మట్టిపాత్రలతోనే పరిపూర్ణ ఆరోగ్యం
సారంగపూర్: మట్టిపాత్రలను వినియోగించడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, చించోలి(బి) హైస్కూల్ హెచ్ఎం మునీందర్రాజు అన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఎన్జీసీ ఆధ్వర్యంలో మట్టిపాత్రల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. అనంతరం ఇటీవల గణిత సెమినార్కు ఎంపికై న హెచ్ఎం మునీందర్ రాజును, జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.


