ఆ ప్రశ్న ఉద్యమం అయింది! | Varsha Deshpande awarded UN Population Award 2025 | Sakshi
Sakshi News home page

ఆ ప్రశ్న ఉద్యమం అయింది!

Dec 20 2025 4:18 AM | Updated on Dec 20 2025 4:18 AM

Varsha Deshpande awarded UN Population Award 2025

గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్‌ దేశ్‌ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది.  అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్‌ మండల్‌’కు పునాదిగా మారింది. 

మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో  చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్‌ పాపులేషన్‌ అవార్డ్‌ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్‌ దేశ్‌ పాండే పాండే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement