Women Power
-
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
చార్టర్డ్ అకౌంటెంట్ అవడం అంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన సీఏ ఎగ్జామ్లో పాసవడం కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ పరీక్షల్లో నెగ్గేందుకు ఏళ్లబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవారెందరినో మనం చూసుంటాం. అయితే నందిని అగర్వాల్ అలా కాదు. అత్యంత చిన్నవయసులోనే సీఏ ఫైనల్స్ క్లియర్ చేయడమే కాదు, ఏకంగా ఆలిండియా టాపర్గా నిలిచి ప్రపంచ రికార్డు సాధించింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ రాణిస్తోంది నందిని.అన్నయ్యకు క్లాస్మేట్!మధ్యప్రదేశ్లోని మొరెనా పట్టణానికి చెందిన నందిని అగర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జరిగిన సీఏ (న్యూ) పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్తో ఆలిండియా టాపర్గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించినట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్ వెల్లడించింది. 2001, అక్టోబర్ 18న నందిని జన్మించింది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి తన అన్నయ్య సచిన్కు క్లాస్మేట్గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్ రాసిన సచిన్కు 18వ ర్యాంక్ రావడం గమనార్హం. ఇక సీఏ ఇంటర్ను 16 ఏళ్ల వయసులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది.వరల్డ్ ఫేమస్ కంపెనీల్లో జాబ్నందిని ప్రస్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎనలిస్ట్గా పనిచేస్తున్నారు. అంతకుముందు వరల్డ్ ఫేమస్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. పీడబ్ల్యూసీ కంపెనీలో ఆర్టికల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్మెంట్లు, టాక్స్ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్లలో తనకు మూడేళ్ల అనుభవం ఉందని తన లింక్డ్ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసినట్టు వెల్లడించారు. BCGలో కీలకమైన G20 టీమ్లోనూ ఉన్నట్టు పేర్కొన్నారు.చదవండి: కళ్ల తప్పిన బైండ్ల బతుకులుసోషల్ మీడియాలోనూ సంచలనండిజిటల్ కంటెంట్ క్రియేటర్గా తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది నందిని అగర్వాల్. ఇన్స్టాగ్రామ్లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లోనూ ఆమెకు 2 లక్షలకు పైగా సబ్స్కైబర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ పరీక్షల సంబంధించిన స్టడీ టిప్స్ వీడియోలను యూట్యూబ్లో ఆమె షేర్ చేస్తుంటుంది. -
హిమాచలంలో ఉమెన్ పవర్
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్ప్రదేశ్లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది. -
నిరీక్షణ ఫలించింది...
కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో కలిసి మన దేశంలో ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ భారత్లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దిల్లీలో ఉంటున్న ఫిషర్ దంపతులు నిషా అనే దివ్యాంగురాలైన బాలికను దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది.‘2023లో అక్టోబర్లో దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా, 2024లో నిషాకు దగ్గరయ్యాం. 2025 ఏప్రిల్ నాటికి దత్తత పూర్తయింది. ఇప్పుడు నిషా మా అందమైన కుమార్తె’ అని ఇన్స్టాగ్రామ్లో రాసింది ఫిషర్.‘కౌంటింగ్ డౌన్ ది డేస్ అన్టిల్...’ ట్యాగ్లైన్తో ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తాను దత్తత తీసుకున్న పాప కనిపిస్తుంది. మరో వీడియోలో చిన్నారి నిషాకు సంబంధించిన ఎమోషనల్ గ్లింప్స్ను షేర్ చేసింది. దివ్యాంగురాలు అనే కారణంతో నిషాను చిన్న వయసులోనే తల్లిదండ్రులు వదిలేశారు. రెండు సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగింది నిషా. ‘స్పెషల్ నీడ్స్ చైల్డ్ను దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం...వారికి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం’ అంటుంది క్రిస్టెన్ ఫిషర్. -
సోలార్ సఖి
రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆ మహిళలు.... ‘రైలు ప్రయాణం ఇంత బాగుంటుందా!’ అని సంబరపడి పోయారు. ఆ తరువాత మరో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే అది రైలు ప్రయాణం కాదు. తమ జీవితాలను మార్చివేసిన ప్రయాణం. చిన్న చదువులు చదువుకున్న ఎంతో మంది గ్రామీణ మహిళలు సోలార్ ఇంజినీర్లుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా రాణిస్తున్నారు...రాజస్థాన్లో నిశ్ఛలగఢ్కు చెందిన తవ్రీదేవి ఎన్నో సంవత్సరాలు విద్యుత్ సౌకర్యం లేని ఇంట్లోనే గడిపింది. అయిదవ తరగతి తరువాత తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో ఇంటి పనులు చేసేది. గొర్రెలు మేపేది. ఇల్లే ప్రపంచంగా బతుకుతున్న తవ్రీదేవి జీవితాన్ని ‘సోలార్ పవర్’ మార్చి వేసింది. హర్మదా(జైపూర్)లో ఐదు నెలల సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమం ఆమె జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్లింది.సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కోసం సిద్ధం అయినప్పుడు.. ‘ఎందుకులే’ అన్నారు తల్లిదండ్రులు. వారిని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది, ‘మా కమ్యూనిటీలోని మహిళలు ఎప్పుడూ ముసుగు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లలేదు. నేను ఎప్పుడూ పట్టణ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లలేదు’ అంటుంది తవ్రీదేవి.కిషన్గడ్కు వెళ్లడం...తన తొలి రైలు ప్రయాణం! ‘అది పూర్తిగా కొత్త అనుభవం. ప్రయాణంలోని ఆనందం తెలిసొచ్చింది’ అంటుంది తవ్రీదేవి. శిక్షణలో సోలార్ ఇన్స్టలేషన్, ఫీల్డ్వర్క్కు అవసరమైన నైపుణ్యాలు సంపాదించింది. ఆ తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. ‘మేము చాలా సంవత్సరాలు చీకటిలో జీవించాము. అందుకే మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నాను’ అంటుంది తవ్రీదేవి.సోలార్ ఇంజినీర్గా కొత్త జీవితాన్నిప్రారంభించిన తవ్రీదేవి తన గ్రామానికి విద్యుత్ వెలుగులు తీసుకువచ్చింది. భారత రాష్ట్రపతి నుండి ‘ఆది సేవా గౌరవ్ సమ్మాన్’ అవార్డ్ అందుకుంది. ఇది కేవలం తవ్రీదేవి విజయగాథ మాత్రమే కాదు... జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్తో సహా పదిరాష్ట్రాలలో మూడువేల మందికి పైగా గ్రామీణ మహిళా సోలార్ ఇంజినీర్ల విజయగాథ.తమ గ్రామాల్లో సోలార్ ΄్యానెళ్లను ఒంటిచేత్తో మరమ్మతు చేసే వీరు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఈ మార్పుకు కారణం హర్ష్ తివారీ నేతృత్వంలోని ఈఎంపీఐ ఇంటర్నేషనల్. ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలు సోల్డరింగ్, వైరింగ్, బ్యాటరీ సెటప్, ఫాల్ట్ ఫైండింగ్, ఇన్స్టలేషన్లలోప్రావీణ్యం సాధించారు. గ్రామీణ మహిళలకు సాంకేతిక నైపుణ్యం, ఆర్థికస్వాతంత్య్రం లక్ష్యంగా ఈఎంపీఐ ఇంటర్నేషనల్ పనిచేస్తోంది.శిక్షణ అనంతరం మహిళలు తమ గ్రామాల్లో సోలార్ సొల్యూషన్స్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మరమ్మతులు, ఫస్ట్లెవల్ చెకప్లు నిర్వహించేందుకు వీలుగా చిన్న ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా సాగేలా చూస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సోలార్ ఇంజినీర్లను ‘సోలార్ సఖీ’ అని పిలుస్తారు.‘వ్యవసాయంతో పాటు చిన్న తరహా పరిశ్రమలలో సౌరశక్తితో నడిచే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంపీఐ ఇంటర్నేషనల్ సోలార్ సఖీలకు శిక్షణ ఇస్తోంది. జీవనోపాధి కల్పిస్తుంది. టెక్నికల్ ట్రైనింగ్తోపాటు ఎంటర్ప్రెన్యూర్షిప్, కస్టమర్ ఎంగేజ్మెంట్లో కూడా శిక్షణ ఇస్తాం. గ్రామాల్లో సోలార్ సెటప్లలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే సోలార్ సఖులు పరిష్కారం చూపుతున్నారు’ అంటున్నాడు హర్ష్ తివారీ. -
సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!
యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్స్ ఎగ్జామ్లో సక్సెస్ని ముద్దాడటం కోసం యువత ఎంతగా తపిస్తుందో తెలిసిందే. అయితే అందరూ విజయాన్ని అందుకోలేరు. కొందరికి తీరని కలగా మిగిలిపోతుంది. ఇక అలా డిప్రెషన్లోకి వెళ్లక.. మరొక మార్గం ఎంచుకుని అచంచలంగా ఎదుగుతూ శెభాష్ అనిపించుకునేలా బతికి చూపించారు ఈ ఇద్దరు మహిళామణులు. ఇద్దరిది ఒక్కో నేపథ్యం, కానీ లక్ష్యం ఒక్కటే. కానీ ఇద్దర్నీ ఆ సివిల్స్ ఎగ్జామ్ విజయం అందుకోలేరని వికటాట్టాహాసం చేసింది. ఇనాళ్లపడ్డ శ్రమ, టైమ్, డబ్బు వేస్ట్ అయిపోయాయి అనేంత మనోబాధే మిగిలింది. అయినా దాన్ని కూడా తట్టుకుని మరో రంగంలో సక్సెస్ వస్తుందేమోనని ధైర్యంగా ముందడుగు వేశారు. అదే వారిని ఊహకందని సక్సెస్ని చవిచూసేలా చేసింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచేలా చేసింది.వివరాల్లోకెళ్తే.. ప్రతి ఏడాది లక్షలాదిమంది విద్యార్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయికి చేరాలనుకుంటారు. అయితే అది అందరికీ అంత ఈజీగా దక్కే విజయం మాత్రం కాదు. కొందరూ మాత్రం త్రటిలో చేజార్చుకున్న పరాజితులుగా మిగిలిపోతారు. అలాంటి పరాజితులే కాజల్ శ్రీ వాస్తవ్, వేద గోగినేనిలు. అయితే ఇద్దరికి సివిల్స్ పరీక్ష రాసే ఛాన్సలన్నీ వృధా అయిపోయాయి. కళ్లముందు శ్రమ అంతా ఆవిరై పోయిందనే వేదన వారి మనసులను ఓ పట్టాన నిలువనీయలేదు. అయితే వారు అక్కడితే ఓడిపోయామని ఆగిపోలేదు. ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాప్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.స్వదేశీ స్పోర్ట్స్ వేర్ వ్యవస్థాపకురాలు..అక్టోబర్ 24, 2020న కాజల్ తన యూపీఎస్సీ పరీక్ష ఆరవ ప్రయత్నంలో విఫలమయ్యాక తీవ్ర నిరాశకు లోనైంది. అనవసరంగా ఈ వైపుకి వచ్చి సమయం వృధా చేసుకున్నానని మధనపడుతూ ఉంది. ఇప్పుడు ఇదికాదు.. నా మనసుకు అత్యంత ప్రశాంత కావాలని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమె సోదరి జోక్యం చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పి.. మరో రంగం ఎంచుకోమని సూచించింది. సివిల్స్లో విఫలమైతే జీవితం పోయినట్లు కాదని గుర్తు చేసింది. అయితే సమయం, డబ్బు వృధా చేసేనన్న గిల్టీ ఫీలింగ్ కాజల్ని స్థిమిత్తంగా ఉండనివ్వలేదు. దాంతో ఆమె మానసిక ప్రశాంతత నిచ్చే పని కోసం వెతకడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే పురాతన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టును నేర్చకునేందుకు ఆసక్తి కనబర్చింది. అదే ఆమె జీవతాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఒక రకంగా నిరాశనిస్ప్రుహలో ఉన్న ఆమెకు తనను తాను నయం చేసుకునే మందులా ఆ విద్య కనిపించిందామెకు. పైగా ఆ రంగంలో రాణించి..ఆ కళను ప్రోత్సహించేలా వర్క్షాప్లు నిర్వహించింది. అలాగే వ్యాపార రంగంలోకి కూడా అగుడుపెట్టి.. స్వదేశీ స్పోర్ట్స్ వేర్ను స్థాపించింది. అలా ఈ రంగంలో సక్సెస్ని అందుకుంటూ..గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా పేరుతెచ్చుకుంది.ఎర్త్ఫుల్ వ్యవస్థాపకురాలు ..వేద గోగినేని ముంబైలోని డ్యూయిష్ బ్యాంక్లో మంచి ఉద్యోగం చేస్తుండేది. త్వరలో లండన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. అయినా..2015లో ఆమె జీవితాన్నే మార్చే అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన యూపీఎస్సీ కలను సాధించేందుకు అంత మంచి ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చి అక్కడే చిన్న ఇరుకుగదిలో...రూమ్మేట్తో కలిసి ప్రిపేరవ్వడం ప్రారంభించింది. మూడున్నేర ఏళ్లు ప్రిపరేషన్కి అంకితమైన జస్ట్ ఒక్క మార్కు తేడాతో కటాఫ్ మార్కులు మిస్ చేసుకునేది. అయితే ఈ ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిలైనా.. మళ్లీ మొదటి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేయాల్సిందే. దీంతో ఇలా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాను అనే బాధ ఆమెను దారుణంగా కుంగదీయడం ప్రారంభించింది. ఇక ఆమె ఏది గెలవలేను అనే ఆత్మనూన్యత భావనకు వచ్చేసింది. అలాంటి సమయంలో ఆమె తల్లి అక్కున చేర్చుకుని మరో రంగంలోకి అడుగులు వేయమని సూచించింది. అలా ఆమె తన సోదరి సుధతో కలిసి 'ఎర్త్ఫుల్' అనే ప్లాంట్ ఆధారిత సప్లిమెంట్స్ కంపెనీని స్థాపించింది. ఈ స్టార్టప్ షార్క్ ట్యాంక్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేగాదు 75 లక్షల పెట్టుబడిని కూడా పొందింది. నిజంగా ఆమెకు ఇది..ఇన్నాళ్లు చవి చూసిన ఓటములకు ఓదార్పు ఈ అతిపెద్ద సక్సెస్. ఇప్పుడామె ఓ సహ వ్యవస్థాపకురాలిగా మరిన్ని విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడూ సివిల్స్ గెలవనందుకు బాధపడటం లేదని ఆనందంగా చెబుతున్నారు. మమ్మల్ని అంతకుమించిన స్థాయిలో నిలబెట్టేందుకే తామిద్దరం అందులో విజయం అందుకోలేకోయేమేమో అని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు. తరుచుగా వింటుంటాం.. వైఫల్యాన్ని అంగీకరించి.. వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోవాలని అంటుంటారు పెద్దలు. ఒకచోట చవిచూసిన ఓటములు మరో రంగాన్ని ఎంచుకున్నప్పుడూ జాగ్రత్తను, తట్టుకోవడాన్ని నేర్పిస్తాయి. అందుకు ఉదహారణే ఈ ఇద్దరూ విజేతలు.చదవండి: 'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పాక్ తండ్రి.. -
'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్గా, ఇండస్ట్రియలిస్ట్గా..
‘మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే నిర్ణయాధికారం వస్తుంది’ అని నమ్మే వాళ్లలో తాటిపర్తి దీపికారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఎవరు? హైదరాబాద్ వాసి .. టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) వ్యవస్థాపకురాలు. ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, ఉచిత శిక్షణతో వాళ్లను ఆ దిశగా నడిపించి.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ఇరవై ఏళ్ల ఆ ప్రయాణం గురించే ఈ కథనం.. చదువుకునే వయసు నుంచే దీపికా రెడ్డి .. ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడాలనే కోరుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి ప్రయాణం మాత్రం పెళ్లయ్యాకే మొదలైంది. ఆమెకున్న పలురకాల ఆసక్తులు, అభిరుచుల మేరకు ఆయా కోర్సులు చదువుకుంటూ ఆయా రంగాల్లో తన ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ను నిరూపించుకున్నారు. అలా పెళ్లి తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి హెయిర్ అండ్ స్కిన్ కోర్స్లో డిప్లొమా చేశారు. ఏరోబిక్స్లో శిక్షణ పొందారు. ఆ అర్హతలతోనే ‘బ్యూటీ అండ్ ఫిట్నెస్ సెంటర్’ అనే ఓన్లీ ఫర్ విమెన్ జిమ్ను స్టార్ట్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసి.. ఇంటీరియర్ డిజైనర్గా మారి, వేదీస్ ఇంటీరియర్స్ పేరుతో సంస్థనూ పెట్టారు. టీ లైఫ్.. ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆంట్రప్రెన్యూర్గా కొనసాగుతున్న దీపికకు హైదరాబాద్లోని ఎలీటా అసోసియేషన్ పరిచయం అయింది. అది మహిళల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ను పెంపొందించడానికి శిక్షణనిచ్చే సంస్థ. అందులో జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు ఆమె. మూడేళ్లపాటు ఆ అసోసియేషన్లో అనుభవం గడించాక 2017లో తను సొంతంగా టీ లైఫ్ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్) సంస్థను ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆంట్రప్రెన్యూర్షిప్ పట్ల అవగాహన కల్పించి, వారికి కావల్సిన శిక్షణను ఇప్పించి వారిని ఆంట్రప్రెన్యూర్స్గా మలచడమే ఆ సంస్థ లక్ష్యం. అందుకే దాని తరపున ఆమె తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకున్న మహిళల కోసం అక్కడి కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారుల సహాయంతో సదస్సులు నిర్వహిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్షిప్ కోసం బయట ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రభుత్వ పథకాలేంటీ, లోన్స్, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, బిజినెస్ కోసం వాళ్ల ప్రాంతాల్లో ఉన్న రీసోర్సెస్ వంటివన్నీ వివరిస్తారు. సదస్సు తర్వాత వాళ్లకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి, హాజరైన మహిళలకున్న బిజినెస్ ఆసక్తులను ఆ దరఖాస్తు ఫారాల్లో నింపమంటారు. ఆ ఫారాల ఆధారంగా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్కి అందుతున్న రుణాలతో అందులోని సభ్యులు ఎలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చో చెప్పి, తగిన శిక్షణనిచ్చి.. ఆ వ్యాపారాలను పెట్టించారు కూడా! ఈ క్రమంలో ఆమె గమనించిన విషయం.. ఆ మహిళలందరినీ వాళ్లమ్మాయిలు ప్రోత్సహించడం.అమ్మాయిల కోసం.. దీపిక.. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలకూ వెళ్లి అక్కడి అమ్మాయిలకూ బిజినెస్ రంగంలో ఉన్న అవకాశాలు, శిక్షణ వంటి వాటిమీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడున్నర వేల మంది మహిళలకు శిక్షణనిచ్చారు. అందులో వందకు పైగా మహిళలు ఆంట్రప్రెన్యూర్స్గా నిలబడ్డారు. ఇందులో సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్కి చెందిన మహిళలే ఎక్కువ. ప్రస్తుతం టీ లైఫ్కి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో ఆఫీసులున్నాయి. మే నెలలో మహబూబ్నగర్లో కూడా ప్లాన్ చేయాలనుకుంటారు. టీ లైఫ్ ఆరంభించినప్పుడు కనీసం పదివేల మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేరుకున్నారు కూడా. నెలకు నాలుగు నుంచి అయిదు బ్యాచ్లుంటాయి. అభ్యర్థులు పెట్టాలనుకున్న బిజినెస్ను బట్టి ఆ శిక్షణ కార్యక్రమాల గడువు ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఎక్స్పర్ట్స్తోనే ఉంటాయి. ‘మొదటి నుంచీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన చోటల్లా అది కుటుంబంలో కానీ.. సమాజంలో కానీ ఎక్కడైనా నాకు గౌరవం పెరుగుతూ వచ్చింది. దాన్ని గ్రామీణ మహిళలు, పట్టణ ప్రాంతం వారూ పొందాలని అనుకున్నాను. వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాను. అందుకే టీ లైఫ్ని స్టార్ట్ చేశాను. మేము వెళ్లినచోటల్లా పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్లకోసం కంప్యూటర్, ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్స్నూ పెట్టాం. ఇంట్లో వాళ్ల నుంచీ నాకు సపోర్ట్ దొరుకుతోంది. టీ లైఫ్ ధ్యేయం ఒక్కటే.. మహిళలు ఆంట్రప్రెన్యూర్స్గానే కాదు ఇండస్ట్రియలిస్ట్స్గానూ ఎదిగేందుకు తోడ్పడాలని. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా అసవరమే! కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలంగా ఉంటే తర్వాత తరాల అమ్మాయిలూ స్ట్రాంగ్గా ఉంటారని నా నమ్మకం.’ అంటున్నారు దీపికారెడ్డి – సరస్వతి రమ(చదవండి: స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!) -
సాగులో సాధికారత కోసం..
భారతదేశంలో మహిళా రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. అవేంటంటే.. సమాన భూమి హక్కులు.. మహిళా రైతులకూ సమానంగా భూమి హక్కులు కల్పించడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారతను పెంపొందిస్తున్నారు. రుణాలు, ఇతర ఆర్థిక సహాయం.. మహిళారైతులకు రుణసౌకర్యాలు, సబ్సిడీలు, ఇతర ఆర్థిక సహాయాలు అందించడం ద్వారా వ్యవసాయ కార్యక్రమాలనుప్రోత్సహిస్తున్నారు. మిషన్ హార్టీ కల్చర్.. ఈ పథకంతో మహిళలకు సాగు నైపుణ్యం, శిక్షణ, సబ్సిడీలు, మద్దతులను అందిస్తున్నారు. సహాయక సమూహాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మహిళా రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో మహిళల నేతృత్వంలోని ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎమ్ – కిసాన్).. ఈ పథకం ద్వారా అర్హతగల రైతులకు బయోడిజాస్టర్లను అందిస్తూ రైతుల శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు దీనివల్ల ఆదాయమూ పెరుగుతోంది. సాంకేతిక పరికరాలు, శిక్షణ.. మహిళా రైతుల కోసం ప్రత్యేక పరికరాలు అందించి.. శిక్షణ కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వారు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి భారతప్రభుత్వం కృషిచేస్తోంది. పట్టణప్రాంతాలకు పురుషుల వలస పెరుగుతున్నందున పశువుల పెంపకం, పాడిపరిశ్రమ, ఉద్యానవనాల పెంపకం, సాగు/సామాజిక అటవీ, చేపలు పట్టడం వంటి పనులను ఎక్కువగా మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో దాదాపు 60– 80 శాతాన్ని గ్రామీణ మహిళలే అందిస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు లభించట్లేదు. సమప్రాధాన్యం అందట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో గ్రామీణ మహిళల సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఒకటే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. ఇది ఈఅ్గNఖఔM కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. ఈ పథకం మొత్తం బడ్జెట్ రూ. 1261 కోట్లు. ద్రావకాలు, పురుగుల మందుల వాడకానికి.. 2024–25 నుంచి 2025–2026 వరకు ఎంపిక చేసిన 14, 500 మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు డ్రోన్లను అందించడం దీని ప్రస్తుత లక్ష్యం. అత్యంత ప్రజాదరణ పొందిన కేంద్రప్రభుత్వ పథకాల్లో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ కూడా ఉన్నాయి. – బి.ఎన్. రత్న బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
ఆపన్న హస్తం ఆదుకుంది.. చదువు దారి చూపింది!
కన్నవారు కాదనుకున్నా.. అనాథలా మారినా.. కష్టాలు చుట్టుముట్టినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అక్షరమే ఆయుధంగా బతుకుపోరు సాగించింది.. అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసింది రవీనా చౌదరి. రెండేళ్ల పసిప్రాయంలో ఆమెను తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. ఆలనా పాలనా చూడలేక తండ్రి మొహం చాటేశాడు. ఏ దారి లేని ఏడారి రాష్ట్రానికి చెందిన ఆ చిన్నారిని తీసుకొని నానమ్మ హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. ఇక్కడే ఉంటున్న తన కూతురు వద్ద ఉంచి రాజస్థాన్ తిరిగి వెళ్లిపోయింది. రవీనాను మేనత్త చేరదీసి స్థానిక హెచ్ఎంటీ కాలనీలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించింది. చదువుల్లో చురుగ్గా ఉండే రవీనా పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. చదువు ఇక చాలన్నారు..పదవ తరగతి పూర్తి కాగానే పైచదువులు చదివించలేనని, ఏదైనా పని చేయాలని రవీనాకు మేనత్త చెప్పింది. తండ్రి రాజస్థాన్ (Rajasthan) నుంచి వచ్చి తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు. చదువుకుంటానంటే కొట్టి పెళ్లికి అంగీకరించాలని హింసించాడు. తండ్రి బారి నుంచి తప్పించుకొని రవీనా అతి కష్టం మీద తిరిగి నగరానికి వచ్చేసింది. అయితే ఆమెను మేనత్త చేరదీయలేదు. ఓనమాలు నేర్పిన పాఠశాల గడప తొక్కడంతో..రవీనా చౌదరి సెయింట్ ఆంథోని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంది. ఆయన చలించి పాఠశాల పూర్వ విద్యార్థులు, తెలిసిన వారి సహకారంతో సమీపంలోని గరల్స్ హాస్టల్లో ఆమెను చేర్పించారు. నెలనెలా ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పుకోవాలని ఐదుగురు చిన్నారులను అప్పగించారు. దీంతో రవీనా చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ హబ్సిగూడలోని ఓ ప్రైవేటు ఇంటర్ కళాశాలలో చేరింది. ఆమె గాథ టీఎన్జీఓ (TNGO) వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి కోయడ దశరథరావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు.తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రవీనా 978/1000 మార్కులు సాధించి చదువుపట్ల తన ధృడత్వాన్ని చాటుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఎప్పటికైనా సివిల్స్లో ర్యాంకు తెచ్చుకోవడమే తన లక్ష్యమని రవీనా చౌదరి ధీమాగా చెబుతోంది. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్లో ప్రవేశం పొంది ఓ టోర్నమెంటులో మెడల్ కూడా సాధించడం గమనార్హం. రవీనా డిగ్రీ చదువుకు, ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కు అండగా ఉంటామని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, దశరథరావు పేర్కొనడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.చదవండి: ఈసారి కూడా అమ్మాయిలదే హవా -
నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ అది మరి! ఆమె టీ కప్ స్పెషల్ ఏంటో?
రిలయన్స్ అధినేత,బిలియనీర్ ముఖేష్ అంబానీ ,నీతా అంబానీ (nita ambani) విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యాపార కుటుంబ వారసత్వంతోపాటు, వ్యాపార దక్షతతో భారీ వ్యాపార సామ్రాజ్యం వారి సొంతం. అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు.ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ కూడా ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపార నాయకుల' జాబితాలో పేరు దక్కించుకున్నారు. ఫిలాంత్రఫిస్ట్గా కూడా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో ముందుంటారు. నీతా అంబానీ దగ్గరున్న చీరలు, డైమండ్ నగలు, చెప్పులు, వాచెస్, వజ్రాలు పొదిగిన హ్యాండ్ బ్యాగ్లు, లిప్స్టిక్ల అద్భుతమైన కలెక్షన్ లెక్కేలేదు. హ్యాండ్ బ్యాగ్లు కూడా వజ్రాలతో పొదిగి ఉంటాయి. చానెల్, గోయార్డ్ మరియు జిమ్మీ చూ కెర్రీ వంటి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్ల హ్యాండ్బ్యాగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికినీతా అంబానీ టీ రూ. 3 లక్షల విలువైన ప్రత్యేకమైన కప్పు ఇవన్నీ ఒక ఎత్తయితే, ఉదయంఆ మె తాగే టీ కప్పు కూడా చాలా విశేషమైనదేట. నీతా ఒక చాయ్ ప్రేమికురాలు ఉదయం టీని ప్రత్యేకమైన టీ కప్పులోనే తాగుతుందట. ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా నీతా అంబానీనే వెల్లడించారు. దీన్ని జపాన్లో పురాతన క్రాకరీ బ్రాండ్ నోరిటెక్ నుండి 50 పింగాణీ కప్పుల సెట్ కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు, అంటే ఒక్కో కప్పు ధర రూ. 3 లక్షలు. ఈ కప్పులు ప్రత్యేకమైన పద్ధతిలో, బంగారం , ప్లాటినం పూత పూసిన అంచులతో తీర్చిదిద్దారు. ఈ డిజైన్ చాలా అరుదుగా లభిస్తుంది మరియు నోరిటెక్లో మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?అంతేకాదు నీతా అంబానీ షాపింగ్ కోసం ఎక్కువ శ్రీలంక వెళతారట. ముఖ్యంగా వంటగది సామాగ్రిని శ్రీలంక దేశం నుంచి కొనుగోలు చేస్తారట. ఇది భారతదేశంలో కంటే శ్రీలంకలో ఉత్పత్తులను చౌకగా చేస్తుంది. భారతదేశంలో సాధారణంగా రూ. 67,000 నుండి రూ. 1.6 లక్షల వరకు ఖరీదు చేసే డిన్నర్ సెట్ శ్రీలంకలో రూ. 25వేల నుంచి రూ. 42 వేల మధ్య లభిస్తుందట. నీతా అంబానీకి కూడా బ్రాండెడ్ వాచీలంటే చాలా ఇష్టం. ఆమె వాచెస్ కలెక్షన్లోబల్గారి, కార్టియర్, రాడో, గూచీ, కాల్విన్ క్లైన్ , ఫాసిల్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ బ్రాండ్ల వాచీల ధర రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అలాగే పెడ్రో, గార్సియా, జిమ్మీ చూ, పెల్మోరా, మార్లిన్ బ్రాండ్ల నుండి బూట్లు, చెప్పులను ధరిస్తారు.ఈ బ్రాండ్ల షూలు రూ. 1 లక్ష నుండి ప్రారంభమవుతాయి అంటే నీతా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ను అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ! -
కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్లో సత్తా
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్సీ (UPSC) సివిల్స్లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఇదీ చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్ ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణంకఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలుమాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్కు సంబంధించి దర్యాపూర్కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్! -
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్రూమ్లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది. -
Kamala Sohonie భారతీయ తొలి మహిళా డాక్టరేట్
తొమ్మిది దశాబ్దాల క్రితం ఓ యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటమే చేయాల్సివచ్చింది. ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్తో! ఆ యువతి కమలా సోహానీ Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ! బొంబాయిలో 1911 జూన్ 18న జన్మించారు కమలా భాగ వత్. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసా యన శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. తర్వాత సీవీ రామన్ డైరెక్టర్గా ఉన్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ (నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ ళూరు)లో ఎమ్మెస్సీ చదవాలని ప్రయ త్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదు వుకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించేది. సీవీ రామన్ కూడా దాన్నే నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భాగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత రామన్ మహాశ యుడు కమల పట్టుదలను గమనించ లేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో రామన్ దిగిరాక తప్పలేదు. చివరకు ప్రవేశ మిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో! అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీగా చేరవలసి వచ్చింది. ‘అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు’– ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు! అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎమ్మెస్సీ పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు.దీంతో రామన్ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడంప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్య యనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యారు. పీహెచ్డీ కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో ‘సైటోక్రోమ్ సి’ అనే ఎంజైమ్ ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటు న్నదనీ కనుగొన్నారు. తన పరిశోధనా ఫలితాలను కేవలం 40 పుటలు ఉన్న సిద్ధాంత గ్రంథంగా కేంబ్రిడ్జి యూని వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు. విజ్ఞానశాస్త్ర రంగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమల అవతరించారు.ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఎం.వి. సోహా నీతో 1947లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కమలా భాగవత్పేరు కమలా సోహానీగా మారింది. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు, తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగు లేనివి.ఎనభయ్యారేళ్ళ వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 1998 జూన్ 28న ఆమె హఠాత్తుగా మరణించడం ఆమె జీవన యాత్రకు ఆశ్చర్యకరమైన ముగింపు!– డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ఈ రోజు కష్టాలున్నాయని కుంగిపోకూడదు. చీకటి వెనుకే వెలుగు ఉంటుంది. ఈ ఆశావహదృక్పథమే మనిషిని నడిస్తుంది. భవిష్యత్పై ఆశను పెంచుతుంది. ఆత్మవిశ్వానికి మనో ధైర్యాన్ని జోడించి ముందుకు అడుగేయాలి. అప్పుడే మన పట్టుదలకు, కష్టానికి విజయం దాసోహమంటుంది. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ సక్సెస్ గురించి తెలుసుకుంటే.. ఈ మాటలు అక్షర సత్యాల నిపించక మానవు. 9వ తరగతిలో న చదువు మానేసి, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ గురించి తెలుసుకుందా రండి!రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో వివాహం చేశారు పెద్దలు. అప్పటికి మద్వా ఖపర్దా అనే చిన్న గ్రామంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. పెళ్లి తరువాత చదువుకు బ్రేక్ పడింది. కుటుంబం గడవడం కోసం దినసరి కూలీగా పనిచేసింది. NREGA ద్వారా వచ్చే జీతమే వారికి ఆధారం. కానీ రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ (రాజీవిక) పథకం ఆమె జీవితంలో మార్పునకు నాంది పలికింది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందంలో చేరి, ఆమె సౌర దీపాలు , ప్లేట్లను(Solar lamps and Plates) ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంది. శ్రద్ధ పెట్టి, ఈ పనిలో నైపుణ్యం సాధించింది. ఆ తరువాత దుర్గా ఎనర్జీ (దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్)కంపెనీని స్థాపించింది. ఒక గిరిజన మహిళగా తాను సాధికారత సాధించడమే కాదు, తనలాంటి ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది. కంపెనీ ఐదేళ్ల కాలంలో రూ. 3.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. కంపెనీ సీఈవోగా రుక్మిణి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కృషికి గాను ఆమెకు జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రుక్మిణిని సత్కరించారు.ఇదీ చదవండి: ఫ్యాషన్లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్తో మెరిసిన బ్యూటీతక్కువ చదువుకుంటే ఏంటి? "మహిళలు పెద్దగా చదువుకోలేదని, విద్య తక్కువ అని ఎప్పుడూ తమను తాము తక్కువగా అనుకోకూడదు. తక్కువ విద్యతో కూడా ఎదగవచ్చు. నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నేడు నేను ఒక కంపెనీ యజమానిని. నాలాగే ఇతర మహిళలు ఇలా ఎందుకు చేయకూడదు?” అంటుందామె సగర్వంగా. ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇపుడు భర్త కమలేష్తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: రాకేష్, ఆశా, ప్రవీణ్ ,యువరాజ్. అందర్నీ ఉన్నత చదువులను చదివిస్తోంది.చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
Rutuja Warhade: దేశం కోసమే మొదటి అడుగు
ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. దేశం మొత్తం నుంచి 12 లక్షల మంది రాశారు. వీళ్లలో లక్షన్నర మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది పూణెకు చెందిన రుతుజా వర్హాడే. అంతే కాదు.. దేశం మొత్తం మీద 3వ ర్యాంక్ పొందింది. 75 ఎన్ డీఏ చరిత్రలో ఒక అమ్మాయి టాప్ ర్యాంక్ సాధించడం ఇదే మొదలు. ‘మొదటి నుంచి డిఫెన్స్ లో పని చేయాలనేది నా కోరిక... అందుకే కష్టపడ్డా’’ అంటోంది రుతుజా.పూణెలో ఉండే ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్.డి.ఏ) ఎంట్రన్స్ సంవత్సరంలో రెండుసార్లు జరుగుతుంది. ఏప్రిల్లో. సెప్టెంబర్లో. ఏప్రిల్లో జరిగిన ఎంట్రెన్స్కు 12 లక్షల మంది దేశవ్యాప్తంగా అప్పియర్ అయితే వారిలో 3వ ర్యాంక్ సాధించింది రుతుజ వర్హాడే. అకాడెమీ చరిత్రలో ఒక అమ్మాయికి ఈ స్థాయి ర్యాంక్ రావడం ఇదే మొదలు. పరీక్షలో పాల్గొన్న 12 లక్షల మంది అభ్యర్థుల్లో లక్షన్నర మంది అమ్మాయిలైతే వారిలో మొదటి స్థానంలో నిలిచింది రుతుజ. అందుకే ఆమెను అందరూ శ్లాఘిస్తున్నారు. ఆ ప్రతిభకు సెల్యూట్ చేస్తున్నారు.దేశం కోసం...రుతుజ పూణెలో పుట్టి పెరిగింది. తండ్రి ప్రొఫెసర్. తల్లి ఇంట్లో 5వ తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్ పిల్లల వరకూ మేథ్స్లో ట్యూషన్ చెబుతుంది. రుతుజ చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రిలియంట్గా ఉంది. పదవ తరగతిలో టాప్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో కూడా అంతే. ఎన్.డి.ఏ ఎంట్రన్స్ ఇంటర్ తర్వాత రాయాలి కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ రాసి టాప్ ర్యాంక్ సాధించింది. ‘ఆర్మ్డ్ ఫోర్స్లో పని చేయాలనేది నా కల. దేశం కోసమే నా మొదటి అడుగు’ అంటోంది రుతుజ.ఎనిమిదవ తరగతిలో ఉండగా...సాధారణంగా ఆమ్మాయిలు ఎన్.డి.ఏ.లో చదవాలని కోరుకోరు. అందుకే నిన్న మొన్నటి వరకూ వారిని అనర్హులుగా చూసేది ఎన్.డి.ఏ. అయితే రుతుజ ఎనిమిదవ క్లాస్లో ఉన్నప్పుడు ఎన్.డి.ఏ. ఇకపై ఆడపిల్లలకూ ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఈ విషయం మా క్లాస్లో చర్చకి వచ్చింది. అప్పుడే ఎన్.డి.ఏ గురించి తెలిసింది. మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉండటం మొదటి అర్హత అయితే కఠినమైన రిటన్ టెస్ట్లో పాసయ్యి రెండవ దశలో సీట్ సంపాదించడం ఇంకా కష్టమని తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ అకాడెమీలో చేరాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. మేథ్స్, అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు ఉంటాయి. వాటి కోసం కోచింగ్ సెంటర్లో నాలుగైదు గంటల మెగా లెక్చర్స్ వినేదాన్ని. అంతేకాదు... మా నాన్నగారు అందించిన ప్రోత్సాహం కూడా నన్ను మోటివేట్ చేసింది’ అంటుంది రుతుజ.మాటలు పడినా...రుతుజ ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. చదువులోనే నిమగ్నమై ఉండటంతో స్నేహితులు ఆమెను బాయ్కాట్ చేశారు. ఎప్పుడూ చదువే నీకు... ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నీ ప్రతిభ గుండు సున్నా అని ఎగతాళి చేశారు. ‘రోషపడి సీనియర్ ఇంటర్లో క్లాసుల కంటే కూడా స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్లో ఎక్కువ సమయం వెచ్చించాను. దాంతో నా గ్రేడ్స్ పడిపోయాయి. చాలా డల్ అయిపోయాను. ఆ దశ నుంచి తిరిగి టాప్ స్టూడెంట్గా నిలవడానికి కష్టపడాల్సి వచ్చింది’ అని తెలిపింది రుతుజ.‘సాధారణంగా సీనియర్ ఇంటర్లో చాలామంది డైవర్ట్ అవుతారు. అలా కాకుండా కష్టపడి చదివి లక్ష్యం వైపు అడుగు వేస్తే విజయం మీదే’ అంటోంది రుతుజ. -
ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్లో చోటు..
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్ బయోటక్ దిగ్గజం కేవల్ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్రమణి. ఆమె ఈ ఏడాది టైమ్ మ్యగజైన్ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్ ప్రోఫైల్ కూడా దీన్నే హైలెట్ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్ జాగ్రత్త..!) -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్కి మంచి మార్కెట్గా మార్చాయి! భారత్కు బ్రాండ్నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ను డెస్టినేషన్గా కోరుకుంటూ! ఆ స్టోరీ...భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే తెలంగాణ రాష్ట్రాన్ని మిస్ వరల్డ్ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు. వీటిని కవర్ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్బజార్లో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్గానో.. ఆఫ్ బీట్ స్టోరీస్గానో ఫోకస్ చేస్తాయి. అలా తెలంగాణ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం. తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్ మేకప్ ఆర్టిస్ట్లు, హెయిర్ స్టయిలిస్ట్లు, టెక్స్టైల్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?హైదరాబాద్ను సౌత్ ఫ్యాషన్ హబ్లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!బాధ్యతనూ తీసుకోవాలినారాయణ పేట్ విమెన్ వీవర్స్ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్డౌన్ టైమ్లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్ టెక్నిక్తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్ ప్రింట్స్ని యాడ్ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్ చేసి నారాయణ పేట్ లోనే వీడియో షూట్, ఫొటో షూట్ చేశాను. ఆ డిజైన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్లా పెట్టి.. ఆ సేల్స్ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్ డే రోజు వాళ్లకు గిఫ్ట్గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్టైల్స్ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్టైల్ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్ హబ్ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్మంచి అవకాశంనేనైతే దీన్ని పాజిటివ్గానే చూస్తాను. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్వేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, హెయిర్ స్టయిలిస్ట్స్, మేకప్ ఆర్టిస్ట్స్ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్వేర్, కాస్ట్యూమ్స్ తయారీకీ ఇది హబ్గా మారొచ్చు. గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్కీ స్కోప్ ఉంటుంది. గ్రూమింగ్ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉపయోగపడతాయి. – కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మేకప్ రంగంలో మంచి విమెన్ మేకప్ ఆర్టిస్ట్లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్కి వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్ ఆర్టిస్ట్ల నుంచి కొటేషన్స్ను ఆహ్వానించాలి– శోభాలత, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్భద్రత.. రక్షణ కల్పించి...ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్తబ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ఈ పోటీలు హైదరాబాద్ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ అనుకోవచ్చు. – మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ -
Aarthi Subramanian: ఐటీలో ఆమెకు అగ్రపీఠం
ఐ.టి. దిగ్గజ సంస్థ టి.సి.ఎస్. మే 1 నుంచి ఆర్తి సుబ్రహ్మణ్యానికి సి.ఓ.ఓ. బాధ్యతలు అప్పజెప్పింది. బహుశా దేశంలో ఐ.టి. రంగంలో సి.ఓ.ఓగా నియమితురాలైన మొదటి మహిళ ఆర్తినే కావొచ్చు. ఆమె పరిచయం.చిన్న చిన్న ఉద్యోగాలు, వర్తకాలు చేసే వారు కూడా ‘వాకింగ్కి టైమ్ దొరకలేదు’ అంటుంటారు. కాని టాటా సంస్థల్లో కీలకమైన బాధ్యతల్లో ఉంటూ వచ్చిన ఆర్తి సుబ్రహ్మణ్యం ఏ రోజూ వాకింగ్ మానేయరు. వాన వచ్చినా వరద ముంచెత్తినా వాకింగ్ చేయాల్సిందే. ‘రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాలని నా ప్రయత్నం. కనీసం ఆరు నుంచి ఎనిమిదైనా నడుస్తుంటాను. నడక ఆలోచనకు చోటు ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి దోహదం చేస్తాయి’ అంటారామె. 58 ఏళ్ల ఆర్తి సుబ్రహ్మణ్యం 30 బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి. సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టి.సి.ఎస్.)కు మే 1 నుంచి సి.ఓ.ఓ. (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా మగవారే పై స్థానాల్లో ఉండే ఐ.టి. రంగంలో సి.ఓ.ఓ.గా మహిళ కనిపించడం అరుదు. టాటా సంస్థల్లో గాని, ఇతర ఐ.టి. దిగ్గజ సంస్థల్లోగాని ఇలా సి.ఓ.ఓ.స్థాయికి చేరిన స్త్రీలు బహు తక్కువ. అందుకే అందరూ అబ్బురంగా ఆర్తి వైపు చూస్తున్నారు.ట్రయినీగా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి...ఆర్తి సుబ్రహ్మణ్యం మన వరంగల్ విద్యార్థి. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో బి.టెక్ కంప్యూటర్ సైన్స్ చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. 1989లో తన కెరీర్ని గ్రాడ్యుయేట్ ట్రయినీగా టాటాలో మొదలుపెట్టి్ట అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు టాటాలోని అన్ని కీలక సంస్థల్లో ముఖ్యహోదాల్లో పని చేశారు. మన దేశంలో పాస్పోర్ట్ డిజిటలైజేషన్ కోసం టాటా నిర్వహించిన ప్రాజెక్ట్లో చురుగ్గా పని చేశారు. టాటా ఏ.ఐ.జి.లో, అలాగే హెచ్.ఆర్లో చేస్తూ టాటా సన్స్లో ఎనిమిదేళ్లుగా గ్రూప్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే టి.సి.ఎస్.కు సి.ఓ.ఓ.గా వస్తున్నారు.మిసెస్ ఫిక్సిట్ఆర్తి సుబ్రహ్మణ్యానికి సాటి ఉద్యోగులు ‘మిసెస్ ఫిక్సిట్’ అని సరదాగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దానికి ఆమె దగ్గర సమాధానం ఉంటుంది. సవాళ్లను స్వీకరించే ఆమె తత్త్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అయితే ఆమెకు ఉద్యోగమే జీవితం కాదు. వారాంతం వచ్చిందంటే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చూడాల్సిందే. అమితాబ్ బచ్చన్కు పెద్ద ఫ్యాన్. అలాగే పాటలు వింటారు. మేనేజ్మెంట్కు సంబంధించిన పుస్తకాలు చదువుతారు. ‘ఒక వ్యక్తి రాబోయే కాలంలో ఎక్కడ ఎలా ఉండాలో నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరొచ్చు. అయితే టీమ్ మీతో ఉండి మీకు సహకరించాలి. మీరు టీమ్కి సహకరించాలి. అది జరిగిన పక్షంలో ఉద్యోగంలో ఒక్క క్షణం కూడా మీకు బోరు కొట్టదు’ అంటారామె. టి.సి.ఎస్.కు ఐదేళ్ల పాటు సి.ఓ.ఓ.గా పని చేయనున్నారు ఆర్తి సుబ్రహ్మణ్యం. ఈ సమయంలో ఈ వార్త ఆ సంస్థ ఉద్యోగులకే కాదు ఐ.టి. రంగంలో పని చేస్తున్న స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకమే. -
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
కొంతమంది అనుకోకుండా యాక్టర్లు అవుతారు. మరికొంతమంది డాక్టర్ కాబోయి యాక్టర్లు అవుతారు. ఇంకొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత స్టార్ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును, పేరును తెచ్చుకున్నట్టప్పటికీ, వేరేరంగంలో పేరు రాణించడం చాలా అరుదు. పలు సినిమాలలో నటించి క్రేజ్, ఫామ్ను వదిలిపెట్టి, ఇపుడు ఐఏఎస్ ఆఫీసర్గా రాణిస్తున్న హెచ్సీ కీర్తన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.భారతీయ సినిమా మనకు అనేక మంది ప్రఖ్యాత కళాకారులు అందించింది. తమకంటూ ఒక పేరును చెక్కుకుని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వారి అద్భుతమైన నటనకు దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో ఒకరు. హెచ్సి కీర్తన. ఆమె బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించి, అనేక మంది ప్రముఖ తారలతో కలిసి నటించింది. 32 కి పైగా చిత్రాలలో నటించింది. 48 టీవీ షోలలో కనిపించింది. కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, పుత్రీ, జననీ, జననీ ఉన్నాయి. అనేక సినీపాత్రలతో అపారమైన ప్రజాదరణ పొందింది. చదవండి: ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం!అద్భుతమైన ఫామ్ కొనసాగుతున్న సమయంలోనే తన చదువుపై దృష్టి పెట్టడానికి పరిశ్రమను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంది. దేశానికి సేవ చేయడానికి 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. IAS ఆఫీసర్ కావాలనే తన తండ్రి కల, తన కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించింది. నటనా జీవితానికి బై బై చెప్పేసి యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యింది. అయితే తన కల అంత ఈజీగా సాకారం కాలేదు. ఐదుసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన, చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సొంతం చేసుకుంది. UPSC పరీక్షలో ఆలిండియా లెవెల్ లో ఆరో ప్రయత్నంలో 167వ ర్యాంక్ ను ఆమె సాధించారు. ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తోంది.గతంలో కీర్తన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకోవడం విశేషం.ఇదీ చదవండి: మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..! -
హాట్సాప్ అన్నపూర్ణ ..! రియల్ ‘లేడి సింగం’
పోలీసుశాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025. ‘ఎందుకు ఇలా?’ అనేదానిపై ఎందరో ప్రముఖులు తమ అభిపప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్మెంట్లో మహిళలు తప్పనిసరిగా ఎందుకు ఉండాలి’ అనే కోణంలో కొందరు విలువైన విశ్లేషణ చేశారు. అన్నపూర్ణలాంటి ధైర్యసాహసాలు మూర్తీభవించిన పోలీస్ ఇన్స్పెక్టర్ల గురించి చదివినప్పుడు వారి విశ్లేషణ నూటికి నూరుపాళ్లు సరిౖయెనదే అనిపిస్తుంది. కర్నాటకలోని హుబ్లీ నగరంలో గత ఆదివారం ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచార యత్నం చేసి, చంపేసిన సంఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బిహార్కు చెందిన రితేష్ కుమార్. ఇతడు వలసకూలీ. సీసీ టీవీల కెమెరా ఫుటేజీ సహాయంతో రితేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం తీసుకువెళుతున్న సమయంలో రితేష్ పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అశోక్నగర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ పారిపోవద్దు’ అని రితేష్ను హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు (వార్నింగ్ షాట్) జరిపింది. రితేష్ ఆమె హెచ్చరికను ఖాతరు చేయలేదు. రాళ్ల దాడీ ఆపలేదు. దీంతో గత్యంతర లేని పరిస్థితులలో అన్నపూర్ణ రితేష్పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో అన్నపూర్ణతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అన్నపూర్ణ ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ‘లేడి సింగం’ అనే విశేషణాన్ని ఆమె పేరుకు ముందు జోడిస్తున్నారు. తాజా విషయానికి వస్తే... కర్నాటక మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నపూర్ణను అభినందించారు. ‘హేయమైన నేరాలకు పాల్పడిన నిందితులను ఉరి తీయాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. పోలిస్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలవాలి. అన్నపూర్ణను అత్యున్నత రాష్ట్ర పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రులకు సిఫారసు చేస్తాం’ అన్నారు హెబ్బాళ్కర్. బెల్గాం జిల్లాలోని గుజనట్టి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ధార్వార్డ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేసింది. 2018లో పోలిస్శాఖలో చేరింది. ‘రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ మహిళా పోలీస్ అధికారి చేయని సాహసాన్ని అన్నపూర్ణ చేసింది. హాట్సాప్’ అంటూ సోషల్ మీడియాలో అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.(చదవండి: 'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..! ఆ ఏజ్లోనే విడిపోవడానికి కారణం..) -
కౌంట్ డౌన్: ఐకానిక్ మహిళల అంతరిక్ష యాత్ర
ఆరుగురు ఐకానిక్ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ లేకుండానే పనిచేస్తుంది. సబ్ ఆర్బిటల్ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఎన్.ఎస్.–31 మిషన్ టెక్నాలజీ ఫీట్ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్ కింగ్.‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్ సాంచెజ్.ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్ మహిళల అంతరిక్షయాత్ర హాట్ టాపిక్గా మారింది.అయేషా బోవ్నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్ మిచిగన్ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో డిగ్రీ, స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్ బోర్డ్’ అనే ఇంజినీరింగ్ కంపెనీకి అయేషా బోవ్ సీఈవో.అమంద గుయెన్హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్లో పనిచేసింది అమంద గుయెన్. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్ ఫైవ్: ఎ మెమోరియల్ ఆఫ్ హోప్’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.లారెన్ సాంచెజ్ లారెన్ సాంచెజ్ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్గా పనిచేసింది. లారెన్ హెలికాప్టర్ పైలట్ కూడా. ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.గేల్ కింగ్మేరీల్యాండ్ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్ కింగ్కు రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్ కింగ్ ఇన్ ది హౌజ్’ అనే రేడియో షోని హోస్ట్ చేసింది. ఉత్తమ రేడియో టాక్ షో కోసం ఇచ్చే ‘అమెరికన్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ గ్రేసి అవార్డ్’ను సొంతం చేసుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.కేటీ పెర్రీఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్లలో పాప్ స్టార్ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ రికార్డ్లు బ్రేక్ చేసింది. 13 గ్రామీ అవార్డ్లకు కేటీ నామినేట్ అయింది. బిల్బోర్డ్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్–2012’ అవార్డ్ అందుకుంది. ‘ఫైర్ వర్క్ ఫౌండేషన్’ మొదలుపెట్టి యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా సేవలు అందిస్తోంది.కెరియానే ప్లిన్కెరియానే ప్లిన్ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్లో ఆమె తీసిన దిస్ చేంజెస్ ఎవ్రీ థింగ్ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి. -
యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..
సోషల్ మీడియా ఎక్కడెక్కడో వంటింట్లోనే మగ్గిపోయే వనిత లెందరినో బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎందిరినో స్టార్లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్నైట్ స్టార్లుగా మార్చింది. అలానే ఇక్కడొక బామ్మ కూడా యూట్యూబ్ సెన్సేషన్గా మారింది. తన పాకకళతో ఎందరో ఫాలోవర్లును దక్కించుకుని డిజటల్ క్విన్గా మారింది ఈ 74 ఏళ్ల బామ్మ. ఆ బామ్మను అంతా ఆప్లీ ఆజీగా పిలిచే సుమన్ ధమానే. ఆమె యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే..ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్థిచడం మరింత విశేషం. ఆమె మనవు యష్ సాయంతో ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారామె. తన పాకకళతో యూట్యూబ్ ఛానెల్లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ. ఎప్పటికప్పుడూ కొత్తదనంతో..కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరించింది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరంగా వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో..ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది. ఈ యూట్యూబ్ స్టార్డమ్ జర్నీలో ఆమె కెమెరా ముందు నిలబడి మాట్లాడటంలో మొదట్లో తడబాటు, సిగ్గుపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. అలాగే సాంకేతిక లోపాలు, ఛానెల్ హ్యాక్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ..తన జర్నీని విరమించలేదు. తాజా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్ను కూడా దక్కించుకుంది. ఈ బామ్మ కథ విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నేనా సాధించగలమని నిరూపించింది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్తో నెలకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల పైనే సంపాదిస్తుందట. (చదవండి: మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..) -
అమిత ప్రతిభ
అడ్వర్టైజింగ్, సినిమా ఫీల్డ్ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్టైజింగ్ ఫీల్డ్కు వెళతావా! సినిమా ఫీల్డ్కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్టైజింగ్ ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్లో బ్యాగులు ΄్యాకింగ్ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.ఒగిల్వి, లియో బర్నెట్లాంటి అడ్వర్టైజింగ్ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్టైజింగ్ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్ బిల్డింగ్, క్లయింట్ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్ ఫిలిమ్స్’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్–ఫస్ట్ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్తో కూడిన టెలివిజన్ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా...మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్ స్పాట్ అయినా, మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్–టు–ఎండ్ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. టీమ్ అంకితభావం మా విజయానికి కారణం.– అమిత మద్వాని -
ఆ యూనిఫాం నచ్చి చెఫ్గా మారా.. ఏకంగా 72 పోటీల్లో 94 పతకాలు!
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్కు చెందిన మహిళా చెఫ్ (Woman Chef) దివ్యసారిక. తాను చెఫ్గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్గా మలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా (Guntur District) ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక (Divya Sarika) ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్గా మారాలని నిర్ణయించుకుంది. మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్ఐసీసీలో అప్రెంటీస్లో చేరి అనంతరం అక్కడే చెఫ్గా చేరింది. తదనంతరం నోవోటెల్లో రెండున్నరేళ్ల పాటు చెఫ్గా చేసింది. 72 పోటీల్లో.. 94 పతకాలు.. బేకరీ విభాగంలో చెఫ్గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది. నిర్భయ గర్ల్చైల్డ్, మథర్ థీమ్తో చెఫ్గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది. లక్షల జీతం వదిలి.. మహిళా చెఫ్గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్గా స్థిరపడ్డారని తెలిపారు. రుచికరమైన ఆహారం అందించేందుకు.. చెఫ్స్గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!) -
చలనమే విజయం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.టెస్ట్ పాసైన మహిళగత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.మా జీవితాలు మారాయిడ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్తో ఒక టూ వీలర్ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు. చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి. ‘కనావు’...అంటే ‘స్వప్నం’దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి. మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది. -
'ట్విన్టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా చదవడం అత్యంత అరుదు. ఎక్కడోగానీ అలా జరగదు. ఒకవేళ్ల ఇద్దరూ మంచి ప్రతిభావంతులైనా కూడా ఒకేలా మార్కులు సాధించడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఈ ట్విన్స్ ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. తమ పుట్టుకే కాదు..ప్రతిభలో కూడా ఒకేలా సత్తాచాటుతామని అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అంతేకాదండోయ్ పది నుంచి ఎంబీబీఎస్ వరకు దాదాపు ఒకేలా మార్కులు సాధించడం విశేషం.ఆ కవలలే రహిన్, రిబాలు. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగారు ఇద్దరు. తమ కుటుంబంలోని తొలి వైద్యులు కూడా వీరే. తమ మామ ఈ రంగంలోకి రావడానికి ఆదర్శం అని చెబుతున్నారు ఇద్దరు. వీరిద్దరూ వడోదరలోని GMERS మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకేలా 66.8% స్కోర్ సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఆ కాలేజ్ హాస్టల్ గదిలో ఒకే రూమ్లో కలిసి చదువుకున్నారు. తామిద్దరికి ఎంబీబీఎస్ సీటు వేర్వేరు కాలేజీల్లో వచ్చినా..2019లో గోత్రిలోని వైద్య కళాశాలలోనే ఇద్దరం జాయిన్ అయ్యాం అని చెబుతున్నారు ఇద్దరూ. తమ ఇంటికి చేరువలోనే ఆ కాలేజ్ ఉంటుందన్నారు. అలాగే నగరానికి వచ్చి ఒంటరిగా చదవడం కూడా ఇదే మొదటిసారని కూడా చెప్పారు. తమ తల్లి, తాతా, మామల ప్రోద్భలంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెబుతున్నారు. ఇక రిబా, రహిన్లు తమ అమ్మ కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక వారిద్దరి విద్యా నేపథ్యం చూసినా..చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. పదిలో రిబా 99%, రహిన్ 98.5%తో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్లో ఒకరు 98.2%, మరొకరు 97.3% కాగా, NEET-UGలో ఇరువురు 97%, 97.7% మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇతర మెరిట్ ఆధారిత ఆర్థిక సహాయం ద్వారా ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా చదువుకున్నారు ఇద్దరు.ఇక రహిన్ ప్రసూతి అండ్ గైనకాలజీ వంటి సర్జికల్ బ్రాంచ్లో, రిబా ఇంటర్నల్ మెడిసిన్లోనూ కొనసాగాలనుకుంటున్నారు. అంతేగాదు ఇద్దరు అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు. తామిద్దరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చామని చెబుతున్నారు. తమ కెరీర్ జర్నీ చాలా అద్భుతంగా సాగింది..అదే సక్సెస్ని ప్రతి విషయంలోనూ కొనసాగిస్తామంటున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.(చదవండి: మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..) -
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మంచి సక్సెస్ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?) -
సముద్రంపై సాహస సంతకం
‘జీరో’ అంటే చాలామందికి చిన్న చూపు. అయితే ఎంత పెద్ద విజయమైనా ‘జీరో’ తోనే మొదలవుతుంది. హీరోలను చేస్తుంది. తాజా విషయానికి వస్తే.... త్రివిధ దళాలకు చెందిన 11 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల ‘సముద్ర ప్రదక్షిణ’కు శ్రీకారం చుట్టారు. గతంలో వీరికి సముద్ర సాహస యాత్ర అనుభవం లేదు. జీరో నుంచి మొదలు పెట్టి ప్రతి విషయాన్నీ ఓపికగా నేర్చుకొని సాహసయాత్రకు కదిలారు.హిందూ మహాసముద్రం స్త్రీ శక్తికి వేదిక కానుంది. త్రివిధ దళాలకు చెందిన పదకొండుమంది మహిళా అధికారులు నిన్నటి (సోమవారం) నుంచి హిందూమహాసముద్రంలో ‘సముద్ర ప్రదక్షిణ’ మొదలుపెట్టారు. ముంబైలోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ (ఐఎన్డబ్ల్యూటీసీ) ఈ యాత్రప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహా సముద్రంలోని 4,000 నాటికల్ మైళ్లను ఈ బృందం అధిగమించనుంది. వీరిలో ఆరుగురు ఆర్మీ అధికారులు, ఒక నేవీ అధికారి, నలుగురు వైమానిక దళ అధికారులు ఉన్నారు.త్రివిధ దళాల నుంచి...భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ అనుజ, మేజర్ కరంజీత్, మేజర్ తాన్యా, కెప్టెన్ ఒమితా, కెప్టెన్ దౌలీ, కెప్టెన్ ప్రజక్త, భారత వైమానిక దళం నుంచి స్క్వాడ్రన్ లీడర్ విభా, స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధ, స్క్వాడ్రన్ లీడర్ అరువి, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి, భారత నావికాదళం నుంచి లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక ఈ బృందంలో ఉన్నారు.కఠినమైన ఎంపిక ప్రక్రియఈ సాహస యాత్రకు ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగింది. ఎంపికకు ఫిజికల్ ఫిట్నెస్, టీమ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, అకడమిక్ నాలెడ్జ్, బోట్–హ్యాండ్లింగ్ కేపబిలీటీస్... మొదలైన వాటినిప్రామాణికంగా తీసుకున్నారు. త్రివిధ దళాలకు చెందిన 41 మంది మహిళా అధికారుల బృందం నుంచి 11 మంది మహిళా అధికారులను సముద్ర సాహస యాత్ర కోసం ఎంపిక చేశారు.పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పరిధిలోని ‘ఆర్మీ అడ్వెంచర్ నోడల్ సెంటర్ ఫర్ బ్లూ వాటర్ సెయిలింగ్’లో త్రివిధ దళాల మహిళా అధికారులు రెండు సంవత్సరాల పాటు కఠోర శిక్షణ ΄÷ందారు, ఈ బృందం జీరో నుంచి శిక్షణ మొదలుపెట్టింది. నౌకాయానానికి సంబంధించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలలోప్రావీణ్యం సాధించారు. సముద్రయానానికి అవసరమైన శారీరక బలాన్ని సమకూర్చుకున్నారు. నావిగేషన్, వాతావరణ శాస్త్రం, సీమన్షిప్ గురించి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్లాంటి సెయిలింగ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. రూట్ ΄్లానింగ్, వెదర్ ఫోర్ కాస్టింగ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, స్టాకింగ్ అండ్ సేఫ్టీ ్రపోటోకాల్స్తోపాటు అంతర్జాతీయ సముద్ర చట్టాల గురించి కూడా తెలుసుకున్నారు.చిన్న అడుగులతో పెద్ద సాహసం వైపు...మొదట షార్ట్ డే ట్రిప్స్ చేసేవారు. భవిష్యత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమలోని నైపుణ్యాలకు పదును పెట్టడానికి, సముద్ర ప్రయాణానికి సిద్ధం కావడానికి ముంబై నుండి గోవా, కొచ్చి, పోర్బందర్, లక్షద్వీప్ వరకు ఎన్నో యాత్రలకు వెళ్లారు. అయితే ఊహించని వాతావరణ పరిస్థితుల నుంచి సాంకేతిక సమస్యల వరకు సముద్ర యాత్రలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి సవాలు నుంచి పాఠం నేర్చుకున్నారు. అధికారిక నౌక ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్(ఐఎఎస్వీ)‘త్రివేణి’ నుంచి మొదలైన ఈ ప్రపంచ యాత్ర చరిత్ర సృష్టించనుంది.‘నారీశక్తి’ స్ఫూర్తితో మొదలైన ఈ ప్రయాణం చారిత్రాత్మకమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. పంచభూతాల సందేశంసముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డ్ నెలకొల్పనుంది. ఈ యాత్ర కేవలం సముద్రయానం మాత్రమే కాదు మహిళా సాధికారతకు శక్తిమంతమైన ప్రతీక. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు మహా సముద్రాలను కూడా జయించగలరు అని పంచభూతాల సాక్షిగా ఇచ్చే శక్తిమంతమైన సందేశం.యాత్ర లక్ష్యంముంబై నుంచి సీషెల్స్ వరకు మా మొదటి అంతర్జాతీయ యాత్ర మొదలైంది. రోజుల తరబడి, వారాల తరబడి భూమికి దూరంగా లోతైన జలాల్లో సాగే ఈ యాత్ర మా సహనానికి, నావిగేషన్ నైపుణ్యాలకు పరీక్ష. మహిళా సాధికారతలో బలాన్ని చూపించడమే ఈ యాత్ర లక్ష్యం.– కెప్టెన్ దౌలీ -
భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్..!
ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్మెడల్తో పాటు సర్టిఫికెట్ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు. ఎనిమిది నెలలు శ్రమించా.. గత ఎనిమిది నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను. (చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!) -
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.ఎవరు ఈ నిధి?నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్గంజ్లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్ను 2006లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సివిల్స్సివిల్ సర్వీసెస్లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.మొదటి మహిళమోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.అజిత్ దోవల్ టీమ్లోప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది. -
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!
కష్టాలనగానే భయపడిపోతుంటాం. ఎందుకంటే ఆ సమయం ఎవ్వరైన చెప్పుకోలేని వేదన అనుభవిస్తారు. దాటుకుని రావడం అంత ఈజీ కూడా కాదు. పదేపదే వెంటాడే ఛీత్కారాలు, అవమానాలు తట్టుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం కష్టమే అయినా సాధ్యం కానీ విషయం అయితే కాదు. అలా భావించిన వాళ్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కనివినీ ఎరుగని సక్సస్ని అందుకుంటారు. పైగా తనని కష్టపెట్టిన వాళ్లే చేతులెత్తి సలాం కొట్టే స్థాయికి చేరుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 23 ఏళ్ల ఊర్మిళ. ఆమె కథ ప్రతిఒక్కరికీ ఓ కనువిప్పు, సక్సెస్కి చిరునామాగా చెప్పొచ్చు. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఊర్మిళ పాబుల్ ఐదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగింది. ఎన్నో అవహేళనలు, కష్టాలు ఎదుర్కొంది. తన తల్లే ఒంటరిగా తనని, సోదరుడుని చదివిస్తోందన్న విషయాన్ని ఏ క్షణాంలోననూ మరువలేదు. అదే ఆమె ఎదుగదలకు బూస్టప్గా తీసుకుంది. పడుతున్న ప్రతి కష్టాన్ని తన లక్ష్యాన్ని గుర్తు చేసేవిగా భావించింది. ఆ సానూకూల దృక్పథం, అచంచలమైన పట్టుదల, దీక్షలే ఆమెను స్కేట్బోర్డింగ్లో ఛాంపియన్గా మార్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. ఆ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే రేంజ్కి ఎదిగింది. అలా ఆమె 36వ జాతీయ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకోవడమే గాక UAEలోని షార్జాలో జరిగిన ప్రపంచ స్కేట్బోర్డింగ్ ఛాంపియన్షిప్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్నీ ఆమెను ఒలింపిక్ అర్హతకు హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతం ఆమె స్నోబోర్డింగ్లో శిక్షణ తీసుకుని మరీ. గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాదే స్నోబోర్డింగ్ క్రీడలో శిక్షణ తీసుకుని పోటీలోకి దిగినా.. విజయ ఢంకా మోగించి ప్రపంచమే సతన వైపుతిరిగి చూసేలా చేసింది ఊర్మిళ. 'దటీజ్ ఊర్మిళ' అనుపించుకుంది. అంతేగాదు వ్యక్తిగత కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకువచ్చే సోపానాలని చాటిచెప్పింది. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!) -
ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ ఎవరంటే..2014 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకం అయ్యారు.Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn— Press Trust of India (@PTI_News) March 31, 2025 (చదవండి: నా పిల్లలు భారత్లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్గా అమెరికన్ తల్లి పోస్ట్) -
ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్నూ ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఎర్విరిథింగ్ ఈజ్ పాజిబుల్.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ ‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నినస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్ కోసం కూడా వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్ఫుల్ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... శిక్షణ తర్వాత చాలా మార్పు సివిల్స్ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్ పొందడం చాలా లక్కీ! మరిచిపోలేని అనుభూతి.. రాష్ట్రస్థాయి రిపబ్లిక్డే వేడుకల పరేడ్ కమాండర్గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేటి తరానికి ఇచ్చే సందేశం.. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. ఎవి్వరిథింగ్ ఈజ్ పాజిబుల్. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్ కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది. కుటుంబ నేపథ్యం.. మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఇంటర్ (బైపీసీ) తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్ మాది. ప్రజల సహకారం ఉంటేనే.. ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతి¿¶ద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్ శాఖ టోల్ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్.. సేఫ్టీయాప్. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు ఉంటారు. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం. మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పింస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్ పరీక్షలు రాసుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణలో... డ్రోన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పింస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్హెచ్వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్లో పెట్టారు శారద. ఆ పోస్ట్పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
మహిళలకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రిటైల్లోనే ఎక్కువ మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్మేన్లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్క్వార్టర్ అయిన షోపియన్కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్మేన్గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్పూర్, షియోపూర్లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.ఉమ్రికాల గ్రామం విజయ్పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు -
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్హెచ్జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.80 శాతం సబ్సిడీపై...కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.– అనిత, ఎస్హెచ్జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.డ్రోన్లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.– లక్ష్మి, ఎస్హెచ్జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా (చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన) -
World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్ -
'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!
ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో స్వదేశ్ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.భర్త నేర్పించాడు!ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్ క్లాస్ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్తో ఏదైనా చేయాలనుకున్నారు. రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్ సెట్ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.మార్కెట్ బాగుంది!‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్ బాగుంది. మెమెంటోలుగా పీకాక్ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్ చార్జ్ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.ప్రధాని ప్రశంస!జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.జీఐ ట్యాగ్ వచ్చింది:మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ ఈ కళకు కేంద్రం. కరీంనగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ క్లస్టర్కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది.భద్రమైన కళఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్దాన్, పాన్దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్ వేజ్లు, పాత్రలు, వాల్ ఫ్రేమ్లు, టేబుల్ టాప్ షో పీస్లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు. (చదవండి: -
వయసు 60..టైలరింగ్తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్క్యాంప్కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్లనే స్పేస్కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్సెట్తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్ను స్పేస్ స్టేషన్కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు.. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్.. అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు. ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్గడ్ కేడర్లో కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు. అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. వైవాహిక జీవితం..ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా. (చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..) -
సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్లోని దానాపూర్కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్. అలాంటి స్కేటింగ్కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్. ఆమె భారత్ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్ దిగ్గజం ఆనంద్ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్ స్కేటింగ్ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్ స్కేటింగ్ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మహీంద్రా పోస్ట్లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్ స్కేటింగ్కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది. ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు.తారా ప్రసాద్ ఎవరు?ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్ షూస్ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్ స్కేటింగ్ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది. భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. అయితే.. సియోల్లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్లో క్రికెట్కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్ద బెట్ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip. Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times. Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్లోని జైపూర్లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
పశు పోషణతో పారిశ్రామికవేత్తలుగా..
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ .. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎమ్).కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ల పెంపకానికి 50 శాతం సబ్సిడీతో రుణ సదుపాయాన్ని అందిస్తోంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాలూ దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు ఎన్.ఎల్.ఎమ్. ద్వారా అందుతున్న ముందస్తు సబ్సిడీ అవకాశం గురించి సిబ్బందికి చెప్పాలి. సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సొంత లేదా కనీసం అయిదేళ్ల లీజు కింద ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూమిని కలిగి ఉండాలి. నాటుకోళ్లు, పందుల పెంపకానికైతే ఎకరం భూమి సరిపోతుంది. గొర్రెలు, మేకలకు సంబంధించి అయితే.. 500 గొర్రెలకు గడ్డిసాగు, షెడ్డులాంటి వాటికోసం అయిదు ఎకరాల భూమి కావాలి. తగిన అర్హతలుంటే ఒకే కుటుంబంలో ఎంతమందైనా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దరఖాస్తుకు..ఉద్యమ్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వగైరాలన్నిటికీ రుజువుగా పాస్పోర్ట్ లేదా ఆధార్కార్డ్, పాన్కార్డ్ వంటివి సమర్పించాలి. ఆదాయ రుజువు పత్రం, గడచిన రెండేళ్ల ఐటీఆర్, బ్యాంక్స్టేట్మెంట్,ప్రాజెక్ట్కు సంబంధించిన కొటేషన్స్తోపాటు ఎక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో ఆప్రాంతప్రాముఖ్యం, అక్కడ వ్యాపార అనుకూలతలు మొదలైన అంశాలతో పూర్తిప్రాజెక్ట్ రిపోర్ట్నూ సమర్పించాలి. పై వివరాలన్నిటిలో ఏ మాత్రం తప్పుల్లేకుండా చూసుకోవాలి. దరఖాస్తును,ప్రాజెక్ట్ రిపోర్ట్ను పశుసంవర్ధక శాఖా సిబ్బంది పరిశీలించి, అప్రూవ్ చేసిన పత్రాన్ని సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. అప్పుడు బ్యాంకు ద్వారా రుణం పొంది, సొంతపెట్టుబడినీ కూడబెట్టుకోవాలి. సబ్సిడీకి కూడా అప్లయ్ చేసుకోవాలి. సబ్సిడీ పొందడానికి కొంత సమయం పడుతుంది. సబ్సిడీ పొందిన వెంటనే యూనిట్నుప్రారంభించవచ్చు. ఈలోపు ఎక్కడైతే యూనిట్ను పెట్టాలనుకుంటారో అక్కడ గ్రాసాన్ని పెంచాలి. ప్రభుత్వం సూచించిన నమూనాలోనే షెడ్డును నిర్మించాలి. అందులోని పశువులకు పోషకాహారం, పశువైద్య సౌకర్యం వంటివీ చూసుకోవాలి. ఇటు గ్రామీణ... అటు పట్టణ్రపాంతాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోందీ పథకం.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
వీల్ పవర్
ఆమె పేరు వసుంధర.. విధి పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది.. వీల్ చెయిర్తోనే విజయానికి అడుగులు వేసింది! మాతృత్వాన్నీ సాధించింది! డేరెస్ట్ ఉమన్గా మన్ననలు అందుకుంటున్నారు హైదరాబాద్కు చెందిన వసుంధర. ఈ విజేత గురించి ఆమె మాటల్లోనే..‘మన దగ్గర ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్లకు అనువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ లేదు. అంటే నా చిన్నప్పటి పరిస్థితి ఊహించుకోండి.. ర్యాంప్స్, సపరేట్ వాష్ రూమ్స్ అనే ఊసే ఉండేది కాదు. ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలు చదువుకోవాలన్నా.. ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలన్నా వాళ్లతో ఒక మనిషి ఉండాల్సిందే పనులన్నీ మానుకొని! అందుకే సాధారణంగా దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో వైకల్యం ఉన్న పిల్లలను ఇంట్లోనే ఉంచేస్తారు. కానీ నన్ను మా అమ్మ చదివించింది. ఆవిడ సింగిల్ పేరెంట్. పెద్దగా చదువుకోలేదు. కానీ బ్రహ్మాండమైన లీడర్షిప్ క్వాలిటీస్తో నెగ్గుకొచ్చింది. టైలరింగ్ చేసేది అమ్మ. వీల్ చెయిర్ కొనేంత స్తోమత లేదు. అయినా నా చదువు విషయంలో వెనకడుగు వేయలేదు. స్కూల్కి, కాలేజ్కి తమ్ముడే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. కాలేజ్లో క్లాసెస్ మారాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు.→ కలాం గారిని అడిగాను కానీ...నేను సీఏ చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ నడుపుకోగలిగే వెహికిల్స్ని సమకూర్చొచ్చు కదా అని అడిగాను. అడిగాక ఆలోచించాను.. వాళ్లకోసం నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా.. మాకున్న సమస్యల గురించి మనమే పోరాడాలి.. ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలనిపించింది. అది మీడియాలో ఉంటేనే సాధ్యమవుతుందని గ్రహించాను. దాంతో సీఏ డ్రాప్ అయిపోయి, పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాను. → చాలా నేర్చుకున్నాను.. జర్నలిస్ట్గా నా పయనాన్ని ఆరంభించాను. చాలెంజింగ్గా ఉండిందా జాబ్. నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీ„ý కురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. దాంతో చాలా నేర్చుకున్నాను. అయితే పది గంటలపాటు అలా ఒకేచోట కూర్చోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. కానీ దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ఒక వేదికైతే ఉండాలి కదా! అందుకే వేవ్ మీడియాను స్టార్ట్ చేశాను. దివ్యాంగులకు అన్నిరకాల అవకాశాలను అందించడానికి ‘గుర్తింపు ఫౌండేషన్’ను మొదలుపెట్టాను. దివ్యాంగుల్లోని ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ని వెలికి తీసి, వాళ్లను ఆంట్రప్రెన్యూర్స్గా తయారుచేయడానికి ‘డీ హబ్’నుప్రారంభించాను. రీసెంట్గా ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్నాను. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను.→ వైవాహిక జీవితానికి వస్తే..డిజేబుల్డ్ పర్సన్స్ వైవాహిక జీవితానికి పనికిరారనే అపోహ, ఆరోగ్యవంతుడు డిజేబుల్ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడంటే అతనిలో ఏం లోపం ఉందో అనే కామెంట్ల మధ్య.. నన్నర్థం చేసుకొనే స్నేహితుడు నరేందర్ని పెళ్లి చేసుకున్నాను. తల్లిని కావాలనీ ఆశపడ్డాను. కానీ నా ఆరోగ్యం అందుకు సహకరిస్తుందో లేదో అనే భయం ఉండేది నరేందర్కి. దాంతో ఆయన్ని కౌన్సెలింగ్కి తీసుకెళ్లాల్సి వచ్చింది!ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను కానీ.. తర్వాతే చాలా ఒత్తిడి ఫీలయ్యాను. నాలాగే నా బిడ్డకూ వైకల్యం వస్తుందేమోననే భయం. పోలియో తప్ప జెనెటికల్గా నాకెలాంటిప్రాబ్లం లేదు. అయినా టెస్ట్లు చేయించుకున్నాను. బ్యాక్ బోన్ పెయిన్ వల్ల ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికీ వెళ్ళాను. అప్పుడే నాకు సివియర్ స్కోలియోసిస్ ఉందని తేలింది. 150 డిగ్రీల వంపు తిరిగినట్లు ఉంటుంది నా బాడీ. దీనివల్ల నాకు ఒక లంగ్ చిన్నగా.. ఒక లంగ్ పెద్దగా, ఒక కిడ్నీ చిన్నగా.. ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. అలాగే నా గర్భాశయంలో కూడా బిడ్డ ఒక సైడ్కు పెరుగుతోందని తెలిసింది.→ ఎన్నో పరీక్షలను తట్టుకుని...డీ హబ్ని డెవలప్ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ రావడంతో ఫైనాన్సియల్గా కూడా స్ట్రగుల్ అయ్యాం. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడా లేదు. ముందు జాగ్రత్తగా ఏడోనెలలోనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్. ఆసుపత్రిలోంచే వర్క్ చేశాను డెలివరీ ముందు రోజు వరకు. లక్కీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా తొమ్మిదోనెల వరకు రాగలిగాను. సిజేరియన్ డెలివరీతో బాబు పుట్టాడు. కానీ జాండీస్తో ఐసీయూలో పెట్టారు. వాడు ఇంటికి రావడానికి 27 రోజులు పట్టింది. వచ్చాక అనిమియా .. వీక్లీ చెకప్ అన్నారు. అది జ నరల్ కండిషన్నే అని తెలిసినా... తలసేమియానా? నా డిజేబిలిటీ వల్లే ఇలా అవుతోందేమో అనే భయం. ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేను. అన్ని అవాంతరాలు దాటి బిడ్డ ఆరోగ్యంగా కేరింతలు కొడుతుంటే అన్నీ మరచిపోయాను. ఇప్పుడనిపిస్తుంటుంది.. నేనేనా అంతలా భయపడ్డది అని! నాకున్న కండిషన్లో మాతృత్వమనేది నిజంగానే నేను సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది’’ అంటూ తన విజయగాధను వివరించారు వసుంధర.నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీక్షకురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. – శిరీష చల్లపల్లి -
#WomenPower : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?
విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రం. హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి విట్టల దేవాలయం. 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వారసత్వ సంపద, సంస్కృతీ విశేషాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు కనుక దీన్ని జయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు. ఆర్కిటెక్చర్, డిజైన్ విజయనగర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. సైన్స్కు కూడా అంతుచిక్కని అద్భుతాలకు నిలయం. ద్రావిడ నిర్మాణ శైలితో, విస్తృతమైన అలనాటి కళాకారుల ప్రతిభతో అపురూపంగా చెక్కిన శిల్పాలను చూసినపుడు తనువు రోమాంచిత మవుతుంది. ఇక్కడున్న మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటి వాటిల్లో కళావైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా చేతితో (గంధపు చెక్కలతో) మీటగానే సప్త స్వరాలను పలికించే సంగీత స్తంభాలు ఇలా ఒకదానికొకటి సందర్శకులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే దీన్ని ప్రత్యేకతను రక్షించే చర్యల్లో భాగంగా టూరిస్టులు ఈ స్థంభాలను తాకడానికి వీల్లేదు. దీనికి బదులుగా ఇక్కడ స్వరాలను వినాలనుకుంటే, దానికి వీలుగా ఆయా స్థంభాల వద్ద క్యూఆర్ కోడ్లుంటాయి. వాటిని మన మొబైల్ ద్వారా స్కాన్ చేసి సంబంధింత సంగీత స్వరాలను వినే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందా రండి. అంతటి విశిష్టమైన ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు అక్కడి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విట్టల ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. దీనికి పర్యాటకుల కోసం కాలుష్యరహిత వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మాత్రమే పర్యాటలకు విట్టల దేవాలయ సమీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా పొల్యూషన్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు. సారథులంతా మహిళలేఅయితే ఈ వాహనాలకు అందరూ మహిళా డ్రైవర్లే ఉండటం మరో ప్రత్యేకత. టూరిస్టులను విట్టల ఆలయానికి వద్దకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకు వచ్చే బాధ్యత ఈ మహిళా డ్రైవర్లదే. సందర్శకులను తీసుకెళ్లి దింప, మళ్లీ వచ్చేటపుడు తిరుగు ప్రయాణంలో ఉన్నవారిని బయటికి తీసుకు వస్తారు. అలా సందర్శకుల రద్దీని నివారించే ఏర్పాటు కూడా అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లను సాక్షి. కామ్ పలకరించింది. వారి అనుభవాల గురించి ముచ్చటించింది. గతరెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని వెల్లడించారు. తమకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ ఈ ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఎనిమిది గంటల డ్యూటీ ఎంతో సరదాగా గడిచిపోతుందని చెప్పారు. నిత్యం ఎంతోమంది సందర్శకులను, చాలామంది విదేశీ పర్యాటకులను చేరవేస్తూ ఉంటామని, వారి ఆనందం చూస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుందని, నిజానికి చాలా గర్వంగా కూడా ఉంటుందని చెప్పారు. అలాగే టూరిస్టులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడతామన్నారు. -
మహిళల కోసం మహిళలే...సిస్టర్ లైబ్రరీ
మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసం మహిళలే నడుపుతున్న గ్రంథాలయం ఒకటి ఉంది తెలుసా? ఇది ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉంది. అదే సిస్టర్ లైబ్రరీ. దీన్ని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ లైబ్రరీగా చెప్పుకోవచ్చు. 2019ల ప్రారంభమైంది ఇది.ఎలా?ముంబైలో ‘బాంబే అండర్గ్రౌండ్’ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ గ్రూప్ ఒకటుంది. నగరంలోని పలుచోట్ల తాత్కాలిక రీడింగ్ స్పెస్ని ఏర్పాటు చేసి.. పుస్తకాలతోపాటు తోటివాళ్లతో జనాలు సమయం వెచ్చించేలా చూడ్డం ఈ గ్రూప్ విధుల్లో ఒకటి. ఆ పనిలోనే ఉన్నప్పుడు ఈ గ్రూప్ సభ్యురాలైన ఎక్వీ థామీకి రీడింగ్ స్పేస్లో సమావేశమైన వారెవ్వరూ మహిళా రచయితల పుస్తకాలు చదువుతున్నట్టు కనిపించలేదు. అసలు తానెన్ని చదువుతుందో తేల్చుకోవాలనుకుంది ముందు. ఇంటికెళ్లి తన బుక్ ర్యాక్లో చూసుకుంటే మహిళా రచయితల పుస్తకాలు కనీసం 20 శాతం కూడా లేవు. అప్పుడు డిసైడ్ చేసుకుంది ఎక్వీ మహిళా రచయితల పుస్తకాలు చదవాలని. దేశంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో మహిళా రచయితల రాసిన పుస్తకాలన్నిటినీ సేకరించడం మొదలుపెట్టింది. అలా కేవలం మహిళా రచయితల పుస్తకాలతోనే నిండిపోయిన తన పర్సనల్ లైబ్రరీలోంచి స్నేహితులూ పుస్తకాలు అరువు తీసుకోసాగారు. ఆ డిమాండ్ చూసి నిశ్చయించుకుంది ఫెమినిస్ట్ లైబ్రరీ స్టార్ట్ చేయాలని. ఆ ప్రయత్నాల్లో ఉండగా.. 2018లో ఆమెకు ఫైన్ ఆర్ట్ అవార్డ్ వచ్చింది. దానికింద అందిన రొక్కంతో దేశంలోని ప్రముఖ నగరాలను పర్యటించి మహిళా రచయితలు రాసిన నవలలు, వ్యాస సంపుటాలు, ఉద్యమ రచనలు, ఆర్ట్ పుస్తకాలు, మహిళాపత్రికలు వంటి వెయ్యి పుస్తకాలను సేకరించింది. వాటితోనే ‘సిస్టర్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ‘సాహిత్య, కళా రంగాల్లో మహిళల కృషిని తెలియజేయడానికే ఈ లైబ్రరీని స్థాపించినా.. ఈ ప్రయాణ క్రమంలో అనిపించింది అసలు సృజన రంగంలో మహిళలు పంచిన జ్ఞానాన్ని, వాళ్లు సాధించిన స్థానాన్నీ ప్రపంచం గ్రహించేలా చేయాలని! ఇప్పుడా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’ అని చెబుతుంది ఎక్వీ. ఈ లైబ్రరీకి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని మహిళలంతా తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాల నుంచి క్రౌడ్ఫండింగ్ దాకా ఇందులో పుస్తకాల కోసం ధన సహాయమూ అందుతోంది. ఫెమినిస్ట్ లైబ్రరీ ఆవశ్యకతను చాటడానికి, స్ఫూర్తి పంచడానికి సిస్టర్ లైబ్రరీ సభ్యులు దేశ, విదేశీ పర్యటనలూ చేస్తున్నారు. దీంతోపాటు దేశంలో మహిళలే నిర్వహిస్తున్న చంపక బుక్స్టోర్ (బెంగళూరు), వాకింగ్ బుక్ ఫెయిర్స్ బుక్స్టోర్ అండ్ మొబైల్ లైబ్రరీ (భువనేశ్వర్), ట్రైలాజీ క్యురేటెడ్ బుక్ షాప్ అండ్ లైబ్రరీ (ముంబై) స్టోరీటెల్లర్ బుక్స్టోర్ (కోల్కత్తా), వన్ అప్ లైబ్రరీ, బుక్స్టోర్ స్టూడియో అండ్ లర్నింగ్ ల్యాబ్( ఢిల్లీ), సిస్టర్స్ ఆఫ్ ద పిపుల్ (ఢిల్లీలోని చారిటీ బుక్ స్టోర్) లాంటి బుక్ స్టోర్స్, లైబ్రరీలు ఉన్నాయి. -
Women's Day మహిళా ఆర్టిస్టుల ‘సిరి శక్తి’ మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్
సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘సిరి శక్తి’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిత్రకళలో ప్రతిభను చాటుకుంటున్న మహిళల నైపుణ్యాన్ని గుర్తిస్తూ హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మార్చి 8 నుంచి 15వ తేదీవరకు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఎనిమిదేళ్లనుంచి 88 ఏళ్ల వయస్సున్న 118 మంది మహిళా ఆర్టిస్ట్లు తమ పెయింటింగ్స్ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ ఎనిమిది రోజుల వేడుకలో ఒక్కో రోజును ఒక్కో ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. కళారంగంలో నిష్ణాతులైన విశిష్ట అతిధులను ఆహ్వానిస్తున్నామని సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సారధులు, డైరెక్టర్ స్వామి, శివ కుమారి దంపతులు వెల్లడించారు. ఇప్పటివరకు వరకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, రానున్న మూడు రోజుల ప్రదర్శనను కూడా విజయవంతం చేయాలని శివ కుమారి విజ్ఞప్తి చేశారు. వీరిలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, ప్రొ. పద్మావతి, నటి గీతా భాస్కర్, ప్రముఖ ఆర్టిస్ట్ శిల్పి డా. స్నేహలతా ప్రసాద్, డా. హిప్నో పద్మా కమలాకర్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సృజనాత్మకత, ప్రతిభా, నైతిక విలువలను ప్రతిబింబించేలా, విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకునేలా కృషి చేశామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ‘8’ అనే ప్రత్యేక సంఖ్యను ప్రాతిపదికగా రూపకల్పన చేయడం మరో విశేషమని పేర్కొన్నారు.గత 30 ఏళ్లుగా హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సిరి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నామని, ఇందులో మహిళలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పదవీ విరమణ చేసినవారు, విద్యార్థులు ఇలా అన్ని వయసుల వారికి చిత్రకళను బోధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆయిల్, అక్రిలిక్, సాండ్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డీ క్లే ఆర్ట్, స్కెచింగ్ తదితర వివిధ మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, అనేక చిత్ర ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. వేదిక : JNAF ALU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్ వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.ఫోన్: 3643419662, 9948887211 -
మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..!
చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ని నిర్మించిన షాజహాన్ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి. మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణి కి వావ్, గుజరాత్పాట్న రాణి కి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్ స్టెప్వెల్ ఆర్కిటెక్చర్. అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.విరూపాక్ష ఆలయం, కర్ణాటకభారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రామొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.మిర్జన్ కోట, కర్ణాటకఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.దక్షణేశ్వర్ కాళి ఆలయం, కోల్కతా19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.(చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
‘ఫ్యాషన్ ఐకాన్’ : 70 ఏళ్లు దాటితేనేం, ఆమే బ్యూటీ క్వీన్
ష్యాషన్ క్వీన్ అనగానే గుర్తొచ్చే సీనియర్ నటీమణులలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ నటి రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా, ఫ్యాషన్ ఐకాన్లా ఉంటారామె. ఆమె చీర కడితే ఆ చీరకే అందం. కాంజీవరం చీరలో ఆమె అందానికి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. ఆమె ఏ వేదిక మీద ఉన్నా ఆ వేదిక కళకళలాడిపోవాల్సిందే.. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు మంచి సింగర్. చాలా సార్లు ఈ విషయాన్ని స్వయంగా చాటి చెప్పింది. అందానికీ, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన రేఖ సిగ్నేచర్ స్టైల్ చీరలో కాకుండా ఓవర్ సైజు బ్లేజర్లో మరోసారి అల్టిమేట్ స్టైల్ ఐకాన్గా నిలిచింది. స్టైల్, గ్రేస్, డై-హార్డ్ లుక్స్తో ఫ్యాషన్కు, మెడ్రన్ స్టైల్కు వయస్సు పనేముందని నిరూపించిన వైనం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్లో లేడీ బాస్ తన ఎనర్జీతో అక్కడున్న వారి నందరినీ అబ్బురపర్చింది. ‘పింటు కి పప్పీ’ ట్రైలర్ లాంచ్లో అద్భుతమైన తెల్లటి ప్యాంటుసూట్లో చిక్ లుక్లో ఆకట్టుకుంది.శాటిన్ బ్లౌజ్,దానిపై లేయర్డ్ ట్రెండీ ఓవర్ సైజు బ్లేజర్ను జోడింకి ట్రెండీగా మెరిసింది. దీనికి వైడ్ లెగ్ ట్రౌజర్తో జత చేసింది. బ్లాక్ సన్ గ్లాసెస్, బంగారు చెవిపోగులు, స్టైలిష్గా వైట్ క్యాప్ ఆమె లుక్కు మరింత గ్లామర్ను తెచ్చి పెట్టాయి. అలాగే ఒక అందమైన షాయరీని చదవి వినిపించడం విశేషం.అంతేనా, మెటాలిక్ గోల్డ్ ప్లాట్ఫామ్ స్నీకర్లతో మరింత యంగ్గా, ఫ్రెష్గా లుక్తో మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఆమె స్టైల్ను ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచేశారు. "జస్ట్ లుకింగ్ లైకే వావ్!’’, ‘‘ఆమెకు70 ఏళ్లు అని నేను నమ్మలేకపోతున్నాను" "ఫ్యాషన్ ఐకాన్" ఇలా అందరూ రేఖను ప్రశంసించారు. ఇటీవల IIFA అవార్డ్స్ 2025 వేడుకలో రేఖ అద్బుతమైన కాంజీవరం చీరలో కనిపించారు. అవార్డు ఫంక్షన్లో రేఖ తన ఐకానిక్ బంగారు కాంజీవరం చీరలలో అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by IIFA Awards (@iifa)ఆమె లుక్తో పాటు, తన సహనటులు, ఇప్పటి నటులతో పాటు, అభిమానులతో ప్రేమగా ఉండటం ఆమె ప్రత్యేకత. ఇటీవల ఒక అభిమాని ప్రత్యేకంగా తీసుకొచ్చిన అందమైన బొమ్మను స్వీకరించడం, తన అభిమానాన్ని చాటుకోవడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, సినిమాకు సంబంధించి ముఖ్యమైన ఏ వేడుక అయినా, తన సమయాన్ని కేటాయించడం, కళామతల్లిపై ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. రేఖగా పాపులర్ అయిన భానురేఖ గణేషన్, 1954లో అక్టోబర్ 10న పుట్టింది. 180కి పైగా చిత్రాలలో నటించిన రేఖ, జాతీయ చలనచిత్ర అవార్డు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. -
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్సైట్ను, యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్టచ్–బ్యాడ్టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ వరకు..
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది. అవార్డులు.. ప్రశంసలు.. విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్లైన్ కాంపిటేషన్లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. చిన్ననాటి నుండే.. చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను. – విజయలక్ష్మి, తుర్కపల్లిమూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్తో పాటు కలర్ మ్యాచింగ్లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం -
ఇంటికి గెస్ట్గా పొన్నంకి పిట్ట.. గొప్ప జ్ఞాపకం
విద్యార్థులకు ఆమె గణితం నేర్పాలనుకున్నారు. కానీ విధి లిఖితం ఆమెకు కొత్త రెక్కలు తొడిగింది. పక్షుల ప్రేమలో వేలమైళ్లు ప్రయాణించేలా చేసింది. ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షులను గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 550కు పైగా జాతులను కెమెరాలో బంధించి రికార్డు సృష్టించారు. ఆమే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీన్పూర్ (Ameenpur) సమీపంలోని హెచ్ఎమ్టీ కాలనీలో నివసించే శ్యామల రూపాకుల (Syamala Rupakula).. పక్షి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమ ఆమెకు అనారోగ్యాలను దూరం చేయడం మాత్రమే కాదు.. కొత్త రికార్డులకు దగ్గర చేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో‘ఆన్లైన్లో మ్యాథ్స్ ట్యూటర్గా పనిచేసేదాన్ని. కొన్ని ఆరోగ్య సమస్యలు నన్ను బాధించాయి. దీంతో ఆ పని వదిలేయాల్సి వచ్చింది. అనుకోకుండా బర్డ్ వాచర్గా మారాను’ అంటూ ఏడేళ్ల నాటి గతం గుర్తు చేసుకున్నారు శ్యామల. దాదాపు రికార్డు స్థాయిలో 550 పక్షులను గుర్తించి నగర బర్డ్ వాచర్స్ (Bird Watchers) ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఐటీ ఉద్యోగి అయిన భర్త బాలసుబ్రహ్మణ్యకుమార్ సహకారంతోనే తన హాబీని ఇంతగా ఆస్వాదించగలిగానని చెబుతున్నారు. ఆమె ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..బీజం పడింది అక్కడే.. తొలుత జంతువుల పట్ల ఆసక్తితో వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలకు (వైల్డ్లైఫ్ శాంక్చురీ) వెళ్లేదాన్ని. బర్డ్ వాచింగ్ చేసినా మా ఇంటి దగ్గర్లో ఉన్న అమీన్పూర్ లేక్ వరకు మాత్రమే పరిమితమయ్యేదాన్ని. అయితే పక్షులపై వీరాభిమానానికి తొలిసారి బీజం పడింది మంజీరా వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రానికి వెళ్లినప్పుడు. అక్కడ నాకు పరిచయమైన షివాన్ మాధురి దంపతులు.. నా బర్డ్ వాచింగ్ ఆసక్తిని గమనించి హైదరాబాద్ పాల్స్ గ్రూప్ గురించి చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు. అక్కడి నుంచి బర్డింగ్ కమ్యూనిటీలో స్నేహితుల మార్గదర్శకత్వంలో సీరియస్ బర్డ్ వాచింగ్ ప్రయాణం ప్రారంభమైంది. తమిళనాడు వెళ్లా. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో నెలకు ఒకటైనా సరే కాస్త దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్తా. కేరళ రెండు సార్లు, ఉత్తరాఖండ్ మూడు సార్లు, కర్ణాటకకు ప్రతి యేటా వెళుతుంటాను. ఇక వారాంతాల్లో నరసాపూర్, క్రిష్ణారెడ్డి లేక్, అనంతగిరి హిల్స్, ఉమామహేశ్వరం.. ఇలా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళతాం. మన దేశంలో 1300లకుపైగా జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 550కి పైగా పక్షులను గుర్తించాను. మొత్తం అన్నీ గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రావోయీ అభిమాన అతిథీ.. మా ఇంట్లోనే ఒక చిన్న తోట పెంచుతున్నాం. పక్షుల రాక కోసమే ఇంట్లో డ్రిప్ సిస్టమ్ ఉంది. నీళ్ల కోసం దాదాపు 12 రకాల పక్షులు వస్తాయి. రోజూ పొద్దున్న, సాయంత్రం వాటిని చూస్తుంటే మనసు నిండిపోతుంది. గత సీజన్లో బర్డర్స్ ఫేవరెట్గా పేర్కొనే పొన్నంకి పిట్ట (ఇండియన్ పిట్ట) మా ఇంటికి వచ్చి ఏకంగా 4 రోజుల పాటు ఉండడం మరచిపోలేని, మధుర జ్ఞాపకం. ఇవి సాధారణంగా హిమాలయాల నుంచి వస్తాయని చెబుతారు. యేటా అక్టోబరు, నవంబర్ నెల్లో వచ్చి ఎండలు ముదిరినప్పుడు వెళ్లిపోతాయి. అలాంటి పక్షి.. మా ఇంటి పెరట్లో కొన్ని రోజుల పాటు ఉండడం గొప్ప జ్ఞాపకం. ప్రతి పక్షికీ ఓ పేరుంటుంది. ఒక్క జాతిలోనే అరడజను రకాలు ఉంటాయి. వాటి రెక్కల రంగు, పరిమాణం.. వంటి వాటిని బట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తు పెట్టుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అలవాటైంది.చదవండి: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్ఎంతో సంతృప్తినిస్తోంది.. ప్రస్తుతం నగరంలో చాలా మంది బర్డ్ వాచర్స్గా మారుతున్నారు. పలువురు నాకు కాల్ చేసి పక్షుల రాకపోకల గురించి సమాచారం అడుగుతుంటే.. వాళ్లకి సమాధానం ఇస్తుండడం నాకెంత సంతృప్తిని అందిస్తుందో.. అభిరుచులను పంచుకోడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? పైగా పక్షులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే.. నీటి నుంచి నింగి వరకూ ప్రతి చోటా ప్రత్యక్షమయే పక్షుల ద్వారా.. ప్రకృతిలోని అనువణువూ బర్డ్ వాచింగ్ మనకు పరిచయం చేస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్నగర్ బ్రాంచ్లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
women's day 2025 అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్గా చేసి, అగ్రికల్చర్యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి హెడ్గా, సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు. ‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. ఉల్లిపా యలు వేసిన మార్గం..మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్వో నర్సరీ ఇంచార్జ్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.పారిశ్రామిక రంగానికి జత చేయాలిఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్కు మధ్య చర్చలు జరిపాం.నవతరం దృష్టి మారాలి..ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్వర్క్తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
టెక్ అంకురాల్లోనూ మహిళల హవా..!
న్యూఢిల్లీ: వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్న మహిళా స్టార్టప్లు, భారీ ఎత్తున నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నాయి. మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ఇప్పటివరకు 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్టైమ్ ఫండింగ్ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో నిల్చాయి. రీసెర్చ్, అనలిటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థల సంఖ్య 7,000 పైచిలుకు ఉంది. క్రియాశీలకంగా ఉన్న మొత్తం స్టార్టప్లలో వీటి వాటా 7.5 శాతం. ఇవన్నీ కలిసి ఇప్పటివరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళా స్టార్టప్లు మొత్తం మీద 32.8 బిలియన్ డాలర్లు సమీకరించగా .. దేశీ అంకురాలు 5 బిలియన్ డాలర్లతో 15.18% వాటా దక్కించుకున్నాయి. ఇక 2024లో అంతర్జాతీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్లకు ఫండింగ్ విషయంలో 3.96% వాటాతో అమెరికా, బ్రిటన్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలి్చంది. ఈ స్టార్టప్లు భారీగా నిధులను సమీకరించడంతో పాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, భవిష్యత్ ఎంట్రప్రెన్యూర్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్షన్ పేర్కొంది. ఇవి మరింత వృద్ధిలోకి రావాల ంటే ఆర్థిక తోడ్పాటు, మెంటార్షిప్, వ్యవస్థాగతంగా మద్దతు లభించడం కీలకమని వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రంగాలవారీగా చూస్తే రిటైల్ స్టార్టప్లు అత్యధికంగా 7.8 బిలియన్ డాలర్లు, ఎడ్టెక్ 5.4 బిలియన్ డాలర్లు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంకురాలు 5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. బిజినెస్ టు కన్జూమర్ ఈ–కామర్స్, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్లు, ఫ్యాషన్ టెక్ అంకురాలు కూడా గణనీయంగా రాణిస్తున్నాయి. → మహిళా స్టార్టప్ల సంఖ్యాపరంగా, అలాగే ఇప్పటి వరకు సమీకరించిన నిధులపరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. → 2021లో మహిళల సారథ్యంలోని స్టార్టప్లలో అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్న్లుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో నాలుగు, 2022లో అయిదు ఈ హోదా సాధించాయి. అయితే, 2017, 2023, 2024లో ఒక్క యూనికార్న్ కూడా నమోదు కాలేదు. → 2021లో మహిళా స్టార్టప్లు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కి, 2023లో 25కి, 2024లో 16కి తగ్గింది. → 2024లో మహిళల సారథ్యంలోని అయిదు స్టార్టప్లు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. మొబిక్విక్, ఉషా ఫైనాన్షియల్, తన్వాల్, ఇంటీరియర్స్ అండ్ మోర్, లాసీఖో వీటిలో ఉన్నాయి. -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్లు... 339 స్కీమ్లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్లను నిర్వహిస్తున్నారు. భారత్లో అతిపెద్ద ఫండ్ హౌస్గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్లతో అత్యధిక స్కీమ్లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కష్టాన్నే నమ్ముకోవాలి
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్గా మారిపోయింది..ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్లో. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ రైల్వేక్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్ హెల్ప్ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!దూరదర్శన్ మాత్రమే.. ఈ ఫీల్డ్లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్ప్రోగ్రామ్ నచ్చి, దూరదర్శన్ సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ చేశారు.. ‘ప్రదీప్ గారి డైరెక్షన్లోని ఓ సీరియల్లో మమ్మల్ని కాస్ట్ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్ చానల్ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్ ఎపిసోడ్స్లోనే ఎక్కువగా చేశాను. కొన్ని సినిమా బేస్డ్ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశాను. శాటిలైట్ చానల్స్ స్టార్ట్ అవగానే పూర్తిగా యాంకరింగ్కి షిఫ్ట్ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్ మోర్’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్ మహిళ’ లాంటి ఎన్నో షోస్ని హోస్ట్ చేశాను. ‘స్టార్ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్స్పైర్ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు. అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఇప్పుడు.. నా యూట్యూబ్ చానల్లో ‘చాట్ షో’ని స్టార్ట్ చేశాను. అలాగే ‘షెఫ్ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్ టెంపుల్స్’ అనే సిరీస్ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్కి ఆకాశమే హద్దు. ఒక రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. వైరల్ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్తో ఎంటర్టైన్ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్టైన్మెంట్ పోర్షన్ను అందిస్తున్నాను. లీజర్టైమ్ దొరికితే.. వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను.నాకు అత్యంత మెమరబుల్ మూమెంట్ నా పిల్లలే! ప్రొఫెషన్కి సంబంధించి అయితే .. నంది అవార్డ్ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే ఎన్జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్ చేశాను. భవిష్యత్లో మరికొన్నిప్రాజెక్ట్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. బహుభాషలతో ప్రయోజనంయాంకరింగ్ పర్సనల్ క్యారెక్టర్కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్ పాయింట్ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం, ఇంగ్లిష్ లో ఫ్లుయెన్సీ వల్ల.. ఏవైనా అవార్డ్ ఫంక్షన్స్కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్ షోసే కాబట్టి ఎడిటింగ్కి స్కోప్ ఉండదు. నాకు నేనే ఎడిటర్గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. – శిరీష చల్లపల్లి -
లీడర్షిప్ కావాలి
నేను ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు అంటే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్ క్యాడర్లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్కి వెళ్లినా ఆ పోస్ట్లో ఫస్ట్ ఉమన్ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. పోలీస్ స్టేషన్స్లో సౌకర్యాలూ విమెన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్లో మహిళల కోసం సపరేట్ వాష్ రూమ్స్ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్లో కూడా బేబీ కేర్ సెంటర్ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్లు, గణేశ్ నిమజ్జనానికి మహిళా పోలీస్లు డ్యూటీకి వెళితే వాష్రూమ్స్ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వాష్రూమ్స్ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్ ఉంటే అక్కడికి ఈ మొబైల్ వాష్రూమ్ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్ వచ్చినట్టే కదా!దృష్టి పెడతారు.. ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్షిప్ రోల్స్ని పొందే అవకాశం వస్తుంది. లీడర్షిప్ రోల్స్లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.చెప్పుకోదగ్గదే కానీ.. మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్ సిటిజన్ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. ఎలాంటి టాస్క్లకైనా సిద్ధమే! ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!– సరస్వతి రమ -
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్షిప్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్వర్క్. హార్డ్వర్క్తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్వర్క్ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్వర్క్ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Womens Day 2025: సృష్టికి మూలం ఆమె..! కనీసం ఈ రోజున..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 20వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. 1900 సంవత్సరం ప్రారంభ కాలంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి . అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కాపెన్హాగన్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో " క్లారా జెట్కిన్ " అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19న అనేక యూరోపియన్ దేశాలలో నిర్వహించారు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. అలా ఏటా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి ఫూలే , దుర్గాబాయి దేశ్ ముఖ్ లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేసారు. మహిళల విద్య , బాల్య వివాహలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేసారు.ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేలా ప్రోత్సహించింది. ఈ దినోత్సవం మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించింది.దేశాల వారిగా మహిళల శాతం..ఇవాళ ప్రపంచ జనాభా 810 కోట్లు . ప్రపంచ జనాభా లో 50.30% పురుషులు , 49. 70% మహిళలు. హాంకాంగ్ లో 54. 92 % , లాట్వియా లో 54% , రష్యా లో 54.3%, ఉక్రెయిన్ లో 54% , లిథువేనియా లో 54% మంది చొప్పున ఆయా దేశ జనాభాలో మహిళలు ఉన్నారు.ఖతార్ లో 28.48% , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 30.9% , ఒమన్ లో 35.8% , బహ్రెయిన్ లో 38% , సౌదీ అరేబియా లో 43.2% మంది మహిళా జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేశాలలో మహిళకు సమాన అవకాశాలు..ఇక్కడ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, వేతన సమానత్వం ఎక్కువగా ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని, ప్రభుత్వ మద్దతును అందిస్తున్నాయి. భారతదేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, లింగ వివక్ష , వేతన అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి వంటి రంగాలలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ దినోత్సవం ప్రాముఖ్యత..భారతదేశంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నది. అవేంటంటే..మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.లింగ సమానత్వం , మహిళలపై హింసను అంతం చేయడం, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలపై దృష్టి సారించడానికి ఇది ఒక అవకాశం. నాయకత్వ పాత్ర పై , విద్య, వాణిజ్య , ఉద్యోగ , ఆరోగ్య, ఉపాధి , ఆర్థిక స్థిరత్వంలో మహిళలను ప్రేరేపించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, లైంగిక వేధింపులు మహిళలకు సరిపోని ఆరోగ్య సంరక్షణ , మెరుగైన పని వాతావరణం వంటి సవాళ్ల గురించి ప్రభుత్వం, దృష్టికి తీసుకురావడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.బీజింగ్ డిక్లరేషన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవం 2025ను మహిళలు-బాలికలకు అందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాల మార్పుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శక్తిమంతమైన వేదికగా నిలవాలి ఆకాంక్షిస్తుంది. ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని .. 'Accelerate Action' అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెబుతోంది. .చివరగా ఈ దినోత్సవం రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఇక కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, యాజమాన్యాలు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక చర్చలు , గోస్టులు, ఆటలు, పాటలు, ఆరోగ్య శిబిరాలు, ప్రతిభ చూపిన మహిళలుకు సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. సృష్టికి మూలం అయిన స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. వారికి జేజేలు. వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ల, విశ్రాంత ఆర్ టీసి డిపో మేనేజర్, (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు) -
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
విప్లవం, ప్రేమ వేరు కాదని చెప్పిన విప్లవ ప్రేమికురాలు!
ఉమ్మడి గుంటూరు జిల్లా క్రైస్తవ మతానికీ, కమ్యూనిస్టు ఉద్యమానికీ పేరు. దళితులు ఈరెండింటిలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో చేరడం చరిత్ర. ఒకనాటి తెనాలి తాలూకా, ఇప్పటి కొల్లిపర మండలంలోని దావులూరు ఒక పచ్చటి పల్లెటూరు. కమ్యూనిస్టు ఉద్యమం, క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన తోడ్పాటుతో ఆ ఊరిలో ఆడ పిల్లలు, మగ పిల్లలు బాగా చదువులపై శ్రద్ధ పెట్టేవారు. ‘పాలేరు’, ‘భూమికోసం’ వంటి నాటికలు, బుర్రకథలు వారిలో ఉత్సాహాన్ని ప్రోదిచేసేవి. వేము సువార్తమ్మ, నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదం వంటి వారు మోటూరి ఉదయం వంటి నాయకురాళ్ళ దగ్గర బుర్రకథ నేర్చుకున్నారు. తర్వాత బుర్రకథ పితామహుడిగా పేరుగాంచిన షేక్ నాజర్తో కలిసి పనిచేశారు.దావులూరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేము కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబంలో సుమారు మూడు తరాలవారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తమ ఆస్తి పాస్తులను ఉద్యమం కోసం త్యాగం చేశారు. 1934లో పుట్టిన సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన అంబటి రాజారావు, దీనమ్మల కుమార్తె. వేము రామసుబ్బయ్యకు మేనత్త కూతురు. వారిది ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి. ఆమె పదో తరగతి వరకు చదివింది. తర్వాత హిందీ ‘భాషా ప్రవీణ’ పూర్తి చేసింది. సువార్తమ్మ, రామసుబ్బయ్య అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజ మండ్రి, కడలూరు, సేలంలలో జైలు శిక్ష అనుభవించారు. వారికి ఏడుగురు పిల్లలు. వారిలో ఇద్దరు చిన్న వయసులోనే పోషణ కరవై చనిపోగా ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు మిగిలారు. చదవండి: International women's day 2025 హోమ్ మేకర్కు వేతనమేదీ? దళిత ఉద్యమంలో పాల్గొంటూ చిన్న కొడుకు శాంతి చనిపోయాడు. భర్త పార్టీ కోసం పొలం ఇవ్వడం, ఉద్యోగం చెయ్యకుండా, ఇల్లు పట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పార్టీ పనులపై తిరుగుతున్నా ఆమెకు ఎప్పుడూ కోపం రాలేదు. ఆయన నిబద్ధతను గౌరవించింది. ఉద్యమం విజయవంతమైతే పేదలు, పీడితుల జీవితాలలో వెలుగు వస్తుందని నమ్మిన గొప్ప ప్రజాస్వామికవాది. సువార్తమ్మ దృష్టిలో విప్లవం, ప్రేమ వేరు కాదు. ఈ నెల ఒకటవ తేదీన మృతి చెందిన వేము సువార్తమ్మ గారికి జోహార్లు!– ప్రొ.చల్లపల్లి స్వరూపరాణి; ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు -
‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!
గాయని మధుప్రియ గళంతో మధువులొలికిస్తుంది! ఆ స్వర ప్రయాణం ఆమె మాటల్లోనే...‘నేనసలు సంగీతం నేర్చుకోలేదు. అమ్మ, నాన్న, తాతయ్య పాడతారు. ఆ కళ వాళ్ల దగ్గర నుంచే వచ్చింది. నా గురువు మా అమ్మే! నాకు ఆరేళ్లున్నప్పటి నుంచే పాడటం స్టార్ట్ చేశా. స్కూల్లో, ఫంక్షన్స్లో పాడేదాన్ని. ఆ తర్వాత మెల్లమెల్లగా జానపదాలు, తెలంగాణ ఉద్యమగీతాలు పాడటం మొదలుపెట్టా. తెలంగాణ మూవ్మెంట్ టైమ్లో గద్దర్ తాతతో కలిసి పాడటం అదృష్టంగా ఫీలవుతాను. నా పాటల ప్రయాణంలో సూపర్ సింగర్లో పాల్గొనడం చెప్పుకోదగ్గ మలుపు.వాళ్ల బాధ చూసి రాసిన పాట...నాకు గుర్తింపునిచ్చిన పాట ‘ఆడపిల్లనమ్మా..పాటే! మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ‘ముగ్గురూ ఆడపిల్లలే’ అని అమ్మా నాన్న బాధపడటం చూసి నా చిన్నప్పుడే రాసుకున్న పాట అది. నా స్టోరీ. ఒకరకంగా ప్రతి ఆడపిల్ల కథ. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఆ పాటతో కనెక్ట్ అయ్యారు. అందుకే అదంత పాపులర్ అయింది. అదొక్కటే కాదు నేను రాసి, పాడిన పాటలన్నీ ఆడపిల్లల గురించే ఉంటాయి. ‘అమ్మా నీ మనసు గొప్పదిలే..’ అంటూ అమ్మ మీదా ఎన్నో పాటలు పాడాను. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఈ మదర్స్ డేకి ‘ఆడపిల్లనమ్మా..’ వీడియో ఆల్బమ్ను తీసుకొస్తున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి, జానపదాలు.. ఏవైనా నూటికి తొంభై తొమ్మిది శాతం మెసేజ్ ఓరియెంటెడ్ పాటలే పాడుతూంటాను. వాటితో నాకెన్ని డబ్బులొస్తున్నాయి అనేకంటే నా పాటలు ఎంతమందికి చైతన్యాన్నిస్తున్నాయనేదే చూస్తాను.అభిమానాన్ని పొందాలి...ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి గోదారి గట్టు పాట వరకు చాలానే ఫేస్ చేశాను. ఎంతవరకు నిలబడ్డాను అనేదే పరిగణనలోకి తీసుకుంటాను. నా గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా.. పట్టించుకోను. మహా అయితే రెండు నిమిషాలు బాధపడతానేమో అంతే! తర్వాత నా పనిలో పడిపోతాను. నేర్చుకోవాల్సిన విషయాల మీద దృష్టిపెడతాను. ఎలాంటి పరిస్థితులెదురైనా నవ్వుతూ ఎదుర్కొంటాను. అదే నా స్ట్రెంగ్త్. ఇంకా చాలా పాటలు రాయాలి.. పాడాలి.. జనాల అభిమానాన్ని పొందాలి.. అదే నా లక్ష్యం’’ అంటూ ముగించింది మధుప్రియ.– శిరీష చల్లపల్లి (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు) -
మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు
ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. ఇప్పుడు సీన్ మారింది. ప్రాతినిధ్యం స్థాయి నుంచి ఎదిగి ఏకంగా దేశానికి పతకాలు అందించే స్థాయికి మన మహిళా క్రీడాకారిణులు చేరుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా... ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు ప్రతికూలతలనూ అధిగమిస్తూ అత్యున్నత శిఖరానికి చేరుకుంటున్నారు. నిరంతర శ్రమ, సడలని విశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభాపాటవాల ద్వారా భావితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు... వారిలో కొందరి గురించి....నూషిన్ అల్ ఖదీర్... మంచి ప్లేయర్ మంచి కోచ్ కూడా కాగలరని నిరూపించారు నూషిన్ అల్ ఖదీర్. 44 ఏళ్ల నూషిన్ గత నెలలో మలేసియాలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. 2023లోనూ తొలిసారి జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో నూషిన్ శిక్షణలోనే టీమిండియా జగజ్జేతగా అవతరించింది.కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించి, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన నూషిన్ 2002 నుంచి 2012 వరకు భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 5 టెస్టులు, 78 వన్డేలు, రెండు టి20 మ్యాచ్ల్లో భారత్ తరఫున బరిలోకి దిగింది. 2005లో ఆటకు వీడ్కోలు చె΄్పాక నూషిన్ కోచింగ్ వైపు వచ్చింది. నూషిన్ శిక్షణలో భారత టీనేజ్ క్రికెటర్లు వరుసగా రెండు టి20 ప్రపంచకప్లలో విజేతగా నిలిచి ఔరా అనిపించారు.కోనేరు హంపి... రెండున్నర దశాబ్దాలుగా భారత మహిళల చెస్కు ముఖచిత్రంగా వెలుగుతూ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది విజయవాడకు చెందిన 37 ఏళ్ల హంపి. రెండుసార్లు ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల గ్రాండ్ప్రి సిరీస్లలో పతకాలు గెలవడం అలవాటు చేసుకున్న హంపి 2024 డిసెంబర్లో కజకిస్తాన్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఓఎన్జీసీలో చీఫ్ మేనేజర్ అయిన హంపి క్లాసిక్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ సాధించడమే లక్ష్యం అంటోంది.జ్యోతి సురేఖభారత మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో తిరుగులేని ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ. విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్లో ఉంది. 14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచకప్ టోర్నీలలో కలిపి 50 పతకాలు సాధించింది. జ్యోతి యర్రాజీపాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఇచ్చిన సలహాతో అథ్లెటిక్స్ లో అడుగు పెట్టి.. అచిరకాలంలోనే అంతర్జాతీయ అథ్లెటిక్స్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది వైజాగ్కు చెందిన జ్యోతి యర్రాజీ. 100 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డులు లిఖించుకున్న జ్యోతి యర్రాజీ 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో భారత్ తరఫున పోటీపడ్డ తొలి మహిళా అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి వరుసగా మూడుసార్లు జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. 2024 సంవత్సరానికి కేంద్రం నుంచి జ్యోతికి ‘అర్జున అవార్డు’ లభించింది. గుగులోత్ సౌమ్య... జట్టు క్రీడ ఫుట్బాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే విశేష ప్రతిభ ఉండాల్సిందే. ఆ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టులో ఫార్వర్డ్గా రాణిస్తోంది గుగులోత్ సౌమ్య. నిజామాబాద్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల సౌమ్య అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం దేశవాళీ మహిళల ఫుట్బాల్ లీగ్లో విఖ్యాత ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టుకు ఆడుతున్న సౌమ్య ఇటీవలే షార్జాలో జరిగిన పింక్ లేడీస్ కప్ నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆకుల శ్రీజటేబుల్ టెన్నిస్లో భారత నంబర్వన్ ర్యాంకర్ ఆకుల శ్రీజ 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది కజకిస్తాన్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో టీమ్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన 26 ఏళ్ల శ్రీజ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో కంటెండర్ స్థాయి టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందింది. గత ఏడాది జూన్లో నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్ కంటెండర్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. గతేడాది జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ లీగ్ మ్యాచ్లో చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిడిపై సంచలన విజయం సాధించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకుంది. కరణం నారాయణ, సాక్షి స్పోర్ట్స్ డెస్క్ (చదవండి: -
మహిళా దినోత్సవం– పుష్ప విలాసం
అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే పువ్వులుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ పువ్వులలో ఎక్కువప్రాచుర్యం పొందింది... యెల్లో మిమోసా. మహిళలకు యెల్లో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇటలీలో ఉంది. సున్నితత్వాన్ని, బలాన్ని సూచించే యెల్లో మిమోసాను ఇటాలియన్ ఫెమినిస్ట్లు మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా ఎంచుకున్నారు. మార్చి ప్రారంభంలో మిమోసా వికసిస్తుంది కాబట్టి వారు ఈ పువ్వును ఎంచుకున్నారు. -
సక్సెస్ 'కీ' పవర్ డ్రెస్సింగ్
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.1920లలో జాకెట్, స్కర్ట్తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వృత్తికి తగిన డ్రెస్సింగ్ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్లను ఆధునిక కట్లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.పవర్ డ్రెస్సింగ్కి ప్రేరణ కోసం...→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది → పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి → డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది → ఎవరికి వారు ఓన్ స్టైల్ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు → ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్గా ఉండేలా చూసుకోండి.సందర్భానికి తగిన ఎంపికలుభారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..డ్రేపింగ్ శైలులతో ఎవర్గ్రీన్గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.సల్వార్ కమీజ్భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్ని అందిస్తున్నాయి. ఆఫీస్వేర్గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్ను కుర్తాతో జత చేయడం.వెస్ట్రన్ గౌన్లు పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్ను ఇస్తున్నాయి. ఫార్మల్ వేర్మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.ఇతర అలంకారాలకూ...మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది. రీసైక్లింగ్ బెస్ట్ ఛాయిస్టెక్స్టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్లూమ్స్, సింథటిక్స్ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్పరిమెంటల్ ప్యాషన్లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్ను తీసుకొని ప్యాచ్వర్క్తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్వేర్, క్విల్ట్లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కు స్టైలిష్ లుక్నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం. ‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్మెంట్ను సృష్టించారు → నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్తో పవర్ఫుల్ ఐకాన్గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం → సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్గ్రీన్గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్లోనైనా తమ స్టైల్స్టేట్మెంట్ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్లుక్కి ఐకాన్గా మారడం గమనిస్తున్నాం. -
కుటుంబాలను నడిపిస్తోంది మహిళలే : గో డాడీ అధ్యయనం...
భారతీయ మహిళలే చిన్న తరహా వ్యాపారాల (Indian Female Small Business Owners) ద్వారా తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ చిన్న వ్యాపారాలకు మరింత శక్తిని అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) స్వీకరణకు కూడా సై అంటున్నారు. సాంకేతిక సేవలకు పేరొందిన గోడాడీ (GoDaddy) సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళలు స్థిరత్వంతో విజయాన్ని పునర్నిర్వచించు కుంటున్నారని, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార అవకాశాలు ఆవిష్కరణల కొత్త శకానికి ప్రేరణనిచ్చేందుకు సాంకేతికతను ఉపయోగిస్తు న్నారని వెల్లడించింది. లఘు, చిన్న తరహా వ్యాపారాలలో పావు వంతు (27%) కంటే ఎక్కువ మహిళల యాజమాన్యంలో ఉన్నాయని అధ్యయనం తేల్చింది, వీటిలో 74% సాంకేతికత విస్తరించిన గత ఐదు సంవత్సరాలలోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా తెలిపింది. మహిళలు తమ సొంత వ్యాపారాలను నడపడమే కాదు, అచంచలమైన విశ్వాసంతో రాణిస్తున్నారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు (79%) తమ వ్యాపారాలు వచ్చే సంవత్సరంలో పెద్ద, మెరుగైన వనరులు కలిగిన కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, భారతీయ మహిళలు ఏఐఆర్వో వంటి ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వారానికి 12 గంటలు ఆదా చేస్తున్నారని కూడా వెల్లడైంది.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి 63%మంది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ప్రస్తుత వాటిని మెరుగుపరచడానికి 55%మంది వ్యాపార భవిష్యత్తును ప్లాన్ చేయడానికి 46% మంది సమయం వెచ్చిస్తున్నారు.చదవండి: ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్ -
డైరెక్టరవుదామనుకుని : మహిళా సినిమాటోగ్రాఫర్ సక్సెస్ స్టోరీ
మేము సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పురుషులకే పరిమితం అని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెమెరా మహిళగా వెండి తెరపై అడుగు పెట్టి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన ఫల్గు సత్పతి గురించి తెలుసుకుందాం. దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఫల్గుకి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం ఏర్పడింది. అయిదేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకుంది. గురువు పల్లవి దాస్ వద్ద శిక్షణ పొందింది. అనేక ప్రదర్శనలిచ్చింది. నృత్యాకారిణిగా రాణించింది. దీంతో పాటు, బాల్యంనుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలైంది. బాలనటిగా, బిజయ్ మొహంతి, తాండ్రా రే వంటి అనుభవజ్ఞులతో కలిసి దూరదర్శన్లో నటించింది. కనిపించాను. ఈ సందర్భంలోనే వెండితెర వెలుగుల వెనుక ఇంకా చాలామంది ఉంటారని గమనించింది. సినిమాలంటే ఇష్టంగా మారింది. అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడటానికి థియేటర్స్కి వెళ్లేది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా , ప్రతీ అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేది ఫల్గు. ఒకసారి అనుకోకుండా 'కరణ్ అర్జున్' చూసి దర్శకత్వంపై మోజు పెంచుకుంది.ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ BPFTIO (బిజు పట్టనాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా)గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించింది. కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేసింది. ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం. అయితే, ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో , సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని ఫల్గు గుర్తించింది. ఇక్కడ చదువు పూర్తైన తరువాత, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేసింది.తొలి ప్రాజెక్ట్తోనే ప్రశంసలుఫల్గు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ , ఒడియా చిత్రం 'పుష్కర. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇంకా శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్ (హిందీ ఫీచర్ ఫిల్మ్) , దివానా దివానీ, హలో ఇన్ లవ్, సపనార పాథే పాథే', 'లవ్ యు జెస్సికా', 'ము తారా కియే' వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేసింది. అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్లకు కూడా సహాయ సినిమాటోగ్రాఫర్గా పనిచేసింది.'బెటర్ హాఫ్' అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేసింది. ఫల్గు కెమెరా పనితనానికి నిదర్శనంగా ‘పడే ఆకాశ’ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా. శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర మూవీకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ఘనత కూడా ఫల్గుదే కావడం విశేషం. ఇన్స్టిట్యూట్లో పరిచయమైన నటుడు హరా రాత్ని 2013 లో వివాహం చేసుకుంది.ఆకాశమే హద్దు..‘‘మహిళ సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తిని ఎంచుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా , మానసికంగా చాలా కష్టపడాలి. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, పోరాడాలసిందే. ఈ విషయంల అత్తమామలు నా కుటుంబం మద్దతు చాలా ఉందని తెలిపింది. ఫల్గు. సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి. గొప్పగా ఆలోచించి, విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి. ఈ ప్రపంచంలో ఏదీ తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి. ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి’’ అంటుంది ఫల్గు. కెరీర్కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం అంటుంది. -
కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు..
కొన్ని బాధకరమైన ఘటనలు మన అంతర్గత శక్తిని ప్రేరేపించి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. అలా కాకుండా ఆ పరిస్థితికి కలత చెందకుండా..ఎలా ఫేస్ చేద్దామనే ఆలోచనే మనల్ని కార్యోన్ముఖులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఆ విధంగానే ఈ తల్లి స్టార్టప్ని పెట్టేందుకు దారితీసి ఓ గొప్ప వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఏడాదికి రూ. 9 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. ఒక సాధారణ గృహిణి అయిన ఆ తల్లి ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగిందో చూద్దామా..!.కర్ణాటకకు చెందిన లక్ష్మీ ప్రియ విజయగాథ ఎందరికో ఆదర్శం. ఆమె కొడుకు అనారోగ్యమే ఆమెలో దాగున్న అసాధారణ వ్యాపారవేత్తను బయటకు తీసుకొచ్చింది. లక్ష్మికి నెలలు నిండకుండానే పుట్టిన కొడుకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను స్టార్టప్ పెట్టుందుకు దారితీశాయి. ఆమెకు పుట్టిన నవజాత శిశువు నెలల నిండకుండా జన్మించడంతో సుమారు 21 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ శిశువులో పెద్దగా మెరుగుదల కనిపించపోగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బతుకుతాడనేది చెప్పలేమని వైద్యులు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా ఆ చిన్నారికి తల్లి ఒడిలోవెచ్చదనం అందించి ప్రయత్నిద్దామని చెప్పడంతో..అలా చేసిన కొద్దిసేపట్లోనే ఏదో అద్భుతం జరిగినట్లుగా కోలుకోవడం జరిగింది ఆ శిశువు. పల్స్ రేట్ పెరిగి బతికి బట్టకట్టాడు. కానీ ఆ తర్వాత కూడా లక్ష్మీ కొడుకు బలహీనమైన రోగనిరోధకశక్తితో ఇబ్బంది పడేవాడు. శరీరంలో తగినంత స్థాయిలో రక్తం కూడా లేకపోవడం వంటి రుగ్మతనలు ఎదర్కొన్నాడు. దీనికి పోషకాహార లోపమని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ దిశగా వంటగదిలో ప్రయోగాలు చేసేది. తన కొడుకు పోషకాహార లోపంతో బాధపడకూదన్న ఆమె సంకల్పం పాలకూర వంటి ఆకుకూరలపై దృష్టిసారించేలా చేసింది. తనలాంటి తల్లలకు సహాయం అందించేలా చేయాలనే తపన, తన కొడుకు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే బలమైన కోరిక వెరసీ ఆమెను పాలకూర స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది. పాలకూరలో ఉండే విటమిన్లు పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయని న్యూట్రిషన్ల ద్వారా తెలుసుకుంది. ఆకుకూరల గొప్పతనం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలే ఆమెను పాలకూరతో రకరకాల వంటకాలు చేసేందుకు పురిగొలిపింది. కానీ ఈ పాలకూర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా దాన్ని ఎండలో బెట్టి పౌడరు చేసుకుని రకరకాల వంటకాలు ఎలా చేయొచ్చని ప్రయోగాల చేసింది. అలా ఆమె తానే స్వయంగా పాలకూర పొడులకు సంబంధించిన తినాసరి కీరై స్టార్టప్ పెట్టి విక్రయించడం ప్రారంభించింది. ఈ స్టార్టప్లో పాలకూరకు సంబంధించిన 40 రకాలు పొడుల మిక్స్లు ఉంటాయి. పాలకూరని కన్నడలో కీరై అని పిలుస్తారు. అందులోని వెరైటీలు ప్రధానంగా మనథక్కలి, కాసిని, ముదకథన్ , అగతి కరిసలంగన్నితో దాదాపు 15 రకాల వంటకాలను రూపొందించింది. ఈ లోగా కొడుకు కూడా ఆరోగ్యవంతుడయ్యాడు. క్రీడల్లో ఛాంపియన్గా కూడా రాణించే స్థాయికి చేరుకున్నాడు తన సొంత జ్ఞానంతో పెట్టిన ఈ స్టార్టప్తో ప్రారంభంలో పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ పొడులతో దోసెలు, సూప్లు, బియ్యం మిశ్రమాలు వంటి వాటిని కూడా చేర్చింది. వీటి గురించి తన కొడుకు స్నేహితుల తల్లిదండ్రులకు పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో తన స్టార్టప్లో విక్రయించే ఈ పాలకూర పొడుల ప్రాముఖ్యత గురించి వివరించేది. పైగా పాలకూర కొని చేయడం కంటే ఈ మిక్స్లతో సులభంగా వండటమేగాక మంచి పోషకాహారాన్ని అందిస్తామన్న ఆమె వివరణ ఎందరో తల్లిదండ్రులను ఆకర్షించింది. సులభంగా వండగలమన్న విధానం ప్రజలను ప్రభావితం చేసి.. కొనేందుకు ముందుకు వచ్చారు. అందులోనూ పిల్లలకు ఆకుకూరల తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటివి అయితే సులభంగా తింటారు, పైగా పోషకాలు అందుతాయన్న ఆశతో కొనేందుకు ముందుకు రావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్ల పెరగడం తోపాటు ఆర్డర్లు కూడా వచ్చేవి. అందుకు తగ్గట్టుగానే ఐఎస్ఓ(ISO)-సర్టిఫైడ్ పద్ధతులను అవలంబించడం, తన బ్రాండ్ నాణ్యతలో రాజీపడకుండా అందించి ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అలా అనాతి కాలంలోనే వార్షిక అమ్మకాలు రూ. 9 లక్షలకు చేరుకోవడంతో చిన్న వంటగది ప్రయోగాలు కాస్త ఓ పెద్ద బిజినెస్గా మారి దూసుకుపోయేందుకు కారణమైంది. అంతేగాదు లక్ష్మీ స్టార్టప్ ఈ స్టార్టప్ ఇప్పుడు భారతదేశం దాటి విస్తరించింది, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి సుదూర ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తుంది.నిపుణులు ఏమంటున్నారంటే..చివరగా పోషకాహార నిపుణురాలు పద్మజ గుత్తికొండ, పాలకూర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. పాలకూరలో కెరోటినాయిడ్లు, విటమిన్లు సీ, కే, ఫోలిక్ ఆమ్లం , కాల్షియంలకు మూలం అని ఆమె అన్నారు. ఇది కంటి ఆరోగ్యం, ప్రేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ప్రతిరోజూ పిల్లల ఆహారంలో లేదా వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేర్చడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడమే గాక కంటి చూపుకి ఢోకా ఉండదని చెబుతున్నారు.(చదవండి: టైప్ 2 డయాబెటిస్కి మొక్కల ఆధారిత ఔషధం..! ట్రయల్స్లో షాకింగ్ ఫలితాలు) -
ఒక ఆలోచన...విజేతను చేసింది
నళిని ఓ ఫుడ్ప్రెన్యూర్. జంషెడ్పూర్, టాటానగర్లో పుట్టారు. ప్లస్ టూ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత ఒడిశా, భువనేశ్వర్లో డిగ్రీ, ఎంబీఏ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద కలిగిన ఆసక్తి ఆమెను మార్కెటింగ్ వైపు అడుగులు వేయించింది. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్లో సక్సెస్ అయ్యారు. కరోనా పాండమిక్ ఆమె కెరీర్ని మలుపు తిప్పింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఆమెతో మిల్లెట్ మిరకిల్ చేయించింది. బ్రెడ్ తయారీలో ఉన్న ఆసక్తి కొద్దీ ఆ ఫార్ములాని మిల్లెట్స్ మీద ప్రయోగం చేశారు. అగ్రికల్చర్, ఫుడ్ సైంటిస్టుల పరీక్షలను నెగ్గిన నళిని విజయవంతమైన తన ప్రయోగానికి పేటెంట్ ఫైల్ చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి.ఇది నా పేటెంట్ ప్రోడక్ట్! చపాతీ అంటే ప్రకటనలో చూపించినట్లు మూడువేళ్లతో తుంచేటంత మృదువుగా ఉండాలి. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చపాతీ చేస్తే తినడం కష్టంగా ఉంటోంది. పరిష్కారం ఏమిటి? దీనిని ఛేదించగలిగితే సక్సెస్ చేతికందినట్లే. ఇందుకోసం నళిని తన ఆలోచనకు పదును పెట్టారు. తన సాధన ఫలించి ఆమె సాధన ఫలించి, ఇంట్లో వాళ్లు సంతృప్తిగా తిన్నారూ.. తిన్నారు. దీనినే తన ఎంటర్ప్రెన్యూర్షిప్కి మార్గం చేసుకోవచ్చు కదా! అనుకోవడంతోనే సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ మిల్లెట్ చపాతీలు ఆ పరీక్షల్లో నెగ్గాయి. నిల్వ ఉండడానికి ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం లేదని, పోషకాల లభ్యత బాగుందని హైదరాబాద్, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్æ సైంటిస్టులు నిర్ధారించారు. పరీక్షలలో నెగ్గిన తర్వాత తన ఫార్ములాను పరిరక్షించుకోవడం కోసం పేటెంట్ ఫైల్ చేశారు నళిని. అగ్రికల్చరల్ యూనివర్సిటీ... ఫుడ్ డెవలప్మెంట్ విభాగంలోని ఇన్క్యుబేటర్లో ప్రయోగదశలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడంతోపాటు అగ్–హబ్, నిధి ప్రయాస్ గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించింది. తన ఆలోచన, ప్రభుత్వం నుంచి అందినప్రోత్సాహంతో పరిశ్రమ స్థాపించగలిగానని చెప్పారు నళిని. ‘‘రెండు–మూడు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత తెరమీదకు వచ్చాను. ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తూ నగరంలోని క్యూ మార్ట్, స్టార్ హోటళ్లకు అందిస్తున్నాను. పేటెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెడతాను. ఒక కొత్త ఉత్పత్తిని ఊహించుకుని, నా జ్ఞానాన్ని మేళవించి, నిరంతరాయంగా శ్రమించి సాధించుకున్న విజయం ఇది. నా ఆలోచన, ప్రయోగానికి పేటెంట్ సాధించుకోవడం అనే ఊహే ఆనందంగా ఉంది’’ అన్నారు నళిని. మల్టీ టాస్కింగ్ మహిళలకు కొత్త కాదు! మల్టీ టాస్కింగ్లో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి బాధ్యతలను నిర్వహించడమే అందుకు నిదర్శనం. గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఎక్కువ మంది అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటారు. ధైర్యం చేసి తొలి అడుగు వేస్తే నడక దానంతట అదే కొనసాగుతుంది. అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్లో అడుగుపెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మరుసటి రోజు నుంచే లాభాల కోసం చూడరాదు. రాబడి పెరిగి ఆదాయం వచ్చే వరకు శ్రమించగలిగిన సహనం ఉండాలి. లాభాల బాట పట్టిన తర్వాత కూడా అలాగే శ్రమను కొనసాగించాలి. – నళిని, ఫౌండర్, కిబేస్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిర్వహణలోనూ రాణిస్తాం
ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్ సర్వీసెస్ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్కు వైస్ ప్రసిడెంట్... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్కు సీవోవో... మరికొందరు హాస్పిటల్ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ హాస్పిటల్ రంగంలో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్గా...నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్ చేశా. నా ఇంటర్న్షిప్ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాశా. అలా నేను డాక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారాను. ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. సమాజంలో ఈ వివక్ష ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలూ, 16 నర్సింగ్ కాలేజీలూ, 28 పారామెడికల్ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్జెండర్ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్ సర్వీసెస్లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి. – డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంకల్ప బలంతోనే సాధన సులభంఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా, మా టీమ్లోని ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్గా, మా హెచ్ఆర్ టీమ్లకూ, పారామెడికల్ స్టాఫ్కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపట్టా. ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఏఎమ్పీహెచ్ ప్రోగ్రామ్ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్ గ్రూపునకు ఆపరేషన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను. – డాక్టర్ రూప పుట్టా, సీనియర్ రేడియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్ సారథ్యం అంత కష్టమేమీ కాదు!ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్ టైమ్లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్ కాలేజీలూ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది. – డాక్టర్ గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మేనేజ్మెంట్లో మేమే బెస్ట్!మొదట నేను ఓ డాక్టర్గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్గా, ఓ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్ భాస్కర్రావుగారు కిమ్స్ తమ హాస్పిటల్ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్లో అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్గా కిమ్స్లో పనిచేయడం మొదలుపెట్టా. హాస్పిటల్ నడిపించడమెలాగో నేర్చుకోవడం కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్లోని కొండాపూర్ కిమ్స్ విభాగానికి మెడికల్ డైరెక్టర్గా, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ తాలూకు వైస్ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది. – డాక్టర్ హరిణి చేబ్రోలు, వైస్ ప్రెసిడెంట్ (రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్), కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కెరియర్ మెట్లపై‘ఫెమ్’నిస్టులం!అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్కేర్ సెంటర్ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్ సర్జన్ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్ విజేత. ఆమెకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్సిటీ హాస్పిటల్. ఓ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్ 9 టు 5 జాబ్ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్ అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్సిటీ కేర్స్ అనే ఫౌండేషన్ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం. – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్), ఫెమ్సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్రంగుల కళఇంటర్నేషనల్ విమెన్స్ డే సింబల్, పోస్టర్ డిజైన్లలో సాధారణంగా పింక్ కలర్లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డేఅంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. యూకేలోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్ప్రెన్యూర్గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన చట్టాలివే..!
ఎంతలా అభివృద్ధిపథంలోకి దేశం దూసుకుపోతున్నా..స్త్రీలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఏదో ఒక మూలన అత్యాచారం, లైగంగిక వేధింపులు వంటి అమానుష ఘటనలు చోటు చేసుకంటూనే ఉన్నాయి. చదువుకుని తమ కాళ్లపై నిలబడినా మహిళలంటే చిన్న చూపు, తేలిక భావం ఇంకా ఉన్నాయి. అన్ని రంగాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని చెబుతున్నా..ఆమె మగాడు లేకపోతే మనలేదు అనే కుచించిత భావంలోనే ఉండిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి మహిళ తనను తాను రక్షించుకునేందుకు తప్పక తెలసుకోవాల్సిన చట్టాలేంటో చూద్దామా..!1. అనైతిక వ్యాపారర (నివారణ) చట్టము, 1956 The Immoral Traffic (Prevention) Act, 19562. వరకట్న నిషేధ చట్టం, 1962. The Dowry Prohibition Act, 19613. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005.Protection of Women from Domestic Violence Act, 20054. పనిచేయుచోట మహిళలపై లైంగిక హింస (నివారణ, నిషేధము – పరిహార) చట్టం, 2013. The Sexual Harassment of Women at Workplace PREVENTION, PROHIBITION and REDRESSAL Act, 20135. స్త్రీల అసభ్య చిత్రణ (నిషేధ) చట్టం, 1986. The Indecent Representation of Women (Prohibition) Act, 19866. భారతీయ సాక్ష్య అధినియం, BNS IPC) ) లోని స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు, మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాలు, గృహహింస, వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించటం వంటి పలు రకాల నేరాలకు గల శిక్షలు.7. పలు వివాహ చట్టాలు – క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 (144 బిఎన్ఎస్ఎస్) ద్వారా తమను తాము పోషించుకోలేని మహిళలకు మెయింటెనెన్స్, భరణం పొందే హక్కు 8. తల్లి దండ్రుల, వయోవృద్ధుల పోషణ – పరిరక్షణ చట్టం, 20079. విద్యాహక్కు చట్టం, 200910. చిన్నపిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించటానికి POCSO Act, 2012(చదవండి: కనపడని నాలుగో సింహం..! నిందితుడిని కటకటాల్లోకి పంపేది వారే..! -
ఈక్వల్ జర్నీ స్లోగా ఉంది
పని ప్రదేశాల నుండి బహిరంగ ప్రదేశాల వరకు ఎన్నో చోట్ల భద్రతప్రాపాముఖ్యతను గుర్తుతెస్తుంది... జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day). భద్రతా అవగాహన–అమలుకు అంకితమైన ‘నేషనల్ సేఫ్టీ వీక్’లో భాగంగా వివిధ రంగాలలో, వివిధ ప్రదేశాలలో, వివిధ కోణాలలో మహిళల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు వెదకడం అత్యవసరం. అనివార్యం. వికసిత భారత్కు ఆయువు పట్టు... మహిళల శ్రేయస్సు, భద్రత...నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం భారతదేశంలో 15–49 సంవత్సరాల వయస్సు గల 30 శాతం మంది మహిళలు శారీరక, లైంగిక, గృహహింసను అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంతప్రాపాధాన్యత ఇస్తున్నాయి.మహిళల భద్రత, భద్రతాప్రాపాజెక్ట్ల కోసం ప్రభుత్వం ‘నిర్బయ నిధి’ని ఏర్పాటు చేసింది. నిర్భయ నిధి కింద బ్యూరో ఆఫ్ పోలిస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపీఆర్ అండ్ డి) దర్యాప్తు అధికారులు,ప్రాపాసిక్యూషన్ అధికారులు, వైద్య అధికారులకు శిక్షణ ఇస్తారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ(సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్) కిట్లను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాపాంతాలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.‘ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్’(డబ్ల్యూపీఎస్–2023)లో 177 దేశాల్లో మహిళల భద్రతలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలను డెన్మార్క్, స్విట్జర్లాండ్ దక్కించుకున్నాయి. ఆఫ్గనిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది.2022: మహిళలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ హింసకుపాల్పడే టాప్10 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ జాబితాలో 537 సంఘటనతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. 125 సంఘటనలతో మన దేశం 7వ స్థానంలో ఉంది.ఉమెన్ సేఫ్టీకి సంబంధించి వివిధ సంస్థలు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి నుంచి సేఫ్టీకి సంబంధించిన టిప్స్, సేఫ్టీకి సంబంధించిన గోల్డెన్ రూల్స్ చెప్పడం, యాప్స్ను పరిచయం చేయడం వరకు ఎన్నో చేస్తున్నారు. సెల్ఫ్–డిఫెన్స్కు సంబంధించి అపోహలను తొలగిస్తున్నారు. హక్కులను సాధించడానికి పోరాటపటిమ... అవకాశాలను అందుకోవడానికి ప్రతిభాపాటవాలు... సాధించి, అందుకున్న దాంట్లో స్థిరపడే చోటేపోరాటం... ఇవన్నీ అవసరం అవడానికి కారణం అభద్రత, రక్షణలేమి! అవి ఇన్నేళ్ల మహిళల ప్రయాణాన్ని మళ్లీ మొదటికే తీసుకొస్తాయేమోననే భయం వెంటాడుతోంది! తర్వాత తరాలను జీరో దగ్గర నిలబెట్టకుండా.. వాళ్లకో మైల్స్టోన్ను అందివ్వాలనేదే ఈతరం మహిళల ఆరాటం! అది విమెన్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే సాధ్యం! ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రపోలీస్ శాఖ చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు తెలంగాణ సీఐడీ, విమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీపీ శిఖాగోయల్ (Shikha Goel).ఏ రంగంలో అయినా మహిళాప్రాపాతినిధ్యం పెరిగితేనే మహిళలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మొదటినుంచీ పురుషాధిపత్య రంగమైనపోలీస్ డిపార్ట్మెంట్లోనూ మహిళలప్రాతినిధ్యం పెరగాలి. ఇదివరకటితో పోలిస్తే పెరిగింది కూడా. అయినా జాతీయ స్థాయిలో చూస్తే వీరి సంఖ్య 25 శాతం కూడా లేదు. తెలంగాణపోలీస్ శాఖలో మహిళల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తోంది. దాంతో రాష్ట్రపోలీస్ శాఖలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రికార్డ్ స్థాయిలో 2,500 మంది మహిళలను అపాయింట్ చేశాం. అంటే దాదాపు 20 శాతం. ఎస్సీటీపీసీ ప్రోగ్రామ్ ద్వారా 2,338 మందిని తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బ్యాచ్ ఇది.పోలీస్ డిపార్ట్మెంట్లోకి మహిళలను ప్రోత్సహించడానికే ఇలాంటి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ కృషి జరుగుతోంది. అయినా ఈ రంగంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది. మహిళల నియామకాలను పెంచడంలో చిత్తశుద్ధి ప్రయత్నాలతోపాటు జెండర్పాలసీ, మహిళలకు లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవీ చాలా అవసరం. ఇన్ని అవాంతరాల మధ్య కూడా గుర్తించదగిన విజయాన్నే సాధిస్తున్నాం.భద్రతా నగరాల్లో ఒకటిగా...మహిళా భద్రత, రక్షణ కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితమైంది కాదు. ఇంటి నుంచి మొదలు స్కూల్, వర్కింగ్ ప్లేస్, ట్రాన్స్΄ోర్ట్ ఇలా అన్ని చోట్లా సమస్యగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు పెద్ద పీట వేస్తోంది. షీ టీమ్స్, భరోసా సెంటర్స్, సాహస్, సీడీఈడబ్ల్యూ (డొమెస్టిక్ వయొలెన్స్) కౌన్సెలింగ్ సెంటర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, చట్టాలను కఠినంగా అమలుపరచడం, నిర్భయ ఫండ్స్తో అధునాతన నిఘా పరికరాలు, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్, హెల్ప్లైన్స్ వంటివాటితో భద్రత, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాం. దీంతో మహిళ లు నిర్భయంగా బయటకు వచ్చి.. తమకు నచ్చిన రంగంలో రాణించే వాతావరణం ఏర్పడింది. కిందటేడు మార్చిలో టీ సేఫ్ సర్వీస్నుప్రాపారంభించింది ప్రభుత్వం. ఇది చదువు, స్త్రీల హక్కులు, చట్టాల గురించి అమ్మాయిల్లో అవగాహన కల్పించడం, అలాగే మహిళలను గౌరవించాలనే స్పృహను అబ్బాయిల్లో కలిగించడం వంటి కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింసను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వీటన్నిటి వల్లే తెలంగాణ ఈరోజు దేశంలోనే అత్యధిక వర్కింగ్ విమెన్ ఉన్న రాష్ట్రంగా, హైదరాబాద్.. దేశంలోకెల్లా భద్రతా నగరాల్లో ఒకటిగా నిలిచాయి. సవాళ్లు...ఇంత చేస్తున్నా ఇంకా చాలామంది మహిళల్లో తమ హక్కులు, చట్టాల విషయంలో పూర్తి అవగాహన రాలేదు. దీనివల్ల గృహహింస, పనిప్రదేశాల్లో లైంగికవేధింపులు వంటివాటి మీద ఫిర్యాదు చేయడం లేదు. అవగాహన ఉన్నవారు కూడా వెనుకడుగు వేస్తున్నారు పరువు, ప్రతిష్ఠ లాంటి భయాల వల్ల. ఇవన్నీ మహిళల భద్రత, రక్షణకు అడ్డంకులుగా మారుతున్నాయి. అయినాపోలీస్ శాఖ అలుపెరగని ప్రయత్నం చేస్తోంది.మనమే క్రియేట్ చేసుకోవాలి...ఏ రంగంలో మహిళలు మైనారిటీగా ఉంటారో ఆ రంగంలో సవాళ్లు తప్పనిసరి. అయితే వాటికి భయపడకుండా మన స΄ోర్ట్ సిస్టమ్ను మనమే రూ΄÷ందించుకోవాలి. దాన్ని విజయానికి సోపానంగా మలచుకోవాలి.ప్రాపాధాన్యాలను గ్రహించి.. దానికి అనుగుణంగా పనిచేసుకుపోవడమనేది కూడా ఒక నైపుణ్యంగా మారుతుంది.ప్రాపాధాన్యాలను గ్రహిస్తూ వర్క్– లైఫ్ బ్యాలెన్స్ని ఒక స్కిల్లా డెవలప్ చేసుకోవాలి. -శిఖాగోయల్డిజిటల్ థ్రెట్ను ఢీ కొట్టాలిట్రెడిషినల్ ముప్పుకు అదనంగా ఈ–థ్రెట్స్ సోషల్మీడియా రాకతో మరింత పెరుగుదల భయం వీడితేనే నేటి మహిళకు పూర్తి భద్రత బాధితుల వివరాల గోప్యతకుపోలీస్ భరోసా ‘సోషల్ మీడియా సహా డిజిటల్ ప్రపంచం మానవ జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. ఆపై దాని వల్ల ముంచుకొస్తున్న ముప్పును తెలుసుకున్నాం. ఇప్పుడు నిరోధక మార్గాలు అన్వేషిస్తున్నాం. నేటి మహిళకు పెను సవాల్గా మారిన డిజిటల్ థ్రెట్ను సమర్థంగా ఢీ కొట్టాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి’... అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ నేర పరిశోధన విభాగం డీసీపీ ఎన్.శ్వేత. మహిళల భద్రతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు కీలకాంశాలు వివరించారు.వేధింపులు పరిధి దాటాయిప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. ఆమెకు ఏళ్లుగా ఎదురవుతున్న వేధింపులు, గృహహింస తదితరాలను ట్రెడిషనల్ థ్రెట్గా చెప్పుకోవచ్చు. నేటి మహిళ వీటిని చాలా వరకు సమర్థంగా ఎదుర్కొంటోంది. ఫలానాప్రాపాంతం లో ఈవ్ టీజింగ్ చేసేపోకిరీలు ఉన్నారని తెలిస్తేపోలీసులకు ఫిర్యాదు చేస్తాం లేదా ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అయితే డిజిటల్ థ్రెట్కు, సైబర్పోకిరీలకుప్రాపాంతం, పరిధి అంటూ ఉండవు.ముప్పును పట్టించుకోవట్లేదుడిజిటల్ మీడియాను మహిళలు, యువతులు ఓ మంచి ఎక్స్ప్రెషన్ లాట్ఫాంగా వినియోగించుకుంటున్నారు. తమ అభిప్రాయాలు, అభిరుచులను అక్కడ స్వేచ్ఛగా వెలిబుచ్చుతున్నారు. తద్వారా వేల మందికి సుపరిచితులుగా మారిన, ఆర్థికంగా నిలదొక్కుకున్న అతివలూ ఎందరో ఉన్నారు. అయితే ఈ ఎక్స్ప్రెషన్లో అంతర్లీనంగా ఉన్న ముప్పును గుర్తించలేక΄ోతున్నారు. ఫలితంగా అనేక మంది మహిళలు ఫిజికల్గా, వర్చువల్గా, ఎమోషనల్గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జాగ్రత్తలను విస్మరిస్తున్నారుస్వభావ సిద్ధంగానే మహిళలు బాహ్య ప్రపంచంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తొందరగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడరు. నమ్మకం కలిగే వరకు అభిరుచులు పంచుకోవడం మాట అటుంచి కనీసం తమ పేరు కూడా చెప్పరు. రియల్ వరల్డ్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... వర్చువల్ వరల్డ్లో మాత్రం తొందరపడుతున్నారు. హాయ్, హలోతో మొదలైన ఈ పరిచయాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసుకునే వరకు వెళుతున్నాయి. ఇవే కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి.వీరి భయమే వారికి ధైర్యండిజిటల్ థ్రెట్కు లోనైన మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. కుటుంబం, సమాజం, వ్యక్తిగత జీవితం.. ఇలా అనేక అంశాలను ఊహించుకుని భయపడుతున్నారు. ఈ భయమే ఎదుటి వారికి ధైర్యం అవుతోంది. మరింత రెచ్చి΄ోతూ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళుతున్నారు. మీ పరువు అనేది మీ చేతుల్లో, మీ ప్రవర్తనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. నట్టింట్లో, నడివీధిలోనే కాదు... ‘నెట్’ఇంట్లోనూ బాధితురాలిగా మారిన అతివకు అన్ని ఏజెన్సీలు అండగా ఉంటాయి. వీళ్లు తమకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకోవాలి. ధైర్యంగా ముందుకువచ్చిపోలీసులతోపాటు సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఎక్కడైనా చేయవచ్చుమీరు ఏప్రాపాంతంలో ఉన్నప్పటికీ మరేప్రాపాంతంలో అయినా ఏ ఏజెన్సీకి అయినా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేసిన వాళ్లే దర్యాప్తు చేయడమో, సంబంధితప్రాపాంతానికి బదిలీ చేయడమో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బా«ధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా గోప్యతపాటిస్తారు. ఈ విషయంలో న్యాయస్థానాలు సైతం బాధితులకు పూర్తి అండ, సహాయసహకారాలు అందిస్తుంటాయి. టెక్నాలజీని వాడుకోవాలి, విచక్షణతో ముందుకు వెళ్లాలి. – ఎన్.శ్వేత. డీసీపీ నేర పరిశోధన విభాగం, హైదరాబాద్ -
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం
2024 సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్ కాని, ఇండియన్ సినిమాల్లోకానివేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్ గురించి కథనం.వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?అమెరికా లాస్ ఏంజెలెస్లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.ఎవరీ ‘అనోరా’?:నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్–ఏ–ఆజమ్’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్–ఏ–ఆజమ్లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్లోని ఓ క్లబ్లో స్ట్రిప్పర్గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమెను క్లబ్ యజమాని రష్యాకు చెందిన ఇవాన్ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా పార్టీల్లో, వీడియో గేమ్స్లో సమయం గడుపుతూ ఉంటాడు. అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్ఫ్రెండ్గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.కష్టాలు మొదలుఅయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్లో తన ఇష్టానికి స్ట్రిప్పర్గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్ పారిపోతాడు. ఇవాన్ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.ఊరడించే బంధంఅయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్ డిస్ట్రబ్ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.సినిమా విశేషాలు→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్ బేకర్కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్–అమెరికన్ జంట కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ. 2000–2001 సమయంలో న్యూయార్క్లో సీన్ బేకర్ వీడియో ఎడిటర్గా పని చేస్తూ అనేక రష్యన్–అమెరికన్ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం కోసం కెనెడియన్ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం ఆమె గతంలో సెక్స్ వర్కర్గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్ వోర్’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. → కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. 25 ఏళ్ల మైకీ మాడిసన్ లాస్ ఏంజెలెస్లో పుట్టి శాన్ ఫెర్నాండ్ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.→ 2013లో తొలిసారి ‘రిటైర్మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్లో నటించే నాటికి మైకీ మాడిసన్ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది. 2017లో హీరోయిన్గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్లో టీనేజ్ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్’, ‘మాన్ స్టర్’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్లలోనూ నటించి, మెప్పించింది. → 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఆ పై ‘స్క్రీమ్’, ‘లేడీ ఇన్ ది లేక్’ సినిమాల్లో నటించింది. → తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్క్రీమ్’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్ బేకర్ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది. -
కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్చేస్తే వచ్చే ఫ్లేవర్లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్లో డైటెటిక్స్లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..) -
సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది!
అమ్మాయి..అందులోనూ కొత్త పెళ్లికూతురు అనగానే పదహారణాల పడచులా, ముట్టుకుంటే మాసిపోయేంత మృదువైన కుసుమంలా సుకుమారంగా అందంగా ఉండాలని అందరూ ఊహించుకుంటారు. ఆమె ఏ రంగంలో ఉన్నా, ఎంత సాధికారత సాధించినా, సిగ్గులమొగ్గవుతూ, తలవంచుకొని తాళి కట్టించుకుంటూ అణకువగా ఉండాలనే పద్ధతికి దాదాపు అందరూ అలవాటు అయిపోయారు. కానీ తన సిక్స్ ప్యాక్ కండలు చూపిస్తూ అందరినీ షాక్కి గురి చేసిందో పెళ్లికూతురు. నిజానికి ట్రెడిషనల్ కాంజీవరం చీర, నగల ముస్తాబైంది. దీంతోపాటు తనలోని బాడీ బిల్డర్ (Body Builder) విశ్వరూపాన్ని చూపించిందీ ఫిట్నెస్ ఫ్రీక్. బాడీ బిల్డర్, సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకకు(Karnataka) చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చిత్ర పురుషోత్తమ్(Chitra Purushotham) ఈమె మామూలు పెళ్లి కూతురిలా ముస్తాబైంది. కానీ అసలు సిసలైన ట్రెడిషనల్ లుక్లో కూడా తన అసలు సామర్థ్యమేంటో అతిథులందరి ముందూ ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. అందరి ముందూ అద్భుతమైన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఫోజులిచ్చింది. వధువు తన ఫిట్నెస్తో సాంప్రదాయ గోడలను బ్రేక్ చేసిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన అందానికి ఫిట్నెస్తోపాటు ఆత్మవిశ్వాసాన్ని జోడించిన వైనం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా అందంగా ఉంది.. మహారాణిలా ఉంది అంటూ తెగ పొగిడేశారు. సాంప్రదాయం, సాధికారత జమిలిగా ‘ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే!’ అన్న సందేశాన్నిచ్చింది. దీనిపై కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, తన ఫిట్నెస్ కోసం చేసిన కృషి, సాధించిన బాడీపై దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. చాలామంది చిత్రలోని టాలెంట్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు ఉండాలి, ఇలాంటి ధైర్యవంతులైన మహిళలు సమాజానికి స్ఫూర్తి.ఇదే కదా నిజమైన అందం’ అంటూ చిత్రకు మద్దతుగా వ్యాఖ్యానించడం విశేషం. View this post on Instagram A post shared by CHITRA PURUSHOTHAM 🇮🇳 (@chitra_purushotham)త్వరలోనే తన ప్రియుడ్ని ప్రేమ వివాహం చేసుకోనుంది చిత్ర. వివాహానికి ముందు, ప్రీ-వెడ్డింగ్ షూట్కి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. చిత్ర పురుషోత్తమ్ తన ఫిట్నెస్తో ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తోంది. చిత్ర పసుపు , నీలం రంగు కాంజీవరం చీరను ధరించింది.. బ్లౌజ్ లేకుండానే, కష్టపడి సంపాదించిన బాడీని ప్రదర్శించింది. ఇంకా లేయర్డ్ నెక్లెస్లు, కమర్బంద్, గాజులు, మాంగ్ టీకా , చెవి పోగులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఇంఒంటినిండా టాటూలు, పొడుగుజడ, జడగంటలు, పూలు ఇలా ఎక్కడా తగ్గకుండా తన గ్లామర్ లుక్తో మెస్మరైజ్ చేసింది. చిత్ర పురుషోత్తం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు మంచి ట్రైనర్ కూడా. వధువుగా చిత్ర వైరల్ కావడం ఇదే తొలిసారి కావచ్చు, కానీ పురుషులకే సొంతం అనుకున్న రంగంలో ప్రతిభ మరోపేరుగా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. మిస్ ఇండియా ఫిట్నెస్ అండ్ వెల్నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక అండ్ మిస్ బెంగళూరు లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర పురుషోత్తం తాజా ఫోటోషూట్ స్టీరియోటైప్ అంచనాలను బద్దలు కొట్టి మరీ తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడమే కాకుండా, అందం, స్త్రీత్వం సామాజిక ప్రమాణాలను పునర్నిర్వచించింది. అంతేకాదు అంత దృఢమైన దేహాన్ని సాధించడంలోని తన కృషి పట్టుదల,నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. తనలాంటి వారికి ప్రేరణగా నిలుస్తోంది. -
నాకు నచ్చిన పాత్ర ఇందిర
పి.శ్రీదేవి రాసిన నవల ‘కాలాతీత వ్యక్తులు’లోని ఇందిర చాలా వినూత్నమైన పాత్ర అని నేను అనుకుంటాను. నవల చదివిన వారు ఇందిరను అంత సులువుగా మర్చిపోలేరు. ఇంకా చె΄్పాలంటే ఎప్పటికీ మర్చిపోలేరు. రచయిత్రి ఆ పాత్రను అలా తీర్చిదిద్దింది. ‘ప్రకాశం, ఇది కాదు బతికే విధానం, ఇంతకంటే బాగా బతకాలి‘ అని ఇందిర చెప్పే డైలాగ్ విన్నాక ఇందిరను తల్చుకుంటే భయం వేస్తుంది. ఇందిరను తల్చుకుంటే ధైర్యం వస్తుంది. ఇరవయ్యేళ్ళ వయసుకు తగని బరువు మోసే ఆ పిల్ల ఒక్కచోట కూడా కన్నీళ్ళు పెట్టుకోదు. పైగా ‘నేను బలపడి, మరొకరికి బలమివ్వాలనుకునే తత్వం నాది‘ అని అనగలిగే సాహసి.‘అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం! ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు’ అంటుందామె. కృష్ణమూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా ‘పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంతదూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకోనివ్వు’ అని ఆ రోజుల్లోనే తన పర్సనల్ స్పేస్ తనకుండాలని చెప్తుంది.‘నీ ఆయుర్దాయం ఎంతో అన్నిరోజులూ నిండుగా బతుకు! నిర్భయంగా బతుకు! రోజుకు పదిసార్లు చావకు. ఈ ప్రపంచంలోని వికృతాన్నీ, వికారాన్నీ అసహ్యించుకో! ఆశలూ, స్వ΄్నాలు, అనురాగాలు అన్నీ పెంచుకో! కానీ వాటికి శస్త్రచికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్’ అనే ఇందిర నేటికీ మనకు అవసరమైన పాఠం చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, లౌక్యం, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే! ‘పాతివ్రత్యం, అర్పించుకోడాలు... వంటి నాన్సెన్స్ని ఫెడీమని కాలితో తన్నే ఇందిర’ అని డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు ప్రస్తావించే ఇందిర డ్రామా చెయ్యదు, సహజంగా ప్రవర్తిస్తుంది. అందులో స్త్రీలకుండే బలం కనిపిస్తుంది. అందుకే ఇందిర నాకిష్టం. -
నాకు స్ఫూర్తి మా నానమ్మ
ఎందుకంటే.. ‘ఒక పొజిషన్ అచీవ్ చేయమనెప్పుడూ చెప్పలేదు మా నానమ్మ. అయితే ఒక పొజిషన్లో ఉంటే చేయగలమో చెప్పింది. మన పనులతో ఎంతమందిని ప్రభావితం చేయగలమో చెప్పింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ ఎప్పుడూ మమ్మల్ని అబ్బాయిలకు డిఫరెంట్ అని పెంచలేదు. అందుకే మేం వాళ్లతో ఈక్వల్ కాదనే భావన మాకెప్పుడూ రాలేదు. అమ్మ కానీ, నానమ్మ కానీ మాకు ఎక్కడ తగ్గాలో నేర్పారు. అది మహిళలకున్న సహజగుణమని మేం గ్రహించేలా చేశారు. నిజానికి మనకు ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. కానీ ఎక్కడ తగ్గాలో తెలియదు. అది తెలుసుకోవాలి. సహనం మనకున్న సహజమైన లక్షణం. దాన్నెందుకు కోల్పోవాలి మనం! అది మనకున్న ఆరా! దాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ నేను మా నానమ్మ, అమ్మ ద్వారే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో నాకు వాళ్లే స్ఫూర్తి!’ -
ప్రవచన శిరోమణులు
అడిగేవారికి చెప్పేవారు లోకువ అని సామెత. అయితే అవతలి వారు ఏమీ అడగకున్నా, వారికి ఏం కావాలో, ఏం చెబితే బాగుంటుందో తామే తెలుసుకుని నాలుగు మంచిమాటలు .. అందులోనూ ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి పాదులు తీసే అంశాలూ చెబుతుంటారు ప్రవచనకారులు. ఇక్కడ ప్రవచనకారులు అనగానే ముందుగా గుర్తొచ్చేది పురుషులే. అలాగని స్త్రీలు అసల్లేరని కాదు. అయితే వారి పేర్లు చెప్పాలంటే చేతివేళ్లు సరిపోతాయి. 8న మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ హితంకోసం ప్రవచనాలు చెబుతున్న కొందరు మహిళామణుల గురించి తెలుసుకుందాం. వారి ప్రయాణంలోని సాధక బాధకాలు వారి మాటల్లోనే...మహిళలు ప్రవచనాలా?– డా. ఎన్. అనంతలక్ష్మి‘‘ఈ రోజు ప్రేయర్ అయినాక నువ్వు మాట్లాడు’’ అన్నారు మాస్టర్ గారు. సంతోషం, భయం ఒకేసారి కలిగాయి. నా కంగారు అర్థం కాదా! పిలవలేదు. ఊపిరి పీల్చుకున్నా కాని, కొంచెం నిరాశ. తర్వాత జనకులం (తల్లి తండ్రులు స్కూలు తర్వాత పిల్లలకి సంప్రదాయం సంస్కారం నేర్పే వ్యవస్థ)లో పెద్దలకి ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడి కథాభాగం చెప్పమన్నారు. ఎం. ఏ; లో అది మాకు పాఠ్యభాగం కాదు. మాస్టర్ గారికే నమస్కరించుకుని చెప్పాను. అది వాళ్ళకి కాదు నాకు శిక్షణ. వేదవాఙ్మయాన్ని, పురాణేతిహాసాలను, కావ్యాలను శాస్త్రవిజ్ఞానంతో సమన్వయం చేసి, నేటితరానికి పనికి వచ్చే అంశాలని వివరించి, వాటి సార్వకాలీనతను ప్రపంచానికంతటికి వెల్లడించటం మా గురువరేణ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్ధతి. అది శిష్యులలో కొద్దిగానైనా ప్రతిఫలించటం సహజం. ఈ కారణంగా నా సాహిత్య ప్రసంగాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అయ్యాయి. వీలైనంత మందికి మాకు తెలిసిన విషయాలను చెప్పాలనే తపన తప్ప అది ప్రసంగమో, ప్రవచనమో పట్టించుకోలేదు. అందరూ అవి ప్రవచనాలు అని నిర్ధారించారు. అందరూ నన్ను ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త అంటుంటే వింతగా ఉంటుంది. నేను మామూలు గృహిణిని, ఉద్యోగినిని, తల్లిని అంతే! నన్ను అందరూ ఆ విధంగా గుర్తించటానికి నా కుటుంబ సభ్యులు అందరు కారణం. నా పిల్లలు, విద్యార్థులు అడిగే అనుమానాలని తీర్చటానికి మరింత అధ్యయనం చేయవలసి వచ్చింది. అనుకున్న ప్రయోజనాన్ని సాధించాననే అనుకుంటాను. సాధారణంగా ఆడవాళ్ళు ప్రవచనాలు అంటూ బయలుదేరితే ఇంట్లోనే ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది, అనేకరకాలుగా. అటువంటి సమస్య నాకు కుటుంబం నుండి రాలేదు. (ఎవరికీ ఇబ్బంది కలుగని విధంగా జాగ్రత్తలు తీసుకునే దాన్ని.) కాని, బయటి నుండి తప్పవు. ‘‘ఆడవాళ్ళు ప్రవచనాలు చేయటం ఏమిటి?’’,‘‘ముందు ఇల్లు చూసుకో మనండి.’’ ‘‘దీనికి కూడా ఆడవాళ్ళు పోటీకి వస్తే మా సంగతి ఏమిటి?’’ ఇటువంటివి చాలానే విన్నాం. పైగా మగవాళ్లు వినరు ఆడవాళ్ళు చెపితే వినేది ఏమిటి? అని. చేస్తున్నది ధర్మబద్ధం అయితే అటువంటి వ్యాఖ్యలని పట్టించుకో నవసరం లేదు. తల్లిలాగా లాలించినట్టు చెపితే మంచి వైపుకి సమాజం మళ్లుతుంది అనుకుని చెప్పాలి. అలాగే చెబుతున్నాను కూడా!వ్యక్తిత్వ వికాసానికి.. ఆధ్యాత్మిక భావోన్నతికి...– డా. తుమ్మలపల్లి వాణీకుమారివృత్తిరీత్యా నేను అధ్యాపకురాలిని. సుమారు 35 సంవత్సరాల బోధనానుభవంలో నాకు తెలిసినంతవరకు విద్యార్థులకు బోధించగలిగాననే సంతృప్తి నాకు నిండుగా ఉంది. నేను చాలాకాలంగా ప్రసార మాధ్యమాలలో, ఇతర సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నా ప్రవచనాల వైపు మరల లేదు. ఒకసారి రామాయణం గురించి నేను వ్రాసిన పుస్తకాలను చూసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు ‘‘ఇన్ని మంచి విషయాలను వ్రాసిన మీరు ప్రవచనాలను చెప్పకపోవడం ఏమిటి? పైగా హైదరాబాదులో ఉంటూ కూడా!’’ అన్నారు. వారి వాక్ప్రభావమో, దైవసంకల్పమో కానీ తరువాత కొన్ని ఆలయాలలో, ఇతర వేదికలలో ప్రవచనాలకు అవకాశం వచ్చింది. మామూలు సాదం (అన్నం) భగవదర్పితమయితే ప్రసాదమైనట్లు మామూలు వచనం భగవత్సంబంధితమయితే అది ప్రవచనం అవుతుంది. ఆ విధంగా చెప్పేవారికి, వినేవారికి కూడా మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది కాబట్టి నాకు ప్రవచనాల పట్ల మక్కువ కలిగింది. అయితే ప్రవచనాలను వినేవారు పెద్దవారు. ప్రవచనకారులు చెప్పే విషయాల పట్ల కొంత అవగాహన ఉన్నా ఆసక్తిగా వింటారు. చెప్పే విషయాలలో, తీరులో వైవిధ్యం ఉండటమే ఇందుకు కారణమనుకుంటాను. తెలుగు రాష్ట్రాలలో విఖ్యాతులైన ప్రవచనకారులు ఎంతోమంది ఉన్నా, నేను చెప్పినప్పుడు ఆసక్తిగా వినే శ్రోతలు లభించటం నా అదృష్టం. మంచి విషయాలను పదేపదే చెప్పటం వలన చెప్పేవారికి, వినటం వలన వినేవారికి మనసులో నాటుకుపోతాయి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించే స్థైర్యం అలవడుతుంది. నా వరకు ఇది నా వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక భావోన్నతికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.చిన్నప్పుడే పునాది పడింది– ఖుర్షీదా బేగం షేక్నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు. అలా ధార్మిక పుస్తకాలు, ఇస్లాం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, ధార్మిక రచనలు చేస్తూ ఉండటం మూలాన నా జీవితంలో ఆధ్యాత్మికతకు బలంగా పునాది పడింది. ఒక నిజమైన ముస్లిం విశ్వాసి నుండి దైవం ఏమి కోరుకుంటున్నాడో అది చేయడం మాత్రమే నా మోక్షానికి, దైవప్రేమకు, పరలోక జీవిత సాఫల్యానికి మార్గం అని గ్రహించాను. అంతిమ దైవగ్రంథం దివ్య ఖుర్ ఆన్, ప్రవక్త ముహమ్మద్(స) బోధించిన హాదీసు బోధలను, మహాప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవిత చరిత్రను అధ్యయనం చేశాను. అవే నాకు ఆధ్యాత్మిక ప్రేరణ. ఒక విశ్వాసిగా ఇస్లాం అడుగుజాడల్లో నడుస్తున్నా సాటి విశ్వాసులకు ఏదో చేయాలనే తపన ఉండేది.గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉండేవారు. ధార్మిక సమావేశాల్లో వారికి ఖుర్ ఆర్, హాదీసు బోధనలను వివరించేదాన్ని. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా విని, తమకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకునేవారు. మూఢనమ్మకాలు, అజ్ఞానం, నిరక్షరాస్యత, అనాగరిక ఆచార, సంప్రదాయాలు వారిలో ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వాస్తవ బోధనలను వారికి తెలిపి వారి జీవితంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తే వారి ఇహ, పర జీవితాలు అల్లాహ్ కరుణను పొందుతాయని వారి ఇహ, పరలోకాలు ఆదర్శంగా, గౌరవంగా ఉత్తమ, ఉన్నత నైతికతతో ఉండి తద్వారా పరలోకంలో శాశ్వత సాఫల్యం లభిస్తాయని ధార్మిక సమావేశాల్లో వివరించేదాన్ని. నా రచనలు, ప్రసంగాల ద్వారా చాలామంది తమలోని నైతిక రుగ్మతలను దూరం చేసుకొని, ఒక ముస్లిం ఎలా ఉండాలో అలా మారే విధంగా తమను తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. నా జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది.నేర్చుకున్నాను...నేర్పిస్తున్నాను– షకీనా గ్లోరి, సువార్తికురాలునేను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి పట్టణంలో భక్తిగల దైవసేవకుల కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండే మా తల్లిదండ్రులు మాకు బైబిల్ ను బోధించేవారు.‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దానినుండి తొలగిపోడు’’ అని బైబిల్ వాక్యప్రకారం సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వారు మాకు నేర్పించారు. తదనుగుణంగా నేను బైబిల్లో ఉన్న యేసుప్రభువు బోధలకు, వాక్యాలకు ప్రభావితమొందాను.నీతి నియాలు పాటించి బతికితే ఈ లోకంలో బతికినంత కాలం శాంతి–సమాధానం పొందుకుంటాము. ఒకవేళ ఏదో ఒక రోజున కన్నుమూస్తే దేవుడుండే తన రాజ్యానికి చేరుకుంటాము అనే సత్యాన్ని అనేకులకు తెలియజేయాలని, భయంకర సమస్యలకు దేవుడు పరిష్కారమిస్తాడు. మీకు మేళ్లు కలిగిస్తాడు. మిమ్మును ఆదరిస్తాడు. రక్షిస్తాడు. మీ బుద్ధిని మారుస్తాడనే శుభవార్తను అందరికీ అందించాలని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే నేను నా జీవితాన్ని ఈ పనికి అంకితం చేసుకున్నాను.ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని బీఈడీ చేసి పోస్ట్గ్రాడ్యుయేషన్ కూడా కొనసాగించుచున్న నాకు దైవస్వరం వినిపించగా నా శేషజీవితమంతా దేవుని పనిలో వాడబడాలని, ఆశలు అడియాశలైన వారినెందరినో బలపరచి, వారికి ఆనందకరమైన జీవితాన్నందించాలని ఈ సేవలో సాగిపోతున్నాను. మా తండ్రిగారైన జోసఫ్ విజయకుమార్ గారే నాకు ప్రేరణ. చాలా ఒడిదొడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఎదురౌతున్నా మొక్కవోని ధైర్యంతో క్రీస్తుబోధలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. నా కుటుంబానికి, పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ... అందరం సమైక్యంగా ఈ పనిలో ఆనందిస్తుంటాము. నేను అందించిన ఈ బైబిల్ ప్రవచనాలు తమ కన్నీటిని తుడిచాయని, తమలో ధైర్యాన్ని నింపాయని, తమను వెన్నుతట్టి ప్రోత్సహించాయని, మంచిమార్గంలో నడిచేలా సహాయం చేస్తున్నాయని, చెడు వ్యసనాలతో, చెడు బుద్ధులతో ఉన్న తమను విడిపించి, సరిౖయెన, నిజమైన మార్గాన్ని చూపించాయనే సాక్ష్యాలు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంటుటుంది. -
ప్రొటెక్షన్ ప్లీజ్...హెల్త్ చూస్తుంది
కుటుంబ ఆరోగ్యాన్నే కాదు సమాజ ఆరోగ్యాన్నీ రెప్పవేయకుండా కనిపెట్టుకోగలదు స్త్రీ! ఆ ఓపిక, శ్రద్ధ మెడిసిన్ డిగ్రీతో వచ్చినవి కావు.. డీఎన్ఏలో భాగమై వచ్చినవి!వాటి బలంతోనే డాక్టరమ్మగా అలుపులేని సేవలందిస్తోంది.. దేశ ఆరోగ్య నాడి లయ తప్పకుండా చూసుకుంటోంది! కానీ ఆమె సహనాన్ని బలహీనతగా తీసుకుని.. వైద్యరంగంలో ఆమె భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు! అది ప్రభుత్వ వైద్యరంగంలో స్త్రీల ప్రవేశానికి అడ్డంకిగా మారకముందే మేలుకుని.. నాయకత్వ హోదాల్లో మహిళలకు అవకాశాన్ని ఇచ్చి.. భద్రతను కల్పిస్తే... హెల్త్కేర్ సెక్టార్లో సాధికారత సాధ్యం కాదు తథ్యం!→ ఆనందిబాయీ జోషీ ఆమె బాల్యవివాహ బాధితురాలు. వైద్య సదుపాయాల్లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అప్పుడనుకుంది.. మెడిసిన్ చదవాలని! చదివింది.. అదీ అమెరికా, పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజ్లో. అలా చేతిలో మెడిసిన్ డిగ్రీ, మెడలో స్టెత్, దేశ తొలి మహిళావైద్యురాలిగా సొంతగడ్డ మీద అడుగుపెట్టింది. ఆవిడే డాక్టర్ ఆనందీబాయి జోషీ. మన సమాజం ఆమెను ప్రశంసించక పోగా.. తీవ్రంగా విమర్శించింది. వివక్షకు గురైనా వెరవక వైద్యసేవలందించింది. దురదృష్టం.. పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. → డాక్టర్ కాదంబినీ గంగూలీ మన దేశ తొలి మహిళావైద్యుల్లో మరో డాక్టర్.. కాదంబినీ గంగూలీ. యూరప్లో శిక్షణ పొందిన ఆమె మెడికల్ కెరీర్ అంతా దేశంలోని మహిళల ఆరోగ్యం, మాతా.. శిశు మరణాలను అరికట్టే ప్రయత్నానికే అంకితమైంది. → ఇంకా.. ∙మేరీ పూనెన్ ల్యుకోస్ మన తొలి మహిళా గైనకాలజిస్ట్ మేరీ పూనెన్ లుకోస్, దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ సాగడానికి శ్రమించిన కమల్ రణదివే.. వీళ్లంతా స్వాతంత్య్రానికి పూర్వమే తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచారు. వీళ్ల స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం.. దేశంలో క్యాన్సర్ చికిత్సలో సమర్థమైన మార్పులకై కృషి చేసిన డాక్టర్ వి.శాంత, రేడియాలజిస్ట్ డా. కె.ఎ.దిన్షా, కార్డియాలజిస్ట్ డా.పద్మావతి అయ్యర్, డా. నీలమ్ క్లేర్, డా. అజితాచక్రవర్తి, డా. శశి వాధ్వా, డా. కామినీ రావు, డా. ఇందిరా హిందుజా లాంటివాళ్లెందరో వారి వారి విభాగాల్లో రాణించారు. మహిళలకు ఆరోగ్యం పట్ల స్పృహ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పాజిటివ్ నోట్ చూస్తుంటే వైద్యరంగంలో మన మహిళలు ఎంతో ముందుకెళ్లారనే భావన కలుగుతుంది. కానీ అధ్యయనం (2021 ప్రకారం) చేసి లెక్కలు తీస్తే ఆ సంఖ్య 29 శాతమే అని తేలింది. బోర్డ్ మెంబర్స్గా ఉన్నది 17 శాతమే. నర్సింగ్సేవల్లో మహిళల సంఖ్య 80 శాతం. దేశంలోని మొత్తం హెల్త్కేర్ వర్క్ఫోర్స్లో 54 శాతం ప్రైవేట్ వైద్యరంగానిదే వాటా! అందులో కూడా నాయకత్వ హోదాల్లో ఉన్న మహిళల సంఖ్య 30 శాతానికి మించిలేదు. అంతర్జాతీయ స్థాయిలో.. హెల్త్కేర్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్స్ గా రాణిస్తున్న అను ఆచార్య, కిరణ్ మజుందార్ షా, మీనా గణేశ్, డాక్టర్ నందితా షా, నాన్కీ లఖ్విందర్సింగ్, నటాషా పూనావాలా, సునీతా మహేశ్వరి, సమీనా హమీద్, సౌమ్య స్వామినాథన్, డాక్టర్ వి. శాంత సహా తెలుగు వనితలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి లాంటి వాళ్లెందరి పేర్లో వినిపిస్తాయి. వీళ్లంతా తమ రంగాలలో తమ ముద్రను చూపించుకుంటున్నారు.ప్రమాదం అంచున... జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన శారీరక హింసకు గురవుతున్నారు. ఇది హెల్త్కేర్ సెక్టార్లోకీ విస్తరించి మహిళావైద్యులు, నర్సుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది. దీనికి ఉదాహరణ ఇటీవలి కోల్కతా కేజీ కర్ ఆసుపత్రి పీజీ స్టూడెంట్ హత్యాచారమే! ఈ దారుణాలకు కారణం ఆయా విభాగాల్లో నాయకత్వ హోదాలో మహిళల సంఖ్య కనీసం 30 శాతం కూడా లేకపోవడమే. పైస్థాయిలో ఎక్కువమంది మహిళలున్న చోట పనిప్రదేశం భద్రంగా ఉంటుంది. భరోసా పెరుగుతుంది. మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది.ముంబై.. దిక్సూచీ... ఈ విషయంలో ‘దిలాసా క్రైసిస్ సెంటర్’ను ఏర్పాటు ద్వారాదేశానికి మార్గదర్శిగా నిలిచింది ముంబై! ఇది మహిళల మీద హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాన్నెలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సహాయం పొందాలి, ఎలా సహాయం అందించాలి వంటి వాటి మీద ఆసుపత్రుల్లోని సిబ్బందికి శిక్షణనిచ్చింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో వైద్యరంగంలోని మహిళలదే కీలకపాత్ర. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం శూన్యం. అది గ్రహించి ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రైవేట్ రంగం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచి, వచ్చే మహిళా దినోత్సవానికల్లా వైద్యరంగంలో మహిళల విజయగా«థను చెప్పుకునే అవకాశాన్నిస్తాయని ఆశిద్దాం! మహిళలతోనే భరోసానేను మహిళా బాస్ల కిందే పనిచేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా వారితో షేర్ చేసుకుంటాను. వెంటనే స్పందిస్తారు. నేను కూడా నా కింది ఉద్యోగుల విషయంలో అలాగే ఉంటాను. మన బాసులుగా కానీ, కొలీగ్స్గా కానీ మహిళలే ఉంటే ఇలాంటి భరోసా వస్తుంది. అయితే అవకాశాలను వెదుక్కుంటేనే మహిళా శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే ఆటోమేటిగ్గా పని ప్రదేశం విమెన్ ఫ్రెండ్లీగా మారుతుంది. – డాక్టర్ మౌనిక నేలపట్ల అసిస్టెంట్ప్రొఫెసర్, జనరల్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, కామారెడ్డిమేము వారధులంఒక రకంగా మేము ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలాంటి వాళ్లం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి ఆరోగ్యసంరక్షణలో మా పాత్ర ముఖ్యమైనది. వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి కాబట్టి.. భద్రత, రక్షణ వంటి వాటిలో ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అవమానాలూ ఎదురవుతుంటాయి.– జంగం రమాదేవి, ఆశ వర్కర్,పాల్వంచ, కామారెడ్డి జిల్లా. -
అ‘టెన్’షన్ ప్లీజ్...కేర్ తీసుకోండి
ఆమె ఆరోగ్యమే ప్రపంచ భాగ్యంమహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలపై అవగాహనపెరుగుతోంది. మహిళా దినోత్సవాలలో ‘మహిళల ఆరోగ్యం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఇరవైలలో...మున్ముందు ఆరోగ్యాల కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకేందుకు తగిన వ్యాయామాలు చేయాలి. పాల వంటి క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ మున్ముందు ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి → శబ్దకాలుష్యం నుంచి మీ చెవులను కాపాడుకోండి. ఎక్కువ శబ్దంతో వినకుండా మీరు రేడియో, టీవీ, మొబైల్... ఏది వింటున్నా వాల్యూమ్ తగ్గించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి → రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటుంటే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకుని దాన్ని క్రమబద్ధం చేసుకోండి → ఆటల్లో, వ్యాయామాల్లో గాయాలు కాకుండా చూసుకోండి. ఇవ్వాళ్టి గాయాలు భవిష్యత్తులో గండాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడండి → మనం ఏమి తింటున్నామనే విషయంపై దృష్టి సారించండి. ఇవ్వాళ్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే... భవిష్యత్తులో మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులని గుర్తుంచుకోండి → వయసు పెరిగేకొద్దీ నిద్ర తగ్గే అవకాశముంది కాబట్టి వీలైనంత వరకు కనీసం తొమ్మిది గంటలపాటు కంటినిండా నిద్రపొండి. ముప్ఫైలలో...ఈ వయసులో కనిపించే కొద్దిపాటి మార్పులపై దృష్టిసారించండి. → మీ బరువును గమనించండి. మీరు బరువు పెరుగుతున్నారంటే జీవక్రియలు మందగించాయని అర్థం. మొదట్లో కొద్దిగానే పెరిగినట్లు కనిపిస్తున్నా జీవక్రియలు చురుగ్గా జరిగేలా చూస్తూ వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించండి. → చర్మాన్ని రక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. కనీసం 15 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండటం చాలా అవసరం. అది క్యాన్సర్తో సహా పలు చర్మ సమస్యలను కాపాడుతుంది → ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండండి. ఒత్తిడి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు కలుగుతాయి → ఈ వయసులోనే క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలూ, మెడికల్ చెక్అప్స్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది → ప్రెగ్నెన్సీతో వచ్చే ముప్పులను గుర్తుంచుకోండి. ఎందుకంటే... 35 ఏళ్లు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీలతో బిడ్డకు ఎన్నో రకాలుగా ముప్పు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వయసులో గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే తప్పనిసరిగా ఆబ్స్టేట్రీషియన్ను సంప్రదించండి. నలభైలలో...వయసు తాలూకు సంధి దశ అయిన ఈ ఈడులో కనిపించే మార్పులకు సిద్ధంకండి.→ మెనోపాజ్కు ముందుగా కనిపించే ‘పెరీ–మెనోపాజ్’ మార్పులను గమనిస్తూ ఉండండి. ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గడం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్ల మాదిరిగా వస్తున్నాయా, నిద్ర పట్టడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయా, త్వరగా చిరాకుపడటం వంటి మార్పులు కనిపిస్తుంటే పాప్ స్మియర్ పరీక్షతోపాటు పెల్విస్ పరీక్షలు చేయించుకోండి → రొమ్ముక్యాన్సర్కు స్క్రీనింగ్ పరీక్ష మామోగ్రామ్ కూడా చేయించుకోండి → తీసుకుంటున్న ఆహారంపై దృష్టి నిలపండి. మీ జీవక్రియల వేగానికి తగినట్లుగా ఆహారం అందేలా... కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటున్నారా అన్న విషయాన్ని గమనించుకోండి ∙కంటి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చాలారకాల కంటి సమస్యలు ఈ వయసులోనే బయటపడతాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ 40లలోనే కళ్లజోడు ధరించాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించండి → మీ కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నట్లయితే కొలనోస్కోపీకి ΄్లాన్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబ ఆరోగ్య చరిత్రలో జీర్ణ సంబంధమైన సమస్యలున్నవారి లో ఎంత త్వరగా సమస్యను కనుగొంటే అంత ఎక్కువ ప్రయోజనమని తెలుసుకోండి → రక్తంలో చక్కెర మోతాదులెలా ఉన్నాయో చూసుకోండి. చాలావరకు 40 ల లోనే టైప్–2 డయాబెటిస్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది చాలామందిలో ఎలాంటి లక్షణాలూ లేకుండానే వచ్చేందుకు అవకాశమున్నందున ఒకసారి మీ డాక్టర్తో పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు.యాభైలలో...మీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వయసు ఇది.→ మెనోపాజ్ కోసం సిద్ధం కండి. 51 అన్నది చాలామందికి మెనోపాజ్ వచ్చే సగటు వయసు ∙చురుగ్గా ఉండండి. చురుకుదనం తగ్గిపోయే ఈ వయసులో చురుకుదనాన్ని పెంచుకోవడం వల్ల మున్ముందు చాలాకాలం పాటు మరింత ఆరోగ్యంగా ఉండగలరు → ఒకసారి మొత్తం దేహానికి సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకోండి. వీలైతే మీ యాభైలనుంచి ప్రతి రెండేళ్లకోమారు అన్ని బేసిక్ హెల్త్ పరీక్షలూ చేయించుకుంటూ ఉండటం మంచిది. → ఒకసారి ఈసీజీ తీయించుకోండి. సాధారణంగా గుండెజబ్బులు కనిపించేది ఈ వయసులోనే కాబట్టి ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని, మీకు ఎలాంటి గుండెజబ్బులూ లేవని నిర్ధారణ చేసుకుని ఆనందంగా ఉండండి.అరవైలలో...ఈ వయసు... ఆరోగ్యానికి సంబంధించిన మరో దశకు మొదటి మెట్టు.→ ఆహారంలో మరింత పీచు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వయసులో ఆహారంలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల పెద్దపేగుల్లో కండపెరగడం, ఇతరత్రా పెద్దపేగు సమస్యలను రాకుండా నివారించవచ్చు → నడక వంటి వ్యాయామాలు చేయండి. ఈ వయసులో చేసే వ్యాయామాలన్నీ దేహానికి మరింత ఎక్కువ శ్రమ కలిగించనివీ, మరీ తీవ్రమైనవి కాకుండా ఉండేవి అవసరం. వారంలో కనీసం 150 నిమిషాల పాటు దేహానికి మంచి కదలికలు ఉండే వ్యాయామం దొరికేలా చూసుకోండి. దీనివల్ల మీలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కనీసం 15 శాతం తగ్గుతాయి → ఈ వయసులో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ, మామోగ్రామ్ పరీక్షలూ చేయించుకోండి. బరువు పెరగకుండా చూసుకోండి. పెరుగుతున్న బరువు క్యాన్సర్తో సహా అనేక అనారోగ్యాలకు హేతువని గుర్తుంచుకోండి → పెద్ద వయసులో తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ, నిమోనియా వంటివి. → పెద్దవయసులో తీసుకోవల్సిన వ్యాక్సినేషన్ల గురించి తెలుసుకుని, వాటిని తీసుకోవడం వల్ల ఆ వయసులో అవి సోకకుండా జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నప్పుడు వాటిని తట్టుకునేంత సామర్థ్యం వయసు పైబడ్డాక ఉండకపోవచ్చు.డెబ్భైలలో...వయసు పెరగడాన్ని గమనించుకుంటూ... ఆ ఈడుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోండి.→ ఈ వయసులో బాధలను దరిజేరనివ్వకండి. సంతోషంగా గడపడానికి ప్రాధాన్యమివ్వండి. మోకాళ్లు అరగడం వంటివి ఈ వయసులో సాధారణంగా కనిపించే సమస్యలు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్స్ వంటివి ఈ వయసులోనే చేయించుకోండి. మరింత వయసు పెరిగితే అంతగా సాధ్యం కాకపోవచ్చు → ఈ వయసులో కళ్ల సమస్యలు మామూలే. సాధారణంగా క్యాటరాక్ట్ వంటివి ఈ వయసులో కళ్లకు వచ్చే సమస్యలు. వీలైనంత త్వరగా కాటారాక్ట్ సర్జరీ చేయించుకుని సుదీర్ఘకాలం పాటు మీ కళ్లతో ప్రపంచాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేయండి.డాక్టర్ కె. ఉషారాణిసీనియర్ ఫిజీషియన్ ఇలా ప్రతి పదేళ్ల కాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, పది పదుల ఏళ్ల పాటు పదిలంగా ఉండండి. -
పెళ్లి, మంచి ఉద్యోగం, 4 సార్లు ఓటమి : ఐఏఎస్ కాజల్ సక్సెస్ స్టోరీ
గొప్ప గొప్ప కలలు అందరూ కంటారు. కానీ సాధించాలన్న ఆశయం ఉన్నవారు, లక్ష్యంతో పని చేసిన వాళ్లు మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకుంటారు. క్రమశిక్షణ, కఠోరశ్రమ సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధనలో సఫలీ కృతులౌతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాజల్ జావ్లా (Kajal Jawla). పెళ్లి, ఉద్యోగ బాధ్యతలను మోస్తూనే సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచారు. స్ఫూర్తిదాకమకమైన కాజల్ జావ్లా సక్సెస్ గురించి తెలుసుకుందామా!కాజల్ జావ్లా ఉత్తరప్రదేశ్లోని మధురలో 2010లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE) పట్టా అందుకుంది. ఆ తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం. రూ.23 లక్షల వార్షిక ప్యాకేజీ. ప్రేమించే భర్త. అందమైన కుటుంబం. కానీ ఐఏఎస్ కావాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే భర్తతో మాట్లాడి, ఆయన మద్దతుతో ఐఏఎస్ కావాలనే తన సంకల్ప సాధనకు నడుం బిగించింది. ఫుల్టైమ్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం నుండి బయటపడి తన సహోద్యోగులు అంతా చిల్ అవుతోంటే కాజల్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేది. అలా తొమ్మిదేళ్ల పాటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగింది.దేశంలోని అత్యంత గౌరవనీయమైన సివిల్ సర్వెంట్ల ర్యాంకులకు ఎదగాలనే అచంచలమైన సంకల్పంతో పగలూ రాత్రి కష్టపడింది. కానీ అనుకున్నది సాధించేందుకు నాలుగు సార్లు నిరాశను, ఓటమిని భరించాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయింది. అయినా పట్టుదల వదలకుండా ఓర్పు, దృఢ సంకల్పంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు సిద్ధమైంది. ఐదోసారి UPSC 2018 పరీక్షలో 28వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంతో ఆమె కలలు నిజమయ్యాయి.భర్త మద్దతు2012లో 24 సంవత్సరాల వయసులో ఆమె UPSC సన్నాహాలు మొదలు పెట్టింది. ఆమె మొదటి ప్రయత్నం సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు, 2014 ,2016లోనూ అదే రిజల్ట్. ఈ కాలంలో, కాజల్ ఉద్యోగాలు మారడం వివాహం జరిగింది. భర్త ఆశిష్మాలిక్తో తన దీర్ఘకాలిక ఆశయాన్ని వెల్లడించింది. ఆయనిచ్చి సపోర్ట్తో గత వైఫల్యాల గురించి ఆలోచించ కుండా, చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది.ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో పనిచేసే భర్త ఆశిష్ మాలిక్ సంపూర్ద మద్దతునిచ్చాడు. ఇంటిపనుల ఉంచి మినహాయింపు నిచ్చి, భర్త తన ప్రిపరేషన్కు తగిన సమయం కల్పించారని స్వయంగా కాజల్ ఒక సందర్భంగా తెలిపింది. అంతేకాదు ‘ఢిల్లీలో ఒక చిన్న ఇంట్లో ఉండవాళ్లం కాబట్టి. ఇంటి పనులు తక్కువగా ఉండేవి. ఎక్కువ వంట హడావిడి లేకుండా, ఫ్యాన్సీ భోజనాలకు సాధారణ కిచిడీ లేదా సలాడ్లతో పరిపెట్టు కునే వాళ్లం. తద్వారా ఎక్కువ టైమ్ ప్రిపరేషన్కు దొరికేది. ఇంటిని అద్దంలా ఉంచుకోవడం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. పెళ్ళయ్యాక కూడా బ్యాచిలర్స్గా బతికాం’ అని చెప్పింది. ఎక్కువ సెలవులు కూడాతీసుకోకుండా, వార్షిక సెలవులను వాడుకుంది. ప్రిలిమ్స్కు ఒక వారం ముందు సెలవు 'మెయిన్స్' కోసం 45 రోజుల, పెర్సనల్ టెస్ట్కి వారం రోజులు మాత్రమే సెలవు తీసుకుంది. ప్రారంభంలో తన వైఫల్యాలకు కారణం సమయం లేకపోవడమేనని కాజల్ చెప్పింది. ‘సమయం చాలా కీలకం. ప్రిపరేషన్కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేక పోవడమే.’ అంటూ తన అనుభవం గురించి చెప్పింది. ఓటమికి తలవంచకుండా, వైఫల్యానికి గల కారణాలను సమీక్షించుంటూ అచంలచమైన పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన కాజల్ తనలాంటి వారెందరికో ప్రేరణగా నిలిచింది. -
జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025’ ఇంట్రస్టింగ్ సంగతులు
జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025‘జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025’ (Gender Equality Strategy 2022-2025 ) పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ది గ్లోబల్ కాంటెక్ట్స్–క్రైసిస్ అండ్ ఆపర్చునిటీ, వాట్ వుయ్ హ్యావ్ లెర్న్డ్, అవర్ పార్ట్నర్షిప్స్, డైరెక్షన్స్ ఆఫ్ చేంజ్, అవర్ ప్రయార్టీస్, త్రీ ఎనేబ్లర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫర్మేషన్... అనే అధ్యాయాలు ఉన్నాయి.‘మనం ముఖ్యంగా రెండు విషయాల గురించి ఆలోచించాలి. లింగ సమానత్వం దిశగా పురోగతి ఎందుకు నెమ్మదిగా, చెల్లాచెదురుగా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి? అయితే ఎంత జటిలమైన సవాలు అయినా కొత్త అవకాశాలను అందిస్తుంది. కొత్త వ్యూహాలు రూపొందించుకునేలా చేస్తుంది’ అంటూ కార్యాచరణ ప్రణాళికకు ముందు మాట రాశాడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యుఎన్ డిపి) అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్. ‘సమ’ దారిలో ‘సగం’ దూరంలక్ష్యం కూడా విత్తనంలాంటిదే. విత్తే ముందు దాని విలువ అంతగా తెలియకపోవచ్చు. ‘అది ఎప్పుడు మొలకెత్తాలి? ఎప్పుడు చెట్టు కావాలి?’ అనే నిరాశ కూడా ఎదురు కావచ్చు. అయితే విత్తనం ఎప్పుడూ ఫలాన్ని వాగ్దానం చేస్తుంది. విత్తనంలాగే లక్ష్యం కూడా ఫలితాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ‘విమెన్స్ ఈక్వాలిటీ 2030’ లక్ష్యం ఎంతో ఆశను రేకెత్తించడంతో పాటు ఎప్పటికప్పుడూ చర్చనీయాంశంగా ఉంటూ వస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే ముందు సవాళ్లు, సమస్యలపై అవగాహన ఉండాలి. విమెన్ అండ్ యూనైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్ రి΄ోర్ట్ జెండర్ ఈక్వాలిటీకి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది..నాయకత్వంలో మహిళల కొరత : పార్లమెంటరీ సీట్లలో 27 శాతం, స్థానిక సీట్లలో 36 శాతం, మేనేజ్మెంట్ పదవుల్లో 28 శాతం మహిళలు మాత్రమే ఉండడంతో సమగ్ర విధాన రూపకల్పనకు ఆటంకం కలుగుతోంది. భిన్న అభిప్రాయాల కొరత కనిపిస్తోంది.పేదరికం : 2030 నాటికి 34 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతారని అంచనా. ప్రపంచ మహిళా జనాభాలో 8 శాతం మంది రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు.పని ప్రాంతంలో వివక్ష–అసమానతలు: పురుషులలో 91 శాతం మందితోపోల్చితే మహిళల్లో 61 శాతం మంది మాత్రమే శ్రామిక శక్తి(లేబర్ ఫోర్స్)లో ఉన్నారు. ఇది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి రెండిటినీ ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే శ్రమ ద్వారా మహిళలు తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు.అసమతుల్యత: పనిచేసే వయసులో ఉన్న సుమారు 2.4 బిలియన్ల మహిళలకు సమాన ఆర్థిక అవకాశాలు లభించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మహిళలకు పురుషులతో సమానమైన ఆర్థిక హక్కులు లేవు. వేతనం లేని సంరక్షణ(అన్పేయిడ్ కేర్ వర్క్)లో మహిళలు, పురుషులు గడిపే సమయం మధ్య అంతరం కొద్దిగా తగ్గుతుంది. కానీ 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే 9.5 శాతం ఎక్కువ సమయం(రోజుకు 2.3గంటలు) వేతనం లేని సంరక్షణ పనిలో గడుపుతారు. ఈ నిరంతర అంతరం విద్య, ఉపాధి, ఇతర అవకాశాలలో మహిళల భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది.సామాజిక కట్టుబాట్లు – సాంస్కృతిక ఆచారాలు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు యువతులలో ఒకరికి పద్దెనిమిది ఏళ్లు నిండక ముందే పెళ్లి జరుగుతుంది.విద్య-ఆరోగ్యం: 2030 నాటికి 110 మిలియన్ల మంది బాలికలు, యువతులు స్కూల్కు దూరంగా ఉంటారని అంచనా.ఆహార అభద్రత: 2030 నాటికి దాదాపు 24 శాతం మంది మహిళలు, బాలికలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కోనున్నారని అంచనా.హింస: ప్రతి సంవత్సరం 245 మిలియన్ల మంది మహిళలు, బాలికలు భర్త, సన్నిహితుల ద్వారా శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. వృద్ధ పురుషులతో పోల్చితే వృద్ధ మహిళలు ఎదుర్కొంటున్న పేదరికం, హింస ఎక్కువ.నిదుల కొరత: లింగ సమానత్వం గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణకు తగినంత నిధులు లేవు. కేవలం నాలుగు శాతం మాత్రమే లింగ సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై కేటాయిస్తున్నారు. 2030 నాటికి లింగ సమానత్వాన్ని సాధించడానికి అవసరమైన అదనపు పెట్టుబడి సంవత్సరానికి 360 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.అమలు చేయని చట్టాలు: కనీసం 28 దేశాలలో వివాహం, విడాకులకు సంబంధించి మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు లేవు. 67 దేశాలలో మహిళలపై ప్రత్యక్ష, పరోక్ష వివక్షను నిషేధించే చట్టాలు లేవు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చట్టాలు ఉన్న చోట సమర్థవంతమైన అమలు సవాలుగా ఉంది........‘సవాళ్లు, సమస్యల సంగతి సరే, ఇప్పటి వరకు మనం ఏర్పర్చుకున్న లక్ష్యాల వల్ల ఏ మేరకు పురోగతి సాధించాం?’ అనే ప్రశ్న వేసుకుంటే జవాబు కొంత ఆశాజనకంగా ఉంటుంది. అంతర్జాతీయ నియమాల (ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్) వల్ల కొన్ని రంగాలలో మెరుగుదల కనిపిస్తుంది. బాల్య వివాహాలు కొంత మేరకు తగ్గిపోయాయి. ఇది చిన్న ఆశా రేఖ మాత్రమే.‘కోవిడ్లాంటి విపత్తుల వల్ల 2030 లక్ష్యం మనుపటి కంటే మరింత దూరంలో ఉంది’ అనే మాట వినబడుతుంది. 2030 లక్ష్యాలకు సంబంధించి చాలా రంగాల్లో పురోగతి మందకొడిగా సాగుతుందని, బాల్యవివాహాలు పూర్తిగా కనిపించకుండా చేయడానికి, చట్టపరమైన రక్షణ (లీగల్ ప్రొటెక్షన్)లో అంతరాలను పూడ్చడానికి, వివక్ష పూరిత చట్టాలను తొలగించడానికి, పని ప్రాంతంలో అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సమాన ప్నిధ్యం కల్పించడానికి, పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యం సాధించడానికి పట్టే కాలం... సుదీర్ఘ కాలం అంటున్నారు. ‘2030 లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టి కృషి, నిధుల పెంపుదల అవసరం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కీలకమైనదే’ అంటుంది యూఎన్ రిపోర్ట్. -
Kanyasulkam నాకు నచ్చిన పాత్ర మధురవాణి-ఓల్గా
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే. -
అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి..
భారతదేశంలో గురువులను దేవుడిగా పూజిస్తారు. తల్లిదండ్రుల తర్వాత పూజ్య స్థానం గురువులదే. అలాంటి గురువు మనసుని దోచిన విద్యార్థినే ఐఏఎస్ సాధించి ఆనందాన్ని కలిగించింది. చిన్నతనంలో తండ్రి మరణంతో చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అదే తన బతుకు జీవనానికి బలమైన ఆయుధమని నమ్మింది. చివరికి ఓ మహోన్నత గురువు సాయంతో అనితర సాధ్యమైన యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటింది. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే పేదరికం అడ్డంకి కాదని నిరూపించి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్వ తన్వర్ చిన్నప్పటి నుంచి మంచి తెలివైన విద్యార్థి. చాలా మెరిట్ స్టూడెంట్. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అతి పెద్ద విషాదాన్ని ఎదుర్కొంది. ఇంటి పెద్దదిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలా రోడ్డునపడుతుందో పసివయసులోనే తెలుసుకుంది. నిత్యం చుట్టుముట్టే ఆర్థిక కష్టాలు చదవాలనే ఆలోచనను చెరిపేస్తున్నా..మొండి పట్టుదలతో చదువును సాగించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా..తన ఆనందం మొత్తం చదువులోనే వెతుక్కునేది దివ్య. అదే తన కష్టాలను దూరం చేసే వజ్రాయుధమని బలంగా అనుకునేది. ఎంతటి దీనస్థితిలో బాధలు అనుభవిస్తున్నా సరే ఎక్కడ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అలా దివ్య ప్రాథమిక విద్యను మహేంద్రగఢ్లోని నవోదయ విద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత మహేంద్రగఢ్లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి బి.ఎస్సీ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్పై దృష్టి పెట్టింది. ఆఖరికి సివిల్స్ ప్రిపేరయ్యే తాహత లేకపోయినా..గురువుల మన్ననలతో వారి సాయంతో కోచింగ్ తీసుకుంది. సాధ్యం కాదనిపించే సమస్యల నడుమ వెనకడుగు వేయని ఆమె పట్టుదల ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో విజయం సాధించేలా చేసింది. తొలి ప్రయత్నంలోనే 438వ ర్యాంకు సాధించింది. అఅయితే తాను అనుకున్నట్లు ఐఏఎస్ పోస్ట్ సాధించలేకపోయింది. దీంతో మరోసారి ప్రయత్నించి ఏకంగా ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్ అధికారిణి అయ్యింది. అంతేగాదు దేశంలోని అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తికి ప్రియమైన విద్యార్థి అట. చాలామంది విద్యార్థులు ఆయనే రోల్ మోడల్. అంతలా విద్యార్థులను ప్రభావితం చేసే గురువు వికాస్కి ఎంతో ఇష్టమైన విద్యార్థి ఈ దివ్య తన్వర్.(చదవండి: 'సెలబ్రిటీ అట్రాక్షన్గా పంచకట్టు దోశ') -
దారి చూపే చుక్కాని
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ల్యాబ్లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.– డా. సెరెజో శివ్కర్, శాస్త్రవేత్త -
కెరీర్లో పీక్లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ ఊహగానాలను కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా? స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్లో తన తొలి సీరియల్తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస, విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ను ప్రారంభించి, నవ్య పేరుతో పాపులర్ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే షోలో టైటిల్ రోల్లో నటించింది. 2013లో MTV వెబ్బెడ్ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్లో పీక్లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్ను వెస్టిన్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ రిసార్ట్లో వివాహం చేసుకుంది తరువాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక కొడుకు ఐడెన్ పుట్టాడు.ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా కూడా చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో చచ్చిపోదామనుకున్నా. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది. చివరికి పెళ్లైన రెండేళ్లకు 2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. మరోవైపు ఈ కష్టకాలంలో సౌమ్య సేథ్కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్మీడియా పోస్ట్ ద్వారా చెప్పింది సౌమ్య.సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ ఆమె ధైర్యానికి, దృఢత్వానికి చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది. -
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది. -
తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట -
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నిందితురాలిగా ఉన్న చందా కొచ్చర్ కొత్త జర్నీని ప్రారంభించారు. ఐసీఐసీఐబ్యాంక్ సీఎండీగా ఉన్నపుడు చందా కొచ్చర్ క్రిడ్ప్రోకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్త దీపక్ కొచ్చర్తో సహా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం భర్తతో పాటు బెయిల్పై ఉన్న చందా కొచ్చర్ సోషల్ మీడియాలో సంచలనం రేపేందుకు సన్నద్ధమయ్యారు. యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ 'జర్నీ అన్స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్' ను లాంచ్ చేశారు. ఎలాంటి పరిణామాన్నైనా ఎందుర్కొనేందుకు ద్ధంగా ఉన్నాననీ, తన పాడ్కాస్ట్ చాలా విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. జెన్ జెడ్ కి ఇష్టమైన మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్న చందాకొచ్చర్ పాడ్కాస్ట్పై కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.'జర్నీ అన్స్క్రిప్టెడ్' అనే పాడ్కాస్ట్ను చందా కొచ్చర్ ప్రారంభించారు. స్వయంగా తాను ఎంతో రీసెర్చ్ చేసి, అతిథులను స్వయంగా ఎంచుకుంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పారు. నెలకు మూడు పాడ్కాస్ట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ కొత్తది నేర్చుకోవడం, మార్పుతోపాటు ముందుకు సాగడం ఈ రెండే తన లక్ష్యాలని ఆమె చెప్పారు. ఈ షోలో ఆమె తొలి అతిథి మారికో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా. రెండో గెస్ట్గా నటుడు రాబోతున్నారని కూడా హింట్ ఇచ్చారు. కానీ ఆ గెస్ట్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఈ పాడ్కాస్ట్ను స్వతంత్ర కంటెంట్, డిజైన్ ఏజెన్సీ ‘ది సాల్ట్ ఇంక్’ రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. కాగా 1984లో ICICI బ్యాంక్లో చేరారు చందాకొచ్చర్. 2009లో బ్యాంకు ఎండీ, సీఈవో అయ్యారు. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకులు లాభాల పరుగులు పెట్టించి గోల్డెన్ గర్ల్గా ప్రశంస లందుకున్నారు. 2010లో ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశీయ అత్యంత గౌరవనీయమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ సహా, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.Thoroughly enjoyed this insightful debut podcast by Chanda Kochhar and one of my favorite people @hcmariwala. So many valuable learnings which Harsh has generously shared from his life experiences! Hear the full podcast in https://t.co/Tf2Ax3n8w1 . Some snippets here… pic.twitter.com/dwnkKVeH93— Harsh Goenka (@hvgoenka) February 16, 2025 2017లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించినప్పుడు ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు రూ.3,250 కోట్ల విలువైన రుణాల కేటాయింపు విషయంలో బ్యాంకు సీఎండీ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2019లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్కు రూ.300 కోట్లు ఇచ్చాన మంజూరు కమిటీలో కొచ్చర్ భాగమని, చివరకు ఆ కంపెనీ దానిని చెల్లించడంలో విఫలమైందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకోలో కొచ్చర్ భాగమని సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్కు రూ.300 కోట్ల రుణం క్లియర్ అయిన ఒక రోజు తర్వాత దీపక్ కొచ్చర్ కంపెనీ నుపవర్ రెన్యూవబుల్స్లో వీడియోకాన్ రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది. -
వసంత యోగం
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి. హైదరాబాద్ అమీర్పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్లోని యోగా ఇన్ స్టిట్యూట్లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు. తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సాధించింది. ఆరోగ్య భారత్ కోసం....రికార్డ్లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం. – వసంతలక్ష్మి – నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/ కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్ -
గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్ -
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్న్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారతీయ మహిళకు చోటు..!
టైమ్స్ విడుదల చేసిన 2025 విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఒకే ఒక్క భారతీయ మహిళకు చోటు దక్కింది. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణులు సంరక్షణాధికారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ నిలిచింది. ఈ జాబితాలో నటి నికోల్ కిడ్మాన్, ఫ్రాన్కు చెందని గిసెల పెలికాట్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఏకైక భారతీయ మహిళగా నిలిచిన పూర్ణిమా దేవి బర్మాన్కి ఇంత పెద్ద గుర్తింపు ఎలా లభించింది..? ఆమె ఏం చేశారంటే..అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. ఆమెకు చిన్నప్పటి నుంచి పక్షులంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను జంతుశాస్త్రంలో పీహెచ్డీ చేసేందుకు దారితీస్తుంది. ఆ సమయంలోనే గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయని తెలుసుకుని కలవరపడింది. దీన్ని నివారించడానికి తన వంతుగా ప్రయత్నం చేయాలనుకుంది. అలా పూర్ణిమ తన పీహెచ్డీ పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతున్నాయని గుర్తించింది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు.ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకొచ్చేలా పూర్ణిమ ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. దీంతో చిన్నగా మార్పు మొదలవ్వడం ప్రారంభమైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారు చేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ.తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేయడం వంటివిచ చేసింది ఈ హర్గిల ఆర్మీ. ఈ నెట్వర్క్ అస్సాం నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాల తోపాటు కంబోడియాకు వరకు విస్తరించింది. చివరికి ఫ్రాన్స్ వరకు వెళ్లడమే గాక అక్కడ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఈ పక్షుల గురించి బోధించడం వంటివి చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా ఈ ఆర్మీ సభ్యులు నేసినవే. ఎందుకంటే వాటి వల్లే వారి జీవనోపాధి కలుగుతుంది. ఇలా పూర్ణిమ ప్రకృతిని కాపాడటమే గాక..అంతరించిపోతున్న పక్షి జాతి కోసం గ్రామీణ మహిళలతో హర్గిల ఆర్మీనిని ఏర్పాటు చేసి అంతిరించిపోతున్న కొంగల జాతి వృద్దికి కృషి చేసింది, అలాగే గ్రామీణ మహిళలకు వాటితోనే జీవనోపాధిని కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే టైమ్స్ పూర్ణిమ కృషని గుర్తించి ఈ ఏడాది ఉమన్ ఆఫ్ది ఇయర్ జాబితాలో చేర్చి గౌరవించింది. టైమ్స్ మ్యాగ్జైన్ ప్రతి ఏడాది ఉమన్ ఆఫ్ ది ఇయర్ జాబితాను విడుదల చేస్తుంది . హిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల మధ్య మెరుగైన ప్రపంచం కోసం కృషి చేసే శక్తిమంతమైన మహిళలను గుర్తించి ఇలా విమెన్ ఆఫ్ది ఇయర్ జాబితాలో చోటు కల్పించి గౌరవిస్తుంది. కానీ ఈ ఏడాది పర్యావరణ పరంగా మన భారతీయ జీవశాస్త్రవేత్త బర్మాన్ ఆ గౌరవాన్ని దక్కించుకుంది. (చదవండి: అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..) -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
గిరిజన పిల్లల కోసం ఆ టీచర్ ప్రాణాలనే..!
‘ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు. చావడానికి కాదు’ అని ఎంతోమంది అన్నలక్ష్మితో అనేవారు. ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి? కేరళలోని చిన్నార్ అభయారణ్యంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం తయ్యన్నన్కుడిలోని ఏకైక అంగన్వాడీలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.అన్నలక్ష్మి ఉద్యోగ జీవితం రిస్క్, సాహసంతో కూడుకున్నది. వారం రోజుల క్రితం అటవీమార్గంలో జనావాసాలకు వచ్చిన అడవి ఏనుగు నుంచి తృటిలో తప్పించుకుంది. కొన్ని రోజుల క్రితం అదే ఏనుగు ఒక గిరిజనుడిని తొక్కి చంపేసింది. అయినప్పటికీ అన్నలక్ష్మి ఎప్పుడూ భయపడలేదు.విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి గత పదిహేడు సంవత్సరాలుగా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రయాణ మార్గంలో జంతువుల అడుగు జాడలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడవి ఏనుగులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పెద్ద పెద్ద రాళ్లు, చెట్ల వెనుక దాక్కొని తప్పించుకుంది.38 ఏళ్ల అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగం అయ్యాయి. స్థానిక ముత్తువన్ భాషను అనర్గళంగా మాట్లాడే అన్నలక్ష్మి గిరిజన ప్రజలకు ప్రియమైన ఉపాధ్యాయురాలు.‘పిల్లలు ఇంట్లో కంటే టీచర్ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు’ అంటుంది ఒక గిరిజన తల్లి.‘ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వారే వెలుగు’ అంటుంది అన్నలక్ష్మి. (చదవండి: మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!) -
ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..
దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్ విమెన్ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్ దీక్షిత్. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్కి. ఇక వినోద్ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సభ్యుడు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై 11, 1962న షీలా వినోద్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ టిప్స్..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....) -
ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్
కేరళ మన దేశంలో మొదటి మహిళా స్కూబా టీమ్ను సిద్ధం చేసింది. అగ్నిమాపక దళం నుంచి ఎంపిక చేసిన వారితో ఈ టీమ్ను తయారు చేసి ఇక పై వరద ప్రమాదాల్లో వీరి సేవను వినియోగించనుంది.‘గన్నెట్స్’(The Gannets)... ఇదీ కేరళ(Kerala) అగ్నిమాపక శాఖ(Fire Department) తన ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ టీమ్కు(All Women Scuba Diving Team) పెట్టిన పేరు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో సముద్రపు లోతుకు దూసుకెళ్లి చేపలను నోట కరుచుకుని ఎగిరే పక్షులే ‘గన్నెట్స్’. ఇకపై కేరళలో ఏవైనా జల ప్రమాదాలు సంభవిస్తే ఈ గన్నెట్స్ దూసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. వీరి మొత్తం సంఖ్య 17. ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ముగించుకొని ఈ టీమ్ మంగళవారం బాధ్యతల్లోకి వచ్చింది. భారతదేశంలో అందరు మహిళల స్కూబా రక్షణ దళం ఇదే.100 మంది నుంచి...కేరళలో వానకాలంలో ఊహించని వరదలు సర్వసాధారణంగా మారాయి. మనుషుల్లో నీళ్లల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే సామర్థ్యం ఉన్న స్కూబా డైవర్స్ ఉండాలని ప్రభుత్వం భావించింది. అయితే వారు ఎందుకు స్త్రీలు కాకూడదు అని ప్రశ్నించుకుంది. అగ్నిమాపక శాఖ నుంచి 100 మంది మహిళలను ఎంపిక చేస్తే వారిలో 17 మంది అన్ని విధాలుగా అర్హులుగా నిలిచి ట్రైనింగ్కు ఎంపికయ్యారు.కఠినమైన ట్రైనింగ్కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అకాడెమీలో ఈ మహిళా సభ్యుల శిక్షణ 21 రోజుల పాటు జరిగింది. స్కూబా డైవింగ్తోపాటు నదులు, చెరువులు, సముద్రాల్లో నీటి స్వభావాన్ని బట్టి ఎలా రక్షణ చర్యలు చేపట్టాలో నేర్పారు. అండర్వాటర్ కెమెరాలు వాడటం కూడా ఇందులో భాగం.]వీరికి 30 మీటర్ల లోతుకు వెళ్లి రక్షించడం నేర్పారు. ‘ట్రైనింగ్ మాకు మొదట్లో కష్టమైంది. కాని అన్ని దశలను దాటగలిగాం. ఇప్పుడు మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల సేవకు సిద్ధం’ అని ఈ టీమ్లోని మహిళలు అన్నారు. ఈ కొత్తశక్తికి స్వాగతం. (చదవండి: చాట్ జీపీటీ బామ్మ..! ఆమె అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్) -
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్బాట్ అయిన ‘చాట్జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..) -
గర్భిణి అని జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..
ఓ ప్రెగ్నెంట్ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతి ఇవ్వాల్సిందిగా తన బాస్ని అభ్యర్థించింది. అనుమతి మంజూరు చేయకపోగా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగంలో తొలగించాడు. కేవలం ఆమె కడుపుతో ఉన్నందుకే ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో ఆమె ఉపాధి ట్రిబ్యూనల్ కోర్టుని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం సదరు కంపెనీకి దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏమని తీర్పు ఇచ్చిందంటే.యూకేకి చెందిన ప్రెగ్నెంట్ మహిళ పౌలా మిలుస్కా తాను ఇంటి నుంచి పనిచేస్తానంటూ బర్మింగ్హామ్లోని తన కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ని అభ్యర్థించింది. తన కంపెనీ హెడ్ అమ్మర్ కబీర్కి టెక్స్మెసేజ్లో తన సమస్యలను వివరిస్తూ కోరింది. గర్భిణిగా ఉన్నప్పుడూ మహిళలకు ఉండే మార్నింగ్ సిక్నెస్(వికారం, వాంతులు) తదిరతర కారణాల దృష్ట్యా మహిళా ఉద్యోగి మిలుస్కా వర్క్ ఫ్రమ్ ఇవ్వాల్సిందిగా తన బాస్ని కోరింది. అందుకు ప్రతిగా కబీర్ నిన్ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నాం అంటూ జార్జ్ హ్యాండ్స్తో కూడిన ఎమోజీలతో అవమానిస్తున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. మిలుస్కా తన బాస్ నుంచి వచ్చిన ఈ అనుహ్యమైన ప్రతిస్పందనకి దిగ్బ్రాంతి చెందుతుంది. ఆమె ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్. అక్టోబర్ 2022లో తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత నుంచి గర్భిణి మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలనే ఫేస్ చేసింది.వీటిని తట్టుకోలేక తాను ఇంటి నుంచే పనిచేయాలని భావించి తన కంపెనీ బాస్కి తన సమస్యను వివరిస్తూ..మెసేజ్ పెట్టింది. అయితే అతడి నుంచి ఇలా ఊహించిన విధంగా సమాధానం రావడంతో జీర్ణించుకోలేకపోయింది మిలస్కౌ. దాంతో ఆమె యూకే ఉపాధి ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. తాను గర్భంతో ఉన్నాన్న కారణంతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కోర్టుకి విన్నవించుకుంది. అయితే న్యాయస్థానం ఈ కేసుని విచారించి ఆమె తగిన పరిహారం మంజురయ్యేలా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కోర్టు ఇరువురి మధ్య జరిగిన సంభాషణను విచారించి.. కేవలం ఆమె గర్భిణి కావడంతోనే ఉద్యోగం నుంచి నిర్థాక్షిణ్యంగా కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ తొలిగించినట్లు తేల్చింది. అయితే సదరు కంపెనీ వ్యాపార ఇబ్బందులు, కార్యాలయంలో ఉద్యోగి అవసరం తదితరాల దృష్ట్యా టెక్స్ట్ మెసేజ్ ద్వారా తొలగించామే గానీ మరే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చింది. అయితే అదంతా కేవలం సాకు మాత్రమే అంటూ కొట్టిపారేసింది ట్రిబ్యూనల్. అంతేగాదు బాధిత మహిళ మిలుస్కాకు అన్యాయానికి పరిహారంగా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ట్రిబ్యూనల్ పేర్కొంది.(చదవండి: ఢిల్లీ తొక్కిసలాట ఘటన: ఆ ఐదుగురు మృతికి కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!
సాహాసయాత్రలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్ ఎస్ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్ హార్న్ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. అంతేగాక ఈ మిషన్ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు. In persistent rains, Sea State 5, winds of 40kns (~75 kmph) and waves more than 5 metres, Lt Cdr Dilna K & Lt Cdr Roopa A, recorded their names in the annals of history by successfully crossing the #CapeHorn located at the southern tip of #SouthAmerica, while sailing on the third… pic.twitter.com/N1isyvHGMA— SpokespersonNavy (@indiannavy) February 15, 2025 (చదవండి: ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?) -
వీణల విందుగా...
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతోంది.‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్లో సర్టిఫికెట్ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్వర్మ ప్రశంసలు అందుకుంది. వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ధ్యానం లాంటి వీణవీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. – అప్పికట్ల దీప్తి – అంబటి శేషుబాబు సాక్షి, మచిలీపట్నం -
ఫలితాలకు షార్ట్కట్స్ ఉండవు!
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...‘మా వర్క్లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.మందుల పనితీరుపై పరిశోధనలుకార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్డి స్టూడెంట్స్తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం. పాతికేళ్ల ప్రయాణంఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను. ప్రతి నిమిషమూ విలువైనదేఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కు బ్లడ్ లెవల్స్లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి. క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి. – డాక్టర్ పింగళి ఉషారాణి – నిర్మలారెడ్డి -
సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్లుగా..
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు. అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు. అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది. అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్గా నియమితురాలైంది.ఐపీఎస్ సుష్మితా రామనాథన్చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్లో సక్సెస్ అయ్యింది. ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. (చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..) -
పీఎమ్ఈజీపీ రుణాలు..: పెన్నుల నుంచి పాలిమర్స్ దాకా...
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్ఈజీపీ పోర్టల్లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి. అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేసింది. యాంకర్గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
ఆమెపై చెయ్యెత్తడమా?
‘స్త్రీలపై హింస చేయడం తప్పు’ అని భావించేవారు కూడా సినిమాల్లో హీరోయిన్ని హీరో లాగిపెట్టి కొడితే క్లాప్స్ కొడతారు. ఇలా కొట్టే సన్నివేశాలు యువత మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో హీరోలు పెద్దగా ఆలోచించరు– కథకు అవసరమైనా కాకపోయినా. కాని అమోల్ పాలేకర్ మాత్రం నలభై ఏళ్ల క్రితం కొట్టిన చెంపదెబ్బకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ లో తన పుస్తకం ‘వ్యూఫైండర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆ ఉదంతాన్ని ప్రస్తావించాడు.‘నేను ప్రధానంగా చిత్రకారుణ్ణి. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని నా కాబోయే భార్య చిత్ర ఆ రోజుల్లో నాటకాలు వేస్తుంటే తోడుగా రోజూ వెళ్లేవాణ్ణి. అప్పుడు నాటక గురువు సత్యదేవ్ దూబే నాతో ‘నా తర్వాతి నాటకంలో వేషం ఇస్తాను చెయ్. నీలో ఏదో టాలెంట్ ఉందని ఆఫర్ చేయడం లేదు. బాగా ఖాళీగా ఉంటున్నావని ఇస్తున్నాను’ అన్నారు. అలా నాటకాల్లోకి... తర్వాత సినిమాల్లోకీ వెళ్లాను. నాటకాల్లో చేయడం వల్ల రిహార్సల్స్ చేసి నటించడం నాకలవాటు. అయితే ‘భూమిక’ (1977) సినిమాలో ఒక సన్నివేశంలో తనకు కావలసిన ఎక్స్ప్రెషన్ స్మితాపాటిల్ ఇవ్వడం లేదని దర్శకుడు శ్యామ్ బెనగళ్ నన్ను పక్కకు పిలిచి– టేక్లో ఆమెను లాగిపెట్టి కొట్టు అన్నారు. అలాగే సార్.. రిహార్సల్కు ఆమెను రమ్మన మనండి అన్నాను. ఆమెకు ఈ సంగతి నేను చెప్పలేదు... నువ్వు నిజంగా కొట్టాలి అన్నారు. నేను షాక్ అయ్యాను. లేదు సార్... అలా చేయను. స్త్రీలపై చెయ్యెత్తడమే తప్పు. యాక్టింగ్ కోసం చేయొచ్చు. కాని నిజంగా చేయమంటే చేయను అన్నాను. ఆయన ఊరుకోలేదు. ‘‘ఇది నా ఆర్డర్. చేస్తావా చేయవా’’ అన్నారు. ఇక నేను ధైర్యం కూడగట్టుకున్నాను. టేక్ మొదలైంది. స్మితాపాటిల్ అద్భుతంగా నటిస్తోంది. సరిగ్గా దర్శకుడు కోరిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన సమయంలో ఆమెను లాగిపెట్టి కొట్టాను. స్మిత స్థాణువయ్యింది. ఆ పని నేను చేయగలనని ఆమె ఊహించలేదు. దాంతో ఎక్స్ప్రెషన్స్ ఒకదాని వెంట ఒకటి ఆమె మొఖంలో పరిగెత్తాయి. మొదట అపనమ్మకం, తర్వాత కోపం, తర్వాత అవమానం, ఆఖరుకు దుఃఖం... డైరెక్టర్ కట్ అనే వరకు నేనూ ఆమె నటిస్తూనే ఉన్నాం. కట్ అన్నాక ఒక్కసారిగా నేను ఏడ్చేశాను. స్మితాను దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. ఆ రోజుల్లో నేను కొత్తనటుణ్ణి. అలా చేశాను. పేరు వచ్చాక అలా చేయలేదు. ఎప్పుడూ చేయను. అసలు స్త్రీల మీద చెయ్యెత్తుతారా ఎవరైనా? ఆమె మీద గొంతెత్తడమే తప్పు. నేనైతే పెద్దగొంతుతో స్త్రీలతో మాట్లాడి కూడా ఎరగను’ అన్నాడు హర్షధ్వానాల మధ్య.స్త్రీలతో పురుషులు– వారు భర్త/తండ్రి/సోదరుడు స్థానంలో ఉన్నాగాని వ్యవహరించవలసిన తీరు ఏమిటో ఆమోల్ ఉదంతంతో బేరీజు వేసుకుని పరిశీలించుకోవాలి. -
రేసర్ అవని
ఈ తరం భారతీయ సమాజానికి అమ్మాయి చేతిలో స్టీరింగ్ విచిత్రం ఏమీ కాదు. స్టీరింగ్ మగవాళ్లదనే అభిప్రాయాన్ని యాభైఏళ్ల కిందటే తుడిచేశారు మహిళలు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్లోనూ స్టీరింగ్ తిప్పుతున్నారు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువ. దేశం మొత్తంమీద చూసినా వేళ్లమీద లెక్కపెట్టేటంత మంది మాత్రమే ఉన్నారు. వీరిలో అత్యంత చిన్నవయసు అమ్మాయి అవని వీరమనేని. మన తెలుగు రాష్ట్రాల్లో తొలి అమ్మాయి కూడా. హైదరాబాద్కు చెందిన పదిహేడేళ్ల అవని ఫార్ములా ఈ రేసింగ్లో దూసుకుపోతోంది. → మగవాళ్లతో పోటీస్టీరింగ్ మీద ఇష్టమే అవనిని ఫార్ములా ఈ రేసింగ్ వైపుకు మళ్లించింది. అన్నయ్య కారు నడుపుతుంటే తనకూ నేర్పించమని మొండిపట్టు పట్టింది. రెండురోజుల్లో స్టీరింగ్ మీద రోడ్ మీద కంట్రోల్ వచ్చేసింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు మాత్రం రాలేదు. కారిచ్చి రోడ్డు మీదకు పంపించరు. స్టీరింగ్ మీద ప్యాషన్ తీరేదెలా? రేసింగ్ గురించి ఇండియాలో ఉన్న అవకాశాల కోసం గూగుల్లో సెర్చ్ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ గురించి తెలియగానే అమ్మానాన్నలను అడిగింది. నిండా పదిహేనేళ్లు లేవు. ఇందులో స్త్రీపురుషులకు పోటీలు విడిగా లేవు. డ్రైవింగ్లో పది–ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నలభైఏళ్ల మగవాళ్లు కూడా అదే ట్రాక్ మీద పోటీలో ఉంటారు. కారువేగం గంటకు 160 నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద వాళ్ల మధ్య కుందేలు పిల్లలాగ ఉంటుందేమో అనుకున్నారు. కానీ అంతటి క్లిష్టమైన టాస్క్ని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కు లాగడం ఎందుకు అనుకున్నారు. అవని కోరుకున్నట్లే ఫార్ములా ఈ రేసింగ్ లో శిక్షణ ఇప్పించారు. అవని ఇప్పుడు అహురా రేసింగ్ గ్రూప్తో పోటీల్లో పాల్గొంటోంది. తొలిసారి రేసింగ్ ట్రాక్ మీదకు వెళ్లిన నాటికి ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. గడచిన మూడేళ్లుగా కోయంబత్తూర్లో, చెన్నైలో జరిగిన జేకే టైర్స్, ఎమ్ఆర్ఎఫ్ కంపెనీలు నిర్వహించిన పోటీల్లో పాల్గొంటున్నది. టాప్ టెన్ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. → ఈ తరం టీన్స్అవనితోపాటు ఫార్ములా ఈ రేసింగ్లో స్టీరింగ్ పట్టుకున్న అమ్మాయిల గురించి చెబుతూ ‘‘దేశం మొత్తం మీద చూసినా పెద్ద నంబర్ ఏమీ లేదు. తెలుగువాళ్లెవరూ కనిపించలేదు. తమిళనాడు, మహారాష్ట్రల నుంచి చూశాను. 2023లో నాతోపాటు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. 2024లో కూడా మరో ఇద్దరిని చూశానంతే. వాళ్లు కూడా నాకంటే కొద్దిగా పెద్దవాళ్లే తప్ప ఇరవై దాటిన వాళ్లెవరూ లేరు. ఓన్లీ మెన్ ఉన్న ఈ స్పోర్ట్లో ఉమెన్ ఎంట్రీ ఈ జనరేషన్ టీన్స్తో మొదలైందని చెప్పవచ్చు’’ అంటోంది అవని. ఈ పోటీల్లో పాల్గొనడానికి మంచి శక్తినిచ్చే ప్రత్యేకమైన ఆహారం గురించి మాట్లాడుతూ ‘‘అమ్మ డాక్టర్. నేను ఏమి తినాలో, ఎంత తినాలో అమ్మ చూసుకుంటుంది. నాకు తెలిసిందల్లా అమ్మ పెట్టింది తినడమే. నాతోపాటు ట్రైనింగ్కి, పోటీలకు తోడుగా అమ్మ లేదా నాన్న వస్తారు. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకు కూడా సెలవులు కష్టమే. ఇద్దరికీ వీలుకానప్పుడు అమ్మమ్మ వస్తుంది. నన్ను భద్రంగా చూసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు. కాబట్టి ఇక నా ఫోకస్ అంతా ట్రాక్ మీదనే’’ అని సంతోషంగా నవ్వేసింది అవని. టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టింది! లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. నైన్త్క్లాస్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ మొదలు పెట్టినప్పుడు చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. టెన్త్లో ట్రైనింగ్ సెషన్స్, బోర్డు ఎగ్జామ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. పగలంతా ట్రైనింగ్, రాత్రి హోటల్ రూమ్కి వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం... నిజంగా క్లిష్టసమయం అనే చెప్పాలి. అలాగే బోర్డ్ ఎగ్జామ్ రాశాను. ఫార్ములా ఈ రేసింగ్ చాలా ఖర్చుతో కూడిన ఆట. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ ఒప్పుకోవడం నా అదృష్టం. – అవని వీరమనేని, ఫార్ములా ఈ రేసర్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
సాటి లేరెవరూ నీ సాహసానికి!
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్గా మారింది.‘రోయింగ్ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది. -
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
వ్యాధిని వరంలా మార్చి..కుటుంటాన్ని పోషించింది..!
ఎదురైన సమస్యనే అనుకూలంగా మార్చుకుని ఎదిగేందుకు సోపానంగా చేసుకోవడం గురించి విన్నారా..?. నిజానికి పరిస్థితులే ఆ మార్గాన్ని అందిస్తాయో లేక వాళ్లలోని స్థ్యైర్యం అంతటి ఘనకార్యాలకు పురిగొల్పితుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం స్ఫూర్తిగా నిలిచిపోతారు. కళ్ల ముందే కలలన్నీ ఆవిరై అడియాశలుగా మిగిలిన వేళ కూడా కనికనిపించని ఆశ అనే వెలుగుని వెతికిపట్టుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు కొందరు. వీళ్లని చూసి.. కష్టానికి కూడా కష్టపెట్టడం ఎలా అనేది క్లిష్టంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె విషాద జీవిత కథ ఎందరికో ప్రేరణ కలిగించడమే గాక చుట్టుముట్టే సమస్యలతో ఎలా పోరాడాలో తెలుపుతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం అసామాన్య ధీరురాలైన ఆ మహిళ గాథ ఏంటో చూద్దామా..!.ఆ మహిళ పేరు మేరీ ఆన్ బేవన్(Mary Ann Bevan). ఆమె 1874లో లండన్లోని న్యూహామ్(Newham, London)లో జన్మించింది. ఆమె నర్సుగా పనిచేసేది . అయితే ఆమె థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే వివాహం అయిన 11 ఏళ్లకు అనూహ్యంగా భర్త మరణిస్తాడు. ఒక్కసారిగా ఆ నలుగురి పిల్లల పోషణ ఆమెపై పడిపోతుంది. ఒక పక్క చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం మరోవైపు పిల్లల ఆలనాపాలన, పోషణ అన్ని తానే చూసుకోవడం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసేస్తుంటాయి.సరిగ్గా ఇదే సమయంలో ఆమె అక్రోమెగలీ(Acromegaly) అనే వ్యాధి బారినపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలోని గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యి శారీరక రూపం వికృతంగా మారిపోతుంది. ఆమె శరీరంలో కాళ్లు, చేతులు, ముఖ కవళికలు తదితరాలన్ని అసాధారణంగా పెరిగిపోతాయి. దీంతో బయటకు వెళ్లి పనిచేయలేక తీవ్ర మనో వేదన అనుభవిస్తుంది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే సంపాదించక తప్పనిస్థితి మరోవైపు ఈ అనారోగ్యం రెండూ ఆమెను దారుణంగా బాధిస్తుంటాయి. భర్త పోయిన దుఃఖానికి మించిన వేదనలు ఎదుర్కొంటుంది మేరీ. ఈ అనారోగ్యం కారణంగా కండరాల నొప్పులు మొదలై పనిచేయడమే కష్టంగా మారిపోతుంటుంది. చెప్పాలంటే దురదృష్టం పగబట్టి వెంటాడినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. అయినా ఏదో రకంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతుందో వింటే మనసు ద్రవించిపోతుంది. సరిగ్గా ఆసమయంలో 1920లలో, "హోమిలీయెస్ట్ ఉమెన్" పోటీ పెడతారు. దీన్ని "అగ్లీ ఉమెన్" పోటీ(Ugly Woman contest) అని కూడా పిలుస్తారు. ఇందులో పోటీ చేసి గెలిస్తే తన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవచ్చనేది ఆమె ఆశ. నిజానికి అలాంటి పోటీలో ఏ స్త్రీ పోటీ చేయడం అనేది అంత సులభంకాదు. ఎందుకంటే అందుకు ఎంతో మనో నిబ్బరం, ధైర్యం కావాలి. ఇక్కడ మేరీకి తన చుట్టూ ఉన్న కష్టాలే ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసాన్ని స్థ్యైర్యాన్ని అందించాయి. ఆమె అనుకన్నట్లుగానే ఈ పోటీలో పాల్గొని గెలుపొందింది కూడా. ఆ తర్వాత ఆమె అరుదైన జీవసంబంధ వ్యక్తులకు సంబంధించిన ఐలాండ్ డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో "ఫ్రీక్ షో ప్రదర్శనకారిణిగా పనిచేసింది. మరికొన్నాళ్లు సర్కస్లో పనిచేసింది. ఇలా కుటుంబాన్ని పోషించడానికి తన అసాధారణమైన వైద్య పరిస్థితినే(Medical Condition) తనకు అనుకూలమైనదిగా చేసుకుని కుటుంబాన్ని పోషించింది. చివరికి ఆమె 59 ఏళ్ల వయసులో మరణించింది. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంది. దురదృష్టం కటికి చీకటిలా కమ్ముకున్నప్పుడే దాన్నే జీవితానికి ఆసరాగా మలుచుకుని బతకడం అంటే ఇదే కదా..!. సింపుల్గా చెప్పాలంటే దురదృష్టంలోని మొదటి రెండు పదాలను పక్కన పడేసి అదృష్టంగా మార్చుకోవడం అన్నమాట. చెప్పడం సులువు..ఆచరించాలంటే ఎంతో గట్స్ కావలి కదూ..!.(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్వన్ ఆల్రౌండర్గా ఉంది. నాలుగు ప్రపంచ కప్లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. -
బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.కరువు నుంచి బయటపడేందుకుపశ్చిమ రాజస్థాన్లో జోద్పూర్, బికనిర్లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.1730 స్త్రీల ఊచకోత1730లో జోద్పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.చలించిన రచయిత‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్ గుడ్మాన్.వేటాడితే జైల్లో వేస్తాంపుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్చాట్(Snapchat)లో ఇంటర్న్గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
‘సగానికి’ భాగమిదేనా?
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో! ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదుజెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ల వారీగా డిపార్ట్మెంట్ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు. – మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం! గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.ఇంకొంత కసరత్తుఈ ఏడు జెండర్ బడ్జెట్కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది. – మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖనిజాయితీతో కూడిన మద్దతు అవసరంమహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీపెద్దగా మార్పు కనపడలేదు2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. – ప్రియ గజ్దార్, చైర్పర్సన్, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్శ్వేతపత్రం విడుదల చేయాలిస్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి! – ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి – సరస్వతి రమ -
సీతమ్మ నోట స్త్రీ కష్టం
మహిళల శ్రమశక్తికి సాక్ష్యాలు, తూనికరాళ్లు అక్కర్లేదు. స్త్రీ శ్రమశక్తి అనేది నిత్యం కళ్ల ముందు కనిపించేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రమ అంటేనే స్త్రీ. అయినా సరే, ఎప్పటికప్పుడు మహిళలు తమను తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కష్టం గురించి చేసిన వ్యాఖ్యలుప్రా«ధాన్యతను సంతరించుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.‘గుర్తింపు పొందడానికి మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. స్కూల్, కాలేజీ, బోర్డ్, ఆర్మీ, మీడియా... ఇలా ఎక్కడైనా సరే గుర్తింపు రావాలంటే పురుషుల కంటే మూడురెట్లు తమను తాము నిరూపించుకోవాలి. ఇది అన్ని చోట్లా ఉంది’ అంటున్నారు నిర్మలమ్మ.‘లైఫ్ ఈజ్ అన్ ఫెయిర్’ అంటూనే అంతర్గత శక్తి ని పెంపొందించుకోవడం గురించి నొక్కి చెబుతున్నారు. అన్యాయాలు జీవితంలో ఒక భాగమని, వాటిని అధిగమించడానికి అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడం కీలకం అంటున్నారు నిర్మలా సీతారామన్.‘కంపెనీ బోర్డులలో మహిళల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కంపెనీ బోర్డుల్లో ఉండడానికి తాము అర్హులమని ఇప్పటికీ నిరూపించుకోవాలా!’ అని ప్రశ్నిస్తున్న సీతారామన్– ‘మహిళలు తమను తాము నిరూపించుకున్నారు. తమదైన గుర్తింపు పొందారు’ అంటూ చరిత్రను గుర్తు తెచ్చారు. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్లోని వెరావల్కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!
భారత సంతతికి చెందిన చెందిన బ్రిటిష్ కళాకారిణి రాధికా వెకారియా 30 ఏళ్ల వయసులో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒకపుడు మాట్లాడానికి (నత్తి లాంటిది) ఇబ్బంది పడింది. తన పేరు కూడా పలకడానికి కూడా కష్టపడిన ఆమె సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. రాధిక వెకారియా తన బాల్యంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనేక అవమానాల పాలైంది. వేధింపులు, బెదిరింపులూఎదుర్కొంది. ఆ అవమానాలు, వేధింపుల నుంచే తన విజయాన్ని వెదుక్కుంది. మౌనంగా ఉంటూనే, ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగింది.ఫిబ్రవరి 2న లాస్ ఏంజిల్స్లో జరిగిన గ్రామీ అవార్డ్స్ కార్యక్రమంలో టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, సబ్రినా కార్పెంటర్ చాపెల్ రోన్ వంటి పాపులర్ పాప్ దిగ్గజాలతో కలిసి టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, సబ్రినా కార్పెంటర్ మరియు చాపెల్ రోన్ వంటి ప్రధాన పాప్ సంస్కృతి దిగ్గజాలతో చేరుతుంది. నడిచింది.ఇంతకీ ఎవరీ రాధిక? ఏమా కథ? తెలుసుకుందాం రండి!2013 నుండి అమెరికాలో నివసిస్తున్న రాధిక వెకారియా లండన్లో పుట్టింది. ఈమె తాతముత్తాతలు భారతసంతతికిచెందినవారు. బాల్యం నుంచి దీర్ఘకాలిక ప్రసంగ లోపాలతో బాధపడేది. మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నా తాను ఖచ్చితంగా పాడగలనని గ్రహించింది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. అందుకే మాట్లాడటం నేర్చుకునే ముందు పాడటం నేర్చుకుంది. View this post on Instagram A post shared by RADHIKA VEKARIA (@radhikavekaria_)మరోవైపు అమ్మమ్మ నుంచి స్ఫూర్తి పొందిన రాధిక చిన్నప్పటి నుంచి శాస్త్రీయసంగీతంపై ఆసక్తి పెంచుకుంది. ఆర్టిస్ట్గా రాణించింది. వారియర్స్ ఆఫ్ లైట్’ ఆల్బమ్ నామినేషన్కు ఎంపికైంది. ఈ ఆల్బమ్ను రాధిక సంస్కృతం, హిందీ, తమిళం, ఆంగ్లభాషల్లో పాడటం విశేషం. ఉత్తమ న్యూ ఏజ్, యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్ విభాగంలో అనౌష్కా శంకర్, రికీ కేజ్ వంటి ప్రముఖ కళాకారుతో తలపడింది. రాధిక వెకారియా ఇలా అంటుంది.."మాటల సమస్య ఉన్న చాలా మంది నిజానికి చాలా మంచి గాయకులు, దానికి శ్రావ్యత, కొంచెం స్వరం , కొంచెం సంగీత జ్ఞానం అలవడితే గాయకులుగా రాణిస్తారు. అంతేకాదు అది మనస్సుకు ప్రశాంతత నిస్తుంది.మెదడుకు మంచిది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. అందుకే ఆకు పాడటం అలవాటైంది’’ అని చెప్పుకొచ్చింది. అసలు తనకున్న సమస్యను అధిగమించగలనని ఊహించలేదని సంతోషంగా తెలిపింది. తన పాట విని స్నేహితులు , కుటుంబ సభ్యులు ముగ్ధులయ్యారని చెప్పింది. అసలు వేదికలపై మాట్లాడ తానని, ఇపుడు చేస్తున్న పనులన్నీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. తాను నేర్చుకున్న సంగీతమే, తస్వేచ్ఛగా మాట్లాడగలిగేలా చేయగలిగింది అంటూ అంతులేని సంబరంతో చెప్పింది. క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లోపం స్వయంగా నయంకావడం ప్రారంభమైందని వెల్లడించింది. పెద్దయ్యాక పాడడానికి ఒక ధ్యానం చేసేదాన్నని, అది చాలా ప్రభావాన్ని చూపించినట్టు వెల్లడించింది. తనలోని లోపాలకు భయపడటం మానేసి, తనలో ఏదో శక్తి ఉందని, పాటగలనని గ్రహించడమే తన జీవితంలో పెద్ద మలుపు అని పేర్కొంది. -
ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్లా..!
చేతివ్రాత అనేది కనుమరుగైపోతుంది. ఇప్పుడంతా ప్రింట్ఔట్లే..జస్ట్ టైప్ చేయడమే..రాసే పనేలేదు. అయినప్పటికీ కొందరూ తమ చేతివ్రాతను పదిలంగా ఉంచుకుంటున్నారు. అంతేగాదు చేతివ్రాత బట్టి మనిషి నేచర్ని కూడా చెబుతుంటారు మానసిక నిపుణులు. అందుకే పిల్లల్ని తరుచుగా చేతివ్రాత బాగుండేలా చూసుకోమని పదేపదే చెబుతుంటారు. అలాంటి గొప్ప నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి చేతివ్రాత ఎంత అందంగా ఉంటుందంటే..చూసినవాళ్లేవరైనా ఆ చేతివ్రాతకి ఫిదా అయిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. అత్యంత అసాధారణమైన చేతివ్రాత ఆమెది. అసలు రాసిందా, టైప్ చేసిందా అన్నది కనిపెట్టలేనంతగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..!.మంచి చేతివ్రాత విద్యార్థి పురోగతికి ఎంతగానే సహాయపడుతుందని ఉపాధ్యాయులు చెబుతుంటారు. అందుకే విద్యార్థులను చేతివ్రాత బాగుండేలా చూసుకోమని చెబుతూ..సాధన చేయమంటారు. మనమంతా అలానే కష్టపడి చేతివ్రాత మెరుగ్గా ఉండేలా చేసుకున్నవాళ్లమే. కానీ చేతివ్రాత(Handwriting) ల్లో అత్యంత అందమైనవి..అందరికీ నచ్చేలా రాసే నైపుణ్యం ఉంటుందని విన్నారా..?. అలాంటి అసాధారణమైన ప్రతిభని సొంతం చేసుకుంది నేపాల్(Nepal)కి చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా(Prakriti Malla). ఆమె తన చేతివ్రాతతోనే వార్తల్లో నిలిచి సెలబ్రిటీగా మారిపోయింది. ఎందుకంటే చేతివ్రాత అందంగా ఉండటం వేరు, అందరూ మెచ్చుకునేంత అందంగా ఉండటం అనేది అసాధ్యం. చెప్పాలంటే ఈమె చేతివ్రాత చూస్తే..చేత్తో రాసిందా? లేక కంప్యూటర్లో టైప్ చేశారా..? అనేది చెప్పడం అసాధ్యం. అంతలా ఆకట్టుకుంటుందా ఆమె చేతివ్రాత. ఆమె హ్యాండ్ రైటింగ్ గణనీయమైన ప్రజాధరణ పొందింది. ప్రకృతి ఎనిమిదో తరగతిలో ఉండగా రాసిన అసైన్మెంట్ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి, ప్రజలు చేతితో రాయడం దాదాపుగా మానేశారు. ఒకప్పుడు చేతిరాతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అందమైన చేతివ్రాతను కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి చేతివ్రాత అందరిని కట్టిపడేస్తోంది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతివ్రాత నిపుణులు కూడా ప్రకృతి మల్లా చేతివ్రాతను చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆమె 51 యూనియన్ స్ఫూర్తి సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates (UAE)) పౌరుల నాయకత్వానికి అభినందన లేఖ రాసింది. ఆ లేఖను ప్రకృతినే స్వయంగా రాయబార కార్యాలయానికి అందజేసింది. అందుకుగానే నేపాల్ సాయుధ దళాలు(Nepalese armed forces) ఆ అమ్మాయిని సత్కరించాయి కూడా.(చదవండి: 'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!)