Social Media
-
రైల్లోనే డెలివరీ.. 'ఆపరేషన్ మాతృశక్తి' వీడియో వైరల్
కదులుతున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు తోటి ప్రయాణికులు, రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సమయానికి స్పందించడం మాత్రమే కాదు, సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షేమంగా ప్రసవంజరిగేలా చూసిన ఘటన మానవీయ కోణాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన పుణే-సుపాల్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఉత్తరప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల రుఖ్సానా ఖాతూన్, ఆమె భర్త జమీల్ బేలవర్ కలిసి పుణే నుండి బీహార్ వెళ్లేందుకు జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారు. రైలు అహల్యనగర్ స్టేషన్కు సమీపిస్తుండగా, రుఖ్సానాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో లేని ఆసుపత్రి, కిక్కిరిసిన జనరల్ కోచ్, వేగంగా కదులుతున్న రైలు కావడంతో వైద్య సాయం అందడం కష్టంగా మారింది.'ఆపరేషన్ మాతృశక్తి'ఈ అత్యవసర పరిస్థితిపై సమాచారం అందుకున్న సెంట్రల్ రైల్వే వెంటనే 'ఆపరేషన్ మాతృశక్తి'ని యాక్టివేట్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోమనాథ్ పాఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ మహిళ ఉన్న కోచ్కి చేరుకున్నారు. ఆమె నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆ సమయంలో ఆసుపత్రికి తరలించడం అసాధ్యమని గుర్తించారు. అందుకే రైలులోనే సురక్షిత ప్రసవం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆర్పీఎఫ్ సిబ్బంది, కోచ్లోని తోటి మహిళా ప్రయాణికులు కలిసి రుఖ్సానా చుట్టూ దుస్తులు, దుప్పట్లతో ఒక సురక్షితమైన తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేసిన ఈ పనితో రుఖ్సానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు వినగానే తోటి ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు.In a heartwarming incident aboard the Pune-Supaul Express, a pregnant woman safely gave birth inside a crowded general coach after experiencing severe labour pain near Ahilyanagar station. With no time to move her to a hospital, RPF personnel swiftly launched “Operation… pic.twitter.com/qnwb8L0e8d— NDTV (@ndtv) May 12, 2026 అనంతరం రైలు అహల్యనగర్ స్టేషన్కు చేరుకోకముందే రైల్వే అధికారులు అక్కడ 108 అంబులెన్స్ను, డాక్టర్లను సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బందిని మరియు సహకరించిన ప్రయాణికులను అందరూ అభినందిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..
ఒక బెంగళూరు వ్యక్తి తన ఎలక్ట్రిక్ యూని సైకిల్పై రోజూ చేసే ప్రయాణg ఓ ట్రాఫిక్ పోటీసులో కుతుహాలం రేపి, ఆ వ్యక్తిని ఆపి మరి దాని గురించి తెలసుకునేలా చేసింది. చివరికి ఆ పోలీసు ఒక సారి ఆ సైకిల్ని ట్రై చేసి చూశాడు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జెరోమ్ ఆనంద్ అనే ఆ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి ఆ ఎలక్ట్రిక్ యూని సైకిల్పై వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆ రోజు కూడా సాధారణ ప్రయాణంగా ప్రారంభమైన తన రైడ్ చివర్లో అసాధారణంగా మారింది. ఆయన ఆఫీస్ నుంచి ఇల్లు జస్ట్ 25 కి.మీటర్లే కావడంతో ఆ ఒంటి చక్ర వాహనంపై రోజు వెళ్తుంటాడాయన. అందులోనూ బెంగళూరు ట్రాఫిక్లో ప్రయాణించడం ఎంత సాహసమో తెలియంది కాదు. ఆ రోజు కూడా ఆనంద్ ఎప్పటిలానే తన ఒంటి చక్ర వాహనంపై ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నడు. ఇంతలో తన జర్నీకి ట్రాఫిక్ పోలీసుల రూపంలో సడెన్ బ్రేక్ పడింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపుతారు. ఆయన ఇలా ప్రయాణించడం కూడా ఏదైన ట్రాఫిక్ ఉల్లంఘన ఏంటీ అనుకుని ఆగిపోతాడు. వాళ్లు ఈ వాహనంపై ఎలా ప్రయాణిస్తారు వంటి కుశల ప్రశ్నలు అడుగతారు. దాంతో అతను ఆ వాహనం ఫీచర్స్ గురించి సవివరంగా వివరించడమే కాదు రైడ్ చేసి చూస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఆనంద్ వాహనంపై ఎక్కి సరదాగా రైడ్ చేస్తాడు కూడా. ఆ సైకిల్పై రైడ్ చేయడంలో ఆనంద్ పోలీస్కి హెల్ప్ చేస్తాడు కూడా. అయితే ఈ వాహనంతో పెట్రోల్ టెన్షన్, పార్కింగ్ హైరానా ఉండదని కూడా వివరిస్తాడు. పైగా ట్రాఫిక్ని సులభంగా నిర్వహించొచ్చు, చాలా దూరం సునాయాసంగా ప్రయాణించొచ్చు అని ఆనంద్ ఆ ట్రాఫిక్ పోలీసులకు వివరిస్తాడు. ఆయన ఆ వీడియోకి "ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు... చివరికి అతను నా ఈయూసీని నడపడంతో ముగిసింది" అనే క్యాప్షన్తో షేర్ చేశాడు ఆనంద్. అంతేగాదు ఏమో ఎవరు చెప్పగలరు ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు కూడా బెంగళూరు రోడ్లపై EUC తో గస్తీ కాయొచ్చేమో..అని చమత్కిరిస్తూ పోస్ట్ని ముగించాడు. View this post on Instagram A post shared by Jerome anand (@jro_thestreetrider) (చదవండి: అమ్మగా గర్వించే క్షణం..!) -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..
ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నమర్తా నితిన్ గోయెల్ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్ చేశారు. ఆమె తాను కేన్సర్ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్తో గుండు చేయించుకున్నారని తెలిపింది. ఆ క్రమంలో ట్రిమ్మర్ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Namarta Nitin Goel (@goelnamarta) (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్కు చెందిన మఖన్లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్గా మఖన్లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
యువ జంట ఘనత.. జస్ట్ 10 గంటల్లో..
బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే. బెంగుళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు. మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vrushali & Danish | Fit Couple • Sea Swimmers • Triathletes (@our.life.in.miles) (చదవండి: ఆ రేంజ్లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!) -
ఆ రేంజ్లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!
నిజంగా స్టేట్ ర్యాంక్ వస్తేనే సంబరాలు చేసుకుంటాం. అలాంటిది జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధిస్తే ఎగిరిగంతేస్తాం. తల్లిదండ్రలు ఇంట్లో ఓ పండుగలా వేడుక జరిపిస్తారు అలాంటిది ఈ తల్లి మాత్రం ఆ ఒక్క మార్కు అంటూ బాధుపడుతున్న తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. పైగా మరీ ఇంతలా పేరెంట్స్ ఉండకూడదు అంటూ తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్కి చెందిన దిబ్యేందు ప్రమణిక్ పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఐసీఎస్ఈ సిలబస్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంత పెద్ద ఘనత సాధించినందుకు ఏ తల్లిదండ్రలకైన పట్టరాని సంతోషం కలుగుతుంది. కానీ అతడి తల్లి ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకోవచ్చు కదా అంటూ విచారం వ్యక్తం చేసింది. అతడికి 500కి ఒక్క మార్కు తేడాతో 499 మార్కులు సాధించాడు. కానీ ఆ తల్లి బాగానే తెచ్చుకున్నాడు గానీ, ఇంకా కొంచెం కష్టపడితే ఆ ఒక్క మార్కు కూడా మిస్ అయ్యేది కాదు కదా అంటూ ఉసురుమనిపించేలా మాట్లాడింది. ఒక దిబ్యేందు కూడా తన తల్లిలా మాట్లాడాడు. ఆ ఒక్క మార్కు కోల్పోయినందుకు బాధగా ఉంది, కానీ పర్వాలేదు తన వరకు చాలా బాగా రాశానంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఇంజనీర్ కావాలనుకుంటున్నానని, ఐఐటీ వంటి అగ్రశ్రేణి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు వామ్మో ఇలాంటి తల్లిదండ్రులు నాకు లేనందుకు సంతోషం అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కొందరు ఆమె మాటలను చూస్తుంటే ఆ అబ్బాయిపై ఎంత ఒత్తిడి పెంచారో ఊహించగలను అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Noiseless News (@noiselessnews) (చదవండి: ఎవరీ ర్యాన్ కోహెన్..? కాలేజీ డ్రాపౌట్ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..) -
35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..
ప్రస్తుత కాలంలో యువత ఒత్తిడి, ఆర్థిక భద్రత మధ్య నలిగిపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ లైఫ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసి ఒత్తిడిలో కూరుకుపోయేలో చేసిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. అంతేగాదు ఆ కారణంగా ఆ లైఫ్కి స్వస్తి పలుకుతున్నా అంటూ..తన చివరి రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ..ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు. ఇంతకీ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే..బిస్వజిత్ మొహంతి 35 ఏళ్ల వయసులో కార్పొరేట్ కెరీర్కు విరమణ పలుకుతున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మొహంతి కార్పొరేట్ ప్రపంచంలో తన లాస్ట్ వర్కిగ్ డేని జరుపుకున్నట్లు ప్రకటించారు. ఈ క్షణం వరకు కార్పొరేట్ లైఫ్లో సాగిన తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులో సవంత్సరాల పాఠశాల విద్య, లోన్ తీసుకుని మరి చదువుకున్న ఉన్నత విద్య, దాదాపు 11 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం తదితరాలు ఉన్నాయి. ఇవన్నీ చివరకు కార్పొరేట్ లైఫ్ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయానికి దారితీశాయి. పదవీవిరమణ వరకు అదే వృత్తిలో కొనసాగకూడదని సుమారు మూడేళ్ల క్రితం అనుకున్నట్లు తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తన మనసులోకి వచ్చిందని, అన్నారు. అయితే ఆర్థిక భద్రత నేపథ్యంలో కొనసాగించాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయాన్నారు. ఇక్కడ నుంచి బయటపడ్డాక..నెక్స్ట్ ఏంటీ అన్న భయం కారణంగా కార్యరూపంలోకి తీసుకురాలేకపోయానన్నారు. గత మూడేళ్లలో ఏం కోల్పోయానో గ్రహించా, పాతవాటిని మర్చిపోవడం, తన బలాలను గుర్తించడం వంటివే అసలైన సంపదలుగా గ్రహించా, దాంతో తన శక్తిని, సమయం వంటి వాటిని సరైన దానిపై పెట్టబడి పెట్టడంపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై సైతం స్పష్టత ఉందన్నారు. ఈ కార్పొరేట్ లైఫ్ని వదిలేసే ముందు వరకు కష్టంగా అనిపించింది. కానీ వైదొలగడం మాత్రం చాలా ప్రశాంతతనిచ్చిందన్నారు. అంతేగాదు సాంప్రదాయ వృత్తి మార్గం కంటే వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలసుకున్నా అంటూ తన పోస్ట్ని ముగించారు. నెటిజన్లు సైతం ఆయన పోస్ట్కి మద్దతు పలుకుతూ..నిజంగానే "కార్పొరేట్ ఉద్యోగం ఒక పెద్ద ఉచ్చు..! ఉద్యోగం మిమ్మల్ని ఎప్పటికీ ధనవంతులను చేయదు. అది ఎల్లప్పుడూ మన కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించే వారి కింద మనల్ని ఉంచుతుందంటూ తమ అనుభవాన్ని షేర్ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. (చదవండి: శాకాహార బాడీబిల్డర్గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్ఓ..) -
సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్ టీచర్
కలలను నెరవేర్చుకోవడానికి వయసు పరిమితి లేదు. జీవితంలో ఏ దశలోనైనా వాటిని సాకారం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన గాన ప్రస్థానాన్ని లేటుగా ప్రారంభించినా ‘వాహ్వా’ అనిపిస్తున్నారు.తాజా విషయానికి వస్తే...రవీంద్రనాథ్ బిస్వాస్ ట్రెండింగ్లో ఉన్న ‘ఖత్’ అనే పాట పాడి వాహ్వా అనిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది.ఈ వీడియో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉన్నా అదేమీ ఆయన గాన ప్రతిభకు అడ్డుగోడ కాలేదు. విశేషం ఏమిటంటే, ఈ రీల్ సోషల్ మీడియా ప్రేక్షకులనే కాదు సంగీతపరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది.నవజోత్ అహుజా ఆనంద బాష్పాలతో కూడిన ఇమోజీతో స్పందించారు.‘దాదూ, ఆప్తో ఛా గయే’ (తాతా మీరు అదరగొట్టేశారు) అని జియోసావన్ స్పందించింది. ‘అంకుల్, మాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం’ అన్నది అమెజాన్ మ్యూజిక్ ఇండియా. ‘ప్రతిభ విషయానికి వస్తే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే’. ‘ఈ వయసులోనే వీరి గాత్రం ఇలా ఉందంటే... యవ్వనంలో ఇంకా ఎంత బాగుండేదో’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Ritik Dey (@ft.ritikdey) (చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
విజయ్ విజన్ ఉన్నోడు..వారికి పీడకలే!
టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ విజన్ ఉన్నవాడు, వారెన్ బఫెట్లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.27 పేజీల అఫిడవిట్లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో ఒక సేవింగ్బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో ఎస్ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?He beats nifty returns by keeping his money in FDHe is sitting on 300cr cash Just like Warren buffet with 300 billion in cashThalapathy Vijay is visionary pic.twitter.com/eXdm0CPIQL— सौरभ (@saurabh_gunjal_) May 6, 2026ఇదీ చదవండి: సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి Vijay is a Finfluencer's nightmare! pic.twitter.com/2J2hhjbqFv— Dharmesh Ba (@dharmeshba) May 6, 2026నెటిజన్ల కామెంట్స్"మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు."వంద కోట్ల రూపాయలను ఎఫ్డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్యూ స్టాక్స్లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు)ముఖ్యంగా "టాప్ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక ఎక్స్ యూజర్ వివరించారు. "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. TVK Chief Vijay appears to be risk-averse but may be lacking proper financial advice. He has ₹213 Cr in savings bank & FDs of ₹100 Cr which yields very low interest. If he invests in high dividend yield stocks of top PSUs, capital is safe + regular income + capital appreciation pic.twitter.com/pcakqtFxG6— RJ Stocks (@RakJhun) May 5, 2026 -
వెరైటీ చోరి.. నవ్వు ఆపుకోలేరు మరి!
దొంగతనాలకు సంబంధించిన వార్తలు మనం తరచుగా మీడియాలో చూస్తుంటాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే చోరీ ఘటన గురించి బహుశా ఎప్పుడు విని ఉండకవపోచ్చు. ఇదో విచిత్రమైన ఘటన. సాధారణంగా చీరల దుకాణాల్లో చోరీలు జరగడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం.. వైరల్ అవడం ఈ రోజుల్లో సర్వసాధారణ వ్యవహారంగా మారింది. మన చెప్పుకోబోయే చోరీ ఉదంతం కూడా ఇక్కడ వరకు ఇలాగే జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలే విచిత్రంగా ఉన్నాయి.వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని అంగుల్ జిల్లా కేంద్రంలో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు ఈనెల 2న నీట్గా ప్యాక్ చేసిన పార్సిల్స్ వచ్చాయి. వాటిని ఓపెన్ చేయగానే అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాటిలో 7 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 24 చీరలు ఉన్నాయి. బోయనికా సిబ్బంది అవాక్కాయింది వాటి విలువ చూసి కాదు. ఈ 24 చీరలు గత నెలలో తమ దుకాణం నుంచే చోరీకి గురైనవని తెలుసుకుని ముక్కున వేలేశుకున్నారు. దొంగతనం చేసిన వారే ఈ చీరలను తమకు తిరిగి పంపించారని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయారు. ఇలా కూడా జరుగుతుందా అని అవాక్కయ్యారు!అసలేం జరిగింది?టిప్టాప్గా తయారైన కొందరు మహిళలు బట్టలు కొనేందుకు ఏప్రిల్ 11న అనగుల్లో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు వచ్చారు. చాలా చీరలు చూశారు. చివరకు 1400 రూపాయలకు కుర్తా మాత్రమే కొని వెళ్లిపోయారు. తర్వాత పరిశీలిస్తే దుకాణంలో 25 చీరలు మాయమయినట్టు తేలింది. దీంతో సీసీ కెమెరాలు చెక్ చేయడంతో చీరల చోరీ బయటపడింది. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో బోయనికా ఫిర్యాదు చేసి, సీసీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేయగా, ఇందులోని దృశ్యాలు వైరల్గా మారాయి.ఈ నేపథ్యంలో చోరీ అయిన 25 చీరల్లో 24 శారీలు కొరియర్లో శనివారం బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు అందాయి. చోరీ అయిన చీరలు తిరిగి రావడం పట్ల అవుట్లెట్ మేనేజర్ రష్మి రంజిత పట్నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు నిందితులు తమ సిబ్బందిలో ఒకరికి ఫోన్ చేసి క్షమాపణ కూడా చెప్పారని వెల్లడించారు. ''తెలంగాణ చెందిన నిందితురాలు బిల్లు మీద ఉన్న నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు. చీరల చోరీ వీడియో వైరల్ కావడంతో తమ ప్రాంతంలో తలెత్తుకుని తిరగలేపోతున్నామని వాపోయింద''ని తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే నిందితులు తాము దొంగిలించిన చీరలను వెనక్కి పంపివుంటారని అన్నారు.తిరిగిచ్చినా చర్యలు తప్పవుకాగా, దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం మాసిపోదని, కేసు నుంచి తప్పించుకోలేరని అంగుల్ పోలీసు అధికారి ప్రకాశ్ చంద్ర మాఝీ తెలిపారు. వారు చీరలను తిరిగి ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉదంతం గురించి విన్నవాళ్లందరూ.. అడుగు తొక్కనేల, కాళ్లు కడనేల సామెతను గుర్తు చేసుకుంటున్నారు.If you remember the incident where a gang of women stole expensive sarees from Boyanika in Angul, Odisha…there is now a twist in the tale 🙂The gang has couriered the sarees back to the showroom, fearing arrest.Looks like police have identified the accused and traced their… pic.twitter.com/2k1EiCtv3o— Manas Muduli (@manas_muduli) May 5, 2026బోయనికా గురించి..బోయనికా అవుట్లెట్లను ఒడిశా ప్రభుత్వ చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని నైపుణ్యం గల నేత కార్మికులకు, వినియోగదారులకు వారధిగా నిలవాలనే లక్ష్యంతో 1956లో బోయనికాను ఒడిశా నెలకొల్పింది. నాణ్యమైన ఉత్పత్తులను ఇది పేరుగాంచింది. దీంతో బోయనికాలో దుస్తులు, హస్తకళల ఉత్పత్తులు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రఖ్యాత సంబల్పురి, బొంకై చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టులు, కుర్తాలతో పాటు గృహోపకరణాలు ఇందులో విక్రయిస్తుంటారు.చదవండి: తమిళనాడులో విజయ్ గెలుపు.. ట్రెండింగ్లో అన్నామలై! -
కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు
ఓ టెకీ తల్లిదండ్రులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి నెటిజన్ల మనసును దోచుకున్నాడు. ఎప్పుడు పిల్లల కోసం అన్ని త్యాగం చేసే తల్లిదండ్రుల కోసం ఏం చేసినా అతి తక్కువే. కానీ మనకు చేతనైనంతలో ఏది ఇచ్చినా..వాళ్లకు అత్యంత అపురూపం. పైగా తమ పిల్లలు ఇంత పెద్ద వాళ్లైపోయారా అన్న ఆనందానికి మించింది మరొకటి లేదు. ఆ విషయాన్ని ఈ టెకీ సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.సిద్ధార్థ్ భదౌరియా అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తల్లిదండ్రులను ఏవిధంగా సర్ప్రైజ్ చేశానో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించని వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో తాను స్కూటర్ మాత్రమే కొంటున్నానని చెప్పి ఎలా బీఎండబ్ల్యూ ఎక్స్ 1 కారుని గిఫ్ట్గా ఇచ్చానో వివరించాడు. ముందుగా తన తల్లికి నాన్నకి కొత్త టూ వీలర్ కొంటున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. అయితే అంత డబ్బు ఖర్చు చేసి స్కూటర్ కొంటున్నందుకు కచ్చితంగా నీకు తిట్టు తప్పవని కొడుకుని హెచ్చరించిందామె. కానీ కొడుకు అంతకు మించిన ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నాడని ఆ క్షణం ఆమె ఊహించలేదు. పాపం ఆమె కొడుకు ఏ లక్షో లేదా ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టాడనుకుందా ఆ పిచ్చితల్లి. అయితే కుమారుడు సిద్ధార్థ్ తన తల్లిదండ్రులను పార్కింగ్ ప్రదేశానికి తీసుకెవెళ్లి తండ్రికి తాళాలు అందించాడు. అంతే ఒక్కక్షణంపాటు అయోమయానికి గురైన ఆ తల్లిదండ్రులు అంతలోనే తేరుకుని తమ కుమారుడు ఇచ్చింది అత్యంత లగ్జరీ ఎస్యూవీని తెలిసి ఉప్పొంగి పోయారు. అంతేగాదు ఇది నిజమా కలా అన్ని సందిగ్ధానికి లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అతడి పేరెంట్స్. ఆ తర్వాత తండ్రి ఇంత ఖరీదైన కారు ఎవరైనా కొంటార్రా అని కుమారుడిని నవ్వుతూ ప్రశ్నించారు. నాన్న ధర గురించి మర్చిపోండి, మీరు హాయిగా కూర్చోని ప్రయాణం ఆస్వాదించండిని బదులిచ్చాడు. పైగా ఆ కారు తనకు ఉచితంగా వచ్చిందని చెప్పాడు టెకీ. కానీ అతడి తల్లి ఇంకా సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ..ఓరి దేవుడా..! నేను నిజంగా ఇంత లగ్జరీ కారులో కూర్చొన్నానా..!..అస్సలు నమ్మలేకపోతున్నా కన్నా..అంటూ మురిసిపోయిందామె. ఆ టెకీ ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసును హత్తుకుంది. "వాళ్లు నాకు అన్ని ఇచ్చారు. ఈ రోజు నావంతు" అనే క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పంచుకున్నాడు ఆ టెకీ. View this post on Instagram A post shared by SiddhaRth BhadauRia (@siddharthbhadauria) (చదవండి: ఐదు పదుల వయసులో నీట్ పరీక్ష..! ఐతే..) -
అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యాడు!
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ప్రభుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్రదాయానికి తమిళులు చరమగీతం పాడి మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే విజయ్వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగిన ద్రవిడ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేత అన్నామలై ముందే పసిగట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది.“తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ తమిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామలై మద్దతుదారులు ఆయనకు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామలై.. సోమవారం ఎన్నికల ఫలితాల సమయానికి చెన్నైకు తిరిగి వచ్చినట్టు ఆమె మరో పోస్ట్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.బీజేపీ ఒంటరిగా పోటీచేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని అన్నామలై మద్దతుదారులు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రెండేళ్ల క్రితమే అన్నామలై పసిగట్టారని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామలై ముందుగానే గుర్తించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామలైని పక్కన పెట్టిందని ఆయన సానుభూతిపరులు అభిప్రాయపడ్డారు.పొత్తుతో చిత్తు'అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యారు' అన్నట్టుగా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ''తమిళనాడు ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయారని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ఆయన మాటలను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు విజయ్ సాధించిన విజయంతో అన్నామలై మాటలు నిజమయ్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా కష్టపడి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజయ్ ఫలితం పొందారని మరొకరు అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పు చేసిందని ఎక్కువ మంది పేర్కొన్నారు.చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!రిస్క్ తీసుకోవాలి2024, ఫిబ్రవరి 16న జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా ప్యూర్ అలయెన్స్ గవర్నమెంట్ ఏర్పడబోతోంది. ఈ రెండేళ్లలో పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి క్షేత్రస్థాయిలో నాయకులకు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. వారం, పది రోజుల అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నామలై అప్పట్లో అన్నారు. பிப்ரவரி 16, 2024. சரியாக 2 வருடம் முன்பு அண்ணாமலை சொன்ன வார்த்தைகள் இன்று அச்சு பிசுறாமல் 200% அப்படியே நடந்துள்ளது.பாஜகவின் வெற்றியை தடுத்து, ரிஸ்க் எடுக்கவும் உழைக்கவும் பயந்து இன்று தமிழக பாஜகவை ஒழித்தது யார்? @annamalai_k 🙇🏻🔥🔥 pic.twitter.com/FTFJERVEX9— ᴋᴀʀᴛʜɪ (@TwitzKarthi) May 5, 2026 -
పానీ పూరీపై మనసు పారేసుకున్న జపాన్ చిన్నది..!
నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. తాజాగా ఓ జపనీస్ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్ అనే జపనీస్ మహిళ ఎక్స్ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్ స్నాక్కు జపాన్లో కూడా క్రేజ్ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. パニプリにハマりすぎて、気軽に食べ歩きできるパニプリ屋でも起業しようかなって真剣に思うくらいハマってる。エキゾチック料理NGな夫すら、「俺ハマったかもしれん、パニプリのことをすぐ考えてしまう」と言うくらい中毒性ある、、週2くらいで食べてるし、パニプリキットも買った笑 pic.twitter.com/LXqtiklwS6— エルメス (@hermes_ooo) April 20, 2026 (చదవండి: Met Gala 2026: గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..) -
నమస్కారం తమిళనాడు: ప్రకాశ్ రాజ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం, తమిళనాడులో విజయ్ సంచలన విజయం నమోదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందన అధికంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే సత్తా విజయ్కు ఉందా అని ఒకరు సందేహిస్తే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు మంచి చేయాలని మరొకరు హితవు పలికారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాజ్దీప్ సర్దేశాయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.‘అభిమాన’ సమాజంనమస్కారం తమిళనాడు. కామరాజర్ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.– ప్రకాశ్ రాజ్, నటుడు‘టీవీకే’ నడపగలదా?బెంగాల్లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.– యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్ట్పింగ్–పాంగ్బెంగాల్లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్–పాంగ్’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్ డోర్’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.– ప్రణయ్ రాయ్, ఎన్నికల డేటా విశ్లేషకులువిద్య... ఆరోగ్యంఅధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.– జావేద్ అఖ్తర్, గీత రచయితవిసుగు ఫలితం!సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్.డి.ఎఫ్.పై ప్రభావం చూపాయి.– రాజ్దీప్ సర్దేశాయ్, సీనియర్ జర్నలిస్ట్మూడో శక్తిపశ్చిమ బెంగాల్ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది. – అరుణా రాయ్, ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ సభ్యురాలుమార్పే బలంబెంగాల్లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.– హర్ష్ మందర్, సామాజిక కార్యకర్త, రచయితకట్టుబడి లేరుటీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్ జడ్, మిలీనియల్ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది. కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్డిఎఫ్ వైపు మళ్లిన తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణం.– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలుఅందరూ దూరమే!గత నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ దక్కించుకున్నాయి.– అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!
భారతదేశ పర్యటన గురించి ఓ విదేశీ యాత్రికుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎన్నో దేశాలను పర్యటించానని, కానీ భారత్ పర్యటన తన ప్రయాణ అనుభవాన్నే మార్చేసిందంటూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో the_globedigger గా ప్రసిద్ధి చెందిన జెఫ్ జోసీకి భారతదేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ పర్యటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించారు. తాను మొత్తం 46 దేశాలను పర్యటించానని, ఒక యాత్రికుడికి విజయవంతమైన పర్యటన అంటే..ఎలాంటి ఆటంకాలు లేని ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అని అర్థం. కానీ భారతదేశంలో చేసే ప్రయాణం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. అంతేగాదు ఇక్కడ ప్రయాణం చాలా అరుదుగా సులభంగా ఉంటుందన్నారు. ఇక్కడ పర్యటన సౌకర్యానికి చాలా దూరంగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లే..ఆ గమ్యస్థానాన్ని అత్యంత అపురూపమైనదిగా మార్చేస్తాయని నొక్కి చెప్పారు. అలాగే భారత్లో ప్రపంచంలోని అత్యుత్తమమైన వీధి ఆహారాలు, ప్రపంచస్థాయి బీచ్లు ఉన్నాయిన పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆయన గోల్డెన్ టెంపుల్తో సహా "ప్రముఖ" దేవాలయాలను సందర్శించడం చూపించారు. ఆయన జైపూర్లోని హవా మహల్, ఆగ్రాలోని తాజ్ మహల్, ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ను కూడా సందర్శించారు. 46 దేశాలు పర్యటించిన తర్వాత భారత్ తనకు ప్రయాణం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేసింది అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఇక్కడ పర్యటన అంత సులభమైన గమ్యస్థానం కాదు, సౌకర్యవంతంగా ఉండకపోయినా..మదిలో నిలిచపోతుంది అంటూ భారత్ పర్యటనపై పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే భారత్ మనల్ని నెమ్మదించేలా, పరిస్థితులకు అలవాటు పడేలా చేయడమే గాక ప్రపంచాన్ని విభిన్నంగా చూపించేలా చేస్తుందని, ఓ పర్యాటకుడు చవి చూడాల్సింది కూడా ఇదేనంటూ భారత్పై ప్రశంసంల వర్షం కురిపించారు. నెటిజన్ల కూడా ఆయనతో ఏకీభవిస్తూనే..ఈ నేలపై మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Geoff Josey (@the_globedigger) (చదవండి: ఆ ట్రైన్స్ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు ..అదొక ఎక్స్పీరియెన్స్) -
హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్!
ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా. ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు. ఉద్యోగం చేసే చోట సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు. మరి స్వేచ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్ చూపెడుతున్నప్పుడు అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన నోట్ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొందుపరిచాడు. డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని, కారు డోర్ను నెమ్మదిగా మూయాలని కోరాడు. మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు. ఇది హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ నోట్గా తెలుస్తోంది. హైదరాబాద్ క్యాబ్లు వెనుకాడవు అనే క్యాప్షన్తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్’లో ఆ నోట్ను ఫోట్ తీసి పోస్ట్ చేశాడు. ఇది వైరల్గా మారిన వైనంలో వార్త అయ్యింది. Hyderabad cabs do not hesitate pic.twitter.com/oWuJUtwRkB— Aman (@AmanHasNoName_2) May 2, 2026 -
బట్టలు ఆరేసాక, సడెన్గా వర్షం వస్తే : అమ్మడి ఐడియా అదుర్స్!
బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్ బెడ్స్మీదో ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్ మెషీన్లోనే అనుకోండి) ఆరేసినపుడు, ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది. అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప్లేస్ దొరకనపుడు బట్టల రాక్లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో, పడకగదుల్లోనూ బట్టల రాక్లు అమర్చుకుంటాం. ఇంకా వాష్స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట తీగల మీద ఆరేసిన బట్టల్ని వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక వినూత్న టెక్నిక్ను వాడింది. దీనికి జస్ట్ అలా వీల్ అమర్చిన స్టాండ్ను లోపలికి జరిపింది. అంతే ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో మహిళ.Aniden basan yağmurlara karşı kendi imkanlarıyla raylı çamaşır asma düzeneği kuran bir kadın; pic.twitter.com/APFfTHUbFk— Gezegen ve İnsan (@gezegenveinsan) May 1, 2026నెటిజన్ల స్పందన గుడ్ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్, స్పేస్ వేస్ట్ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
ఎరక్కబోయి పెట్టుకుంటే..ఇరుక్కుపోయింది, వైరల్ వీడియో!
సోషల్ మీడియా రీల్స్ స్టంటా లేక ఎండవేడిని తట్టుకోవడానికి చేసిన ప్రయత్నమో గానీ ఒక యువకుడికి చుక్కలు కనిపించాయి. ఎరక్క బోయి చేసిన ఒక్క పనితో దాదాపు ప్రాణం పోయినంత పనైంది. గంటల తరబడి నరక యాతన అనుభవించాడు. అల్వార్ జిల్లా అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోగఢ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అంటేనే మండించే ఎండలు. 40 డిగ్రీల ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి కాలూరామ్ అనే యువకుడు పాల డబ్బాను తలపై రక్షణగా పెట్టుకున్నాడు. 15 లీటర్ల పాల డబ్బాను తలపై హెల్మెట్లా పెట్టుకున్నాడు. కానీ, అనూహ్యంగా ఆ అల్యూమినియం పాల క్యాన్లో తల ఇరుక్కు పోయింది. ఎంతకూ బయటకు రాలేదు. ఈ వీడియోలో తలకు పాల డబ్బా ఇరుక్కుపోయి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.ఎంతో కష్టపడి కాపాడారుకొందరు ఇది ఎండ వేడిని తట్టుకోవడానికి చేసిన 'నింజా టెక్నిక్' అంటుండగా, మరికొందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమే ఇలా చేశాడని అంటున్నారు. కారణం ఏదైనా, ఎంత ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో కాలూరామ్ ఆందోళనతో కేకలు వేశాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దాన్ని తీయడానికి నానా కష్టాలుపడ్డారు. అయినా రాలేదు. చివరికి గ్రైండర్తో కట్ చేసి అతడికి విముక్తి కల్పించారు. ఎంతో శ్రమ, చాకచక్యం తర్వాత, బాధితుడికి ఎలాంటి గాయం కాకుండా, ఆ డబ్బాను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత! A man’s head got stuck in milk can! Don’t know why he put his head there!? pic.twitter.com/oOlTKcOTfS— Aparajite (@amshilparaghu) April 25, 2026నెటిజన్ల స్పందనఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో , నెటిజన్ల మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇతనే మన ఇండియన్ ఐరన్ మ్యాన్" అని ఒకరు చమత్కరించారు. రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వేడికి ఆ డబ్బా కొలిమిలా మారకపోవడం మంచిదైంది అని ఒకరు, వేడి నుండి తప్పించుకోవాలనుకుంటే,చుట్టూ ఒక టవల్ చుట్టుకోవాలి గానీ, ఈ పాల డబ్బా ఏంటి బ్రో అని మరొకరు కామెంట్ చేశారు.నోట్: ఈ వీడియో చూడటానికి హాస్యంగా అనిపించినప్పటికీ, ఇదొక తీవ్ర హెచ్చరిక. సోషల్ మీడియాను ఆకర్షించేందుకు ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పకనే చెప్పింది. ఇలాంటి విన్యాసాలు చేసేముందు ఒకటిరి రెండు సార్లు ఆలోచించు కోవాల్సిందే. ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక -
కోళ్ల ప్రాణం తీసిన డీజే సౌండ్!
బరాత్లు, ఊరేగింపుల టైంలో జోష్ కోసం చెవులకు చిల్లులు పడే రేంజ్లో డీజేలు ఏర్పాటు చేస్తుంటారు కొందరు. ఆ అత్యుత్సాహం ఒక్కోసారి విషాదాలకు.. విపరీతాలకూ దారి తీసే అవకాశమూ లేకపోలేదు. శబ్ధ కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుంటారు. అందుకు మూగ జీవాలు, పక్షులు కూడా మినహాయింపే కాదు. డీజే మ్యూజిక్ కారణంగా తన కోళ్లు గుండె ఆగి చనిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.ఏప్రిల్ 25న ఉత్తర ప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా రామ్భద్రపూర్వ గ్రామానికి చెందిన బాబన్ విశ్వకర్మ తన కుమార్తె వివాహాన్ని జరిపి, అత్తారింటికి పంపే సమయంలో ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. గ్రామం అంతా డీజే శబ్దాలతో ఊగిపోయింది. అయితే, ఆ ఊరేగింపు సబీర్ అలీ నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫారమ్ పక్కన వెళ్లింది. ఆ సమయంలో సౌండ్ కారణంగా కోళ్లు భయంతో వణికిపోయి చెల్లాచెదురయ్యాయి. చివరకు గుండె ఆగి చనిపోయాయి.సుల్తాన్పూర్లో జరిగిన ఘటన అసాధారణం కాదు. అధిక శబ్దం వల్ల కోళ్లు షాక్కు గురై చనిపోవడం శాస్త్రీయంగా సాధ్యమే. ఈ ఘటనలో మొత్తం 140 కోళ్లు చనిపోయాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అవి చనిపోవడానికి డీజే ఆపరేటర్ కవి యాదవ్ కారణమని సబీర్ ఆరోపిస్తున్నాడు. అయితే పోలీసులు యాదవ్ను ప్రశ్నించి వదిలేశారు. అధిక శబ్దం కేవలం మనుషులకే కాకుండా జంతువులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి డీజేలు పెట్టినప్పుడు సౌండ్ కంట్రోల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతుంటారు. -
బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
జపాన్లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడి సింగిల్ కింగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్ ఆఫర్ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.జపాన్లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.జపాన్లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు -
జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
ఇరాన్ వార్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్కు వచ్చిన సందేహం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.అసలు ఏం జరిగింది?అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా, అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.వధువు సమాధానంవధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో వధువు ముసిముసిగా నవ్వుకుంది.నెటిజన్ల స్పందనఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం -
అస్తిపంజరంతో బ్యాంక్కు.. అసలు జరిగింది ఇదే!
ఓ గిరిజనుడు తన సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇది బాగా వైరల్ అయ్యింది కూడా. ఈ ఘటన కలచి వేసిందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నియంత్రణ శాఖల మంత్రి సురేష్ పూజారి అనడం.. విపక్షాల విమర్శలకూ తావిచ్చింది. అయితే.. ఘటన వైరల్ అయిన నేపథ్యంలో జీతూ ముండాకే ఎక్కువ మంది సపోర్ట్గా నిలిచారు. వ్యవస్థలోని లోపాలు, అవగాహన లోపం, పేదరికం.. అంశాలతో పెద్ద చర్చే నడిచింది. ఏదైతేనేం బాధిత కుటుంబానికి అందాల్సిన డబ్బు అందింది. అయితే సంబంధిత బ్యాంకు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా సగం సగం సమాచారంతో తమను తొట్టిపోయడం సరికాదని అంటోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసింది. కేంఝర్ జిల్లా దియానలి గ్రామానికి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మేయగా వచ్చిన సొమ్మును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసింది. దీంతో ఆ సొమ్ము కోసం ఆమె సోదరుడు జీతూ ముండా (50) బ్యాంకు అధికారుల్ని సంప్రదించాడు. ఆమె వస్తేనే ఆ డబ్బు ఇవ్వడం కుదరుతుందని బ్యాంకు అధికారులు అతనితో చెప్పారు. ఆమె చనిపోయిందన్నా వినలేదు. దీంతో సాక్ష్యం కోసం ఆమె సమాధి తవ్వి ఎర్రటి ఎండలో భుజాన వేసుకుని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. కంగారుపడిపోయిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈలోపు అతన్ని కొందరు వీడియోలు తీసి నెట్లో పెట్టారు. ఈలోపు పోలీసులు కలగజేసుకుని అతనికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి.. ఆ అస్తిపంజరాన్ని తిరిగి సమాధిలోకి చేర్చారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ภาพถึงหน้าแบงค์แล้ว Jitu Munda พยายามถอนเงินประมาณ 20,000 รูปี (6,877.64 บาท) จากบัญชีของพี่สาวผู้ล่วงลับ ธนาคารในรัฐโอดีชา ปฏิเสธ (ให้พาเจ้าของบัญชีมาด้วย) pic.twitter.com/TEi3evavxn— R here (@UvgtdERt4PWmcjF) April 28, 2026ఈ ఘటన వైరల్ కావడంతో.. మంగళవారం అధికారులు స్పందించారు. కల్రా ముండా డెత్ సర్టిఫికెట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు కూడా జీతూ ముండా, మిగతా సోదరీమణుల చేతికి అప్పగించారు. ఆ వెంటనే గ్రామీణ బ్యాంక్ అధికారులు కదిలారు. వాళ్లకు రావాల్సిన రూ.19, 402 సొమ్మును అందజేశారు. అదే సమయంలో రెడ్క్రాస్ సొసైటీ వాళ్లకు ఆ కుటుంబ దీనావస్థ గురించి తెలిసి మరో రూ.30 వేలను అందించింది. అయితే.. బ్యాంకు మాత్రం జరిగింది వేరని చెబుతోంది. విత్డ్రా సొమ్ము కోసం జీతూ ముండా బ్యాంకుకు వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉండడం, పైగా నిరక్షరాస్యుడు కావడంతో మా సిబ్బంది చెప్పింది అతనికి అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి ఖాతాలో ఎమౌంట్ను విత్డ్రా చేసే అధికారం.. నామినీకి తప్ప మూడో వ్యక్తికి ఉండదు. అందుకే డబ్బు ఇవ్వడం కుదరదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకురావాలని.. అదీ కుదరకుంటే నామీనిని అయినా తీసుకు రమ్మని చెప్పారు. అప్పటికే మత్తులో ఉన్న ఆయనకు అదేదీ అర్థం కాలేదు.. మా ఉద్దేశం డిపాజిటర్ డబ్బును రక్షించడం, నియమాలను పాటించడం మాత్రమే. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఒడిషా గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ట్వీట్ చేసింది. Reported Incident at Odisha Grameen Bank of claimant bringing sister’s skeleton for death claim process.We would like to submit that, today the Government Authorities have issued the Death Certificate and Legal Heir Certificate. Immediately on receipt of these documents, Bank…— Indian Overseas Bank (@IOBIndia) April 28, 2026 ఎవరేమంటున్నారు.. ‘నా సోదరి మరణించిందని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఆమెను తీసుకొని వస్తేనే డబ్బు ఇస్తామన్నారు. ఏం చేయాలో పాలుపోక నా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నా’.. జీతూ ముండామా సోదరుడు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. అక్కడి సిబ్బంది ఇవ్వకుండా అతన్ని వేధించారు. ఏం చేయాలో సరిగా వివరించలేదు. భరించలేకే ఆ పని చేశాడు. అందుకే అధికారులు దిగొచ్చి మా డబ్బు మాకు ఇచ్చారు .. జీతూ మిగిలిన ఇద్దరు సోదరీమణులుమరణించిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకురావాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన పత్రాలు అందించమని మాత్రమే కోరాం. అవి అందిన వెంటనే రూ.19,402 మొత్తాన్ని ముగ్గురికీ అందించాం.. బ్యాంకు అధికారులుజీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు.. స్థానిక పోలీసులుడబ్బు ఎలా తీసుకోవాలో జీతూ ముండా కుటుంబానికి అవగాహన లేకుండా పోయింది. అదే సమయంలో వాళ్లకు అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంకు సిబ్బంది కూడా విఫలమయ్యారు.. గ్రామస్తులుబ్యాంకు అధికారులకు ఆ పెద్దాయన భలే బుద్ధి చెప్పారు అని కొందరు.. ఇలాంటి విషయాల్లో ఖాతాదారులకు కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
బీజేపీ ఎమ్మెల్యే అనుపమకు అఖిలేష్ పరామర్శ
సమాజ్వాదీ పార్టీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థులకు సర్ప్రైజ్ ఇచ్చారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్ను పరామర్శించారు. అఖిలేష్ దిష్టిబొమ్మను తగలబెడుతున్న సమయంలోనే ఆమె గాయపడడం గమనార్హం.మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో సమాజ్వాదీ పార్టీ తీరును నిరసిస్తూ శనివారం బహ్రైచ్లో బీజేపీ ‘మహిళా జనాక్రోశ్ మార్చ్’ నిర్వహించింది. అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమ ముఖం మీద మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆమెను హుటాహుటినా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముఖంపై 75 శాతం కాలిన గాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెటాండా ఆస్పత్రికి తరలించారు. #BREAKING : Former minister Anupama Jaiswal injured in Bahraich after effigy-burning protest goes wrong. The incident occurred at DM Chauraha, and she has been admitted to the local medical college with burn injuries to her face.#Bahraich #AnupamaJaiswal #Protest… pic.twitter.com/7y53mXmr1c— upuknews (@upuknews1) April 25, 2026మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన అఖిలేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. అనుపమ భర్త, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆయన రాకతో ఆస్పత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు అంతా కలిసి ఆయనతో పొటోలు దిగారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదిక Xలో “సమాజంలో విభేదాల మంటలు కాకుండా.. సఖ్యత, శ్రేయస్సు ఉండాలి. రాజకీయాలకు ఒక స్థానం ఉంది. కానీ మానవ సంబంధాలు కూడా అంతే ముఖ్యమైనవి” అని పోస్ట్ చేశారు. జైస్వాల్ భర్త అశోక్ జైస్వాల్ ఈ పరామర్శను ప్రజాస్వామ్య మర్యాదగా అభివర్ణించారు. हम नहीं चाहते हैं कि समाज के बीच आग जले। हम चाहते हैं समाज में सौहार्द की फुहार हो। हमारी सकारात्मक राजनीति की स्वस्थ परंपरा ने हमें यही सिखाया है। इसीलिए हम भाजपा विधायक श्रीमती अनुपमा जायसवाल जी से मिलने गये और उनके शीघ्र स्वास्थ्य लाभ की कामना करके आएं हैं। राजनीति अपनी जगह है… pic.twitter.com/4lfmjx5HoK— Akhilesh Yadav (@yadavakhilesh) April 28, 2026అంతకు ముందు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌధరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, లక్నో మేయర్ సుష్మ ఖర్క్వాల్ తదితరులు కూడా అనుపమను పరామర్శించారు. -
బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక రద్దీ రోడ్డుపై ఆరుగురు చిన్న పిల్లలు ఒకే స్కూటర్పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. రోడ్డు భద్రతా నియమాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?శ్రేయాస్ అనే ఎక్స్ యూజర్ ఆఫీసుకి వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసి, ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు నగర పోలీసులను, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రకారం సుమారు 10 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు మైనర్లు (ఆడ, మగ) పిల్లలు ఒకే స్కూటర్పై కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. రైడర్తో పాటు అందరూ మైనర్లు కావడంతో తీవ్ర ఆందోళన రేపింది. రద్దీగా ఉండే బహిరంగ రహదారిలో ఒక చిన్న బాలుడే స్కూటర్ను నడుపుతున్నాడు. పైగా వీరిలో ఎవరికీ హెల్మెట్లు లేవు. దరిదాపుల్లో పెద్దలెవరూలేరు. ఈ ఘటన ఏప్రిల్ 26 గోరిపాళ్య సమీపంలోని పాదరాయణపుర మెయిన్ రోడ్డుపై జరిగింది. మరోవైపు ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్ట్ను గుర్తించి, తదుపరి చర్యల కోసం మగడి రోడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, వాహన యజమానిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?నెటిజన్ల ఆగ్రహంస్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ (KA05JZ9065) స్పష్టంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్లకి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులను కనీసం వారం రోజుల పాటు జైల్లో పెట్టాలి. వారి నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఇంత నిర్లక్ష్యమా?" పెద్దోళ్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. వీళ్లకి కేవలం జరిమానా వేస్తే సరిపోదని మరి కొందరు వ్యాఖ్యానించారు. నోట్ : మైనర్లు వాహనాలు నడపటం వల్ల ఇప్పటికే అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి హెచ్చరిస్తోంది. చట్టప్రకారం, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితేవాహన యజమాని లేదా తల్లిదండ్రులకు భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుంది. సదరు మైనర్కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.This is haappend on today 26/04/2026 morning 10:45 am those kid's illegally ridding scooter No. ( KA05JZ9065 ) on location ( Padarayanapura main road near gowripalya on opposite of total engineer auto gas ) new Bridge. please take necessary. @BlrCityPolice @blrcitytraffic pic.twitter.com/S4rrOE8vbD— Shreyas Shreyu (@Shreyas35240282) April 26, 2026 -
వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేసిన వైనం నెట్టింట ఆగ్రహానికి తావిస్తోంది. ఇది సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం. ఇలాంటి ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, లేదా ఘర్షణలకు దిగడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. దీనిపై హైదరాబాద్ సీపీ వీసీసజ్జనార్ స్పందించారు. ఇలాంటి మూర్ఖత్వపు సాహసాలు తగదు అంటూ యువతను హెచ్చరించారు. వినాశ కాలే విపరీత బుద్ధిః అని పెద్దలు ఊరికే అనలేదు అంటూ చురకలేశారు. ‘‘పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి Feelings మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి!’’అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు.పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!?గుర్తుంచుకోండి.. మీరు చేసే… pic.twitter.com/ud2iRpFVmW— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 28, 2026 -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్కు గురయ్యారు. తమ మొబైల్స్లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్వర్క్, ప్రక్రియలు -
అంబులెన్స్లో రోగి వాంతి : భార్యతో కడిగించిన వైనం, వీడియోవైరల్
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.గాయపడిన రోగిని తరలించేందుకు అతని భార్యతో అంబులెన్స్ను శుభ్రం చేయించిన అమానుష ఘటనపై అంబులెన్స్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శుక్రవారం సాయంత్రం ఉమరియా-బర్హి రోడ్డులోని ఖితౌలి సమీపంలో ఉన్న కరేలా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాహుల్ బర్మన్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాహుల్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 112 సహాయంతో అతడిని మొదట బర్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని కట్నీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. బర్హి నుంచి కట్నీకి తీసుకువస్తుండగా, నొప్పి, గాయం కారణంగా రోగి రాహుల్ అంబులెన్స్ కిటికీలోంచి వాంతి చేసుకున్నాడు.దీంతో ఉద్యోగి మోహిత్ నాయక్ రోగి భార్యపై అంబులెన్స్ను శుభ్రం చేయమని ఒత్తిడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి భార్య నీళ్లు పోస్తూ అంబులెన్స్ను శుభ్రం చేస్తూ కనిపిస్తుంది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,ఈ సమయంలో అంబులెన్స్ సిబ్బంది సున్నితత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ మహిళకు ఏమాత్రం సహాయం చేయలేదు.ఆ తర్వాత జబల్పూర్కు తరలించారు: కట్నీ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, రాహుల్ పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. View this post on Instagram A post shared by The Trending India 🇮🇳 (@thetrendingindian) ఈ మొత్తం విషయంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రాథమిక ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అంబులెన్స్లో రక్తస్రావం జరిగి ఉండవచ్చని, దానిని ఆ మహిళ శుభ్రం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అంబులెన్స్ మేనేజర్తో మాట్లాడిన తర్వాత సమగ్ర విచారణ జరిపి తెలిపారు. -
తీవ్ర పదజాలంతో పేరెంట్పై ప్రిన్సిపాల్ వీరంగం!? వీడియో వైరల్
యూపీలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అనుచిత వైఖరి సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వీడియోను @NewsAlgebraINDతో సహా ట్విటర్లో పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్గా మారిన వీడియో ప్రకారం షట్ అప్, షట్ అప్ గెట్లాస్ట్ అంటూ ఒక విద్యార్థి తల్లిపై సన్బీమ్ పాఠశాల ప్రిన్సిపాల్ మమతా మిశ్రా విచక్షణా రహితంగా విరుచుకుపడింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.పాఠశాల పుస్తకాల కొనుగోలు నిబంధనలను పాటించనందుకు, వారి పిల్లల పేరును తొలగించమని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.బయటి విక్రేతల నుండి పుస్తకాలు కొనడంపై పాఠశాల విధానాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై "నోరు మూయండి! ఇక్కడి నుండి వెళ్ళిపోండి!" అని అరుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతో హర్దోయ్లో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాఠశాల యాజమాన్యాల వైఖరి, సిబ్బంది ప్రవర్తన, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.School Principal lost her cool at mother for not purchasing books from the school.PRINCIPAL : "You shut up! Get lost. I am going to remove the children's name from the Register" 🤯pic.twitter.com/OWt5cvk5hZ— News Algebra (@NewsAlgebraIND) April 26, 2026దీనిపై వివాదం మరింత ముదరడంతో ప్రిన్సిపాల్ మమతా మిశ్రా ఆ రోజు ఏం జరిగిందో, తాను తల్లిదండ్రులపై ఎందుకు అరిచానో వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.Sunbeam School Hardoi Principal Mamta Mishra’s clarification: Parents were pressuring to reduce ₹1300 monthly fee, so she lost her cool. Questions how much lower it should go. (2/3) pic.twitter.com/osbgnXuAOS— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026 హర్దోయ్లోని సన్బీమ్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తన వివరణలో పేర్కొన్న దాని ప్రకారం నెలకు రూ.1,300 ఫీజును తగ్గించాలని తల్లిదండ్రులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో సహనం కోల్పోయింది. ఫీజును ఇంకా ఎంత తగ్గించాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. సంఘటన జరిగిన రోజున, పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరుగుతోందని, ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు అప్పటికే తెలియజేశామనిన్నారు. సాధారణంగా, టీకాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉంటారు, కానీ ఇది పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో, పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.సరిగ్గా ఆసమయంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అదే రోజు తమ ఆందోళనలను వ్యక్తం చేసి, ప్రక్రియకు అంతరాయం కలిగించారనేది ఆమె అయితే. అంతేకాదు తమ పాఠశాల ఎల్లప్పుడూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఏళ్లుగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. చాలా మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.వైరల్ వీడియోలో సంఘటనలోని కొంత భాగాన్ని మాత్రమే చూపించారని, పూర్తి సందర్భం అందులో లేదని ఆమె అన్నారు. ఒక చిన్న క్లిప్ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు Sunbeam School Hardoi Principal Mamta Mishra harshly scolded mother Neelam Verma just for requesting a 15-day fee extension.⁰Neelam has now accused the principal of extreme misbehavior. pic.twitter.com/zOJX3DlTr2— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026బాధిత మహిళ వాదనతల్లి నీలం వర్మ ప్రకారం, కేవలం 15 రోజుల గడువు పొడిగింపు కోరినందుకే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అప్పటికే నోట్బుక్లతో సహా పూర్తి కోర్సును కొనుగోలు చేశాను, కానీ భర్త ప్రస్తుతం ఊళ్లోలేని కారణంగా 15 రోజుల సమయం కోరానని, అయినా కనీస మర్యాద లేకుండా, దుర్బాషలాడుతూ పిల్లల వస్తువులను రోడ్డుపై విసిరేశారని వాపోయింది.ఇదీ చదవండి : రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!
చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింపచేసేలా చేస్తుంది కూడా. కొన్ని నినాదాలు మాటలకే పరిమితమైపోతాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..గుజరాత్లోని నార్నౌల్లోని ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచారం అందర్నీ ఆకర్షించడమే కాదు లింగ సమానత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచింది. బీకామ్ పట్టభద్రురాలైన నేహా జాంగ్రా, తన పెళ్లికి ఒక రోజు ముందు, శనివారం రాత్రి తన పరిసర ప్రాంతాల్లో ఆడ గుర్రంపై ఊరేగుతూ కనిపించింది. సంగీతం, ఉత్సవ నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనందం, గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి హరిరామ్ జాంగ్రా చిన్న కిరాణ దుకాణం నడుపుతుంటారు.2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి, అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తాను కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు.‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార స్ఫూర్తికి అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. "ఇది కేవలం ప్రతీకాత్మకం కాదు; ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి," అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహా తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెల మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పుకు స్ఫూర్తినిస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.పెళ్లికి ముందు బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో, ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కాగావడోదరలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్కు చెందిన నిలేష్ కుమార్తో నేహా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. (చదవండి: అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..! ఎందుకో తెలుసా..) -
నెలకు రూ. 10 లక్షల జీతం, ఇండియాలో కోట్ల ఆస్తులు.. అయినా..?!
దేశంలో చాలామంది యువత కనీస ఉపాధి దొరక్క నానా కష్టాలుపడుతోంటే, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా, జీవితం బోరింగ్గా ఉంది అంటున్న ఒక టెకీ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. రియాద్లో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు రూ. 10 లక్షలు సంపాదన. నెలకు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నాడు. అయినా సంతృప్తి లేదట. ఎందుకలా? డబ్బు, ఆస్తులు జీవితానికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేవని, జీవనశైలిలో వైవిధ్యం కూడా ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో ఒకటైన హంగర్స్టేషన్ కోసం రియాద్లో పనిచేస్తున్న తన స్నేహితుడి వివరాలను ఇంజనీర్ అభిషేక్ సింగ్ పంచుకోవడంతో చర్చ మొదలైంది. దీని ప్రకారం అతను నెలకు రూ. 10 లక్షల జీతం. ఖర్చు తక్కువ. దీంతో సగానికిపైగా జీతం ఆదానే. ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నారు. దీంతోపాటు భారతదేశంలో కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా తన జీవితం చాలా 'బోరింగ్'గా ఉందని వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్జీవితం 'బోరింగ్'?అధిక వేతనం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో సంతోషం లేకపోవడం, రోజువారీ రొటీన్ జీవితం విసుగు తెప్పిస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఇంత సంపాదన ఉన్నప్పటికీ, తన దైనందిన జీవితం చాలా నిరర్థకంగా మారిందని ఆ ఇంజనీర్ పేర్కొన్నారు. ఆయన జీవనశైలి కేవలం "పని, జిమ్, నిద్ర.. మళ్ళీ అదే పని" అన్నట్లుగా ఒకే పద్ధతిలో సాగుతోందని, అందులో ఎటువంటి ఉత్సాహం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన బెంగళూరులోని 'ఇన్మోబి' (InMobi) , లండన్లోని 'వైజ్' (Wise) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒక స్థాయి దాటిన తర్వాత భౌతిక సుఖాలు, డబ్బు అర్థరహితంగా అనిపిస్తాయి. నిత్యం ఒకే రకమైన జీవనశైలి విసుగు తెప్పిస్తుందఅని కొందరు సమర్థించారు. నెలకు రూ. 2 లక్షలతో రియాద్ వంటి నగరంలో విలాసవంతమైన జీవితం గడపడం కష్టం, ఆయన తన ఖర్చులను తక్కువ చేసి చెబుతున్నారంటూ మరికొందరు విమర్శించారు. కేవలం భారత రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆయన సంపద ఇంకా పెరిగేదని కొందరు సలహా ఇచ్చారు.డబ్బు, స్థిరమైన ఆస్తులు ఉన్నప్పటికీ, జీవితంలో ఉత్సాహం లేకపోవడం అనే అంశంపై ఇది ఆధునిక కార్పొరేట్ జీవితంలోని ఒక వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది.Talked to my friend today.He’s in Riyadh working at HungerStation.1. Makes 10L+ per month 2. Saves ~8L per month 3. Says life is boring: work, gym, sleep, repeat 4. Already bought multiple properties in India, net worth is compounding quietly pic.twitter.com/OKVvWrfTWH— Abhishek Singh (@0xlelouch_) April 21, 2026 ఇదీ చదవండి: నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం -
చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
గుజరాత్లోని ఛోటా ఉదయ్పూర్లో నాలుగేళ్ల కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఛోటా ఉదయ్పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది. సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం అంతకన్నా లేదు. చిరుతపై ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది. అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై పావి జెట్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి స్పందిస్తూ రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలుతండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఝలక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది. పార్టీకి, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్ ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఈ పరిణామం సోషల్ మీడియాపై బాగా ప్రభావం చూపించింది.Unfollow Raghav Chadha సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతరాఘవ్ చద్దా రాజకీయ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది.ఫాలోవర్ల సంఖ్యగా భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో సుమారు 80,000 పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్బుక్లో వేలమంది యూజర్లు ఆయనను అన్ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), , “అన్ఫాలో రాఘవ్ చద్దా” చద్దా కాదు చడ్డీ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్ఫాలో చేశారు.సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే, ఇటివలి పరిణామాలు, కేజ్రీవాల్కి లిక్కర్ స్కాంనుంచి ఊరట లభించగానే చద్దాపై చర్యలు, పథకం ప్రకారం ఆరుగురి ఎంపీలతో కలిసి చద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు మరియు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ ,అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇది మామూలు వెన్నుపోటు కాదయ్యో..!
ఆపరేషన్ లోటస్ వేళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పైనే బీజేపీ ఎదురు దాడికి దిగింది. కొత్త బంగ్లాకు ఆయన మకాం మార్చడంపై సెటైర్లు వేసింది. తనది సాదాసీదా జీవనం అని చెప్పుకునే కేజ్రీవాల్.. ఛండీగఢ్ బంగ్లా కోసం మాత్రం కోట్లు ఖర్చు చేశారని, అదంతా ప్రజా ధనమేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో ఇటు కేజ్రీవాల్కు బంగ్లా విషయంలో జరిగిన వెన్నుపోటు కూడా చర్చనీయాంశమైంది. లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బయటకు వచ్చాక సీఎం పదవికి రాజీనామా చేయడంతో అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆనాడు ఆప్(ప్రస్తుత బీజేపీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రముఖ విద్యావేత్త అశోక్ మిట్టల్ కేజ్రీవాల్ కుటుంబాన్ని తన అధికారిక బంగ్లాకు ఆహ్వానించారు. మండీ హౌస్ సమీపంలోని 5 ఫిరోజ్షా రోడ్లోని బంగ్లాలో అప్పటి నుంచి ఆ కుటుంబం ఉంటూ వస్తోంది. అయితే నిన్న(ఏప్రిల్ 24)న లోధీ ఎస్టేట్లోని ప్రభుత్వ బంగ్లాలోకి మారాడు. ఇది కాకుండా ఛండీగఢ్ సెక్టార్లో కేజ్రీవాల్ మరో ప్రభుత్వ బంగ్లాను ఆక్రమించారని.. దానిని షీష్ మహల్ 2 అంటూ ఎగతాళి చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ.కేజ్రీవాల్ను ఢిల్లీ రెహమాన్ డెకాయిత్గా (ధురంధర్ సినిమాలోని ఫేమస్ పాత్ర.. ) అభివర్ణిస్తూ శనివారం పర్వేశ్వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కేజ్రీవాల్ ఒకప్పుడు తనది సాధారణ జీవనం అని చెప్పి ప్రజల మద్దతు పొందారు. ఇప్పుడు విలాసవంతమైన బంగ్లాకు మారడం ఆయన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఆ బంగ్లాను అంత లగ్జరీగా మార్చడానికి డబ్బుల్లేక్కడివి?. అదంతా పంజాబ్ ప్రజల సొమ్ము కదా?.. ఈ విషయంలో దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలి’’ అని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ క్రమంలో బంగ్లా లోపల అంటూ కొన్ని ఫొటోలను ప్రదర్శించి ‘షీష్ మహల్-2’ అంటూ ఆరోపించారు. #WATCH | दिल्ली: दिल्ली सरकार में मंत्री प्रवेश वर्मा ने कहा, "यह उनके पूरे घर का लेआउट है... जितना दिमाग उन्होंने एक-एक कमरों पर लगाया है, अगर उतना समय वे दिल्ली के कार्यों में लगाते तो शायद आज उनके कार्यकर्ता आम आदमी पार्टी को छोड़कर नहीं जा रहे होते।" pic.twitter.com/dr3ZC0hA0T— ANI_HindiNews (@AHindinews) April 25, 2026నమ్మకస్తుడి వెన్నుపోటుఅశోక్ మిట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) స్థాపకుడు, ఛాన్సలర్ కూడా. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ ఆయన్ని రాజ్యసభకు పంపింది. ఈ నెల మొదట్లో రాఘవ్ చద్దా తీరుతో విసిగిపోయిన ఆప్.. ఆయన్ని తప్పించి అశోక్ మిట్టల్ను రాజ్యసభ ఉపనేతగా నియమించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే అశోక్ విద్యాసంస్థలపై ఈడీ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఆప్ ఆ దాడులను ప్రతీకార రాజకీయంగా ఖండించింది. అయితే..ఏడాది పాటు కేజ్రీవాల్ను తన ఇంట్లో ఉంచుకున్న అశోక్ మిట్టల్.. ఆయన బంగ్లా ఖాళీ చేసిన కాసేపటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఆయనతో పాటు రాఘవ్ చద్దా, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీలో చేరారు. లోథి ఎస్టేట్లోని ప్రభుత్వ బంగ్లాను ప్రస్తుతం జాతీయ పార్టీ అధినేత హోదా కింద కేజ్రీవాల్కు కేటాయించారు. అయితే బీజేపీ మాత్రం జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతలంతా ఛండీగఢ్ సెక్టార్లోని ప్రభుత్వ బంగ్లాలను ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సహకారంతో ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తోంది. 2015-2024 మధ్య కేజ్రీవాల్ ఢిల్లీ సిఎంగా ఉన్నప్పుడు నివసించిన సివిల్ లైన్స్ బంగ్లాను బీజేపీ "షీష్ మహల్"గా పిలిచింది. ఈ బంగ్లాలో కోట్ల ప్రజా ధనం వెచ్చించి విలాసవంతమైన సౌకర్యాలను కేజ్రీవాల్ అనుభవించారని ఆరోపించింది. ఇప్పుడు ఆయన వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ ఎన్నికల కోసం ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో షీష్ మహల్2ను తెరపైకి తెచ్చింది. -
అంత్యక్రియల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!
థాయ్లాండ్లో ఒక వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక మనిషి చివరి కోరిక తీర్చడం, కనీసధర్మంగా పాటించడం ఆనవాయితీ. అలా వారి ఆత్మశాంతిస్తుందని కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢంగా నమ్ముతారు. కానీ అలా చేసినందుకు ఒక థాయ్ కుటుంబం విమర్శల పాలైంది. అసలింతకీ ఏమైంది? అతని చివరి కోరిక ఏంటి?బ్యాంకాక్ పోస్ట్ నివేదిక ప్రకారం,దక్షిణ థాయ్లాండ్లోని నఖోన్ సి తమ్మారత్ ప్రావిన్స్లో ఉన్న వాట్ థెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 15న మరణించిన 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియలను ఏప్రిల్ 21న నిర్వహించారు. అయితే అతని దహన సంస్కారాలకు ముందు ప్రదర్శన ఇవ్వడానికి 'కొయెట్ డాన్సర్స్' గా పిలిచే ముగ్గురు మహిళా నృత్యకారులను ఏర్పాటు చేసింది. (అతి తక్కువ బట్టలతో నృత్యం చేస్తారు. సాధారణంగా బార్ టేబుళ్ల మీద, నైట్క్లబ్లలో లేదా ఇతర కార్యక్రమాలలో నృత్యం చేస్తారు) దీనికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.ఏం జరిగింది?బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత, చితికి నిప్పంటించే ముందు ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ముగ్గురు యువతులు శవపేటిక ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. అన్ని వయసుల వారు ఈ ప్రదర్శనను చూస్తుండగా, దీనిని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుబాధపడుతూ కూర్చోవడం కంటే, మరణించిన వారి ఆఖరి కోరికను గౌరవించడం మంచిదే. దీనివల్ల విషాదం కొంతవరకు తగ్గుతుందని కొందరు సదరు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మరోవైపు మరణించిన వారి కోరికను గౌరవించాల్సిందే, కానీ అంత్యక్రియల వంటి పవిత్రమైన చోట ఇలాంటి నృత్యాలు సరికావు. ముఖ్యంగా చిన్న పిల్లల ముందు ఇలాంటి ప్రదర్శనలు భ్యంతరకరమని మరికొందరు విమర్శించారు. మొత్తానికి, సంప్రదాయానికి, వ్యక్తిగత కోరికకు మధ్య జరుగుతున్న ఈ వివాదం థాయ్లాండ్లో హాట్ టాపిక్గా మారింది.కుటుంబ సభ్యుల వివరణనెటిజన్ల విమర్శల నేపథ్యంలో మృతుడి కుటుంబం వివరణ ఇచ్చింది. "చావు అనేది అనివార్యం, నా అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదు, వేడుకలా జరుపు కోవాలి" అనేది అతని చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చడం తమ కనీస బాధ్యఅని భావించామని తెలిపారు. అతను జీవించి ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా, జోవియల్గా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చడానికి మరియు శోకతప్త హృదయాల్లో ఆనందాన్ని నింపడానికే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్టాప్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!
మూగజీవులు మనుషులకు మించి ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే గాదు..అలా రక్షించిన ఘటనలు కోకొల్లలు. తనకు ఎలాంటి ప్రమాదం లేదంటేనే రక్షించేందుకు ముందొకస్తాడు మనిషి. కానీ ఈ శునకం తనకు అపాయం అని తెలిసి చిన్నారుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది .అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో,కాళి అనే వీధి కుక్క చేసిన సాహసం అక్కుడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ పాఠశాల సమీపంలో ఆరుబయట సుమారు 30 మందికి పైగా చిన్నారులు ఆడుకుంటారు. తమ వైపు బుస్సు బుస్సు మని నిశబ్దంగా వస్తున్న ప్రమాదం గురించి వారికి ఏ మాత్రం తెలియదు. దాన్ని తత్క్షణమే పసికట్టిన కాళీ అనే వీధి కుక్క ఆ చిన్నారులందర్నీ కాపాడేందుకు ఆ విషసర్పంతో పోరాడేందుకు ముందుకు దూకింది. ఆ పాము వైపుకి దూసుకెళ్లి మరి నిర్విరామంగా పోరాటం చేసింది. చిన్నారుల వైపుకి ఆ పాముని రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది. చెప్పాలంటే ప్రమాదానికి పిల్లలకు మధ్య నిలబడి ఆ కాళి అనే కుక్కతో అపరకాళిలా పోరాడింది. పామును చంపేంత వరకు పోరాటం చేయడం విశేషం. అయితే ఆ పోరాటంలో ఆ పాము ఆ కుక్క ముఖం, నోటిపై కాటేసినా.. లెక్కచేయకుండా పోరాడి దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది ఆ శునకం. అప్పటికే ఆ కుక్కకి తక్షణ సహాయం అందడంలో ఆలస్యమైపోయింది. ఆ విషం అప్పటికే దాని ప్రాణాలను బలిగొంది. ఒక్క బిడ్డకు కూడా హానికలగకుండా వీరోచితంగా పోరాడి యావత్తు గ్రామం మనసుని దోచుకుంది. నిజానికి ఆ కాళి అనే కుక్క వీది కుక్క కాదు, తమ రక్షకురాలు అని భావోద్వేగంగా అంటున్నారు స్థానికులు. దాని త్యాగానికి గుర్తుగా మొత్తం గ్రామమే కదిలివచ్చి మరి వీడ్కోలు పలికారు. దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలమాలతో అలంకరించి, గ్రామం గుండా అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకువెళ్తూ..ఆ శునకానికి నివాళులు అర్పించారు. విశ్వాసంలో కుక్కకు మించిన వారు లేరని రుజువు చేసే ఘటన ఇది. (చదవండి: జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!) -
ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక బాలుడు అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్ ద్వారా ఆ పాత్రను కట్ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం. దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే ఫన్నీగా స్పందించారు. ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026 -
ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!
రైలు ప్రయాణం అనగానే సర్వసాధారణంగా చిన్న బాక్స్లో భోజనం పెట్టుకుని తెచ్చుకుంటారు. ఓవర్నైట్ ప్రయాణమైతే సాధ్యమైనంత వరకు చాలామంది ప్రయాణికులు ఇలానే తెచ్చుకుంటారు. మరికొందరు ట్రైన్లో అమ్మే ఆహారాలతో పనికానిస్తారు. కానీ ఈ అమ్మ అంతకు మించి ఆలోచించింది తన పిల్లలు గురించి. వాళ్ల ఆరోగ్యం బేషుగా ఉండాలని ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి సామాన్లు సర్దడంలో ఎంత శ్రమపడిందో ఆమె ఆహారం సర్వ్ చేసిన విధం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ వీడియో ఒక అమ్మాయ్ ప్రెషర్ కుక్కర్ను బ్యాలెన్స్ చేస్తూ నవ్వడంతో మొదలవుతుంది. తన తల్లి బ్యాగ్ నుంచి కుక్కర్ బయటకు తీసి..రైలులోనే తన కుటుంబ సభ్యులకు వేడి వేడి పలావ్ను చాలా మామూలుగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వీడియోకి “అమ్మకు ఇది రాత్రిపూట రైలు ప్రయాణం అని చెప్పాను... ఆమె కుక్కర్ సర్దింది.” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మా కుటుంబంతో కలిసి ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని కొందరు, ఇంకొందురు వేడిగా పెట్టాలన్న ఆత్రం, ఆ తల్లి ప్రేమ రెండు కనిపిస్తున్నాయ్ అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashritha & Hanish | Couple Reels | Hyderabad (@ashshaniii) (చదవండి: గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!) -
మరో సంచలన పోరుకు డా. శివరంజని : ప్రజారోగ్యం కోసం సంతకం చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ పరిచయం అవసరం లేని పేరు. ఓఆర్ఎస్ (Oral Rehydration Solution-ORS) పేరుతో, హై షుగర్ ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ విక్రయాలకు వ్యతిరేకంగా 8 ఏళ్లపాటు అలుపెరగని పోరు సల్పి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన వైద్యురాలిగా అందరికీ సుపరిచితం. చిన్న పిల్లల వైద్యురాలిగా వృత్తిపరమైన నిబద్ధతను, చిన్నపిల్లల ఆరోగ్యంపై తనకున్న ప్రేమను చాటుకున్న తీరు అందరి మనసులను దోచుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గుర్రుగా ఉన్న కొన్ని ప్రధానమైన ఫార్మా కంపెనీలు ఇటీవల డాక్టర్ శివరంజని సంతోష్కు లీగల్ నోటీసులు ఇచ్చాయి. ఈ విషయంలో ఆమె మరోసారి ఉద్యమానికి దిగారు. కార్పొరేట్ కంపెనీల తప్పుడు మార్కెటింగ్కు వ్యతిరేకంగా వైద్యులు, ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫార్మసీలలో eRZLను ORSLకు కొనసాగింపుగా లేదా ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ ,ప్రచారం చేస్తున్న తీరుపై డా. శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఆందోళనలను లేవనెత్తినిందుకు తనకు జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ , కెన్వ్యూ నుండి ఒక లీగల్ నోటీసు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. తన ఈ పిటిషన్ ఎవరితోనో గొడవ పడటానికి కాదు; ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. eRZL అనేది ORSLకు కొత్త రూపం తప్ప మరొకటి కాదని ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటం eRZL సురక్షితమైనదా కాదా అనే దాని గురించి మాత్రమే కాదు. ఇది ఆ ఉత్పత్తిని మార్కెట్లో ఎలా ప్రదర్శిస్తున్నారు, ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా అన్నారామె.ఈ పిటిషన్ దేనికి అనేదానిపై ఆమె వివరణఆరోగ్య సంరక్షణ సమాచారంలో స్పష్టతవినియోగదారులలో గందరగోళాన్ని నివారించడంబాధ్యతాయుతమైన బ్రాండింగ్ , ప్రకటనలను నిర్ధారించడంప్రజారోగ్య సమస్యలను వైద్యులు సంకోచం లేకుండా లేవనెత్తడానికి అనుమతించడం ఆమె లేవనెత్తిన ప్రధాన అంశాలుeRZL తన ప్రచారంలో ORSL పేరును ప్రస్తావించకూడదు. ఎందుకంటే ORSL అనేది అసలైన వైద్య సిఫార్సు చేయబడిన ORS కాదు.eRZLను ORSL కు కొనసాగింపుగా చూపడం వల్ల, తల్లిదండ్రులు దీనిని వైద్యపరమైన ORS అని పొరబడే అవకాశం ఉంది. ఇది నియంత్రణ సంస్థల చర్యల ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తుంది.ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులు ఫార్మసీలలో తెలిసిన పేర్లను చూసి త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. eRZL బ్రాండింగ్ వల్ల అది ఒక మెడికల్ సొల్యూషన్ అని వారు నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆ పాత పేరుతో ఎలాంటి సంబంధం లేకుండా దీనిని రీబ్రాండ్ చేయాలి.మెడికల్ షాపుల్లో వీటి అమ్మకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.అలాగే వైద్యులు సిఫార్సు చేసే ORS కు, ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్కు మధ్య స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలి.ప్రజారోగ్యం కోసం గొంతెత్తే ఆరోగ్య నిపుణులకు రక్షణ కల్పించాలి.వైద్యరంగంలో చిన్న గందరగోళం కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది. సరైన సమాచారం ప్రాణాలను కాపాడుతుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, పిల్లలలో 'సుక్రలోజ్' (sucralose) వంటి పదార్థాల వాడకంపై ఆందోళనలు ఉన్నాయి. అందుకే స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.ప్రజారోగ్యం కోసం అండగా నిలవండి. క్లిష్ట సమయాల్లో ప్రతి కుటుంబం సరైన నిర్ణయం తీసుకునేలా చూడటానికి ఈ పిటిషన్పై సంతకం చేయండి దీనిని అందరికీ షేర్ చేయండి అంటూ ఆమె ఎక్స్లో లింక్ను షేర్ చేశారు. ప్రజారోగ్యం కోసం సంతకం పెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి I am Dr. Sivaranjani, a pediatrician , raising concerns about how eRZL is being marketed and positioned in pharmacies, and the risk it creates for consumers making critical decisions during dehydration.This issue is not about whether eRZL is safe in isolation.⁰It is about how…— Dr.Sivaranjini (@dr_sivaranjani) April 21, 2026 -
లెన్స్కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్చల్
సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్చల్ చేశారు. ముంబైలోని స్టోర్లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.తమ ఉద్యోగుల కోసం లెన్స్కార్ట్ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్కార్ట్ స్టోర్లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.లెన్స్కార్ట్ వివరణసోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్కాట్ లెన్స్కార్ట్' తీవ్రం కావడంతో , లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Mohsin Khan is the main operator of the Lenskart Shop in Andheri, Mumbai!No Hindu staff member can wear the Tilak!Kalaava!This is strictly prohibited!All Lenskart Shops in India should be banned immediately!Gazwa-e-hind strategy are operational from #lensekart ?… pic.twitter.com/q6bClZvrLL— Nazia Elahi Khan (सनातनी) (@ElahiNazia1) April 19, 2026 -
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ
ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు. ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.The daughter in-law did not cook food for her in- laws. Her mother arrived at the scene, gave her daughter a thrashing, and immediately instructed her to serve her in lawsThis is rarest of rare case in India in recent history, you know what i mean. pic.twitter.com/5h1VdYtYh1— Woke Eminent (@WokePandemic) April 19, 2026 (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..) -
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్తో ఈ కేఫ్ని నిర్మించారట. ఈ కేఫ్లో హైలెట్గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతేగాదు పోస్ట్లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..) -
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్గా లేకపోవడం.. సడెన్గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం
మనం సాధించే గెలింపు మనొక్కరిదే కాదు. అందుకు సహకరించి కుటుంబసభ్యులది కూడా. అయితే వారి క్రెడిట్ కనబడదు. కానీ ఈ మహిళ తన సక్సెస్ వెనుక తన తండ్రి ఉన్నాడంటూ..అందరికీ తెలియజేసేలా ఆమె చేసిన పని..అక్కడున్న వారి కళ్లలో నీళ్లుగిర్రున తిరిగేలా చేశాయ్. ఆ కమనీయ దృశ్యం ఓ ప్రేరణ కూడా.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, సుమేధా షేక్ ఇంటిని చక్కబెడుతూ, ఇద్దరు పిల్లల భాద్యత, దివ్యాంగుడైన తండ్రి బాగోగులు చూసుకుంటూ పోలీస్ అధికారిణి అయ్యారు. ఆమె తన విజయాన్ని జరుపుకున్న విధానం అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. తండ్రిని భుజాలపై ఎత్తుకుని ఆ క్షణాన్ని ఒక హృదయపూర్వక నివాళిగా మార్చారు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెట్టింట వైరల్గా మారి అందరి హృదయాలను గెలుచుకుంది. తల్లిదండ్రుల త్యాగం ఎప్పుడూ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ మన జీవితాంతం ప్రతిధ్వనిస్తుందని అని చెప్పేలే ఈ మహిళ సెలబ్రేషన్ చేసుకుంది తన సక్సెస్ని. ఈ మేరకు కొత్తగా పోలీసు అధికారిణిగా నియమితురాలైన సుమేధా మట్లాడుతూ..తన కష్టసుఖాల్లో అండగా నిలిచి, తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడిన తండ్రికి ఇలా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ వీడియోలో సుమేధా దివ్యాంగుడైన తన తండ్రిని భుజాలపై మోస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడున్న వారు కూడా ఆమె సంతోషంలో భాగమయ్యారు. కొందరు ఆమె తన అసాధారణ విజయాన్ని తన తండ్రికే అంకితం చేస్తూ.. వేడుకగా చేసుకున్న తీరుని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి ఇది 'ఉత్తమ తండ్రీ-కూతుళ్ల బంధం' అని అభివర్ణించగా మరికొందరు విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయంగానే కాకుండా..ఆ ప్రయాణానికి సహకరించి బంధాలది కూడా అని చెప్పే ఘటన అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: బ్లింకిట్ డెలివరీ బాయ్గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..! కారణం తెలిస్తే అవాక్కవుతారు) -
బ్లింకిట్ డెలివరీ బాయ్గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..!
పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగిగా కొనసాగడం అత్యంత అరుదు. అందులోనూ పిల్లలు స్థిరపడ్డాక, ఎలాంటి చీకు చింత లేకుండా పదవీ విరణమ చేశాక ఎవ్వరైన రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ తాతగారు అందుకు విభిన్నం. అదికూడా యువకులు చేసే గిగ్వర్క్ జాబ్లో జాయిన్ అవ్వడం..పైగా ఎన్ని డెలివరీలు కంప్లీట్ చేశారో తెలిస్తే..తాతగారు మీరు సూపర్ అని ప్రశంసించకుండా ఉండలేరు. మరి ఎందుకు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతున్నారంటే..అహ్మదాబాద్కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి, మాజీ క్లర్క్ దినేష్ మహంత్ ఠాకోర్దాస్ మంచి స్థిరపడ్డ కుటుంబం. ఆయనకు ముగ్గురపిల్లలు వాళ్లు కూడా బాగా స్థిరపడ్డారు. ఆయనకు ఏమి అంత ఆర్థిక బాధ్యతలు కూడా ఏమిలేవు. కానీ తన పరిసర ప్రాంతంలో ఒక బ్లింకిట్ డెలివరీ పార్టనర్గా పనిచేస్తున్నారు. ఆయనకు అదొక ఆసక్తికరమైన ఉద్యోగంలా అనిపించి చేయాలనకున్న జాబ్ కాస్తా సాధారణ కార్యకలాపంగా మారింది. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్లో న్యూస్ ఆల్జీబ్రా ఖాతా నుంచి షేర్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన రోజు ఉదయం 5.00లతో రోజు ప్రారంభించి ఉదయం 6.00లకు కంపెనీ స్థానిక డార్క్ స్టోర్కు చేరుకుంటారట. తన ఇష్టపడే షిఫ్ట్ సుమారు రూ. 11.30 గంటలకు మొదలవుతుందట. ఆ తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా ముగించాలా అని నిర్ణయించుకుంటారట. ఇలా గత రెండేళ్లలో సుమారు 10,220 డెలివరీలను పూర్తి చేశారట. అయితే ఈ సంపాదన మాత్రం ఇంటి ఖర్చుల కోసం కాదట. కొత్త నగరాలు, రాష్ట్రాలు, దేశాలు సందర్శించడానికి వినియోగిస్తారట. అంతేగాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్దతత చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిందంటూ ..పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఈ వయసులో ఇంత శారీరక శ్రమ అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.A 66-year-old retired clerk from Ahmedabad is delivering on Blinkit, and he has no plans to stop.Dinesh Mahant Thakordas spent 26 years at a life insurance company, raised a family, and built a stable life. He and his wife have three children, all well-settled. With no… pic.twitter.com/iUZ6WENJv1— News Algebra (@NewsAlgebraIND) April 17, 2026 (చదవండి: ‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!) -
రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ సోషల్ మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.2016లో రద్దయిన పాత రూ. 1000, రూ. 500, నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీంతో బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని కూడా హెచ్చరించింది. Has RBI really announced 'new rules' for exchanging old ₹500 & ₹1000 notes❓Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck❌ This claim is FAKE!❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని తమకు సెండ్ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను (rbi.org.in) చెక్ చేయాలని వెల్లడించింది.WhatsApp: +91 8799711259Email: factcheck@pib.gov.in -
మొగుడుపై అలిగి, రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది!
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది. అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? హై రేంజ్ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిThis Chinese woman is going viral after she threw over $162,000 out onto the streets from her balcony after an argument with her husband. 🙆♂️ pic.twitter.com/rWiLFu9Rrj— Erimus (@HeDontMakeNoise) April 15, 2026నెటిజన్ల స్పందన ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రభుత్వ కార్యాలయ మీటింగ్లో జరిగిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో ఒక అనుకోని అతిథి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత విషయం తెలిసి అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటన బాఘ్పత్లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందీ అంటే..బాఘ్పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ రాయ్ రైతుల సమస్యలను వింటున్నారు. ఈ సమయంలో కోతి ఆడిటోరియంలోకి ప్రవేశించి, నేరుగా డీఎం టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న పత్రాలను లాగడం చూసి అధికారులు భయాందోళనకు గురయ్యారు. కోతి ఆకస్మిక చర్యలతో అవాక్కైన కొంతమంది ఆఫీసర్లు సీట్లు వదిలి పారిపోయారు. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్ ఇంతకీ ఈ కోతి ఎవరో తెలుసా? జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ పెంపుడు కోతి. దీని పేరు 'మాత్రు'. మాతృను చూడగానే జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తన కుర్చీలోంచి లేచారు. అధికారులు, రైతుల ముందు ప్రశాంతంగా ,అస్మితా లాల్ చిరునవ్వు నవ్వి, మాతృను తన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించారు. అది పోయి అక్కడ పొందికగా కూర్చంది. ఆ తర్వాత అధికారులు మాతృని మెల్లగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో వాతావరణం సద్దు మణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో కదిలిస్తోంది. తోటి స్నేహితులు ఆడుతుంటే చూసి మురిసిపోయిన ఓ దివ్యాంగ చిన్నారి నెటిజన్ల మనసు గెలుచుకుంది. హృదయాలను తాకిన ఈ దృశ్యానికి ఎమోషనల్గా కనెక్టయిపోతున్నారు. పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి సంబంధించిన ఈ సంఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. మనం స్వయంగా ఆటల్లో పాల్గొనకపోయినా.. ఇతరుల ఆనందాన్ని చూస్తూ కూడా సంతోషాన్ని పొందవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ఒక దివ్యాంగ చిన్నారి తన స్నేహితులు ఆడుకుంటుంటే చూసి.. వారితో పాటు నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంది. ఆమె శారీరక స్థితి వల్ల వారితో కలిసి పరిగెత్తలేకపోయినా.. ఆమె ముఖంలోని చిరునవ్వు నెటిజన్లను ఒకేసారి భావోద్వేగానికి, ఆనందానికి గురిచేసింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి మెట్ల వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు తరుముకుంటూ.. కుస్తీ పడుతూ ఆడుకుంటున్నారు. వారు అటు ఇటు పరిగెడుతూ నవ్వుతుంటే.. ఆ చిన్నారి అక్కడే కూర్చుని వారిని గమనిస్తూ.. వారితో పాటు కేరింతలు కొడుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.ఈ వీడియో నిడివి తక్కువైనా.. అది పంచిన భావోద్వేగం మాత్రం చాలా పెద్దది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారి తన బాధను మర్చిపోయి.. కేవలం తన స్నేహితుల ఆటను చూస్తూ వారితో కలిసి నవ్వుతోందని ఆ వీడియో వివరించింది. ఇది ఆ దృశ్యానికి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె చిరునవ్వు చూస్తుంటే ఒక పక్కన మనసు నిండిపోతోంది. మరోపక్క కళ్లు చెమర్చుతున్నాయి. చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి’’ అంటూ నెటిజన్లు దీవెనలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by diva choudhary (@deeva_2024) -
"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్ అంతే..
కార్యాలయాల్లో లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినా..కాసింతా వేడివేడి చాయ్ తాగితే దెబ్బకు రిలీఫ్గా ఉంటుంది. మళ్లీ నూతనోత్సాహంతో మన పనిలో పడిపోతాం. అందుకే చాయ్ప్రియులకు ఇదంటే అంత మక్కువ. అలాంటి చాయ్ని అత్యంత లగ్జరీయస్ అందించే ప్రయత్నం చేశాడు. ఆ ఆలోచనే కనీవినీ ఎరుగని అద్భుతం. మరి ఆ వెరైటీ సర్వింగ్ స్టైల్ ప్రజలకు నచ్చిందా అంటే..ఎన్నో టీ స్టాల్స్ చూశారు గానీ ఇలాంటి వినూత్న చాయ్ స్టాల్ని మాత్రం చూసే ఛాన్సేలేదు. తన టీ స్టాల్ కోసం లక్ష రూపాయల రోల్స్రాయ్స్ను అద్దెకు తీసుకున్నాడు. చిన్నిచాయ్ స్టాల్కి అంత లగ్జరీ కారు దేనికి అనుకోకండి మనోడు ఆలోచన ఏ రేంజ్లో చూద్దాం రండి. అతడు తాను విలావంతమైన కారులో టీ సర్వీస్ని అందివ్వాలనుకున్నాడట. అందుకు రోల్స్రాయ్స్ కారుని అద్దెకు తీసుకున్నారు. ఈ ఆలోచను టీ స్టాల్ యజమానితో పంచుకోగా వాళ్లు కూడా అంగీకరించారు. అందుకోసం వాళ్లు బోర్డును ప్రింట్ చేసి కస్టమర్ల కోసం రెడ్కార్పెట్ పరిచాడు. 'టీ' తోపాటు కుకీలు, బిస్కెట్లు ఏర్పాటు చేసి..అమ్మకాలు ప్రారంభించాడు. ఇది చూసిన అక్కడున్న జనాలకు భలే ఆసక్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ అనుభవం పొందాలనే ఉద్దేశ్యంతో అందరు ఆ లగ్జరీ కారులో జర్నీ చేస్తూ టీ తాగే అనుభవాన్ని పొందారు. ఈ లగ్జరీ చాయ్ స్టాల్కి అయిన ఖర్చు రూ. 1,08,000 అయితే అతను సంపాదించింది రూ. 88,400. పాపం అతనికి నష్టమే అయినా..చాలామంది జీవితంలో ఇలాంటి కారు కొనగలమో లేదో తెలియకపోయినా..తమ కుటుంబాలతో టీ తాగుతూ ఆనందించారు అదే చాలు అని అంటున్నాడు. ఏ వ్యాపారమైన మొదట్లోనే లాభాలు వచ్చేయవు కదా..రాను రాను ఊపందుకోవచ్చు కూడా. ఏదీఏమైనా ఈ ఐడియా అదుర్స్ కదూ..!. అతడి ఆలోచన అలా ఇలా లేదు బ్రో..ఇలా మరెవ్వరకీ సాధ్యం కాదేమో అని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by deluxe (@deluxebhaiyaji) (చదవండి: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
ఆ ఒక్క మాట.. లేదంటే వారి ప్రాణాలు గాల్లోనే!
కళ్లముందు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తున్నప్పుడు మనల్ని రక్షించుకునేందుకు అందరమూ ముందుగా చేసి పని అక్కడినుంచి పారిపోవడం, ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా పరుగెత్తడం. ఏప్రిల్ 6న ఇండోనేషియాలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో (Mount Dukono) వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని అనుభవం ఎదురైంది. అయితే క్షణాల్లో వారి ప్రాణాలను కాపాడిన గైడ్ నిర్ణయం నెట్టింట విశేషంగా నిలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఛానల్ న్యూస్ ఏషియా నివేదిక ప్రకారం మౌంట్ డుకోనో అగ్నిపర్వతం శిఖరానికి సమీపంలో ఆ బృందం ట్రెక్కింగ్ చేస్తుండగా, కేవలం కొన్ని మీటర్ల దూరంలో అకస్మాత్తుగా విస్ఫోటనం సంభవించింది. క్షణాల్లో బూడిద, శిథిలాలతో కూడిన ఒక ఎత్తైన స్తంభం ఆకాశంలోకి ఎగసి పడింది. దీంతో అక్కడున్న పర్వతా రోహకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అక్కడినుంచి దూరంగా వెళ్ళాలనే ఆశతో కొండ కిందికి వెళ్లడం ప్రారంభించారు. కానీ వారి లోకల్ గైడ్ వెంటనే జోక్యం చేసుకుని, అందరినీ ఆగి, ఉన్నచోటనే ఉండమని ఆదేశించాడు. "కిందికి వెళ్లొద్దు, పైకే రండి!" అని ఆ గైడ్ గట్టి గట్టిగా కేకలు వేసి మరీ అప్రమత్తం చేశాడు. గైడ్ చాకచక్యంతో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గాలి దిశను, బూడిద ప్రవహించే మార్గాన్ని అంచనా వేసిన గైడ్, అందరినీ ఒకే చోట ఉంచడం ద్వారా వారు సురక్షితంగా ఉండేలా చూడడం ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇలాంటి కీలక ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేసేటపుడు అనుభవం ఉన్న స్థానిక గైడ్ల సలహాలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది అంటున్నారు.Terjebak di puncak saat abu vulkanik mulai membumbung tinggi! Di saat semua orang panik ingin lari ke bawah, guide ini justru mengambil keputusan yang dianggap 'gila': Melarang pendaki turun! Ternyata, ini adalah langkah paling jenius untuk menghindari awan panas dan material… pic.twitter.com/JNGe1g8pzA— Cadas (@Music_Cadas) April 14, 2026ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఎందుకు కిందికి వెళ్లకూడదు అంటేసాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు దూరంగా వెళ్లాలని అనుకుంటాం. కానీ అగ్నిపర్వతాల విషయంలో, వేగంగా కదిలే వేడి బూడిద మేఘాలు (Ashclouds) విష వాయువులు కొండవాలు గుండా కిందికి ప్రవహిస్తాయి. కిందికి పరిగెత్తితే నేరుగా ఆ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.మౌంట్ డుకోనో: ఇది ఉత్తర మలుకులోని హల్మహెరా ద్వీపంలో ఉంది. ఇది తరచుగా విస్ఫోటనం చెందుతూ ఉంటూ, బూడిదను వెదజల్లుతుంటుంది. సాహస యాత్రికులకు ఇది ఇష్టమైన ప్రదేశం అయినప్పటికీ, ఇక్కడి పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి.ఇదీ చదవండి: TCS Nasik case: టీసీఎస్ మరో కీలక నిర్ణయం -
డోంట్ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..!
ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారామె. ఆ డ్రైవర్ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. ఇంతకీ ఆ డ్రైవర్ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ తన పోస్ట్ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్ని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..) -
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాంఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
'నాన్న'గా గర్వించే క్షణం..!
పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా.. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. అలాంటి క్షణం ఏ నాన్న అంత తేలిగ్గా మర్చిపోలేని జ్ఞాపకం కూడా. అలాంటి అనుభూతినే ఓ టెకీ తండ్రి పొందాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ తన తండ్రికి అమెజాన్ ఆఫర్ లెటర్ చూపిస్తూన్న వీడియో ఇది. అది అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ప్రతితల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది ఇదే కదా అని నెటిజన్లు అంటుడంటం విశేషం. ఆ వీడియోని శైలేంద్ర యాదవ్ అనే టెకీ పంచుకున్నారు. ఆయన ఆ వీడియోకి మా నాన్న నా ఆఫర్ లెటర్ చదవుతున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టెకీ తండ్రి ఆఫర్ లెటర్ చదువుతూ కనిపిస్తారు. ఇది నాన్నగా గర్వించే క్షణం, హృదయానికి హత్తుకునే ఘటన కూడా అని నెటిజన్లు అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు. ఇక టెకీ శైలేంద్ర పోస్ట్లో తాను రైతు కుటంబం నుంచి వచ్చాననని. సరైన విద్యకు అవకాశాలు పరిమితులుగా ఉండే మా కుటుంబంలో ఇంజనీర్ అయిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. తన చదువు కోసం తన తండ్రి ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశారో కూడా చెప్పాడు. తనకు ఉత్తమ అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. చివరికి అమెజాన్ నుంచి ఎస్డిఇ-2 ఆఫర్ను సంపాదించాను. అయితే ఈ విషయాన్ని మాములుగా చెప్పకూడదనిపించి వాలెంటైన్స్ డే రోజున చాల సర్ప్రైజ్ ఇచేలా చెప్పాను. ఈ గుడ్న్యూస్ చెప్పడం కోసమే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లానని అన్నాడు. ఆయన నాకోసం చేసిన వాటన్నింటిలో చాలా చిన్న మొత్తంలో ఇలా తిరిగి ఇచ్చినట్లుగా నాకనపించిందన్నారు. (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్లో రాకీభాయ్లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
ఉదయాన్నే ప్లైన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా?
ఉదయం అల్పాహారం అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ, దోసె. మీకు కూడా దోసె తినడం ఇష్టమా? అయితే, ఒక ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కీలక హెచ్చరిక చేస్తున్నారు మార్నింగ్ ప్లైన్ దోసె (Plain Dosa) తినడం మానేయమని ప్రజలను కోరుతున్నారు. అయితే దోసె అనారోగ్యకరమైందా? ఎలా తినాలి? తెలుసుకుందాం.ప్రధానంగా దక్షిణ భారతదేశంలో దోసె అనేది ఒక ఎమోషన్. రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే తేలికైన, పోషకమైన టిఫిన్ అనుకుంటాం. కొందరు ఉపవాసాల సమయంలో, మరికొందరు బరువు తగ్గించుకునే డైట్లో కూడా దీన్ని చేర్చుకుంటారు. అయితే ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. బరువు తగ్గాలనుకుంటే అల్పాహారంలో దోసె తినడం మానుకోవాలని ఇటీవల ఒక వీడియోలు పేర్కొన్నారు. విచిత్రంగా అనిపిస్తోందా? దీనికి గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు.దోశలో స్వతహాగా అనారోగ్యకరమైనదేమీ లేదు.. అది కేవలం బియ్యం, మినపపప్పును పులియబెట్టి తయారు చేస్తారు. సాంబార్ కూడా ఒక పప్పు పదార్థమే కాబట్టి దానిలో అరోగ్యకరమే .అసలు సమస్య అది కడుపు నింపే గుణం విషయంలోనే ఉందని సింగ్ వెల్లడించారు.దోసె సులభంగా జీర్ణమైనప్పటికీ, గంటలోపే ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువ కావడంతో అదనపు కేలరీలను తీసుకుంటాం అని సింగ్ చెప్పారు. దాన్నే ‘హై గ్లైసెమిక్ రెస్పాన్స్’ అంటారు. దోసె తిన్న వెంటనే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతుంది. వెంటనే ఆకలి వేయడానికి కారణం ఇదేనట. మితంగా తినాలి. వెంటనే దోసెకు చెక్ పెడదాం అనుకుంటున్నారా. ఆగండాగండి. ఈ సెలబ్రిటీ ట్రైనర్ దగ్గర ఒక పరిష్కారం ఉంది. కడుపు నిండింది అనే ఫీలింగ్ రావడానికి దోసె లోపల రుచికరమైన ఫిల్లింగ్ను జోడించుకోమని సూచిస్తున్నారు. అంటే తురిమిన పనీర్ దట్టించిన దోసె కానీ, మసాలా దోసె గాని తీనమని సలహా ఇచ్చారు. View this post on Instagram A post shared by Siddhartha Singh (@officialsiddharthasingh) మరి దోసె ఆరోగ్యకరమైందేనా? ఆరోగ్యకరమైందే. కానీ మితంగా తినాలి. పులియబెడతాం కాబట్టి, కడుపుకు తేలికగా ఉంటుంది, శక్తి కోసం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. అధిక కేలరీలు గల చట్నీలకు బదులుగా సాంబార్ వంటి ఆరోగ్యకరమైన సైడ్ డిష్లతో కలిపి తీసుకుంటే మంచిది. మినప పప్పు కలుస్తుంది కాబట్టి కొంత ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు సాంబార్తో కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఇంకా పెరుగుతుంది. పులియబెట్టడం ఇతర అల్పాహారాలతో పోలిస్తే దోస సులభంగా జీర్ణమవుతుంది. మరీ సాదా దోసెలాగా కాకుండా పనీర్, కార్న్, మసాలా మష్రూమ్ లాంటివి యాడ్ చేసుకుంటే కడుపూ నిండుతుంది. ఎక్కువ సేపు ఆకలీ వేయదు. -
'అచ్చం చిన్ని కృష్ణుడిలానే'..!
పసిపిల్లలు సహజంగానే ముద్దుగా అనిపిస్తారు. వారి అమాయకపు మోము ఎవ్వరినైనా.. ఇట్టే కట్టిపడేస్తుంది. కొందరు చిన్నారులను చూడంగానే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంటుంది కూడా. కానీ ఈ చిన్నారిని చూడగానే వాసుదేవ నందనుడు, ఆ నందగోపాలుడే గుర్తుకొస్తాడు. చిన్ని కృష్టుడిలా ముద్దుగా ఆకర్షిస్తున్న ఈ చిన్నారిని చూసి ఎవ్వరూ కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా ముగ్ధమనోహరంగా ఉందా ఆ పాపాయి. ఆ జగన్నాథుడే మళ్లీ ఈ భువిపై ఇలా చిన్ని కృష్ణుడిలా అవతరించాడా అన్నంతగా అందంగా ఉంది ఆ చిన్నారి. ఆ చిన్నారి చిరునవ్వు నుంచి ఆడుకుంటున్న విధానం అన్ని చూస్తే..ఒక్కసారిగా మన కళ్లముందు శ్రీకృష్ణుడి బాల్య జ్ఞాపకాలు కదలాడతాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి “అచ్చం చిన్ని కృష్ణుడిలాగే ఉన్నాడు!” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఈ వీడియోకి వేలల్లో లైక్లు, వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి మరి..!.Looks just like little Krishna!🥰 pic.twitter.com/XrTWBV8gwV— 𝑺𝒂𝒏𝒅𝒉𝒚𝒂𝒂'𝒗 (@vedicvenus_) April 10, 2026 (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని ఫైన్
మనదేశంలో ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించవనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగౌర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నడుపుతున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్షేడ్ అమర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయల జరినామా విధించారు. అక్కడితో ఆగకుండా పొల్యుషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ చూపించాలని వాహనదారుడిని పోలీసు అధికారి అడిగారు. అతడు చూపించకపోవడంతో మరో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని ఎంత చెప్పినా సదరు పోలీసు పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయలేదని, సాక్ష్యం చూపించాలని కోరినా పట్టించుకోలేదు. తనకు అకారణంగా జరిమానా వేసినందుకు కోర్టులో వేస్తానని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్కచేయలేదు. ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందని.. ఇది కాలిక్యులేటర్ను వాతావరణం గురించి అడిగినట్టుగా ఉందని సెటైర్ వేశారు. తెలియని విషయాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించడాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజనులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని చాలా మంది పోలీసులకు తెలియదని, ఇలాంటి విషయాలపై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు."ఇలాంటి పోలీసు అధికారుల వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించర''ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలోని తెలివితక్కువ వారి వల్లే దేశం నాశనం అవుతుందని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంతకైనా దిగజారతారని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈవీకి కచ్చితంగా పీయూసీ వర్తించదని, ఒకవేళ డ్రైవింగ్ సమయంలో కారు కిటికీలకు కర్టెన్లు వేసివుంటే చలానా విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ అన్నారు. नागौर पुलिस ने नया कानून लागू किया है इलेक्ट्रिक कार की PUC करवाओ नहीं तो आपके भी PUC का चालान कटेगालो साहब ने काट दिया 1500 की चालान😳😲 pic.twitter.com/uYpFvT0If1— एक नजर (@1K_Nazar) April 8, 2026చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు! -
బావి నుంచి సింహ గర్జన.. చివరికి జరిగింది ఇదే..!
‘పదిహేను అడుగుల లోతు బావిలో పడ్డ సింహం.. గంటపాటు సాగిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..’ గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బావిలో చిక్కుకున్న ఒక సింహాన్ని అటవీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఏప్రిల్ 13న నవబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది.అటవీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ సింహం ఆహారం వేటలో తన నివాసం నుండి బయటకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీటి బావిలో పడిపోయింది. బయటకు రాలేక.. తీవ్రంగా పోరాడింది. సింహం గర్జనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జసాధర్ అటవీ శాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్ను రంగంలోకి దిగింది. సింహం బావిలో పడిందన్న వార్త తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.అటవీ సిబ్బంది బలమైన తాళ్లను బావిలోకి దించారు. సింహం వాటిని పట్టుకుంటుందని పైకి లాగడానికి వీలుగా ఉంటుందని భావించారు. అయితే, భయపడిపోయిన ఆ సింహం దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఆ తాళ్లను పళ్లతో కొరికేసింది. దాదాపు 30 నిమిషాల పాటు రక్షణ సిబ్బందికి, సింహానికి మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగింది.A wild chase turned into a rescue mission in Gujarat.Near the forested stretch of Navabandar in Una taluka, a majestic lion, likely in search of prey, accidentally fell into an open farm well.What followed was a race against time.With swift coordination and remarkable… pic.twitter.com/Ssj7if76Hz— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2026చివరకు శ్రమ, సమన్వయంతో అధికారులు ఒక తాడు ఉచ్చును ఉపయోగించి సింహాన్ని బంధించగలిగారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి.. బావి అంచున ఒక బోనును సిద్ధంగా ఉంచారు. ఆపై సిబ్బంది మొత్తం కలిసి సింహాన్ని పైకి లాగడం ప్రారంభించారు. బావి నుంచి పైకి రాగానే.. సింహం సహజంగానే పక్కనే ఉన్న బోనులోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది బోను తలుపులు వేశారు. సింహం సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ రెస్క్యూ వీడియోను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘సమన్వయం, అసాధారణమైన ధైర్యంతో, అటవీ శాఖ బృందం గంటపాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి. సింహానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రక్షించారు’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. -
పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్
వివాహ వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్.అలాగే పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది. అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్, ఆపిల్స్ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు. రొటీన్గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by FeelKarkeDekho (@feel_karkedekho) ఒక మేరకు పళ్లు వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్ ప్యాకెట్లతో డెకరేట్ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట సందడి చేస్తోంది. 2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు. ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. -
ఒక రాధ ఇద్దరు కృష్ణులు!
వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.అయితే.. సంభల్కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది. -
గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!
విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్స్టైల్కి అడ్జెస్ట్ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్ని మధ్యలో వదిలేసి భారత్కి వచ్చాశాడో సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించాడు. ఆ పోస్ట్లో మానవ్ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్గా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Manav Shah (@physiomanav) (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
రైలు బోగినే దేవాలయం, బెర్త్పైనే పూజలు, వైరల్ వీడియో
రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్ పూజా మందిరంగా మార్చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఈ వీడియోలో చూడవచ్చు.భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'భారత్ గౌరవ్' అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి పూజాకార్యక్రమాలు భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో నిర్వహించడం గమనార్హం. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకుద్దేశించినవేఅయినప్పటికీ కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది. View this post on Instagram A post shared by TUBELIGHT (@the_tubelight)సోషల్ మీడియా స్పందనఈ వీడియో ఇంటర్నెట్లో భారీ వ్యూస్ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు. “ఒక ముస్లిం వ్యక్తి రైలులో నమాజ్ చేస్తే అది తప్పా... మరి దీని సంగతేంటి... నేను హిందువునే, కానీ అన్నిటికంటే ముందు నేను భారతీయుడిని.” అని ఒకరు వ్యాఖ్యానించారు. “సందర్భం ముఖ్యం! ఇది తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు. ఈ భక్తి కార్యక్రమాలకు సిబ్బంది అధికారికంగా మద్దతు ఇస్తున్నారు, ఇవి థీమ్ ఆధారిత ప్రయాణ అనుభవంలో భాగం. ప్రజలు వివరణ చదవకుండా లేదా ఇది ఒక సాధారణ పబ్లిక్ కోచ్ కాదని అర్థం చేసుకోకుండా స్పందిస్తున్నారు.” ఇంకొకరు ఆగ్రహం ప్రకటించారు. “వారిని ఇప్పటికే జైల్లో ఎందుకు పెట్టలేదు? బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అర్థంలేని పనులను ఎలా సహిస్తున్నారు? ఇది కేవలం వైరల్ రీల్స్ కోసమా లేక ఏంటి?” ఒకరు, “ పనీ పాటా, జ్ఞానం లేని ప్రజలు, ఇలా తయారవుతున్నారు.” అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. హితవు చెప్పిన NCIBఈ వీడియో బాగా వైరల్గా మారడంతో, NCIB అధికారిక ఖాతా ద్వారా స్పందించింది. బహిరంగ ప్రదేశాల నిబంధనలను గౌరవించాలని ప్రయాణికులను కోరింది. -
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్. *కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026 (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!) -
మండే ఎండల్లో కూల్ గిప్ట్ : ఎవరికైనా కన్నీళ్లాగవు!
ఇంట్లో వాడని వస్తువులను, దుస్తులను ఇంట్లో పనిచేసే సహాయకులకు గిఫ్ట్గా ఇవ్వడం కాలా కామన్. కానీ తన ఓనర్ ఇచ్చిన బహుమతికి ఒక ఇంటి పనిమనిషి ఉబ్బితబ్బిబ్బైన ఘటన నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సర్ప్రైజ్ గిప్ట్ చూసి ఆమె మొదట చాలా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత భావోద్వేగానికి లోనైంది. మనుషుల మధ్య ఉండాల్సిన అసలైన బంధానికి, మానవత్వానికి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచిందిఇంతకీ ఆమెకు లభించిన గిఫ్ట్ ఏంటి?దేశవ్యాప్తంగా వేసవి ఎండలు తీవ్ర స్థాయికి చేరాయి. ఏప్రిల్ మాసంలో ఎండలు మండిపోతున్న వేళ, ఒక కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్ (Air Cooler) బహుమతిగా ఇచ్చింది. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొన్న కూలర్ అని చెప్పగానే ఆ మహిళ ఆనందంతో పొంగిపోయింది. ప్రేమతో ఇచ్చిన చల్లని కానుకను చూసి యజమానిని గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనైంది. ఇన్స్టాగ్రామ్లో ఈ హృద్యమైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటివరకు 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Coco & Chico 🐾 (@lifeofcocoandchico)నెటిజన్లు స్పందనఈవీడియో చూసి నెటిజన్లు నిజమైన అనుబంధం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె అవసరాలను గుర్తించి, ఆమెను సంతోషపెట్టడానికి కొంచెం కరుణ, చిరు సాయం, కొంచెం సానుభూతి ఉంటే చాలు అంటూ ప్రశంసించారు. ప్రపంచమంతా ఇలాంటి మానవత్వం, ప్రేమ, గౌరవంతో ఉంటే ఎంత బాగుంటుందో అని మరికొందరు వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇలాంటి ఘటనే..తమ ఇంట్లో సభ్యురాలిలా చూసుకుంటూ, తమ పెంపుడు కుక్కలను కూడా తన బిడ్డల్లా ప్రేమించే గృహకార్మికులకు ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఎంతో సంతృప్తినిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇదే తరహాలో గతంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో జ్యోతి అనే పనిమనిషి తన పుట్టినరోజున "ఈరోజు మా అమ్మ బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమించేది" అని ఏడుస్తుంటే, ఆమె యజమాని (కృతార్థ)అతని స్నేహితులు ఐస్క్రీమ్ కేక్ తీసుకొచ్చి ఆమెతో పుట్టినరోజు వేడుకలు జరిపి ఆమెను ఆశ్చర్యపరిచిన ఘటన నెటిజనులను బాగా ఆకట్టుకుంది.ఇదీ సంగతి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం -
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
రేంజ్ మారినా.. మారిపోని ఫ్రెండే ఇతడు..!
స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా..స్టేటస్ మారినా..ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్..!. ఇంతకీ అతడేం చేశాడంటే..గురుగ్రామ్లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్ చౌహన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్ యూజర్ చౌహన్ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్గా చెబుతాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లు అవధేష్ పేర్కొన్నాడు.ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్గా ఉపయోగించి బేకర్ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Harsh Chauhan • Raw Life (@otherharsh) (చదవండి: ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!) -
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్. -
బెంజ్ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో క్రేజ్కోసం ఎ లాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదు. తాజాగా రష్యన్ మహిళ నిర్వాకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రష్యాకు చెందిన ఒక మహిళ లగ్జరీ కారునే బాత్రూమ్గా మార్చేసింది. మార్పులు చేర్పులు చేసిన మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తూ జుట్టును వాష్ చేసుకుంది. నడిరోడ్డుపై పోతూ పొడవాటి తన జుట్టుకు షాంపూ పూసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం,టవల్ చుట్టుకోవడం లాంటి తతంగాన్నంతా పూర్తి చేసింది. కార్లో వెడుతూనే జుట్టు కడుక్కున్న వైనం నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ⚡️🚨 شابة روسية تقوم بغسل شعرها اثناء مرور سياره مرسيدس محوله السياره إلى حمام منزلي مما أثارت جدل واسع جداً بطريقتها الغريبة . pic.twitter.com/KILM9cZgzp— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) April 9, 2026 ; ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేలం వెర్రి అని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద జుట్టునుఅలా వాష్ చేసుకుంటోంది...పొరపాటున ఆ జుట్టు టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే! -
ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..
అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్ట్ని గ్రెయిల్మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్ఇన్లో షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్ని బుక్ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్ అయ్యింది. డ్రైవర్ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు. ఆ రైడ్ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్ వచ్చింది. తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నట్లుగా ఓపెన్ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్ మెసేజ్ పంపింది. ఆ ఉబర్ డ్రైవర్ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్కి నిజంగా ఐదు స్టార్లు అంటూ పోస్ట్ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.(చదవండి: ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్టాపిక్గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!) -
ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్
ఆడపిల్ల అనే చిన్నచూపుతో ముద్దుల మూటగట్టే కవల పిల్లల్ని కన్నతండ్రే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ప్రతీ ఒక్కరినీ కంట తడిపెట్టించింది. ఆధునిక సమాజంలో కూడా ఆడబిడ్డల్నిఒక భారంలా చూస్తున్న వైనం ఆందోళన రేపుతోంది. అయితే డెహ్రాడూన్లోని ఒక కుటుంబం తమ ఇంట ఆడబిడ్డ పుట్టిన క్షణాలను ఆనందంగా జరుపుకున్నారు. తద్వారా ఆడబిడ్డలు భారం కాదు, బలం ఆనందం, సంతోషం అనే శక్తివంతమైన సందేశాన్ని అందించారు.కుటుంబంలోకి ఒక బిడ్డ రావడం సంతోషాన్నిచ్చే వార్తే. జెండర్తో సంబంధం లేకుండా కుటుంబమంతా ఆనందపడాల్సి క్షణాలు. డెహ్రాడూన్లోని కుటుంబం అదే చేసింది. కాదు కాదు మరింత ప్రత్యేకంగా తమ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం పలికింది. బంధువులకు, స్నేహితులకు మామూలుగా ప్రకటించడం కాకుండా, అందరూ గుర్తుంచుకునే విధంగా పండగలాగా వేడుక చేశారు. ఆనందంతో కుమార్తెకు స్వాగతం పలకడమేకాదు యావత్ దేశం చూడగలిగే ఒక సందేశాన్ని ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇదీ చదవండి : గుండె పగిలింది : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదంట్రాఫిక్ను నిలిపివేసి మరీ వేడుకఆ కుటుంబం రెండు కార్లలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. గులాబీ రంగు బెలూన్లతో అందంగా అలంకరించి దానిపై ‘బేటీ హుయీ హై’ (ఆడబిడ్డ పుట్టింది) అని రాసి ఉన్న ఒక ప్లకార్డు ఉంచారు. ఆ కార్లను నగర వీధుల్లో ఊరేగించారు. ఇది అందర్నీ విపరీతంగా ఆకర్షించింది. ఎంతలా అంటే ట్రాఫిక్ను నిలిపివేసి మరీ ఆ కుటుంబం సంతోషంలో పాలు పంచుకున్నారు. వాహనదారులు తమ వాహనాలను ఆపివేసి మరీ ఈ వేడుకను తిలకించారు. ఈ వీడియోను నీరజ్ పాశ్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!A family in Dehradun celebrated their baby girl’s birth, driving around announcing “Beti Hui Hai,” spreading joy, breaking stereotypes, and inspiring others to proudly welcome daughters with love and pride.🎥 Credits: @rjneeraj pic.twitter.com/jaLIsdEbcG— OneVision Media (@onevision_media) April 8, 2026మరోవైపు ఈ కుటుంబ సభ్యులలో ఒకరైన తాన్యా సిన్హా కూడా దీని సంబరం వెనుక క్షణాలను పంచుకున్నారు. కారును ఎలా అలంకరించారో అలా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆమె పంచుకున్నారు. వైరల్ అవుతుందని తాము ఇలా ప్లాన్ చేయలేదనీ, కేవలం తమ ఆనందాన్నిఇలా ప్రకటించుకున్నామని వివరించారు. ఇదీ చదవండి: త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్ స్పందన ఇదే! -
ఇది అందరూ చూడగలిగే పువ్వు కాదు..!
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. తనలో ఇముడ్చుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచుతామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా..!.ఈ మంచు పుష్పం ఐదు నుంచి ఎనమిదేళ్లు పెరిగి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట ఈ పర్వత పుష్పం. 'అరుదైన అందం', 'జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం' వంటి పదాలు సరిపోతాయేమో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని సాసురియా ఇన్వోలుక్రాటా లేదా సాసురియా లానిసెప్స్ అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే ఇది అందరు చూగలిగే పువ్వు కాదని అంటుంటారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే కాకుండా హిమాలయాలు, టియాన్షాన్ పర్వతాల్లో నివశించే కొద్దిమందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది అందమైనది మాత్రమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. నిజానికి పదివేల కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడను కష్టతరం చేస్తాయి. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిది కష్టాలను ఓర్చుకునే తన మనగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!) -
'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!
మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్) మధ్య సాగే పాటలోని సీన్ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by _VED_46_..!!❤️ (@__ved_46__) (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!
విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్ చేశాడు.ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఆమెకు 2018లో పంజాబ్లోని జలంధర్లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.సెలబ్రేషన్స్ ఎందుకంటే..ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్ చేశాం. అని చెప్పారు.मेरठ: तलाक के बाद बेटी को ढोल-नगाड़ों के साथ घर लाए रिटायर्ड जज#Meerut pic.twitter.com/LpPhkU8aSg— NDTV India (@ndtvindia) April 5, 2026 (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!
చైనాలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ, అనూహ్య పరిస్థితిలో రైలులో రక్త వాంతి చేసుకుంది. అయితేతన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఆమె చేసిన పని లక్షలాది మంది మనసులను గెలుచుకుంది. అంతేకాదు ఆమె పరిస్థితి వారిని కదిలించి, కోట్ల రూపాయలను భారీ విరాళాలను ఆమెకు అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగింది? స్థానిక మీడియా కథనం ప్రకారం చైనాకు చెందిన హు జిన్యావో (Hu Xinyao) అనే 23 ఏళ్ల యువతికి చిన్న వయసులోనే ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' (ANCA-associated vasculitis) అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఇంజెక్షన్ తీసుకోవడానికి హు జిన్యావో ఆసుపత్రికి వెళ్తుండగా జీర్ణవ్యవస్థలో అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల అనుకోకుండా రక్తం కక్కుకుంది. దీంతో వెంటనే తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన కోట్తోనే నెమ్మదిగా ఆ రక్తాన్ని శుభ్రపర్చింది. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.జియుపాయ్ న్యూస్ ప్రకారం, మార్చి 23న, చాంగ్కింగ్లోని మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు ఆ మహిళను చిత్రీకరించగా, ఆ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె వైద్యం కోసం భారీగా విరాళాలు అందాయి. సుమారు 4,00,000 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.7 కోట్లు విరాళాలు సమకూరాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!నెటిజనుల రియాక్షన్స్"ఆమె మనసు చాలా మంచిది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "నేను ధన వంతుడ్ని కాకపోయినా, ఆమె చికిత్స కోసం నా వంతు సాయం చేస్తాను" అని మరొకరు తన వంతు సాయం చేశారు. ఇలా వారంలోపే ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ఎంతలా అంటే, ఆమె సోషల్ మీడియా ఖాతాకు విరాళాలు వెల్లువెత్తడంతో ప్లాట్ఫారమ్ తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో స్పందించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. "నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు పంపిన మొత్తాన్ని నేను నోట్ చేసుకున్నాను. ప్రజలు నాపై చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా సాయం చేయాలని ఆశిస్తున్నాను," అని హు భావోద్వేగంతో చెప్పింది. ఎవరీ హు హు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చింది. 2018లో స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఫలితంగా వైద్య ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే ఆపేసింది. ఆపై రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించింది. Hu కుటుంబం ఆమె అనారోగ్య చికిత్స కోసం లక్షల కొద్దీ ఖర్చుపెడుతోంది. గత ఏడాది కాలంలోనే ఆమెకు ఆసుపత్రి నుండి 20 సార్లు 'క్రిటికల్ ఇల్నెస్' (ప్రాణాపాయ స్థితి) నోటీసులు వచ్చాయి. అయినా జీవితాన్ని నెట్టుకొస్తూ ప్రస్తుతం ఆన్లైన్ నవలలు రాస్తూ నెలకు 5,000 నుండి 6,000 యువాన్లు సంపాదిస్తుండటం గమనార్హం.ప్రియుడితో బ్రేకప్ ఇలాగత సెప్టెంబర్లో ఆమె మాజీ ప్రియుడు 'సియావో' ప్యాంక్రియాటైటిస్తో మరణిస్తూ, తన దగ్గర ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని హు చికిత్స కోసం ఇచ్చి వెళ్ళాడు. తమ బంధం కేవలం రెండు నెలలే అయినప్పటికీ, తన అనారోగ్యం వల్ల అతడి జీవితం పాడవకూడదని హు అంతకుముందే అతడికి బ్రేకప్ చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ నిస్వార్థమైన బంధం కూడా ప్రజలను ఎంతగానో కదిలించింది.గొప్పమనసుపెద్ద నగరాల్లో వైద్య చికిత్స పొందుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ,వారి బంధువులు బస చేయడానికి వీలుగా ఒక "రోగుల గృహం" నిర్మించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని హు మీడియాకు తెలిపింది. ఇటీవల ఆమె పరిస్థితి కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏప్రిల్ ప్రారంభంలో తూర్పు జియాంగ్సు ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రిని సందర్శించాలని యోచిస్తోంది. -
ఫ్లూట్లు అమ్ముకునే వ్యక్తి కథ..!
సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సంగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్జోత్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్జోత్. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Prabhjot Singh (@intent.content.form) (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
వంటగదిలో పని మనిషి కన్నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..!
ఓ భావోద్వేగ క్షణం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. తన ఇంట్లో పని చేసే మహిళ కోసం ఓ యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కృతార్థ అనే యువకుడు తన ఇంట్లో పనిచేసే జ్యోతిని ఆప్యాయంగా ‘దీదీ’ అని పిలుస్తుంటారు. ఓ రోజు అతను.. జ్యోతి వంటగదిలో కన్నీరుపెట్టుకోవడం గమనించాడు. ఏం జరిగిందంటూ విచారించగా.. ఆమె చెప్పిన మాటలు ఆ యువకుడి గుండెల్ని పిండేశాయి. ఇవాళ నా పుట్టినరోజు.. ఒకవేళ నా తల్లి బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేదంటూ ఆమె వాపోయింది. జ్యోతి చాలా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. అందుకే తన పుట్టినరోజున ఒంటరితనంతో ఆమె అలా భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె గతాన్ని మార్చడం సాధ్యం కాదు కానీ.. ఆమె కళ్లలో సంతోషం చూడడానికి కృతార్థ.. తన స్నేహితులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ కలిసి ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలని నిశ్చయించుకున్నారు. వీడియోలో చూపినట్లుగా.. ఆ బృందం ఒక కేక్ ఏర్పాటు చేసి చిన్నపాటి వేడుకను నిర్వహించారు. ఈ వేడుక సమయంలో జ్యోతి తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఆర్డర్ చేసుకుని పార్టీ చేసుకోమని.. తన వద్ద ఉన్న 500 రూపాయలను వారికి ఇవ్వబోయింది.. కానీ కృతార్థ, అతని స్నేహితులు ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించారు.. ప్రేమతో ఆమె పుట్టినరోజును జరిపారు. ‘‘ఈ వీడియోలోని నిరాడంబరత, మానవత్వం వేలాది మంది హృదయాలను తాకింది. ఆమె ముఖంలోని ఆ చిరునవ్వే సమాధానం ఇస్తోంది. ఇన్స్టాగ్రామ్లో మనం చూడదగ్గ అత్యుత్తమమైన దృశ్యం ఇది. ఆమె ముఖంలో కనిపిస్తోన్న ఆ ఆనందం వెలకట్టలేనిది’’ అంటూ నెటిజన్లు స్పందించారు. View this post on Instagram A post shared by Kritartha (@tamashewala) -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్కాంగ్లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
ఐదంకెల జీతం, కార్పొరేట్ హోదా..ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అదో గొప్ప స్టేటస్. కానీ ఇపుడు కథ మారిపోయింది. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ (Oracle)12 వేల మంది టెకీల ఉద్వాసన కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదేదో తక్కువ పెర్ఫార్మర్కే పరిమితం కాదు..ఎంతో అనుభవం ఉన్నా, నిపుణులకు కూడా ఇది తప్పలేదు. దీంతో ఆయా ఐటీ ఉద్యోగులు తమ బాధలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, కార్పొరేట్ ఒత్తిడిలుని జీవితం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.పదేళ్ల పాటు అంకితభావంతో సేవలందిస్తూ, ఏడాదికి రూ. 37 లక్షల వేతనం అందు కున్న వ్యక్తి ఉన్నట్టుండి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వనేష్ మాలి అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీని ప్రకారం సదరు ఐటీ ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఉన్నపళంగా ఉద్యోగం నుండి తొలగించారు. రేపటినుంచి నీ సేవలు అనవసరం అన్న సందేశం వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు అశనిపాతంలా తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే.. బోలెడన్ని కమిట్మెంట్స్, ఈఎంఐలు, ఫీజులు లాంటి అవసరాలెన్నో కళ్లముందు మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆందోళన చెందుతారు. కానీ, మనం చెప్పుకోబోయే టెకీ మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించాడు. ఎలాంటి నిరాశ లేదా ఆందోళనకు బదులుగా, ప్రశాంతంగా ఈ పెను తుఫానులాంటి పరిస్థితిని స్వీకరించడం విశేషం. "నేను దీనిగురించి అస్సలు బాధపడటం లేదు. నిజానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపై నేను ఏ ఐటీ కంపెనీలోనూ పని చేయను. నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను." అనే నిర్ణయానికి వచ్చేశాడు.వ్యవసాయమే ఎందుకూ అంటేఇదేదో తాత్కాలిక ఆలోచనో, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదిది. దీని వెనుక ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించిన బలమైన ఆర్థిక ప్రణాళిక ఉంది. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును తెలివిగా పొదుపు చేశాడు. భవిష్యత్తులో ఉద్యోగం పోయినా అతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తగిన ఆర్థిక భద్రతను కల్పించుకున్నాడు. ఇపుడిక ఎలాంటి దిగులు లేకుండా తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ, కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ 'ర్యాట్ రేస్' (Rat Race) అని పిలిచే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచాని దూరంగా, ప్రశాంత జీవనం గడపడమే అతని లక్ష్యం.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది దీనిని 'ఆస్పిరేషనల్ మూవ్' (ఆదర్శవంతమైన అడుగు) అని అభివర్ణిస్తున్నారు. లేఆఫ్స్ అనేవి కొన్నిసార్లు మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాలని కొందరు కామెంట్ చేశారు. సొంత రూల్స్తో ర్యాట్ రేస్నుంచి వైదొలగడం అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ జీవితం కంటే వ్యవసాయం, కుటుంబాన్ని ఎంచుకోవడానికి ధైర్యం , దృఢ విశ్వాసం అవసరమని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో పొదుపు ప్రాముఖ్యత అందర్నీ ఆకట్టుకుంది. ఆకస్మికంగా ఉద్యోగం పోయినా తట్టు కోవాలంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతం కన్నా తనవాళ్ల మధ్య మనశ్శాంతిగా జీవించడంతోపాటు, భూమాతను నమ్ముకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.ఇదీ చదవండి : పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్ స్టోరీ
కనిపెంచిన తల్లిదండ్రులకు బిడ్డలు ఖరీదైన బహుమతులు అందించడం చాలా కామన్. ఎదిగిన బిడ్డలు ఎంతో ప్రేమగా ఇచ్చిన కానుకను చూసి మురిసిపోవడం ఇంకా కామన్. అయితే తల్లికి ఖరీదైన అందమైన గిష్ట్ ఇచ్చిన కొడుకు ఆ తరువాత తల్లిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. దీనికి సంబంధింన వివరాలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే..వేదిక్క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ రాజ్ కుమార్ తన తల్లికి లక్ష రూపాయల బహుమతి కొన్నాడు. కానీ దాన్నితల్లి తీసుకునేందుకు చాలా ష్టపడాల్సి వచ్చింది. దాదాపు అరగంటపాటు ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు.. ఊహించిన దానికంటే తాను చాలా ఎక్కువ సంపాదిస్తానమ్మా.. డోంట్ వర్రీ అంటూ ఆమెను ఒప్పించారు. ఆమెకు 1,200 డాలర్ల (సుమారు 1,00,500 రూపాయలు) విలువైన కళ్లజోడును కొనిచ్చిన హృద్యమైన కథను ఎక్స్లో షేర్ చేశారు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, సాహిల్ దానిని "చాలా హృద్యమైన రోజు"గా అభివర్ణించారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక హృద్యమైన కథ ఆన్లైన్లో వేలాది మంది నెటిజనులను ఆకర్షించింది. తన తల్లి షాపింగ్ చేస్తుండగా అనుకోకుండా చేసిన వీడియో కాల్ అనంతరం, ఆమెకు లక్ష రూపాయల విలువైన డిజైనర్ కళ్లజోడును ఎలా బహుమతిగా ఇచ్చాడో వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, తన కోసం విలాస వస్తువులపై అరుదుగా ఖర్చు చేసే తన తల్లి, ఒక దుకాణంలో కళ్లద్దాలు చూస్తుండగా, వాటిలో కొన్నింటిని చూపించడానికి తనకు వీడియో కాల్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. అయితే తనకు బాగా నచ్చిన కళ్లజోడు విలువ ఎక్కువ ఉండటంతో , దాన్ని కొనే ఆలోచనను ఆమె వెంటనే విరమించుకుంది. దీంతో కొడుకు కుమార్ కల్పించుకుని, ఆ డబ్బు తానే చెల్లిస్తానని చెప్పాడు, కానీ అతని తల్లికి నమ్మకం కుదరలేదు. అతను నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు, సంపాదిస్తూ, పొదుపు చేసినప్పుడే అలాంటి బహుమతిని అంగీకరిస్తానని ఆమె చెప్పింది. అలా కుమార్ ఆమెను 30 నిమిషాలు వాదించి ఒప్పించి, చివరకు ఆమె అతన్ని నమ్మిన తర్వాత, కళ్లద్దాలు కొనడానికి అంగీకరించింది. ఇదీ చదవండి : బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతంఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. సగటు భారతీయ కుటుంబాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు. పిల్లలు తమ జీవితంలో బాగా రాణిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా వారి నుండి ఆర్థిక సహాయం స్వీకరించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని పేర్కొన్నారు.ఇదీ చదవండి : రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి -
సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!
యంగ్గా ఉన్నప్పుడు నేర్చుకోవడం వేరు..పెద్ద వయసు వచ్చాక కొత్తవి నేర్చుకోవాలన్న లోలోన ఏదో బెరుకు ఉంటుంది. కొందరు మాత్రం చాల డేర్గా నచ్చిన నైపుణ్యాలను అందుపుచ్చుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ విద్యాకౌర్.మాజీ ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ అయిన విద్యాకౌర్కి డ్రైవింగ్ అంటే మహా ఇష్టం. ఎలాగైన నేర్చుకోవాలన్నది ఆమె డ్రీమ్. అయితే 59 ఏళ్ల వయసులో డ్డ్రైవింగ్ నేర్చుకుందామనుకుంటే..చాలా పెద్ద వయసు అని తిరస్కరించారు అధికారులు. అయితే విద్యాకౌర్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగింది. ఆమెనే స్వయంగా కారు కొనుక్కుని పొరుగువారి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నారామె. ప్రస్తుతం ఆమెనే స్వయంగా కారుని రయ్ రయ్మని నడిపేస్తోంది. సీనియర్ సిటిజన్ అనే మూసధోరణిని బద్దలు కొడుతూ..స్వేచ్ఛగా సాగిపోతోందామె. ఇక్కడ విద్యాకౌర్ కథ ఎవరో మన పరిమితుల్ని డిసైడ్ చేయడం కాదు..మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు సాగిపోచ్చు అని చాటి చెబుతోంది ఈ సూపర్ బామ్మ స్టోరీ. View this post on Instagram A post shared by Pune Times Mirror (@thepunemirror) (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్
రాజస్థాన్లోని జైపూర్లో రష్యన్ ఫొటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు ముదురు గులాబీ రంగు (Pink) వేసి చేసిన ఫొటోషూట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోషూట్లో పాల్గొన్న 70 ఏళ్ల చంచల్ అనే ఏనుగు గత నెలలో మరణించింది. అయితే, ఆమె మరణానికి ఈ షూట్కు ఎలాంటి సంబంధం లేదని, వయసు పైబడటం వల్ల సహజ కారణాలతోనే చనిపోయిందని అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఏమి జరిగింది?గత ఏడాది నవంబరులో రాజస్థాన్లోని జైపూర్లోని ఒక పురాతన గణేశుడి ఆలయం వద్ద ఈ షూట్ జరిగింది. 'పింక్ సిటీ' జైపూర్ నేపథ్యం నుండి ప్రేరణ పొంది, మోడల్ యశస్వి, చంచల్ అనే ఏనుగుకు ఒకే రకమైన గులాబీ రంగు వేసి ఫొటోలు తీశారు. బార్సిలోనాకు చెందిన ప్రఖ్యాత కాన్సెప్టువల్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక ఏనుగుకు తల నుండి తోక వరకు పూర్తిగా గులాబీ రంగు పూయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Julia Buruleva (@julia.buruleva) కొంతమంది ఈ షూట్ సౌందర్య ఆకర్షణను సృజనాత్మకతను ప్రశంసించగా, చాలా ఎక్కువ మంది ఏనుగు పట్ల వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులలో జంతువులను ఉపయోగించడం యొక్క నైతికతను ప్రశ్నించారు. ఇది కచ్చితమైన జంతు హింసే.. ఇలా లైక్స్ కోసం మూగజీవాలను కెమికల్ రంగులతో ముంచెత్తడం ఆర్ట్ అనిపించుకోదు అంటూ పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ వాదనఏనుగు యజమాని , హతి గావ్ కమిటీ అధ్యక్షుడు బల్లు ఖాన్ , ఫొటోగ్రాఫర్ వాదన ప్రకారం, హోలీ పండుగలో వాడే ఆర్గానిక్ గులాల్ (Gulal) పొడిని మాత్రమే వాడారు. అంతేకాదు రంగును కేవలం 10-30 నిమిషాలు మాత్రమే ఉంచి, వెంటనే కడిగేసినట్లు వారు తెలిపారు.ఏనుగు మృతితో మరింత ఆందోళన సుమారు 70 ఏళ్ల వయసున్న చంచల్ గత నెలలో మరణించినట్లు బల్లుఖాన్ ధృవీకరించారు. ఏనుగు మరణానికి ఫోటోషూట్తో గానీ, దాని చుట్టూ ఉన్న వివాదంతో గానీ సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.దాని మరణం సహజ కారణాల వల్ల సంభవించిందని అధికారులు, స్థానిక సంరక్షకులు స్పష్టం చేశారు.స్పందించిన అటవీ అధికారులుఅయినప్పటికీ, ఈ వీడియో వైరల్ అవ్వడంతో,కళాత్మక సృజన పేరుతో మూగజీవాలను ఇలా రంగులతో హింసించడం సరికాదని నెటిజన్లు విమర్శల నేపథ్యంలో రాజస్థాన్ అటవీ శాఖ స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చనున్నారు.వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. నిర్లక్ష్యం లేదా వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల ఉల్లంఘన ఏదైనా కనుగొనబడితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
నదిని శుభ్రం చేసిన ఒకే ఒక్కడు..! ఆనంద్ మహీంద్రా సైతం..
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.మధ్యప్రదేశ్లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు. బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్కే ఇదంతా అని ట్రోల్ చేసినట్లు తెలిపారు. సోషల్మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్లు, వ్యూస్ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు. ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు. అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడని అన్నారు. డిజిటల్ స్టార్డమ్ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.This young man from Biaora, M.P, was criticised for claiming to have cleaned parts of a river just in order to gain social media views.Well, we usually complain that social media rewards the trivial rather than the meaningful So If a desire for ‘likes’ can become a force for… pic.twitter.com/ARgEhphuQN— anand mahindra (@anandmahindra) March 30, 2026 (చదవండి: ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్కి మతిపోవాల్సిందే..!) -
ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్కి మతిపోవాల్సిందే..!
సాధువులు చూడగానే..ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం ఉన్నవారనే భావనే ఉంటుంది. వారికి ఆధునికత, వివిధ భాషలు తెలిసి ఉండటం అత్యంత అరుదు అని అందరి భావన. గతేడాది కుంభమేళలో మేధావులైన బాబాలను చూసే వరకు అందరి భావన ఇలానే ఉండేది. అయితే మన చుట్టుపక్కల పరిసరాల్లో తరుచుగా కనిపించే బాబాలు విద్యావంతులేనా అనేది సంశయాత్మక ప్రశ్నే. అయితే ఈ బాబాను చూస్తే ఆ అభిప్రాయం కూడా మారిపోతుందేమో..అందుకు సంబంధించిన వీడియని వాసుదేవ్ కచ్ఛవా అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్లో సాధుబాబా సమీపంలో పుస్తకాల షాపు వద్ద బల్లపై ఉంచిన పుస్తకాలను తిరగేస్తూ కనిపిస్తారు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. మీకు ఇంగ్లీస్ వచ్చా అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ సాధు బాబా ఒక పుస్తకాన్ని తీసుకుని చదవి ఇది రెండొవ అధ్యాయం అని స్పష్టంగా చెబుతాడు. మీకు ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చు అని అడగగా..తాను ఇంగ్లీష్ చదువుకున్నట్లు చెబుతాడు. ఆ తర్వాత మరో పుస్తకాన్ని ఇస్తూ..చదవమని కోరతాడు. ఆ పుస్తకం వైపు చూస్తూ..'ది సైలెంట్ పేషెంట్'' అని బదులు ఇస్తాడు. మాకు కూడా ఇంత ఇంగ్లీష్ రాదు అనగా, అందుకు ఆ సాధువు వ్యగ్యంగా మీర అంత చదువు చదువుకుని ఉండరు అని కౌంటరిస్తాడు. అందుకు సదరు వ్యక్తి మీరు ఎంత వరకు చదువుకున్నారు అని అడుగుతాడు..దానికి బాబా..తాము సాధువులమని దాన్ని బహిర్గతం చేస్తే తమ సర్టిఫికేట్లు విలువని కోల్పోతాయని అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం బాబా క్లాస్టాపర్..అదరగొట్టేశారు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vasudev Kachhawa (@vaas.you) (చదవండి: నేచర్ లవర్స్కు డ్రీమ్ డెస్టినేషన్) -
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్ డైలాగ్ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది. స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయంపొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను చూసి అత్యాశకు పోలేదు. రీటా ఆ డబ్బును విత్డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.బ్యాంక్ అధికారుల ప్రశంసలు ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్ ఎర్రర్, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ పాండే తెలిపారు.సోషల్ మీడియా ఫిదా'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది అంటూ ఎక్స్ యూజర్ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు. -
పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..
పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించొచ్చు అనగానే మహా అయితే రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు ఉండొచ్చని అనుకుంటాం. రోజంతా నిలబడి.. అర కొర సంపాదనతో కష్టపడే వేతన జీవులుగా భ్రమపడతాం అని అంటున్నాడు కంటెంట్ విక్రేత. అంతేకాదండోయ్ వాళ్లు నిజంగా పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించగలరో స్వయంగా తెలుసుకునేందుకు ఆ స్టాల్లో పనిచేసి మరి రోజువారీ వేతనం లెక్కించాడు. మరి ఇంతకీ ఎంత సంపాదించొచ్చంటే..బెంగళూరుకు చెందిన పెరీరా అనే కంటెంట్ క్రియేటర్ రోడ్డు పక్కనే ఉన్న ఒక పానీపూరీ స్టాల్లో ఒక రోజంతా పనిచేసి అతడి రోజువారీ సంపాదనను లెక్కించాడు. అందుకోసం ఉల్లిపాయలు, బంగాళ దుంపల తొక్కు తీయడం, మసాల పూరీని తయారు చేయడం వంటి ప్రాథమిక తయారీ పనులను కుణ్ణంగా నేర్చుకుని మరి ప్రారంభించాడు పెరారీ. ఆ పనులు అలవాటయ్యాక వినియోగదారులకు అందించడం ప్రారంభించడు. మొదట్లో కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత రద్దీ పెరిగాక త్వరగా అలవాటుపడిపోయాడు. కేవలం ఒక గంటలోనే సుమారు 120 పూరీలు దాక అమ్మాడు. ఈ స్టాల్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని, సాయంత్రం అయ్యే కొద్దీ జనం క్రమంగా పెరుగుతారని ఆయన పేర్కొన్నారు. అంతేగాదు ఆయన పనిచేస్తున్న సమయంలో పలువురు సన్నిహితులు ఆయన గుర్తుపట్టారు కూడా. ఎంత ఆదాయం వస్తుందంటే..ఒక ప్లేట్ ధర రూ. 30లు. అంటే రోజుకి సుమారు 80 నుంచి 100 ప్లేట్లు అమ్ముడవుతాయని పెరీరా తెలిపారు. అంటే రోజువారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 3000 దాక ఉంటుంది. దానిప్రకారం నెలకు రూ. 90,000 వరకు గడిస్తాడని, దాదాపు ఏడాదికి రూ. 10.8 లక్షలకు సమానమని పెరారీ అంచనా వేశారు. అందుకు సంబంధించిన వీడియోతో సహా నెట్టింట షేర్ చేయడంతో సర్వత్రా పానీపూరీ వంటి సంప్రదాయ వ్యాపారాలతో ఇంతలా ఆర్జిస్తారా అని చర్చల మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
ఆ బ్యూటీ చూపించిన తెగువకి మాటల్లేవ్ అంతే..!
అందాల పోటీల్లో ఒక్కోసారి అనూహ్య పరిణామాలు చేసుకుంటాయి. మనం అనుకున్నట్లుగా ప్లాన్ ప్రకారంగా జరిగిపోవు. ఒక్కోసారి ఊహించని ఝలక్లు ఎదురవ్వుతాయి. ఆ సమయంలో మనం ఎలా బ్యాలెన్స్గా ఉన్నాం అన్నదే మేటర్. అలాంటప్పుడే అసలైన టాలెంట్ బయటకొస్తుంది. అందుకు ఈ అందాల భామే ఉదాహరణ.ఇటీవల బుధవారం జరిగి మిస్ గ్రాండ్ థాయ్లాండ్ అందాల పోటీలో ఓ బ్యూటీకి అనూహ్య పరిణామం ఎదురైంది. అయితే ఆ లోపాన్ని ధైర్యంగా ఎదుర్కొందే తప్ప ఆందోళనకు తావి ఇవ్వకపోవడం విశేషం. మిస్గ్రాండ్ పతుమ్ థాని కమెల్వాన్ చనాగో బ్యూటీ తనను తాను పరిచయం చేస్తుండగా అకస్మాత్తుగా కట్టుడు పళ్లు ఊడిపోయాయి. కానీ ఆమె సమయస్పూర్తితో స్పందించి..ఆ వేదిక మీదే వెనుతిరిగి సరిచేసుకుని ఆ వెనువెంటనే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ కొనసాగించింది. ఆ ఆకస్మిక ఘటనకు కించెత్తు టెన్షన్ పడకుండా వెంటనే వెనుకకు తిరిగి సరిచేసుకుని, నవ్వుతూ ర్యాంప్ వాక్ చేసింది. పైగా మెరిసే గౌనుతో కెమరాకు అందంగా ఫోజులు కూడా ఇస్తూ..తన పళ్లను మరోసారి ప్రదర్శించింది. అయితే ఆ క్షణంలో ఆమె ప్రదర్శించిన ప్రశాంతత, ధైర్యం ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి. పొరపాటు సైతం ఆమెను అడ్డుకోలేకపోయిం, వెనక్కి మరల్చలేకపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు సైతం ఆమె దృఢనిశ్చయానికి కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రశంసల వర్ష కురిపిస్తూ పోస్టులు పెట్టారు.En un evento de belleza, Miss Tailandia sufrió un percance cuando se le cayó la dentadura postiza. pic.twitter.com/0o6URHkrcx— Bandit Mapache (@banditmapache_) March 26, 2026(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెంట్కి ఫిదా అవ్వాల్సిందే) -
బంక్కి వచ్చింది బైక్ కాదు… దాని ట్యాంక్ మాత్రమే..!
బాటిల్స్లో పెట్రోల్ కొట్టడం చట్ట విరుద్ధం. ఇంధనాన్ని బయట నిల్వ చేయడం ప్రమాదకరం కనుక బాటిల్స్ కొట్టడానికి అనుమతించడం లేదు. 1934 తీసుకొచ్చిన పెట్రో సేఫ్టీ చట్టం ప్రకారం బాటిళ్లలో లేదా ఇతర కంటైనర్లలో పెట్రోల్ కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. . ప్రధానంగా అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, ప్రమాదాలు జరగకుండా నిరోధించడం కొరకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో ఆందోళన ఎక్కువైంది. అది ప్రధానంగా పెట్రోల్, గ్యాస్పై ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. గ్యాస్ దొరకపోతే పరిస్థితి ఏంటి.. పెట్రోల్ దొరకపోతే ఏం చేయాలి? అని డైలమాలో పడ్డారు జనం. భారత్లో పెట్రోల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం ఆందోళన పోవడం లేదు. ప్రధానంగా నగర ప్రాంతాల్లో వాహనదారులు.. ఇంధనం కొరత ఎక్కడ వస్తుందోననే భయంతో పెట్రోల్ బంకులకు క్యూకట్టిన పరిస్థితులు నిన్న, మొన్న ఎక్కువగా కనిపించింది. నగరాల్లో కిలోమీటర్ల మేర క్యూలు కనిపించడంతో ప్రజల్లో మరింత భయం ఎక్కువైంది. ఒకర్ని చూసి ఒకరు ఏమౌతుందోననే గాబరాతో బంక్ల వద్దే గంటల తరబడి నిరీక్షించి మరీ పెట్రోల్ కొట్టించుకుని ఊపిరి పీల్చుకున్నారు. బైక్ ట్యాంక్తో పెట్రోల్ బంక్కు..!అయితే ఓ వ్యక్తికి వినూత్న ఆలోచన వచ్చింది. ఎలాగూ బాటిళ్లలో పెట్రోల్ కొట్టడం లేదు.. బండి తీసుకుని వెళ్లి బంక్ దగ్గర నిలబడాలంటే చాలా సమయం పడుతుందనే భావనతో ఓ వ్యక్తి ఏకంగా బైక్కు ఉన్న పెట్రోల్ ట్యాంక్ను ఊడదీసి బంక్కు తీసుకొచ్చాడు. ఎవరేమి అనుకుంటే నాకేంటి అనుకుంటూ దర్జాగా పెట్రోల్ కొట్టించుకున్నాడు.. హుషారుగా వెళ్లిపోయాడు. కానీ అక్కడ క్యూలో ఉన్న వారికి మాత్రం కోపం చిర్రెత్తుకొచ్చింది. బైక్ లేకుండా తీసుకొచ్చిన ట్యాంక్కు పెట్రోల్ ఎలా కొడతారంటూ అక్కడున్న వారు చిరాకు పడ్డారు. ఈ ఘటన చూసి అక్కడున్న వారు శభాష్ అని మెచ్చుకున్న వారు లేకపోలేదు. ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ పెట్రోల్ కాబట్టి.. ఇది పెట్టిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపై యూజర్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎలాగూ బాటిల్స్లో పెట్రోల్ కొట్టడం అనేది నిషేధం.. అదే సమయంలో కేవలం బైక్ ట్యాంకుల్లో కొట్టడానికి మాత్రమే అనుమతి ఉంది. అదే చేశాడు ఆ వ్యక్తి. బైక్ ట్యాంక్నే తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాడు’ అని ఒక యూజర్ స్సందించగా, ఈ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలంటూ మరొకరు డిమాండ్ చేశారు. Petrol in bottles is banned and allowed only in bike tanks, so he just brought the tank without bike. 😂 pic.twitter.com/xVS1om4v9y— Oppressor (@TyrantOppressor) March 26, 2026 ఎవరు ఏమనుకున్నా -
దంతాలతో కళాఖండాలు..!
ఎన్నో రకాల శిల్పులను చూశాం. అతి సూక్ష్మమైన వాటిని తయారు చేసేవారు, గోటితో, ముక్కుతో పలు రకాల ఆర్ట్లను ప్రదర్శించారు. కానీ దంతాలతో ఆర్ట్ గురించి విన్నారా..?. ఔను మీరు వింటోంది నిజమే..ఈ కళను చైనా మహిళ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.చైనాలోని హుబే ప్రావిన్స్కు చెందిన 25 ఏళ్ల చెన్ క్విన్ తన అసాధారణ ప్రతిభకు సంబంధించిన వీడియోలను పంచుకోవడంతో నెట్టింట వైరల్గా మారింది. కేవలం తన పళ్లతో సూక్ష్మమైన శిల్పాలు చెక్కుతూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె వాటన్నింటిని క్యారెట్లతో చేయడం విశేషం. క్యారెట్లను కొరుకుతూ అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తుందామె. చిన్న జంతువుల బొమ్మల నుంచి వివిధ సంక్లిష్టమైన నిర్మాణాల వరకు చాలా కళాఖండాలను రూపొందించింది. అందులో అత్యంత ఆకర్షణీయమైన చైనా మహా కుడ్యg, ఎల్లో క్రేన్ టవర్ ప్రతిరూపాలు, ఫీనిక్స్ కిరీటాలు, మియావో ప్రజలు ధరించి వెండి టోపీలు తదితరాల కూడా ఉన్నాయి. ఇదెలా మొదలైందంటే..క్యారెట్ని తింటున్నప్పుడూ ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. తొలుత సరదాగా చిన్న చిన్న ఆకృతులను తయారు చేసింది. దానికి మరింత మెరుగులు పెట్టి అందంగా శిల్పాలు చెక్కడం ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు సుమారు వందకు పైగా క్యారెట్ శిల్పాలు రూపొందించిందట. ఆ క్యారెట్లన్నీ ఆమె పొలంలో పండినవేనట. పైగా క్విన్ తనను తాను దంత శిల్పిగా అభిర్ణించకుంటోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..) -
అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..
ఎంబ్రాయిడరీలో ఉండే కళా నైపుణ్యం వేరేలెవెల్. అందులోనూ మన అమ్మమ్మలు ఆ వయసులో వారి చేత్తో పొద్దిగా కుడితే..అది మనకు ఎంతో అపురూపమైన జ్ఞాపకం.అలాంటి ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీని పరిచయం చేసింది ఈ బామ్మ. సుమారు 90 ఏళ్లు పైనే ఉండే ఈ బామ్మ తన కళను శ్రద్ధగా దాచుకున్న విధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియోని మనవడు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో మనవడు తన అమ్మమ్మ సూదీదారం పట్టుకుని కుట్టిన ఎంబ్రాయిడరీని తన మనవడికి చూపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె స్వయంగా రూపొందించిన కళాఖండాన్ని మనవడు చూస్తున్నప్పడు ఆ బామ్మ కళ్లు ఆనందంతో మెరుస్తుండటం చూడొచ్చు వీడియోలో. దశాబ్దాల క్రితం ఆమె చేసిన అందమైన కళాఖండం అది. అవి ఆమెకు కళ పట్ల ఉన్న అంకితభావం, ఓర్పుకు నిదర్శనం. యంత్రాలతో నేటితరం చిటికెలో చేస్తే..అవి అమ్మమ్మ తన స్వహస్తాలతో కేవలం సూది, దారంతో చాలా శ్రద్ధతో చేసిన అద్భుత సృష్టి. అవి ఆ అమ్మమ్మ గతం తాలుకా అమూల్యమైన జ్ఞాపకం కూడా. ఆ కళాఖండం సుమారు 1947 నాటి చారిత్రక ఘట్టం. వాటిని చూస్తే..ఇన్ని దశాబ్దాలు గడిచినా.. చెక్కుచెదరకుండా ఉన్న వాటిని చూస్తే ఆ కళ ఎంత విలువైనవనేది అనేది తెలుస్తోంది. ఇది తమ కుటుంబ చరిత్రలో భాగం, భావోద్వేగమైనది కూడా అని చెబుతున్నాడు ఆమె మనవడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా కుటుంబ వారసత్వ సంపద కళ మాత్రమే అనే విషయం నొక్కి చెప్పిందని అన్నారు. అంతేగాదు కళ ద్వారా నాటి జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయన్నారు. వేగవంతమైన ప్రపంచంలో కుటుంబం, సంప్రదాయం, వారసత్వం, జ్ఞాపకాల ప్రాముఖ్యతలను ఈ దృశ్యం హైలెట్ చేసిందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jujhar singh Aujla (@aujla_1994) (చదవండి: పంజాబీ వంటకాలకు ఫుడ్లవర్స్ ఫిదా..!) -
కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!
మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉన్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో పాడ్కాస్టర్ కుశల్ షేర్ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్ ఆర్ వైశ్య. టీనేజ్ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది. ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్ షిప్ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్ అనుభవం కోసం చేసే సీనియర్ సీఏ వద్ద చేసే ట్రైనింగ్ ఈ ఆర్టికల్ షిప్. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది. ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు. మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం. ఆ తర్వాత భారత్, దుబాయ్, ఒమన్ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్కిచెన్ వ్యాపారాన్ని కూడా రన్ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్కాస్టర్ కుశల్ ఇలా అన్నారు. అభిషేక్ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు. అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.He used to sell vegetables at Dadar with his father from age 13-20.He used to sell vegetables early in the morning from 4 to 6 AM, then go for his CA Final classes from 7-10 AM, then go for articleship from 10 AM – 9 PM, study for a bit, and then sleep by 11 PM.He used to… pic.twitter.com/ihRK4OG39g— Kushal Lodha (@kushallodha548) March 19, 2026 (చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..) -
వైరల్ వీడియో.. కింగ్ కోబ్రాతోనే ఆటలా..?
విష సర్పాలతో ఆటలు చాలా ప్రమాదకరం. స్నేక్ క్యాచర్స్ కూడా పాములను పట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందులోనూ అత్యంత విష సర్పమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడం చాలా ప్రమాదం. ఇక్కడొక వ్యక్తి కింగ్ కోబ్రాను బంధించిన వైనం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది. ఆ కోబ్రాను బంధించే క్రమంలో అది ఒకసారి చిక్కినట్లే చిక్కి మళ్లీ బుసలు కొట్టిన తీరు చూస్తే అమ్మో అనిపించకమానదు. అయినా చివరకు అత్యంత చాకచాక్యంగా ఓ గొట్టం సాయంతో దాన్ని బంధించాడు ఆ స్నేక్ క్యాచర్. ఒక గొట్టం, ఒక సంచి సాయంతో దాన్ని ఎట్టకేలకు పట్టుకున్నాడు. కనీసం చేతికి గ్లౌజ్లు కూడా లేకుండానే పట్టుకోవడం ఇది చూసిన నెటిజన్లకు మరింత కలవరాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం అటు-ఇటు అయినా ఇక ఆ కోబ్రా నుంచి తప్పించుకోవడం కష్టమనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదమంటే ఒకే కాటు ద్వారా 400–500 mg వరకు విషం ఇంజెక్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఈ పరిమాణం 11 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగలదు అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది కూడా. మరి అటువంటి కింగ్ కోబ్రాతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పట్టుకోవడం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు.కాస్త అటు ఇటు అయ్యి ఉంటే..5 నిమిషాల్లో అతని ప్రాణం పోవడం ఖాయం! #KingCobra pic.twitter.com/G8W2d22SVT— UttarandhraNow (@UttarandhraNow) March 24, 2026 -
వామ్మో.. బంగాళా దుంపలను ఇలాక్కూడా కడుగుతారా?
ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. అపరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్ను ఇష్టపడేవారికి షాకయ్యేలా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. దుకాణదారుడు బంగాళా దుంపలను చేతులతో కాకుండా.. ఏకంగా కాళ్లతో.. అది కూడా చెప్పులు వేసుకుని కడుగుతున్న దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.ఘాజీబాద్లోని డిఎల్ఎఫ్ అంకుర్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో తీసిన మహిళ మాట్లాడుతూ.. ఓ ఆలూ టిక్కీ షాపులో ఈ దారుణం జరుగుతోందని.. తన తల్లి కూడా అక్కడ చాట్ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని మరీ బంగాళాదుంపలను కాళ్లతో కడగడం అత్యంత సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘాజీబాద్ ప్రాంతం.. బంగాళాదుంపతో పరిశుభ్రతకు కొత్త అర్థాన్ని ఇస్తోందంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. "వావ్, అద్భుతమైన పరిశుభ్రత!" అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టారు. "మీకు ఇది చూసి అసహ్యం వేస్తోందా? అయితే ఒకసారి ఆవకాయ తయారీ ఫ్యాక్టరీకి వెళ్లి చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పటికీ పచ్చళ్లు తినరంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. "బయట తిండిపై నమ్మకం పోయింది.. ఇంట్లో వండిన ఆహారమే మిన్న అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.What kinda people are they?😭this man is cleaning potatoes with his feet.The video is from Loni, Ghaziabad.pic.twitter.com/4JaYKJzDjU— Ghar Ke Kalesh (@gharkekalesh) March 23, 2026ఇలాంటి ఘటనలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు.. ఇదే నెలలో థానేలోని ఒక వీధి వ్యాపారి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి.. చేతులు కడుక్కోకుండానే తిరిగి వచ్చి పాప్కార్న్ అమ్మడం కనిపించింది. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.. -
పెళ్లి రోజే ఉద్యోగానికి దరఖాస్తు..!
సోషల్ మీడియా పుణ్యామా కొన్ని హాస్యభరితమైన సన్నివేశాలు, సంఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదేం విడ్డూరం అని అంతా అనుకునేలా ఆ ఘటనలు కాసింత ముఖంపై నవ్వులు మెరిపిస్తున్నాయి. అలాంటి ఫన్నీ వైరల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అదికూడా ఓ వధువుకి సంబంధించింది కావడంతో ఏమ్మా ఆ టైంలో కూడా ఇదేంటని అంతా తలోమాట అనుకునేలా చేసిన ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు.ఈ వీడియోని సాంచి-శివం అనే దంపతులు నెట్టింట పంచుకున్నారు. ఆ వీడియలో వధువు పూర్తి పెళ్లి కూతురి దుస్తులో కారులో కూర్చొని కనిపిస్తుంది. ఆమె ఫోన్తో ఉద్యోగ దరఖాస్తు కోసం ఈమెయిల్ని పంపుతూ కనిపిస్తోంది. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం జరుగుతున్న రోజునే ఆమె ఈ పనిలో బిజీగా ఉండటం కాసింత ఆగ్రహం, నవ్వు తెప్పించేలా ఉంటుంది. కానీ ఆ వధువు మాత్రం పెళ్లి దుస్తుల్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో జాబ్కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇది జీవితంలోని ముఖ్య ఘట్టాలను, వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకోవడానికి తరుచుగా ఇబ్బందిపడే చాలామంది యువనిపుణులకు ఈ ఘటన ఓ చక్కటి సందేశానిచ్చేలా ఉంది కదూ.!. అంతేగాదు సాధారణంగా పెళ్లిళ్లు అంటే అట్టహాసమైన ఆచారాలు, వేడుకలతో ముడిపడి ఉన్నప్పటికీ..జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో కొన్నిసార్లు ఉద్యోగ బాధ్యతలు ఎలా ప్రాధాన్యత సంతరించుకుంటాయో ఈ క్లిప్ హాస్యభరితంగా చూపిస్తోంది. ఈ వీడియోకి "పెళ్లికూతురి మోడ్ ఆన్, హస్టల్ మోడ్ నెవర్ ఆఫ్" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sanchi & Shivam (@sanchi_shivam_twoheartsonesoul) (చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!) -
పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!
ఒక్కోసారి మనకు వచ్చే కష్టాలే దారి చూపేలా బతుకుతెరువును కూడా అందిస్తాయి. మనకే ఈ కష్టాలు అనుకుంటాం గానీ, ఒక్కోసారి మనలోని టాలెంట్, సృజనాత్మకతను వెలికితీస్తాయి అవి . కష్టం మనల్ని వదలకపోవచ్చు గానీ దానిపై సవారీ చేసేలా బతుకు మార్గం చూసుకోవాలి అని ఈ మహిళని చూస్తే అర్థమవుతుంది. ఆమె కథ వింటే కన్నీళ్లు వచ్చినా..గెలవాలని మాత్రం కచ్చితంగా ఆకాక్షిస్తారు.నెట్టింట వైరల్గా మారిన కోమల్ అనే మహిళ కథ ప్రతి ఒక్కరిని కదలించేలా మనసులను తాకుతుంది. మహారాష్ట్రకు చెందిన కోమల్ గైక్వాడ్ అనే మహిళ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఇందులో పెద్ద వింత ఏముంది అని తీసిపారేయకండి. ఇక్కడే ఉంది అసలు కథ..!. ఆమె కళ్యాణ్ వీధుల్లో ఆటో నడుపుతూ..అటు జీవనాన్ని, ఇటు మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతోంది. అదెలా అంటే..ఆమె కథ ఏంటో తెలుసుకోవాల్సిందే మరి..!.కోమల్ ఆర్థిక కష్టాలు కారణంగా పదోతరగతితోనే చదువు ఆపేసింది. 2018లో వివాహం తర్వాత కళ్యాణ్ నగర్కు మారింది. అక్కడ ఆమె భర్త ఆటో నడిపేవాడు. కానీ తేజు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే..అతడు తన సొంతూరికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దాంతో కోమల్ తన బిడ్డను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఎలాంటి ఆసరా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, దీనికి తోడు తేజును చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఉద్యోగంలో కొనసాగడం అసాధ్యంగా మారింది. తన బిడ్డకు దూరంగా ఉండని పనిచూసుకోవాలని డిసైడ్ అయ్యి..డైవింగ్ నేర్చుకుంది. అలా అద్దె ఆటోతో మొదలుపెట్టిన కోమల్ ఎప్పుడూ తేజును పక్కనే ఉంచుకుని నగర రోడ్లుపై ప్రయాణించడం ప్రారంభించింది. మొదట్లో ఆటో వెనుకభాగంలో బిడ్డను పడుకునేలా సీటింగ్ ఏర్పాటుచేయాలనుకుంది. కానీ ఆ దూరం తన కూతురుకి ఇబ్బందిగా ఉండటంతో..తన సీటు పక్కనే చిన్న సీటు ఏర్పాటు చేసేలా ఉపాయం ఆలోచించి..అలా సెటప్ చేసింది. దాంతో తేజు రోజంతా తన దగ్గరే ఉండేలా..ఆటో నడపుకోవడం సులభమైంది కోమల్కు. ప్రస్తుతం కోమల్ రోజుకు రూ. 400 నుంచి రూ. 500 దాక సంపాదిస్తోంది. అంతేగాక ఈఎంఐ పద్ధతిలో తన సొంతంగా ఆటోరిక్షాను కొనుగోలు చేసి, మరో అడుగు ముందుకు వేసింది. కోమల్కి ఏమి పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కేవలం తన కూతురుకి మంచి విద్యను అందించేలా, పాఠశాలకు పంపించడం తోపాటు తాను మరింతగా సంపాదించడమే ఆమె ఆకాంక్షలు. నిజంగా కోమల్ గ్రేట్ కదూ..భారం వదిలేసి పారిపోయిన భర్త గురించి పక్కనపెట్టి..కూతురు ఆలన పాలనా చూసుకునేలా నడుబిగించిన స్త్రీమూర్తి కదూ..!. నిజంగా ఆ అమ్మ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..) -
బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..
చాలామంది యువత కలలుగనే లగ్జరీ లైఫే ఈ వ్యక్తిది. ఎంతో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ హాయిగా సాగిపోతున్న జీవితానికి సడెన్గా స్వస్తి పలికి..ఏదో గొప్పజీవితం కోసం అన్వేషిస్తూ దేశాలు పర్యటించడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతడి లైప్ ఏవిధంగా యూటర్న్ తీసుకుని ఫ్యామిలీ మ్యాన్గా మారాడో తెలిస్తే అవాక్కవుతారు. పైగా ఆ తర్వాత కూడా తన నిర్ణయంలో మార్పు లేకపోగా..ఇలా బతకాలి అనేపించేలా రాజులా బతుకుతుండటం విశేషం. ఆ వ్యక్తి తన కథను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో..అందర్నీ అమితంగా ఆకర్షించేలా ఆలోచింపచేసింది. వ్యక్తిగత విజయం కంటే సంతృప్తి మిన్నా అనే చర్చలకే తెరలేపింది. ఆ పోస్ట్ ప్రకారం ఆవ్యక్తి ఐఐటీ చేసి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అతను విజయవంతమైన కార్పొరేట్ కెరీర్ని నిర్మించుకున్నాడు. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి, అతను ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్లో డైరెక్టర్గా ఉన్నత స్థాయికి ఎదిగి, చాలామంది కోరుకునే లగ్జరీ లైఫ్ని లీడ్ చేశాడు. కానీ అవేమి తనకు సంతృప్తినివ్వక పోవడమే గాక వివిధ హోదాల వెంట తిరుగుతూ ఓ చట్రంలో ఇరుక్కుపోయిన ఫీలింగి కలిగింది అతడికి. దాంతో ఈ కార్పొరేట్ లైఫ్ నా వల్ల కాదు అని డిసైడ్ అయ్యి..2013లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కేవలం ప్రాథమిక అవసరాలతో సోలోగా పర్యటించడం మొదలు పెట్టాడు. అలా 18 నెలల్లో ఏకంగా 35 దేశాలను అన్వేషించాడు. విభిన్న సంస్కృతులు, అనుభవాల్లో మునిగిపోయాడు. కార్పొరేట్ బోర్డురూమ్ల నుంచి ప్రయాణ జీవితానికి మారడం, ఒక సరికొత్త దృక్పథాన్ని అందించింది. ఎలాంటి టార్గెట్లు లేని సరికొత్త లైఫ్ని గడుపుతున్నట్లు అనిపించింది అతడికి. సరిగ్గా మాంటెనెగ్రోలో పర్యటన అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అక్కడ అతను ఆస్ట్రియాకు చెందిన సామాజిక కార్యకర్త అయిన క్యాథీని కలిశాడు. ఒక చిన్న పరిచయంగా మొదలైనది త్వరలోనే ఒక గాఢమైన బంధంగా మారింది. కేవలం 10 నిమిషాల సంభాషణ.. పది రోజుల పాటు విడిచి ఉండలేని విధంగా బలపడింది వారి బంధం. అలా వారిద్దరూ చివరికి 2016లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు సాంప్రదాయాల కన్నా, అనుభవాలు, స్వేచ్ఛ, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే జీవనశైలిని స్వీకరిస్తూ..ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి సొంతంగా ఇల్లుగానీ, కారు గానీ లేవు. జస్ట్ హోమ్స్టే లేదా అద్దెంటిలో నివశిస్తోంది ఆ కుటుంబం. భారత్లో పెట్టిన పెట్టుబడుల సాయంతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. తమ పిల్లలకు వేదాలు, ఉపనిషత్తుల తోపాటు ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను ఉపయోగించి ఇంట్లోనే విద్యను అందిస్తున్నారు. అతను తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. 4 BHK ఇంటిని వదులుకుని మొత్తం ప్రపంచాన్ని పొందానని సగర్వంగా చెబుతున్నాడు. అంతేకాదండోయ్ ఇప్పుడే "జీవితాన్ని రాజులా గడుపుతున్నాను" అని పేర్కొన్నాడు. ఈ పర్యాటనలలోనే ఆ ముగ్గురు పిల్లలను కన్నారట. వారంతా సాధారణ ప్రసవం ద్వారానే పుట్టారట. డైపర్లు, ఆధునిక వైద్యం వంటివి లేకుండా పెంచారట. పైగా జీవితం అంటే ఏమవుతారని కాకుండా..మీరు ఎవరు అని తెలుసుకునేలా బోధిస్తున్నామని చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్ఫ్రెండ్ మాత్రం..) -
ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్ఫ్రెండ్ మాత్రం..
ఎంతటి ప్రేమలో అయినా..చిన్న చిన్న మనస్పర్థలు సహజం. కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా అదే ప్రేమ కొనసాగితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు. ఆ బంధం ఎన్నటికీ అత్యంత బలమైనది..స్వచ్ఛమైనది కూడా. అలాంటి గొప్ప ప్రేమనే పొందాడు ఈ యువకుడు. ఆమె ఆ రోజు అండగా నిలిచి ధైర్యం ఇచ్చి ఉండకపోతే తాను బతికి ఉండేవాడిని కాదంటున్నాడు అశ్విన్. వారి ప్రేమ కథ అమరం, అఖిలం అనొచ్చు. అంత అందమైన ఆ క్యూట్ లవ్ స్టోరీ ఏంటో చూద్దామా..కేరళకు చెందిన ఆదిత్య అనే అమ్మాయి తన లవ్స్టోరీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తమ ప్రేమ కథ పాఠశాల రోజుల్లో 2014లో మొదలైందంటూ చెప్పుకొచ్చింది ఇలా. "ఆమెకు 14 ఏళ్లు, అశ్విన్కు 17 ఏళ్లు ఉన్నప్పుడు..కలిసి నవ్వుకోవడం, రోజువారి చదువు ఒత్తిళ్లు గురించి మాట్లాడుకోవడంతో స్నేహంగా మొదలైంది. క్రమంగా మా బంధం బలపడటం మొదలైంది. మొదటగా అశ్విన్ తన భావాలను వ్యక్తపరిచినప్పుడు..ఆదిత్య దిగ్బ్రాంతికి గురై..దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది". అయితే ఆ దూరంలోనే తనకు అశ్విన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైందని చెబుతోంది. దాంతో మళ్లీ తనని కలిసి తమ రిలేషన్ కొనసాగించినట్లు చెప్పుకొచ్చింది. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడం మొదలైంది కూడా. ఇక అశ్విన్ ఇంజనీరింగ్ చదవడానికి తమిళనాడుకి మారాడు. ఇద్దరి మధ్యం దూరం పెరిగినా..ఏదోలా కలుసుకుంటూ తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు. అలా హాయిగా సాగుతున్న తరుణంలో తమ ప్రేమను ఓ కుదపు కుదిపేసింది ఆ రోడ్డు ప్రమాదం.అమాంతం అన్నింటిని మార్చేసిన ప్రమాదం..మే 2017లో మద్యం సేవించిన డ్రైవర్ కారణంగా జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదం అశ్విన్ దారుణంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ అతని కాలుని కాపాడటానికి సుదీర్ఘ వైద్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు అతని ప్రాణాలు కాపాడేందుకు ఆ కాలుని తొలగించక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని ఆదిత్య, అశ్విన్ తల్లి ద్వారా తెలుసుకుని కుంగిపోయింది. మానసిక మద్దతు అవసరమైన సమయంలో ఆదిత్యకు కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి. వైకల్యంతో జీవిస్తున్న అతడితో భవిష్యత్తు గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. దూరంగా ఉండాలని సూచించారు కూడా. ఈ ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే..ఆదిత్య తీవ్రంగా కుంగిపోయే స్థితికి చేరుకుంది. ఆమె ఆవేదన, తీవ్రమైన ప్రేమను చూసి..తల్లిదండ్రులే దిగొచ్చి అర్థం చేసుకున్నారు. ఇక అశ్విన్ సైతం ఆ ప్రమాదం తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా పోరాటం చేశాడు. తాను ఒక భారంగా మారిన జీవితంలోకి రావద్దని ఆదిత్యకు సూచించాడు అశ్విన్. ఈ సంబంధాన్ని ముగించమని చెప్పాడు. కానీ ఆమె అదే ప్రమాదం తనకు జరిగితే నువ్వే ఏం చేస్తావు అని అడిగి.. అశ్విన్ని మారుమాట్లాడకుండా చేసింది. తమ బంధాన్ని పునరుద్ధరించుకుని..తమ జీవితాలను తీర్చిదిద్దుకునే వైపుగా అడుగులు వేశారు ఇద్దరు. ఈలోగా అశ్విన్ తన ఇంజనీరింగ్ చదువుని పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగా, ఆదిత్య కూడా తన చదువుని పూర్తి చేసింది. ఒకరికొకరు అందించే అచంచలమైన మద్దతులో పాతుకుపోయిని వారి వ్యక్తిగత ఎదుగుదల తోపాటు వారి సంబంధం కూడా పరిణితి చెందింది. అలా 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారిద్దారు. అయినా అప్పటికే ఇరు కుటుంబాలు వారి ప్రేమలో బలాన్ని చూసి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాయి. ప్రస్తుతం వారిద్దరూ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ బంధమైన నిరంతర శ్రద్ధ, గౌరవంతో బలోపేతమవుతుందని చెబుతున్నారు ఈ దంపతులు. సరదాగా స్నేహంగా మొదలై ప్రేమగా చిగురించిన ప్రేమను..చిన్న చితకా సమస్యలు, గాలి వానలా వచ్చిన కష్టాలకు తట్టుకుని పోరాడి..విజయవంతంగా పెళ్లిపీటలు ఎక్కేలా చేసుకున్నారు. ఈ కేరళ జంట ప్రేమ నెటిజన్లను ఆకర్షించడమే కాదు పెద్ద ఎత్తున్న ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి కూడా. అయితే ఆదిత్య ఇది త్యాగం వల్ల నిలిచిన ప్రేమ కాదు..అవగాహన, నిబద్ధతపై నిలిచిన శాశ్వతమైన ప్రేమ అని బలంగా చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!) -
భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!
ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్ సక్సెస్ని షేర్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో సీనియర్ డైరెక్టర్ డెవలపర్ జీటీఎం మార్కెటింగ్గా పనిచేస్తున్నారామె. ఇన్స్టాగ్రామ్లో తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్లో తన కెరీర్ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భారత్ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్ లైఫ్లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
అసలు ఊహించలేదు.. భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు
కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటనను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.వృత్తిరీత్యా దంత వైద్యురాలైన ఓ తల్లి.. పాపకు మునగకాయ సూప్ (drumstick soup) తాగించింది. అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు."నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు సహాయం ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్ చేశారు View this post on Instagram A post shared by Dr. Bhavna K (@chaos_to_care) -
ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..!
అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..పంజాబ్లోని ఎన్నారై గుర్జీత్ సింగ్ మథారు జలంధర్లోని కిషన్ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా. రీజన్ ఏంటంటే..గుర్జీత్ సింగ్ న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్లోనే నివశిస్తున్న గుర్జీత్ సింగ్కి ప్రతి ఏడాది భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్లోని ఓ చిన్న సైజ్ న్యూయార్క్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. VIDEO | Punjab: Gurjeet Singh Matharu, an NRI living in New York for 26 years, has installed a Statue of Liberty replica on the fourth floor of his home in Jalandhar’s Kishanpura area, drawing visitors from nearby and far away.He said the idea came from seeing the Statue of… pic.twitter.com/7PkZaTzJFO— Press Trust of India (@PTI_News) March 21, 2026 (చదవండి: పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!) -
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh— Sun News (@sunnewstamil) March 21, 2026 -
పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!
పైలట్ వృత్తిలో ఉండే వ్యక్తులకు మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఉంటాయని తెలుసా. అందరీ పైలెట్లకి రెండు ఫ్లైట్ జర్నీలు అత్యంత సర్వసాధారణం. మూడోది మాత్రం.. కొందరికే దొరికే సువర్ణావకాశం. అలాంటి లక్కీఛాన్స్ కొట్టేశాడు ఈ పైలట్. ఆ పట్టరాని సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఇలా. ఆ వ్యక్తే కెప్టెన్ అజమ్ అల్లి. ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ మధురమైన క్షణాన్ని కెమెరాలో బంధించి మరి పంచుకున్నారు. విమానంలో ప్రత్యేక ప్రకటన ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకంటూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఆయన శుభోధయం, లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేసి..మీ ఫైట్ డెక్ నుంచి మీ కెప్టెన్.. ఐయామ్ కెప్టెన్ అజమ్ అల్లి, అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పైలట్ జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయంటూ వాటిని వివరిస్తాడు. ఒక పైలట్కి ఎప్పటికీ మర్చిపోలేని మూడు ప్రయాణాలు ఉంటాయని పేర్కొన్నాడు. వాటిలో మొదటిది సోలో ఫ్లైట్ అని, దాదాపు 24 సంవత్సరాల క్రితం భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా ఉన్నప్పుడు తనకు ఎదురైన జర్నీ అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. రెండో ముఖ్యమైన ఘట్టం పదవీ విరమణకు ముందు చేసే చివరి విమానం ప్రయాణం. అయితే ఆ మైలురాయి తనకు ఇంకా దాదాపు రెండు దశాబ్దాల దూరంలో ఉందని అన్నారు. అన్నింట్లకంటే మూడో ఘట్టం అన్నింటికన్నా ప్రత్యేకమైనదంటూ ఇలా చెప్పారు. మూడోది బహుశా ఇది అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విమాన ప్రయాణం..ఎందుకుంటే కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం లభించడం. ఈ రోజు నాకు అలాంటి రోజే ఎదురైంది. నా భార్య, పిల్లలు, ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే..విమానంలోని ప్రయాణికులు చప్పట్లు కొడుతూ, చిరునవ్వులతో స్పందన తెలిపారు. కెప్టెన్ అల్లి ఈ వీడియోకి "ఒక పైలట్ ఎప్పటికీ మరచిపోలేని మూడు విమాన ప్రయాణాలు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Fishbed Motorist (@azam_ally) (చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!) -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
మా మాష్టారే పేషెంట్గా..!
మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి గౌరవప్రదమైన వ్యక్తులకు సేవ చేసే అవకాశం దొరకడం కూడా అత్యంత అరుదు. అలాంటి మహద్భాగ్యం ఈ డాక్డర్కి దొరికింది. అంతేగాదు ఆ క్షణాన్ని అత్యంత ప్రత్యేకం, అలాగే గర్వంగానూ ఉంది అంటూ సంబరపడిపోతాందా ఆ వైద్యురాలు.ఆ అదృష్టవంతురాలే డాక్టర్ ప్రతిభ నిఖార్ జునేజా. అందుకు సంబంధించిన వీడియోకు క్యాప్షన్గా డాక్టర్ జునేజా ఇలా రాశారు..ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం, భావోద్వేగభరితమైన రోజు అంటూ..తన కెదురైన మధురానుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన మాజీ గురువు డాక్టర్ బిడి గుప్తా తన క్లినిక్ని సందర్శించిన క్షణం గురించి పేర్కొంది. జామ్నగర్లోని ఎంపీ షా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ గుప్తా, డాక్టర్ జునేజాకు ఆమె మెడికల్ కాలేజీ రోజుల్లో బోధించారు. ఒకప్పుడూ తాను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకుందో ఆ వ్యక్తి ఈ రోజు తనని నమ్మి ఆయన ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెట్టారని రాసుకొచ్చింది. డాక్టర్ అవ్వడం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక "బాధ్యత" అని ఇలాంటి క్షణాలు గుర్తు చేస్తాయని అంటోంది. మన ఉపాధ్యాయులు మనపై ఉంచే నమ్మకమే అన్నింటికన్న గొప్ప బహుమతి. అని భావోద్వేగంగా మాట్లాడింది. ఇన్నేళ్ల తర్వాత చికిత్స నిమిత్తం రావడం, ఆయన్ని కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం వంటివి అన్ని.. నిజంగా ఈ రోజుని మర్చిపోలేను అని అన్నారామె. అంతేగాదు తన ఉపాధ్యాయుడు తనపై ఉంచిన నమ్మకం పట్ల గర్వం, వినమ్రతను కలిగి ఉన్నానని అన్నారామె. నెటిజన్లు సైతం మన గురువులు డాక్టర్గా నమ్మే రోజుకి మించిన అనుభూతి మరోకటి లేదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ పంపును తీసివేయడం మర్చిపోయారు.🚨Mirzapur, UP's new PWD road built AROUND a hand pump. Coordination fail or planning blunder? Who's accountable for this public inconvenience? pic.twitter.com/l1juOKDIsA— indiainlast24hr (@indiain24hr) March 18, 2026బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. Handpump In Middle Of The Road, Netizens Slam #PWD #Mirzapur #UttarPradesh #YogiAdityanath pic.twitter.com/VJyrKmY5x9— HW News English (@HWNewsEnglish) March 18, 2026 -
మైకేల్ జాక్సన్ని తలపించేలా ఆ తండ్రి డ్యాన్స్..!
ఓ కూతురు తన తండ్రి ఆ రైంజ్లో డ్యాన్స్ చేస్తాడని ఊహించలేదు. ఒక్కసారిగి విస్తుపోయి..చివరికి అతడితో కలిసి పాదం కదిపింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మేడమ్ బహిరంగంగా ప్లే చేస్తే..ఆయన టాలెంట్ ఏంటో తెలిసేది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు కూడా. వివరాల్లోకి వెళ్తే..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియలో ఓ యువతి 'బిల్లీ జీన్' పాటకు డ్యాన్స్ చేయడంతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి మాములుగా ఆమె వద్దకు వస్తాడు. ఆ తర్వాత ఆతడు చాలా సులభంగా మూన్వాక్ చేయడంతో ఒక్కసారిగా ఆ దృశ్యం అనూహ్య మలుపు తీసుకుంటుంది. ఈ నాన్న సాధారణ దుస్తులతో ఉన్నప్పటికీ..చాలా సునాయాసంగా ఆత్మవిశ్వాసంగా చేస్తున్న ఆ డ్యాన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యంత నేచురల్గా కనిపించే ఆ క్షణం మధుర జ్ఞాపకంగా మారిపోయిందా కూతురికి. ఒక్క క్షణం ఆమె సైతం తన తండ్రి అద్భుతమైన డ్యాన్స్ చూసి నిశ్చేష్టురాలైపోతుంది. ఆ తర్వాత కొంచెంసేపటికీ అతనితో కలిసి అడుగులు కదపడానికి ప్రయత్నించడంతో వీడియో ముగుస్తుంది. కాగా 1982లో విడుదలైన 'బిల్లీ జీన్', మైఖేల్ జాక్సన్ అత్యంత ప్రసిద్ధ ఆల్బమ్లలో ఒకటైన 'థ్రిల్లర్'లోని ఒక భాగం. ఈ పాట పాప్ సంగీతం, నృత్య సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందులోనూ జాక్సన్ చేసిన మూన్వాక్ ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది. View this post on Instagram A post shared by 🧚 (@magic._.shopp_)(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
గ్యాస్ బ్లాక్ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం
అమెరికా-ఇజ్రాయెల్.. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్రూమ్లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాత్రూమ్లో సిలిండర్లు..ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్రూమ్ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.#BREAKING : During a late-night raid in Hapur, Uttar Pradesh, local authorities recovered 32 LPG cylinders from a residential property. Officials confirmed that 18 of the cylinders were filled. Further action is being taken in the matter.#LPGSeizure #IllegalLPG… pic.twitter.com/9NR8ZWbcbK— upuknews (@upuknews1) March 13, 2026పశువుల పాకలో 201 సిలిండర్లు..రాజస్థాన్లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా.. సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.610 LPG Cylinders of Indane, Bharat Gas & HP Gas were seized, which were illegally storedThe Crime Branch, Delhi Police busted an illegal LPG cylinder hoarding racket operating from a godown in Mundka, Outer DelhiTo defame govt and to create panic situation these people can… pic.twitter.com/v9oWJBGHAM— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 16, 2026గ్యాస్ చోరీ.. హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్కు గ్యాస్ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్పై 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.ఎల్పీజీ బ్లాక్ మార్కెట్.. 33 లక్షలు స్వాధీనంమహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్లైన్ నంబర్ను జారీ చేసింది.330 LPG cylinders seized in Bhiwandi, Maharashtra. Three people booked for illegal storage.#lpggasissue #LpgCrisis #LpgCylinder #Maharashtra pic.twitter.com/3RfIiLTZB8— Sachin (@Sachin1649242) March 17, 2026 -
గంగా నదిలో బిర్యానీతో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026 -
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు
తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి. ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది. వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు. తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!) -
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలని చాలా మంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.వర్ష అనే యువతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్గా ఇచ్చింది.తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు. అందరూ కలిసి కారు పైన కవర్ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n)భావోద్వేగ సందేశం"మా తల్లిదండ్రులు ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."నెటిజన్ల ప్రశంసలుఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!
జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా స్పందించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అది చెప్పినంత సులువు కాదు. ఒక్కోసారి ఈ వయసులో ఇంత కష్టమా అని తల్లడిల్లిపోతాం. కానీ కొందరే ధైర్యంగా ఎదురెళ్లతారు. అలాంటి వాళ్లకు ఆ దేవుడు సదా తోడుగా ఉంటాడనేందుకు ఈ తాతగారే ఉదాహరణ.అమెరికాలోని టేనస్సీలోని మాంచెస్టర్కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే 78 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ వయసులో ఆ తాతగారి ఏం కష్టం వచ్చిందో అనిపిస్తుంది అతడు పడుతున్న తపన చూస్తే. వస్తువులను డెలివరీ చేసేందుకు వెళ్తున్నప్పుడూ.. వయసురీత్యా జారిపోయే అవకాశం ఉండటంతో ఎంతో జాగ్రత్తగా డెలివరీ చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే అతడు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంతలా కష్టపడుతూ డెలివరీ చేయడం ఎందుకని బాధ కూడా కలుగుతుంది. అలానే అనుకుంది బ్రిటనీ స్మిత్ అనే మహిళ కూడా స్టార్బక్స్ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్న రిచర్డ్ పుల్లీని చూసి. అతడు డెలివరీ చేస్తున్న విధానానికి ఫిదా అయ్యి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆ తాతగారి గురించి వివరించింది. ఆయన ఏడుపదుల వయసులో ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడో కూడా తెలిపింది. ఫుల్లీ తన భార్య వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతాడు. తన భార్య ఆమె తప్పిదం లేకుండానే ఉద్యోగం కోల్పోయిందని చెప్పుకొచ్చాడు ఫుల్లీ. దాని ఫలితంగా ఆమె ఆరోగ్య భీమా కూడా కోల్పోయింది. అందువల్ల తాను తమ జీవన ఖర్చుల తోపాటు మందులు, వైద్య ఖర్చులకు లెక్క చూస్తే..నెలాఖరుకి ఏమి ఉండదు. అందువల్ల ఇలా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు తెలిపాడు ఫుల్. తమది 56 ఏళ్ల వైవాహిక బంధమని చెప్పాడు. తన భార్య ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి ఒక ఏడాదికిపైగా ఇలా డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. దాంతో బ్రిటనీ స్మిత్ ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు అండగా నిలిచేందుకు, వారి ఖర్చుల నిర్వహణలో సహాయపడేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చారు. ఏకంగా రూ. 4.5 కోట్లు దాక విరాళం రావడం విశేషం. NEW: Internet users have raised $280,000 for an elderly man who became a DoorDash delivery driver to help pay for his and his wife's bills.A Tennessee woman decided to take matters into her own hands when she saw the man delivering her Starbucks."I work because I have to. I… pic.twitter.com/qWIXG8ZzSt— Collin Rugg (@CollinRugg) March 12, 2026(చదవండి: రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు టర్నోవర్..) -
ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..
పేరెంట్స్ పిల్లలకు గిఫ్ట్ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్ అమ్మో ఇద్దరూ కూతుళ్లా..?! అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. ఇద్దరు టీనేజ్ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటా సర్ప్రైజ్ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్ సర్ప్రైజ్కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n) (చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్
Iran war ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకరదాడులు, ఇరాన్ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వాస్తవం ఏంటి?ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి పోస్ట్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఏఐతో రూపొందించారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు వ్యాపించాయి. అసలు ఆయన బతికే ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.అసలు నిజం ఏమిటంటేఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్లైన్లో వ్యాపించిన పుకార్లను అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ, సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు.ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్షాట్లు, తప్పుడు దృశ్యాలు. తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
గ్యాస్ కొరత.. సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు. ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026 -
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్పిట్లో కూర్చోని రీల్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రయాణీకుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్ను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్పిట్లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలుఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్పిట్లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిరిండియా స్పష్టం చేసింది.Wait until you see the end of this video. The plane is in the air and an air hostess is sitting in the cockpit making reels. Is this really allowed? Feels quite disturbing to see something like this when passenger safety is supposed to be the top priority. @DGCAIndia pic.twitter.com/91Nmsr9R70— Nikhil saini (@iNikhilsaini) March 10, 2026డీజీసీఏ నిబంధనలేంటి?డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్పిట్లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. -
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట -
రైల్లో రీల్స్తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్కు కాల్ చేస్తే...!
రైలు ప్రయాణం అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు, ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో బిలాస్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా చేరింది. రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో "రీల్ స్టూడియో"గా మార్చింది. కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్తో రచ్చ రచ్చ చేశారు. వ్యక్తి తన తలపై రైల్వే బెడ్షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్లైన్కు (139)ను సంప్రదించారు. దీంతో రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. View this post on Instagram A post shared by Manmohan Verma (@bioeducator_manmohan) ‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ, రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్లో చెప్పారు. నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు. రైళ్లలో పుట్టిన రోజు జరుపుకోవడం, బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం తనకూ ఎదురైందంని ఒక యూజర్ పేర్కొన్నారు.ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్) -
అరుదైన ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసా?
మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్ ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్ రైల్వే స్టేషన్లో నది ఒడ్డు వరకే ట్రాక్ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు. -
తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..
కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. డాక్టర్ శరవణ కుమార్ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్లోనే ఉన్న అతన్ని డాక్టర్ ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!) -
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..) -
చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!
స్కేటింగ్, స్నోబోర్డింగ్ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్రెయ్ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్ చేసి నోటమాట రాకుండా చేశారు. ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్ చేసే థ్రిల్ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్, తన స్విస్ స్నేహితురాలితో కాశ్మీర్లోని గుల్మార్గ్లో మంచుకొండలపై ఈ స్టంట్ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు. అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్ సారీ" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్ స్కేటింగ్ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్ బోర్డింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్ స్విట్జర్లాండ్, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్ల నుంచి అనేక స్పాన్సర్షిప్లు కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Urmila P. (@ursk8kid) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
తన లవ్తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_) -
ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!
కొందరు భలే విచిత్రంగా ఉంటారు. ఒక్కరోజు వర్కౌట్లు మిస్సైతేనే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా లబోదిబోమంటారు. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..టెన్షన్గా వ్యాయామాలు చేసేయాల్సిందే. అందుకోసం ఏం చేసేందుకైనా, ఎంత కష్టమైనా డోంట్ కేర్. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ టైపే. అయితే ఈ వ్యక్తి ఫిట్నెస్ పిచ్చి ఏ రేంజ్లో ఉందో చూస్తే..ఓర్నీ గాల్లో కూడానా. అంటారు.ఇంతకీ ఏం చేశాడంటే..బెర్లిన్కు చెందిన ఎండ్యూరెన్స్ అథ్లెట్, కంటెంట్ క్రియేటర్ డోమ్ స్ట్రోహ్..ఫ్లైట్లో దాదాపు పదకొండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో చాలా గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. కనీస కదలికలు కాస్త కష్టమే. అందువల్ల మనోడు ఎక్కడ ఆరోగ్యం పాడవ్వుతుందని అనుకున్నాడో ఏమో గానీ. ఎలాగైనా..ఈ పరిస్థితుల్లో కూడా తన ఫిట్నెస్ని కాపాడు కోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. అందుకని ఏకంగా ఫ్లైట్లో ఉండే టాయిలెట్నే జిమ్గా మార్చేశాడు. విమానంలో సాధారణంగా వాష్రూమ్లు చాలా చిన్నగా ఉంటాయి. అంత ఇరుకైనా వాష్ రూమ్లో మనోడు ఏకంగా 5కే రన్ పూర్తి చేసే సాహసం చేశాడు. అసలు మనిషి ఒక్కడే పట్టేంత స్థలంలో వాకింగ్ అనేదే సాధ్యం కాదు..కానీ డోమ్ ఏకంగా రన్ చేయాలనుకుంటున్నాడు. ఎలా చేశాడో కూడా అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్చేశాడు డోమ్. అంతేకాదండోయ్ నిజంగానే 5.5 కిలోమీటర్లు రన్చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మనిషి అటు ఇటు కదలడానికి ఏ మాత్రం చోటు లేని ఆ చిన్న బాత్రూమ్లో మనోడు అంత వర్కౌట్ పూర్తి చేశాడా..? అని ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం డోమ్ ఆ స్టంట్ ఎలా పూర్తిచేశాడో చూసేయండి మరి..!. నెటిజన్లు కూడా మీరొక్కరే బాత్రూంలో అంతసేపు ఉండిపోయి..ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారో ఏంటో అని కొందరు. పాపం గాల్లో స్టంట్ చేయాలనుకున్నాడు కాబోలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dom Stroh (@dom.stroh) (చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’) -
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak) -
'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!
హోలీ వేడుకును అందరు పలు విధాలుగా జరుపుకుంటారు. సహజసిద్ధమైన రంగులతో కొందరు..ప్రకృతిని ఆస్వాదించేలా కొందరు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వాటన్నింటికంటే మన పుడమి తల్లి జరుపుకునే హోలీ వేడుకకు మించిన రంగుల పండుగ మరొకటి ఉండదు. సరిగ్గా చూస్తే దానిలో దాచుకున్న అద్భుతం హే రంగులే.. హే రంగులే ..అన్నట్లుగా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గజం షేర్ చేస్తూ అందర్నీ ప్రకృతి రమ్యత గూర్చి ఆలోచింపచేసేలా చేశారు.ఆ వీడియోలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా "హోలీ వేళ తప్పక వీక్షించాల్సిన వీడియో" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆకాశం నుంచి చూస్తే..రంగుల వస్త్రాన్ని కప్పుకున్న నేల తల్లిలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అద్భుతమైన ఎర్రమిరప పంట వైమానిక క్లిప్. రైల్వేలైన్ ఇరువైపులా ఎండబెట్టిన మిరపకాయలు షీట్లు కనిపిస్తాయి. అది చూస్తే ఒకవైపు పచ్చదనం..మరోవైపు ఎరుపు రంగు కలగలసి అద్భుతమైన పెద్ద కాన్వాస్ని పోలి ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగం నుంచి పుట్టుకొచ్చే రంగులే వేరు. బెలూన్ రైడ్, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలకు మించిన సహజసిద్ధమైన రంగుల ప్రదర్శన అని, తానెప్పుడు దీన్ని చూడలేదని రాసుకొచ్చారు మహీంద్రా పోస్ట్లో. పర్యాటకులను ఆకర్షించేలా తమ ఆదాయాన్ని పెంచుకునేలా స్థానిక రైతులు చేస్తే బాగుండనని, అయితే ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదని కూడా అన్నారు. నెటిజన్లు కూడా ఈ పోస్ట్పై స్పందిస్తూ..ఇలా పోస్టలు పెట్టారు. గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశ సహజ హోలీ కాన్వాస్లు. సరైన ప్రణాళికతో రైతులకు మద్దతు ఇచ్చేలా..ఆంధ్రుల గర్వాన్ని ప్రదర్శించే ప్రపంచ స్థాయి వ్యవసాయ-పర్యాటక ఉత్సవంగా మార్చొచ్చు అని పోస్టులు పెట్టారు.The perfect video to view on Holi… Because the colours of India spring up in many different ways & surprise us. Chillis laid out for drying create an amazingly beautiful tapestry when seen from above.This is Guntur district in Andhra Pradesh which alone has a share of 15%… pic.twitter.com/QKUn1rbDm0— anand mahindra (@anandmahindra) March 4, 2026 (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మెరుగైన స్టూడెంట్ గొప్ప ఉద్యోగంలో ఉంటాడని, యావరేజ్ స్టూడెంట్ ఏ ఉద్యోగం లేకుండా ఉంటాడని అనుకుంటాం. కానీ విధి చాలా పక్కా స్క్రిప్ట్తో మన అంచనాలను తలకిందులు చేస్తూ మన రాతన నిర్దేశిస్తుంది. అందుకు ఈ మిత్రులు కథే ఓ ఉదాహరణ. ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులు మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారి..నెటిజన్లను ఆలోచింపచేసేలా చేసింది. ఈ మిత్రుల సంభాషణను భారత్ మాతా కే సేవక్ సోష్ల్ మీడియా ఎక్స్లో షేర్ చేసింది. ఉమర్ అనే వ్యక్తి రైడ్ని బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైడర్ పేరు ఎందుకనో ఆసక్తిగా అనిపించిది. ఆ రైడర్ పేరు చందన్గా మొబైల్లో కనిపించడంతో ఒకప్పటి తన క్లాస్మేట్ చందన్నే. ఆ..! క్లాస్ టాపర్ కదా వీడేనా వాడు అని ఆలోచిస్తూ ఉండగానే..బుక్చేసుకున్న రైడర్ రానే వచ్చాడు. అతడు ఊహించనట్లుగానే ఆ రైడర్ తన క్లాస్మేట్ కావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతడిని కలిసిన ఆనందంతో ఎప్పటి నుంచి రైడర్గా పనిచేస్తున్నావ్ రా అని అడుగుతాడు. వెంటనే సదరు రైడర్ చందన్ ముందు ఓటీపీ చెప్పరా అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత చందన్ మాట్లాడుతూ..జీవితం ఎప్పుడూ ఓ ప్లాన్ ప్రకారం జరిగిపోదురా. అయిన పర్లేదు మిత్రమా..! నువ్వు నాగురించి ఏం బాధపడొద్దు. అయినా నువ్వు నా ఫ్రెండ్వి. నేను నీకు ఎలాంటి ఛార్జ్ చేయను అని అంటాడు. అప్పుడు ఉమర్ నువ్వు మన క్లాస్ టాపర్వి కదరా ఇలా..అంటూ ఆగిపోగా..చందన్ నవ్వుతూ..జీవితం చాలా విచిత్రమైనది..అయినా నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నువ్వే నా కస్టమర్వి అవుతావని అని నవ్వుతూ అంటాడు. ఆ తర్వాత రా కూర్చో..నేను నిన్ను సురక్షితంగా డ్రాప్ చేస్తాను అని బదులిస్తాడు. ఆ పోస్ట్ చాలా ఆలోచనాత్మక సందేశాన్ని ఇచ్చింది. మార్కులు, డిగ్రీలు లేదా టాపర్గా ఉండటం అనేవి మన భవిష్యత్తుని నిర్ణయించవు. అలాగే నిజాయితీగా పనిచేస్తే ఏ ఉద్యోగం చిన్నది కాదు. ముందు మనల్ని మనం చిన్నబుచ్చుకోకుండా గౌరవప్రదంగా భావిస్తే.. ప్రతి ఉద్యోగానికి ఓ గౌరవం ఉంటుంది అనే విషయాన్ని నొక్కిచెప్పింది అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం క్లాస్ టాపర్ ఇలా రాపిడో రైడర్గా మారడం ఓకింత బాధను కలిగించింది అని పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by The Siasat Daily (@siasatdaily) (చదవండి: శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్గా పనికి వచ్చేయాలి..) -
లిఫ్ట్లో షాకింగ్ యాక్సిడెంట్.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
గుజరాత్లోని వల్సాద్లో అత్యంత భయానకమైన లిఫ్ట్ ప్రమాదంఆందోళన రేపింది. లిఫ్ట్లోంచి బయటకు వస్తూండగానే అమాంతం లిఫ్ట్ కిందికి కదిలి పోయింది. హైటెక్ లిఫ్ట్తో కూడిన 14 అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్గా మారింది. గుజరాత్లో చాలా భవనాల్లో లిఫ్ట్లు శిథిలావస్థలో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వల్సాద్ నగరంలోని తితాల్ రోడ్లోని సర్దార్ హైట్స్లోని విలాసవంతమైన సబర్మతి భవనంలో ఈ సంఘటన జరిగింది. లిఫ్ట్లో ఉన్న ఒకవ్యక్తి తాను దిగాల్సిన ఫ్లోర్కు సంబంధించిన అంతస్తు కోసం బటన్ నొక్కాడు. లిఫ్ట్ కావలసిన అంతస్తుకు చేరుకుంది. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతోనే అతడు బయటకు అడుగు పెడుతుండగాఅకస్మాత్తుగా అధిక వేగంతో లిఫ్ట్ కిందికి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటననుంచి అతను ప్రాణాలతో తృటిలో తప్పించుకోవడం విశేషం. లిఫ్ట్ లోపల ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో ఈ దిగ్భ్రాంతికరమైన క్షణాలు స్పష్టంగా రికార్డైనాయి.ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్సాంకేతిక లోపమే కారణమా?టెక్నికల్ లోపం కారణంగానే ఇలా తలుపు తెరిచి ఉండగానే లిఫ్ట్ కదిలి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు . ఈ లిఫ్ట్ను ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందని, లిఫ్ట్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు రెండు రోజుల ముందే భవనాన్ని సందర్శించారని భవనం ఛైర్మన్ మీడియాకు తెలిపారు.ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! दिल देहलदेने वाला वलसाड का यह वीडियो लिफ्ट के रखरखाव की कमी को उजागर करता है। दरअसल, गुजरात की कई पुरानी सोसायटीज में खस्ता हाल में ही लिफ्ट चल रही है। जो कभी भी मौत को बुलावा दे सकती है। @sanghaviharsh pic.twitter.com/T5vK4tBuhq— Dixit Soni (@DixitGujarat) March 3, 2026 లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా, లిఫ్ట్లో ఇరుక్కుపోయినప్పుడు ప్రాణాపాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లిఫ్ట్ బటన్ నొక్కగానే తలుపులు తెరుచుకుంటాయి. కానీ, లోపల 'క్యాబిన్' (ఫ్లోర్) ఉందో లేదో చూసుకోకుండా అడుగు వేయకండి. కొన్నిసార్లు సాంకేతిక లోపం వల్ల క్యాబిన్ రాకముందే తలుపులు తెరుచుకోవచ్చు.లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కకూడదు. ఓవర్లోడ్ వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా చిన్న పిల్లలతో లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లండి. లిఫ్ట్ లోపల బటన్లతో ఆడుకోకుండా చూడండి.కదులుతున్న లిఫ్ట్ తలుపులకు ఆనుకుని నిలబడాలి.. అలాగే తలుపులు మూసుకుంటున్నప్పుడు చేతులు లేదా కాళ్లు అడ్డు పెట్టకండి. ఎందుకంటే ఒక్కోసారి సెన్సార్లు పని చేయకపోతే ప్రమాదం జరగొచ్చు. లిఫ్ట్ లోపల గెంతడం లేదా అల్లరి చేయడం వల్ల లిఫ్ట్ 'సేఫ్టీ గ్రిప్స్' లాక్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.చీర కొంగులు, పొడవైన దుస్తులు లేదా బ్యాగ్ బెల్టులు తలుపుల మధ్య చిక్కుకోకుండా చూసుకోండి.ఒక వేళ లిఫ్ట్ మధ్య ఆగిపోతే ఆందోళనపడవద్దు. లిఫ్ట్ ఆగిపోగానే ఊపిరి ఆడదనే భయం అస్సలు వద్దు. లిఫ్ట్లోని 'Alarm' లేదా 'Call' బటన్ను నొక్కాలి.ప్రశాంతంగా ఉంటూ ఫోన్ ద్వారా మెయింటెనెన్స్ టీమ్కు, లేదా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. టెక్నీషియన్లు వచ్చే వరకు లోపలే సురక్షితంగా ఉండటం ఉత్తమం.అలాగే లిఫ్ట్ ఫ్లోర్ల మధ్యలో ఆగినప్పుడు, తలుపులు బలవంతంగా తెరిచి బయటకు దూకడానికి ప్రయత్నించకండి. లిఫ్ట్ ఒక్కసారిగా కదిలితే ప్రాణాపాయం కలగవచ్చు.అపార్ట్మెంట్ కమిటీలు అసోసియేషన్లు కనీసం నెలకు ఒకసారి గుర్తింపు పొందిన టెక్నీషియన్లతో లిఫ్ట్ కండిషన్ను చెక్ చేయించాలి.లిఫ్ట్ లోపల కెమెరా, ఎమర్జెన్సీ లైట్లు పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి.లిఫ్ట్కు తప్పనిసరిగా Automatic Rescue Device (ARD) సిస్టమ్ ఉండాలి. ఇది కరెంట్ పోయినప్పుడు లిఫ్ట్ను దగ్గరలోని ఫ్లోర్లో ఆగేలా చేస్తుంది.ఒకవేళ భవనంలో మంటలు (Fire) చెలరేగినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. మెట్లు మాత్రమే ఉపయోగించాలి అనేది గుర్తుంచుకోవాలి. -
సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక. సంగీత్, మెహిందీ అంటూ సాగే ప్రీ వెడ్డింగ్ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి హృదయాన్ని ఆకట్టుకునే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది. ఇంతలో చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.హైలైట్ ఏంటంటే పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా 82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.నెటిజన్ల సంబరంఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) View this post on Instagram A post shared by Anjali Damani Choreography (@anjalidamanichoreography) "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్కు వీరు స్టెప్పులేశారు.ఇదీ చదవండి: వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్లో డెడ్బాడీ, షాకైన ఓనర్ -
సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో బేబీ షవర్ లేదా సీమంతం వేడుకలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది. మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా, ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది. @maamantraventures అనే ఇన్స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్ ఇన్ ఇది ఎయిర్..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్తో ఆమెను సర్ప్రైజ్ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది. View this post on Instagram A post shared by Akshitha Poojary (@akshupoojary) View this post on Instagram A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్నెటిజనుల స్పందనపురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు మరొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే బావుండేది అని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.(విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!
సీనియర్ సిటిజెన్ అని ప్రత్యేకంగ పేర్కొన్నప్పటికీ, రైల్వే రిజర్వేషన్ సమయంలో చాలా మందికి లోయర్ బర్త్లు ఎలాట్ కావు. పైగా అప్పర్ బర్త్లు కేటాయించడం ఒక్కోసారి చాలా కోపం తెప్పిస్తుంది. అలా కాసేపు రైల్వేస్ని తిట్టుకుని ఊరుకోకుండా ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. 82ఏళ్ల మహిళకు అప్పర్ బెర్త్ కేటాయించారని వ్యక్తి ఫిర్యాదుపై భారతీయ రైల్వేస్ ఎలా స్పందించింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయర్ బెర్త్లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్లో పైబెర్త్ కేటాయించడంపై సోషల్ మీడియా ద్వారా రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముకున్నారు” అంటూ ఐఆర్సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది క్లారిటీ ఇచ్చింది.ఐఆర్సీటీసీ ఏమందీ అంటే..ఈ వైరల్ పోస్ట్కు ప్రతిస్పందిస్తూ, కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి నియమాలను స్పష్టం చేసింది."సర్, భారత రైల్వేల కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్లో, సీనియర్ సిటిజన్లు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, వేరే మార్గం లేకపోయినా, స్వయంచాలకంగా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. అయితే, ఇది బుకింగ్ సమయంలో అటువంటి లోయర్ బెర్త్ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో, లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్ను ఎంచుకునే నిబంధన ఉందని కూడా ఉంది. ఈ సందర్భంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ బుక్ అవుతుంది. అంతేకాకుండా, ఇండియన్ రైల్వేలలో, రిజర్వ్ చేయబడిన వసతిని ఫస్ట్ కమ్ఫస్ట్ సర్వ్ కింద బుక్ అవుతుంది. ఎంపిక చేసుకున్న బెర్త్ లభ్యతకు లోబడి కేటాయించబడుతుంది" అని IRCTC వివరణ ఇచ్చింది. Booked ticket for 82 year old lady and @IRCTCofficial allotted upper berth (even though there were many seats available). Now the same lower berths will be sold at high rates in premium tatkal 👏Also well done in removing senior citizen quota @AshwiniVaishnaw— babu bisleri (@baabuOP) February 28, 2026లోయర్ బెర్త్ కావాలంటే ఈ చిట్కా పాటించాలట ఇలాంటి వివాదంలో గతంలో ఇండియన్ రైల్వేస్కు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఇచ్చిన వివరణ ఇచ్చారు. ఇది చాలామంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించడంలో సహాయపడింది. "మీరు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకే టికెట్లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చినట్లయితే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయని టీటీ వివరించారు. ఇదీ చదవండి : తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?భారతీయ రైల్వేస్లో సీనియర్ సిటిజన్ కోటా ఆటోమేటిక్ లోయర్ బెర్త్ కేటాయింపు లభ్యతను బట్టి 60 ఏళ్లు, అంతకు పైబడిన పురుషులకు, 45 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు లోయర్ బెర్త్లు కేటాయించ బడతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వయస్సు రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, వారు ప్రయాణ సమయంలో వారి వయస్సును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి . టికెట్ తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు దానిని చూపించాలి.ఇదీ చదవండి: విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు -
ఇదిగో... బ్లింకిబాండ్
‘గుర్రాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి’ అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. అయితే నిత్యజీవితంలో ఎక్కడో ఒకచోట అవి మనుషులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. తాజా విషయానికి వస్తే... రాజస్థాన్లోని ఒక హైవేపై బ్లింకిట్ డెలివరీ బ్యాగ్ను గుర్రంపై మోసుకెళ్తున్న వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటెంట్ క్రియేటర్ కపిల్ బిష్ణోయ్ ఈ వీడియో క్లిప్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.‘ఇది రాజస్థాన్! యువకులకు గుర్రాన్ని స్వారీ చేసే అవకాశం ఇవ్వకుండా వృద్ధులు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు’ అని సరదాగా తన క్యాప్షన్లో రాశాడు కపిల్.‘ఆధునిక రహదారిపై గుర్రపు డెక్కల లయబద్ధమైన సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి గందరగోళం, హడావిడీ కనిపించదు’ అనుకునేలా చేసిన ఈ తొమ్మిది సెకన్ల వీడియోను చూసి నెటిజనులు ‘వావ్’ అనడమే కాదు... ‘కార్లు, బైక్ల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో గుర్రాలు పర్యావరణానికి హాని కలిగించని అద్భుతమైన రవాణా సాధనాలు’ అంటున్నారు కొందరు. ‘బ్లింకిట్’ను ‘జేమ్స్బాండ్’ ను కలిపి ‘బ్లింకిబాండ్’ అని నామకరణం చేశారు. -
ఆర్టిస్ట్ మీరే... క్యారికేచర్ మీదే!
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీలో క్యారికేచర్లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ ఎక్స్పీరియెన్స్లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:→ చాట్జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్లోడ్ చేయాలి.→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్పుట్ ఇవ్వాలి.→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి. -
రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్ మెర్సిడెస్ వచ్చింది!
షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాలు కోసం ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?ప్రతీ వేసవిలో దుబాయ్ 'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్ సర్వ సాధారణం. కానీ దుబాయ్లోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్. View this post on Instagram A post shared by Dubai Gold District (@dubaigolddistrict)కారుతో సరదాగా ఫోటో కట్ చేస్తే20ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్న సుమిత్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్లకు ఒక వోచర్ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. సర్ప్రైజ్ చేసిన కాల్ఒకరోజు నైట్ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?) -
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్గా మారింది.పెద్ద నోట్లు రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం.. పాతనోట్లను గుర్తించిన తరువాత అమ్మ తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది. నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా, లేదా? అంటూ తన ఫాలోయర్స్ను ఉద్దేశించి అడగడాన్ని ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. View this post on Instagram A post shared by AD🧿 (@ayushidixit___)ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్తనెటిజన్లు ఏమన్నారంటేవైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్ -
లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్
చివరి క్షణంలో బాస్ సెలవు రద్దు చేయడంతో ఒక యువతి స్పందించిన తీరు నెట్టింట్ చర్చకు దారి తీసింది. తన జర్నీ ప్లాన్స్ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్పోర్ట్లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్. దీనికి సంబంధించి జెన్జెడ్ యువతి ఒక వీడియోను సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. సిమ్రాన్ షేర్ చేసిన వివరాల ప్రకారం తాను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే మేనేజర్కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు, అత్యవసర విస్తరణ అవసరం కారణంగా ఆమె సెలవు రద్దు చేసినట్టు సమాచారం ఇచ్చాడు మేనేజర్. దీంతో షాకైన ఆమె "ఐ డోంట్ కేర్" అని సమాధాన మిచ్చిందట. కార్యాలయంలో అత్యవసర పరిస్థితులు సంభవించవచ్చు, కానీ పర్సనల్ కమిట్మెంట్స్ను పదేపదే దెబ్బతీసేలా ఉండకూడదు కదా సిమ్రాన్ తెలిపారు. ఉద్యోగాన్ని శ్రద్దగా చేస్తాను. అలాగే తన జీవితాన్ని, ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని పేర్కొంది.Boss Cancels Leave At Last Moment, Gen Z Worker's "I Don't Care" Reply Goes Viral pic.twitter.com/GH2BZEm1K9— प्रेsident (@Desi_urbann) February 25, 2026నెటిజనుల స్పందనఈ వీడియో త్వరగా ఆన్లైన్లో దృష్టిని, మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఆమె వైఖరికి మద్దతు ఇచ్చారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై తీవ్ర చర్చ సాగింది. ఈ సంఘటన ఆమెను నిరాశకు గురిచేసిదని,ఇది కమ్యూనికేషన్ వైఫల్యంగా కొందరు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్ను ఏర్పాటు చేసుకొని, లీవ్ సంగతి స్పష్టంగా తెలియజేయాలని మరికొందరు పేర్కొన్నారు.అయితే, మరికొందరు సెలవు అధికారికంగా ఆమెదించారా? లేదా అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసు, అధికారుల ప్రవర్తనా తీరు, ఉద్యోగుల వృత్తిపరమైన జవాబుదారీతనం చుట్టూ పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేసింది. ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
పెళ్లిలో డాన్స్.. ఇలాగా కూడా చేస్తారా?
పదిహేను సంవత్సరాల క్రితం... కాలేజీ ఫంక్షన్లో ‘యూ ఆర్ మై సోనియా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు యశ్, గరీమా.తాజా విషయానికి వస్తే... స్నేహితులు కాస్తా వధూవరులు అయ్యారు.హైలెట్ ఏమిటంటే ఆనాటి డ్యాన్స్ వీడియోను పెళ్లివేడుకలో ప్రదర్శించడం. పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రమే కాదు నెట్వాసులు కూడా ‘బ్రహ్మాండమైన ఐడియా’ అంటున్నారు.‘ఎన్నో జ్ఞాపకాలను మోసుకొచ్చి మనసును ఉల్లాసపరిచిన వీడియో ఇది’ అని ఇన్స్టాగ్రామ్లో రాసింది గరీమ.‘‘కాలేజీ డ్యాన్స్ను రీక్రియేట్ చేయాలనే ఐడియా అనుకోకుండా వచ్చింది. ఇంత స్పందన వస్తుందనుకోలేదు’ అన్నాడు యశ్. ‘చిన్ననాటి స్నేహితులు, కాలేజీ రోజుల నాటి స్నేహితులు పెళ్లి చేసుకుంటే వారి పాత వీడియోలు, ఫొటోలను పెళ్లి వేడుకలో ప్రదర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది’ అని సూచించాడు ఒక నెటిజనుడు.చదవండి: ఈ వధూవరులది ఎంత గొప్ప మనసు!పెళ్లివేడుకలో మరో హైలైట్ ఏమిటంటే ‘యూ ఆర్ మై సోనియా’ పాటకు వధూవరులు స్టేజీపై డ్యాన్స్ చేశారు.‘అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు!’ అంటారా?ప్రేమకు ఉన్న పవర్ అదే కదా! View this post on Instagram A post shared by Yash garima yaari (@yaarigram) -
పింక్ ప్యారడైజ్గా బెంగళూరు, వైరల్ వీడియోలు : హీరో ఈయనే
బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతీ వసంతంలో 'పింక్ ప్యారడైజ్'లా అద్భుతమైన అందతో అలరారుతుంది. అచ్చం జపాన్లోని 'చెర్రీ బ్లాసమ్స్' లాగే బెంగళూరులోని ఈ పూలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆకాశం నుండి చూస్తే గులాబీ దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది. పింక్ పూలతో స్వాగతం పలుకుతున్న బెంగళూరు వీధులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు 'పింక్ ప్యారడైజ్' వెనుక ఉన్న హీరో గురించి తెలుసుకుందాం.గార్డెన్ సిటీ బెంగళూరు ఇపుడు పింక్ ప్యారడైజ్లా దర్శనమివ్వడానికి కారణం సేతురాం గోపాల్రావు నేగిన్హాల్ అనే అటవీ అధికారి. ఆయన కేవలం అటవీ శాఖ అధికారిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా పనిచేశారు. కర్ణాటక కేడర్కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ సేతురామ్ గోపాలరావు నెగినహాల్ (S.G. Neginhal). 1980వ దశకంలో బెంగళూరు నగరం వేగంగా విస్తరిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గుండూ రావు నగరాన్ని పచ్చదనంతో నింపే బాధ్యతను నెగినహాల్కు అప్పగించారు. అంతే అప్పటివరకు అడవుల పెంపకానికే పరిమితమైన అటవీశాఖ, మొదటిసారిగా నగర వీధుల్లో మొక్కలు నాటడం ప్రారంభించింది అటవీశాఖ. నెగినహాల్ కేవలం చెట్లను నాటడమే కాదు, ఏ వీధిలో ఏ చెట్టు ఉండాలో చాలా శాస్త్రీయంగా నిర్ణయించారు. 1982-1987 వీధివీధిన స్థానికులను అడిగి మరీ సుమారు 15 లక్షల మొక్కల్ని నాటించారు. మొక్కల్ని నాటడంతోనే చేతులు దులుపేసుకోలేదు ఆయన. నాటిన మొక్కల్ని పశువులు, ప్రజల నుండి కాపాడటం మొదలు, వాటిని సంరక్షణ లాంటి అనేక సవాళ్లను శ్రద్ధగా నిర్వహంచారు. View this post on Instagram A post shared by Sharath Kumar (@sharuzlife) నెగినహాల్ అద్భుతమైన ప్రణాళికబెంగళూరు వీధుల్లో ఒకేసారి ఒకే రంగు పూలు పూసేలా ఆయన ప్లాన్ చేశారు. వసంత కాలం వస్తే ఒక వీధి అంతా పసుపు రంగులో (Tabebuia Argentea), మరో వీధి అంతా గులాబీ రంగులో (Tabebuia Rosea) కనిపిస్తుంది.టాబెబుయా రోసియా (Tabebuia Rosea): ఇప్పుడు మనం చూస్తున్న ఈ గులాబీ రంగు పూల చెట్లు నిజానికి విదేశీ జాతికి చెందినవి. ఇవి బెంగళూరు వాతావరణానికి బాగా సరిపోతాయని ఆయన గుర్తించి వేల సంఖ్యలో నాటించారు. (గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం)2024లో నెగినహాల్ ఈ భౌతిక ప్రపంచానికి దూరమైనా ఆయన నాటిన లక్షలాది చెట్లు ప్రతి ఏటా వసంత కాలంలో విరగబూస్తూ ఆయన ఉనికిని గుర్తు చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కబ్బన్ పార్క్, లాల్బాగ్, మల్లేశ్వరం, జయనగర్ తదితర వీధుల్లో పూలు పూసినప్పుడు నేలంతా గులాబీ రంగు పూల రేకులతో నిండి పోయి అద్భుతంగా కనింపించే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆయన దార్శనికత మరింతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. ఇదీ చదవండి: టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్ -
పానీపూరీని ఇలా కూడా సర్వ్ చేయొచ్చా..!?
ఆహార విక్రేతలు వాళ్ల ఫుడ్ స్టాల్ అమ్మకాల కోసం ఎన్నో రకాల వ్యూహాలతో సాగుతారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ పానీపూరీ విక్రేత అంతకుమించి క్రియేటివిటీతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మొత్తం సెటప్ చూస్తే..అది పానీ పూరీ అమ్ముతున్నట్లుగా ఉండదు..ఏదో వార్లా కనిపిస్తుంది. ఈ వ్యక్తి క్రియేటివిటీకి, ఐడియాకు మెచ్చుకోకుండా ఉండలేం. అంతలా ఫుడ్స్టాల్ని సెటప్ చేశాడు మరి..!. ఎక్కడంటే..ముంబైకి చెందిన పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి ఆహార్యం సైతం పూర్తి విభిన్నంగా ఉంది. అతడు పానీపూరీని పోరాట అడిషన్గా మార్చేశాడు. యుద్ధం చేసే సైనికుల మాదిరిగా పవర్ఫుల్ వార్మ్యాన్లా దుస్తులు ధరించి చేతిలో సూపర్సోకర్ వాటర్గన్తో ప్రజలకు పానీపూరీని సర్వ్ చేస్తున్నాడు. ఆలుకర్రీ స్టఫ్తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్గన్తో సర్వ్ చేస్తున్నాడు. కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండం విశేషం. అంతేగాదు ఒకరకంగా ఆవిచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తున్నారు. ఇది మార్కెటింగ్ ట్రిక్ అయినా..పొట్టకూటి కోసం మనిషి ఎంత దూరమైన వెళ్తాడు..పైగా తనలోని టాలెంట్ మొత్తం బయటకు తీసి ఏదోరకంగా బతుకుబండిని నడిపించేందుకు ఆరాటపడతాడు. అందుకు నిదర్శం ఈ పానీపూరీ వ్యాపారి క్రియేటివిటీనే కదూ..!.(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!
ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్ని ప్లీజ్ రెండు స్టెప్లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Gursehaj Kaur (@impromptu_gursehaj) (చదవండి: రష్మిక, విజయ్ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ఎంత ఖర్చు అవుతుందంటే..)


