబి బ్లాక్ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలకరంగాల్లో పెంబి మండలం గణనీయమైన పురో గతి సాధించినందుకు ఈ అవకాశం దక్కిందని వివరించారు. రాష్ట్రం నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు మాత్రమే ఈ సెమినార్కు ఎంపిక కాయ్యాయని తెలిపారు. పెంబి బ్లాక్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ వేదికపై ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. లక్ష్మణచాంద: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్లో కూలీల హాజరు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. నూతన యాప్తోనే... గతేడాది ఆగస్టు నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్ఎంఎంఎస్ నూతన యాప్ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. నమోదు ఇలా.. పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మస్టర్లో కనిపించే పేర్లపై కూలీ ఫోటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. అలాగే పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో అనేక సంఘటనలు.. జిల్లా వ్యాప్తంగా 1,74,318 జాబ్ కార్డులు ఉన్నాయి. 3,20,936 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 88,475 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నారు. అనంతరం చేపట్టిన సామాజిక తనిఖీల్లో పలుమార్లు ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు.జిల్లా సమాచారం... జిల్లాలో మొత్తం జీపీలు 400 మొత్తం జాబ్ కార్డులు 1,74,318 మొత్తం కూలీల సంఖ్య 3,20,936 యాక్టివ్ జాబ్ కార్డులు 88,475 -
వీసీ కోసం విద్యార్థుల నిరీక్షణ
ఆర్జీయూకేటీలో విద్యార్థులు, యాజమాన్యం మధ్య లొల్లి ముదురుతోంది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న పరిపాలనా సమస్యలపై చర్చించేందుకు టీఎస్ఏఎస్ సభ్యులు శనివారం ఇన్చార్జి వీసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సుమారు 50 మందికిపైగా విద్యార్థులు వీసీని కలిసేందుకు రెండు గంటలకుపైగా కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. టీఎస్ఏఎస్ అధ్యక్షుడు నవనీత్ మాట్లాడుతూ.. వీసీ కార్యాలయానికి వెళ్తే డీన్ దగ్గరకు, డీన్ కార్యాలయానికి వెళ్తే మళ్లీ వీసీ దగ్గరకు వెళ్లమని చెప్పుతూ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమస్యలను చెప్పేందుకు వచ్చిన విద్యార్థులను గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, లోపలికి రాకుండా గేట్లు మూసివేయడం వంటి చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు వారాలుగా యూనివర్సిటీలో పలు పరిపాలనా సమస్యలు కొనసాగుతున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని విద్యార్థులు తెలిపారు. వీసీ లేదా సంబంధిత అధికారులు ఒక తేదీ, సమయం కేటాయించి విద్యార్థుల సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
అసత్య ప్రచారం సరికాదు
బాసర: సామాజిక మాధ్యమాల్లో బాసర ఆర్జీయూకేటీపై జరుగుతున్న అసత్య ప్రచారంపై యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ వెళ్లారని తెలిపింది. ఈ విషయాన్ని వక్రీకరించి అధికా రులు అందుబాటులో లేరని కొంతమంది విద్యార్థులు వీడియోలు విడుదల చేయడాన్ని ఖండించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యాబోధన, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపింది. అసత్య ప్రచారం నమ్మొద్దని కోరింది. -
అన్నిరంగాల్లో రాణించాలి
నిర్మల్: ‘మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లాలో తొలిసారి కలెక్టర్గా పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రక్తహీనత, ఇతరత్రా ఇబ్బందులతో బాలింతలు చనిపోవడాన్ని అరికట్టడానికి ‘అమ్మరక్షిత’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం, మాతృమరణాల తగ్గింపులో దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపురావడం చాలా సంతృప్తినిస్తోంది. మహిళలు తలచుకుంటే, తమలోని శక్తిని గుర్తిస్తే, దేనినైనా సాధించగలరు..’ అంటూ కలెక్టర్ అభిలాషఅభినవ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’తో మాట్లాడారు. -
ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు
నిర్మల్చైన్గేట్: ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై శని వారం సమీక్ష చేశారు. పంచాయతీరాజ్, రహదారులు–భవనాల (ఆర్అండ్బీ) శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల పనుల్లో జాప్యం చేయొద్దని సూచించారు. అటవీ శాఖ అనుమతులతో ముడిపడి ఉన్న పనుల కోసం వెంటనే ‘పరివేశ్’ పోర్టల్లో దరఖాస్తు చేయాలన్నారు. ఖానాపూర్ పట్టణ పరిధిలో విలువైన ప్రభుత్వ భూ ముల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమగ్రంగా సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అటవీ క్లియరెన్స్ విషయంలో అధికారులు వేగంగా స్పందించాలని, అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
బాలికలకు టీకా రక్ష
తల్లిదండ్రుల అనుమతితోనే.. తల్లిదండ్రుల అనుమతితోనే హెచ్పీవీ టీకా వేస్తాం. జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ను ఈనెల 8 (నేటి) నుంచి పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాాం. మొదట జీజీహెచ్ సీహెచ్ సీలో ప్రారంభించి తర్వాత పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధి లోని 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు చేస్తాం. వైద్యుల పర్యవేక్షణలోనే టీకాల పంపిణీ కొనసాగుతుంది. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో నిర్మల్చైన్గేట్: మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్)ను నియంత్రించేందుకు కేంద్రం హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ టీకాను 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇస్తే లక్ష్యం నెరవేరేలా పని చేస్తుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ప్రధాని మోదీ జాతీయస్థాయిలో రాజస్థాన్లో టీకా పంపిణీని ఫిబ్రవరి 28న ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ప్రారంభించారు. ఉమెన్స్ డే సందర్భంగా జిల్లాలో ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. 90 రోజుల కార్యక్రమం.. వ్యాక్సిన్ స్టాక్ రావడంతో ఆదివారం నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇది 90 రోజుల కార్యక్రమం. ఇప్పటికే ఆరోగ్యశాఖ 14–15 ఏళ్లలోపు బాలికలు జిల్లాలో 7,684 మంది ఉన్నట్లు గుర్తించింది. మొదట నెల రోజులు జిల్లా జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఉన్న 18 పీహెచ్సీలలో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్సీల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు హెచ్పీవి వ్యాక్సిన్ ఇచ్చే విధానంపై శిక్షణ ఇచ్చారు. వ్యాక్సిన్తో ఉపయోగాలు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్లను ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడపిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకముందే టీకా తీసుకోవడంతో సంబంధిత క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది. సుమారు రూ.5 వేల ఖరీదు ఉండే ఈ టీకాను భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా పంపిణీ చేస్తోంది. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్చైన్గేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు పట్టణంలోని ఓ హోటల్లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అవసరమైన మెలుకువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామ్గోపాల్, ఇండియన్ పోస్ట్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రయాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేశ్కుమార్ పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న బైక్
లక్ష్మణచాంద: స్కూల్ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సోన్ ఎస్సై గోపి కథనం ప్రకారం.. సోన్ మండలం వెల్మల్ నుంచి శనివారం ఉదయం నిర్మల్ శ్రీ చైతన్య పాఠశాల బస్సు విద్యార్థులతో నిర్మల్ వైపు వెళ్తోంది. సంఘంపేట్కు చెందిన గజ్జల గంగన్న, భీమన్న బైక్పై వేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి మూటాపూర్ నుంచి వెల్మల్ వైపు ఎదురుగా వస్తున్నారు. న్యూవెల్మల్ శివారు గల సరస్వతి కెనాల్ బ్రిడ్జి వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పాఠశాల డ్రైవర్ శంకర్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో మద్యం మత్తులో వేగంగా బైక్ నడిపిన గంగన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్జీయూకేటీలో ఘనంగా మహిళా దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారికతపై జరిగిన ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలో నియోం లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్?ట్టమెంట్ డైరెక్టర్గా పని చేసిన ఎల్జా జెజేరేనియా ఆన్లైన్ద్వారా మాట్లాడారు. ఆధునిక సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారని, గ్లోబల్ స్థాయిలోవారికి లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, మహిళలు తమలోని శక్తిని గుర్తించి ప్రతీరంగంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థినుల కోసం తాము వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాము స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాలలో సరికొత్త దిశలో అవకాశాలను కల్పించామని, ఇది ప్రతీ సంవత్సరం పెరుగుతున్న బాలికా విద్యార్థుల(గర్ల్స్ స్టూడెంట్స్) చేరికల సంఖ్య ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కే రాములు, సభ్యులు రమాదేవి, లకుమాదేవి, నాగలక్ష్మి, సారిక, ప్రవళిక, శ్రీవిద్య, శ్వేత, శిరీష, బద్రి నారాయణ్, అసోసియేట్ డీన్లు శేఖర్ శీలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ మహిళా ఫారెస్ట్ అధికారిగా అలేఖ్య
నర్సాపూర్(జి): ఎఫ్ఎస్వో సుంకరి అలేఖ్య ఉత్తమ మహిళా ఫారెస్ట్ అధికారిగా పురస్కారం అందుకున్నారు. సారంగాపూర్ మండలం ఆలూరుకు చెందిన ఈమె నర్సాపూర్ (జి) మండలంలో ఎఫ్ఎస్వోగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల స్థిరమైన నిర్వహణకుగాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీసీఎఫ్, రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక వర్గేస్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. శనివారం బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, ఎఫ్డీఓ నాగిని భాను, అటవీ అధికారులు ఆమెను అభినందించారు. -
నువ్వే జగమంతా..
అమ్మ తలుపు తెరిస్తేనే పొద్దు తెల్లారుతుంది. ఆలి అన్నీ సిద్ధం చేసిస్తేనే రోజు మొదలవుతుంది. బిడ్డ నవ్వుతూ ఎదురొస్తేనే ఆ రోజు బాగా గడుస్తుంది. అక్క ‘ఆల్ ది బెస్ట్’ చెబితేనే విజయం దక్కుతుంది. చెల్లితో గిల్లికజ్జాల జ్ఞాపకం జీవితాంతం గుర్తుంటుంది. ఆమే లేకుంటే.. ఏదీ లేదు. సృష్టికి మూలం, ప్రేమకు రూపం, ధైర్యానికి నిదర్శనం ఆమె. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రమజీవులుగా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కండక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జిల్లా కేంద్రంలో ఇంకా చీకట్లు తొలగకముందే చీపుర్లు పట్టుకుని పట్టణాన్ని పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో శనివారం వేకువజామున ముచ్చటించింది. తెల్లవారుజామున ఉరుకులు, పరుగులతో ‘ప్రగతిచక్రాల’లను పరుగులు పెట్టించేందుకు మహిళా కండక్టర్లను పలకరించింది. – నిర్మల్ -
ప్రతీ మహిళా శక్తిని చాటాలి..
నిర్మల్: ‘మహిళఖిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులు సత్తా చాటుతున్నారు. పోలీసుశాఖలో మహిళా పోలీసు సిబ్బంది ద్వారా పోలీసక్క, నారీశక్తి, శివంగి టీమ్.. ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం సంతోషాన్నిస్తోంది. ఇక్కడ సిబ్బంది కూడా అంకితభావంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతీ సమస్యను ఎదుర్కొనేలా సీ్త్రలు సిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో రాణించగలుగుతాం..’ అని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. -
ఇళ్లు మంజూరు చేయండి
భైంసాటౌన్/భైంసారూరల్: ముధోల్ నియోజకవర్గానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే జి.విఠల్రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి విన్నవించారు. లబ్ధిదారుల ఎంపిక సమయంలో కొందరు ఇల్లు లేనివారిని కూడా సాంకేతిక కారణాలతో ఎల్–3 లిస్టు, ఎల్–2 లిస్టులో చేర్చినట్లు తెలిపారు. అర్హులకు న్యాయం జరిగేలా ఆ జాబితాలను సరిచేసి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విఠల్రెడ్డి తెలిపారు.మంత్రికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి -
నిర్మల్
(0%)1325%స్నేహితుల సూచనసమాజం69లేదు 83మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఒక సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరంనా సొంత నిర్ణయం 282మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును కావాలనే ఎంచుకున్నారా?మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తోంది...50%మా తల్లిదండ్రుల నిర్ణయంకుటుంబం 291స్నేహితులు110100%235158పూర్తిగా 205కొద్దిమేర 182 -
కోటి కష్టాలు
కోతుల కట్టడికి నిర్మల్: ‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేసిన్నుంచి పరేషాన్ చేస్తున్నయ్. బయటకు అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందకు మంద వాకిట్లనే కూసున్నయ్. ఏమన్నందామంటే మీదికస్తున్నయ్. వీటిని ఏంచేసుడిగ..’ జిల్లాలో ఇదీ పరిస్థితి. ఇది ఒక్క జిల్లాకేంద్రమో.. ఇంకో ఊరిదో కాదు. జిల్లావ్యాప్తంగా అన్ని ఊళ్లల్లో ఇప్పుడు కోతులతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి చిన్న ముచ్చటనే కానీ.. వీటితో ప్రధానంగా పల్లెల్లో రైతులు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. వీటి బాధ భరించలేక పంటచేళ్లల్లో చుట్టూ ఉన్న చెట్లను నరుక్కున్నారు. అంతేకాదు.. వాటిని తరిమికొట్టేందుకు కొండెంగ, ఎలుగుబంటి, చింపా జీ వేషధారణలో వాటివెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఉంది. ఇన్ని చేస్తున్నా.. వానరాల కట్టడి సాధ్యం కావడం లేదని పలువురు వాపోతున్నారు. పెరుగుతూనే ఉన్న సంతతి.. వానరాల జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడకోతి కేవలం మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. తన జీవితకాలంలో దాదాపు 20–22 పిల్లలు కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లోనే పరిమితమైన కోతులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం కోసం జనావాసాలు, పంటచేళ్లపై ఆధారపడుతున్నాయి. తిండి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు అడ్డుకున్నా, తమను కొట్టేందుకు వచ్చినా విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాయి. ప్రయోగానికి స్పందనేదీ..? రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లాకేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ ఏర్పాటు చేశారు. ఇందులో వానరాలకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ చేసి, వాటి సంతతి క్రమంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభించారు. కానీ.. ఇక్కడికి కోతులను తీసుకురావడమే అసలు సమస్య. కొన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు మాత్రమే కోతులను పట్టి తీసుకొస్తున్నాయి. ఈ ప్రయోగం కొంతమేర ఫలితమిచ్చేలా ఉన్నా.. ప్రస్తుత సర్కారు మాత్రం దీనిపై దృష్టిపెట్టడం లేదు. ఇటీవల కొలువుదీరిన నిర్మల్ పుర పాలకవర్గం త్వరలోనే కోతుల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పింది. గతంలో మాదిరి వాటిని పట్టుకుని దూరంగా అడవుల్లో వదిలి పెడతామని పేర్కొన్నారు. వేషం వేయాల్సిందే.. ఈ చిత్రంలో ఇద్దరు ఎలుగుబంటి, చింపాజీలను పోలినట్లున్న వేషం వేసుకున్నారు. వీరు కూడా కోతులను తరమడానికే ఇలా తిప్పలు పడుతున్నారు. నిర్మల్రూరల్ మండలం న్యూపోచంపాడ్లో సర్పంచ్ పద్మశ్రీనివాస్ కోతుల నివారణకు ఇలా గ్రామస్తులతో వేషం వేయించి కట్టడికి ప్రయత్నం చేశారు. -
నిర్మల్
బందీఖానాగా మార్చాల్సిందే.. ఇది ఇల్లా.. లేక జైలా..! ఇలా చుట్టూ ఇనుప కట్టడి చేశారు అన్న అనుమానం వస్తుంది కదా! ఇది కూడా కోతులను అడ్డుకోవడానికే. పచ్చని మొక్కలను నాశనం చేయడమే కాదు, ఇంట్లోకి చొరబడి నానాహంగామా చేస్తుండటంతో జిల్లాకేంద్రంలో ఇలా ఇంటిని బందీఖానాలా మార్చుకోవాల్సి వస్తోంది. వల వేసుకోవాల్సిందే... జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్కు చెందిన సంతోష్ రోజూ కిరాణాషాప్ తీయగానే ముందుగా చుట్టూ వల వేస్తుంటారు. ఎందుకంటే.. ఏ వైపు నుంచి ఏ కోతి దుకాణంలోకి చొరబడుతుందో తెలియదు. డబ్బాలను, ప్యాకెట్లను ఎప్పుడు ఎత్తుకెళ్తుందో చెప్పలేం. అందుకే ఇలా జాలిలు, వలలతో దుకాణాన్ని కాపాడుకుంటున్నాడు. నిర్మల్లో గల్లీల్లోని ఏ దుకాణం చూసినాఇలాంటి రక్షణ చర్యలే కనిపిస్తాయి. కొండెంగ ఫొటో పెట్టాల్సిందే.. ఏంటిదీ..!? కొండెంగ ఫొటోను ఇలా ఇంటి గేట్కు పెట్టుకున్నారు..!? అని ఆశ్చర్యపోకండి. నిర్మల్లో ప్రస్తుతం చాలామంది తమ ఇళ్ల ముందు ఇలా కొండెంగల ఫొటోలు పెట్టుకుంటున్నారు. కోతులు చేసే చేష్టలను, అవి చేసే నష్టాలను కట్టడి చేసేందుకు. కొండెంగలు ఉన్న చోటుకు కోతులు రావన్న ఉద్దేశంతో ఇదిగో ఇలా ‘కొండెంగ ప్రయత్నం’ చేస్తున్నారు. ప్రతిజ్ఞ చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. రంజాన్ కానుకలొచ్చాయ్నిర్మల్చైన్గేట్: రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండడంతో రంజాన్ తోఫాలు జిల్లాలకు పంపుతోంది. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 3 వేల కుటుంబాలకు తోఫా రంజాన్ కానుకలు జిల్లాలో 3 వేల కుటుంబాల కు అందించాలని అధికారులు గుర్తించారు. నిర్మల్ నియోజకవర్గంలో 1000, ముధోల్లో 1,250, ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో 750 కుటుంబాలకు ఈ కానుకలు అందించనున్నారు. రంజాన్ తోఫా కింద కుటుంబంలోని భార్యాభర్తతోపాటు వారి పిల్లలకు నూతన దుస్తులు అందించనున్నారు. ఇందులో పాయింట్, షర్ట్, చుడీదార్, చీర, జాకెట్ ఉంటాయి. ఇఫ్తార్ విందుకు నిధులు.. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.12 లక్షలు మంజూరు చేసింది. నిర్మల్ నియోజకవర్గానికి రూ.4 లక్షలు, ముధోల్కు రూ.5 లక్షలు, ఖానాపూర్కు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేసింది. నిర్మల్లో 4, ముధోల్లో 5, ఖానాపూర్లో 3 ప్రాంతాల్లో 500 మంది చొప్పున ఇఫ్తార్ విందు ఇస్తారు. లబ్ధిదారులు, నిధుల వివరాలు నియోజకవర్గం లబ్ధిదారులు ఇఫ్తార్ నిధులు నిర్మల్ 1,000 రూ.4 లక్షలు ముధోల్ 1,250 రూ.5 లక్షలు ఖానాపూర్ 750 రూ.3 లక్షలు -
పాఠశాల ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్
భైంసాటౌన్: పట్టణంలోని నారాయణ పాఠశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఫీజుల వసూలుపై ‘ఇదేం.. ఫీజులుం..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈవో సుభాష్ పాఠశాలకు శుక్రవారం చేరుకుని ప్రిన్సిపాల్కు నోటీసు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతం చేయడంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ముందస్తుగా ఫీజులు ఏ అధికారం కింద వసూలు చేస్తున్నారని, అలాంటి సేకరణ కోసం సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందారా.. నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సంస్థపై ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలోపు సంబంధిత సహాయక పత్రాలతోపాటు రాతపూర్వక వివరణ సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఎంఈవో తెలిపారు. గడువులోపు సమాధానం రాకపోతే, తదుపరి నోటీసు లేకుండా నిబంధనల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ముందస్తు ఫీజుల వసూలుపై పాఠశాల నిర్వహకులు, ఎంఈవోను ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఫైజాన్ అహ్మద్కు వీడ్కోలు
నిర్మల్చైన్గేట్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఫైజాన్ అహ్మద్ వీడ్కోలు కార్యక్రమం గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఏ ఉద్యోగికి అయినా బదిలీలు సర్వసాధారణమన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి, పల్లె, పట్టణ ప్రగతి, ఎన్నికల నిర్వహణ, పలు విభాగాలకు నోడల్ అధికారిగా, నిర్మల్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా, ప్రభుత్వ పథకాల అమలుకు విశేష కృషి చేశారన్నారు. బదిలీపై వెళ్లిన జిల్లాలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సంతృప్తినిచ్చింది.. ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. విధుల నిర్వహణలో తనకు సహకారం అందించిన కలెక్టర్ అభిలాష అభినవ్, అధికా రులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం కలెక్టర్, పలువురు అధికారులు ఫైజాన్ అహ్మద్ దంపతులను సన్మానించి, జ్ఞాపికలు అందించారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన కౌన్సిలర్లు
ఖానాపూర్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖనాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును శుక్రవారం కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో అంకం మౌనిక, మహేందర్, బండిపెల్లి సింధూజ, ప్రకాశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి ఉన్నారు. -
పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్
లక్ష్మణచాంద: పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్కు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ సౌజన్యంతో అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5, 6వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు ఇందులో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. 6, 7 తరగతుల కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు వసతితోపాటు భోజనం, విద్య ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 8 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 15న నిర్మల్లో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజునాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా అమలు చేయాలి...
నిర్మల్చైన్గేట్: వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వివిధ శాఖలకు కేటాయించిన పనులన్నీ ప్రణా ళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, షిండే ఆనంద్రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పది హాల్టికెట్లపై క్యూ ఆర్ కోడ్
లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. పరీ క్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్టికెట్లు పాఠశాలకు చేరుకున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి పోస్టల్ శాఖ ద్వారా ముందస్తుగానే విద్యార్థుల హాల్ టికెట్లు వివిధ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ పంపించినట్లుగా ప్రధానోపాధ్యాయులు తెలిపారు. జిల్లాలో ఇలా...జిల్లాలో 168 ప్రభుత్వ పాఠశాల నుంచి 3,013 బాలురు, 3,592 మంది బాలికలు, 73 ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 1773 మంది బాలురు, 1,372 మంది బాలికలు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమై వచ్చేనెల13 వరకు జరుగుతాయి. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్..పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కో డ్ను విద్యాశాఖ అధికారులు ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ను విద్యార్థులు ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే విద్యార్థి పరీక్ష వివరాలతోపాటు పరీక్ష కేంద్రం లైవ్ లొకేషన్ కూడా సూచిస్తుంది. అలాగే విద్యార్థు ల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్(పెన్) కూడా హా ల్ టికెట్పై ముద్రించినట్లు అధికారులు తెలిపారు. పోషకుల ఫోన్లకు.. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకుకోవచ్చు. దీనికోసం ముందుగా 8096958096 నంబర్కు హాయ్ అని వాట్సాప్ చేయాలి. వెంటనే ‘వెల్కమ్ టు మీ సేవ’ అనే రిప్లై మెసేజ్ వస్తుంది. ఆ తరువాత ‘ఎస్సెస్సీ హాల్టికెట్ మార్చి–2026’ అని మెసేజ్ పంపితే ఒక లింక్ అందుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరును ఎంపిక చేసి, పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంటినుంచే హాల్ టికెట్లను పొందే సౌకర్యం కల్పించింది.విద్యాశాఖ సూచనల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా పదోతరగతి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర విద్యాశాఖ ఇదివరకే అన్ని పాఠశాలలకు పోస్టుద్వారా హాల్ టికెట్లు పంపించింది. పోషకుల వాట్సాప్కు కూడా విద్యార్థుల హాల్ టికెట్లు పంపడం జరిగింది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలి. – భోజన్న, డీఈవో,నిర్మల్ -
పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం
కడెం: రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని డీఎఫ్వో సుశాంత్సుఖ్దేవ్ బొబడే అన్నారు. సాగుభూమి కోసం ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో పునరావాస గ్రామాన్ని గురువారం సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. సాగునీరు, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గిరిజనులు అందోళన విరమించాలని సూచించారు. సీఐ అజయ్, ఎస్సై సాయికిరణ్ అధ్వర్యంలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఇందులో ఎఫ్డీవో శివకుమార్, డీటీ లచ్చిరాం, ఆర్ఐ శారద, అటవీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రగతి కోసం.. ప్రణాళిక
నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ జిల్లాలో గురువారమే ప్రారంభమైంది. కలెక్టర్ అభిలాషఅభినవ్ విజయవంతంగా ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి దాదాపు పది ప్రధాన అంశాల్లో ప్రణాళికబద్ధంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 99రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈనెల 3న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి ఈకార్యక్రమంపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి శుక్రవారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో ఈమేరకు కార్యక్రమాలను చేపట్టేందుకు కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆధ్వర్యంలో అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నిర్మల్ మున్సిపాలిటీలో తనిఖీలు చేశారు. ప్రజలతో మాట్లాడారు. 99 రోజుల పాటు..రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని 99 రోజులు పకడ్బందీగా అమలు చేయనుంది. పల్లెస్థాయి నుంచి రూపురేఖలు మార్చే దిశగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదల తదితర లక్ష్యాలను పెట్టుకున్నారు. గ్రామాల్లో ఈనెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తిచేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు సేవలు అందేలా..ప్రజాసమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సేవల ను ప్రజలకు సమర్థవంతంగా అందించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వర కు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, ప్రజారోగ్యం, రోడ్డు భవన నిర్మాణాలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణం, మాదకద్రవ్యాల నిర్మూలన తదితరలు అంశాలు ఇందులో ఉన్నాయి. సంబంధిత శాఖలు ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోనూ సంబంధిత అధికారులు ఈమేరకు కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. విజయవంతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని జిల్లాలోనూ 99 రోజులు విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లావాసులూ సహకరించాలి. – అభిలాషఅభినవ్, కలెక్టర్ఐదు దశల్లో..ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2న ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండలస్థాయి సమావేశాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు చేపడతారు. మే 22న జిల్లాస్థాయి సమావేశాలు, కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయి. జూన్ 12న ఈ కార్యక్రమం ముగియనుంది. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అమలు చేయటంతోపాటు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేసింది. నిర్మల్ పట్టణంలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ -
పీఎఫ్ ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదు ట నిరసన తెలిపారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ దరఖాస్తు కోసం ఆన్లైన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించి నెలకు రూ.4,016 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన కార్మికులందరికీ పెన్షన్, బకాయిలు చెల్లించా లన్నారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పా టు చేయాలన్నారు. నరేంద్రమోదీ తీసుకొచ్చి న 4 లేబర్ కోడ్స్ చట్టాలు వెంటనే రద్దు చే యాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్, (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి గంగాధర్, అ ధ్యక్షురాలు శ్రీజ, కార్యదర్శులు స్వరూప, స మీనా బేగం, కే.లక్ష్మి, బి.జ్యోతి పాల్గొన్నారు. -
ప్రారంభమైన సోషల్ ఆడిట్
ఖానాపూర్: ఖానాపూర్ మండలంలో 2024–25లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని 25 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ ద్వారా రూ.10,32,26,847, పంచాయతీరాజ్ ద్వారా రూ.5,67,33,920, అటవీ శాఖ ద్వారా రూ.46,29,410 పనులు జరిగాయిరయి. ఈ పనులపై సామాజిక తనిఖీని ప్రారంభిస్తామని సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ మహేశ్ తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి 14 టీంలు 14 మంది డీఆర్పీల ద్వారా పనులు జరిగిన ప్రాంతాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడం జరుగుతందన్నారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలే సేకరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం తనిఖీ వివరాలను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభలతోపాటు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజావేదికలో వెల్లడిస్తామని వివరించారు. సంబంధిత అధికారుల నుంచి రికార్డులు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. -
నిర్మల్
9ఇంటర్ పరీక్షలకు 220 మంది గైర్హాజరునిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 220 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మ్యాథ్స్ బి/జువాలజీ/హిస్టరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు 6,138 మంది హాజరయ్యారు. డీఐఈవో జాదవ్ పరశురాం మామడ జూనియర్ కళాశాల, జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. -
ఎస్వో, ముగ్గురు సీఆర్టీల సస్పెన్షన్
నిర్మల్ రూరల్: పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఎస్వో, ముగ్గురు సీఆర్టీలను కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీని డీఈవో భోజన్నతో కలిసి తనిఖీ చేశారు. మొదట పాఠశాలలోని వంటగది, స్టోర్ రూం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. స్టోర్రూంలో ఉంచిన బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయలను పరిశీలించారు. మెస్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి అసెంబ్లీలో పాల్గొన్నారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన ఎస్వో సుజాత, పీజీ సీఆర్టీలు కవిత, సంతోషిమాత, సీఆర్టీ శైలజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురిని సస్పెండ్ చేయాల ని డీఈవోను ఆదేశించారు. ఉపాధ్యాయులు విధి ని ర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హె చ్చరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాము ఖి నిర్వహించి పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యాబోధన, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఇందులో తహసీల్దార్ రాజు, ఎస్వో లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రూరల్ కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో.. జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీని డీఈవో భోజ న్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. -
ఆమె ఆరోగ్యానికి భరోసా
నిర్మల్చైన్గేట్: ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయంగా, మహిళ ఆరోగ్యానికి భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘హెల్త్ మిషన్–100’ పేరుతో వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయటానికి వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ పీహెచ్సీలలో ఈ మేరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ హెల్త్ కార్డులు..మహిళల కోసం సమగ్రమైన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ’విజన్–2047’లో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఈ 100 రోజుల ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 30 రకాల వైద్య పరీక్షలుజిల్లాలోని సుమారు 15,653 మహిళా సంఘాల్లో ఉన్న 1,74,917 మంది సభ్యులకు 30 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వారి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. అందుకనుగుణంగా వారికి హెల్త్ కార్డులు అందిస్తారు. నాలుగు దశల్లో కార్యక్రమాలు...మొదటి దశ (మార్చి 6 నుంచి 31వరకు)..మొదటి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, కంటి, ఎముకలు, దంతవైద్య, నిపుణులు ప్రత్యేక సేవలు అందిస్తారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వద్ధాప్య చికిత్స శిబిరాలు, స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషకాహారంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడతారు. రెండో దశ (ఏప్రిల్ 1–15వరకు)..ఇందులో క్యాన్సర్ నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి, కేర్ పాలసీని విడుదల చేస్తారు. రిజిస్ట్రీ ఏర్పాటు, ఆరోగ్య మహిళా పథకం కింద స్క్రనింగ్ క్యాంపులు, జిల్లా డే–కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవల మ్యాపింగ్ చేస్తారు. మూడో దశ (ఏప్రిల్ 16– మే 15వరకు).. మూడో దశలో వేసవిలో వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి సారిస్తారు. టీబీ(క్షయ) కేసుల గుర్తింపు, పోషకాహారం అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతారు. నాలుగో దశ(మే 16– జూన్ 12వరకు)..చివరి దశలో పట్టణ, గిరిజన ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. అర్బన్ పీహెచ్సీను పాలీక్లినిక్స్గా అప్ గ్రేడ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమి యా, తలసేమియా, హీమోఫీలియా బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందిస్తారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. హెల్త్ మిషన్–100 కోసం సిబ్బందికి అవగాహన కల్పించాం. ఎప్పుడు ఏ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారనే విషయాన్ని గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యులకు తెలియజేస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వోవివరాలు: -
బిద్రెల్లి వద్ద చెక్పోస్టు
బాసర: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం తరలింపును అడ్డుకునేందుకు ఏఎస్పీ పర్యవేక్షణలో బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బిద్రెల్లి వద్ద చెక్పోస్టు గురువారం ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రాజేశ్మీనా మాట్లాడుతూ ఈ చెక్ పోస్ట్ 24 గంటలు పోలీసులు డ్యూటీ చేస్తూ నిజామాబాద్ ధర్మబాద్ వైపు నుంచి వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తారన్నారు. అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం తరలిస్తే సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రవీందర్నాయక్, బాసర ఎస్హెచ్వో సీఐ కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి ఉన్నారు. -
ఉపాధిహామీలో ఎఫ్ఆర్ఎస్
నిర్మల్ రూరల్: ఉపాధి హామీ పథకంలో ఎఫ్ ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైంది. డీఆర్డీవో విజయలక్ష్మి సోన్ మండలం గంజాల్లో ఈ ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఉద యం 6 గంటలకు వచ్చిన ఉపాధి హామీ కూ లీలను ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ కేవైసీ చేస్తారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా తప్పకుండా మరోసారి ఎఫ్ఆర్ఎస్ ఈకేవైసీ ద్వారా ఫొటో దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికా రులు తెలిపారు. తప్పనిసరిగా రెండుసార్లు ఈ ప్రక్రియ చేస్తేనే కూలీలకు డబ్బుల ను చెల్లిస్తారు. ఒకసారి చేయకపోయినా సగం కూలి మాత్రమే చెల్లిస్తారు. ఈ ప్రక్రియతో నాణ్యత పెరిగి నకిలీలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. డీఆర్డీవో వెంట ఏపీవో రామకృష్ణ, డీఆర్పీ గంగ ఉన్నారు. -
సుదర్శన్రెడ్డిని కలిసిన నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్
నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్దే లక్ష్యంగా మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వేణుగోపాలచారితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిని గురువారం కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను సమన్వ యం చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అ భివృద్ధికి సహకారం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నిర్మల్ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చినట్లు చైర్ పర్సన్ తెలిపారు. -
ఏడాదైనా బోనస్ ఏది?
భైంసా: సన్నవడ్ల బోనస్ కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సన్నవడ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగిలో విక్రయించినవారికి మాత్రం నేటికీ చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 4,483 మంది రైతులు సన్నవడ్లు విక్రయించగా, వీరికి రూ.12.81 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. సన్నాల సాగులో ఐదువేల మందే.. జిల్లాలో 70వేల ఎకరాల్లో రైతులు రెండు సీజన్లలో వరి పండిస్తారు. దొడ్డురకం ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే సన్నరకం పండిస్తే 16 నుంచి 23 క్వింటాళ్లే వస్తుంది. పైగా సన్నాల సాగులో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు కూడా ఎక్కువే. దొడ్డురకం పంట 110 రోజుల్లో వస్తుండగా, సన్నరకం పంట 130 నుంచి 150రోజుల సమయం పడుతుంది. దీంతో సన్నవడ్లు పండించే రైతులు జిల్లాలో 5వేల మంది మాత్రమే ఉన్నారు. సాగు చేయాలా.. వద్దా? ఈ ఖరీఫ్లో సన్నవడ్లకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగికి సంబంధించి పెండింగ్లో పె ట్టింది. దీంతో ఈ యాసంగిలో సన్నాలు సాగు చేసి న రైతుల్లో అయోమయం నెలకొంది. గతేడాదిలాగే బోనస్ నిలిపివేస్తారా? చెల్లిస్తారా? అనే విషయం తెలియక ఆందోళనకు గరవుతున్నారు. కాగా, జిల్లాలో వానాకాలంలో 63వేల ఎకరాల్లో సాగు చేసిన సోయా భారీ వర్షాలతో దెబ్బతింది. మార్క్ఫెడ్ ఆ ధ్వర్యంలో జిల్లాలో 2,38,450 క్వింటాళ్లను నాఫెడ్ కొనుగోలు చేశారు. సోయా రైతులకు రూ.51కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ చెల్లింపులు లేవు. ఇప్పటివరకు జమకాలేదు గత యాసంగిలో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సన్నవడ్లు సేకరించాం. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. కానీ, బోనస్ డబ్బులు ఇప్పటివరకై తే జమకాలేదు. – సుధాకర్, పౌరసరఫరాలశాఖ డీఎం -
టెర్రరిస్ట్ దాడులను ఖండించాలి
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ టె ర్రరిస్ట్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ నిర్మల్–ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు కోరారు. ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఖానాపూర్ పార్క్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల ను ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానా పూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, నిర్మల్ డివిజన్ కార్యదర్శి హరిత, నాయకులు దుర్గం లింగన్న, ఎల్ఆర్ ఉపాలి, కూడుదుల రాజేశ్, గోనె స్వామి, గూట్ల ప్రసాద్, శ్రీనివాస్, మల్లక్క గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
చేతిలోనే.. ‘మీ టికెట్’ ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అభివృద్ధికి సహకరించండి నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వును మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వై స్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి కోరారు. బుధవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వే ణుగోపాలాచారితో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నిర్మల్ పట్టణంలోని చారిత్రక శ్యామఘడ్, బత్తి స్ఘడ్ను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చే యాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. నిర్మల్చైన్గేట్: లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా ని ధులు మంజూరు నిలిచి వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఆగస్టు–2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి నిలిచిపోయాయి. జిల్లాలో 79 రైతువేదికలు గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 79 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి అంటే చెల్లింపులు నిలిచిపోయాయి. 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటి వరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 79 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.2కోట్ల 84లక్షల 40వేలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈవోలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు.. జిల్లాలోని 18మండలాల్లో 79 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి 79మంది ఏఈవోలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. జిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈవోలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కంప్యూటర్లున్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈవోలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటినుంచి నెలానెలా నిధులు విడుదల చేయాలని ఏఈవోలు, రైతులు కోరుతున్నారు. కనీస వసతులు కరువు మంజూరు కాగానే చెల్లిస్తాం కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. నిర్వహణ లోపం లేకుండా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులతో రైతువేదికలను శుభ్రం చేయిస్తున్నాం. రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా చూస్తాం. నిధులు మంజూరు కాగానే రైతువేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలోని రైతువేదికల వివరాలు మండలాల సంఖ్య 18 రైతువేదికలు 79 ఒక్కోదానికి బకాయి రూ.3.60లక్షలు మొత్తం బకాయిలు రూ.2.84కోట్లు -
పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి’
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. జిల్లాలో చా లామంది వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చలికాలంలో చాలా గృహాల్లో ఏ సీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకపోవడంతో విద్యు త్ వినియోగం బాగా తగ్గింది. వేసవికాలంలో ఇ వన్నీ అధికంగా వాడితే కరెంట్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వ ర్తించదు. అందుకే విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 2,45,496 గృహ కనెక్షన్లు జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 2,45,496 ఉన్నాయి. గత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకుని 1,25,257 మంది లబ్ధిదారులు రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. వీరందరికీ రూ.3.59 కోట్ల రాయితీ లభించింది. విద్యుత్ను పొదుపుగా వినియోగించుకుంటే విద్యుదుత్పత్తి భారం తగ్గుతుందని, వేసవిలో విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వినియోగదారులకూ అవగాహన కల్పిస్తున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు, సబ్సిడీ వివరాలు నెల లబ్ధిదారుల సబ్సిడీ మొత్తం సంఖ్య (రూ.లక్షల్లో) జూన్ 1,15,682 రూ.493.44 జూలై 1,22,082 రూ.477.75 ఆగస్టు 1,22,926 రూ.487.40 సెప్టెంబర్ 1,29,365 రూ.498.11 అక్టోబర్ 1,29,762 రూ.501.87 నవంబర్ 1,30,235 రూ.482.11 డిసెంబర్ 1,29,315 రూ.339.98 జనవరి 1,26,881 రూ.315.13 ఫిబ్రవరి 1,25,257 రూ.359.80 పొదుపు చేయడం ఇలా.. సెల్ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ను ప్లగ్ నుంచి తొలగించాలి. -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ఖానాపూర్: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. బుధవా రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. న ల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కా పాడే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని, ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు వచ్చిన వారంతా నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ముసు గు గంగవ్వ, కార్యదర్శి నారపాక పరిమళ, బ్లా క్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ తస్లీమా, ఖానాపూర్, కడెం, మామడ మండలాల అధ్యక్షులు కలమడుగు శారద, సురేఖ, లక్ష్మి, కౌన్సి లర్ తిరుమల, నాయకురాలు రేఖ ఉన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాంనాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్వరం పరీక్షాకేంద్రంలో ద్వితీయ సంవత్సరం పరీక్షకు 120 మంది హాజరు కావాల్సి ఉండగా 117 మంది హాజరైనట్లు తెలిపారు. ఆయన వెంట సీఎస్ విఠల్ ఉన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి. బుధవారం సెకండియర్ విద్యార్థులకు బాటనీ/గణితం/పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,227 మంది విద్యార్థులకు గాను 6053 మంది హాజరు కాగా, 174 మంది గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జాదవ్ పరశురాం లోకేశ్వరం, ముధోల్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు. -
మరింత పకడ్బందీగా ఎఫ్ఆర్ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు మరింత పారదర్శకంగా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఉపాధ్యాయుడు రోజూ ఉదయం 9గంటల లోపు పాఠశాలకు చేరుకుని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 9గంటల తర్వాత నమోదు చేస్తే స్కూల్కు ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు గుర్తిస్తారు. ఉదయం 9.15 గంటల వరకు పాఠశాల అసెంబ్లీ పూర్తి చేసి తరగతి గదులు నిర్వహిస్తారు. గతంలో 10 నిమిషాల వరకు ఆలస్యమైనా వెసులుబాటు కల్పించేవారు. ప్రస్తుతం ప్రతీ నెలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువసార్లు ఆలస్యమైతే గైర్హాజరైనట్లు పరిగణిస్తారని పేర్కొంటున్నారు. రోజుకు రెండుసార్ల చొప్పున.. ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకోవాలి. ఉదయం 9గంటలకు మళ్లీ సాయంత్రం వెళ్లేటప్పుడు చెక్ అవుట్ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ఒక పూట సెలవు పెట్టి మరో పూట పాఠశాలకు హాజరైనప్పుడు ఎఫ్ఆర్ఎస్ నమోదుకు ప్రత్యేక నిబంధనలు పెట్టారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు హాజరయ్యేవారు ఒంటి గంటలోపు రావాల్సి ఉంటుంది. ఉదయం పాఠశాలకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టే ఉపాధ్యాయులు 12.30 గంటలకన్నా ముందుగా అవుట్ టైం నమోదు చేస్తే నిర్ణీత సమయానికి ముందుగా వెళ్లినట్లు పరిగణిస్తారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 713 ఉన్నాయి. ఇందులో 3,267 మంది ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు. బుధవారం 2,535 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా, 309 మంది సెలవులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో బుధవారం 77.59 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. -
పునరావాస భూముల లొల్లి
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గిరిజనులకు పరిహారం కింద మండలంలోని పెత్తర్పు సమీపంలో సాగు భూములు కేటాయించారు. సదరు సాగు భూముల వద్ద ఈ నెల 3న పునరావాస గిరిజనులు, స్థానిక గొండుగూడ వాసుల మధ్య గొడవలు జరిగాయి. బుధవారం పునరావాస కాలనీని ఆర్డీవో రత్నకఽళ్యాణి, ఎఫ్డీవో శివకుమార్ సందర్శించి గిరిజనులతో సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుకు నిరసనగా గిరిజనులు సమావేశ ఆనంతరం పాత మైసంపేట్కు తరలి అక్కడే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సాగు భూముల గొడవలు లేకుండా చేసి, భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని, లేకుంటే పాత గ్రామంలోనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గురువారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. డీటీ లచ్చిరాం, ఎఫ్ఆర్వో గీతారాణి, సీఐ అజయ్, హైటీకాస్ ఎన్జీవో ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెంకట్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడంలో షీటీం పాత్రను ప్రశంసించారు. వేగం పెంచాలి ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్ ఫిర్యాదుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని వారికి సూచించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా ఉన్నారు. -
జిల్లాకు సబ్సిడీ డ్రోన్లు
లక్ష్మణచాంద: జిల్లాలో గడ్డెన్న, కడెం, సదర్మాట్, స్వర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. దీంతో పంటల సాగుకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ జిల్లాగా నిర్మల్ ప్రసిద్ధి చెందింది. రెండు పంటలకు సరిపడా సాగునీరు ఉండడంతో ఏటా రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. రోజురోజుకూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయ పనులకు అవసరమైన కూలీలు దొరకడం లేదు. దీంతో కూలీల కొరతను తీర్చి రైతులను ఆదుకుకోవడానికి సబ్సిడీపై డ్రోన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఎంఏఎం పథకం కింద... సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎంఏఎం) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు పది డ్రోన్లు మంజూరు చేసింది. ధరలో 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. వీరికి కేటాయింపు జిల్లాకు కేటాయించిన పది డ్రోన్లలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీవో), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీలు)కు కేటాయించనున్నట్లు డీఏవో అంజిప్రసాద్ తెలిపారు. 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న డ్రోన్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ఎఫ్పీఓలకు, పీఏసీఎస్లకు, ఎస్హెచ్జీల కు సబ్సిడీపై ఇచ్చే డ్రోన్ల సమాచారం మండల వ్యవసాయధికారుల ద్వారా ఇచ్చినట్లు డీఏవో తెలిపారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు త్వరగా పంపాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సబ్సిడీపై డ్రోన్లు అందచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూలీల కొరత తీరుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందచేస్తున్న డ్రోన్లతో వ్యవసాయ రంగంలో కూలీల కొరత కొంత వరకు తీరుతుంది. వీటిని ఎఫ్పీవో, పీఏసీఎస్, ఎస్హెచ్జీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనల మేరకు అందిస్తాం. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్జిల్లా సమాచారం... జిల్లాకు మంజూరైన డ్రోన్లు 10 కనీస ధర (10 లీటర్ల సామార్ధ్యం) రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు అందించే సబ్సిడీ రూ.4 లక్షలు(గరిష్టంగా) డ్రోన్లు ఇచ్చే సంఘాలు ఎఫ్పీవోలు, పీఏసీఎస్లు, ఎస్హెచ్జీలు -
నిర్మల్కు రైలొచ్చింది!
నిర్మల్ఖిల్లా: పట్టాలే వేయలేదు.. నిర్మల్కు రైలు ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే. జిల్లాలో పట్టాలపై రైలు పరుగులు తీయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజలకు సోమవారం రాత్రి ఓ దృశ్యం కనిపించింది. దీంతో కాసేపు ‘‘నిర్మల్కు రైలు వచ్చిందోచ్!’’ అని ఆసక్తిగా తిలకించారు. భైంసా నుంచి హైదరాబాద్కు ఓ భారీ లారీలో రైలు ఇంజిన్ను తరలిస్తున్నారు. ఆ లారీ రాత్రి నిర్మల్ మీదుగా వెళ్తుండగా పట్టణవాసులు చూసి ఆశ్చర్యపోయారు. చిన్నారులు ఉత్సాహంగా నిర్మల్కు రైలు వచ్చేసింది అంటూ కేరింలు కొట్టారు. -
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం
నిర్మల్చైన్గేట్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సదస్సుల్లో పాల్గొన్నారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్–అలైవ్), సంక్షేమం, పిల్లల భద్రత – డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ప్రత్యేక అంశాలపై శాఖల వారీగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేలా చూడటమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. -
పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఎప్పుడో..!
ముధోల్: పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన సుమారు రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించింది. పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ఇక సీఎం రేవంత్రెడ్డి కూడా పంచాయతీలకు స్పెషల్ ఫండ్ ప్రకటించారు. అయితే రెండు నెలలైనా నిధులు విడుదల చేయలేదు. సీఎం వరాలు కొత్త సంవత్సర కానుకగా సీఎం రేవంత్రెడ్డి చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం కోటా నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాలో 400 పంచాయతీలకు మొత్తం రూ.32 కోట్ల వరకు వస్తాయని లెక్కలు వేశారు కొత్త సర్పంచులు. కానీ రెండు నెలలైనా ఒక్క పంచాయతీకి కూడా నిధులు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీలు.. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం విడుదల చేసిన నిధులు అరకొరగా ఉన్నాయి. పంచాయతీ నిర్వహణకు, చెల్లించాల్సిన బిల్లులకు పేరుకుపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులు ఆలస్యం కారణంగా సర్పంచులు బిల్లులు చెల్లిస్తున్నారు. నిధులు లేకపోవడంతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. పంచాయతీల పాలన ఇంకా గాడిన పడలేదు. నిధులు లేక బిల్లులు పెండింగ్లో ఉండటంతో ప్రభత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్థిక సంఘం నిధులతో ముడి పెట్టకుండా సీఎం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడి ఉండాలి. – కృష్ణయ్య, బోరిగాం సర్పంచ్ జీపీలను చులకనగా చూడొద్దు పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దు. ఎవరూ అడగకుండానే సీఎం రేవంత్రెడ్డి తన కోటా నిధులు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలలైనా ఆ నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదలైతే పంచాయతీలకు ఊరట లభిస్తుంది. – మల్లేశ్, రువ్వి సర్పంచ్ -
చరిత్ర తీర్చేనా..
ఆహ్లాదం చింతనిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లవుతోంది. కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఒక్క టూరిజం స్పాట్ను అభివృద్ధి చేయలేదు. చూసేందుకు ఎన్నో ఆకట్టుకునే ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నా కనీస సదుపాయాలు, వసతులు లేకపోవడంతో జిల్లావాసులు, పర్యాటకులు అటువైపు వెళ్లడం లేదు. జిల్లా కేంద్రంలో ఒక్క పార్కు కూడా లేదు. శివారులో ఉన్న గండిరామన్న హరితవనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈనేపథ్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమకు మౌలిక వసతులతోపాటు కాసింత ఆహ్లాదాన్నీ అందించే పార్కులు ఏర్పాటు చేయాలని అభ్యర్థులను కోరారు. ఈమేరకు కొత్త మున్సిపల్ పాలకవర్గం జిల్లాకేంద్రంలో చారిత్రక ప్రదేశాల చెంతనే పార్కులు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కాంక్రీట్ జంగల్లో అవసరం.. పట్టణాలు రోజురోజుకూ విస్తరణతో కాంక్రీట్ అడవుల్లా తయారవుతున్నాయి. రోడ్లు, షాపింగ్ మా ల్స్, అపార్ట్మెంట్లు, పెద్దపెద్ద భవనాలు పెరుగుతు న్నా.. ప్రజలకు ప్రశాంతతనిచ్చే పచ్చని ప్రదేశాలు మాత్రం కరువవుతున్నాయి. కనీసం ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేకుండా పో తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్కులు నగర జీవనానికి ఊపిరిలా మారాయి. పచ్చదనం మధ్య గడి పే కాసింత సమయం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమవుతున్న పిల్లలకు పార్కులు ఆడుకునే స్వేచ్ఛను ఇస్తాయి. త్వరలోనే ఏర్పాటు చేసేలా.. జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ జనాభా పెరగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం కనుమరుగైంది. ప్రజల నుంచి పార్కుల ఏర్పాటు డిమాండ్ పెరుగుతోంది. ఈమేరకు చారిత్రక కట్టడాల వద్ద పార్కులు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలోనే పురావస్తుశాఖ అధికారులతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలుస్తాం. ‘చరిత్ర’ను కాపాడేలా.. పట్టణవాసుల నుంచి పెరుగుతున్న డిమాండ్ మేరకు నిర్మల్ పురపాలకవర్గం వినూత్న ప్రతిపాదన తీసుకువచ్చింది. నిర్మల్ చారిత్రక ప్రాంతం కావడంతో ఇప్పటికీ ఇక్కడ పదుల సంఖ్యలో బురుజులు, గఢ్లు, కట్టడాలు ఉన్నాయి. పార్కుల నిర్మాణం కోసం స్థలం లేనందున ఇలాంటి చారిత్రక ప్రాంతాల వద్దనే పచ్చదనం పెంచి, పార్కులను అభివృద్ధి చేయాలన్న యోచిస్తోంది. వీటివల్ల సదరు చారిత్రక ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతోపాటు ముందుతరాలకు నిర్మల్ చరిత్ర తెలుసుకోవడానికీ అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. హిస్టారికల్ పార్కుల కోసం నిజామాబాద్ రోడ్డులో గల శ్యాంగఢ్, కలెక్టరేట్ రోడ్డులో గల బత్తీస్గఢ్, పట్టణ పోలీస్స్టేషన్ ఎదుటగల ఖిల్లాగుట్ట తదితర ప్రాంతాలను త్వరలోనే పరిశీలిస్తామంటున్నారు. అలాగే జిల్లాకేంద్రంలో పురాతన వస్తుసంపద, చారిత్రక అంశాలతో ఓ మ్యూజియంనూ ఏర్పాటు చేయనున్నారు. -
భూమి కోసం.. గిరిజనుల లొల్లి
కడెం: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ సమీ ప మైసంపేట్ పునరావాస గిరిజనులకు కేటాయించిన వ్యవసాయ భూములవద్ద నచ్చన్ఎల్లాపూ ర్, గోండుగూడ గ్రామస్తుల మధ్య మంగళవా రం గొడవ జరిగింది. హోలీ సందర్భంగా భూ ముల వద్ద పూజలు చేయడానికి వెళ్లారు. అప్పటికే అక్కడ పూజలు చేసిన నచ్చన్ఎల్లాపూర్ వా సులను గోండుగూడ గ్రామస్తులు ఈ భూములు తమవని, మీరు ఎందుకు పూజలు చేశారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ఘటన స్థలా న్ని ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్ పరిశీ లించారు. బందోబస్తును పర్యవేక్షించారు. తమ కు భూములు కేటాయించకపోతే తిరిగి మైసంపేట్కు వెళ్తామని తెలిపారు. ఏళ్లుగా ఆ భూములు తాము సాగుచేసుకుంటున్నామని తమకే ఇవ్వాలని గొండుగూడ వాసులు డిమాండ్ చేశారు. -
బాసర ఆలయంలో భర్తీకాని ఖాళీలు
బాసర: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నప్పటికీ అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. బాసర దేవస్థానానికి రీజినల్ జాయింట్ కమిషనర్స్థాయి అధికారి ఈవోగా ఉండాలి. కానీ కొన్ని రోజులుగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నియమిస్తూ వస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు కలిగి ఉన్న అధికారిని నియమిస్తున్నారు. ఫలితంగా అసలే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇది మరింత శాపంగా మారింది. ఆలయ ప్రాముఖ్యత కశ్మీర్ శారదా పీఠం తర్వాత భారతదేశంలో రెండో ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం బాసర. గోదావరి తీరంలో చాళుక్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అక్షరా భ్యాస పూజలకు ప్రసిద్ధి చెందింది. భక్తుల రద్దీ పె రుగుతున్నా సౌకర్యాలు లోపిస్తున్నాయి. రెండు ఈ వో పోస్టులు ఖాళీగా ఉండటంతో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి అంజనాదేవి అదనపు బాధ్యతలతో ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కూడా సెలవుపై వెళ్లారు. ఇక ఏవో, సూపరింటెండెంట్, పర్యవేక్షకులు, సీనియర్–జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. పూజా సిబ్బంది కొరత అర్చక–పరిచారకులు 10 పోస్టులు ఖాళీగా ఉండటంతో నిత్య పూజలు, అక్షర శ్రీకారాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి. 15 మంది రెగ్యులర్ వైదిక సిబ్బంది మాత్రమే ఉండటంతో రోజంతా పనిఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పదవీ విరమణలు జరిగినా కొత్త నియామకాలు చేయడం లేదు. తాత్కాలిక ఏర్పాట్లు వాగ్దేవి సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. శానిటేషన్, టికెట్ పంపిణీ, పూజా సహాయం వంటి విధుల్లో రాజకీయ పక్షపాతాలు ఉన్నాభ అనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల సౌకర్యాలు, ఆలయ పర్యవేక్షణ బాగా లోపించాయి. ప్రభుత్వం దృష్టికి.. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ అభివృద్ధి పనులు, సిబ్బంది భర్తీలకు త్వరి త చర్యలు అవసరమని భక్తులు, స్థానికులు డిమాండ్ చేశారు. అయినా దేవాదాయ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. బాసర ఆలయం.. పోస్టులు ఖాళీల సంఖ్య ఈవో 2 పర్యవేక్షకులు 2 సీనియర్ అసిస్టెంట్లు 2 జూనియర్ అసిస్టెంట్లు 3 -
ఉక్కు పరిశ్రమ కేంద్రంగా తెలంగాణ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం ‘తెలంగాణలో ఇనుము(ఉక్కు) పరిశ్రమ.. లోహశాస్త్రంలో విస్మరించబడిన అధ్యాయం’ అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. డా. జైకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాచీన, మధ్యయుగాల్లో తెలంగాణ ప్రాంతం ఇనుము, ఉక్కు తయారీకి ప్రపంచ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించిన ఈ పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధ ‘డమాస్కస్’ ఖడ్గాల తయారీకి మూలమని చెప్పారు. 2,800 గ్రామాల్లో చేసిన సర్వేలో 2,600 గ్రామాలు ఇనుము కరిగించే కేంద్రాలుగా ఉన్నట్టు గుర్తించారన్నారు. వీటిలో 600 గ్రామాల్లో మట్టి మూసలతో అత్యున్నత నాణ్యమైన ఉక్కును తయారు చేసేవారని ఆధారాలతో వివరించారు. నిజామాబాద్ జిల్లా కోనసముద్రం గ్రామం మధ్యయుగంలో ‘వుట్జు’(ఉక్కు గడ్డలు) పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఇక్కడి ఉత్పత్తులు ఐరోపా, పశ్చిమ దేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపారు. తెలుగు పదాలు ‘కొలిమి’, ‘కమ్మరి’, ‘చిత్యం’ ఆనాటి లోహశాస్త్ర సమాజంతో గాఢ సంబంధాన్ని సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. 1857 స్వాతంత్య్ర పోరాటం తర్వాత బ్రిటిష్ కఠిన చట్టాలు, ఐరోపా పారిశ్రామిక విప్లవ ప్రభావంతో స్వదేశీ సాంకేతికత కనుమరుగైందని తెలిపారు. మెటలర్జీ విభాగాధిపతి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పురాతన సాంకేతికతను ఆధునిక ఇంజనీర్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ, పరిపాలన అధికారి ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు డాక్టర్ వి.అజయ్, డాక్టర్ ఆర్.అజయ్, డాక్టర్ భాస్కర్, జి.సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కరాటేలో గురుకుల విద్యార్థుల ప్రతిభ
సారంగపూర్: ఇటీవల వరంగల్, హనుమకొండలో నిర్వహించిన జాతీయస్థాయి ఫైటర్ షోటోఖాన్ కరాటే పోటీల్లో మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈపోటీల్లో పాఠశాలకు చెందిన చిన్మయి, బి.అంకిత, చందన బంగారు పతకాలు సాధించగా, బి.ప్రణతి, జి.అశ్విత వెండి పతకాలు, సీహెచ్.స్నేహిత, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించారు. అలాగే పీఎంశ్రీ ఆటల పోటీల్లో వందమీటర్ల పరుగు పందెంలో పాఠశాలకు చెందిన జగశ్రీ వెండి పతకం, లాంగ్ జంప్లో కాంస్య పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఆయా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ సంగీత, పీఈటీ సుష్మిత, పీడీ సుప్రియ తదితరులు అభినందించారు. -
నిర్మల్
వసూళ్లకు ఫుల్స్టాప్ నిర్మల్ పట్టణంలో చిరువ్యాపారులపై కొత్త మున్సిపల్ పాలకవర్గం భారం తగ్గించింది. ఫిబ్రవరి 27న జరిగిన తొలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. సమస్యలపై సమరం భైంసా : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ లొల్లి మొదలైంది. వారాలుగా విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతోంది. క్యాంపస్ నిధుల వాడకం, పరీక్ష విధానాల పై నిత్యం నిరసన తెలుపుతన్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యంపై ఆరోపణలు పెరుగుతున్నాయి. క్యాంపస్ బడ్జెట్ వివరాలను బహిర్గతం చేయాలని, శ్వేతపత్రం డిమాండ్ విద్యార్థులు చేస్తున్నారు. యాజమాన్యం ఆరోపణలను తిరస్కరించినా, ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్ ముందు వందల మంది సమావేశమై నిరసన వ్యక్తం చేశా రు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశమైంది. మనీశ్రెడ్డి ఘటనతో.. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ విషయంపై ప్రశ్నించిన విద్యార్థి నాయకుడు మనీశ్రెడ్డి ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనను తనిఖీ చేశారని, తనతో అధికారులు, సిబ్బంది బలవంతంగా లేఖలు రాయించారని రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని సంప్రదించాడు. ఇది క్యాంపస్ పరిపాలనపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో అధికారులు, విద్యార్థుల మధ్య వైరానికి కారణమైంది. ప్రశ్నిస్తే బెదిరింపులు? అధికారుల అక్రమాలు, ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్ని స్తే పరిపాలనా ఒత్తిడి పెరుగుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఫోన్లు తనిఖీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టీఏ ఎస్ఎస్ నేతృత్వంలో ఆదివారం రాత్రి గోదావరి బాలుర హాస్టల్ ఎదుట భారీ సమావేశం జరిగింది. వందల మంది విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు సమావేశం కొనసాగింది. ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడతా మని నినాదాలు చేశారు. మంత్రులు హామీలు ఇచ్చి... గతంలో బాసర క్యాంపస్కు వచ్చిన రాష్ట్ర మంత్రులు పలు హామీలు ఇచ్చారు. విద్యార్థులను కలిసి వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదని విద్యార్థులు అంటున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. మానవ హక్కుల సంఘాల దృష్టి... క్యాంపస్ పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఇక్కడి విద్యార్థులు వెళ్లి ఫిర్యాదులు చేశారు. క్యాంపస్ ఘటనలపై త్వరలోనే విచారణలు జరుగుతాయనే చర్చ ఉంది. భవిష్యత్తుపై భయంతో కొంతమంది విద్యార్థులు బహిరంగంగా ముందుకు వచ్చేందుకు సంకోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారం రోజుల పరిణామాలు బాసర ట్రిపుల్ ఐటీని మరోసారి వార్తల్లో నిలిపాయి. ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్ వద్ద సమావేశమైన విద్యార్థులు భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అసంతృప్తి ఉధృతమవుతోంది. క్యాంపస్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంలో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి విద్యార్థులు భారీగా సమావేశమయ్యారు. టీఎస్ఏఎస్ (తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ) ఆధ్వర్యంలో గోదావరి బాలుర హాస్టల్ ముందు నిర్వహించిన సమావేశం అర్థరాత్రి వరకూ కొనసాగింది. క్యాంపస్కు విడుదలవుతున్న నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇక్కడి సమస్యలపై కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లకు విద్యార్థులు ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి సదుపాయాల లోపాలు, భోజన నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత మూల్యాంకన విధానాలపై తీవ్ర అసంతృప్తి తెలిపారు. పరిపాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను విద్యార్థులు సభలో ప్రస్తావించారు. సమస్యలపై వినతులు స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. టీఎస్ఏఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘‘ఇది హెచ్చరిక మాత్రమే. అవసరమైతే దశలవారీగా ఆందోళనలను విస్తరిస్తాం’’ అని పేర్కొన్నారు. రాత్రి వేళ కూడా నినాదాలతో క్యాంపస్ మార్మోగింది. -
చట్టవిరుద్ధ నియామకం ఆపాలి..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కాలే జీ సోఫీనగరలో పీజీ టీగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి భర్తను కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్గా నియమించినట్లు తెలిసింది. ఈ నియామకం పారదర్శకతను పాటించకుండా జరిగిందని, ఈ విషయమై ప్రిన్సిపాల్ను అడిగితే రిక్రూట్మెంట్ ఏజెన్సీని అడగాలని తెలిపారు. ఉపాధ్యాయురాలి భర్త అని తెలిసి విధుల్లోకి తీసుకున్న ప్రిన్సిపాల్పై చర్య తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పనిషత్ నాయకుడు కొట్టూరి ప్రవీణ్కుమార్ కలెక్టర్ను కోరారు. -
‘ప్రజా’ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూసమస్యపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా చూడాలి.. ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య ఉండే ప్రాంతాలు గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనిఖీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు యూరియా యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా, ఇప్పటి వరకు రైతులు 1.60 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని, 1.40 లక్షల బస్తాలు తీసుకున్నారని వివరించారు. సీఎం కప్ పోటీలలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు రావడం గర్వకారణమన్నారు. ఇందుకుగాను, అధికారులకు, కోచ్ లకు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీవో నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ నిర్మల్ టౌన్: వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు కీలకమని, వాటి సంరక్షణ అందరి బాధ్యత అని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ అన్నారు. వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 33 యూనిట్ల శాంపిళ్లను వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను సామాజిక బాధ్యతగా గుర్తించి, తమ వంతుగా సామాజిక సేవ చేయాలని అటవీ సిబ్బందికి సూచించారు. అటవీ సంపదను కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి ఉంటేనే జీవం ఉంటుందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బొబడే, ఎఫ్డీవోలు నాగిని భాను, శివకుమార్, రామకృష్ణారావు, అటవీ క్షేత్ర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
గల్ఫ్లో క్షేమంగా జిల్లావాసులు
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వారంతా క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుటుంబీకులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం ఇస్తున్నారు. ఖానాపూర్ మండలానికి చెందిన రాజేశ్, తిరుమలేశ్, శ్రీకాంత్, తదదితరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నామని తెలిపారు. తాము పనిచేసే జుఫర్ బెహరన్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. -
బాల్య వివాహాల నివారణకు సహకరించాలి
నిర్మల్చైన్గేట్: బాల్య వివాహాల నివారణకు ప్రజలు బాధ్యతగా సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ‘‘బాల్య వివాహ రహిత భారత్’’ కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలోని అన్నిగ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని, 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. కార్యక్రమంలో విజన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ శరత్కుమార్, రాజు, బాలల పరిరక్షణ అధికారి మురళి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్ శక్తి సిబ్బంది, విజన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇబ్బంది పెట్టారు
పరీక్ష పత్రం రీ వ్యాల్యువేషన్ను చాలెంజ్ చేస్తే నన్ను వేధించారు. యూనివర్సిటీ సిబ్బంది నా ఫోన్ లాక్కున్నారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చి ఇంటి వరకు పంపించారు. బలవంతంగా వారికి నచ్చినట్లు నాతో లేఖలు రాయించుకున్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తాను. – మనీశ్రెడ్డి, విద్యార్థి అందరినీ వేధిస్తున్నారు బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్లో సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన అందరినీ అధికారులు వేధిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశాం. వర్సిటీ అధికారులు సమస్యలు చెబితే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. – ఆకాశ్యాదవ్, విద్యార్థి సంఘం నాయకుడు -
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య డిమాండ్ చేశా రు. ఆదివారం పట్టణంలోని తాపీమేసీ్త్రల సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు కడకుంట్ల నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్ర భుత్వం కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు. మ్యారేజ్, మెటర్నరీ పథకాలకు రూ.లక్ష వరకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన కార్మికుడికి రూ.6వేల పెన్ష న్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డును కాపాడాలని డి మాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు సు నారికారి రాజేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, మండల కార్యదర్శి చిలుకూరి ఇస్తారి, నాయకులు సురపాక రాజన్న, బోదాసు చిన్న నర్సయ్య, పోశెట్టి కోమటిపల్లి, భీమయ్య, దుర్గం లింగన్న, ఆడేపు గణేశ్, ఎల్ఆర్ ఉపాలి తదితరులున్నారు. -
● జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్టని సర్కారు ● పనుల నిర్వహణలో ఇబ్బందులు
నిర్మల్చైన్గేట్: వలసలను నివారించేందుకు గ్రామీ ణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉపాధిహా మీ పథకం నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. జి ల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాధారణంగా ఉపాధిహామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనుల ప ర్యవేక్షణ, డేటా సేకరణలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపులు, పనుల పర్యవేక్షణ, జాబ్కార్డుల మంజూరు, ఆధార్ కార్డుల అనుసంధానం, వనమహోత్సవం, డేటా సేకరణ తది తర పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తుంటారు. ప్రతీ వేసవిలో ఉపాధి పనులకు కూలీలు అధికసంఖ్యలో హాజరవుతుంటారు. వివిధ కారణాలతో జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతోపాటు పలు పాత పంచాయతీల్లోనూ సరిపడా సిబ్బంది లేక పథకం అమలులో తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2018 నుంచి విడతల వారీగా జిల్లాలో 400 గ్రామ పంచాయతీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలున్నాయి. 400 మంది క్షేత్ర సహాయకులకు ప్రస్తుతం జిల్లాలో 205 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 195 మంది క్షేత్రసహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టనందున పక్కవారికి ఇన్చార్జి బాధ్యతలు ఇస్తున్నారు. లేదా.. అనుభవమున్న సీనియర్ కూలీని మేట్గా గుర్తించి పనులు చేయిస్తున్నారు. కార్యదర్శులకు బాధ్యతలు కొత్త గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించని కారణంగా పంచాయతీ కార్యదర్శులే ఉపాధిహామీ పనులు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. కార్యదర్శులకు గ్రామపంచాయతీ పనులు ఉండటంతో ఉపాధి పనులపై సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. పనుల్లో ఏ పొరపాటు జరిగినా పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి. కార్యదర్శులకు పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో ఉపాధి పనుల అమలులో పురోగతి లేకుండా పోతోంది. కొత్తపనులు కేటాయించడం, గ్రామసభలు, నర్సరీల నిర్వహణ, కూలీల వేతనాలు మంజూరు తదితర విషయాల్లో పర్యవేక్షణ లేక ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో పథకం అమలులో ఇబ్బందులెదురవుతున్నాయి.జిల్లా సమాచారం మండలాల సంఖ్య 18 గ్రామపంచాయతీలు 400 ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్లు 205 ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలు 195 జాబ్కార్డులు 1.28లక్షలు ఉపాధి కూలీలు 2.19లక్షలు 100రోజుల పని పూర్తి చేసినవారు 574 -
ఉడుంపూర్లో పర్యటించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హు స్సేన్నాయక్ ఆదివారం పర్యటించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్యాదవ్ హుస్సేన్ నాయక్కు గొంగడి కప్పి, గొర్రెపిల్లను అందించి స్వాగతం పలికారు. లక్ష్మీపూర్ ఎత్తి పోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు పొడిగించాలని, మిద్దెచింత గ్రామానికి విద్యుత్, గండిగోపాల్పూర్కు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం క ల్పించాలని కోరారు. ఐటీడీఏ డీడీ అంబాజీ, శం కరయ్య, శేఖర్, పరంధాములు, శారద, బ క్కయ్య, విజేశ్, విజయ్, శ్రీను ఉన్నారు. -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–96 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం మండల కేంద్రంలోని బృందావన్ రిసార్ట్స్లో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉత్సాహంగా గడిపారు. అప్పటి గురువులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఖానాపూర్: పట్టణంలోని బాలికల జెడ్పీహెచ్ఎస్లో 2001–2002 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివినవారంతా స్థానిక జీవీఆర్ ఫంక్షన్హాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకున్నారు. ఒకరికొకరు పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సందడి చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. -
‘అడెల్లి’కి భక్తుల తాకిడి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆది వారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నైవేద్యాలు, ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగా, అమ్మవారిని మాజీ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ భోజాగౌడ్ ఘనస్వాగతం పలికి దర్శనానంతరం సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు ఆలయం మూసివేత అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఈనెల 3న ఉద యం 7నుంచి 4వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భూమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6గంటలకు అభిషేకం, అలంకరణ, హారతి నివేదన అనంతరం 7గంటల నుంచి ఆలయం మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదీన ఉదయం 6గంటలకు ఆలయంలో గణపతి, గౌరీపూజ, పుణ్యాహావాచనం, అమ్మవారి ఆలయ ప్రాంగణం సంప్రోక్షణ, పంచామృతాభిషేకం, అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. -
యూరియా కష్టాలు తీరేదెలా?
భైంసా: జిల్లా రైతులు యూరియా కోసం నానా పా ట్లు పడుతున్నారు. యూరియాను యాప్లో బుక్ చేసుకోవాల్సి ఉండగా రైతులకు సరిపడా అందని పరిస్థితి ఉంది. సారంగపూర్ మండల కేంద్రంలోని ఒక దుకాణానికి ఇటీవల 450 యూరియా బస్తాలు రాగా, 50 సెకన్లలోనే యాప్లో నో స్టాక్ సూచిస్తున్నట్లు రైతులు వాపోయారు. అప్పటివరకు దుకా ణం వద్దే ఉన్న రైతులు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఖానాపూర్లోని గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపులో యూరియా బుక్ చేసిన రైతులు రెండ్రోజులు నిరీక్షించినా ఇవ్వనట్లు తెలిసింది. మామ డ మండలంలోని పలువురు రైతులు ఈ కేంద్రానికి వచ్చి యూరియా దొరకక వెనుదిరిగి వెళ్లారు. ఐదు నిమిషాల్లో స్టాక్ ఖాళీ జిల్లాలోని మరికొన్ని మండలాల్లోనూ యాప్లో స్టాక్ అందుబాటులో ఉందని చూపించిన కొద్దిసేపట్లోనే ‘స్టాక్ లేదు’ అని మెసేజ్ వస్తోందని రైతులు వాపోతున్నారు. నిజంగా ఎంత స్టాక్ వచ్చింది, ఎవరు బుక్ చేసుకున్నారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. యూరియా స్టాక్ ఎప్పుడు వచ్చిందో.. ఎంత వచ్చిందో ముందుగా సమాచా రం ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. దీంతో డీలర్ వద్దకు చేరుకునేసరికే స్టాక్ అయిపోతున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇక, స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియని వృద్ధ రైతులు యాప్లో బుక్ చేసుకోవ డం తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు యూరియా స్టాక్ రాగానే ముందుగా తెలిసిన వ్యక్తు లే యాప్లో బుక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. యూరియాతో పాటు ఇతర మందులు కొనుగోలు చేసేవారికే దుకాణాదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పారదర్శక విధానం అమలు చేయాలని కోరుతున్నారు. వ్యవసాయాధికారులు స్పందించి యాప్ లోపాలపై సాంకేతిక సమీక్ష చేయాలని, స్టాక్ వివరాలను రియల్ టైమ్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ముందస్తు సమాచారం అందించే విధా నం అమలు చేయాలని, కౌలు రైతులకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావర ణం పొడిగా ఉంటుంది. చలి తగ్గుతుంది. శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలిభైంసారూరల్: యువత ఛత్రపతి శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్ సూచించారు. ఆదివారం మండలంలోని పాంగ్రి గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీ చేసిన పో రాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, దౌర్జన్యాలకు ఎదురు నిలిచి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహోన్నత నాయకుడు అని కొనియాడారు. పాంగ్రి గ్రామంలో రాజ కోట నమూనాతో విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. సర్పంచ్ ఆకాశ్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అనుక్షణం.. భయం భయం!
నిర్మల్వినూత్నం గిరిజన హోలీ ఆదివాసీ గిరిజనులు ‘దురాడి’ పేరుతో హోలీ ని విభిన్నంగా జరుపుకొంటారు. సంప్రదా యాలకు అనుగుణంగా పండుగ చేసుకోవ డం వీరికి ఆనవాయితీగా వస్తోంది. ‘ఉపాధి’పై పర్యవేక్షణ ఏది?మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు భైంసాటౌన్: తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్పై ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా 12 మంది బాలురు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో పట్టణ పోలీస్స్టేషన్కు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఎస్సైలు ఉన్నారు.నిర్మల్ఖిల్లా: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన వలస కార్మికులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇ క్కడి వారి కుటుంబాల్లోనూ ఏం జరుగుతుందోన న్న ఆందోళన నెలకొంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ఆయా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయని అక్కడి వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని చె బుతూనే తమలో భయాందోళన నెలకొందని వెల్ల డిస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలతో అక్కడి ప్రజల్లో భీతి నెలకొంది. ఈ ప్ర భావంతో ఆయా దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్రమత్తం చేసిన రాయబార కార్యాలయాలు యూఏఈ, సౌదీఅరేబియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికే భారతీయులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అవసరమైతే సమీప రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవా లని విజ్ఞప్తి చేస్తున్నాయి. జిల్లాలోని వలస కార్మికుల కుటుంబ సభ్యులు తమ బంధువుల క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు సద్దుమణగాలని, తమ వారు సురక్షితంగా స్వదేశానికి చేరాలని కోరుకుంటున్నారు. బాంబుల మోతతో భయభ్రాంతులు ఇరాన్తో పాటు ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీఅరేబియా తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చే స్తుండగా మరోవైపు అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయిల్ దేశం ఇరాన్పై పరస్పరదాడులకు దిగుతుండడంతో ఆయా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మా రుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళ్లి ఆయా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితిపై వా రి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై తే ఆయా దేశాలు భద్రత చర్యలు చేపడు తుండగా సురక్షితంగానే ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఎక్కడి నుంచి క్షిపణి దాడులు ముంచుకొస్తున్నాయో.. తెలియకపోవడంతో బాంబులు పడిన శబ్దాలతో తాము భయభ్రాంతులకు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు. విధులు లేక గదికే పరిమితం గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: మండలకేంద్రంలోని గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఆలయంలో పూజలు చే శారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ‘ఆడ ఎట్లున్నది బిడ్డా.. అంతా మంచిదేనా.. బాంబులు వడుతున్నయని టీవీలల్ల చెప్తున్నరు.. ఉన్నొక్కడివి బతుకుదెరువు కోసం పెండ్లంపిల్లగాళ్లను ఇడిసి దేశం పోతివి.. ఈ వార్తలు సూసి భయమనిపియ్యవట్టే బిడ్డా..’ ఇది ముధోల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన ఓ తల్లి కువైట్లో ఉంటున్న తన కొడుకుకు ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీసిన తీరు. ‘ఏమండి బావున్నారా.. పిల్లలు గుర్తుచేస్తున్నరు.. టీవీల్లో, ఫోన్లలో చూసి మన పిల్లలు అడుగుతున్నరు.. దేశాల మధ్య బాంబు దాడులు జరుగుతున్నయట నిజమేనా..? ఎట్లున్నది పరిస్థితి..? అంత మంచిదేనా..? ఇది నిర్మల్ జిల్లాకు చెందిన ఓ గృహిణి కువైట్ దేశంలో ఉన్న తన భర్తకు ఫోన్ జేసి వాకబు చేసిన తీరు.బహ్రెయిన్ దేశంలోని అస్కర్ ప్రాంతంలో ఉంటున్న కడెం మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఎం.రాజేందర్ ఇప్పటికై తే సురక్షితంగానే ఉన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విధులు లేక రూమ్లోనే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాలు ప్రమాద హెచ్చరిక జారీ చేశాయని, అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని నిబంధనలు కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. తనతోపాటు అదే మండ ల ంలోని సారంగపూర్ గ్రామానికి చెందిన మిగతా ముగ్గురు మిత్రులు కూడా నివాస గదికే పరిమితమైనట్లు ఆయన తెలిపారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. విధులతోపాటు ఆరోగ్యం ముఖ్యంనిర్మల్టౌన్: పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణ ఎంత ముఖ్యమో.. ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వా ర్టర్స్లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ శనివారం నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్తో సిబ్బందికి ఫిజి కల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. స మయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని సూ చించారు. ఫిట్నెస్ను నిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించాలని, జిల్లాకు తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పరేడ్లో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు నైలు, కృష్ణ, సమ్మయ్య, రామ్ నిరంజన్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
30 నిమిషాల్లో ఎఫ్ఐఆర్
● బాధితుడి ఇంటికి వెళ్లిన పోలీసులు భైంసారూరల్: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ప్రజలకు అతి సులభమైన మార్గంలో భరోసా కల్పిస్తూ, స్టేషన్కురాలేని బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. 30 నిమిషాల్లోనే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రజల వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. భైంసారూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్జూర్ గ్రామానికి చెందిన కళ్యాణ్ బయ్యాజి(70) వృద్ధాప్యం కారణంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై సుప్రియ తన సిబ్బందితో కలిసి బిజ్జూర్ గ్రామానికి చేరుకున్నారు. బాధితుడి ఇంటి వద్దనే ఫిర్యాదు స్వీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉంచిన ఆవును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు కళ్యాణ్ బయ్యాజి తెలిపారు. శనివారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 30 నిమిషాల్లో ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్కు రాలేని బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు 30 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని భరోసా కల్పించారు. -
వేతన వెతలు..
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక సతమతం అవుతున్నారు. అదనపు పనిభారం, చాలీచాలని వేతనం సకాలంలో అందక, ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు డీపీవో శ్రీనివాస్ను శనివారం కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 37 మంది ఆపరేటర్లు.. ఈ–సేవలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీస్థాయిలో ఈ–పాలన విధానం కింద కంప్యూటీకరణను చేపట్టింది. ఇంటర్నెట్ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామ పంచాయతీ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్దేశంతో ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 37 ఆపరేటర్లను నియమించింది. కార్వీ సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమకాలు చేపట్టింది. సంస్థ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, నియామకం గడువు ముగియడంతో 2016లో మళ్లీ విధుల్లోకి తీసుకుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్లైన్ చేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్స్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతోపాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాల్లేవ్.. ఆపరేటర్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడంలేదు. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో వేతనం చెల్లించేవారు. ఒక్కో ఆపరేటర్ కు రూ.22,750 వేతనం వచ్చేది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపివేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా ఇవ్వడమే లేదు. ఆపరేటర్ల డిమాండ్లివే.. ఉద్యోగ భద్రత కల్పించాలి. జానియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి. వేతనాల కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయించాలి. ఆర్థికంగా ఇబ్బందులు.. ప్రతి నెలా వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. గుర్తింపుతోపాటు భద్రత కరువైంది. వేతనాలు సక్రమంగా అందించాలి. పెండింగ్ వేతనాలు అందించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం. – సునీల్, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఈజీగా గణిత బోధన
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్(పీఎంశ్రీ) గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం విద్యార్థుల్లో డిజిటల్ విద్యపై ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అ మలు చేసి విద్యార్థులకు అభ్యాసక్రమాల్లో మార్పులు తీసుకువచ్చారు. శిక్షణ సెషన్లకు హాజరై, పైథాన్ ప్రోగ్రామింగ్ను పాఠశాల విభాగంలో ప్రవేశపెట్టి సాంకేతిక నైపుణ్యాలను పెంచారు. పాఠశాల విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి 2025 జిల్లా సైన్స్ ఫెయిర్లో పైథాన్ ఆధారిత ప్రాజెక్టులతో వి జయం సాధించేలా మార్గదర్శకత్వం వహించారు. 35 మంది విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు.. కరీం ప్రత్యేక కృషితో పాఠశాలలో 35 మంది విద్యార్థులు మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఫౌండేషన్ కోర్సుల్లో చేరి 8 వారాల్లో పూర్తి చేశారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంత మంది సర్టిఫికెట్లు పొందడం విశేషం. కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాల సందర్శించి విద్యార్థులను, వర్చువల్ ల్యాబ్ సౌకర్యాలను అభినందించారు. వినూత్న బోధనా పద్ధతులు గణిత బోధనలో జియోజిబ్రా, రోబోకాంపాస్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తున్నారు. 2025 మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2026 ఫిబ్రవరి 19న ఎస్సీఈఆర్టీ రాష్ట్రస్థాయి గణిత సెమినార్లో ’గణితంలో పైథాన్ వాడకం’ అంశంపై ప్రదర్శనకు ప్రశంసలు అందుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.. మారుతున్న కాలనీకి అనుగుణంగా (ఎన్ఈపీ–2020) కి అనుగుణంగా విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్ బోధనలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విద్యాశాఖ ఆదేశాలతోపాటు డీఈవో, హెచ్ఎం, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నూతన బోధనల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. భవిష్యత్తుల్లో పాఠశాల విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేందుకు కృషిచేస్తా. – సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం, గణిత ఉపాధ్యాయుడు -
సృజనాత్మక బోధన..
భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ ప్రభుత్వ పాఠశాలలో 18 ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మాదిరి ఎల్లన్న. పదేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరంవిద్యార్థుల అవగాహనపై దృష్టి పెడుతున్నారు. తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శిగా నిలుస్తూ పాఠాలను సరళంగా అందించే పద్ధతుల్లో నిపుణుడు. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసలు.. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోదావరి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో నిర్మల్ జిల్లా ప్రతినిధిగా పాల్గొని ప్రదర్శన ఆకట్టుకున్నది. రాజస్థాన్ ఉదయ్పూర్లో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ రుషి కుమార్ వశిష్ట చేత ప్రశస్క పొందారు. గత సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల విజయాలు ఎల్లన్న పనిచేసిన పాఠశాలల్లో గ్రామస్తుల సహకా రంతో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచా రు. ఆయన విద్యార్థులు గురుకుల సీట్లుసాధించి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. వినూత్న విధానాలతో గ్రామీణ విద్యారంగంలో మార్పు తీసుకురావడం ఎల్లన్న ప్రత్యేకత. ఆనందంగా ఉంది ప్రాథమికస్థాయి విద్యార్థుల కోసం పప్పెట్రీ విధానంలో పిల్లలకు బోధించడం ఆనందంగా ఉంది. పదేళ్లుగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పాఠశాలకు వెళ్తున్నాను. అక్కడి పాఠశాలకు సమీపంలో ఉండే విద్యార్థులను బడికి రప్పించేందుకు కృషిచేస్తాను. ఇప్పటికే నాకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాలల్లో సులభమైన పద్ధతిలో విద్యా బోధన చేసేందుకు జిల్లాలో సీఆర్టీగా ఎంపిక చేశారు. – మాదిరి ఎల్లన్న, ఉపాధ్యాయుడు తోలుబొమ్మలాటతో.. పప్పెట్రీ, స్టిక్ పప్పెట్, గ్లోవ్స్ పప్పెట్, స్ట్రింగ్ ప ప్పెట్ వంటి వాటితో పాఠ్యాంశాలను ఆకర్షణీయ ంగా చెబుతున్నారు. కౌమార దశలో ఉన్న పిల్లల కు భాషా నైపుణ్యాలు, సంభాషణా సామర్థ్యం, సృజనశీలతను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనల ద్వా రా లింగ సమానత్వం, సమాన అవకాశాల అవగా హనను సందేశాత్మకంగా బోధిస్తూ సమాజంలో వివక్షతను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. -
శెనగ కొనుగోళ్లు ఎప్పుడో?
భైంసా: జిల్లాలో శెనగ పంట కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయారు. గత వర్షాకాలంలో సోయా కోతల సమయంలో భారీ వర్షాలు పంటను నాశనం చేశాయి. ఆ సమయంలో పరిహారం రాలేదు. ప్రభుత్వం రంగు మారిన సోయాను కొనుగోలు చేస్తామని ప్రకటించినా, జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు జరగలేదు. గోదాముల నుంచి లారీలు త్వరగా తెప్పిస్తామని రైతులను మోసం చేశారు. 38 వేల ఎకరాల్లో సాగు.. సోయా నష్టాల నుంచి తేరుకుని యాసంగిలో జిల్లాలో 38 వేల ఎకరాల్లో శెనగ పంట సాగు చేశారు. కోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసన అకాల వర్షాలకు చేతికి వచ్చిన శెనగలు తడిశాయి. దీంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నా.. కొనుగోళ్లు లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకే.. వారం రోజులుగా భైంసా డివిజన్లో శెనగ కోతలు ఊపందుకున్నాయి. రైతులు భైంసా, ముధోల్, తా నూరు, కుభీర్ మార్కెట్లలో ప్రైవేటు వ్యాపారులకు పంట అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ.4,800 నుంచి 5,300 వరకు ధర పలుకుతోంది. తేమ పేరి ట కోతలు, నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కేంద్రాలు ఏర్పడితే ధరలు పెరిగే అవకాశం. కొనుగోళ్లు ప్రారంభించాలని ఎ మ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్కు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పష్టత లేదు. పెరిగిన ఖర్చులు... అకాల వర్షాలతో శెనగ రైతులకు పంట ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరం పంట కోతకు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక పంట నూర్పిడి చేసేందుకు 50 కేజీల బస్తాకు రూ. 140 నుంచి రూ.160 వరకు చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లో పంట పొలం నుంచి ఇంటికి సంచులు తెచ్చేందుకు ట్రిప్పుకు రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఖర్చులతో చేతిలో చిల్లి గవ్వ లేని రైతులు చేసేదేమి లేక ఇంటికి చేరిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. -
వైద్యుల నిరసన
నిర్మల్ఖిల్లా: ఇటీవల హైదరాబాద్లో పిల్లల డాక్టర్ అభిషేక్పై జరిగిన భౌతిక దాడి చేశారు. దీనిని నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ వైద్యులు శనివారం డాక్టర్ లేన్లో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించారు. బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకో వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యవృత్తిపై ఉన్న గౌరవాన్ని కాపాడాలని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని కో రారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్ట ర్ మురళీధర్, డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ రమేశ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ పోలిశెట్టి సంతోష్, డాక్టర్ రమణగౌడ్, డాక్టర్ సుచిన్ పాల్గొన్నారు. -
హామీల అమలుకే తొలి ప్రాధాన్యం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అజెండగా ముందుకు వెళ్తామని నిర్మల్ మున్సిపల్ చైర్ర్సన్ అప్పాల కావ్య , వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లతో సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతీ వార్డులో ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు. నిర్మల్ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న కోతులు, కుక్కల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండుగ దృష్ట్యా ప్రార్థనామందిరాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే పేద వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని తై బజార్ వసూలును రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలందరికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లీకేజీలు అరికట్టేలా శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. గతంలో పట్టణ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులతో గుర్తించిన పనులు కౌన్సిల్ సభ్యుల తీర్మానంతో రద్దు చేసి, వాటి స్థానంలో స్థానిక వార్డు సభ్యులు గుర్తించిన అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. డీఈ హరిభువన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొనారు. ఇంటర్ పరీక్షకు 244 మంది గైర్హాజరు నిర్మల్ రూరల్: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 6,876 మంది విద్యార్థులకు, 6,627 మంది (96.37%) హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల, ఖానాపూర్ జూనియర్ కళాశాల, ఖానాపూర్ ఆశ్రమ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈవో జాదవ్ పరుశురాం తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.సమావేశానికి హాజరైన సభ్యులు -
ఆర్జీయూకేటీ సరికొత్త రికార్డు
బాసర: బాసర రాజీవ్గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయస్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న నైట్ స్టడీ అవర్స్ ప్రోగ్రాం ఏకంగా మూడు రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించింది. పీయూసీ1, పీయూసీ2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో స్టడీ అవర్స్లో పాల్గొనడం ఈ రికార్డుకు దారితీసింది. ఈ అద్భుతమైన ఫీట్ను గుర్తిస్తూ.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు ధ్రువీకరణ పత్రాలు అందజేశాయి. కార్యక్రమం ఇలా.. ప్రతీరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అకాడమిక్ బ్లాక్–1లోని 46 క్లాస్ రూమ్లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చదువుకోవడంతోపాటు సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ సమయాన్ని కేటాయించారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది. అధికారుల హర్షం.. ఈ విజయానికి కృషి చేసిన స్టడీ అవర్స్ ఇన్చార్జి డాక్టర్ గుజ్జరి శంకర్ను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. శంకర్ పర్యవేక్షణలో విద్యార్థులు తరగతులకు హాజరవుతూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ అకడమిక్ పరంగా రాణిస్తున్నారన్నారు. డాక్టర్ శంకర్ నాయకత్వంలో అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో ఈ రికార్డు సాధ్యమైందని వారు కొనియాడారు. కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డీన్ అకాడమిక్స్ శీలం శేఖర్, డీన్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డాక్టర్ విఠల్, డాక్టర్ జి.నాగరాజు వివిధ విభాగాల అధిపతులు, బోధన బోధనేతర సిబ్బందికి శంకర్ ధన్యవాదాలు తెలిపారు. -
పరీక్షల సీజన్.. నేత్రాలు పదిలం!
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా, మరో రెండు వారాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రోజంతా పుస్తకాలు చదవడం, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండడంవల్ల నయనాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో కంటి సంరక్షణను విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి నొప్పి, డ్రైనెస్ భావన, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ యు.కృష్ణంరాజు విద్యార్థులకు పలు కీలక సలహాలు ఇచ్చారు. పాటించాల్సిన జాగ్రత్తలు.. -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం
నిర్మల్చైన్గేట్: ప్రకతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ రైతువేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపిక చేసిన ఐకేపీ మహిళలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనాలతో కూడిన సాగు కంటే, శాశ్వత ప్రాతిపదికన సేంద్రియ పద్ధతులు పాటించడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. ఆర్గానిక్ పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయని తెలపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని వస్తృతం చేసేందుకు 15 క్లస్టర్లను ఎంపిక చేశామని, ప్రతీ క్లస్టర్ నుంచి ఇద్దరు ఐకేపీ మహిళలను ‘కృషి సఖి’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు గ్రామాల్లోని రైతులకు సేంద్రియ సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతులు ప్రకతి వ్యవసాయం వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించాలని జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక షాపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శిక్షణను పూర్తి చేసుకున్న ‘కృషి సఖి’ మహిళలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చై ర్మన్ సోమ భీమ్రెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు ప ద్మ, నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, అధికారులు, సిబ్బంది, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు. పంటనష్టం నివేదిక రూపొందించాలినిర్మల్చైన్గేట్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాసీ్త్రయంగా అంచనా వేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారని తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, ప్రతీ పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్లు దోపిడీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, రిమ్స్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు సగుడారపు కనిష్క్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈనెల 15న రైల్వే స్టేషన్లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నలుగురు వ్యక్తులు అడ్డగించి కనిష్క్ వద్ద డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. డబ్బులు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కున్నారన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారని తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన సయ్యద్ నవీద్, వడ్డెరకాలనీకి చెందిన మీర్జా ముషారప్ బేగ్, షేక్ బిలాల్, ఖానాపూర్కు చెందిన షేక్ అర్షద్, నెహ్రునగర్కు చెందిన బాన్సోడే కిషన్, భుక్తాపూర్కు చెందిన మైనర్ బాలుడు ఉన్నట్లుగా తెలిపారు. గతంలో వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. వీరు బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ పరిసర ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. -
చోరీ కేసు నిందితుల రిమాండ్
ఖానాపూర్: గత కొన్ని నెలలుగా ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలి పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిర్మల్ డివిజన్లోని ఖానా పూర్, లక్ష్మణ్చాంద, నిర్మల్ టౌన్, మామడ తదితర మండలాల్లోని ఆలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను పట్టుకున్నట్లు తెలిపారు. ఖానాపూర్ మండలం సేవ్యానాయక్ తండాలోని జగదాంబ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలు గురు వ్యక్తులను శుక్రవారం సత్తనపెల్లి గ్రామశివారులో, గురువారం మరో ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో పట్టుబడిన నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడే వారన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన గాదె రమేశ్, దొసండ్ల శ్రీనివాస్, గురిజాల నడ్చి నర్సయ్య, బూట శంకర్, చీమల శ్రీకాంత్, బుర్క లక్ష్మణ్ అనే ఆరుగురు వ్యక్తులు కలిసి ఖానాపూర్ మండలంలోని తర్లపాద్ గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయం, అగ్గిమల్లన్న ఆలయం, మస్కాపూర్లోని శివాలయం, మధురనగర్లోని ఉగ్రనరసింహ స్వామి ఆలయం, ఖానాపూర్లోని సాయిబాబా ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో దేవునిపై ఉండే ఆభరణాలతో పాటు హుండీలో నగదును చోరీ చేశారన్నారు. ఖానాపూర్ సీఐ అజయ్, నిర్మల్ పట్టణ సీఐ నైలు, ఖానాపూర్ ఎస్సై రాహూల్ గైక్వాడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని నిబంధనల పేరుతో అడ్డుకోకుండా మానవత దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్, ఆదిలాబాద్ ఏఎస్పీ మౌనిక, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో గిరిజనులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను కోర్ ఏరియా పేరిట అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. తాగునీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలతో పాటు పీఎం జన్మన్ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, అధికారులు, నాయకులు ఉన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే అభివృద్ధికి దూరం’ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాల న సాగించిన బీఆర్ఎస్, ప్రస్తుతం పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం హర్కపూర్అంద్గూడ, మచ్చపూర్ గ్రామాల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మచ్చపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు శాలువాలతో ఆయనను సన్మానించి నాగోబా ప్రతి మ అందించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, డీటీడీఓ అంబాజీ, నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్లు మెస్రం తుకారం, రాథోడ్ రోహిదాస్, మార్కడ్ అనసూయ ఉన్నారు. -
యంగ్ సైంటిస్ట్లకు ఇస్రో ఆహ్వానం
లక్ష్మణచాంద: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడ మే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞా న్ కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ నిర్వహిస్తోంది. 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎంపిక ఇలా...నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 10,556 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరు తమ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికై న విద్యార్థులకు...ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎప్పటికై నా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు.సమాచారం..దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27 చివరి తేదీ: మార్చి 31 అర్హులు: 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెబ్సైట్: www.isro.gov.in ఇస్రో వద్ద రిపోర్టు చేయవలసిన చివరితేదీ: మే 10 యువికా కార్యక్రమం: మే 11 నుంచి 22 మధ్య -
వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి
ఆదిలాబాద్టౌన్: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్ ప ట్టణంలోని బస్టాండ్ ఎదుట గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన ఓ గర్భిణీ వారం క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కాగా ఈనెల 23న మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉ న్నట్లు వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శిశువు పాలు తాగకపోవడంతో వైద్యులకు విష యం తెలిపారు. మధ్యాహ్నం పిడియాట్రీక్ వైద్యు డు వైద్యం కోసం మరో ఆసుపత్రికి ఆటోలో తమకు తెలియకుండానే శిశువును తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాము కూడా వెంట వెళ్లగా కాసేపటికే బిడ్డ మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు చెప్పాడన్నారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. -
నాణ్యమైన భోజనం పెట్టాలి
కడెం: గిరిజన ఆశ్రమ విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వంట గది, సరుకుల కు పరిశీలించారు. వసతిగృహం ఆవరణలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ను కూల్చివేయాలని, డార్మెటరీ రూమ్స్లో టైల్స్, కిటికీలకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలన్నారు. అనంతరం మండలంలోని పాండ్వపూర్ సర్పంచ్ ఆడ విజయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసి తండా, గూడేల్లో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఇందులో డీడీ అంబాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్యాదవ్, వార్డెన్ రాంజీ, హెచ్ఎం వసంతరావు, ఎస్సై సాయికిరణ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, బంజార సంఘ నాయకులు మోహన్నాయక్, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
గల్ఫ్ మృతుల కుటుంబాల దీనస్థితిపై అధ్యయనం
లక్ష్మణచాంద: గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మరణిస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను జాతీయస్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో పర్యటించారు. గత ఐదు నెలల క్రితం దుబాయ్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన బీమా రమేశ్ కుటుంబాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ భార్య, తల్లిదండ్రులతో మాట్లాడారు. రమేశ్ మరణానికి గల కారణాలు, మృతదేహం స్వదేశానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. వంటి వివరాలను ఆమె ఆరా తీశారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు మరణించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, నిర్మల్ మార్కెట్ వైస్చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఒస రాజేశ్వర్, జిల్లా కిసాన్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్ల పోతారెడ్డి, బిక్నూర్ రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీ కేజీ తరగతులు) ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 10, ఆదిలాబాద్ జిల్లాలో 6, కుమురంభీం జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 26 ఉన్నాయి. వసతుల కల్పన..పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఆయాను నియమించారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద నడుస్తున్న వాటిలో నవంబర్ నుంచి ఇన్స్ట్రక్టర్, ఆయాలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8000, ఆయాలకు నెలకు రూ.6000 వేతనం చెల్లించనున్నారు. వీరికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 6 నెలలకు వేతనాలు విడుదలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఉమ్మడి జిల్లా సమాచారం..జిల్లా పూర్వ ప్రాథమిక కేటాయించిన పాఠశాలలు నిధులు నిర్మల్ 10 రూ.8.40 లక్షలు ఆదిలాబాద్ 6 రూ.5.88 లక్షలు కుమురంభీం 13 రూ.12.74 లక్షలు మంచిర్యాల 26 రూ. 25.48 లక్షలు మొత్తం 55 రూ.52.50 లక్షలు -
ఎన్ఎంఎంఎస్లో మెరిశారు
లక్ష్మణచాంద: ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదువులో ఉముందున్న పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తప్పించేందుకు ఏటా జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. జిల్లా నుంచి 70 మంది అర్హత.. గత నవంబర్లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 70 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం రూ.12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందనుంది. మస్కాపూర్ పాఠశాల నుంచి 30 మంది... ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధికంగా 30 విద్యార్థులు అర్హత సాధించారు. తర్వాత మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 5 మంది అర్హత సాధించి రెండోస్థానంలో నిలిచారు. కొరిటికల్ ప్రభుత్వ పాఠశాల నుంచి 4 విద్యార్థులు, నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతం కన్నా పెరిగిన సంఖ్య.... ఎన్ఎంఎంఎస్ పరీక్షలో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గతేడాది 68 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఈసారి 70 మంది ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం... ఉన్నత పాఠశాల అర్హతసాధించిన విద్యార్థులు మస్కాపూర్ 30 పొన్కల్(మామడ) 05 కొరిటికల్(మామడ) 04 నర్సాపూర్(జి) 04 మామడ 03 కడెం 03 బీరవెల్లి(సారంగాపూర్) 03 రాజూరా(ఖానాపూర్) 02 లక్ష్మణచాంద 02 మంజులాపూర్(నిర్మల్ అర్బన్) 02 సోమవార్పేట్(నిర్మల్ అర్బన్) 02 న్యూరేవోజిపేట్ ఎంపీయూపీఎస్(దస్తురాబాద్) 01 మున్యాల్(దస్తూరాబాద్) 01 లింగాపూర్(ఖానాపూర్) 01 కుభీర్ 01 టీఎస్ఎంఎస్ కుంటాల 01 వడ్యాల్ 01 ఎడ్బిడ్(ముధోల్) 01 పెంబి ఉన్నత పాఠశాల 01 జాఫ్రాపూర్(సోన్) 01 తానూర్(బోసి) 01 -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ఆదిలాబాద్రూరల్: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన కొప్పులవార్ దేవనంద్ (24) ఈనెల 25న మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మద్యం తాగొద్దని భార్య మందలించింది. దీంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి రెబ్బెన: కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దుర్గాపూర్ గొండుగూడకు చెందిన మడావి అజయ్ (18) బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలకు, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా?
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక వసతులపై అడ్మినిస్ట్రేటివ్ డీఎంఈ శివరామ ప్రసాద్ ఆరా తీశారు. శుక్రవారం రెండు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఏయే సదుపాయాలు ఉన్నాయి, ప్రతీరోజు ఎన్ని ఓపీలు నిర్వహిస్తున్నారు, మెరుగైన వసతులు ఉన్నాయా, డయాలసిస్, ఐసీయూలో విధులు ఎలా ఉన్నాయి, రోగులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రసూతి ఆస్పత్రిలో మెరుగైన ఓపీ సేవలు, రేడియాలజీ సేవలతోపాటు చిన్నారుల కోసం ఎస్ఎన్సీయూ సేవలు బాగున్నాయన్నారు. నీటి సమస్య తీర్చేందుకు సంపు ఏర్పాటు చేస్తామన్నారు. జీజీహెచ్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మందుల కొరత లేకుండా చూస్తామన్నారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఆయన వెంట డాక్టర్ సాయినాథ్రెడ్డి, డాక్టర్ సింధు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సీవీ.శారద, జీజీహెచ్ సూపరింటెండెంట్ గోపాల్సింగ్, ప్రసూతి ఆస్పత్రి హెచ్వోడీ డాక్టర్ సరోజ, ఆర్ఎంవో సమత, ఆఫీస్ సూపరింటెండెంట్ నవీన్కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేట్–2 విజయలక్ష్మి, వివిధ విభాగాల హెచ్వోడీలు ఉన్నారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన చెందొద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించా రు.https://www.ceir.gov.in/ వెబ్పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం సులభమన్నారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ.9.44 లక్షల విలువైన 82 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కార్యాలయంలో వాటిని శుక్రవారం బాధితులకు అందజేశారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఐఎంఈ ఐ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు పోయిన 2,006 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలినేరస్తులకు శిక్ష పడేలా కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. గ్రేవ్ కేసుల్లో కోర్టులలో వచ్చిన తీర్పులపై సమీక్ష చేశారు. కేసులు విముక్తి కావడానికి కారణాలు, దర్యాప్తు లోపాలు సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు, ప్రాసిక్యూషన్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సంబంధిత కేసుల్లో అప్పీల్కు వెళ్లే అవకాశాలపై న్యాయపరమైన అంశాలను పరి శీలించి, అవసరమైనచోట చర్యలు తీసుకోవాల ని నిర్ణయించారు. కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలు వినియోగించడంపై అధికారులు దృష్టిసరించాలని స్పష్టం చేశారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సుదర్శన్రెడ్డి, సతీశ్, అరుణ, దేవేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య పాల్గొన్నారు. -
నివేదికపై నిరసన గళం..!
నిర్మల్ఆక్షేపణీయం...‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ నిర్మల్చైన్గేట్: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమితులై న బి.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. కరీంనగర్ డీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన నిర్మల్కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్ను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతంగా సేవలు అందించాలి బ్యాంకర్లు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025– 26 సంవత్సరపు త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.8,409.62 కోట్ల రుణాలు మంజూ రు చేయగా 64.56 శాతం లక్ష్యాన్ని సాధించిన ట్లు తెలిపారు. బ్యాంకులు ప్రజల ఉన్నతికి మ రింత తోడ్పాటును అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలు, సబ్సిడీ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రామ్గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, బ్యాంకర్లు పాల్గొన్నారు. నిర్మల్ఖిల్లా/నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన సిఫారసులతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అందించింది. ఆకునూరి మురళి చైర్మన్గా ఉన్న ఈ కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ నాయకులు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతభత్యాలు అధికంగా ఉన్నాయని పేర్కొనడం, ఉపాధ్యాయ శిక్షణ కోర్సు డీఎడ్ రద్దు చేయమని ప్రతిపాదించడం ఆక్షేపనీయమన్నారు. విద్యా ప్రమాణాలను మరింత పెంచే సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కమిషన్ సిఫారసులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజి నీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల సీట్లు భర్తీ చేయాలని పేర్కొనడం, వేతనాలు అధికంగా ఉన్నాయని పే ర్కొనడం తదితర అంశాలను తీవ్రంగా ఖండించా రు. అసంబద్ధ సిఫారసులు చేసిందని, ప్రభుత్వ వి ద్యావ్యవస్థ నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. వ్యతిరేకిస్తున్నాం...విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీతభత్యాలపై చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యావ్యవస్థ బలోపేతానికి సూచనలు చేయాలని ఏర్పాటు చేసిన కమిషన్ ఉపాధ్యాయుల జీతభత్యాలపై వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయం. డీఎడ్ కోర్సు రద్దు చేయమనడం ఆయన అవగాహన లేమికి నిదర్శనం. కమిషన్ సిఫారసులలో 90% తప్పుగా ఉన్నాయి. పనితీరు పరంగా పదోన్నతులకు కొలమానం ఎలా నిర్ణయిస్తారు. – కృష్ణారావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడుపూర్వ పాఠశాల విద్యను ప్రాథమిక పాఠశాల విద్యతో కలపడం, బడ్జెట్లో కనీసం 18 శాతం విద్యకి కేటాయించడం లాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై సూచనలు చేయలేదు. ఉపాధ్యాయులకు సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిరాకరించడం సరికాదు. పోరాటాల ఫలితంగా రద్దయిన ప్రొబేషనరీ పీరియడ్ను మళ్లీ ప్రతిపాదించడం బాధాకరం. – దాసరి శంకర్, పెంట అశోక్, టీఎస్యూటీఎఫ్, నిర్మల్ -
బహ్రెయిన్లో పార్పెల్లి వాసి మృతి
లక్ష్మణచాంద: ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లిన పార్పెల్లి వాసి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన కందుకూరి చిన్న రాజేశ్వర్(54) గత మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లాడు. శుక్రవారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేసే క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు కుమారుడు రంజిత్ కూడా అక్కడే పని చేస్తుండటంతో ఆయన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో జాప్యం జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను నేరుగా గిరిజన గూడాలకు చేరవేయడంలో యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వివరించారు. సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిల, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, అదనపు ఎస్పీలు రాజేశ్మీనా, సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ● 18 సంఘాలకు నిధులు మంజూరు ● ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున.. ● డీడీలు చెల్లించిన అధికారులు ● ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక
నిర్మల్చైన్గేట్: మహిళా సంఘాల ను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందిరా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులను బస్సులకు యజమానులను చేస్తోంది. మొదటి విడతలో జిల్లాకు అవకాశం దక్కనప్పటికీ రెండో విడతలో అన్ని మండల సమాఖ్యలకు అవకాశం లభించింది. మహిళా దినోత్సవం రోజున 18 మహిళా సమాఖ్యలకు బస్సులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున...జిల్లాలో 18 మండలాలకుగానూ 18 మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో సమాఖ్యలో 700 నుంచి 1,100 మంది సభ్యులు ఉంటారు. ఇందులో భాగంగా బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలు త యారు చేశారు. ఒక్కో బస్సుకు రూ.36 లక్షల విలు వ ఉండటంతో సెర్ప్ నుంచి రూ.30 లక్షలు, మిగతా రూ.6 లక్షలను మండల సమాఖ్య నుంచి లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకుని చెల్లించనున్నారు. 18 సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. బస్సుల కొనుగోలుకు డీడీలు కూడా చెల్లించారు. ప్రతీనెల మొదటివారంలో అద్దె..బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందజేస్తారు. మండల మహిళా స మాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఏడేళ్లలో తిరి గి ఇస్తారు. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతీనెల మొదటి వారంలో అద్దె రూ.69,468 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మొత్తం సెర్ప్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద మండల ఖాతాలో జమవుతుంది. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల్లోని సభ్యుల అభ్యన్నతికి వినియోగిస్తారు. సంస్థపై తగ్గనున్న ఒత్తిడి..ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ నిర్వహిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అదనంగా బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీపై ఒత్తిడి తగ్గనుంది. కొత్త బస్సులతో ప్రయాణికులకు సైతం సౌకర్యం కలగనుంది. ప్రతీ మండల మహిళా సమాఖ్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వద్ద ఉండే కమ్యూనిటీ నుంచి నిధులు విడుదల చేసింది. బస్సుల అద్దైపె ఇప్పటికే ఆర్టీసీతో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. పొదుపు నుంచి వ్యాపార రంగాల్లోకి.. పొదుపు నుంచి మహిళలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో కొంత ఉపాధి పొందుతున్నారు. అతివలకు రెట్టింపు ఆదాయం పెంచేందుకు మహిళా శక్తి క్యాంటీన్, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా నెలకు రూ.69వేల అద్దెను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించనుంది. దీంతో మహిళా సమాఖ్యకు మరింత ఆదాయం పెరగనుంది. -
మట్టిపాత్రలతోనే పరిపూర్ణ ఆరోగ్యం
సారంగపూర్: మట్టిపాత్రలను వినియోగించడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, చించోలి(బి) హైస్కూల్ హెచ్ఎం మునీందర్రాజు అన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఎన్జీసీ ఆధ్వర్యంలో మట్టిపాత్రల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. అనంతరం ఇటీవల గణిత సెమినార్కు ఎంపికై న హెచ్ఎం మునీందర్ రాజును, జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. -
డ్రైవర్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి
లక్ష్మణచాంద: లాంగ్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాంగ్ డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతీ నాలుగైదు గంటలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలన్నారు. మధ్యలో వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి రిఫ్రెష్ అయి మళ్లీ ప్రయాణం కొనసాగించాలని సూచించారు. అలసటతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు గోపి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీ
కై లాస్నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజె క్ట్ అధికారి ఖుష్బూ గుప్తా బదిలీ అ య్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె తొలుత ఆదిలాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అ యిన ఆమె అదే ఏడాది నవంబర్ 4 నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తా జాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూగుప్తా -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
లక్ష్మణచాంద: పదోతరగతి విద్యార్థులు సరైన లక్ష్యంతో ముందుకెళ్లాలని డీఈవో భోజన్న సూచించారు. గురువారం సోన్ మండలంలో ని న్యూవెల్మల్ బొప్పారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితాల్లో పదోతరగి అత్యంత కీలకదశ అన్నారు. ఈ దశలో క్రమశిక్షణ, ప ట్టుదల, సమయపాలన, గురువుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో న్యూవెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్, ఎంఈవో తోడిశెట్టి పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ పాల్గొన్నా రు. -
ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?
భైంసాటౌన్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో గాయాలపాలయ్యారు. తాజాగా, బుధవారం భైంసా మండలం బిజ్జూర్కు చెందిన కల్యాణ్కర్ శివాజీ ఓ శుభకార్యం నిమిత్తం భైంసాకు వచ్చి తిరిగి బైక్పై వెళ్తున్న క్రమంలో పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో లారీ ఢీకొని మృతి చెందాడు. అదేరోజు సాయంత్రం ఏపీనగర్కు చెందిన హన్మంత్రావు కారు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇటీవల సాత్పూల్ వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఏకంగా నలుగురు దుర్మరణం చెందారు. ఇరుకు వంతెనలు...తానూరు మండలంలోని బెల్తరోడ నుంచి నిర్మల్లోని మంచిర్యాల చౌరస్తా వరకు జిల్లాలో ఈ హైవే 53. కి.మీ మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం రెండులైన్ల రహదారికాగా కొన్నిచోట్ల ఇరుకై న వంతెనలున్నాయి. భైంసా పట్టణంలోని సాత్పూల్ వంతెన, మండలంలోని మాటేగాం, కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్(జి) మండలంలోని గుండంపల్లి క్రాస్రోడ్, నిర్మల్ వద్ద చిట్యాల బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భైంసాలోని నిర్మల్ చౌరస్తా, ఏపీనగర్ చౌరస్తా, నర్సాపూర్(జి), తల్వేద ఎక్స్రోడ్, దిలావర్పూర్ బస్టాండ్, చర్లపల్లి ఎక్స్రోడ్ వద్ద సైతం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. న్యూలోలం, సిర్గాపూర్ బస్టాండ్ల వద్ద డివైడర్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రత చర్యలు కరువు...జిల్లాలో హైవే వెంబడి చాలాచోట్ల రహదారి నిర్వహణ సక్రమంగా లేదు. కొన్నిచోట్ల రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుపైకి ఆక్రమణలు, వాహనాల పార్కింగ్తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన యూటర్న్లు ఏర్పాటు చేయడం, అప్రోచ్ రోడ్ల వద్ద భద్రత చర్యలు లేవు. కొన్నిచోట్ల హైవే వెంబడి ప్రైవేట్ స్థలాల నిర్వాహకులు రెయిలింగ్ను తొలగించి దార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి చోట హైవేపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్చార్జీలు వసూలు చేయడంపై ఉన్న దృష్టి.. రహదారి నిర్వహణపై హైవే అధికారులు చూపాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. భైంసాలో లెక్కకు మించి..!భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడంతో అధిక వేగంతో వచ్చే వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటే క్రమంలో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారి మార్గంలో ఉన్న స్థానిక ఫైర్ స్టేషన్ కూడలి వద్ద, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే కూడలి వద్ద కూడా ప్రమాదాలు అధికంగానే చోటు చేసుకుంటున్నాయి. కాలనీల్లోంచి రోడ్డుపైకి వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్లే వాహనాలు ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తేనే...జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. తానూర్ మండలంలోని బేల్తరోడా నుంచి భైంసా మీదుగా నిర్మల్ వరకు 61వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గం మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం రెండు వరుసల రోడ్డు మాత్రమే ఉండడంతో పాటు పలుచోట్ల ఇరుకు వంతెనల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల వద్ద బస్టాప్లు నిర్మించినా వాటిని వినియోగించ డం లేదు. దీంతో రోడ్డు పక్కనే బస్సులు, ప్రైవేట్ వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో బస్సులు సైతం రహదారిపైనే నిలుపుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారిపై భారీ వాహనాలకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో పలుచోట్ల లారీ లు రహదారి పక్కనే నిలిపి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో గమనించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగు వరుసలతో రహదారిని అభివృద్ధి చేసి ఇరుకు వంతెనలను విస్తరిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు -
పుష్కరాలకు ప్రణాళికలు రూపొందించాలి
నిర్మల్చైన్గేట్: గోదావరి నది పుష్కరాల నిర్వహణ కు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాసర సరస్వతీ అమ్మవా రిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భ క్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు వసతి, తాగునీరు, శాశ్వత మొబైల్ టాయిలెట్లు, లైటింగ్, మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు. చేపట్టిన పనులను సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలన్నారు. పటిష్ట బందోబస్తుఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పటిష్ట నిఘా ఉంచుతామన్నారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీలు రాజేశ్ మీనా, సాయికిరణ్, డీపీవో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, బాసర ఆలయ ఈవో విజయ రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్రూరల్: జిల్లాలో బుధవారం ఇంటర్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,076 మంది విద్యార్థులకు గానూ 6,772 మంది హాజరుకాగా 304 మంది గైర్హాజరయ్యారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా హాజరైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. తొలిరోజు జిల్లాలో 95.70 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గురువారం జరుగనున్న ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6,473 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో గల ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్ష గదులను సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాదవ్ పరశురాం, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు ఉన్నారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్రూరల్: మార్చి 14 నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో దర్శనం భోజన్న అన్నారు. బుఽ దవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో జరిగిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారుల ఓరియంటేషన్ తరగతులకు హాజరై మాట్లాడారు. విద్యార్థులతో పాటు సీఎస్, డీవోలకు సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలన్నారు. గదిలో లైటు, ఫ్యాను ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగులకు గ్రౌండ్ఫ్లోర్లోనే పరీక్ష గదిని కేటాయించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరీక్ష నిర్వహణ తీరు గురించి వివరించారు. -
పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ!
నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వం రైతులకు మరింత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించేందుకు భూమి కలిగిన ప్రతీ రైతుకు 14 అంకెల యూనిక్ గుర్తింపు నంబర్ జారీ చేస్తోంది. ఆధార్లా పనిచేసే ఈ ఫార్మర్ ఐడీ డిజిటలైజేషన్ ప్రక్రియను గతేడాది మే 5న ప్రారంభించారు. రైతులు ఆధార్ కార్డు, భూ సంబంధిత పత్రాలు, లింక్డ్ మొబైల్ నంబర్తో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద లేదా మీ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అధికారులు అగ్రిస్టాక్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తారు. మూడు ఓటీపీల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత 14 అంకెల యూనిక్ ఐడీ కేటాయించబడుతుంది. యూనిక్ నంబర్ ఉంటేనే.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వనుంది. ఈ ఐడీ లేకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా, ఎరువుల పంపిణీ వంటి కేంద్ర పథకాలు అందవు. రాయితీ రుణాలు, ఇతర సంక్షేమ సహాయాలకు కూడా ఇది ఆధారం. పట్టాదారు పాస్బుక్ కలిగినవారు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈనెల 24 వరకు మండలాల వారీగా జరిగిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ల వివరాలు మండలం పట్టా రిజిస్టర్ అయిన శాతం పాస్పుస్తకాలు రైతులు లోకేశ్వరం 13,100 9,609 82.53 లక్ష్మణచాంద 9,711 6,595 78.01 నిర్మల్అర్బన్ 786 537 77.91 సోన్ 7,922 5,551 77.86 దస్తురాబాద్ 5,035 3,828 75.40 దిలావర్పూర్ 7,415 4,863 74.19 నర్సాపూర్(జి) 6,972 4,616 73.69 తానూర్ 15,306 10,678 72.92 సారంగాపూర్ 13,006 9,213 72.31 నిర్మల్రూరల్ 11,025 6,518 70.74 ముధోల్ 12,582 8,026 69.68 కుంటాల 8,333 5,108 66.71 ఖానాపూర్ 9,381 5,823 66.47 భైంసా 16,459 10,160 66.09 మామడ 9,819 6,461 64.21 కుభీర్ 17,657 10,987 62.91 బాసర 7,240 3,992 61.83 కడెం 11,380 6,857 60.59 పెంబి 3,784 2,937 49.93 -
● ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతింటున్న పంటలు ● ఈసారైనా పరిహారం అందించాలని అన్నదాతల వేడుకోలు
లక్ష్మణచాంద: ఈ ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో 3,371 మంది రైతులు 4.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 5009 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వివిధ మండలాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. మరికొద్దిరోజుల్లో పంట చేతికి అందివస్తుందని అనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లి రైతును కదిలించినా వారి కళ్లల్లో ఆవేదన కనిపిస్తోంది. బీమా లేకపోవడంతో... ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో చేరలేదు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకంలో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు చేయలేదు. దీంతో ఇలా అకాల వర్షాలకు నష్టపోతున్న రైతులకు బీమా సౌకర్యం లేకపోవడంతో పరిహారం అందక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రకటించినా... ఈ వానాకాలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మా సాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకుంటామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అమలు కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో 13 వేల ఎకరాల్లో పంట నష్టం... జిల్లాలో గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు నవంబర్ మాసంలో వచ్చిన మొంథా తుపాను కారణంగా 13 వేల ఎకరాల్లో వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకూ పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా... జిల్లాలో ఇటీవల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు సోన్, లక్ష్మణచాంద, తానూర్, కుభీర్, భైంసా, ముధోల్, లోకేశ్వరం, మామడ మండలాల్లో 3,371 మంది రైతులకు చెందిన 4,850 ఎకరాల్లో మొక్కజొన్న, 58 మంది రైతులకు చెందిన 88 ఎకరాల్లో జొన్న, 40 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో శెనగ, 11 మంది రైతులకు చెందిన 9 ఎకరాల్లో గోధుమ పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈసారైనా ప్రభుత్వం స్పందించి పంటనష్ట పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.జిల్లా సమాచారం పంటపేరు రైతుల సంఖ్య నష్టపోయినపంట (ఎకరాల్లో) మొక్కజొన్న 3,262 4,850 జొన్న 58 88 శెనగలు 40 62 గోధుమ 11 9 ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు సోమవారం కురిసిన అకాల వర్షానికి కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు సర్వే చేపట్టి జిల్లా వ్యాప్తంగా 5009 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించాం. తదుపరి ప్రభుత్వం సూచనల మేరకు చర్యలు చేపడుతాం. – అంజిప్రసాద్, డీఏవోఈ చిత్రంలో నేల వాలిన మొక్క జొన్న పంట చూపుతున్న యువ రైతు లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామానికి చెందిన రెంక రాజు. గతేడాది కురిసిన వర్షాలకు రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట గోదావరి నది ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ఏడాది మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షాలకు పంటచేను పూర్తిగా నేలమట్టం కావడంతో ఆందోళన చెందుతున్నాడు. -
కవ్వాల్లో పక్షుల కిలకిలలు
కవ్వాల్ టైగర్జోన్లో ఇటికాస్ సంస్థ చేసిన సర్వేలో 264 పక్షులను గుర్తించారు. ఇందులో స్థానిక జాతులతోపాటు విదేశీ పక్షులు ఉండటం విశేషం.నష్టపోయిన రైతులను ఆదుకోవాలి లక్ష్మణచాంద: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేఎల్పీనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి కోరారు. బుధవారం సోన్ మండలంలోని సోన్, కూచన్పెల్లి, బొప్పారం, న్యూవెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వెయ్యి ఎకరాలకు పైనే పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకోవడం తప్పా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ పరిహారం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరికెల గంగన్న, మార గంగారెడ్డి, న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
భైంసాటౌన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం పట్టణంలోని సాత్పూల్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ‘ఎరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందన్నారు. భైంసాలోని సాత్ పూల్ వంతెన వద్ద ప్రమాద సూచికలు లేకపోవడంతో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారని గుర్తుచేశారు. కార్యక్రమంలో భైంసా, నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్ మీనా, సాయికిరణ్, సీఐలు సాయికుమార్, ప్రవీణ్, ఎస్సైలు పాల్గొన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలి భైంసాటౌన్: పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణిలో భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో ‘షీ టీం’ సేవలను పరిశీలించారు. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి కుభీర్: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం పోలీస్స్టేషన్లో 35 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 162 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 80 శాతం హెల్మిట్ ధరించని వారే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు, నాయకులు ఎస్పీని సన్మానించారు. కుభీర్కు చెందిన శిల్పకళాకారుడు సాయిశ్యాం ఎస్పీ విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేశ్, సీఐ ప్రవీణ్, ఎస్సై క్రిష్ణారెడ్డి, సర్పంచ్ కె.సాయినాథ్, మారుతి, సంజు, ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, ఆత్మ చైర్మన్ వివేక్, తదితరులు పాల్గొన్నారు. -
చిత్తడి నేలల పరిరక్షణతోనే సమతుల్యత
నిర్మల్చైన్గేట్: ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలన్నారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, మత్స్య శాఖ ఏడీ రాజ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర త్రిబుల్ ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా ? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
సాగునీటి రంగానికి ప్రాధాన్యం
తానూరు: నియోజకవర్గంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రామరావ్పటేల్ తెలిపారు. రూ.89 లక్షలతో హిప్నెల్లి గ్రామ చెరువు కట్ట మరమ్మతు పనులను మంగళవారం ప్రారంభించారు. పనులు త్వరగా పూర్తి చేసేలా చూస్తామన్నారు. కాళేశ్వరం 28 ప్యాకేజీ కాలువ పనులు పాలకుల నిర్లక్ష్యంతో పూర్తికాలేదన్నారు. నిధులు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పదే పదే కోరానన్నారు. నిధులువస్తే తానూరు మండలం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. పిప్రి లిఫ్ట్ ఇరేగేషన్కు రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలుపడం సంతోషకరమన్నారు. ఎల్విత్, వాడవన, కోలూరు గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పన మంజూరైన మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావ్ పటేల్, నాయకులు లక్ష్మణ్రెడ్డి, చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉన్నారు. -
భయం వీడితే జయమే
లక్ష్మణచాంద: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్కు వచ్చేసరికి వెనుకబడుతున్నారు. చదువుపై భయం, పరీక్షల సమయంలో తడబడడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. ఈ నేపథ్యంలో మానసిక వైద్యుడు అల్లాడి సురేశ్ కొన్ని సూచనలు చేశారు. చదివే సమయంలో.. ● సౌకర్యంగా కూర్చొని 100 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీంతో మెదడుకు రిలాక్స్ అవుతుంది. ఆహార ఎంపికలు పరీక్షా హాల్లో.. -
చలో సెక్రటేరియేట్కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు
భైంసాటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని భైంసా డిపో ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 వేతన సవరణ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, యూనియన్ల పునరుద్ధరణ డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చలో సెక్రటేరియేట్ చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం పెంచి, బస్సుల సంఖ్య తగ్గించి ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్ నుంచి ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల ఏర్పాట్లపై జిల్లాలవారీగా కలెక్టర్లను వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలను లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించి 6,652 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 6,473 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. మార్చి 14 నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు 47 పరీక్ష కేంద్రాల్లో 9,758 మంది విద్యార్థులు రాయనున్నట్లు తెలిపారు. సీఎస్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద, పరీక్ష పత్రాల తరలింపు సమయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, సరైన లైటింగ్, సిబ్బందితో కూడిన వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పరీక్షల సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జీరాక్స్ దుకాణాలు మూసివేసి, బీఎన్ఎస్ సెక్షన్ 163 (సీఆర్పీసీ 144) అమలు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీఐఈవో పరుశురాం, డీపీవో శ్రీనివాస్, ఖజానా శాఖ అధికారి సరోజ, డీఎంహెచ్వో రాజేందర్, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
నిర్మల్
వెయిట్ లిఫ్టింగ్లో ప్రతిభ... దస్తురాబాద్: రాష్ట్ర స్థాయి సీఎం కప్ 110 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన కొట్టె అభిషేక్ ప్రతిభ కనబర్చి సీల్వర్ మెడల్ సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయు డు నవీన్ తెలిపారు. న్యూబొప్పారంలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న డీఏవో అంజిప్రసాద్ ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు నిర్మల్టౌన్: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. అంతేకాకుండా పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూస్తామన్నారు. 23 పరీక్ష కేంద్రాల వద్ద 163(సెక్షన్ 143) అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానం పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అకాల నష్టం భైంసా/భైంసారూరల్/కుంటాల/ముధోల్/ లోకేశ్వరం: జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షానికి మక్క రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో వర్షం కురవడంతో కోత దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. శెనగ పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న శనగ చేలల్లో నీరు నిలవడంతో కాయలు నల్ల బడతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కుంటాల మండలం వెంకూర్, లింబా(కె), లింబా(బి), అందకూర్, అంబకంటి గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. భైంసారూరల్ మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. కామోల్లో 85 ఎకరాల్లో మొక్కజొన్న, కుంసరలో 90 ఎకరాలు, వాలేగాంలో 84, దేగాంలో 82, సిరాల 112, ఇలేగాంలో 56, బడ్గాంలో 30, హజ్గుల్లో 55, కథ్గాంలో 89, హంపోలిలో 30, మాంజ్రిలో 70, పాంగ్రిలో 65, చుచుంద్లో 69, తిమ్మాపూర్లో 45, సుంక్లిలో 45, భైంసాలో 85, సిద్దూర్లో 30, మిర్జాపూర్లో 25, టాక్లిలో 15, లింగాలో 10 ఎకరాల్లో మొక్కజొన్న, కుంసరలో రెండు, వాలేగాంలో ఐదు ఎకరాల్లో శెనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారి గణేశ్ తెలిపారు. ముధోల్ మండల కేంద్రంతోపాటు, బోరిగాంలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నది. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లోకేశ్వరం మండలంలోని రాజూరా, లోకేశ్వరం, పుస్పూర్, హవర్గ, పిప్రి, అబ్ధుల్లాపూర్, రాయపూర్కాండ్లీ, పంచగుడి, ఎడ్ధూర్, గడ్చాంద గ్రామాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న, నువ్వు, పుచ్చకాయ(టర్భుజ), శెనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభాలు విరగడంతో రాజూర గ్రామంలో అంధకారం నెలకొంది. వ్యవసాయాధికారుల మండలంలో 1,076 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏవో గిరిరాజ్ తెలిపారు. బోల్సాశివారులో పంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణచాంద/మామడ: నిర్మల్ డివిజన్ పరిధిలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో అకాల వర్షం అన్నదాతలను అతలాకు తులం చేసింది. లక్ష్మణచాంద మండలం పీచర, చింతల్చాంద, లక్ష్మణచాంద, చామన్పల్లి, మునిపల్లి, మల్లాపూర్, ధర్మారం గ్రామాల్లో ఉడికించిన పసుపు తడిసింది. లక్ష్మణచాంద మండలంలోని మూడు క్లస్టర్ల పరిధిలో 773 రైతులకు చెందిన 1,171 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం కలిగినట్టు మండల వ్యవసాయ అధికారి వసంత్రావు తెలిపారు. సోన్ మండలంలో 437 రైతులకు చెందిన 645 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వినోద్ ప్రాథమికంగా అంచనా వేశారు. మామడ మండలం పొన్కల్, అనంతపేట్, పోతారం గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. ఉడికించిన పసుపు పంట తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న పంటలను ఏఈవో సంతోష్కుమార్ రైతులతోకలిసి పరిశీలించారు. నిర్మల్ డివిజన్లో.. 2,500 ఎకరాలలో నష్టం లక్ష్మణచాంద: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పది రోజుల్లో చేతికి వచ్చే పంట చేతికి రాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 2,500 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల్లో డీఏవో అంజిప్రసాద్ పంటలను పరిశీలించారు. -
ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు సున్న..!
భైంసాటౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన బైల్ బజార్లో అసౌకర్యాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువుల క్రయవిక్రయాలతో ఏఎంసీకి ఆదాయం చేకూరుతున్నా.. రైతులు కూర్చునేందుకు నీడ, తాగునీరు వసతి కల్పించడం లేదు. ప్రతీ మంగళవారం నిర్వహించే బైల్ బజార్కు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులు తమ పశువులను విక్రయించేందుకు వస్తుంటారు. క్రయవిక్రయాలను బట్టి ఏఎంసీకి రుసుం చెల్లిస్తారు. దీంతో నెలకు రూ.50 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. కానీ, నిర్వహణను పట్టించుకోకపోగా, రైతులకు వసతులు కల్పించడం లేదు. బైల్ బజార్ చుట్టూ ఉన్న ప్రహరీ కూలిపోయింది. బజార్ ప్రాంగణంలోని సిబ్బంది గదులు, ఇతర గదులు శిఽథిలదశకు చేరుకున్నాయి. లోపలికి, బయటకు వచ్చే మార్గాల్లో గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గదులకు ఉన్న కిటికీలు, తలుపులను చోరీ అయ్యాయి. ఏఎంసీ అధికారులు పట్టించుకుని, బైల్ బజార్లో సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. -
కేటీఆర్కు ఘన స్వాగతం
లక్ష్మణచాంద: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నిర్మల్ జిల్లా నాయకులు సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన కార్యకర్తలు, నాయకులను అభినందించారు. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్, సుభాష్రావు, మారుగొండ రాము, అయ్యన్నగారి రాజేందర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీర్తో కరచాలనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు -
స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లొకేషన్
లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు తమ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తీసుకుంటున్నా రు. గతంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ కళాశాలల్లో పరీక్ష కేంద్రం ఉండటంతో జిల్లా కేంద్రానికి వెళ్లి పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య పరిష్కారాని కి ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్... ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని మొ బైల్ ఫోన్తో స్కాన్ చేయగానే విద్యార్థి పరీక్ష కేంద్ర ం లైవ్ లొకేషన్తోపాటు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రంకు చేరుకోవడం సులభతరం అవుతుంది. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,652, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,479 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్కు సమాచారం... ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్ తీసుకునే సమయంలో కార్పొరేట్ కళాశాలలో కళాశాల ఫీజులు చెల్లించాలని లేదంటే హాల్టికెట్ ఇవ్వమని చెప్పడంతో చాలామంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో పరీక్షలకు దూరమైన సందర్భాలు కోకొల్లాలు. నిరుపేద విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరమవుతున్నారనే కారణంతో ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల పోషకుల ఫోన్కు ఇంటర్ హాల్టికెట్ బోర్డు లింకు పంపించారు. ఈ లింకు ఓపెన్ చేసి విద్యార్థి ఆధార్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయగానే విద్యార్థి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించింది. ఒత్తిడి తగ్గించేలా.. వార్షిక పరీక్షల సమయంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆందోళనకులోనై అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలకు సహాయం అందించేందుకు ఇంటర్బోర్డు టెలీ మానస్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఏ.విద్యార్థి అయినా మానసికంగా ఆందోళన చెందినా పోషకులు 14416 నంబర్కు ఫోన్ చేయగానే మానసిక నిపుణులు అందుబాటులోకి వచ్చి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తగిన సూచనలు సలహాలు అందిస్తారు. ఈ సహాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. -
ప్రజావాణి.. ప్రయోజనమేమి?
నిర్మల్చైన్గేట్: తన కుమారులు అక్రమంగా భూమి ఆక్రమించారని, దివ్యాంగుల కింద వచ్చే పింఛన్ రావడం లేదని, కూలిన ఇంట్లో ఉంటున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని, పట్టా పాస్బుక్లో ఫొటో తప్పుగా పడిందని.. ఇలా పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని, దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్న జిల్లా ప్రజలు కలెక్టర్కు అర్జీ పెట్టుకుని పోతున్నారు. పరిష్కారంపై ఎంతో నమ్మకంతో ఉంటున్నారు. కానీ, అధికారులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చుడే తప్ప పరిష్కారం కావడం లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు వారాల విరామం తర్వాత మళ్లీ సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 91 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తుపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలు, వస తి గృహాలు తనిఖీ చేయాలని సూచించారు వేసవి సమీపిస్తున్నందున విద్యార్థులకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులు, మండల ప్రత్యే క అధికారులు పరిశీలిస్తూ, నిర్మాణాల ప్రగతి, నాణ్య త పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
వాతావరణం ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం అవుతుంది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది. అకాల వర్షం.. ఆగమాగంప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం నెదర్లాండ్కు చెందిన శాశ్వత వ్యవసాయ నిపుణుడు సచాస్ స్టైమెస్ మండలంలో ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తున్న పంటలను పరిశీలించాడు.భైంసా/భైంసాటౌన్/లక్ష్మణచాంద/లోకేశ్వరం/ఖానాపూర్: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. జిల్లాలో శెనగ పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. వర్షాలకు శెనగలు నల్లబడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పంట కోసిన రైతులు తడవకుండా కుప్పలపై టార్పాలిన్లు కప్పుకున్నారు. భైంసా పట్టణంలో కురిసిన వర్షానికి వార సంతలో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. గాధీగంజ్లో విక్రయానికి తెచ్చిన పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుకున్నారు. సోన్, లక్ష్మణచాంద మండలాల్లో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. సోన్ మండలంలో రాళ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు న్యూవెల్మల్ గ్రామ స్వాగత తోరణం కూలిపోయింది. లోకేశ్వరం మండలం రాజూరా, మన్మద్, పోట్పల్లి(ఎం), లోకేశ్వరం, పుస్పూర్, హవర్గ, సాథ్గాం, హద్దిగాం, బిలోలి గ్రామాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దస్తురాబాద్ మండలం రేవోజీపేట, బుట్టాపూర్, మల్లాపూర్, దస్తురాబాద్ ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ముధోల్తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలలతో వర్షం కురిసింది. పిప్రి గ్రామంలో రోడ్డుపై భారీ వృక్షం కూలింది. ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. మామిడి పూత రాలిపోయింది. -
పెన్షన్ ఇప్పించండి..
నేను పుట్టుకతోనే మూగవాడిని, నాకు చెవులు వినిపించవు. 18 నెలల క్రితం నా పెన్షన్ రద్దు అయింది. సదరన్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి నాకు సంవత్సరం మాత్రమే ఇస్తున్నారు. శాశ్వత సదరం సర్టిఫికెట్తో పాటు పెన్షన్ ఇప్పించండి. – పోశెట్టి, మామడ క్రయ విక్రయాలు ఆపాలి.. నాకు మా అమ్మ అయిన పెంటు లసుంబాయి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి సర్వే నం.716ఆ, 4 గుంటల భూమి కడ్తాల్ శివారులో ఉంది. ఈ వ్యవసాయ భూమిని మా అమ్మకి తెలియకుండా ముద్దం చిన్నపోశెట్టి, ముద్దం బక్కన్న, గుర్తం లసుంబాయి కలిసి మేక శంకర్కు అమ్మేశారు. భూమిని మేము ఎవరికీ అమ్మలేదు. ఈ భూమి ప్రస్తుతం కోర్టు పరిధి లో ఉంది. క్రయ విక్రయాలు జరగకుండా చూడాలి. – పెంటు రాములు, బాగులవాడ -
గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్చైన్గేట్: రానున్న గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పుష్కరాల ఏర్పాట్లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఘాట్ల నిర్మాణం, నీటి వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వసతులు కల్పిస్తామన్నారు. ఇందులో డీపీవో శ్రీనివాస్, నీటిపారుదల ఈఈ అనిల్, జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, అధికారులు పాల్గొన్నారు. -
గృహలక్ష్మి.. ఇందిరమ్మగా
షరతులు ఇలా.. బేస్మెంట్ ప్రాంతం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. ఇప్పటికే ఉన్న బేస్మెంట్ 400 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉంటే దానిని కనీసం 400 చదరపు అడుగులకు పెంచడానికి ప్లింత్ బీమ్లు వేయాలి. పెద్ద బేస్మెంట్ల ప్లింత్ ఏరియా గరిష్టంగా 600 అడుగులకు పరిమితం చేశారు. అయితే వీరికి మంజూరు ఇచ్చినప్పటికి బేస్మెంట్ లెవల్ బిల్లు లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వదు. మిగతా రూ.4 లక్షలు రూఫ్ లెవల్ రూ.లక్ష, ఆర్సీ లెవల్ రూ.2 లక్షలు, పూర్తి అయిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తుంది. నిర్మల్చైన్గేట్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులు ప్రయోజనం పొందలేకపోయారు. అటువంటి వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనుల్లో ఉన్నారు. బేస్మెంట్ లెవల్లోనే.. గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు లబ్ధిదా రులను ఎంపిక చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచి పోయింది. ఈ పథకం కింద ఇల్లు మంజూరై, పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది. బేస్మెంట్ దశ దాటి నిలిచిపోయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటూ మిగతా పనులు కొనసాగించేందుకు లబ్ధిదారులకు రూ.4 లక్షలు విడతల వారీగా అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణిస్తామని పేర్కొంది. నియోజకవర్గానికి మూడు వేల చొప్పున.. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లను ప్రకటించి లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందించిది. కొందరు నిర్మాణ పనులు చేపట్టగా.. ఇంకా కొందరు ఇళ్లు నిర్మించుకోవాలా..? వద్దా..? అన్న మీమాంసలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ప్రారంభించిన లబ్దిదారులు వాటిని కొనసాగించలేక పోయారు. సర్వే చేసి.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పాత ఇందిరమ్మ పథకం, గృహలక్ష్మి పథకాల కింద ఇప్పటికే బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలో వదిలేసిన వారు తిరిగి ఇంటిని పూర్తి చేసుకునేలా చర్యలు చేపడుతోంది. బేస్మెంట్ దశలోనే ఆగిపోయినవి ఎన్నిఉన్నాయో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈనేపథ్యంలో అధికారులు ఊరూరా తిరిగి సర్వే చేసి బేస్మెంట్ దశలో ఆగిన ఇళ్ల వివరాలు సేకరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా 231, ఇందిరమ్మ పథకం ద్వారా 70 వరకు ఉన్నట్లు తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. -
బాక్సింగ్లో ప్రతిభ
నిర్మల్ టౌన్: మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ జూనియర్ బాలు రు, బాలికల బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఇద్దరు బాక్సర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రెండు కాంస్య పతాకాలు సాధించారు. 44–46 కేజీల విభాగంలో ఆర్.అనన్య, 48–50 కేజీల విభాగంలో ఏ.కీర్తన కాంస్య పతకాలను సాధించారు. వీరిని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ బాధ్యులు చందుల స్వామి, శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. రెజ్లింగ్లో రజతం తానూరు: సీఎం కప్ రాష్ట్రసాయి రెజ్లింగ్ పోటీల్లో తానూరు జూనియర్ కళాశాల విద్యార్థులు రజత పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ రాజశేఖర్ తెలిపారు. హైదారాబాద్లో సోమవారం నిర్వహించిన రెస్లింగ్ పోటీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గంగాప్రసాద్ అండర్–17, 45 కేజీల విభాగంలో, శివప్రసాద్ అండర్–19, 52 కేజీల విభాగంలో ప్రతిభ కనబర్చి రజత పతకాలు సాధించినట్లు వివరించారు. -
అడెల్లికి పోటెత్తిన భక్తజనం
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్తోపాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో భూమయ్య, చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం 108 అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ‘అడెల్లి’లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పూజలు సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భోజాగౌడ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు. -
నిర్మల్
బాసరలో భక్తుల రద్దీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి తరలివచ్చారు.అంగన్వాడీలకు వెలుగులురాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిర్మల్టౌన్: హైదరాబాద్లో జరుగుతున్న సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాకు మరిన్ని పతాకాలు లభించాయి. రిథమిక్ యోగా అండర్– 14 సబ్ జూనియర్స్ విభాగంలో మాగం చరణ్కు వెండి పతకం లభించింది. అండర్– 25 విభాగంలో దిలీప్ బంగారు పతకం సాధించాడు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి అభినందించారు. జీరో బిల్లుతోనే సరఫరా.. -
శెనగకు కూలీల కొరత
భైంసా: జిల్లాలో శెనగ పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ కూలీల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సీజన్లో జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల్లో శెనగ సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా. యాసంగి పంటల నమోదు ఇంకా పూర్తిస్థాయిలో చేపట్టలేదు. పంట ప్రస్తుతం కోత దశకు వచ్చింది. కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన కోత ఖర్చులు కూలీల కొరతతో కోత చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉండే ఖర్చు ఈసారి రూ.3,400 నుంచి రూ.4వేల వరకు చేరింది. చిన్న, సన్నకారు రైతులకు ఇది అదనపు భారం అవుతోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడంతో ఖర్చులు అధికమయ్యాయని రైతులు వాపోతున్నారు. ఆలస్యమైతే నష్టం శెనగ పంట కోత ఆలస్యం అయితే గింజలు నేలరా లే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు కురిస్తే దిగుబ డి తగ్గే అవకాశముంది. దీంతో రైతులు తక్షణమే కో త పూర్తిచేయాలనే ఆత్రుతలో ఉన్నారు. కూలీలు ఇ తర ప్రాంతాలకు పనులకు వెళ్లడంతో కోతలు నిలి చిపోతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి కూ లీలు వస్తున్నా రవాణా భారం రైతులపై పడుతోంది. దీంతో చేసేదేంలేక పంటలు కోయిస్తున్నారు. యంత్రాల కొరత... కొంతమంది రైతులు హార్వెస్టర్ యంత్రాల కోసం ప్రయత్నిస్తున్నా జిల్లాలో అందుబాటులో ఉన్న యంత్రాలు పరిమితంగానే ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ మంది రైతులు యంత్రాల కోసం అడుగుతుండటంతో సమయానికి అందడం లేదు. దీంతో యంత్రాల అద్దె కూడా పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది 50 కేజీల శెనగ సంచి నూర్పిడి చేసేందుకు రాజస్థాన్ నుంచి వచ్చే ట్రాక్టర్ యజమానులు రూ.110 తీసుకోగా ఈ ఏడాది రూ.110 నుంచి రూ.130 వరకు తీసుకుంటున్నారు. దీంతో పంట నూర్పిడి చేసే విషయంలోనూ రైతులపై భారం పడుతోంది. శెనగ పంటపై ఆశలు పెట్టుకున్న నిర్మల్ రైతులకు కూలీల కొరత పెద్ద సవాల్గా మారింది. దృష్టి సారిస్తే... వ్యవసాయ పనులకు కూలీల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రైతులకు కాస్త చేయూతనందించాలి. కూలీలను వ్యవసాయ పనులకు మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలి. పంట కోతలకు ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు అందించాలని రైతులు కోరుతున్నారు. తగిన మద్దతు లేకపోతే ఈ సీజన్లో లాభాల కంటే నష్టాలే మిగిలే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఒత్తిడి వద్దు.. లక్ష్యమే ముద్దు
లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల్లో ఇప్పటికే కొంత ఆందోళన మొదలైంది. అలాగే తమ పిల్లలు మంచి మార్కులు సాధిస్తారా? లేదా అనే సందేహం కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఒత్తిడిని జయించి ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విషయ నిపుణులు, మానసిక వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రతీ నిమిషం ముఖ్యమే... జిల్లాలో ఇలా... జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, మోడల్, అన్ని రకాల రెసిడెన్షియల్స్ జూనియర్ కళాశాలలు 69 ఉన్నాయి. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం 6,652 మంది, ద్వితీయ సంవత్సరం 6,473 మంది మొత్తంగా 13,125 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. -
అరైవ్.. అలైవ్
నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా జిల్లా పోలీసులు ‘అరైవ్.. అలైవ్’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జి ల్లాలోని ప్రజల ప్రాణాలు, భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఈ నెల 22 నుంచి వారం రోజులపా టు కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహ న పెంపొందించడం, సురక్షిత ప్రయాణం అభివృద్ధి చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రోజువారీ అవగాహన కార్యక్రమాలురోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యం అరవ్ అలైవ్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే. రోడ్డు ప్ర మాదాల్లో ఏటా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో ఎదురుచూస్తున్న వారి కోసం అయినా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. నడిపితే వారితో పాటు ఇతరులకూ నష్టం జరుగుతుంది. – జానకీ షర్మిల, ఎస్పీ -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్
భైంసాటౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్పై జరిగిన దాడికి నిరసనగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. కుంటాల మండలంలోని ఓలాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు తూప్రాన్లో అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అనంతరం తన కారులో కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కార్యక్రమంలో భైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తప్పని యూరియా తిప్పలు
ఖానాపూర్: రైతులకు యూరియా కష్టాలు దూరం చేసేందుకు ప్రభుత్వం యాప్లో బుకింగ్ పద్ధతి ప్రవేశపెట్టినప్పటికీ తిప్పలు తప్పడంలేదు. పట్టణంలోని గ్రోమోర్ ఫర్టిలైజర్స్ యాప్లో బుక్ చేసిన రైతులు యూరియా బస్తాల కోసం రెండు రోజులుగా షాపు వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం లేక పలువురు రైతులు సకాలంలో యూరియా బుక్ చేసుకోలేక పోతుండగా బుక్ చేసినా బస్తాలకోసం రెండు రోజులుగా తిరగాల్సి వస్తోందని మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన రైతులు అశోక్, శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా యాప్లో నమోదు చేసుకున్న రైతులకు ఫోన్చేసి ఓటీపీ ఎంటర్ చేసి ఆన్లైన్ ప్రక్రియ చేయడంతో ఆలస్యం జరుగుతోందని గ్రోమోర్ నిర్వాహకులు పేర్కొన్నారు. -
● ఆటల్లో సత్తా చాటుతున్న కేజీబీవీ విద్యార్థినులు ● మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీల్లో సత్తా.. ● రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక
నేను మా ఇంటివద్ద క్రికెట్తోపాటు కబడ్డీ, కిక్బాక్సింగ్ ఆటలు బాగా చూసేదాన్ని. కిక్బాక్సింగ్పై మక్కువ ఏర్పడింది. అప్పట్నుంచి బాక్సింగ్లో రాణించాలన్న కల ఉండేది. గురుకులం మంచి వేదికగా మారింది. మా పీడీ, పీఈటీలు నా ఆసక్తికి అనుగుణంగా మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సీఎం కప్పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాను. – బి తేజశ్విని, కిక్బాక్సింగ్ క్రీడాకారిణి మేము పదో తరగతి చదువుతున్నాం. క్యారమ్స్ డబుల్స్లో మేము ఉత్తమ ప్రతిభ కనబర్చాం. మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీల్లో ప్రథమ స్థానం సాధించాం. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాం. రాష్ట్రస్థాయిలో క్యారమ్స్ డబుల్ విభాగంలో మెడల్ సాధిస్తాం. – రిషిత, నవ్యశ్రీ, కేజీబీవీ, లక్ష్మణచాంద లక్ష్మణచాంద/సారంగాపూర్: ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. కృషి, పట్టుదల, సాధన ఉంటే.. ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఇదే సూత్రాన్ని పాటిస్తూ అటు చదువులో.. ఇటు ఆటల్లో రాణిస్తున్నారు లక్ష్మణచాంద, సారంగాపూర్ కేజీబీవీ విద్యార్థులు. ఇటీవల ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చారు. వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. లక్ష్మణచాంద కేజీబీవీ నుంచి 32 మంది, సారంగాపూర్ కేజీబీవీ నుంచి 15 మంది వివిధ క్రీడాంశాల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హాండ్బాల్, బ్యాడ్మింటన్, కిక్బాక్సింగ్, జావెలిన్త్రో, వెయిట్లిఫ్టింగ్, క్యారమ్స్, కరాటే తదితర పోటీల్లో తమదైన ఆటతీరు ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణతో వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతూ పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారు. వీరిపై సండే స్పెషల్. వెయిట్లిఫ్టింగ్లో.. సారంగాపూర్ మండలం జామ్ కేజీబీవీలో ఇంటర్లో మొదటి సంవత్సరం చదువుతున్న సంహిత 32 కేజీల విభాగంలో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ పోటీపడి అద్భుత ప్రదర్శన కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనకబర్చి మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. బాక్సింగ్ వీడియోలు చూస్తూ.. -
ఉపాధ్యాయుల ప్రోత్సాహమే
జావెలిన్త్రోలో పట్టుసాధించి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చడంతో నాకు రాష్ట్రస్థాయిపోటీల్లో అవకాశం దక్కింది. ఉపాద్యాయుల ప్రోత్సాహంతో అటు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించగలనన్న నమ్మకం నాకుంది. ఈసారి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జావెలిన్త్రోలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తా. – జి.రిషిక, జావెలిన్త్రో క్రీడాకారిణినేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడి ఎస్వో, వ్యాయామ ఉపాధ్యాయురాల సహకారంతో రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో పతకం సాధించేందుకు కఠిన సాధన చేస్తున్నాను. – గంగోత్రి, కేజీబీవీ లక్ష్మణచాంద గతంలో నాకు ఆటలపై ఆసక్తి ఉండేది. అయితే గురుకులంలో చేరాక ఇక్కడ చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కిక్బాక్సింగ్ నేర్చుకున్నా. నా ప్రతిభను గుర్తించిన మా ఉపాద్యాయులు మంచి శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ చాటుకున్నాను. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. – రితిక, కిక్బాక్సింగ్ క్రీడాకారిణి జూడోలో రాణిస్తా.. -
యాప్లో యూరియా.. ఇలా ఈజీ
లక్ష్మణచాంద: అన్నదాతలకు యూరియా కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ రైతులు సులభంగా ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అన్నదాతలు ఎక్కడ నుంచి అయినా యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉంది. షాప్ బయట లైన్లో నిలబడే సమస్య ఉండదు. యాప్ ద్వారా జిల్లా, మండల స్థాయిలో స్టాక్ వివరాలు కూడా తెలుస్తాయి. బుకింగ్ ప్రక్రియ..సందేహాలుంటే సంప్రదించాలి.. యూరియా బుకింగ్పై అన్నదాతలకు ఎలాంటి సందేహాలు ఉన్నా క్లస్టర్ల పరిదిలోని ఏఈవోలను సంప్రదించాలి. మొబైల్ ఫోన్ నంబర్ అనుసంధానం లేకున్నా ఏఈవోలను సంప్రదిస్తే వెంటనే లింక్ చేయడంతోపాటు యూరి యా బుకింగ్ చేయిస్తారు. యూరియా బుకింగ్పై ఎటువంటి ఆందోళన వద్దు. వ్యవసాయ శాఖ అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. – వసంత్రావు, ఏవో విస్తీర్ణం ఆధారంగా బస్తాలు.. -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
నిర్మల్చైన్గేట్: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ బీఎం.వినోద్కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశం శని వారం నిర్వహించారు. అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే కమిటీ, జిల్లాలో పర్యటించిందని, గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులకు ఏ విధమైన పాలసీలు రూపొందించాలన్న విషయంపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబాలతో సమావేశమైందని వివరించారు. జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు ఆయా దేశాల చట్టాలు, కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సు ఉన్న ఏజెన్సీల ద్వారానే కార్మికులు విదేశాలకు వెళ్లేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరఫున టామ్ కామ్ ద్వారా కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. దీనిపై గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన అవసరమన్నారు. గల్ఫ్లో చిక్కుకున్న కార్మికులకు సహాయం అందించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ప్రత్యేక సెల్ అభినందనీయం.. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో గల్ఫ్ కార్మికుల సహాయార్థం హెల్ప్లైన్ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. వివిధ గల్ఫ్లో చిక్కుకున్న పలువురు కార్మికులను కలెక్టర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించామన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయన్నారు. జిల్లాలో గల్ఫ్ కార్మికుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేయడాన్ని ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ అభినందించింది. కమిటీ బృందాన్ని, అధికారులను పలువురు సన్మానించారు. వైస్ చైర్మన్ భీమ్రెడ్డి, సభ్యులు శ్రీనివాసరావు, సింగిరెడ్డి నరేశ్రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంతో విలువైనదని, ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జును కాంగ్రెస్ పార్టీ బీఫాం ఖానాపూర్ ఎమ్మెల్యేను చేసిందని సీఎం రేవంత్రెడ్డి అన్నా రు. ఏపీ, తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ తరగతులకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ నాగోబా జాతరకు వెళ్లినప్పుడు సామాన్య కార్యకర్త యాక్టివ్గా ఉండడంతో అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నానన్నారు. వారి తల్లిదండ్రులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అదే అతని బ్యాక్గ్రౌండ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీఫాం ఇవ్వడంతో ఎమ్మెల్యే అయ్యాడన్నారు. ఈ క్యాంప్లో పార్టీ సిద్దాంతాలు, చరిత్ర, సంస్థాగత నిర్మాణం, బూత్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా వినియోగం, ప్రజాసమస్యలపై పోరా టంపై అవగాహన కల్పించారు. మాట్లాడుతున్న సీఎం, ఆసక్తిగా వింటున్న బొజ్జు26న హిందూ మహాసభ సమ్మేళనం నిర్మల్చైన్గేట్: వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలో మహాసభ సంతు సమ్మేళనం(హిందూ జూడో మహాసభ) నిర్వహించనున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షుడు గంగాధర్ పటేల్, అధ్యక్షులు శంకర్ పటేల్ తెలిపారు. నిర్మల్ వీరశైవ లింగాయత్ సంఘ భవనంలో జిల్లా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ, లింగ ధర్మం ప్రచారం, మహా త్మ బసవేశ్వర ఆశయాలు, సమాజంలో శాంతి స్థాపనకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని వివరించారు. సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు, మహరాజు లు, మహారుషులు హాజరవుతునారని తెలిపా రు. పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత్ బంధువులు, ప్రజలు హాజరు కావాలని పేర్కొన్నారు. -
నిర్మల్
కేజీబీవీలో కరాటే సాధన చేస్తున్న బాలికలురాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిర్మల్ టౌన్: హైదరాబాద్లో జరుగుతున్న సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. శనివారం జరిగిన తైక్వాండో పోటీల్లో నేహాల్, జోయా, శ్రీహాన్ కాంస్య పతకాలు సాధించారని కోచ్ వంశీకృష్ణ తెలిపారు. వీరిని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, పీఈటీలు, పీడీలు అభినందించారు. పతకం సాధిస్తాం -
జిల్లా కళాకారుడికి ప్రశంస
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన వర్ధమాన గాయకుడు, సంగీత బృందం నిర్వాహకుడు రాజుల నాగరాజును గానకోకిల, ప్రముఖ సీనియర్ సినీ నేపథ్య గాయని పి.సుశీలమ్మ ప్రశంసించారు. హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో శనివా రం నిర్వహించిన కార్యక్రమంలో నాగరాజు తన ఆర్కెస్ట్రా బృందంతో కలిసి సుశీలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు ప్రతిభను అభినందించిన సుశీలమ్మ, సంగీత రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. జిల్లాకు చెందిన నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్లోని పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమవుతున్న సంగీత కార్యక్రమాల్లో తన గానంతో ప్రేక్షకులను అలరిస్తూ గుర్తింపు పొందుతున్నారు.సుశీలమ్మతో జిల్లా కళాకారుడు నాగరాజు -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
నిర్మల్ రూరల్: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి జాదవ్ పరుశురాంనాయక్ తెలిపారు. ఇప్పటికే పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి ’తో మాట్లాడారు. సాక్షి: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరుకానున్నారు? డీఐఈవో: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 13,125 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం 6,652 మంది, ద్వితీయ సంవత్సరం 6,473 మంది రాయనున్నారు. సాక్షి: పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ? డీఐఈవో: పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశాం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు? డీఐఈవో:మొత్తం 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో జిల్లా కేంద్రంలో 8, భైంసాలో 3, ఖానాపూర్, ముధోల్లో 2, తానూర్, కుభీర్, లోకేశ్వరం, కుంటాల, దిలావర్పూర్, సారంగాపూర్, మామడ, కడెంలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశాం. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? డీఐఈవో:ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, రెండు సెట్టింగ్స్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశాం. ప్రతీ సెంటర్కు ఒక సీఎస్, ఒక డీవో ఉంటారు. ఇప్పటికే వీరికి ట్రైనింగ్ పూర్తిచేసాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో గదిలో 25 నుంచి 30 మందికి ఒక ఇన్విజిలేటర్ను నియమించాం. సాక్షి: విద్యార్థులకు హాల్టికెట్లను ఎప్పటినుంచి అందిస్తారు? డీఐఈవో:ఇప్పటికే సంబంధిత ప్రిన్సిపాళ్లు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు వచ్చే లింకు డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్లు తీసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తాం. హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుస్తుంది. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి? డీఐఈవో:అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షల్లో 24 పేజీల సమాధానపత్రం అందజేస్తాం. అందులో మాత్రమే జవాబులు రాయాలి. అడిషనల్ పేపర్లు ఇవ్వబడవు. ప్రశాంతంగా పరీక్షలు రాయండి. విజయీభవ. -
ఫర్నిచర్ తరలిస్తున్న లారీ పట్టివేత
జన్నారం: అక్రమంగా ఫర్నిచర్ తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. గురువారం రాత్రి జన్నారం నుంచి తాళ్లపేట్ వైపు వెళ్తున్న లారీని తపాలాపూర్ చెక్పోస్టు వద్ద బీట్ అధికారి జ్యోతి తనిఖీ చేశారు. అందులో ఫర్నిచర్ కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సెక్షన్ అధికారి శంకర్, బీట్ అధికారులు సాయి, కృష్ణమూర్తి, బేస్క్యాంపు సిబ్బంది పట్టుకున్న లారీని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈమేరకు విచారణ చేస్తున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం.. ఆదిలాబాద్టౌన్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని చిల్కూరిలక్ష్మినగర్కు చెందిన షేక్ ఇమ్రాన్ అహ్మద్ మహారాష్ట్రకు చెందిన సాహూకు బియ్యాన్ని విక్రయించేందుకు ఆటోలో తరలిస్తున్నాడు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొలిపూర ప్రాంతంలో ఆటో తనిఖీ చేసి బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ బి.సునీల్కుమార్ తెలిపారు. ఆటో సీజ్ చేయడంతోపాటు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఖానాపూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పెంబి ఎస్సై హన్మాండ్లు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బావాపూర్(ఆర్) తండా పంచాయతీ పరిధిలోని పంగిడిగూడెంకు చెందిన తొడసం మారుతి(40) మానసిక స్థితి సరిగా లేదు. మద్యానికి బానిసయ్యాడు. తాగిన మత్తులో ఈనెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్తంభాన్ని ఢీకొట్టిన కారుభైంసారూరల్: మండలంలోని సుంక్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఒక్కసారిగా ఎయిర్బ్యాగ్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని వానల్పాడ్ నుంచి సుంక్లి గ్రామానికి సాయారెడ్డి, శ్రీనివాస్ కారులో వెళ్తున్నారు. శుక్రవారం పోచమ్మ ఆలయం వద్ద అదుపుతప్పి స్తంభానికి, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కారు, స్కూటీ దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యభైంసారూరల్: ఉరివేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వాడి గ్రామానికి చెందిన కల్యాణ్ సంతోశ్(44), గీతాబాయి దంపతులు. భర్త కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని కల్యాణ్ సంతోష్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో గురువారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. శుక్రవారం కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కమ్మనైన అమ్మ భాష
ఆదిలాబాద్: మాతృభాషలోని మాధుర్యం..మరే భాషలోనూ కనిపించదు. ప్రతి చిన్నారి అమ్మ భాషలోనే అనంతమైన జ్ఞానాన్ని సంపాదిస్తుంది. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా, విద్యార్థి మాతృభాషలో విద్యనభ్యసిస్తేనే ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎన్నో పరిశోధనలు తేటతెల్లం చేశాయి. భారత ఉపఖండంలో ఏ భాషకదే తనకంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఎన్నో భాషలు ఉన్న భారత ఉపఖండంలో దేనికదే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పాశ్చాత్య ప్రభావంతో స్థానిక భాషల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాతృభాష ప్రాధాన్యత తెలియజేయాలనే ‘యునెస్కో’గుర్తించింది. 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి ఏటా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. నేపథ్యం.. 1947లో పాకిస్తాన్ దేశంగా ఏర్పడినప్పుడు, ప్రభు త్వం ఉర్దూ భాషను అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రజల మాతృభాష బెంగాలీ. దానికి సమాన గౌరవం ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. 1952, ఫి బ్రవరి 21న ఢాకాలో విద్యార్థులు శాంతి యుత ప్రదర్శన చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు ప్రా ణాలు కోల్పోయా రు. మాతృభాష కోసం ప్రాణాలర్పించడాన్ని గుర్తి స్తూ యూనెస్కో 1999లో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. యునెస్కో నివేదిక ప్రకారం.. లాంగ్వేజ్ మ్యాటర్స్, గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీ లిం గ్వల్ ఎడ్యుకేషన్ అనే నివేదికను వెలువరించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు అర్థం కాని భాషలో విద్య అభ్యసిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. ఫలితంగా ఆ భాషతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వం కూడా అంతమైపోతోందని వివరించింది. ప్రాథమిక విద్యలో కనీసం 6 నుంచి 8 ఏళ్లవరకు మాతృభాషలోనే బోధన సాగాలని యునెస్కో సూచించింది. ‘తల్లి గర్భం నుంచి బయట పడగానే ఏ ఏడుపు ఏడ్చావో.. అదే నీ భాష. పరభాష జ్ఞానం కోసం నేర్చుకో, కా నీ మాతృభాషను ప్రాణం కోసం కాపాడుకో. తెలు గువాడవై ఉండి మాట్లాడకపోవడం నీకు సిగ్గుచేటు. సొంత భాషను నిర్లక్ష్యం చేయడం అంటే నీ అస్తిత్వాన్ని నువ్వే చంపుకోవడం. ఏ భాషలోనైనా పాండిత్యం సంపాదించు, కానీ భావవ్యక్తీకరణకు మా త్రం నీ కన్నతల్లి లాంటి మాతృభాషనే శరణ్యం.’– ప్రజాకవి కాళోజీ నారాయణరావు‘ఏ భాషకై నా దానికి సంబంధించిన యాసలోనే అసలైన అందం, మాధుర్యం ఉంటాయి. పరభాషలో ఎంతటి పాండిత్యం సంపాదించినా, మన అంతరంగంలోని లోతైన భావాలు సహజంగా వ్యక్తపర్చడానికి మాతృభాషనే శరణ్యం. భాష అనేది ఒక జాతి సంస్కృతికి, చరిత్రకు సజీవ ప్రతిబింబం. మాతృభాషను మర్చిపోవడం అంటే మన మూలాలు, అస్తిత్వాన్ని మనమే కోల్పోవడమే.’– సామల సదాశివ మాస్టర్ -
ఉత్తమ అవార్డులు అందుకుని..
జెడ్పీఎస్ఎస్ కూర పాఠశాలలో హెడావు శ్రావణి 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు దీపక్–దీపిక. చిన్న వయసులోనే కథలను రాస్తూ అబ్బురపరుస్తోంది. ఆమె ప్రతిభకు నిదర్శనంగా తెలంగాణ సరస్వత పరిషత్ నుంచి వరుసగా 2024, 2025 సంవత్సరా లకు గాను ఉత్తమ కథ రచయిత అవార్డులు అందుకుంది. ఆమె రాసిన 10 కథల్లో నాలుగు ప్రముఖ పత్రికల్లో ముద్రితమవ్వవడం మరో విశేషం. భావ వ్యక్తీకరణలో పరిణతి, శైలిలో స్పష్టతతో కథలు రాస్తున్న శ్రావణి తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు అనంతరం అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రులు చిన్నారులకు అర్చకులతో అక్షరాభ్యాసం చేయించారు. అలాగే కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. సీఐ కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి, ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈవో గంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులు వివిధ ఆర్జితసేవ, ప్రత్యేక అక్షరాభ్యాసం, చండీహోమం, అభిషేకం, లడ్డూ ప్రసాదం, పులిహోర మండపప్రవేశం, కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.11,472,50 ఆదాయం సమకూరింది. దాడిచేసిన నలుగురిపై కేసునెన్నెల: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, డోబ్బులు శంకరి, ఓరం మల్లయ్య, వేల్పుల సంపత్ దాడి చేశారు. మామిడితోటలో చెట్లు కత్తరింపు చేయిస్తున్న భార్యభర్తలపై దాడి చేసి దుర్బాషలాడి చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాసరలో హాల్టింగ్ ఇంకెప్పుడో?
భైంసా: బాసర రైల్వేస్టేషన్లో కొన్ని రైళ్లు ఆగుతున్నా ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్లకు హాల్టింగ్ లేదు. బాసర క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు రైలుమార్గం ద్వారా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ రైళ్లన్నీ నిలపకపోవడం, అన్ని ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్లు స్టాఫ్ లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన నగరాల నుంచి నిజామాబాద్కు స్టాఫ్ ఉంది. యాత్రికులు, విద్యార్థులు అక్కడే దిగి ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. రైల్వే ఆదాయం పెంచే స్టేషన్గా బాసర ఉన్న ఆ శాఖ అధికారులు ఏళ్లుగా పట్టించుకోవడం లేదు. తిరుపతి–అమరావతి, హైదరాబాద్–జైపూర్ వంటి ప్రతిష్టాత్మక రైళ్లు బాసర స్టేసన్ మీదుగా దూసుకుపోతున్నాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయానికై నా రైళ్లన్నీ నిలిపేలా ఆశాఖ అధికారులపై ఇక్కడి ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడే ఆగిపోతున్నాయి తిరుపతి నుంచి వచ్చే రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్లోనే నిలిచిపోతుంది. ఈ రైలు బాసర వరకు పొడగించాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉన్న స్పందన లేదు. బాసర సమీప రైల్వే స్టేషన్ వరకు వస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో నిత్యం వేల సంఖ్యలో యాత్రికులు ప్రయాణిస్తారు. బాసరకు 35 కి.మీ దూరంలో ఈ రైలు నిలిచిపోతుంది. ప్రతీరోజు ఉదయం 9 గంటలకు నిజామాబాద్కు చేరుకుని తిరిగి మధ్యాహ్నం 1 గంటకు రైలు బయల్దేరుతుంది. ఈ రైలు ఇక్కడి వరకు పొడగిస్తే బాసర క్షేత్రం నుంచి తిరుపతి వరకు వెళ్లే వీలుంటుంది. మరోవైపు 12 కి.మీ దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ వరకు మరట్వాడా ఎక్స్ప్రెస్ బాసర వరకు పొడిగించడం లేదు. మహారాష్ట్ర నుంచి రాత్రి 11 గంటలకు ధర్మాబాద్ వచ్చి వేకువజామున 4 గంటలకు వెళ్లే ఈ రైలు బాసర వరకు పొడిగించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇక కరీంనగర్, కాచిగూడ డెమో రైళ్లు నిజామాబాద్కే పరిమితమవుతున్నాయి. ఈ రైళ్లను ఇక్కడి వరకు పొడిగిస్తే లోకల్ యాత్రికులకు ఎంతో ఉపయోగపడుతుంది.బాసర స్టేషన్లో ఆగని రైళ్లు.. తిరుపతి– అమరావతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్–జైపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అజ్మీర్–రామేశ్వరం హామ్సఫర్ ఎక్స్ప్రెస్ రామేశ్వరం–ఓకా వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుపతి–అకోల స్పెషల్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్–జైపూర్ ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్–ఇండోర్ వీక్లీ ఎక్స్ప్రెస్


