breaking news
Nirmal
-
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు రెండు, మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆదుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ రామారావు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చాలామంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు పూర్తి చేశారని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈనెల 30 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, ఈలోగా చెల్లింపులు జరపకపోతే డిసెంబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్త పనులను కూడా చేపట్టబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు వై.విద్యాసాగర్రావు, లక్కడి జగన్మోహన్రెడ్డి, ప్రకాశ్ ధనానివాల, సదాశివరెడ్డి, దేవేందర్రావు, హరిమోహన్రావు, శ్రీధర్రావు, అరుణ్రెడ్డి పాల్గొన్నారు. -
మన రోడ్లూ డేంజరే!
నిర్మల్టౌన్: రంగారెడ్డి జిల్లా మీర్చాగూడ వద్ద రోడ్డుపై ఉన్న ఒక గుంత కారణంగా 19 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. కంకర లోడ్తో వస్తు న్న టిప్పర్ గుంతను తప్పించబోయి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తర్వాత కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడింది. ఈ ఘటన సంచలనంగా మారింది. రోడ్లపై గుంతలు, వాహనాల ఓవర్లోడ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. ఇక మన జిల్లాలోనూ రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ లోడ్ వాహనాలను పట్టించుకునేవారే లేరు. నిర్మాణ లోపాలు.. జిల్లా కేంద్రంలో రహదారులు వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు పడ్డాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలు హానికరంగా మారాయి. అయినా మరమ్మతులు చేపట్టకపోవడం, కొత్త రోడ్లు నిర్మించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. బస్సుల్లోనూ ఓవర్ లోడ్.. ఇక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలోనే కాదు. ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్నీ రెట్టింపు అయింది. గతంలో 60 నుంచి 70 శాతం ఉండే ఆక్యుపెన్సీ ఇప్పుడు 120 నుంచి 150 శాతం ఉంటుంది. అంటే 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ ఓవర్లోడ్ కారణంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయినా రవాణా అధికారులు, ఆర్టీసీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా మీదుగా రెండు హైవేలు.. జిల్లాలో రెండు హైవేలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిర్మల్ మీదుగా జగిత్యాల వరకు 61వ నంబర్ జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ఎన్హెచ్ 44. జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే ఈ రెండు రోడ్లే జిల్లా రవాణా వ్యవస్థకు, రాకపోకలకు ఆధారం. వీటిపైనే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్హెచ్–44 బైపాస్ రోడ్డుపై ఈ ఏడాది ఇప్పటికే పది ప్రమాదాలు జరిగాయి. ఎన్హెచ్–61 కూడా ప్రమాదాలకు నెలవుగా మారింది. ఓవర్లోడ్తో ప్రమాదాలు.. రహదారులపై భారీ వాహనాలు ఓవర్లోడ్తో దూసుకెళ్తున్నాయి. రోడ్లు బాగా లేకపోయినా నిబంధనలకు విరద్ధుంగా ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. రహదారి నిబంధనలు, రవాణా శాఖ నియమాలు (లారీ, టిప్పర్, ట్రాక్టర్లు) పాటించటం లేదు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 10 టైర్ల లారీ , టిప్పర్లలో 28 టన్నులకు మించి బరువు తరలించకూడదు. 12 టైర్ల వాహనంలో 31 టన్నులు, 16 టైర్ల వాహనాలలో 41 టన్నుల బరువు మాత్రమే తరలించాలి. కానీ ఏ ఒక్క వాహనం కూడా ఈ నిబంధనాలను పాటించడం లేదు. -
ఆన్లైన్లో ఆదాయ వ్యయాలు!
నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఏటా వివిధ రకాల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఈ నిధుల ఖర్చులను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిధులు సద్వినియోగమయ్యాయా లేక దుర్వినియోగమయ్యాయా అనే అంశాన్ని తేలుస్తారు. ఈ నేపథ్యంలో 2024–25 నిధుల వినియోగంపై జిల్లాలో ఆడిట్ అధికారులు లెక్కలు తేలుస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్ర–రాష్ట్ర పథకాల ద్వారా అందిన నిధుల వినియోగంలో పారదర్శకత ఎంత కలిగింది, ఖర్చు, ఆదాయ వ్యవస్థ ఎంత సమగ్రమైందనే అంశాలపై వ్యయ పరిశీలన జరుగుతోంది. మండల–జిల్లా పరిషత్తుల్లో.. పంచాయతీలకు స్థానిక ఆదాయ వనరులతోపాటు ఎస్ఎఫ్సీ 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు కలిపి ప్రభుత్వం ఇస్తున్న మంజూరులను, వినియోగ లెక్కలను సేకరిస్తున్నా రు. ఇంటిపన్ను, వ్యాపార లైసెన్సు వంటి స్థాని క ఆదాయ విషయాల్లోనూ వసూలు అవకాశాలను, జరిమానాలను ట్రాక్ చేస్తున్నారు. ఇదే విధంగా, మున్సిపల్ కార్యాలయాల్లో అర్బన్ డెవలప్మెంట్, ప్రాంతీయ పన్ను ఆదాయ అంశాలను పరిశీలిస్తున్నారు. ఆలయాలు, మార్కెట్ కమిటీలు వంటి సంస్థలకు కూడా ఆదాయ–ఖర్చు పరిశీలన వ్యాప్తంగా సాగుతోంది. ఆన్లైన్లో నమోదు.. ఆడిట్ పూర్తయిన వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గతంలో మాన్యువల్గా నిర్వహించేవారు, నాలుగేళ్లుగా నూతన ఆధునికీకరణ విధానానికి మారారు. ఆడిట్ నిర్వాహకుడు, ముగ్గురు జూనియర్, ఆరుగురు సీనియర్, ఒక అసిస్టెంట్తో మొత్తం తొమ్మిది మందితో సమగ్ర తనిఖీ జరుగుతోంది. జిల్లాలో ఆడిట్ వివరాలు కార్యాలయం మొత్తం పూర్తయినవి మండల పరిషత్ 18 16 గ్రామ పంచాయతీ 396 394 మున్సిపాలిటీ 3 3 మార్కెట్ కమిటీ 5 5 ఆలయాలు 5 4 జిల్లా పరిషత్ 1 0 -
జాబ్ ట్రైనింగ్పై అవగాహన
ఖానాపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఒకేషనల్ విభాగంలో చదువుతున్న విద్యార్థులకు జాబ్ ట్రైనింగ్తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రిన్సిపాల్ ఆనందం అన్నారు. కళాశాలలో ఒకేషనల్ విద్యార్థుల జాబ్ట్రైనింగ్ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడారు. ఒకేషనల్ విభాగంలోని అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, ఆఫీస్ అసిస్టెంట్, ఈటీ కోర్సుల విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కళాశాల ప్రారంభం నుంచి థియరీ క్లాసులకు హాజరైన విద్యార్థులకు జాబ్ట్రైనింగ్ ద్వారా ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ సరిత, అధ్యాపకులు శ్రీదేవి, హమీద్, నాగరాజు, జాకబ్, రఘువీర్, బాపు, సుభాష్ తదితరులు ఉన్నారు. -
వడ్ల కొనుగోళ్లకు కొత్త సాంకేతికత
లక్ష్మణచాంద: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాల గుర్తింపునకు ఇప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా 317 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, ప్రతీ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచింది. గ్రేయిన్ క్యాలీఫర్.. ధాన్యాన్ని రకాల వారీగా గుర్తించడంలో గ్రేయిన్ క్యాలీఫర్ కీలకపాత్ర పోషిస్తోంది. ధాన్యంలో ఉన్న బియ్యం గింజ పొడవు, వెడల్పు వంటి ప్రమాణా లను పరికరం ద్వారా లెక్కించి సన్న, దొడ్డు రకా లని తేలుస్తున్నారు. వరి సంచులపై ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గుర్తుల ద్వారా రైతులకు తెలిసేలా చేస్తున్నారు. రైతులు తెచ్చిన సన్న రకాలను ప్యాడీ పాస్కల్తో పిడికెడు ధాన్యం పోసి తిప్పితే ధాన్యంపై గల పొట్టు ఊడి పోతుంది. అప్పుడు బియ్యం గింజ బయటకు వస్తుంది. పొట్టు తీసిన బియ్యం గింజను గ్రేయిన్ క్యాలీఫర్లో వేస్తారు. గింజ పొడవు, వెడల్పు లెక్కించి వచ్చిన శాతం ఆధారంగా వాటిని సన్న రకాలుగా గుర్తిస్తున్నారు. కౌలు రైతులకు డిజిటల్ అనుమతి కౌలు రైతుల కోసం స్వచ్ఛమైన అనుమతి విధానం ప్రవేశపెట్టారు. యజమాని–రైతు ఆధార్ల అనుసంధానం, ఓటీపీ ధ్రువీకరణ వంటి మునుపటి దశలను పూర్తి చేసినప్పుడే కొనుగోళ్లకు వీలు ఉంటుంది. ఇది అత్యధిక భద్రతతోపాటు నేరుగా రైతుఖాతాలోనే చెల్లింపు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన డిజిటల్ ఏర్పాటుగా నిలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్కు 1.69 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రకాల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచి, రైతులకు అన్ని విధాలుగా మేలును అందించటానికి నూతన వేదిక సిద్ధమైంది. -
ఘనంగా బిర్సాముండా జయంత్యుత్సవాలు
నిర్మల్ రూరల్: గిరిజన జాతీయ నాయకుడు బిర్సాముండా జయంత్యుత్సవాలు జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ పాఠశాలలో బిర్సాముండా చిత్రపటానికి ఏసీఎంవో శివాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు. బిర్సా ముండా జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. నవంబర్ 15 బిర్సా ముండా జయంతి సందర్భంగా 10 రోజులు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో ఉపాధ్యాయులు రమేశ్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. -
‘సంఘ’టిత సమాజమే లక్ష్యం
నిర్మల్: నిత్య శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణం చేయడంతోపాటు సంఘటిత సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్సంఘ్ లక్ష్యమని ఆర్ఎస్ ఎస్ దక్షిణమధ్య(తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక)క్షేత్ర ప్రచారక్ శ్రీరాం భరత్కుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం శతాబ్ది ఉత్సవం, పథసంచలన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానవక్తగా భరత్కుమార్ హాజరై మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ ‘పంచపరివర్తన’ పేరిట ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్నారు. కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసతతో సమాజం ఏకం కావాలని, పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని, మనదైన కుటుంబవ్యవస్థను, అలాగే సంస్కృతిని కాపాడుకోవాల ని, ఇక ఈ దేశపౌరులుగా ఇక్కడి చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలన్న ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ‘వసుదైక కుటుంబకం’లా ప్రపంచం ఉండాలన్న లక్ష్యంతో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని తెలిపారు. అయోధ్యలో ఉన్నది కేవలం రాముడి విగ్రహం కాదని, ఆ రూపంలో ఉన్న ఆదర్శమూర్తి అని వివరించారు. హిందువుగా జీవించాలి.. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందని విశిష్ట అతిథి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంకే.సింగ్ అ న్నారు. ఆర్ఎస్ఎస్ చేస్తున్న సమాజ సంఘటనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అథితి డాక్టర్ చిటికేశి శ్రీనివాస్ మాట్లాడుతూ వందేళ్లు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆర్ఎస్ ఎస్ నిలబడిందన్నారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ చాలక్ నిమ్మల ప్రతాప్రెడ్డి, జిల్లా, నగర చాలక్లు నూకల విజయ్కుమార్, ప్రమోద్చంద్రారెడ్డి, జిల్లా సహసంచాలక్ కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న పథసంచలన్.. ఒకే రకమైన గణవేశ(యూనిఫాం)తో స్వయం సేవకులు నిర్మల్ పురవీధులలో చేపట్టిన పథసంచలన్ ఆకట్టుకుంది. ఏఎన్రెడ్డి కాలనీ, ఆర్కే కన్వెన్షన్, దేవరకోట దేవస్థానం మూడుచోట్ల నుంచి బయలుదేరిన ర్యాలీలు స్థానిక జయశంకర్ సర్కిల్లో కలిశాయి. అక్కడి నుంచి అంబేద్కర్చౌక్ వరకు వెళ్లి, తిరిగి ఎన్టీఆర్ మినీస్టేడియం చేరుకున్నారు. పథసంచలనంలో దారిపొడవునా భగవధ్వజాలకు, స్వయంసేవకులకు మహిళలు మంగళహారతులు పట్టారు. పూలు చల్లారు. అనంతరం ఎన్టీఆర్ మినీస్టేడియంలో ధ్వజారోహణం, శతాబ్ది ఉత్సవం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, సీనియర్ నేతలు సత్యనారాయణగౌడ్, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యే పూర్తి గణవేశతో పథసంచలన్లో పాల్గొని నడవడం అందరినీ ఆకట్టుకుంది. పలువురు చిన్నారులూ ఆర్ఎస్ఎస్ గణవేశ, ఝాన్సీరాణి వేషధారణల్లో అలరించారు. వేదికపై శ్రీరాం భరత్కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఎంకే.సింగ్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి తదితరులుఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంసేవకులు -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: ఆర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
సరిహద్దులో పటిష్ట గస్తీ
తానూరు: సరిహద్దులో అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధి కారులను ఆదేశించారు. తానూరు మండలం బెల్తరోడాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సోమవారం తనిఖీ చేశారు. జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న, కొనుగోళ్లు ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంటలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోకి ప్రవేశించే వాహనం తనిఖీ చేయాలని సూచించారు. తని ఖీ చేసిన వాహనాల వివరాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని చెప్పారు. కలెక్టర్ వెంట భైంసా సబ్కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, డీఏవో అంజిప్రసాద్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్ ఉన్నారు. -
విద్యార్థుల ఇంటికి అధ్యాపకులు
లక్ష్మణచాంద: కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు అధ్యాపకులు వెళ్లి కళాశాలకు పంపాలని తల్లిదండ్రులకు నోటీసులు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు హాజరు నమోదు అమలవుతోంది. కళాశాలకు సక్రమంగా రానివిద్యార్థుల తల్లి దండ్రులకు నోటీసులు అందజేయాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్, ఒడ్డెపెల్లి గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థుల ఇళ్లకు మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అధ్యాపకులు వచ్చి హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు అందజేశారు. ఇకనుంచైనా క్రమం తప్పకుండా కాలేజీకి పంపాలని సూచించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రతీ విద్యార్థి నిత్యం కళాశాలకు హాజరుకావాలన్నారు. ఇందులో అధ్యాపకులు పురుషోత్తం, రాజు, సుమన్ తదితరులు ఉన్నారు. -
తేమ విషయంలో ఆందోళన వద్దు
భైంసాటౌన్: సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు తేమ విషయంలో ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ కాటన్ యార్డులో సీసీఐ కొనుగోళ్లను సోమవారం ప్రారంభించారు. రైతులు సీసీఐ కేంద్రాలకు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ శాతం విషయంలో అధికారులు సహకరిస్తారని భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, యాప్లో స్లాట్ బుకింగ్కు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. మార్కెట్ యార్డుల్లో తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, కంట్రోల్ రూమ్ వంటి వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈసారి జిల్లాలో 1,41,455 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 11,08, 646 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాల కారణంగా తేమ శాతం విషయంలో అధికారులు సడలింపు ఇవ్వాలన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో కలెక్టర్, ఎమ్మెల్యే సోయా కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రతీ గింజ సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దశలవారీగా టోకెన్లు జారీ చేసి పంట కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్, మార్కెటింగ్ ఏడీ గజానన్, డీఏవో అంజిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో నీరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అడెల్లి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఖాళీగా ఉన్న రెండు ధర్మకర్తల స్థానాలకు సోమవారం ఆలయ ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. అడెల్లికి చెందిన కొత్తపల్లి అనసూయ, మామిడి నారాయణరెడ్డి ధర్మకర్త పదవికి దరఖాస్తు చేసుకోగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అబ్దుల్హాదీ, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, కౌట్ల(బి) పీఏసీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, దేవరకోట దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు విలాస్రావు, కార్యదర్శి ముత్యంరెడ్డి, కేఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
నిర్మల్టౌన్: నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిదులు డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్క్లబ్లో జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కళాశాల యజమాన్యాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు మొత్తం నాలుగేళ్ల ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నిధులు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. నిధులు లేకుండా కళాశాలలు నడపడం సాధ్యం కావడంలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,700 కోట్ల రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. ఈనెల 3 నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేసే వరకు కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో టీపీడీఎంఏ జిల్లా అధ్యక్షుడు నవీన్గౌడ్, సెక్రెటరీ అఖిలేష్సింగ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీహెచ్.వెంకట్రెడ్డి, ప్రవీణ్కుమార్, గంగాధర్, వెంకటేశ్, సునీల్కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ రేటింగ్పై రీసర్వే
నిర్మల్9భూ సమస్యలు వెంటనే పరిష్కరించండి కుంటాల: భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త హసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారికి సత్వరమే అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, డీటీ రాకేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దత్తూరాం పటేల్, సీసీ ముత్యం పాల్గొన్నారు. లక్ష్మణచాంద: స్వచ్ఛ, హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ వసతుల వివరాలను ఫొటోలతో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. జిల్లాలో మొత్తం 1,053 పాఠశాలలు వివరాలు నమోదు చేయగా, వాటిలో 14 పాఠశాలలు 5 స్టార్, 288 పాఠశాలలు 4 స్టార్ రేటింగ్ పొందాయి. ఈ 302 పాఠశాలల్లో సమర్పించిన వివరాల నిజనిర్ధారణ కోసం జిల్లా విద్యాశాఖ రీసర్వే ప్రారంభించింది. వేగంగా రీసర్వే.. జిల్లా విద్యాధికారి భోజన్న ఆధ్వర్యంలో 48 కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు 5 స్టార్, 4 స్టార్ సాధించిన పాఠశాలల్లో ఒక్కొక్కరు 6 నుంచి 10 పాఠశాలల చొప్పున రీసర్వే చేస్తున్నారు. ఈ సర్వే అక్టోబర్ 26న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 262 పాఠశాలల్లో పూర్తయింది. మిగిలిన 40 పాఠశాలల సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని డీఈవో ఆదేశించారు. పారదర్శకంగా.. సర్వేలో పారదర్శకత కోసం ఒక క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడిని ఇతర క్లస్టర్ పరిధిలోని పాఠశాలలకు పంపి సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో అప్లోడ్ చేసిన వివరాలు క్షేత్రస్థాయిలో లభించనప్పుడు ఆ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు. పాఠశాలలు సమర్పించిన ఆరు విభాగాలపై 60 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను ప్రతీ అంశం వారీగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం పాఠశాలలు పొందిన స్టార్ రేటింగ్ నిలుస్తుందో లేదో తుది నివేదికలో నిర్ణయించనున్నారు. రాష్ట్రస్థాయికి ఎనిమిది పాఠశాలలు రీసర్వే పూర్తయిన వెంటనే జిల్లా కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి సిఫారసు చేయనున్నారు. వీటిలో రూరల్ విభాగంలో మూడు ప్రాథమిక పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు, అర్బన్ విభాగంలో ఒక ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాల ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తుది ఎంపిక రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర బృందం మళ్లీ ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. ఈ క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్ర బృందం సమర్పించే తుది నివేదిక ఆధారంగా జిల్లా నుండి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పారితోషికం అందజేయనున్నారు. జిల్లా సమాచారం.... జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,053 5 స్టార్ 14 4 స్టార్ 288 3 స్టార్ 537 2 స్టార్ 139 1 స్టార్ 75 -
ఐఎంఏ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా రామకృష్ణ
నిర్మల్చైన్గేట్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కరీంనగర్లో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నిర్మల్కు చెందిన డాక్టర్ యూ.రా మకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణను గజ మాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, సీనియ ర్ వైద్యులు అప్పాల చక్రధరి, రమేశ్, కృష్ణంరాజు, శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, సురేశ్, సంతోష్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
అడెల్లిలో భక్తుల సందడి సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాతోపాటు నిజమాబాద్, కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణ శిలలతో నూతనంగా నిర్మించిన అడెల్లి పోచమ్మ ఆలయం కొత్త గుడిలోకి.. అడెల్లి పోచమ్మనిర్మల్: పసుపుతో మెరుస్తున్న నిండైన రూపం.. నుదుట ఎర్రగా దీప్తించే కుంకుమ, చేతిలో త్రిశూలం, కళ్లల్లో కరుణారసమయమైన చూపు.. ఇదే అడెల్లి పోచమ్మ రూపం. తన పిల్లలను రక్షించే శక్తిగా అమ్మవారు.. జిల్లా ఇలవేల్పుగా భక్తుల మదిలో కొలువై ఉన్నారు. ప్రతీ ఇంటి ఆడబిడ్డగా పూజలందుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టమచ్చినా.. అమ్మా.. అడెల్లి పోశవ్వా ఆదుకో అని కోరితే చాలు.. తల్లి సల్లంగ చూస్తూ ఓదార్పునిస్తుందని భక్తుల విశ్వాసం. జిల్లా ఆడబిడ్డ ఇప్పుడు కొత్త గుడిలో కొలువుదీరబోతోంది. సారంగపూర్ మండలంలోని పచ్చని పర్వతాలచాటున వెలసిన ఈ పవిత్ర క్షేత్రం ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు ఎక్కువగా పూజిస్తారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో పునఃప్రతిష్టించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఈనెల 7 వరకు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వాసానికి ప్రతిరూపం.. అడెల్లి పోచమ్మ పేరు ప్రజలలో మాతృస్నేహానికి దర్పణం. పుట్టినబిడ్డకు భోజన్న, భోజవ్వ, పోశెట్టి, పోశమ్మ వంటి పేర్లు పెట్టే ఆచారం ఈ దేవత నుంచి పుట్టింది. పుట్టుకనుంచి వివాహానికి, జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికి ముందు అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. అడెల్లి పోచమ్మ దీవెనలు ఉంటే పనులన్నీ నిరాటంకంగా జరుగుతాయని నమ్ముతారు. పార్వతీపరమేశ్వరుల బిడ్డనే.. అడెల్లి అంటేనే నిండా పచ్చదనంతో ఉండే అడవితల్లి ఖిల్లా. సారంగపూర్ మండలంలో పరవశింపజేసే ప్రకృతిఒడిలోనే పోచమ్మ కొలువైంది. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతమంతా తీవ్ర కరువు, దుర్భిక్షం ఏర్పడిందట. వందలమంది ప్రాణాలు కోల్పోయారట. అప్పుడు ఇక్కడి ప్రజలందరూ పరమశివున్ని వేడుకున్నారట. ఆ పరమేశ్వరుడు కరుణించి తన బిడ్డగా పోచమ్మ ఈప్రాంతంలో కొలువుదీరి ప్రజల కష్టాలను తీరుస్తుందని చెప్పారట. అలా కొలువుదీరే పోచమ్మ కోసం ఓగద్దెను కట్టాలని పరశురాముడిని శివుడు ఆదేశించాడట. అలా ఆ తల్లి ఇక్కడ పరశురామ నిర్మితమైన గద్దైపె స్వయంభూగా వెలసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో సుభిక్షంగా మారిందని ప్రజల నమ్మకం. -
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
భైంసాటౌన్: జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్, భైంసా, కుభీర్, సారంగపూర్ మండల కేంద్రాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో దళారులు, వ్యాపారులు టీఆర్(తాత్కాలిక రిజిస్ట్రేషన్)లతో రైతుల పేరిట సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈసారి మరింత పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు జరిపేందుకు కేంద్రం కపాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో పత్తి విక్రయించే రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఇంకా ఎవరికై నా సందేహాలుంటే సీసీఐ కేంద్రాల వద్ద సీసీఐ సిబ్బంది నివృత్తి చేస్తారని భైంసా ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ ‘సాక్షి’తో తెలిపారు. వివరాలు ఆయన మాటల్లో.. జిల్లాలో 15 సీసీఐ కేంద్రాలు.. జిల్లాలో 15 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశాం. భైంసాలో 10, నిర్మల్ 02, కుభీర్ 02, సారంగపూర్ 01 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. అయితే, ముందుగా భైంసాలో 04, కుభీర్, సారంగాపూర్, నిర్మల్లో ఒక్కో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. పత్తి రాక బట్టి మిగిలిన కేంద్రాలు ప్రారంభిస్తాం. అవగాహన కోసం సిబ్బంది.. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్పై వ్యవసాయ శాఖ అధికారులు ఇదివరకే అవగాహన కల్పించారు. ఇంకా, అవగాహన లేని రైతుల కోసం సీసీఐ కేంద్రాల వద్ద కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వారిని సంప్రదించవచ్చు. ఎకరానికి 11 క్వింటాళ్లు.. రైతులు 8–12 తేమ శాతం ఉన్న నాణ్యమైన దిగుబడులు తీసుకురావాలి. తేమ ఉన్న పత్తిని తేవొద్దు. నిబంధనల మేరకు ఉన్న పత్తికి క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర చెల్లిస్తాం. రైతుల నుంచి ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తాం. నాలుగైదు రోజుల్లో చెల్లింపులు.. పత్తి విక్రయించిన వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తాం. నాలుగైదు రోజుల్లో ఆధార్తో లింక్ ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. గతంలో పోస్టాఫీస్ ఖాతాల్లో నగదు పరిమితికి ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి ప్రభుత్వం నగదు పరిమితిని ఎత్తివేసింది. స్లాట్ నంబర్తో రావాలి... పత్తి విక్రయించే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్లుతో కూడిన స్లాట్ నంబర్తో సీసీఐ కేంద్రానికి రావాలి. ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ వెంట తెచ్చుకోవాలి. ఆధార్ నంబర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో రైతు సాగు చేసిన పత్తి వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగానే కొనుగోళ్లు జరుపుతాం. ఈసారి టీఆర్(తాత్కాలిక రిజిస్ట్రేషన్)లకు అవకాశం లేదు. -
పెటా జిల్లా కార్యవర్గం
నిర్మల్ రూరల్: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం(పెటా) నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గుగులావత్ అంబాజీ(జెడ్పీహెచ్ఎస్, దిలావర్పూర్), ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ బెనహర్(జెడ్పీహెచ్ఎస్, చామన్పల్లి), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వైవీ. రమణారావు(జెడ్పీహెచ్ఎస్, వడ్యాల్), కోశాధికారిగా అన్నపూర్ణ(జెడ్పీహెచ్ఎస్, చించోలి)ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న సభ్యులు తెలిపారు. అంబాజీడేవిడ్ బెనహర్ -
శ్రీనివాసుని కల్యాణం
ఖానాపూర్: పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ 41వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. వేదపండితులు చక్రపాణి వాసుదేవాచార్యులు, నర్సింహమూర్తి, సందీప్శర్మ కల్యాణోత్సవం జరిపించారు. అంతకుముందు యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, యజ్ఞం, ధ్వజారోహణం, గరుడపెల్లి, హవనం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. తిమ్మాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టెలు, మంగళసూత్రం, పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. కల్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డగట్ల రాజన్న, నిమ్మల రమేశ్, డాక్టర్ కిరణ్కుమార్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల గాజుల పండగ
నిర్మల్టౌన్: భారతీయ సంప్రదాయంలో గాజులకు ప్రత్యేకస్థానం ఉంది. గాజులను మహిళలు ఐదోతనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2008లో ఒకే పాఠశాలలో చదువుకున్న పదో తరగతి విద్యార్థినులు ఆదివారం ఒక్కచోట చేరి గాజుల పండుగ చేసుకున్నారు. ఒకరికి ఒకరు గాజులు వేసుకుంటూ ప్రేమను వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణంలోని జుమ్మేరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2008 పదో తరగతి విద్యార్థినులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ క్రమంలో గాజులు వేసుకుని, గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. -
అమ్మకు అక్షర ‘ఉల్లాస్’ం
లక్ష్మణచాంద: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అనే నానుడిని నిలబెట్టే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. వయోజన మహిళల్లో అక్షరాస్యతను పెంచడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ పేరిట విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. డిజిటల్ యుగంలోనూ వయోజనులు నిరక్షరాస్యులుగా ఉండడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో వయోజనుల్లో.. ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత పెంచి వారిని ప్రాథమిక జ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతులను చేయాలని కేంద్రం సంకల్పించింది. విద్యాప్రగతికి కొత్త దిశ 2011 గణాంకాల ప్రకారం నిర్మల్ జిల్లా జనాభా 7,09,418 కాగా, అందులో మహిళలు 3,62,697, పురుషులు 3,46,721 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యత కేవలం 57.77 శాతంగా నమోదైంది. ఈ నిష్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమం చేపట్టింది. నిరక్షరాస్యుల గుర్తింపు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించారు. జిల్లాలో 33,344 మందిని అభ్యాసకులుగా నమోదు చేశా రు. వీరికి బోధించేందుకు 3,363 మంది వలంటరీ టీచర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. వలంటరీ టీచర్లకు మండలాల వారీగా శిక్షణ కూడా పూర్తి చేశారు. బోధనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలను, పాఠ్య పుస్తకాలను అందజేశారు. విద్యాబోధన ప్రారంభం.. నవంబర్ 1న ఉల్లాస్ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. 100 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతీరోజు సాయంత్రం మూడు గంటలు విద్యాబోధన చేస్తారు. మొత్తం 300 గంటల తరగతులు నిర్వహిస్తారు. ఈ తరగతుల ద్వారా పాఠాలు నేర్చుకునే మహిళలు తమ కుటుంబాలకే కాకుండా సమాజానికీ అక్షర దీపాలుగా మారతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అక్షరాస్యత పెంచాలి.. ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో అమ్మకు అక్షరమాల పేరుతో శనివారం ప్రారంభమైంది. జిల్లాలో గుర్తించిన అభ్యాసకులు ఉల్లాస్ కార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకుని అక్షరాస్యులుగా మారాలి. వలంటరీ టీచర్లు తమకు అప్పగించిన 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. జిల్లా అక్షరాస్యత పెంపునకు కృషిచేయాలి. – భోజన్న, డీఈవోమండలాల వారీగా గుర్తించిన అభ్యాసకులు, వలంటీర్ల వివరాలు... మండలం అభ్యాసకులు వలంటీర్లు బాసర 1,302 135 భైంసా 2,232 212 దస్తురాబాద్ 1,115 112 దిలావార్పూర్ 1,572 158 కడెం 1,319 144 ఖానాపూర్ 1,387 137 కుభీర్ 3,534 351 కుంటాల 2,062 204 లక్ష్మణచాంద 1,388 166 లోకేఽశ్వరం 1,314 121 మామడ 2,817 275 ముధోల్ 1,475 159 నర్సాపూర్(జి) 1,166 130 నిర్మల్ అర్బన్ 416 35 నిర్మల్ రూరల్ 2,942 308 పెంబి 1,247 136 సారంగాపూర్ 1,577 172 సోన్ 2130 201 తానూర్ 2,349 208జిల్లా సమాచారం.... జిల్లా మొత్తం జనాభా(2011 ప్రకారం)7,09,418 పురుషులు 3,46,721 మహిళలు 3,62,697 జిల్లా అక్షరాస్యత శాతం 57.77 జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు 33,344 నియమించిన వలంటరీ టీచర్లు 3,363 -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. న్యాయమైన పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్మల్టౌన్: న్యాయవాదులు కేసుల పరిష్కారంలో భాగంగా ఇరు పార్టీల మధ్య న్యాయమైన పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించాలని హైకోర్టు జడ్జీలు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సూరేపల్లి నందా సూచించారు. జిల్లా కేంద్రంలోని వాసవీ వరల్డ్ స్కూల్లో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహించే 40 గంటల శిక్షణను ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు స్థానిక అటవీ శాఖ వసతి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి హైకోర్టు జడ్జీలకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాదాలను పరిష్కరించడానికి న్యాయవాదులు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. మధ్యవర్తిత్వం అనేది న్యాయపరమైన వివాదా లకు ప్రత్యామ్నాయ పరిష్కారమని పేర్కొన్నా రు. కార్యక్రమంలో జడ్జీలు రాధిక, శ్రీనివాస్, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నిర్మల్ ఉత్సవాలకు సన్నద్ధం కావాలి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతేడాది ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామన్నారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని వేదిక ద్వారా ఆవిష్కరించామని తెలిపారు. ఈసారి కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సుందరీకరణ పనులు చేపట్టి, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ప్రముఖులతో ప్రచారానికి సంబంధించి వీడియోలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైస్వో శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అధికారులు పాల్గొన్నారు. -
‘పశ్చిమానికి’ పదవులేవీ..!?
నిర్మల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లు కావస్తోంది. అయినా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలకు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పదవి దక్కలేదు. కార్పొరేషన్లు, సలహాదారు హోదాలు, బోర్డులు, కమిటీల్లో నియామకాలు జరుగుతున్నా.. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నేతలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పక్క జిల్లాలకు పదవుల వరుస.. తాజాగా తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల ఎ మ్మెల్యే ప్రేమ్సాగర్రావును సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిపదవి దక్కించుకున్నారు. దండేపల్లికి చెందిన కొట్నాక తిరుపతి గిరిజన కోఆపరేటివ్ సొ సైటీ చైర్మన్గా ఉన్నారు. ఇంతవరకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఒక్కరికీ పదవి దక్కలేదు. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఒక్క బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురు నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్రెడ్డి, సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముగ్గురూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వారే. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే సిరికొండ మండలానికి చెందిన తాహెర్బిన్ హందాన్కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవినిచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీమంత్రి షబ్బీర్అలీని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసు ల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని ఇ చ్చారు. నిజామాబాద్కు చెందిన గడుగు గంగాధర్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషన్ సభ్యుడిగా నియమించారు. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని రా ష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పక్క జిల్లాలకు పదవుల వర్షం కురుస్తుంటే, ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నేతల్లో నైరాశ్యం నెలకొంది. బీజేపీ బలంగా ఉన్నా.. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీతోపాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. బీఆర్ఎస్ రెండు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖానాపూర్లో మాత్రమే విజయం సాధించింది. ఇటువంటి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి, స్థానిక నేతలకు పదవులు ఇవ్వడం అవసరమని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధితో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుసీనియర్లు ఉన్నా.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పదుల సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సోయంబాపురావు, వేణుగోపాలచారి, రాథోడ్ బాపురావు, ఇంద్రకరణ్రెడ్డి, రేఖానాయక్, ఎమ్మెల్సీ వి ఠల్రెడ్డి, ఆత్రం సక్కు, విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, అజ్మీరా శ్యాంనాయక్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరు ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి అనుచరవర్గంలో నిరాశ నెలకొంది. -
ఐక్యత కోసమే ఏక్తా రన్
నిర్మల్ టౌన్: దేశ సమైక్యత, సోదరభావానికి తనదైన మార్గాన్ని చూపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘ఏక్తా దివస్’ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 కిలోమీటర్ల ఏక్తా రన్ నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల ఈ రన్ను ప్రారంభించి మాట్లాడారు. అందరూ ఐక్యత, పరస్పర గౌరవం కలిగి ఉండాలన్నారు. పటేల్ సేవలను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడిస్తే నిజమైన జాతీ య ఐక్యత సాధ్యమవుతుందని తెలిపారు. ‘ఏక్తా దివస్’ ద్వారా ప్రజల్లో ఐక్యతా భావం, సామరస్య ఉద్దేశం కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా పీఎస్సార్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) నియామకం అయ్యారు. కేబినెట్ హోదాతో కూడిన పదవిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఎమ్మెల్యేగా ఎన్నికై నప్పటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖరారు కాకపోవడంతో ఇన్నాళ్లుగా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఇచ్చినా కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుంచీ కాంగ్రెస్లోనే.. కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నా రు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్లో ప్రారంభించి.. పార్టీ మారకుండా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా, 1999 నుంచి 2002 వరకు పీసీసీ సభ్యుడిగా, 2002 నుంచి 2005 వరకు పీసీసీ సెక్రెటరీగా, 2004 నుంచి 2006 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2005 నుంచి 2007 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా, 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతూనే, 2022లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, 2023 ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదవిపై విముఖత మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేమ్సాగర్రావు కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు రెండో విడతలో మంత్రిగా అవకాశం కల్పించి ప్రేమ్సాగర్రావును పక్కనబెట్టారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో చీఫ్ విప్, విప్తో సహా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించడంపై చర్చకు వచ్చాయి. ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవీ వద్దని, ఎమ్మెల్యేగానే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని పలు మార్లు ప్రకటించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం కోయంబత్తూర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయనను నామినేటెడ్ పదవిలో నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ పదవి చేపట్టేందుకు ఇష్టం లేనట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకు ని కోలుకుని వచ్చాక నామినేటెడ్ పదవిని స్వీకరిస్తారా? లేదా తిరస్కరిస్తారా అనేది స్పష్టత రానుంది. -
3 నుంచి పత్తి కొనుగోళ్లు..!
భైంసాటౌన్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈనెల 3 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి కొనుగోళ్లలో అవకతవకలకు ఆస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పత్తి విక్రయించే రైతులు ముందుగా ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైతు వ్యవసాయ శాఖ ద్వారా సాగుచేసిన పత్తి పంటకు సంబంధించి క్రాప్బుకింగ్లో నమోదు చేసి ఉండాలి. ఆధార్కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ లేదా, బయోమెట్రిక్/ఐరిస్ ద్వారా కూడా ఆధార్ ధ్రువీకరిస్తారు. రైతులు ఆధార్కు అనుసంధానించిన సెల్ నంబర్ను యాప్లో నమోదు చేసుకుంటే, స్లాట్ బుకింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లో కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, అందులో స్లాట్ బుకింగ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇందులో పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్ కేటాయిస్తారు. అవగాహన లేని రైతులకు ఏఈవోలు, సీసీఐ సిబ్బంది ద్వారా స్లాట్ బుకింగ్లో సహకరించేలా ఏర్పాట్లు చేశారు. 8–12 తేమ శాతం ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.8,110 చెల్లించనుండగా, ఆపై తేమశాతం పెరిగితే ఒక శాతానికి రూ.81 తగ్గించి ధర చెల్లించనున్నారు. భైంసాలోనే అఽధికం.. జిల్లాలోని నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్ ఏంఎసీ పరిధిలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అధిక సంఖ్యలో భైంసాలోనే ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా ముధోల్ నియోజకవర్గంలోనే రైతులు పత్తి సాగు చేస్తారు. దీంతో భైంసా పట్టణంలో 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కానుండగా, ప్రస్తుతం 10 మిల్లులకు అనుమతి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పది మిల్లుల్లో కేంద్రాలు.. ఈనెల 3 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పట్టణంలో 12 జిన్నింగ్ మిల్లులను గుర్తించాం. వీటిలో పది మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – పూర్యానాయక్, ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి, భైంసా -
పోలీస్ అమరుల త్యాగం మరువలేనిది
ఖానాపూర్: ప్రజల రక్షణ, చట్టాల అమలులో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ జానకీషర్మిల, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పోలీస్ అమరవీరుల స్తూపం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. శాంతిభద్రత కోసం ప్రాణ త్యాగం చేసినవారి సేవలు కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఖానాపూర్ సర్కిల్లో నక్సలైట్ల ఘాతుకానికి 19 మంది పోలీస్లు అమరులయ్యారని తెలిపారు. అనంతరం ఖానాపూర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐ అజయ్, తహసీల్దార్ సుజాత, ఎస్సైలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
నీరే..
కల్లాల్లో కళ్లలో..రైతుల ఆరుగాలం శ్రమ ఒక్క తుపానుతో తుడిచిపెట్టుకుపోయింది. ఆరు నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు ఇటీవలే చేతికి వచ్చాయి. దిగుబడిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇక రేపోమాపో కోసేందుకు మరికొందరు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో విరుచుకుపడిన మోంథా తుపాను జిల్లా రైతులకు కన్నీటి దిగుబడి మిగిల్చింది. బుధవారం కురిసిన వర్షానికి ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లోని వరి, సోయా ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం వర్షంతో తడిసి ముద్దయింది. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. మండలంలో 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సుజాత తెలిపారు. ఇక లోకేశ్వరం మండలంలోనూ చేతికొచ్చిన ధాన్యం తడిసింది. యార్డుల్లో, కల్లాల్లో ధాన్యం తడిసిపోతుండటంతో కొందరు రైతులు టార్పలిన్లు కప్పి రక్షించే ప్రయత్నం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే వర్షాలకు తర్లపాడ్ నుంచి కొమురంభీం చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురై రవాణా పూర్తిగా అస్తవ్యస్తమైంది. పట్టణంలోని ప్రధాన వీధులు కుంటలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్లు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయి. – ఖానాపూర్/లోకేశ్వరం -
సదర్మాట్ను సందర్శించిన అధికారులు
ఖానాపూర్: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని గోదావరికి వరద పోటెత్తింది. మండల అధికారులు నీటి ప్రవాహాన్ని శుక్రవారం సందర్శించారు. తహసీల్దార్ సుజాతతోపాటు ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో రత్నాకర్రావు మేడంపల్లి గ్రామంలోని సదర్మాట్ వద్ద 10.5 ఫీట్లు ఉన్న గోదావరి నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం బాదన్కుర్తి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలపై ఆరాతీశారు. అంతకముందు సుర్జాపూర్, మేడంపల్లి గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. -
విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్టాన వేడుకలు వైభవంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈవో భూమయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసరాల్లో హోమం, ఇతర పూజా కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన మండపాలను పరిశీలించారు. కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. అనంతరం అడెల్లి మహాపోచమ్మ మాలధారణ చేసిన భక్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్, పార్టీ మండల అధ్యక్షుడు నరేశ్, సీనియర్ నాయకులు మంతెన గంగారెడ్డి, చంద్రప్రకాశ్గౌడ్, సాహెబ్రావు, వీరయ్య, పోతన్న, ముత్యంరెడ్డి, రాజేందర్రెడ్డి, అయిర నారాయణరెడ్డి, దావూజీ, నారాయణనాయక్, ప్రకాశ్, జమాల్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి సారంగపూర్: రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో ఐకేపీ, బోరిగాంలో సోయా, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. నిర్మల్లోని కేదారీనాథ్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మోంథా తుపాను కారణంగా ధాన్యంలో, సోయా పంటల్లో తేమశాతం పెరిగిందని, తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. -
యువత సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాస్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనే యువతీయువకులు వారి వివరాలను నవంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలలోపు కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నేరుగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలి. ఏడు అంశాల్లో పోటీలు ఉంటాయి. ప్రతీ అంశానికి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి -
కళాశాలల తనిఖీ
లక్ష్మణచాంద:మండల కేంద్రంలోని రెండు జూ నియర్ కళాశాలలను డీఐఈవో పరశురాం నా యక్ గురువారం తనిఖీ చేశారు. కేజీబీవీ జూ నియర్ కళాశాలను, అనంతరం సహకార జూ నియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్లో ప్రవేశాల వివరాలు ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. త్వరగా సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. డీఐఈవో వెంట కేజీబీవీ ఎస్వో నవిత, సహకార కళాశాల ప్రిన్సిపాల్ భోజన్న, జూనియర్ అసిస్టెంట్ భూమేష్ ఉన్నారు. -
నిర్మల్
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం కుంటాల: ఇందిరమ్మ పథకంలో భాగంగా మండలంలోని విఠాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన గుండెటి శ్యామలకు ఇల్లు మంజూరు చేయగా, రెండు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసింది. గురువారం గృహ ప్రవేశం చేసింది ఇప్పటి వరకు ఆమెకు ప్రభుత్వం రూ.4 లక్షలు విడుదల చేసిందని, ఫైనల్ బిల్ మరో రూ.లక్ష రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సొంత ఇంట్లోకి రావడంతో సంతోషంగా ఉందని శ్యామల తెలిపింది. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, ఏపీవో గట్టుపల్లి నవీన్, పంచాయతీ కార్యదర్శి ఉత్తం, మాజీ సర్పంచ్ గల్లపురం లక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన సోయా రైతులు
కుంటాల: మోంథా తుపాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో వరి, సోయా, మొక్కజొన్న ధాన్యం తడిసింది. తడసిన సోయా కొనుగోలు చేయాలని కుంటాలలో రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. సోయా పంట చేతికి వచ్చి నెలరోజులైందని కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో ఇప్పుడు వర్షానికి తడిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల్సింగ్ అక్కడి చేరుకోగా, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు పేర్కొన్నారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్కు తహసీల్దార్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ధర్నాలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తాద్రి, నాయకులు జక్కుల గజేందర్, తాటి శివ, కళ్యాణ్ గజేందర్, సబ్బిడి రాకేశ్, బోగ గోవర్ధన్, బొంతల పోశెట్టి, బోగ గజేందర్, రాధాకృష్ణ, అనిల్, రైతులు పాల్గొన్నారు. మరోవైపు తడిసిన సోయాను ఆరబెట్టేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. -
సర్కారు బడుల్లో 5.0
లక్ష్మణచాంద/మామడ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు అందజేయడంతోపాటు, ఇప్పుడు విద్యాశాఖ ‘‘స్కూల్ 5.0 కార్యక్రమం’’ను ప్రారంభించింది. ప్రధాన ఉద్దేశం.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలను అందంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. విద్యార్థులకు ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం కల్పించడం ద్వారా విద్యా నాణ్యత పెంచడమే ప్రధాన ఆశయం అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం విజయానికి ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, దాతలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు అవుతారు. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అమలు ఇలా.. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించనున్నారు. ఈ కాలంలో పాఠశాల భవనాల పరిశీలన నుంచి శానిటేషన్ వరకు పలు కార్యాచరణలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు విద్యా కేంద్రాలుగా మాత్రమే కాకుండా భద్రతా ప్రమాణాలకు ఆదర్శంగా నిలవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. పాఠశాల వాతావరణం మారితేనే విద్యార్థుల హాజరు, నేర్చుకునే ఆసక్తి, ఫలితాలు మెరుగుపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. అమలు చేయాల్సిన కార్యక్రమాలు.. పకడ్బందీగా అమలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 5.0 కార్యక్రమంను పకడ్బందీగా అమలు చేస్తాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – భోజన్న, డీఈవో -
నాణ్యమైన పత్తికి మద్దతు ధర
నిర్మల్చైన్గేట్: నాణ్యమైన పత్తిని అమ్మకానికి తెచ్చే రైతులందరికీ మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డితో కలిసి, పట్టణంలోని కేదారీనాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. పత్తి పంటను అమ్మేందుకు వచ్చిన రైతుతో సాగు చేసిన విస్తీర్ణం, పంట పెట్టుబడి, దిగుబడి, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రైతులు పండించిన పంట మొత్తం సీసీఐ సేకరించాలన్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నా రు. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. తేమ నిర్ధారణ పారదర్శకంగా జరగాలని సూచించారు. 12 శాతం తేమ ఉన్న పత్తినే విక్రయానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యే పత్తి వ్యాన్కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, రైతులు పాల్గొన్నారు. -
‘మోంథా’ గుబులు
నిర్మల్: మోంథా తుపాన్ జిల్లానూ టెన్షన్ పెడుతోంది. భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లే బుధవారం ఉదయం నుంచి వాతావరణం మబ్బుపట్టి వాన మొదలైంది. దీంతో చేతికొచ్చిన పంటలపై ప్రభావం పడనుంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురు, శుక్రవారాల్లో అధికసంఖ్యలో వివాహాలు, శుభకార్యాలుండగా ముహూర్తాలు నిశ్చయించుకున్నవారిలో ఆందోళన మొదలైంది. క్యాచ్మెంట్ ఏరియాలో భా రీ వర్ష సూచన ఉండటంతో ఇప్పటికే కడెం ప్రాజెక్ట్ అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వతులు తున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లనూ ఎత్తడంతో గోదావరికి వరద పెరుగుతోంది. దిగులు చెందుతున్న రైతాంగం ఆకాశం మబ్బుపట్టి ఉండటంతో రైతన్న గుబులు చెందుతున్నాడు. వరి ధాన్యం, సోయా, పత్తి తదితర పంటలన్నీ చేతికి వచ్చి విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో మోంథా తుపాన్ ఎ లాంటి ప్రభావం చూపుతుందోనని కలవర పడుతున్నారు. వాతావరణ శాఖతోపాటు పలు నివేదికలూ జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలున్నట్లు సూచిస్తున్నాయి. ఈక్రమంలో చేతికొచ్చిన పంట ఎక్కడ నీటిపాలవుతుందోనని రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకువెళ్లిన వరి ధాన్యం, సోయాను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శుభకార్యాలు ఎలా.. జిల్లాలో గురు, శుక్రవారాల్లో భారీగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలున్నాయి. జిల్లావ్యాప్తంగా వివాహాల సీజన్ కొనసాగుతోంది. ప్రతీ ఫంక్షన్హాల్లో ఏదో ఒక శుభకార్యం ఉండటం గమనార్హం. ఇప్పటికే పెళ్లిళ్లు, ఆయా ఫంక్షన్లకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా రు. తీరా.. తీరాన్ని దాటిన మోంథా తుపాన్ వారిని కలవరపెడుతోంది. అన్నీ పూర్తిచేసి పెట్టుకున్న త ర్వాత భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ స మాచారంతో శుభకార్యాలకు ఎలా ఇబ్బంది కలి గిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు.. జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ బుధవారం రాత్రి నుంచి గురువా రం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అ వకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈమేరకు ఎగువన కూడా భారీ వర్షాలు కురిస్తే.. అదేస్థాయిలో వరద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తగా జిల్లాలోని ప్రాజెక్టుల అ ధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరి కలు జారీ చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తిన అధికా రులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దస్తురాబాద్ మండలంలో.. దస్తురాబాద్: మండల వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. బుధవారం రోజంతా మబ్బులు కమ్ముకున్నాయి. రాత్రి వేళ వర్షం ప్రారంభమైంది. కడెం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశమున్నట్లు తహసీల్దార్ విశ్వంభర్ తెలిపారు. పశువుల కాపరులు, మత్స్యకారులు గోదావరి పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుకొంటున్న రైతులు -
కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
భైంసాటౌన్: కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ సూ చించారు. సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభం నేపథ్యంలో పట్టణంలోని తన కార్యాలయంలో బు ధవారం మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి, డీఏవో అంజిప్రసాద్తో సమీక్షించారు. సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా కొనుగోళ్లు జరపాలని, వర్షాల నేపథ్యంలో కేంద్రాల్లో పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సోయా కొనుగోళ్లు ప్రారంభం పట్టణంలోని ఏఎంసీ యార్డు ఆవరణలో మార్క్ఫె డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాలను సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి విక్రయించి క్వింటాల్కు రూ.5,328 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. పంట విక్రయించిన రైతుల ఖాతాల్లో వారం, పది రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్రావు పటేల్, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి, డీఏవో అంజిప్రసాద్, పీఏసీఎస్, ఆత్మ చైర్మన్లు పాల్గొన్నారు. -
పక్షవాతానికి జాగ్రత్తలే కీలకం
నిర్మల్చైన్గేట్: పక్షవాతానికి వయస్సుతో పని లేదని, జాగ్రత్తలే కీలకమని వైద్యులు సూచించారు. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రదీప్ న్యూరో హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో డాక్టర్స్ లేన్ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. షుగర్, బీపీ ఉన్నవారు ఆల్కహాల్, సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పక్షవాతం గురించి ముందస్తు అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని వివరించారు. ర్యాలీలో వైద్యులు దామెర రా ములు, కృష్ణంరాజు, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దేవదాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల భూములు అప్పగించాలి
సోన్: మండలంలోని పాక్పట్ల గ్రామంలో దళితుల భూమిని ఆక్రమించిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకుని సదరు స్థలాన్ని తిరిగి దళితులకు అప్పగించాలని కోరుతూ బుధవారం అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ మల్లేశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోల్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. బోర ముత్యం, బోర చిన్న గంగన్న, బోర నడిపి నర్సయ్యకు చెంది న భూమిలో వీడీసీ సభ్యులు మట్టిరోడ్డు వేశారని తెలిపారు. స్పందించిన తహసీల్దార్ పట్టా భూమిపై పోసిన రోడ్డుపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రవి, సుధీర్, రమేశ్, బోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అంతటా వేధింపులే!
నిర్మల్సురక్షితంగా ప్రయాణించేలా.. ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ తరగతు ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. సత్వర పరిష్కారం చూపాలి భైంసాటౌన్: బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించి, వారికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది మంది నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని భరోసా కేంద్రంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్తో వివిధ కుటుంబా ల్లోని వివాదాలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం షీ టీం పాత్రను అభినందించారు. అదనపు ఎస్పీ అవినాష్కుమార్ ఉన్నారు. నిర్మల్: జిల్లా కేంద్రానికి చెందిన ఓ గృహిణి ఎప్పటికప్పుడు తమ పిల్లల డ్యాన్సులు, కార్యక్రమాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేది. కాస్త అందంగా ఉన్న ఆమైపె ఓ ప్రభుత్వ ఉద్యోగి కన్నేశాడు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యాడు. తన పిల్లలను ప్రోత్సహించేలా కామెంట్లు పెడుతూ క్రమంగా ఆమె పర్సనల్ ఫోన్నంబర్ సంపాదించాడు. సెల్నంబర్కూ మొదట్లో మంచోడిలా మెసేజ్లు పెట్టేవాడు. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగి కదా.. మంచోడేమోనని గుడ్డిగా నమ్మింది. అతడి మెసేజ్లకు రిప్లయ్ ఇస్తూ వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్నిరోజుల తర్వాత సదరు ఉద్యోగి అసలు రూపాన్ని క్రమంగా బయటపెట్టడం ప్రారంభించాడు. కాస్త ఆలస్యమైనా.. అతని దుర్బుద్ధిని తెలుసుకున్న ఆమె ఫోన్ నంబర్ బ్లాక్లో పెట్టడమే కాకుండా భయంతో తన సోషల్ మీడియా అకౌంట్లనూ క్లోజ్ చేసుకుంది. బయట సమాజంలోనే కాదు, ‘సోషల్ మీడియా’లోనూ ఆ డవాళ్లను వదిలిపెట్టడం లేదు. ఇక్కడా.. అక్కడా.. అని కాదు. ఎక్కడైనా.. వేధింపులు తప్పడం లేదు. ఎక్కడైనా తప్పని వేధింపులు సర్కారు ఆఫీస్లో శ్రమించే ఉద్యోగిని నుంచి షా పింగ్మాల్లో చెమటోడ్చే వేతనజీవి వరకు.. కాలేజీలో బోధించే అధ్యాపకురాలి నుంచి బడిలో చదివే విద్యార్థిని దాకా.. ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వింతపశువుల్లా మారిన ఉపాధ్యాయులు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. ఈ ఏడాదిలోనే నర్సాపూర్(జీ)లో ఇద్దరు, బాసరలో ఒకరు బయటపడ్డారు. ఇలా.. బ యటపడకుండా ఉన్నవారెందరో. ప్రైవేట్ సంస్థలు, దుకాణాల్లోనే కాదు, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఆ డవారికి వేధింపులు తప్పని దుస్థితి జిల్లాలో ఉంది. ధైర్యంగా ముందుకు రావాలి మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురవుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలపై శాఖాపరంగా కఠినచర్యలు తీసుకుంటున్నాం. భరోసా కేంద్రం, షీ టీమ్లు, పోలీసు అక్క కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. బాధితులు ధైర్యంగా ముందుకురావాలి. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచి నిందితులపై కఠినచర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జానకీ షర్మిల, ఎస్పీ ఆడవారికి తప్పని వేధింపులు కమిటీలు.. ఎక్కడా? మహిళల కోసం ఎన్నో చట్టాలున్నాయి. వాటిపై అవగాహన లేకపోవడంతోనే చాలామంది ఇంకా బాధితులుగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కనీసం పదిమంది మహిళలు పనిచేసే చోట వేధింపుల నివారణ కమిటీ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్.. ఏ కార్యాలయమైనా.. ఏ పనిచోటైనా మహిళలపై వేధింపుల నివారణకు ఇలాంటి ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ.. జిల్లాలో కలెక్టరేట్ మొదలు ఎక్కడా ఇలాంటి కమిటీలు లేకపోవడం గమనార్హం. ఘటనలు జరిగినప్పుడే సంబంధిత అధికారులు కమిటీలు వేసి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు. -
పోలీసులకు వ్యాసరచన పోటీ
నిర్మల్చైన్గేట్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఏఆర్ ముఖ్య కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కానిస్టేబు ల్ నుంచి ఏఎస్సైలకు ‘పని ప్రదేశంలో లింగ వి వక్ష’ అంశంపై, ఎస్సై నుంచి ఆపై స్థాయి అధి కారులకు ‘గ్రౌండ్ లెవెల్లో పోలీసులను బలో పేతం చేయడం’ అంశంపై పోటీలు నిర్వహించ గా ఐదుగురు ఆర్ఎస్సైలు, 46మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు ముగ్గురిని, ఎస్సై నుంచి పైస్థాయి అధికారి వరకు ముగ్గురిని సె లెక్ట్ చేసి రాష్ట్రస్థాయికి పంపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైనవారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్, నగదు రివార్డు అందజేయనున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరసన
నిర్మల్చైన్గేట్: ఇంటర్, డిగ్రీ, వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ ఆ ధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తె లిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాక పేద విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకా యిలు విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. నాయకులు వుజారం మహేశ్, సుద్దాల మహిపాల్, చుక్క ల నరేశ్, ప్రణీత్, రఘు, అంజన్న, కృష్ణంరాజు, కల్యాణ్, రవి, సంజయ్, అజయ్ పాల్గొన్నారు. -
ఆర్టీఐఏపై అవగాహన
కుంటాల: సమాచారం హక్కు చట్టంపై మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం ఆర్టీఐఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త సయ్యద్ కలీం అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే వీలుందని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం దొరుకుతుందని తెలి పారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాథోడ్ సురేశ్, న్యా యవాది గజేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి న వీన్, సారంగపూర్ మండల బాధ్యుడు సయ్య ద్ హఫీజ్, సిబ్బంది సంగీత పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్చైన్గేట్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆరో గ్య ఉప కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికా రులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. పనుల పురోగతిని రోజు వారీగా పర్యవేక్షించాలని, నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. అనంతరం వరద నివారణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్ట్ల పనుల్లో వేగం పెంచాలని, ఇంజినీరింగ్ శాఖల మధ్య సమన్వయం సాధించి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. పీఆర్ ఈఈ చందుజాదవ్, ఇరిగేషన్ ఈఈ అనిల్, పీఆర్ డీఈ తుకారాం పాల్గొన్నారు. నిత్యావసరాల కిట్లు అందజేత వరద నష్ట బాధితులను ఆదుకునేందుకు నెస్లే సంస్థ ప్రతినిధులు 600 నిత్యావసరాల కిట్లను కలెక్టర్ అభిలాష అభినవ్కు కలెక్టరేట్లో అందజేశారు. సంస్థ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. సంస్థ మేనేజర్ వసీం అహ్మద్, బోస్కో నెట్ ప్రతినిధి సత్యనారాయణ, ధపాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. దళారులకు ధాన్యం విక్రయించొద్దు లోకేశ్వరం: దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని హవర్గ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. కేంద్రంలో అవసరమై న యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్రంలో ని ర్వాహకుల వివరాలు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబ ర్ తదితర వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రికార్డులు పకడ్బందీగా నిర్వహించా లని తెలిపారు. రైతులు ఇబ్బందులెదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్లో 9182958858లో సంప్రదించా లని సూచించారు. అదనపు కలెక్టరు (రెవెన్యూ) కి శోర్కుమార్, డీసీవో నర్సయ్య, జిల్లా పౌరసరఫరా ల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రావు, సీఈవో విష్ణువర్ధన్రెడ్డి, ఏవో గిరిరాజ్, ఏఈవో మౌనిక తదితరులున్నారు. -
కొనుగోళ్లకు వేళాయె
నిర్మల్ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు కార్తీకమాసం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీ సీ రీజియన్ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు. పత్తిలో 12 శాతం తేమ ఉండాలి కుంటాల: పత్తిని మిల్లులకు తరలించేటప్పుడు తేమ 12 శాతం మించకుండా రైతులు చూసుకోవాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను ఆదేశించారు. కుంటాల మండలం కల్లూరు రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందిస్తుందని అన్నారు. ప్రతీ రైతు కిసాన్ కపాస్ యాప్ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సలహాలు, సందేహాల కోసం1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్సింగ్, భైంసా ఏడీఏ వీణ, ఏఈవో గణేశ్, రైతులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్లో వానాకాలం వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు మండలాల్లో రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం మాయిశ్చర్ వచ్చేలా ఆరబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వరి సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 1.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారు 400 గ్రామాల్లో ఈ వానాకాలం 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా ముధోల్, బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, లక్ష్మణచాంద, దిలావర్పూర్, సోన్ మండలాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు. కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 317 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ తెలిపారు. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, డీసీఎంఎస్ కేంద్రాలు 21, పీఏసీఎస్ 129, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి కొనుగోళ్లు.. ముధోల్ మండలంలో బుధవారం నుంచి వరి కొ నుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు వెల్ల డించారు. మిగిలిన మండలాల్లో పంట కోత పూర్తయ్యే కొద్దీ కేంద్రాలు క్రమంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సీజన్లో మొత్తం 1.69 లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడమే లక్ష్యంగా నిర్ణయించారు. గన్నీ సంచులు, వసతులు సిద్ధం ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులు, తూక యంత్రాలు, రవాణా వాహనాలు లాంటి అ న్ని వసతులు కల్పించినట్లు అధికారులు చెప్పారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యం విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ అందజేయనుందని అధికారులు తెలిపారు. రైతులు మధ్యవర్తుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధారణ మార్కుల కేంద్రాల్లోనే విక్రయం చేయాలని పిలుపునిచ్చారు. సర్వం సిద్ధం జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో సాగు అయిన వరి ధాన్యం సేకరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు జిల్లాలో 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.69 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. – సుధాకర్, డీఎం పౌరసరఫరాల శాఖ జిల్లా సమాచారం... ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 159పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు 129డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలు 21జీసీసీ కొనుగోలు కేంద్రాలు 08మొత్తం వరి కొనుగోలు కేంద్రాలు 317మొత్తం వరి ధాన్యం సేకరణ లక్ష్యం 1.69 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకం వరి ధాన్యం ధర క్వింటాల్కు రూ.2,369ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ. 2,389 -
పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
దస్తురాబాద్: గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో పలు కాలనీలను పరిశీలించి పారిశుద్ధ్యం నిర్వహణ గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త సేకరిస్తున్నారా అని ఆరా తీశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే పన్నులపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్ దారులకు నోటీసులు పంపించాలని ఆదేశించారు. అంతకుమందు పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల సామగ్రిని, గ్రామపంచాతీ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. డీపీవో వెంట మండల ఎంపీడీవోవోలు సునీత, రమేశ్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీవో రమేశ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
మక్కలు తూకం వేయడం లేదని ఆందోళన
ఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొ నుగోలు కేంద్రంలో మక్కలు తూకం వేయడం లేదని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. కడెం మండలం అల్లంపెల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రెండురోజుల క్రితం 600 క్వింటాళ్ల మక్కలను 15 ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చారు. అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిర్వాహకులు తూకం వేయకుండా తేమ శాతం, నాణ్యత పేరిట పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఆందోళనలో రైతులు పరశురాం, సృజన్లాల్, పెరమన్న, రిజేశ్, మల్లేశ్, పోశన్న, రాజారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
లక్ష్మణచాంద: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి రాధిక పేర్కొన్నారు. మండలంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పొట్టపల్లి(కె) గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామస్తులకు బాల్య వివాహాల నిరోధక చట్టం, వివిధ రకాల రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించారు. రైతులు రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అలాగే భూసమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజలింగం, లింగాగౌడ్, సిరాజ్, ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్, ఎస్వో నవిత, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
● ఆర్ఎస్యూ నుంచి సికాస కార్యదర్శిగా ● కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ● అనారోగ్యంతో లొంగుబాటు
అజ్ఞాతం వీడిన బండి దాదా మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మొదటిజోన్కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాశ్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్శితుడైన ప్రకాశ్ ఆర్ఎస్యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు. అనారోగ్యం.. ప్రకాశ్కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రితమే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25 లక్షలు అందజేశారు. కుటుంబ సభ్యుల ఆనందం బండి ప్రకాశ్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. అనేకసార్లు ఎన్కౌంటర్లలో మృతిచెందా డని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగి పోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
దుబాయిలో తప్పిపోయిన జిల్లావాసి
సారంగపూర్: మండలంలోని గోపాల్పేట్ గ్రామానికి చెందిన పూర్ణ సాయేందర్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ తప్పిపోయాడు. ఈమేరకు ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిషయమై ఆయన కుటుంబీకులను సంప్రదించగా సాయేందర్ పదేళ్లుగా దుబాయికి వెళ్లొస్తున్నాడని తెలిపారు. రెండు నెలల క్రితం తన కూతురు వివాహం జరిపించి దుబాయికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో దుబాయిలోని వెస్ట్జోన్ కంపెనీలో వీసా రావడంతో 20 రోజుల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయనకు కంపెనీ అడ్రస్ దొరకకపోవడంతో అక్కడే తిరుగుతూ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లావాసుల కంటపడ్డాడు. వారు ఆయనను విచారించగా తనది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, గోపాల్పేట్ గ్రామం అని తెలిపాడు. ఆయన అనారోగ్యంతో ఉండడం గమనించి ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వివరాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అనంతరం అల్కోస్ ఏరియాలో ఉన్న స్థానికులకు సమాచారం ఇచ్చి సాయేందర్ వద్దకు వెళ్లాలని కోరారు. -
మద్యం షాపుల కేటాయింపునకు లక్కీడ్రా
నిర్మల్టౌన్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని 47 మద్యం షాపులను కేటాయించారు. మొత్తం 991 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ఒక్కో దుకాణానికి సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపి పూర్తి పారదర్శకతతో ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా డ్రా కొనసాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. లక్కీ డ్రాలో ఎంపికై న వారికి నిర్ణీత లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేదికపైనే కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్, ఎకై ్సజ్ సిబ్బంది, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాలకు మహర్దశ..
నిర్మల్మనమూ చేద్దాం... మారథాన్ ఉరుకులు, పరుగుల జీవితంలో రోజూ క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.ఓటరు జాబితా పరిశీలన వేగవంతం చేయాలి భైంసాటౌన్: ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం బీఎల్ఓలతో మాట్లాడారు. ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బీఎల్వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాల పరిశీలన పక్కాగా చేయాలని సూచించారు.భైంసాటౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతకాలంగా మున్సిపాలిటీలకు నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నచందంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనులు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు అధ్వానంగా మారాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వరద నీరు పారేలా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు, వర్షపునీరు రహదారులపై నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోనూ మురుగు నీరు ఇళ్లలోకి చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులకు మోక్షం కలుగనుంది. ముఖ్యంగా డ్రెయినేజీలు, సీసీరోడ్లు, వరద కాలువలతో పాటు పార్కులు, సుందరీకరణ పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. పట్టణాభివృద్ధికి తోడ్పాటు.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గుర్తించాం. ఈ నిధులతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, వరద కాలువల నిర్మాణం చేపడతాం. పార్కులు, జంక్షన్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తాం. – బి.రాజేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్, భైంసా -
యూడైస్లో వివరాలు నమోదు చేయాలి
నిర్మల్రూరల్: పాఠశాలల వివరాలను యూడైస్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యూడైస్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మూడు రకాల మాడ్యూల్స్లలో పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకానికీ.. పట్టదా..!
నిర్మల్: ఉత్తరాన ఎత్తయిన సహ్యాద్రి శ్రేణులు, దక్షిణాన ఎగిసిపడే గోదారి అలలు, పచ్చని అడవులు, ఎత్తయిన గుట్టలు, జాలువారే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులు.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల కలబోత నిర్మల్ జిల్లా. పచ్చదనంతో పాటు ఆధ్యాత్మిక ఆలయాలు, చారిత్రక కట్టడాలు జిల్లా పర్యాటకానికి మరింత శోభనిచ్చేవే. ఎన్ని ఉన్నా.. పాలకుల కన్ను మాత్రం ఇటువైపు పడటం లేదు. ఇక్కడి నుంచి అధికారులు ఎన్ని ప్రతిపాదనలు పంపినా.. అవి బుట్టదాఖలే అవుతున్నాయి. ఏళ్లుగా టూరిజం అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది. తాజాగా ప్రభుత్వం నేచర్ టు అడ్వెంచర్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎకోటూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికై నా జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. పచ్చని అడవి అందాలు... అడవులు అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గుర్తొస్తుంది. అలాంటి అడవుల ఖిల్లాకు స్వాగతం పలికినట్లుగా నిర్మల్జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి తూర్పుదిశగా వెళ్తుంటే పచ్చని అటవీ అందాలు స్వాగతం పలుకుతాయి. మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో విస్తృతంగా ఉన్నాయి. గోదావరి అలలు.. ఖానాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్తే గోదావరి నదిపై అడ్డంగా రాళ్లతో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట ఉంటుంది. ఎలాంటి యంత్రాలు, గేట్ల సాయం లేకుండా సహజసిద్ధంగా గోదావరి నీటిని కాలువలకు మళ్లించడం ఇక్కడి ప్రత్యేకత. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గోదావరి అందాలను ఆస్వాదించవచ్చు. దారి పొడవునా.. జిల్లాకేంద్రం నుంచి కడెం వైపు, అలాగే ఆదిలాబాద్వైపు సాగే ఎన్హెచ్ 44 బైపాస్రోడ్డు మొత్తం పచ్చని అడవుల మధ్యలో సాగుతాయి. జిల్లాలో ఎక్కడైనా సరే.. ఎకోటూరిజానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ.. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వమూ జిల్లాపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. తాజాగా చేపట్టనున్న ఎకోటూరిజం అభివృద్ధిలోనైనా జిల్లాను భాగస్వామ్యం చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
జిల్లాస్థాయి జట్లకు ప్రత్యేక శిక్షణ
దిలావర్పూర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న జట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బాలబాలికలకు వేర్వేరుగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. బాలుర జట్లకు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, బాలికల జట్టుకు ఆసిఫాబాద్లోని క్రీడా పాఠశాలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6 నుంచి 8 వరకు పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
హెల్మెట్తో ప్రాణాలు భద్రం
నిర్మల్టౌన్: ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చని రవాణావాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో 85 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదంలో 60 నుంచి 70 శాతం వరకు హెల్మెట్ లేకనే మృతి చెందినట్లు అంచనా. నామ మాత్రపు తనిఖీలు పోలీసులు, రవాణా శాఖ హెల్మెట్ ధరించని వారిపై చర్యలు అంతగా తీసుకోవడం లేదని, తనిఖీలు కూడా నామమాత్రంగా చేపడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రవాణా అధికారులు తమ బాధ్యతగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నాణ్యమైన వి ఉపయోగించాలి నాసిరకం హెల్మెట్ ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ స్ట్రాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐఎస్ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లు ధరించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. వాడకంపై చట్టం.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా కడుతుంటే డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దుచేసే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన ఘటనలు -
● లేఖ విడుదల చేసిన మార్క్ఫెడ్
కొనుగోళ్లకు పర్మిషన్ రావాలి భైంసా: జిల్లాలో సోయా రైతుల తిప్పలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన జిల్లా మార్క్ఫెడ్ అధికారులు సోమవారం లేఖ విడుదల చేశారు. ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆదేశాలు అందిన వెంటనే మార్క్ఫెడ్ ద్వారా సోయా కొనుగోళ్లు ప్రారంభిస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా అదనపు కలెక్టర్ కూడా మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. -
కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్టౌన్: వరి, పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తుఫాను తీవ్రత దష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీవ్రత తగ్గేవరకు హార్వెస్టింగ్ నిలిపివేయాలన్నారు. కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం తహసీల్దార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, అధికారులు విజయలక్ష్మి, రాజేందర్, సుధాకర్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
తలకుగాయం.. ప్రాణాంతకం
చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. బైక్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదం జరిగితే 80 శాతం వరకు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మిగితా గాయాల కన్నా తలకు తలగిన గాయాలు ప్రాణాంతకం. – డాక్టర్ మనోజ్ భరత్, న్యూరో ఫిజీషియన్హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ యాక్టివ్ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తాం. – దుర్గాప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి -
ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుంది
నిర్మల్టౌన్: ప్రతీ రక్తపుబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనాతో పాటు 350 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదాతలు నిజమైన దేవుళ్లు అని అన్నారు. ప్రాణప్రాయస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయడం అంటే.. కొత్త జీవితం ఇవ్వడమే అన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్టౌన్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
భైంసా/భైంసారూరల్ : జిల్లాలో నెల రోజుల క్రితం నుంచి సోయా కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించి పంటను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్తో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర నుంచి పాదయాత్ర ప్రారంభించారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అక్టోబర్ 14న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సోయా దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇప్పటికీ కొనుగోళ్లు లేవు... సోయా సాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పంట కోసి కల్లాల్లో ఆరబోసినా వర్షం ఇబ్బందులు తప్పడంలేదు. ఇటీవల వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల్లో స్పష్టత కరువైంది. కోసిన పంట ఇళ్లలో నిల్వ చేసుకోలేక, కల్లాల్లో ఆరబెట్టలేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 31 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇటువైపు మహారాష్ట్రలోనూ ఈ నెల 30 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. కానీ మన నిర్మల్ జిల్లాలో మాత్రం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు. ప్రైవేటు వ్యాపారులకే కలిసివస్తోంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం ప్రైవేటు వ్యాపారులకే కలిసి వస్తోంది. సోయా క్వింటాకు ప్రభుత్వం రూ.5,328 మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రైవేటు వ్యాపారులు రూ.3,900 నుంచి రూ.4,300 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అదనంగా కమీషన్ చార్జీలు, చాట వాల చార్జీలతో రైతులను దోచుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులే రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే రైతుల పేరిట వ్యాపారులు కొనుగోలు చేసిన సోయాలే విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.వెయ్యి వరకు ధర కలిసివస్తుందని ఆలోచిస్తున్న వ్యాపారులు రైతుల పట్టాపాసు పుస్తకాలు తీసుకుని పంట విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించడం మధ్య దళారులు ప్రైవేటు వ్యాపారులకే ఏటా కలిసి వస్తోంది. భైంసా మార్కెట్కు విక్రయానికి తీసుకువచ్చిన సోయాలుజిల్లా సమాచారం ప్రభుత్వ పాఠశాలలు : 830 విద్యార్థులు : 67,790 ఏఐ విద్యా భోధన అమలవుతున్న పాఠశాలలు: 11 అన్నదాత అరిగోసజిల్లా వివరాలు నియోజకవర్గాలు : ఖానాపూర్, నిర్మల్, ముధోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు : ఖానాపూర్, నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్ జిల్లాలో సోయా సాగు : 1.05 లక్షల ఎకరాలు రైతులు : 72,300 ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు : రూ.5,328 ప్రైవేటులో : రూ.3,900 నుంచి రూ.4,300 ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, దిగుబడి వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, నిర్మల్ సమయం లేక అమ్ముకుంటున్నారు... వేసవి సాగు కోసం భూములను సిద్ధం చేసేందుకు రైతులు పంట చేలలోనే ఉంటున్నారు. వర్షాకాలంలో పండించిన సోయా నిల్వలు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బులతో పంట భూములను సిద్ధం చేస్తున్నారు. రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేసే ఆలోచనలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక వేసవి పంటల సాగు కోసం కాలాన్ని వృధా చేసుకోలేక వచ్చిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్న అధికారులు ప్రభుత్వానికి వివరించి కొనుగోలు కేంద్రాలు తెరవడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ జిల్లాలోని సోయా రైతులు నష్టపోతున్నారు. -
కిక్కు.. ఎవరికో లక్కు..
నిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం సోమవారం లక్కీ నిర్వహించనున్నారు. డ్రా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి లక్కు ఎవరిని వరించనుందని టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకుంటున్నారు. వ్యాపారుల్లో ఆందోళన.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనే వ్యాపారులు ప్రతీ దరఖాస్తుకు రూ.3లక్షల నాన్ రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. లక్కు తగలకపోతే ఆ మొత్తం తి రిగి రాదు. ఈ కారణంగా చాలామంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు వెనుకడుగు వేశారు. గతంలో 50 నుంచి 90 దరఖాస్తులు వేసి లక్కు తగలకపోయినా అనుభవం ఉన్న వ్యాపారులు ఈసారి దూరంగా ఉన్నారు. కొంతమంది నాన్ రీఫెండబుల్ ఫండ్లలో కనీసం 50 శా తం రీఫండ్ ఇచ్చే విధానం అవలంబిస్తే, దరఖా స్తుల సంఖ్య రెట్టింపు అయ్యేదని అంటున్నారు. నేడు లక్కీ డ్రా.. వైన్షాపుల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి నేడు కలెక్టరేట్ భవనంలోని మీటింగ్ హాల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు దారులకు ఇప్పటికే పాస్లు సైతం జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన పాస్ తీసుకుని వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. డిసెంబర్ 1 నుంచి నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా కొత్త వ్యాపారులు రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ ప్రారంభించనున్నారు. 47 దుకాణాలకు 991 దరఖాస్తులు నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 47 వైన్స్ దుకాణాలకు గతనెల 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23న ముగిసింది. 991 దరఖాస్తులు రాగా ఒక్కో అప్లికేషన్కు రూ.3 లక్షల చొప్పున ఎకై ్సజ్శాఖకు రూ.29.73 కోట్ల ఆదాయం సమకూరింది. అర్బన్లో 448, రూరల్లో 543.. మూడు మున్సిపాలిటీల పరిధిలో 19 వైను్ుస్ల ఉండగా 448 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాప్ నెంబర్ 1లో 34, 10లో 44, 11లో 35 దరఖాస్తులు అందాయి. రూరల్ ప్రాంతాల్లో 28 షాపులు ఉండగా 543 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా సారంగాపూర్ మండలంలోని షాప్ నెంబర్ 22, 23లో 35 చొప్పున దరఖాస్తులు అందాయి. రిస్క్ తక్కువ.. ఇన్కాం ఎక్కువ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో రిస్క్ తక్కువే. దీంతో ఎక్కువ మంది రూరల్ ప్రాంతాల్లోని షాపులపైనే దృష్టి పెట్టారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో రూ.60 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. వాటి పరిధిలోని 16 షాపులకుగానూ 8 షాపులకు 20లోపు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు ఒక్కరికే అనుమతి వైన్స్షాపుల కేటాయింపు కోసం నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నాం. ఇందుకోసం ఏ ర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దరఖాస్తుదారులకు పాస్లు జారీ చేశాం. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలలోపు చేరుకోవాలి. ఎంట్రీపాస్ వెంట తెచ్చుకోవాలి. హాల్లోకి మొబైల్ఫోన్లకు అనుమతిలేదు. ఒక్క దరఖాస్తు నుంచి ఒక్కరినే అనుమతిస్తాం. – అబ్దుల్ రజాక్, జిల్లా ఎకై ్సజ్ అధికారి -
గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జలమ్మ ప ల్లకి సేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బోనా లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అడెల్లిలో భక్తుల సందడిసారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజమాబాద్, వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. మన్ కీ బాత్ వీక్షించిన ‘ఏలేటి’నిర్మల్చైన్గేట్/ఖానాపూర్: ప్రధాని నరేంద్రమోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఖానాపూర్లో బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పిట్టల భూమన్న, జెట్టి చిన్న రాజన్న, పన్నెల సురేశ్, పంజాల శివ, భీమన్న, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు. స్వదేశానికి జోర్డాన్ బాధితులు కుంటాల/సోన్: జోర్డాన్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 12 మంది కార్మికులు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. అక్కడ తాము పడుతున్న కష్టాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వారిలో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముఖిమ్, సోన్ మండలంలోని కూచన్పెల్లికి చెందిన మెట్టు ముత్యం ఉన్నారు. మాజీ మంత్రి హరీష్రావు కూలీలకు వేసిన జరిమానా చెల్లించి, విమాన ప్రయాణ చార్జీలు భరించి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. 15 నెలల పాటు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం ముఖిమ్, ముత్యం ఇంటికి రాగానే సంతోషపడ్డారు. -
ఏఐ బోధనకు అడ్డంకులు!
లక్ష్మణచాంద: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 15న జిల్లాలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను ప్రారంభించింది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కంప్యూటర్ ద్వారా విద్యను అందించాలని సంకల్పించింది. ఈ విద్యా సంవత్సరం మరో 14 పాఠశాలల్లో ప్రారంభించారు. 8 పాఠశాలలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో కేవలం 6 పాఠశాలల్లోనే అమలవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 11 పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్యాబోధన జరుగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యం ఇదే.... ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు, పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఏఐ విద్య దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 1, 2 తరగతుల వి ద్యార్థులకు గణితం, 3, 4, 5 తరగతుల విద్యార్థుల కు గణితంతో పాటు, తెలుగు,ఆంగ్లం సులువుగా నే ర్పవచ్చని ఉపాధ్యాయులుపేర్కొంటున్నారు. వీటి నికంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసిబోధన చేస్తున్నారు. అన్ని పాఠశాలలో అమలు చేస్తామని తెలిపిన... గతేడాది పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించగా ఈ విద్యా సంవత్సరం మొత్తం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సగం పని దినాలు పూర్తయినా ఇప్పటి వరకు అన్ని పాఠశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత విద్యాబోధన ప్రారంభం కాలేదు. కారణాలు ఇవే... ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా విద్యాబోధన చేయాలని నిర్ధారించిన పాఠశాలల్లో అనేక అవరో దాలు ఎదురవుతున్నాయి. ప్రతీ పాఠశాలకు 5 కంప్యూటర్లు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్ప టి వరకు పంపిణీ చేయలేదు. వేసవి సెలవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇప్పటి వర కు ఏ ఒక్క పాఠశాలలో అమలుకాలేదు. దీంతో ఏఐ ఆధారిత విద్యాబోధన ప్రారంభమైన పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్యాబ్తో పాటు సమీపంలోని ఎంఈవో కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల నుంచి కంప్యూటర్లు తెచ్చుకుని ఉపాధ్యాయుల ఫోన్ల నుండి ఇంటర్నెట్ అనుసంధానం చేసుకుంటూ బోధన కొనసాగిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలి పారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏఐ విద్యాబోధన అమలుకు సరిపడా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గం
ఖానాపూర్: ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గం సాధ్యమవుతుందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ గోదా శ్రీకృష్ణ నూతన మందిర ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో హవనాలు, శాంతిపాఠం, వేద పారాయణాలు, శాంతిహోమం, మహా పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం శ్రీగోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికర్త దేవుడు లేనిదే జీవుడు లేడని, మాధవ సేవగా సర్వప్రాణి సేవచేసి తరించాలని అన్నారు. మనిషి ఎంత సంపాదించినా ఎంత చేసినా చివరికి మిగిలేది మంచి జ్ఞాపకాలేనన్నారు. ఆలయాలు నిర్మించడం సంతోషకరమని, అర్చకులు వద్దిపర్తి వెంకటరమణ సంకల్పాన్ని రూపా సురేశ్రెడ్డి, అనితారెడ్డి సఫలం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు పైడిపెల్లి రవీందర్ రావు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డా.సునీత విజయ్కుమార్, నాయకులు భూక్య జాన్సన్ నాయక్, చిన్నం సత్యం, కల్వకుంట్ల నారాయణరావు, కొత్తపెల్లి సురేశ్, అల్లాడి వెంకటేశ్వర్లు, మంత్రరాజ్యం సురేశ్, కొండాడి గంగారావు, కొందుకూరు శ్రీనివాస్, బీసీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
నిర్మల్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అనిత శ్రీనివాస్ ఫోటో ఎంబ్రాయిడరీ స్టోర్ను ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు తీసుకురానునట్లు తెలిపారు. కొయ్య బొమ్మల తయారీపై ఆధారపడిన కుటుంబాలకు 90 శాతం సబ్సిడీతో రూ.5కోట్ల రుణం త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కళ అంతరించిపోకుండా స్కిల్ యూనివర్సిటీ సిలబస్ లో నిర్మల్ కోయబొమ్మల అంశాన్ని చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చిత్రాలు వేసే శ్రీనివాస్ కళాకారుడికి జిల్లా కేంద్రంలో ఎంబ్రాయిడరీ షాప్ ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ నాయకులు నాందేడపు చిన్ను, తదితరులు పాల్గొన్నారు. -
దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
భైంసాటౌన్: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా భైంసా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డ్లో పథ సంచలన్–సార్వజనికోత్సవం నిర్వహించారు. ముందుగా ఆయా కాలనీల నుంచి స్వయం సేవకులు పురవీధుల మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ మా ట్లాడుతూ.. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో పనిచేస్తుందని, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ విస్తరించిందన్నారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మ తాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్త నాగ్నాథ్ పటేల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, సహ సంఘచాలక్ సాదుల కృష్ణదాస్, స్వయం సేవకులు, మహిళలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ ఓటరు జాబితా సిద్ధం చేయాలి
నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారుల ను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 2002లో రూపొందించిన ఎస్ఐఆర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏ ఈఆర్వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్వో సూ పర్వైజర్లతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజు లక్ష్యాలను నిర్ణయించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పద్ధతిగా అమలు చేయాలన్నారు. కేటగిరీ–‘ఏ’లోని వివరాలను నిర్ధారించి, ‘సి’, ‘డి’ కేటగిరీ వివరాలతో అనుసంధానం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లొస్తున్నారు..
నిర్మల్చైన్గేట్: భూమి కొలతలలో పారదర్శకత, కచ్చితత్వం సాధించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు ప్రారంభించింది. ఆధునిక పరికరాలతో భూసర్వే చేపట్టేందుకు జిల్లాలో లైసెన్స్ పొందిన సర్వేయర్లు అధికారికంగా రంగంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 23న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన 49 మందికి లైసెన్సులు అందజేశారు. మండలాల వారీగా సర్వేయర్ల కేటాయింపు జిల్లాలో మొత్తం 18 మండలాల్లో సర్వేయర్ల డిమాండ్ అధికంగా ఉంది. ప్రతీ మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 12 మంది రెగ్యులర్ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల రాకతో భూ కొలతల వేగం పెరగనుంది. మొదటి విడతలో 73 మందికి శిక్షణ.. భూసర్వేయర్గా మారేందుకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ప్రభుత్వం మొదటి విడతలో 73 మందిని ఎంపిక చేసింది. 50 రోజుల సాంకేతిక శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో 49 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి సీనియర్ సర్వేయర్ల ఆధ్వర్యంలో అదనంగా 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. అర్హత సాధించిన వారికి ఇటీవల ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. రెండో బ్యాచ్కు శిక్షణ షురూ.. ఆగస్టు 18న ప్రారంభమైన రెండో బ్యాచ్లో మొత్తం 81 మంది పాల్గొంటున్నారు. గత పరీక్షలో ఉత్తీర్ణత పొందలేని 24 మందికి అక్టోబర్ 26న మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. తదుపరి దశలో ఉత్తీర్ణులైన వారికి కూడా లైసెన్సులు జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అధునాతన పరికరాలతో కొలతలు లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ప్రభుత్వం డీజీపీఎస్ మిషన్లు అందించనుంది. వీటి సహాయంతో భూ సరిహద్దులు నాణ్యమైన డిజిటల్ డేటాలో నమోదు కానున్నాయి. ఇది రికార్డు స్పష్టతను తెచ్చి, భూవివాదాలను తగ్గిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది సర్వేయర్లు తమ పారితోషికాల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ ప్రోత్సాహక వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలో మండలాల కేటాయింపు.. ఈనెల 23న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా మొదటి విడత ఉత్తీర్ణులైన 49 మందికి లైసెన్సులు అందించారు. అధికారుల ఆదేశాల ప్రకారం త్వరలోనే వీరికి మండలాలు కేటాయిస్తాం. మొదటి విడతలో ఫెయిల్ అయిన వారితోపాటు రెండవ బ్యాచ్కు ఈ నెల 26న రాత పరీక్ష ఉంటుంది. – రాథోడ్ సుదర్శన్, ఏడీ సర్వేయర్జిల్లా వివరాలు మొత్తం మండలాలు 18 రెగ్యులర్ సర్వేయర్లు 12ఐకేపీ సర్వేయర్లు 5జిల్లాలోని మొత్తం సర్వే నంబర్లు 1,67,046 జిల్లాలోని భూ విస్తీర్ణం 8,96,523.11 ఎకరాలు మొదటి విడత ట్రైనింగ్ పొందిన సర్వేయర్లు 73అనుత్తీర్ణులైన వారు 24లైసెన్స్ పొందిన సర్వేయర్లు 49రెండవ విడత పరీక్ష రాసేవారు 81 -
సంతోష్నగర్ పాఠశాలకు రాష్ట్రస్థాయి అవార్డు
మామడ: ఎఫ్ఆర్ఎస్ అమలులో భాగంగా మండలంలోని సంతోష్నగర్ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో అవార్డు లభించింది. వందశాతం హాజరు నమోదుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఏఎస్పీడీ రాధారెడ్డి, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, నిర్మల్ డీఈవో భోజన్న చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ద్యాగ రాజేంద్ర లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఉదయం 8గంటలకే పాఠశాలకు... పాఠశాలలో 61 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఉదయం 8 గంటలకే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాలకు రప్పించే విధంగా ప్రణాళిక వేసుకుని అమలు చేస్తున్నారు. పాఠశాలలో కృత్యాదార బోధనతో విద్యార్థులు ఆకర్షితులై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మెరుగైన హాజరుతో పాఠశాలను అవార్డు వరించింది. -
అటవీ సంపద భవిష్యత్ తరాలకు అందించాలి
మామడ: అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని, అడవుల సంరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్లో అటవీ వన్యప్రాణుల చట్టాలపై జిల్లా లీగల్ సెల్ అథారిటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నల్దుర్తి తుర్కం చెరువు, వెంగన్న చెరువు ఎకోటూరిజం సర్క్యూట్ను పరిశీలించి, సఫారీ నిర్వహించారు. చెరువు వద్ద ఉన్న బైనాక్యూలర్స్ ద్వారా పక్షులను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో నాగిని భాను, దిమ్మదుర్తి, నిర్మల్ ఎఫ్ఆర్వోలు శ్రీనివాస్రావు, రామకృష్ణారావు, డీఆర్వో నజీర్ఖాన్, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజలింగం, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ లింగాగౌడ్, న్యాయవాదులు రమణారావు, రంజిత్, టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది అన్నపూర్ణ, వెంకట్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించాలి
నిర్మల్చైన్గేట్: అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు జిల్లా వారీగా రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. అర్హులకు ధ్రువీకరణ పత్రం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి సులభంగా అందుతాయన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో నెలకు సుమారు 12 శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 960 యూడీఐడీ కార్డులు అందించినట్లు తెలిపారు. దివ్యాంగులు శిబిరాలకు హాజరయ్యేలా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. -
సోయా రైతు చిత్తు..!
భైంసాటౌన్: భైంసా మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరువాత అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ భైంసా కావడంతో భైంసా డివిజన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుంటున్న ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు. క్యాష్ కటింగ్ పేరిట కోతలు.. మార్కెట్లో కమీషన్ ఏజెంట్ వ్యవస్థ రైతులను పీడిస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించాలంటే కమీషన్ ఏజెంట్ తప్పనిసరి. ముందుగా వ్యవసాయ మార్కెట్కు తెచ్చింది మొదలు పంట అమ్ముకునే వరకు దోపిడీ తప్పడం లేదు. రైతు తెచ్చిన పంట కుప్పను ముందుగా ట్రేడర్లు పరిశీలించి తేమ శాతం ఆధారంగా ఈ–నామ్లో ధర నిర్ణయిస్తారు. ఇందులో హమాలీ, దడ్వాయి, చాటావాల చార్జీలతో పాటు కమీషన్ ఏజెంట్ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 కోత విధిస్తున్నారు. ఇదంతా తక్పట్టీపై అధికారికంగా కోత విధిస్తుండగా, అనధికారికంగా తక్పట్టీ వెనుక కమీషన్ ఏజెంట్లు క్యాష్ కటింగ్ పేరిట రూ.వందకు మరో రూ.1.50 అదనంగా కోత విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట విక్రయించేదే డబ్బుల కోసమని.. అలాంటిది క్యాష్ (నగదు చెల్లింపు) కటింగ్ పేరిట అదనంగా కోత విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తూకాల్లోనూ 50 కిలోల సంచికి 1200 గ్రాములు అదనంగా తీసుకుంటున్నారని వాపోతున్నారు. పట్టించుకోని ఏఎంసీ అధికారులు.. మార్కెట్ యార్డులో ఇష్టారీతిన డబ్బుల చెల్లింపులో కోతలు విధిస్తున్నా.. సంబంధిత మార్కెట్ కమిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. కమీషన్ చార్జీల పేరిట అనధికారికంగా వసూలు చేస్తున్నా.. వారిని ప్రశ్నించిన పాపాన పోవడం లేదు. మరోవైపు దీపావళి ఇనామ్ పేరిట చాటావాలాలు ఇబ్బందికి గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే, పంట విక్రయానికీ ఇబ్బందులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్లో ఇష్టారీతి దోపిడీని అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. రైతులు ఫిర్యాదు చేయాలి.. మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులు విక్రయించే రైతుల వద్ద నగదు చెల్లింపు పేరిట కమీషన్ ఏజెంట్లు అదనంగా వసూలు చేయవద్దు. నిబంధనల ప్రకారం రూ.వందకు రూ.1.50 మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా అదనంగా వసూలు చేస్తే రైతులు ఫిర్యాదు చేయాలి. – పూర్యానాయక్, ఏఎంసీ సెక్రెటరీ, భైంసా అదనంగా కోత పెట్టొద్దు.. కమీషన్ ఏజెంట్ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 మాత్రమే రైతు వద్ద తీసుకోవాలి. అదనంగా నగదు చెల్లింపు పేరిట ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి, నిర్మల్ -
మొలకలతో ఆరోగ్యం
పెసర్లు, శనగలు, పల్లీలు, తదితర తృణధాన్యాలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.ఆత్మవిశ్వాసానికి మూలం గ్రంథాలయాలు చదువుకే కాదు, ఆత్మవిశ్వాసానికి మూలం. గ్రంథాలయంలో ఉన్న ప్రశాంత వాతావరణం, ఒకే లక్ష్యంతో కష్టపడుతున్న ఇతర అభ్యర్థుల స్ఫూర్తి మాకు ఉత్సాహాన్నిచ్చింది. రోజువారీ సమయపాలన, పరీక్షల ప్రాక్టీస్, పుస్తకాల లభ్యత ఇవన్నీ మా విజయానికి కారణమయ్యాయి. – ప్రకాశ్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్–4 విజేత, గోపాల్పేట్, సారంగపూర్ చక్కని మార్గనిర్దేశనం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మాలాంటి నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు చక్కని మార్గదర్శనం చేస్తున్నాయి. ఉచిత పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు కూర్చుని చదివేందుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే చదివి వార్డ్ ఆఫీసర్, గ్రూప్–2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించా. – కే.రమేశ్, గ్రూప్–2 విజేత, ఖానాపూర్ ఇక్కడే చదివి.. ఇక్కడే కొలువులు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాలు చక్కని అవకాశం కల్పించాయి. జిల్లా వాసులైన మేము ఇక్కడే చదివి ఇక్కడే కొలువులు సాధించడం మరిచిపోలేని అనుభూతి. ఇందులో గ్రంథాలయాల పాత్ర అత్యంత కీలకం. – లిఖిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సౌజన్య, ఎన్పీడీసీఎల్ ఏఈ -
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
నిర్మల్టౌన్: పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నిర్మల్కు చెందిన దాత సౌజన్యంతో ప్రతిభ కలిగి, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్న హోంగార్డ్ కుటుంబాలకు చెందిన 20 మంది విద్యార్థులకు, గతంలో చనిపోయిన హోంగార్డు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పేద కుటుంబాలకు చెందిన సిబ్బంది ఉన్నారన్నారు. వారిలో చాలామంది పిల్లలు ప్రతిభావంతులు ఉన్నారని, అలాంటి పిల్లల ప్రతిభను గుర్తించి, ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు ఈ ప్రోత్సాహాన్ని అందించామని తెలిపారు. ప్రోత్సాహం పొందినవారు.. పి.శ్రీనివాస్, శృతిలయ, శివకుమార్, మాసం సాత్విక్, ఆర్.లావణ్య, జాదవ్దివ్య, ఎన్.శిల్ప, జె.స్మిత, చరణ్, వర్ష, సాయి సృజన్, దినేష్, గంగమణి, డి.రాకేశ్, ఎండీ.అయాన్ఖాన్, ప్రణీత్కుమార్, జి.అశ్విని, కె.ఆనంద్, ఐశ్వర్య. -
ఆదర్శ విద్యార్థుల ప్రతిభ
కుంటాల: ఇటీవల నిర్మల్లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్లో కుంటాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు దివ్య, నాగజ్యోతి, విశాల్, జస్వంత్, అవంతిక, విద్య, స్వప్న, కార్తికేయ, మోక్షశ్రీ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్లోనూ ప్రతిభ కనబరిచి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. వీరికి ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులను డీఈవో భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, గైడ్ టీచర్ గంగప్రసాద్ అభినందించారు. హంగిర్గా శివారులో చిరుత సంచారం తానూరు:మండలంలోని హంగిర్గా శివారు ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా గ్రామ శివారు ప్రాంతంలో కూలీలు, ద్విచక్రవాహన దారులు చిరుత సంచారాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళేందుకు జంకుతున్నారు. బుధవారం సాయంత్రం చిరుత సంచారాన్ని సెల్ఫోన్లో చిత్రికరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అధికారులకు సమాచారం అందించడంతో బీట్ అధికారి కృష్ణ బుధవారం గ్రామానికి సందర్శించి రైతులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని, పనులకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రివేళ పశువులను ఇంటి సమీపంలో కట్టేసుకోవాలని తెలిపారు. -
పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి
నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి పీఆర్సీపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయని, హామీకి కట్టుబడి తెలంగాణలోనూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెట్ నుంచి మినహాయింపు విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్లో ఆర్థిక శాఖ అలసత్వం సరికాదన్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ప్రభుత్వం అదే రీతిలో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలు ఇంకా అందక పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్షేక్, నాయకులు శ్రీనివాస్, పరమేశ్వర్, అశోక్కుమార్, లక్ష్మీనారాయణ, ఖాలిద్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో సత్యనారాయణస్వామి పూజలు
బాసర: కార్తీకమాసం సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తామని ఈవో అంజనాదేవి తెలిపారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీసూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు గోదావరి నదికి సాయంత్రం 6:30 గంటలకు కార్తీక దీపారాధన పూజలు చేస్తామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలు హాజరు కావాలని కోరారు. ఆలయానికి మంగళవాయిద్యాలు.. బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన భక్తులు శనగశెట్టి జగదీశ్ – బొబ్బిలి ప్రసాద్ కుటుంబ సభ్యులు మంగళవాయిద్యాలను అందించారు. అమ్మవారికి అభిషేకం సమయంలో వినియోగించేలా ఒక డోలు, రెండు సన్నాయిలను విరాళంగా అందజేశారు. వీటి విలువ రూ.44,200 ఉంటుందని ఆలయ అనువంశిక ట్రస్ట్ సభ్యుడు శరత్ పాఠక్ తెలిపారు. వీరివెంట ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, సన్నాయి డోలు సిబ్బంది ఉన్నారు. -
అనుబంధానికి ప్రతీక
అక్కాతమ్ముడు, అన్నాచెలె ్లళ్ల అనుబంధానికి ప్రతిక భావుబీజ్ ఉత్సవాలు. మహారాష్ట్రకు అనుకుని ఉన్న మండలాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. నిర్మల్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలిమామడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మంజూరైన నిఽ దులు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, డీఈ గంగాధర్, మండల ప్రత్యేక అధికారి రాజనర్సయ్య, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో ఉపేందర్, ఏఈ హరీశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కడెం:ఈ ఏడాది జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కానీ జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరి వృథాగా పోయింది. జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ఉండగా.. ఈ వర్షాకాలం మూడు ప్రాజెక్టులకు కలిపి 78.073 టీఎంసీల వరద నీరు వచ్చింది. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుల అధికారులు 66.28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. కడెంకు సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న కడెం ప్రాజెక్టు కింద 68 వేల ఎకరాలకు ఆయకట్టు ఉంది. అయితే ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది 57.388 టీఎంసీల ఇన్ఫ్లో రాగా, 47.179 టీఎంసీలు గోదావరిపాలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, 2.904 టీఎంసీల మేర పూడిక ఉంది. దీంతో ఈ సారి కేవలం 4.699 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అధికారులు ప్రాజెక్టులో పూడిక తొలగించడంతోపాటు గేట్లు, కాలువలకు సాంకేతికంగా మరమ్మతులు అవసరమని పేర్కొంటున్నారు. ‘గడ్డెన్నవాగు’కు ప్రవాహం ఎక్కువ.. భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సంవత్సరం ప్రాజెక్టుకు 14.225 టీఎంసీల వరద వచ్చింది. అందులో 12.971 టీఎంసీలను అధికారులు వరద గేట్ల ద్వారా వృథాగా వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుతం 1.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ‘స్వర్ణ’ సామర్థ్యమూ తక్కువే.. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు కింద సుమారు 9 వేల ఎకరాలు సాగవుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి 6.130 టీఎంసీల వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం తక్కువగా ఉండడంతో 6 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.037 టీఎంసీలు. ప్రస్తుతం అదే స్థాయిలో నీరు ఉంది. ప్రాజెక్టు నిండినా వారాలకే నీరు తగ్గిపోతుందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. పూడికతో తగ్గిన సామర్థ్యం.. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో ఏళ్లుగా పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 30–35 శాతం మేర తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీళ్లు(ఫైల్)పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. ఖరీఫ్సాగు పూర్తయింది. రెండో పంటకు సాగు నీరందించేందుకు లీకేజీలను ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగికి కూడా పూర్తిగా నీరు అందిస్తాం. – ప్రవీణ్, ఈఈ కడెం ప్రాజెక్టు ఇదీ జిల్లా ప్రాజెక్టుల వరద నీటి లెక్క టీఎంసీలలో.. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్:వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకుల సమాచారం, టెంట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలుకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 9182958858 ను ప్రదర్శించేలా ప్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. సరిపడా సిబ్బంది, కూలీలు, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలుకు సంబంధించిన వివరాలను రోజువారీగా అందజేయాలని పేర్కొన్నారు. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లాలో వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, పూర్తి చేయడానికి ఉన్న గడువు ఆరా తీశారు. అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో సీపీవో జీవరత్నం, వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారులు సందీప్, వేణుగోపాల్, సునీల్ కుమార్, గంగాధర్గౌడ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ గురువారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డు అవుతున్న విధానాన్ని పరిశీలించారు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాం తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులకు సూచించారు. -
అట్టహాసంగా జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖానాపూర్: పట్టణంలోని ఏసీఈ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గురువారం నిర్వహించారు. ఎంపీడీవో రమాకాంత్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రవీందర్గౌడ్ పోటీలను ప్రారంభించారు. యూత్ విభాగం, జూనియర్ విభాగం, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కుత్బుద్దీన్, కరస్పాండెంట్ షేక్ అజార్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షోయబ్, ఇమ్రాన్, ఆర్చరీ కోచ్ అంబేడ్కర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ కిశోర్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారిలో అభిషేక్, సిద్ధార్థ, రిషిత్, విష్ణు, నవీన్, అయాన్, శ్రీనిధి, సంహిత, వర్షిణి, విజ్ఞత ఉన్నారు. నవంబర్ 7న వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. -
రహదారులే కల్లాలు
లక్ష్మణచాంద:వ్యవసాయ జిల్లాగా పేరుగాంచిన నిర్మల్ జిల్లా ప్రస్తుతం వానాకాలం పంటల కోతలు మొదలయ్యాయి. మొక్కజొన్న, సోయాబీన్ కోతలు దాదాపు ముగింపు దశలో ఉండగా, మరో వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. పంటలు కోసిన రైతులు కల్లాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో స్థలం కొరత కారణంగా రోడ్లనే కల్లాలుగా మారుస్తున్నారు. గ్రామాల్లో రోడ్లపై పంటలు ఆరబెడుతున్నారు.జిల్లాలోని పలు మండలాల రైతులు ఖాళీ ప్రదేశాలు లభించక ఇలా చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అవగాహన లోపంతో.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నాయి. అయితే రైతులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపైనే పంటలు ఆరబోస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు రాత్రిళ్లు ధాన్యంపై టార్పాలిన్ కవర్లు వేస్తున్నారు. ఆ కవర్లు కొట్టుకుపోకుండా పెద్ద బండరాళ్లు పెడుతున్నారు. వాహనదారులు చీకట్లో అవి కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం సమీపంలో బైక్ వెళ్తున్న ఓ కుటుంబ రోడుపై ఆరబెట్టిన మొక్కజొన్నపై జారిపడి ప్రమాదానికి గురైంది. రైతులకు అవగాహన లేకపోవడంతో ఇలా చేస్తున్నారు. చర్యలకు ముందుకు రాని అధికారులు రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు చిన్న పంట కలాలు, ఆరబెట్టే స్థలాలు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి అమలు కావడం లేదు. అధికారులు, పోలీసులు, సామాజిక సంస్థలు రైతులు పంటలు రోడ్లపై ఆరబెట్టకుండా అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. -
పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్
నిర్మల్రూరల్: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి ఏఎస్పీ రాజేశ్మీనా విద్యార్థులకు వివరించారు. సిబ్బంది విధులు, బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసే విధానం, విచారణ, సైబర్ వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు. -
భూములపై కదలిక
నిర్మల్: సర్కారు భూముల కబ్జాలపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుండటం, వరుసగా మీడియాలో కథనాలు వస్తుండటంతో కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్గా తీసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్తో పాటు అవసరమున్నచోట పోలీసులతో పాటు సంబంధిత శాఖల సహకారంతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఆక్రమణలను అధికారులు పరిశీలించారు. సర్కారు స్థలాల రక్షణకు ట్రెంచ్లను కొట్టిస్తున్నారు. పరిశీలించిన అధికారులు... జిల్లా కేంద్రంలో ఎప్పటి నుంచో భూకబ్జాలపై వస్తున్న పలు ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ఆర్డీవో రత్నకల్యాణి సహా అర్బన్ తహసీల్దార్, టౌన్ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఇంజినీర్, సర్వేయర్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. స్థానిక నిర్మల్–నిజామాబాద్ రోడ్డులో కంచెరోని చెరువు వద్ద ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలన చేపట్టారు. అలాగే నిర్మల్–మంచిర్యాల రోడ్డులో కలెక్టర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హద్దుల ప్రకారం ఇక్కడ మూడువైపులా ట్రెంచ్(కందకం) కొట్టాలని నిర్ణయించారు. ఇటీవల అయ్యప్పటెంపుల్ ఎదురుగా, దివ్యగార్డెన్ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన చోట సర్కారు భూముల బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.కోట్లు పలుకుతుండటంతోనే.. నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరం భూమి రూ.కోట్లు పలుకుతోంది. మంచిర్యాలరోడ్డులో గల ఏఎన్రెడ్డి కాలనీ, దివ్యనగర్, దత్తాత్రేయనగర్ తదితర కాలనీల్లో ఒక్కో ప్లాటు ధర రూ.50 నుంచి రూ.60లక్షల వరకు ఉందంటే ఇక్కడి భూముల విలువ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే ఇక్కడి సర్కారు భూములపై కొందరు బడానేతలు కన్నేశారు. అసైన్డ్ భూముల్లో వెంచర్లువేసి, ప్లాట్లు విక్రయించడమే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూములనూ కలిపేసుకోవడం, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలను చేపట్టడం గమనార్హం. గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పెద్దగా సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇందుకు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటమూ కారణమే. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి స్వయంగా వెళ్లి అసైన్డ్, ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో జిల్లా అధికారులు సీరియస్గానే స్పందిస్తున్నారు. ఎక్కడా.. జాగా లేదంటూ... ‘సార్.. మా సంఘానికి రెండుగుంటల జాగా చూపియండి కదా..’ అని ఏదైన సంఘంవాళ్లు అడిగినా, ‘సార్.. రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి..’ అని విన్నవించినా.. ‘నిర్మల్లో ఎక్కడా.. సర్కారు భూమి లేదు. ఏదైనా చెరువు దగ్గరో, ఊరవతలో చూసుకుపోండి..చేద్దాం..’ అంటూ పాలకులు, అధికారులు సమాధానం చెబుతుండేవారు. డిజిటల్ లైబ్రరీ పెట్టాలన్నా, ఇండోర్ స్టేడియం కట్టాలన్నా, అంబేద్కర్, బీసీ స్టడీసర్కిళ్లను నిర్మించాలన్నా.. సెంటు భూమి లేదన్న సమాధానమే వచ్చేది. కానీ.. ఇటీవల అధికారుల పరిశీలనల్లో ఎకరాలకు ఎకరాలను కబ్జాపెట్టిన తీరు బయట పడుతోంది. అయ్యప్పటెంపుల్ వద్ద గుర్తించిన ప్రభుత్వ భూమిలో డిజిటల్ లైబ్రరీ, ఇండోర్స్టేడియం, ఇంకా ప్రజాపయోగ నిర్మాణాలను చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే.. జిల్లావ్యాప్తంగా కబ్జాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. -
పేదల గూడు.. ‘ఉపాధి’ తోడు
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. నిర్మాణంలో ఎదురవుతున్న కూలీల కొరతను నివారించి పనులు నిరంతరంగా సాగేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. గ్రామీణస్థాయిలో అమలు కూడా ప్రారంభమైందని సమాచారం. లబ్ధిదారులకు ‘ఉపాధి’.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టే వారిలో జాబ్కార్డు కలిగిన లబ్ధిదారులకు నేరుగా 90 రోజుల పనిదినాలు కల్పించనుంది. ఈ విధానంతో ఇంటి నిర్మాణానికి కూలీలు అందుబాటులో ఉండడం మాత్రమే కాకుండా, లబ్ధిదారుడే తన ఇంటి నిర్మాణంలో భాగస్వామిగా మారి డబ్బులు సంపాదించుకునే అవకాశం పొందుతాడు. ఇంటి నిర్మాణ పనిని దశలవారీగా విభజించి, మొత్తం 90 రోజుల ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేస్మెంట్ స్థాయిలో 40 రోజుల పనిదినాలు, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పనిదినాలు కల్పిస్తారు. మొత్తం 90 పనిదినాలకు రూ.27,630 చెల్లిస్తారు. జిల్లాస్థాయిలో పురోగతి ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో 131 ఇళ్లను ఉపాధిహామీ పథకం కింద గుర్తించారు. ఇందులో గోడలస్థాయి వరకు 92 ఇళ్లు, స్లాబ్ దశకు చేరుకున్న 39 ఇళ్లు నిర్మాణ పనులను పూర్తి చేశాయి. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా, స్వగృహ నిర్మాణ ప్రాంతంలోనే రోజువారీ మస్టర్ వేసి కూలీ పొందవచ్చు. ఈ విధానంతో నిర్మాణ వేగం పెరగడంతోపాటు, కార్మిక శక్తి సమర్థంగా వినియోగించబడుతోంది. రెండు విధాలా ప్రయోజనం.. ఈ కొత్త సమీకరణ ప్రజల జీవితాల్లో రెండు విధాలుగా మార్పు తీసుకురానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగ కార్మికులకు స్థిరమైన పని లభిస్తుంది. ఇదే సమయంలో ఇళ్ల నిర్మాణ వేగవంతం అవుతుంది. పథకాల అమలులో ఆలస్యం తగ్గి వేగంగా పూర్తవుతాయి. మండలాలవారీగా ఉపాధి హామీ పథకానికి అర్హులు మండలం స్లాబ్లెవెల్ గోడలవరకు మొత్తం బాసర 0 5 5 భైంసా 13 11 24 దిలావర్పూర్ 0 4 4 కడెం 4 6 10 ఖానాపూర్ 0 6 6 కుభీర్ 3 7 10 కుంటాల 4 5 9 లోకేశ్వరం 6 6 12 మామడ 0 3 3 ముధోల్ 0 8 8 నర్సాపూర్(జి) 3 8 11 నిర్మల్ రూరల్ 2 5 7 సారంగాపూర్ 0 1 1 సోన్ 2 4 6 తానూర్ 2 13 15జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మంజూరైనవి 9,165 ముగ్గు పోసినవి 5,950 బేస్మెంట్ పూర్తయినవి 3,040 గోడలు పూర్తయినవి 500 స్లాబ్ పూర్తయినవి 50 పనుల వేగవంతానికి దోహదం ఇందిరమ్మ లబ్ధిదారుల గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించింది. అవరోధాలు అధిగమించి పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు పథకం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు ఉపాధి కూడా లభిస్తుంది. – విజయలక్ష్మి, డీఆర్డీవో -
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి భవనాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను పెంపొందించేందుకు చేపట్టిన ప్రాధాన్యమైన కార్యక్రమం అన్నారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలని, భవనం చుట్టూ హద్దుల గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పట్టణంలోని బంగాల్పేట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ చందు జాదవ్, డీఈ తుకారాం రాథోడ్, ఏఈఈ చందన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు ప్రభాకర్, రాజు, ఎంపీడీవో గజానన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులు పరిశీలన కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాలో, అత్యంత నాణ్యంగా విగ్రహ రూపకల్పన జరగాలన్నారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీఏ అవినీతికి చెక్ !
నిర్మల్దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా కుభీర్: ప్రజా సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 101 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకోసం జీఎస్టీ 28 నుంచి 5శాతానికి తగ్గించి దీపావళి కానుక ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేక్, మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్, నాయకులు రమేశ్, నాగేష్, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్ మండలం భోరజ్, తానూర్ మండలం బెల్తరోడ, వాంకిడిలోని చెక్పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖ లో తనిఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్లైన్ ఆ ధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చె ల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏ సీబీ అధి కారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తని ఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్పోస్టు వద్ద, బెల్తరోడ చెక్పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది. కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. ఫైళ్లు తరలింపు.. ఆదిలాబాద్టౌన్: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై బోరజ్ చెక్పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు. సమస్యల పరిష్కారమెప్పుడో..! క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వేతన పెంపు, క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఆన్లైన్లో సేవలు.. వాంకిడి: చెక్పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ద్వారా టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్పోస్ట్ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బెల్తరోడాలో.. తానూరు: బెల్తరోడా చెక్పోస్టులోని ఫర్నిచర్ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్పోస్ట్ను ఎత్తివేసినట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. -
భీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి
నిర్మల్టౌన్: కుమురంభీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. బుధవారం భీం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కుమురంభీం మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఆదివాసీ హక్కులకోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మామడ మండలంలోని పోతారంలో భీమన్న ఆలయంపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు షాకీ లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, రాజ్గోండు సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావు, జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, వెంకురి శ్రీనివాస్, బోర్ర భీమేశ్, అత్రం రాజు, రామకృష్ణ, శ్రీనివాస్, ఉయిక భీంరావ్, పేనుక వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి’
నిర్మల్టౌన్: ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. బుధవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ పరిచయం చేసుకున్నారు. బస్సులో కూర్చున్న తర్వాత ఇలా వివరించారు. ‘అందరికీ నమస్కారం.. నా పేరు తాళ్ల అశ్విని.. నేను ఈ బస్ కండక్టర్ను.. నా పేరు భూమన్న.. ఈ బస్సు డ్రైవర్ను అంటూ.. ఈ బస్సు నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లేందుకు దాదాపు 4:30 నిమిషాలు పడుతుంది.. మిమ్మల్ని మీ గమ్య స్థానాలకు చేర్చాల్సిన బాధ్యత మాది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం అన్నారు. ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. -
‘విద్యారంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం’
ఖానాపూర్: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న లక్సెట్టిపేట సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ రాజ్గోపాల్ను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలలుగా రూ.8 లక్షల బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య, తల్లిపై ఉన్న బంగారం సైతం అమ్మినప్పటికీ సమస్య తీరకపోవడంతో మూడు రోజుల క్రితం నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం కార్మికులు, ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, రవీందర్ రెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కోసం వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించాలని తెలిపారు. ప్రతీ వేయింగ్ మిషన్కి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. లారీలు, కూలీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలి పారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించాలని సూచించారు. కొనుగోలు ఏజెన్సీ ల సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హార్వెస్టర్ల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. రోజువారీగా వరి ధాన్యం కొనుగోలు వివరాలు తనకు అందజేయాలని అధికారులను సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు. -
యాచకుల లెక్కింపు!
నిర్మల్చైన్గేట్:దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో యాచకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, రద్దీ వీధుల్లో నివసించే వారి జీవన స్థితి, ఆహార పద్ధతి, ఆరోగ్య పరిస్థితి, యాచనకు దారితీసిన కారణాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో మెప్మా అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, యాచకులు గుర్తింపు ఆధారాలు లేకపోవడం వల్ల వాటి ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు స్థలాలు మార్చుకుంటూ జీవనం సాగించడం వల్ల ప్రభుత్వ పథకాలు చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు సరైన డేటా సేకరణ ద్వారా పునరావాస విధానం రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం లెక్కింపు చేపట్టింది. ’మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ’ సర్వే మున్సిపాలిటీ ఏరియాల్లో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ పేరుతో సర్వే దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో చేపట్టింది. జిల్లాలో ఈ నెల 15 వరకు సర్వే చేశారు. మెప్మా ప్రాజెక్ట్ అధికారులు, రిసోర్స్ పర్సన్లు పట్టణాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతీ వ్యక్తి గురించి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక వివరాలు నమోదు చేశారు. లింగం, వయసు, కుటుంబ స్థితి, వివాహ స్థితిగతులు, మతం, కులం, మాతృభాష వంటి వివరాలతో పాటు యాచనకు గల కారణాలపై ఆరా తీశారు. వైకల్యం, వృద్ధాప్యం, వ్యసనాలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్రం రూ పొందించిన కొత్త నమూనాలో ఆరు విభాగాలుగా ప్రశ్నలు రూపొందించింది. వ్యక్తిగత సమాచారం, కుటుంబ మానవ వనరుల వివరాలు, భిక్షాటన స్వచ్ఛందమా, లేక బలవంతమా, రోజువారీ ఆదాయం, ఖర్చు పద్ధతులు, ప్రభుత్వం చేయూతనిస్తే యాచన మానుతారా, నైపుణ్య శిక్షణపై ఆసక్తి ఉందా, ఆహారం, ఆరోగ్యస్థితి, వైద్య సహాయం అవసరమా, భవిష్యత్ ఆశలు, ప్రభుత్వ సహకారంపై అభిప్రాయాలు, వివరాలు సేకరించారు. పునరావాసం కల్పించేలా.. ఈ సర్వే ద్వారా యాచకుల పూర్తి వివరాలు నమోదు చేసి, వారికి తగిన పునరావాస ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కేంద్ర ఉద్దేశం. సమగ్ర గణాంకాల ఆధారంగా సర్కారు కొత్త పథకాలు రూపొందించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సర్వేతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొత్త దిశగా అడుగుపెడుతోంది. జిల్లాలో గుర్తించిన యాచకులు.. మున్సిపాలిటీ యాచకుల సంఖ్య నిర్మల్ 32 భైంసా 03 ఖానాపూర్ 03 -
ఘనంగా వెలుగుల పండుగ
లక్ష్మీ పూజలో ఎమ్యెల్యే రామారావు పటేల్, దీపావళి వేడుకల్లో కుటుంబంయూరప్లో లక్ష్మీపూజలో తెలంగాణవాసులు జిల్లా వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్ష్మీ పూజలు చేశారు. భైంసా పట్టణంలో వ్యాపారులు ఖాతా బుక్కులకు పూజలు చేశారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నివాసంతోపాటు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్రావు పటేల్, బీజేపీ నాయకుడు బి.మోహన్రావు పటేల్ నివాసాల్లో లక్ష్మీ పూజలు చేశారు. సాయంత్రం ముంగిళ్లలో దీపాలు వెలిగించారు. చిన్న, పెద్ద అందరూ కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కడెం మండలం లింగాపూర్కు చెందిన మనోజ్, ఇతర జిల్లాలకు చెందిన తెలంగాణ వాసులు యూరప్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నార్త్మెసిడోనియాలో ధనలక్ష్మీ పూజలు నిర్వహించారు. – నిర్మల్ టౌన్/భైంసాటౌన్/కడెం -
కోట ముందా.. పట్టా ముందా..!
చుట్టూ ఎత్తయిన రాతికట్టడంతో, లోపల విశాలమైన స్థలంతో అద్భుతంగా నిర్మించిన ఈ కోట.. శ్యాంగఢ్. నిర్మల్ జిల్లా కేంద్రానికి స్వాగతం పలుకుతున్నట్లుగా, ఘనమైన గతచరిత్రకు రాచరికపు ఆనవాలు అన్నట్లుగా ఉంటుంది. ఇది ఎప్పుడో 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్లక్రితం అప్పటి కలెక్టర్ దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామనుకున్నారు. తీరా.. ఈ కోటలోపల భూమికీ పట్టా ఉన్నట్లు తేలడంతో విస్మయం వ్యక్తంచేశారు. ఈ కోట లోపలే కాదు.. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న పోరంబోకు భూములకూ ఎసరు పెడుతున్నారు. నిర్మల్–హైదరాబాద్ రోడ్డుకు పక్కనే ఉండటం, రెవెన్యూ వ్యవస్థలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇక్కడి సర్కారు జాగాలకు పట్టాలు పుట్టుకొస్తున్నాయి. -
సబ్ స్టేషన్ను సందర్శించిన ఆర్జీయూకేటీ విద్యార్థులు
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు క్యాంపస్ ఆవరణలోని విద్యుత్ సబ్స్టేషన్ను మంగళవారం సందర్శించారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్ మార్గదర్శకత్వంలో అసోసియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ కె.మహేశ్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం పర్యవేక్షణలో ఈ క్షేత్రపర్యటన చేశారు. విద్యుత్ వ్యవస్థలు, సబ్స్టేషన్ కార్యకలాపాల పై విద్యార్థులు అవగాహన పెంచుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు. 180 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న భావనలను క్షేత్రపర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ భూక్య భావ్సింగ్, అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. -
● ఎస్పీ జానకీషర్మిల ● పోలీస్ అమరులకు ఘన నివాళి
నిర్మల్టౌన్: అందరూ నిద్రపోయినా.. పోలీసులు మాత్రం 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద కాగడా వెలిగించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో, అంతర్గత భద్రతలో పోలీసులు అంతే కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతీ సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని వివరించారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే అని వివరించారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబాలతో మాట్లాడారు. వారి పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
చెదరని నెత్తుటి జ్ఞాపకాలు
ఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఖానాపూర్లో అమరుల స్తూపంఖానాపూర్ పోలీస్ష్టేషన్లో పోలీసు అమవీ రుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్స్టేష న్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008 లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
పత్రికాస్వేచ్ఛను హరించొద్దు
లక్ష్మణచాంద: పత్రికాస్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. నిజాలను నిగ్గు తేలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తప్పు పట్టారు. ఎడిటర్ ధనంజయరెడ్డి, పాత్రికేయులను అక్రమ కేసులతో వేధించడంపై మండిపడ్డారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పునరావృతం కానివ్వొద్దు నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడం శోచనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – గోలి గంగాధర్, లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తప్పుడు కేసులు సరికాదు పత్రికాస్వేచ్ఛను హరించడం సరికాదని సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టడం సరికాదు. ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు వెంటనే ఎత్తి వేయాలి. – కోరుకొప్పుల రాజాగౌడ్, లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి -
అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో టీచర్
జైనథ్: ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయుడికి చోటు లభించింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గోసుల సత్యనారాయణ 6వ తరగతి పాఠ్యాంశంలోని ప్రయోగ కృత్యాలను పుస్తకంలో పొందుపర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొనగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ జ్ఞానం, విలువలు పెంపొందించడంతోపాటు ప్రయోగకృత్యాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ అంశాలు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. -
నిర్మల్
మార్కెట్కు దీపావళి శోభజిల్లా ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు నిర్మల్టౌన్: జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ జానకీ షర్మిల శనివారం ఓ ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ప్రతీ ఇంట్లో వెలుగులు, సంతోషం, శాంతి నిండాలని ఆకాంక్షించారు. బంతిపూలు కొనుగోలు చేస్తూ.. వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ కాగా, ఇప్పటికే ఇంటింటా దీపాల వెలుగులతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల పూలు, అరటి చెట్లు, అందమైన ఆకృతుల్లో మట్టి ప్రమిదలు, పూజ సామగ్రి, పటాకులు, వస్త్ర దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. – నిర్మల్టౌన్ -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
లక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీచర గ్రామానికి చెందిన నైనం శేఖర్ (28) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం ఉదయం గ్రామసమీపంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్కు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శన
కుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనూషకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం(జానపద) డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఎంఏ ఇంగ్లిష్ విద్యనభ్యసించగా, ఆమె భరతనాట్యంలో డిప్లొమా పూర్తిచేసింది. 2008లో మా టీవీలో వచ్చిన రేలారేలా కార్యక్రమంలో పాల్గొని జానపద పాటలు పాడారు. గురువు సముద్రాల మాధవీ రామానుజం వద్ద భరతనాట్యంలో మెలకవలు నేర్చుకుంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, భద్రాచలం, తిరుమల తదితర నగరాల్లో 400లకు పైగా, అమెరికా, యూకే, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తండ్రి ఆదిలాబాద్లో పనిచేయడంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. దేశ,విదేశాల్లో భరతనాట్య ప్రదర్శన చేసిన ఆమె ఎక్కడికెళ్లిన కుభీర్ వాసిగా చెబుతోంది. -
‘పీవీటీజీల అభివృద్ధిపై నిర్లక్ష్యం’
బేల: గిరిజన గ్రామాల పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. మండలంలోని సదల్పూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంరం సూరు, కుమురం భీం వర్ధంతికి ఆయన హాజరయ్యారు. పోరాటయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గతేడాది దేశంలోని పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 24వేల కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అందులో భాగంగా తెలంగాణలో రూ. 24 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏకు నిధులు కేటాయించారని తెలిపారు. పీవీటీజీలకు రూ. 60 లక్షలతో మల్టీహాల్ నిర్మించాల్సి ఉండగా కేవలం రూ.45 లక్షలతో నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. అంచనా వ్యయం తగ్గించడంలో అంతరాయం ఏముందని ప్రశ్నించారు. అనంతరం ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై నా కొడప సొనేరావ్ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్రావ్, డివిజన్ అధ్యక్షుడు టేకం గణేష్, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుమ్ర జలపత్రావ్, బేల మండల అధ్యక్షుడు కొడప జైవంత్, గ్రామ మాజీ సర్పంచ్ రాందాస్, ఆదివాసీ సీనియర్ నాయకుడు మడావి జంగు తదితరులు పాల్గొన్నారు. -
వేదవతి శిలకు దారేది..?
బాసర: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకు ని.. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ని త్యం వేల సంఖ్యలో భక్తులు బాసరకు వస్తుంటారు. దర్శనం అనంతరం బస్టాండ్ ఎదుట ఉన్న పురాత న వేదవతి శిల సందర్శనకూ వెళ్తుంటారు. ఈ వే దవతి శిలను మరో రాయితో కొడితే అమ్మవారి సప్తస్వరాలు చెవిలో వినిపిస్తాయని భక్తులు పే ర్కొంటున్నారు. కానీ, వేదవతి శిల దగ్గరకు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. ప్రస్తుతం శిల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలే ఉన్నాయి. ఆలయ అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రం చేసి సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
పక్కాగా పంటల లెక్క
లక్ష్మణచాంద: కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబ డులు విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని 19మండలాల్లోని 400 గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు. 3,66,430 ఎకరాల వివరాలు నమోదు జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏఈవోలు ప్రతీ పంట ఫొటో తీసి మొబైల్ యాప్లో పూర్తి స మాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో మహిళా ఏఈవోలు 1,800 ఎకరాలు, పురుష ఏఈవోలు 2వేల ఎకరాల్లోని పంటల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా వరి 1,14,638 ఎకరాలు, పత్తి 1,26,075, సోయాబీన్ 1,07,052, మొక్కజొన్న 12,835, కంది 5,719, పెసర 52, మినుము 59 ఎకరాలకు సంబంధించి పంటల నమోదు పూర్తి చేశారు. రైతులకు కలిగే ప్రయోజనాలు ఇప్పటికే 95శాతం పూర్తి వ్యవసాయశాఖ ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన పంటల వివరాల నమోదు 95శాతం పూర్తయింది. మిగతా ఐదు శాతం త్వరగా పూర్తి చేస్తాం. – అంజిప్రసాద్, డీఏవో -
గూడేల్లో సంబురంగా దండారీ
ఖానాపూర్: దీపావళికి ముందు సంప్రదాయ ఉత్సవాల్లో ఒక్కటైన దండారీ ఉత్సవాలను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎత్మసార్, చాచో యి, సబాయి, పేన్ తదితర ఆదివాసీ దేవుళ్లకు పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. మహిళలు రేలారేలా నృత్యాలు చేస్తూ, పురుషులు కోలాటం ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడవి సారంగాపూర్, జిల్లెడుకుంట గ్రామాల్లో శనివారం రాత్రి, ఆదివా రం రోజంతా ప్రత్యేక పూజలు చేశారు. పెంబి మండలం వస్పల్లి కొత్తగూడేనికి చెందిన ఆదివాసీలు అడవి సారంగాపూర్లో నిర్వహించిన ఉత్సవాలకు హాజరయ్యారు. సింగాపూర్ గోండుగూడకు చెందిన ఆదివాసీలు జిల్లెడుకుంట గ్రామానికి చేరుకుని ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం దేవుళ్ల వద్ద భేటీలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా గుస్సాడీ వేషధారణలో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో భీంరావు పటేల్, అంకుశ్రావు పటేల్, ఆడె గంగారాం, ఆత్రం రాజేశ్వర్, శంభు, బీర్సావ్, దేవరావు, బారిక్రావు, అర్జున్ పటేల్, పెందూర్ బొజ్జు, శ్యాంరావు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కడెం: మండలంలోని మైసంపేట్, చిట్యాల్, ఇస్లాంపూర్, దోస్త్నగర్ తదితర ఆదివాసీ గూడేల్లో దండా రీ సంబురాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మై సంపేట్ ఆదివాసీలు మండలకేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. -
సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య
సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ఆది వారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై గౌతమ్పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన, పవార్ బాలాజీ(37) ఆరు నెలల క్రితం, ఉపాధి కో సం సాత్నాల మండలం రామయికి వలస వచ్చాడు. సీస కమ్మరిగా, చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ శని వారం రాత్రి భార్య, అత్తతో గొడవ పడ్డాడు. బామ్మర్దులు వారించారు. ఆదివారం ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ తమ్ముడు సంజయ్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గౌతమ్పవార్ తెలిపారు. -
చూసొద్దాం..
జన్నారం అందాలు జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో అందాలు అస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి పచ్చని అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. 15 రోజుల్లో 600 పైగా మంది జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగా ణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చార ని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరా బాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. తెల్లవారు జామున, సూర్యకిరణాలు, చెట్ల మధ్యన పడటం ఆహ్లాదం పంచుతుంది. చెడిపోయిన దారులు.. గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగింది సఫారీ మొదలై 15 రోజు ల్లోనే పర్యాటకుల సంఖ్య పెరిగింది. వీకెండ్లో గదులు నిండిపోతున్నాయి. ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. – వీరేందర్, హరిత మేనేజర్ -
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా సురేశ్
ఖానాపూర్: తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంత్రరాజం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపెల్లిలోగల మెట్రోపొలిటన్ క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్లో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సు రేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాగా, స్థానిక న్యాయవాదులు అభినందనలు తెలిపారు. -
ప్రయత్నం ఫలిస్తోంది
జిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను స్వయంగా కలిసి విన్నవించాను. వారు స్పందించి అవసరమైన మాస్టర్ప్లాన్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవడంతో నా ప్రయత్నం ఫలించినట్లవుతుంది. త్వరలో నే పనులు వేగవంతమయ్యే అవకాశముంది. – గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ ‘సాక్షి’ చొరవ అభినందనీయం ‘సాక్షి’ దినపత్రిక మార్చి 5న అన్ని వర్గాలతో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆయా వర్గాలవారు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ సాధనకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. అదే వేదికపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. దీంతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. వారు అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడంతో లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. – సోగాల సుదర్శన్, ఎయిర్పోర్టు సాధన అడహక్ కమిటీ సభ్యుడు -
మద్యం టెండర్లకు బారులు
నిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం రాత్రితో ముగిసింది. చివరి రోజు దరఖాస్తుకు చాలా మంది వచ్చారు. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విష యం తెలిసిందే. మొదటి నుంచి కొంత స్లోగా కొనసాగిన దరఖాస్తులు శుక్రవారం వరకు 413 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు శనివారం సాయంత్రం 6 గంటల వరకు మరో 342 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగనుంది. ఫీజు పెంపు దరఖాస్తులపై ప్రభావం చూపిందని భావించగా చివరి వరకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు అందినట్లు సమాచారం. -
నష్టపోయినా పట్టించుకోరా..?
భైంసా/భైంసారూరల్: భైంసా – బాసర జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దేగాం వద్ద అసంపూర్తి కల్వర్టు నిర్మాణంతో నష్టపోయిన రైతులు పరిహారం ఇవ్వాలని శనివారం నిరసనకు దిగారు. గ్రామానికి చెందిన మహిళా రైతులు ఉమ, శీల మాట్లాడుతూ ఇటీవల ఇంటి ముందు సోయా పంట ఆరబెట్టగా భారీ వర్షంతో డ్రైనేజీ నుంచి వచ్చిన నీళ్లకు పంట కొట్టుకుపోయింది. కల్వర్టు నీటిని సంబంధిత కాంట్రాక్టరు వాగులోకి మళ్లించకపోవడంతో నష్టపోయామని పేర్కొన్నారు. అదే రోజు అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో నిరసనకు దిగారు. అయినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ఓ దశలో ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలను పట్టుకున్నారు. గమనించిన గ్రామస్తులు డబ్బాలను లాక్కున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు మేమేం చేస్తాం అంటూ దురుసుగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే పంట కొట్టుకుపోయిందని పరిహారం ఇవ్వాల్సిందే అని బాధిత రైతులు కోరుతున్నారు. -
కాలయాపన
కరెంటు సమస్యలపై మంచిర్యాలఅగ్రికల్చర్: సాంకేతిక లోపమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ కొందరి ఇళ్లలో కరెంటు మీటరు గిర్రున తిరుగుతోంది. రూ.వేలల్లో వస్తున్న బిల్లులతో వినియోగదారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నెలలు గడిచినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, హై ఓల్టేజ్, ప్రమాదకరంగా ఉన్నత స్తంభాలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ప్రతీ సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులతోపాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలతో పశువులు, మూగజీవాలు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దండేపల్లి మండలం విద్యుత్ స్తంభానికి షాక్ వస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే స్తంభానికి తగిలి పశువు, లేగదూడ చనిపోవడంతో తేరుకుని సవరించారు. వినియోగదారులు నేరుగా, ఆన్లైన్, మొబైల్ ద్వారా ఏ ఫిర్యాదు అందించినా వెంటనే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచిస్తున్నారు. అయినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండు నెలలు గడిచింది.. ఆర్ఆర్నగర్లోని తన ఇంటికి గత కొన్ని నెలల నుంచి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు వస్తోందని విద్యుత్ అధికారులకు, ఆగస్టు 4న ప్రజావాణిలో ఎస్ఈకి ఫిర్యాదు చేశాను. రూ.150 చెల్లిస్తే సిబ్బంది మీటర్ను పరిశీలిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్ డీఈ ఆపరేషన్ పేరిట నగదు చెల్లించి రెండు నెలలైంది. వందల్లో రావాల్సిన బిల్లు వేలల్లో వస్తోంది. ఈ నెల రూ.3,882 బిల్లు చెల్లించాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. – జోగుల విజయ, మంచిర్యాల -
జాతీయస్థాయిలో గుర్తింపు హర్షణీయం
ఉట్నూర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 17న నిర్వహించిన జాతీయ సదస్సులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్తో పాటు జిల్లా మాస్టర్ ట్రైనర్లు అర్క వసంత్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లు రాజేశ్బాబు, నందకిషోర్ పాల్గొన్నట్లు తెలిపారు. పథకాల అమలులో వారు చేసిన కృషికి పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. -
మొక్కలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
నర్సాపూర్ (జి): గ్రామాల్లో మొక్కలు నాటి నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో 4వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను శనివారం నిర్వహించారు. 13 గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.57 కోట్లతో చేపట్టిన పనులను డీఆర్పీలు, వీఆర్పీలు చదివి వినిపించారు. పనులపై తనిఖీ నిర్వహించగా 13 గ్రామ పంచాయతీల పరిధిలో 74,932 మొక్కలు నాటగా 40,703 మొక్కలు చనిపోయినట్లు రికార్డుల్లో తేలడంతో ఫీల్డ్ అసిస్టెంట్లపై డీఆర్డీవో విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, మస్టర్లలో కూలీల సంతకాలు, పనుల్లో తేడా, హాజరు లేకుండా వేతనాల చెల్లింపు వంటి తప్పిదాలకు రూ.31,766 రికవరీకి ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయం, నాడెపు కంపోస్టు ఎరువు తయారీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మిద్దె తోటలు, ఆగ్రో ఫారెస్ట్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. నర్సరీలలో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలన్నారు. ప్రజా వేదికకు హాజరుకాని వారిపై కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లక్ష్మయ్య, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్ఆర్పీ రాజు, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పీఆర్ ఏఈ క్రాంతి, ఏపీవో జగన్నాథ్, టీఏలు రవీందర్, సతీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్సైకి సమాచారం సమాచారం అందించడంతో ఆవులను ఇచ్చోడలోని గోశాలకు తరలించారు. డ్రైవర్ గురురవాల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోహన్గౌడ్, పైమా సుల్తానా, జాదవ్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
కన్నతండ్రినే కడతేర్చాడు..
జన్నారం: మద్యానికి బాని సైన కుమారుడు తన కన్నతండ్రినే కర్రతో కొట్టిచంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్నగర్కు చెందిన జాదవ్ శంకర్నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు సంతానం. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్యాన్సర్తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్నాయక్ తప్పించుకున్నాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్సింగ్ను బెదిరించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. కాలనీవాసులు నిలదీయడంతో పరారయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. విజయయాత్రలో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్ల గర్భాలయాలలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేక, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం పూజల అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ హిందువు కర్తవ్యమని, ధార్మిక విలువలతో జీవించడం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం..బాసరలో నూతనంగా నిర్మించిన లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. వేలేటి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంజనాదేవి, బాసర గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదాలు అందజేస్తున్న శృంగేరీ పీఠాధిపతి మహాకాళి అమ్మవారి ఆలయంలో హారతి ఇస్తున్న విధుశేఖర భారతీస్వామి -
స్వర్ణ వాగులో పడి ఒకరు మృతి
సారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. బోరిగాంలో ఉంటున్న అతని అక్క పోశవ్వ మూడు రోజుల క్రితం తన ఇంటికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భోజన్న తిరిగిరాలేదు. శనివారం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అధికారి చెప్పినా ఆగని దందా
దీపావళికి స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో అనుమతి లేకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష ఈ నెల 14న తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత వదిలేయడంతో నిర్వాహకులు మళ్లీ స్వీట్ దందా మొదలుపెట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్పూల్ గెస్ట్హౌస్లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, 8 సెల్ఫోన్లు, ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదుపుతప్పి కారు బోల్తా నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వరంగల్కు చెందిన ఐదుగురు స్నేహితులు కారులో షిరిడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ వెళ్లే క్రమంలో స్థానిక కంచరోని చెరువు కట్ట రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ అదుపుతప్పి వైద్యుడు మృతి తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్ గ్రామానికి చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలయ్యారు. -
బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–14 బాస్కెల్ బాల్ పోటీలు శనివారం నిర్వహించా రు. ఎంపీడీవో రాధ, ఎంఈవో అశోక్వర్మ పో టీలను ప్రారంభించారు. ఇందులో ప్రతిభ కనభరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేశారు. బాలుర జిల్లా జట్టు.. వై.ముత్యం, ఎస్.శరత్, ఎస్.సంజుపాల్, రిషి, సాత్విక్, హర్షిత్, వెంకటరమణ, శ్రియాన్, రాకేశ్, లోకేష్, సుశీల్జాన్సన్, బన్నీ, స్టాండ్ బైలుగా లేవినోస్, నిఖిలేష్, శివకుమార్. బాలికల జిల్లా జట్టు.. సహస్రరెడ్డి, కీర్తన, జగశ్రీ,సమికేశ్రెడ్డి, వెన్నెల, రినూత్న, నిహారిక, హర్షిత, దీక్షిత, అమూల్య, నందిని, ప్రణవి, స్టాండ్బైగా నైనిక .17 మందిపై కేసు లోకేశ్వరం: మండలంలోని బామ్ని(కే) గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిపి 17 మందిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన రైతు నడిషారం మైసన్న గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు ప్రాంతంలో రెండు ఎకరాల శిఖం కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని పశువులను మేపేందుకు ఖాళీగా వదిలేయాలని వీడీసీ సభ్యులు మైసన్నను అదేశించారు. అయినా ఈ ఏడాది వరి సాగు చేశాడు. దీంతో వీడీసీ సభ్యులు మైసన్నతో ఎవరూ మాట్లాడొద్దని తీర్మానం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సౌత్జోన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది. నవంబర్ 21 నుంచి 23 వరకు బెంగళూర్లో జరిగే సౌత్జోన్ టోర్నమెంట్లో యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్గా వ్య వహరించనుంది. శనివారం కళా శాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, శ్రీధర్రావు అభినందించారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయం
నిర్మల్టౌన్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై సాగిస్తున్న నిర్బంధకాండను నిర్మల్ జిల్లాకేంద్రంలో అన్ని పాత్రికేయ సంఘాలు, నిర్మల్ ప్రెస్ క్లబ్ ముక్తకంఠంతో ఖండించాయి. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలే కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. వార్తలు రాస్తే పోలీసులతో విచారణ చేయించే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి విచారణ పేరిట నిర్బంధం చేయడం ఖండిస్తున్నామన్నారు. నిరసనలో సీనియర్ జర్నలిస్టులు అల్లం అశోక్, శ్రీనివాస్, రాసం శ్రీధర్, జల్ద మనోజ్, గుమ్ముల అశోక్, శ్రీనివాస్, పూసల పోశెట్టి, రాంపల్లి నరేందర్, వసి ఉల్లాఖాన్, దాసరి వేణుగోపాల్, రామేశ్వర్, సురేశ్, ప్రశాంత్, అక్తర్, శశికాంత్, హరీశ్, రాహుల్గౌడ్, భోజన్న, ప్రేమ్, శేషగిరి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే(143), టీఎస్జేయూ, టీజేడబ్ల్యూఎఫ్, జాట్, మున్నూరుకాపు జర్నలిస్టు అసోసియేషన్ తదితర పాత్రికేయ సంఘాలతోపాటు నిర్మల్ ప్రెస్క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.ప్రభుత్వం తీరు సరికాదు.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికావ్యవస్థను ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాజకీయ ధోరణిలో సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఎంతమాత్రం సరికాదు. దీన్ని ఖండిస్తున్నాం. –వసీఉల్లాఖాన్, నిర్మల్ ప్రెస్క్లబ్ కార్యదర్శిస్వేచ్ఛను అడ్డుకోవడమే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిని విచారణ పేరిట గంటలపాటు నిర్భంధంలో ఉంచడం పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది. ప్రభుత్వాలు ఈ కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. – ఎంఏ.వసీమ్, నిర్మల్ ప్రెస్క్లబ్ గౌరవ సలహాదారుపత్రికాస్వేచ్ఛకు విఘాతం.. ఏ ప్రభుత్వమైనా పత్రికాస్వేచ్ఛను కాపాడేందుకు కృషిచేయాలే కానీ.. ఇలా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సమంజసం కాదు. సాక్షిపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్బంధకాండను వ్యతిరేకిస్తున్నాం. –పొన్నం రాహుల్గౌడ్, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్) జిల్లాబాధ్యుడు నిర్బంధకాండను సహించేది లేదు.. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేస్తున్న నిర్బంధకాండను సహించేది లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పోలీసులు కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తాం. – అల్లం అశోక్, టీయూడబ్ల్యూజే(143) నేషనల్ కౌన్సిల్మెంబర్ -
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా లింగన్న
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం సాయంత్రం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శి శంకర్రెడ్డి వ్యవహరించారు. 17 పదవులకు నామినేషన్లు స్వీకరించారు. పోటీ లేకపోవడంతో అధ్యక్షుడితోసహా మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న, ప్రధాన కార్యదర్శిగా కె.పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా ఎల్.గంగన్న, అసోసియేట్ ప్రెసిడెంట్గా బి.రమేశ్కొండు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎ.పోశెట్టి, డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు, డాక్టర్ ఎ.రజిని, కార్యదర్శులుగా పి.విలాస్, ఎంఏ.కరీం, సంయుక్త కార్యదర్శులుగా రామాగౌడ్, జనార్దన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.రాజేశ్వర్, సుజాతదేవి, ప్రచార కార్యదర్శిగా కె.రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.సత్తయ్య, సీహెచ్.వెంకటేశ్వర్రావు, కె.పోశెట్టి ఎన్నికయ్యారు. తాను అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎంసీ.లింగన్న ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇలాగే విశ్రాంత ఉద్యోగులకు సేవలతోపాటు సామాజిక, లీగల్ వాలంటరీ సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
నిర్మల్
బాసరలో శృంగేరీ పీఠాధిపతి.. బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఉదయం 7 గంటల నుంచే బీసీ కుల సంఘాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు బీసీ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బంద్లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిర్మానుష్యంగా నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ -
దరఖాస్తు గడువు పొడిగింపు
కాగజ్నగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కొరిపెల్లి రేణుకాదేవి శుక్రవారం తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే ఉండిపోయింది. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అడవిలో అరుదైన ‘హైగ్రోసైబ్ పెల్లిసిడా’ జన్నారం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నార్త్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎనగందుల వెంకటేశ్ శనివారం కవ్వాల్ టైగర్జోన్లో శిలీంద్ర జాతికి చెందిన అరుదైన హైగ్రోసైబ్ పెల్లిసిడాను కనుగొన్నారు. 2024లో కేరళ రాష్ట్రంలోని హైగ్రోఫోరేసి కుటుంబంలో ఒక కొత్త జాతిగా మొదటిసారి కనుగొన్నారు. చిన్న, సున్నితమైన అగారిక్ ఫంగస్ అని తెలిపారు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు, చిత్తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని, దీనిని వాక్స్కప్ అని పిలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్జోన్లో మొదటిసారి నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో ఈనెల 15న చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజీ ఽఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సిరికొండ లక్ష్మణ్, మహా రాష్ట్రలోని రాజూరా తాలూకా చున్నాల గ్రామానికి చెందిన కాకట్ల కేశవరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈఇద్దరు నిందితులపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన భీమారం ఎస్సై శ్వేత, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, సిబ్బంది మల్లయ్య, కిరణ్ను సీఐ అభినందించారు. -
ప్రజల గొంతుక అయిన ‘సాక్షి’
జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ అవశ్యకత.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ‘సాక్షి’ గుర్తించింది. దశాబ్దాల కల సాకారం చేయాలని సంకల్పిస్తూ వారి తరఫున గొంతెత్తింది. తొలుత చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ ఆయా వర్గాల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ‘మామా.. ఎయిర్పోర్ట్ వస్తే మనకేమొస్తది’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. తద్వారా ఈ ప్రాంత పాలకులపై ఒత్తిడి పెరిగింది. వారు చట్టసభల్లో గళమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా, పార్లమెంట్లో ఎంపీ నగేశ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం అసెంబ్లీ సాక్షిగా స్పందిస్తూ ‘ఆదిలా బాద్కు ఎయిర్పోర్ట్ తెస్తా.. అది నా బాధ్యత’ అంటూ జిల్లా వాసులకు భరోసా కల్పించారు. ఆ వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ ఽశాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ‘ రెక్కలొస్తున్నాయి..’ అంటూ ‘సాక్షి’ జిల్లావాసులకు తీపికబురు అందించింది. తాజాగా ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. ఎయిర్పోర్టుతో పాటు ఎయిర్ఫోర్సు స్టేషన్ నిర్మాణానికి ఏఏఐ మాస్టర్ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానుండడంపై జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ‘సాక్షి’ చొరవను సర్వత్రా కొనియాడుతున్నారు. -
జీవాలకు టీకా భరోసా
లక్ష్మణచాంద:పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 15న జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. 19 మండలాల్లో టీకా కార్యక్రమం జిల్లాలోని 19 మండలాల పరిధిలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో ఈ టీకా కార్యక్రమం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ సమాచారం ప్రకారం జిల్లాలో 48,496 ఆవులు, 55,027 గేదెలు ఉన్నాయి. మూడు నెలల వయసు దాటిన పశువులకు జాతీయ పశు వ్యాధుల నివారణ పథకం కింద టీకాలు వేస్తున్నారు. 39 బృందాలు రంగంలోకి ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు అవ్వడానికి జిల్లాలో 39 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 15న ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. అధికారులు రెండు లక్షల జీవాలకు టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన టీకాల మొత్తం నిల్వ ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు రోజు ప్రతీ గ్రామంలో టాంటాం ద్వారా సమాచారం అందిస్తున్నారు. రైతులు తమ పశువులకు టీకా చేయించేందుకు సిద్ధంగా ఉండాలని శాఖ సూచిస్తోంది. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకే బృంద సభ్యులు గ్రామాల్లోకి చేరి పశువులకు టీకాలు వేస్తున్నారు. టీకా వేసిన పశువుల చెవికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేయడం ద్వారా వివరాలు ‘‘భారత్ పశుధన్’’ యాప్లో నమోదు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పాడి పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులు ఉన్న ప్రతీరైతు తన పశువులకు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నవంబర్ 14 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. – ఎండీ.బాలిగ్ అహ్మద్, జిల్లా పశు వైద్యాధికారివైరస్ కారణం, లక్షణాలు -
‘మద్యం’.. దూరం పెట్టండి
● టెండర్ల దశలోనే ఫిర్యాదులునిర్మల్: మద్యం దుకాణాల టెండర్ల వేళ పలు గ్రా మాల ప్రజలు వైన్షాపులపై ఫిర్యాదులు చేస్తున్నా రు. తమకు ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను తొ లగించాలని గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డి మాండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలంతా కలెక్టరేట్కు వచ్చి నేరుగా ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తెస్తున్నారు. మద్యం దుకాణాలను ఇప్పుడు మార్చకపోతే మరో రెండేళ్లు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆయా ఫిర్యాదులపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. బడికి.. గుడికి దగ్గరలో.. ఎకై ్సజ్ శాఖ నిబంధనల ప్రకారం బడి, ప్రార్థన మందిరాలకు కనీసం 100మీటర్ల దూరంలో మ ద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులకు 50మీటర్ల దూరంలో ఉండాలి. చాలా చోట్ల నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఏ ర్పాటు చేయడంలేదు. కొన్నిచోట్ల పాఠశాలలు, ఆలయాలు, నివాస సముదాయాలకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో దాదాపు ఐదారు దుకాణాలు హైవేపైనే ఉన్నాయి. మండల కేంద్రాలు, మేజర్ గ్రామాల్లో చాలాచోట్ల పాఠశాలలకు వెళ్లేదారుల్లోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. రోడ్డుపైనే తాగుతూ.. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రో డ్డుపైనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఇక్కడ తరచూ మందుబాబులు రోడ్డుపైనే బైక్లు నిలిపి మద్యం సేవిస్తున్నారు. గ్రామస్తులు పలుసార్లు చె ప్పినా తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం సేవించిన తర్వాత ఇష్టారీతిన వాహనాలు నడపడంతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. చీకటి పడుతోందంటే మహిళలు ఆ దారి లో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒంటరి మ హిళలైతే జంకుతున్నారు. భైంసాలోనూ ఓ ప్రైవేట్ పాఠశాలకు సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. ఇక్కడ కూడా పలుసార్లు అభ్యంతరాలు వచ్చాయి. కుంటాల మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా మద్యం దుకాణం ఉందని స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పుడు మారిస్తేనే.. సమాజాన్ని మత్తులో ముంచే మద్యానికంటే ముందు గ్రామాన్ని ఉన్నతంగా నిలిపే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. పాఠశా లలు, ఆలయాలు, బీడీ కంపెనీలు, రోడ్లకు దగ్గరలో మద్యం దుకాణాలు పెట్టి ఇబ్బందుల పాలుచేయొద్దని కోరుతున్నారురు. సిర్గాపూర్లో ఏకంగా మద్యం దుకాణం వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశా రు. గ్రామ పెద్దలంతా కలిసి కలెక్టరేట్లో పలుసార్లు కలెక్టర్ను కలిసి విన్నవించారు. కలెక్టర్, అధికారులు సానుకూలంగా స్పందించగా.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త దుకాణాల కు మళ్లీ పాతచోట అనుమతివ్వొద్దని, తమను మ రో రెండేళ్లు ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు. -
నిర్మల్
చూసొద్దాం తుర్కం చెరువు నల్దుర్తి తుర్కం, వెంగన్న చెరువులు ఎకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటి అందాలను తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పించింది.IIలోu రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక సోన్: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి గోవిజ్ఞాన ప్రతిభ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సోన్ జెడ్పీఎస్ఎస్కు చెందిన విద్యార్థినులు జోష్ణవి, శివరాత్రి గీతిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఆరాధన శుక్రవారం తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. నిర్మల్: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, భూకబ్జాలకు నిర్మల్ జిల్లా కేరాఫ్గా మారింది. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే రూ.కోట్ల విలువ చేసే భూముల ను కొల్లగొడుతున్నారు. వరుస ఫిర్యాదులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో జిల్లా అధికారుల్లో కొంత కదలిక కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే భూఆక్రమణ లు, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడుతున్నారు. తాజాగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట (అయ్యప్ప ఆలయం) ఎదురుగా ప్రభుత్వ భూ మిలో చేపట్టిన నిర్మాణాలను కలెక్టర్ ఆదేశాల మేర కు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ‘గొలుసుకట్టు’కూ భంగం కలిగించేలా.. దివ్యనగర్లోని 534 సర్వేనంబర్లో స్థానికులు బతుకమ్మకుంటగా పిలుచుకునే కుంటనూ సగానికి పైగా ఆక్రమించారు. నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో భాగమైన గొల్లపేట చెరువు, డిగ్రీ కళాశాల ఎదురుగా గల ఇబ్రహీం చెరువులను కలి పేలా మధ్యలో ఈ కుంట ఉంటుంది. గొల్లపేట చె రువు అలుగు నుంచి ఈ కుంట ద్వారా ఇబ్రహీం చె రువులోకి నీరు చేరుతుంది. కానీ.. ఇక్కడ అలుగునీరు పారే కాలువను వెంచర్లో ఓ డ్రైనేజీగా మార్చి నిర్మించడం గమనార్హం. ఇక పెద్దగా ఉన్న కుంటను క్రమక్రమంగా చిన్నగా మార్చేశారు. రూ.కోట్లు కొల్లగొడుతూ.. నిర్మల్ జిల్లాకేంద్రమైన తర్వాత భూముల విలువ ఆకాశాన్నంటాయి. ఎకరం రూ.కోట్లలో పలుకుతోంది. అలాంటి విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయ్యప్ప టెంపుల్ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వే నంబర్లలో అసైన్డ్ భూముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు చేశారు. కొన్నిచోట్ల ము న్సిపల్ టౌన్ప్లానింగ్లో ఉన్న రోడ్లనూ మాయంచేసి ప్లాట్లుగా మలిచి అమ్మేశారు. ఇక్కడ కేవలం ఒక్క ప్లాట్ ధరనే రూ.40–50 లక్షల వరకు ఉందంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడాబాబులు ఎకరాల్లో కబ్జా చేసిన సర్కారు జాగా ఎన్ని కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అసైన్డ్ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు ‘బుల్డోజర్’లు ప్రయోగించాల్సిందేనని నిర్మల్వాసులు కోరుతున్నారు.అసైన్డ్ పేరిట భూస్వాహా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్ భూముల పేరిట ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్లో మొత్తం 29.03 ఎకరాల్లో అసైన్డ్ పోనూ మిగతా 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. తమ భూమితో పాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగోడలు కట్టేశారు. అసలు.. అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చినా జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అయ్యప్ప టెంపుల్ ఎదురుగా దివ్యగార్డెన్ పక్కన ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్తో తొలగింపజేశారు. -
నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?
నిర్మల్/భైంసాటౌన్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎడిటర్ ధనంజయరెడ్డిని వి చారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ పట్ట ణంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువు రు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్ర భుత్వం కక్ష సాధింపు చర్య లకు పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. మీడి యా స్వేచ్ఛ హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడడం ప్ర జాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెలిపారు. ‘సాక్షి’ యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో జర్నలిస్టులు కృష్ణ, లింగారా వు, రామకృష్ణ, రామకృష్ణ, మార్కండేయ, సతీ శ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఆంధ్రపదేశ్ పోలీసులు విచారణ పేరిట ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై గత కొద్దిరోజులుగా నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛను హరించడమే. దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. – వెంకగారి భూమయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దాడులు సమంజసం కాదు ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం పత్రికాస్వేచ్ఛపై దాడే. రాజకీయ కక్షను పత్రికపై తీర్చుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే ఏపీ ప్రభుత్వం దాడులు ఆపాలి. – శ్రీనివాస్చారి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛను కాపాడాలి ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యహరిస్తు న్న తీరును పాత్రికేయులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ప్రభుత్వాలు పత్రికాస్వేచ్ఛను కాపాడేలా ఉండాలి. – ధర్మపురి శ్రీనివాస్స్వామి, టీఎస్జేయూ రాష్ట్రకార్యదర్శి రాజకీయ కక్ష సాధింపే.. ఏ మీడియా సంస్థౖపైనెనా ప్రభుత్వాలు, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీ య కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – బాస లక్ష్మీనారాయణ, నిర్మల్ ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి -
‘ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’
ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసేదాకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని సమితి కన్వీనర్ నంది రామయ్య హెచ్చరించారు. శుక్రవారం ఖానాపూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టణంలోని 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కో రారు. ఈ స్థలంలో మిగులు భూమిపై సర్వే వివరా లు వెల్లడించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఖానాపూర్లో ఏర్పాటు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూర్కు తరలించుకుపోవాలని చూడడం సరికాదన్నారు. సమి తి గౌరవాధ్యక్షుడు సాగి లక్ష్మణ్రావు, కో కన్వీనర్లు ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, బీసీ రాజ న్న, ప్రధాన కార్యదర్శి కాశవేణి ప్రణయ్, కోశాధికా రి ఎనగందుల నారాయణ తదితరులున్నారు. -
‘బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు’
నర్సాపూర్ (జీ): బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని డీసీసీ అధ్యక్షు డు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చే పట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతూ కాంగ్రెస్పైనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీసీ బిల్లుపై ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, నిర్మల్, భైంసా ఏఎంసీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, ఆనంద్రావుపటేల్, మాజీ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, నాయకుడు గడ్డం ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంద్ను విజయవంతం చేయాలి
నిర్మల్ టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల 18న తలపె ట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. అగ్ర కులాల వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం ఉన్న బీసీలను రాజకీయంగా వెనుకకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ ని హెచ్చరించారు. బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణగౌడ్, నాయకులు అనుముల భాస్కర్, డాక్టర్ కత్తి కిరణ్, అశోక్నాయక్, ప్రశాంత్, శివాజీ గౌడ్, నవీన్ తదితరులున్నారు. -
ఇంటిగ్రేటెడ్ ఫామ్స్పై దృష్టి సారించాలి
దస్తురాబాద్: ఇంటిగ్రేటెడ్ ఫామ్స్పై ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు దృష్టి సారించాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నాలుగో విడత ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించగా హా జరై మాట్లాడారు. భవిష్యత్లో ఉపాధిహామీ పథకంలో ఇంటిగ్రేటెడ్ పనులకే ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో పాశువుల పాకలు, గోట్ షెడ్లు, వర్మీ కంపోస్టు తదితర నిర్మాణాలు చేపట్టే అవకాశముందన్నారు. అంతకుముందు 13 గ్రామపంచాయతీల పరిధిలో 2024–2025లో చేపట్టిన పనులపై ప్రజావేదికలో సమీక్ష నిర్వహించా రు. ప్రజావేదికలో ఫీల్ అసిస్టెంట్లు, టీఏలు, పంచా యతీ కార్యదర్శులు చేసిన అవకతవకల గురించి సోషల్ ఆడిటర్లు వివరించారు. సామాజిక తనిఖీలో 13గ్రామపంచాయతీల పరిధిలో రూ.96,888 నిధు లు దుర్వినియోగమైనట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని, కార్యదర్శుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరా జ్ శాఖ అధికారులు సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు అందజేయకపోవటంతో వారు చేసిన ప నులపై ఆడిట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. హె చ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఏవీవో లక్ష్మయ్య, ఆడిట్ మేనేజర్ అశోక్కుమార్, ఎస్పీఎం దత్తు, ఎస్ఆర్పీ మహేశ్, ఎంపీడీవోలు సునీత, రమేశ్, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి రామ్మోహన్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా కడార్ల రవీంద్ర, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా భూమన్నయాదవ్, జాయింట్ సెక్రెటరీగా లక్ష్మీపతి, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్రావు, ట్రెజరర్గా రతన్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా మంత్రి ప్రకాశ్, ఉపాధ్యక్షులుగా గంగామోహన్, సునీల్రెడ్డి, గంగా కిషన్, రాజేశ్వర్రెడ్డి, గణపతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నవీన్గౌడ్, గంగాధర్, తిరుమల్రెడ్డి, ముత్తన్న, రాహుల్, ఎర్రన్న, చంద్రశేఖర్రెడ్డి, చిన్నారెడ్డి, రాజేశ్వర్, మహిళా కార్యదర్శులుగా సంధ్యారాణి, లక్ష్మి, గీతారామచందర్, స్వాతి, విక్రాంతి, శైలజ ఎన్నికయ్యారు. -
పెన్షనరీ బెనిఫిట్స్ కోసం కలెక్టర్కు వినతి
నిర్మల్చైన్గేట్:రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేలా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి, పెన్షన్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, లోలం గంగన్న , పోతారెడ్డి, కే రమేశ్, పి.జనార్దన్, బి.కిషన్రావు, పోతన్న, పోశెట్టి, వేణుగోపాల్, కే.రాములు, జాప రాములు, లక్ష్మణ్, రాజేశ్వర్, గంగాధర్, కరీం, హుస్సేన్, యూసుఫ్ అహ్మద్ పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..
నిర్మల్చైన్గేట్:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్, విలాస్, ఒడిసెల అర్జున్, సాగర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
పంటల కొనుగోళ్లకు సిద్ధం కావాలి
భైంసాటౌన్:ఖరీఫ్ పంటల కోతలు మొదలైన నేపథ్యంలో ఉత్పత్తుల కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ కార్యాలయంలో గురువారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోయా, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయని తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు కిసాన్ కపాస్ యాప్ అమలు చేస్తోందని, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు రాకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, రైతు నాయకుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, వైస్చైర్మన్ ఫారూక్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, ఆర్టీఏ, అగ్నిమాపక, పోలీస్, పీఏసీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
చేయి తడిపితేనే అనుమతి
నిర్మల్చైన్గేట్:వెలుగుల పండుగ అయిన దీపావళికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో టాపాసుల దుకాణాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. అయితే జిల్లాలో టపాసుల వ్యాపారానికి దళారుల బెడద ఇబ్బందిగా మారింది. దుకాణాల ఏర్పాటు, అనుమతుల పేరుతో కొందరు వ్యక్తులు వ్యాపారుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణం కోసం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘‘అన్ని శాఖల ఫార్మాలిటీలు మనమే చూసుకుంటాం’’ అంటూ, ఇప్పటికే దళారులు వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఖరీదైన వెలుగుల పండుగ టపాసుల దుకాణాల ఏర్పాటుకు తోడు పోలీసులు, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అగ్నిమాపక శాఖలకు ఎప్పటిలాగే ఖర్చులు తప్పడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు రోజుల అమ్మకానికి ఒక్క దుకాణం కోసం రూ.40 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చులు తుదకు వినియోగదారులపై పడే అవకాశముందని, టపాసుల ధరలు కూడా ఈసారి భారీగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు సూచిస్తున్నారు. నిర్మల్లో ఏటా దీపావళికి సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన టపాసులు అమ్ముడవుతాయి. ఈసారి మాత్రం వ్యాపార ఖర్చులు పెరగడంతో ధరల భారమంతా ప్రజలపై పడే అవకాశం ఉంది. అనుమతుల పేరిట.. జిల్లాలో ప్రతీ దీపావళికి తాత్కాలిక టపాసుల మార్కెట్ ఏర్పాటు నియమిత ప్రక్రియగా మారింది. అయితే కొన్నేళ్లుగా కొందరు దళారులు గ్రూపులుగా ఏర్పడి ఈ ప్రక్రియను అదుపులోకి తీసుకున్నారు. ఒక దుకాణం సెటప్కి రూ.10 నుంచి రూ.12 వేల వ్యయం ఉంటే, అదనంగా అంతే మొత్తాన్ని ‘సాయం’ పేరుతో తీసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 60 దుకాణాల వరకు ఏర్పాటైనా, వాటిలో సగానికి మాత్రమే అధికారిక లైసెన్సులు ఫీజు చెల్లించి పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరికీ చెల్లింపులు.. ఈ ఏడాది నిర్మల్ కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 65కి పైగా టపాసుల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతీ దుకాణం పేరుతో రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక విభాగాలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతేకాక, ఇప్పటికే లైసెన్సు పొందిన వ్యాపారులు తమ అనుమతులు తాత్కాలికంగా ఇతరులకు అమ్మి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోకపోతే దళారుల ఈ దోపిడీ కొనసాగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
పోషకాహారంపై అవగాహన కల్పించాలి
నిర్మల్చైన్గేట్:పోషణ మాసం ముగింపు వేడుకలు పట్టణంలోని దివ్య గార్డెన్స్లో గురువారం నిర్వహించారు. మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం ఎంతో ఉపయోగకరమన్నారు. నెల కార్యక్రమంగా కాకుండా, ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందుతోందని భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 17న ప్రారంభమై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణపై అవగాహన కల్పించామన్నారు. బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే భవిష్యత్తులో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి, దేశ నిర్మాణానికి తోడ్పడతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ శాఖకు సంబంధించిన సూచికల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. అంతకుముందు అంగన్వాడీ టీచర్లు పోషకాహారంపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. గర్భిణులకు సా మూహిక సీమంతం చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పోషకాహార స్టాళ్లను పరిశీలించి, టీచర్ల సృజనాత్మకతను ప్రశంసించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, సీడీపీవోలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
కడెం: కడెం ప్రాజెక్ట్కు గురువారం రాత్రి 1000 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాయతీ చాటుకున్న సాయితేజలోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గొడిసెల సాయితేజగౌడ్ దొరికిన బ్యాగును లోకేశ్వరం పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. బుధవారం నిజా మాబాద్ నుంచి పుస్పూర్కు బైక్పై వస్తున్న సాయితేజకు నందిపేట్ మండలం పలుగుగుట్ట సమీపంలో ఓ హ్యాండ్బ్యాగు దొరికింది. అందులో సెల్ఫోన్, రెండు గ్రాముల బంగా రం, ఆధార్ కార్డు ఉంది. ఆధార్ ఆధారంగా నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రవళికగా గుర్తించి లోకేశ్వరం పోలీసులకు బ్యాగ్ను అప్పగించాడు. సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు. గురువారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బ్యాగును అప్పగించారు. డబ్బులు దండుకున్న మధ్యవర్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని, పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేస్తానని డబ్బులు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. హైకోర్టులో జడ్జీలు, న్యాయవాదులు పరిచయం ఉన్నారని నమ్మబలికి బాధితుల నుంచి రూ.3 లక్షల 50వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఫిర్యాదుదారు కుమారుడు, కోడలు మధ్య గొడవలు ఉన్నాయి. మధ్యవర్తిగా పరిచయం ఉన్న జైనూర్ మండలంలోని బూసిమెట్టకు చెందిన జాడే రవీందర్ బాధితులను నమ్మబలికి అందినకాడికి దండుకున్నా డు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. మొదట రూ.3లక్షలు ఇవ్వగా ఆ త ర్వాత కేసు నమోదు చేయిస్తానని బెదిరించి మ రో రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో బాధితురా లు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 42 కిలోల గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: జిల్లాలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడిన 42 కిలోల గంజాయిని గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో గురువారం గంజాయి డిస్పోజల్ చేశారు. ఇందులో 22 కిలోల గంజాయి మొక్కలు, 20 కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు. అడిషనల్ ఎస్పీ సు రేందర్ రావు, డీసీఆర్బీ సీఐ హకీమ్ ఈ ప్రక్రియను పరిశీలించారు. -
భార్యను కడతేర్చిన భర్త
గుడిహత్నూర్: మద్యం తాగొద్దని మందలించిన భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగోంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్, లక్ష్మీబాయి (35) దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంతోష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. గురువారం ఉదయం సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగి మోటార్ సైకిల్ నడుపొద్దని లక్ష్మీబాయి మందలించింది. మద్యం మత్తులో ఉన్న సంతోష్ కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె చెంప భాగంలో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. -
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని సీఐటీయూ కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, ఇన్వాలిడేషన్ అయిన వారి స్థానంలో డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై కొట్లాడటానికి వేదికలైన స్ట్రక్చర్ సమావేశాలు బహిష్కరించి ఇక్కడ గనులపై మెమోరాండాలు ఇస్తూ కార్మికులను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూని యన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ కుమారస్వామి, వెంకట్రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీదేవర ఆలయంలో చోరీ
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ముది రాజ్ సంఘం పెద్దలు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి.. సమీపంలోని పత్తి చేను మీదుగావచ్చిన దుండగులు మొదట ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీలో ఉన్న 4 కిలో ల 500గ్రాములు వెండి, రూ. 36 వేల నగదు, అ మ్మవారిపై ఉన్న రెండు తులాల బంగారు అభరణా లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇంత పెద్దఎ త్తున వెండి ఉందన్న సమాచారం దొంగలకు ఎలా చేరిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందు పార్టీ చేసుకుని దోపిడీ చోరీకి పాల్పడిన దొంగలు మొదట సమీపంలోని పత్తి చేనులో మందు పార్టీ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పథకం ప్రకారం మొదట ఆలయ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయం ఎదుటే నివాస గృహాలు ఉన్నప్పటికీ దుండగులు దోచుకుని యథేచ్ఛగా వెళ్లి పోవడం వెనుక స్థానికులు ఎవరైనా వారికి సహకరించారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 500 మీటర్ల దూరంలోనే పోలీస్స్టేషన్ పోలీస్స్టేషన్కు కేవలం 500 మీటర్ల దూరంలోనే చోరీ, జాతీయ రహదారికి సమీపంలోనే చోరీ జరగడం మండలంలో సంచలనంగా మారింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ గురువారం సందర్శించి స్థానికులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. డాగ్స్వ్వాడ్తో పరిసరాలు గా లించగా అది పత్తిచేనులోకి వెళ్లి ఆగిపోయింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.


