breaking news
Social Media
-
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్లో వైరల్ అయ్యే "షుగర్కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కదులుతున్న రైలులో పూజలు..! వీడియో వైరల్..
రైలు బోగినే హనీమూన్ సూట్గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది. అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్ ద్వారా ప్రేవేట్గా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్లో జరిగిందని తెలిపింది. ఈ సెలూన్ కోచ్ అనేది సీనియర్ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్ బోగీ. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, ఒక చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్ల తోకూడిన వాష్రూమ్ సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్ కోసం అడ్వాన్స్గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది. ఈ సెలూన్ కోచ్ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్ప్రెస్కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు. Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026 (చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..) -
డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళకు డెలివరీ ఏజెంట్ కారణంగా భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరగా, మహిళ అందుకు నిరాకరించింది. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా అతడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. సాధారణ డెలివరీగా మొదలైన ఘటన చివరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ వెళ్లే ముందు టాయిలెట్ ఉపయోగించుకోవాలని అడిగాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆమె అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆమె వద్దని చెప్పినా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జరిగిన ఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఎదుట ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఎదుట తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె వెంటనే తలుపులు మూసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.एक महिला ना कहने पर भी एक लड़का उनका Washroom Use किया उनको उसका Private Part दिखाए 😡।एक Flipkart/Myntra का Delhivery Boy parcel लेेकर आता है एक लड़की के पास उसके बाद उन्होंने कहा कि आपका Washroom Use कर सकता हूं क्या ।लेकिन वो लेडीज अकेला रहता है इसलिए ना कहा लेकिन वो नहीं… pic.twitter.com/rJFaJVRUWT— Subhajit Das (@SantaniSubhajit) July 11, 2026ఈ ఘటన అనంతరం బాధితురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఆమె పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదు అందించాలని బాధితురాలిని కోరిన పోలీసులు, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా, ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందితో సంబంధం ఉన్న కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులకు ఇంట్లోకి ప్రవేశం కల్పించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బదిలీ ఉత్తర్వుల్లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేస్తూ..
రాజస్థాన్లో ప్రభుత్వ రెవెన్యూ శాఖ విడుదల చేసిన పట్వారీల బదిలీ జాబితాలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బదిలీ కావాల్సిన పట్వారీ పేరు స్థానంలో ఏకంగా అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పేరు అధికారిక ఉత్తర్వులో కనిపించడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసే ముందు ఎంత జాగ్రత్త అవసరమో మరోసారి స్పష్టమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో తీవ్రమైన చర్చ నడుస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సైనికుడు, ప్రస్తుతం పట్వారీగా పనిచేస్తున్న నరేంద్ర సింగ్ను బాలోత్రా జిల్లాలోని నవోడా నుంచి డీగ్ జిల్లాలోని సోన్గావ్కు బదిలీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అయితే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసే సమయంలో జరిగిన టైపింగ్ లేదా డేటా ఎంట్రీ పొరపాటు కారణంగా నరేంద్ర సింగ్ పేరు స్థానంలో డీగ్–కుమ్హేర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శైలేశ్ సింగ్ పేరు నమోదైంది. దీంతో అధికారిక ఉత్తర్వు చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈ తప్పిదం బయటపడిన తర్వాత అసలు బదిలీ కావాల్సిన పట్వారీ నరేంద్ర సింగ్ కొత్త విధుల్లో చేరలేకపోయారు. సవరించిన ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక చిన్న పరిపాలనా పొరపాటు ఉద్యోగి విధుల్లో చేరడానికే అడ్డంకిగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శైలేశ్ సింగ్ కార్యాలయం స్పందిస్తూ.. ఇది పూర్తిగా సాంకేతిక లేదా టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఎమ్మెల్యేకు ఈ బదిలీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అధికారులు కూడా తప్పిదాన్ని గుర్తించి సవరించిన ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.అయితే ఈ ఘటన ప్రభుత్వ శాఖల పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే ముందు సరైన పరిశీలన జరిగి ఉంటే ఇలాంటి పొరపాటు జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పట్వారీ పేరు స్థానంలో ప్రజాప్రతినిధి పేరు అధికారిక పత్రంలో రావడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముస్లిం యువకుడైన బబ్లూ సిద్ధిఖీ, తన పెంపుడు సోదరి దీపాన్షి వివాహ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు.హైందవ సంప్రదాయాల ప్రకారం జరిపించిన తీరు స్థానికంగానే కాక సోషల్ మీడియాలోనూ ప్రశంసలందుకుంటోంది.తండ్రి తరువాత తండ్రికొన్నేళ్ల క్రితమే దీపాన్షి తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో పొరుగున ఉండే బబ్లూ సిద్ధిఖీ, ఆమెను తన సొంత చెల్లెలిలా ఆదరించాడు. బబ్లూ కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేరనే వెలితి ఆమెకు తెలియకుండా బబ్లూ కుటుంబం ఆమె జీవితంలో ప్రతి అడుగులో తోడుగా నిలిచింది. ఆమెకు యుక్తవయసు రావడంతో పెద్దమనసు చేసుకొని వైభంగా పెళ్లి చేశారు. కాళ్లు క డిగి కన్యాదానం చేసి చక్కటి విందు ఇవ్వడం విశేషంగా నిలిచింది. జులై 8న హిందూ సంప్రదాయాల ప్రకారం ఉఝానిలోని ఎస్ఎస్ గ్రీన్ ప్యాలెస్లో దీపాన్షి, కమల్కాంత్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంల అత్యంత పవిత్రమైన 'కన్యాదానం' క్రతువును బబ్లూ సిద్ధిఖీ స్వయంగా నిర్వహించాడు. దాదాపు 800 మంది అతిథులకు భోజన వసతులతో పాటు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ మిన్న‘‘దీపాన్షి చిన్నప్పటి నుంచి నా సొంత చెల్లెలా చూసుకున్నా. తమ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ప్రేమ, నమ్మకంతో ఏర్పడే బంధాలు రక్తసంబంధాల కంటే తక్కువేమీ కావు. ఏ ఆడపిల్ల కూడా తన పెళ్లి రోజున ఒంటరినని బాధపడకూడదు. ఒక సొంత అన్నగా చెల్లెల్నిఎంత గౌరవంగా, సంతోషంగా అత్తవారింటికి పంపాలో, అలాగే పంపించాను" అని బబ్లూ సిద్ధిఖీ గర్వంగా చెప్పాడు.కన్నీళ్లు పెట్టుకున్న వధువుపెళ్లి సమయంలో దీపాన్షి పలుమార్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. బబ్లూ భయ్యా, వారి కుటుంబం సొంత కూతురి కంటే మిన్నగా చూసుకున్నారు. తల్లిదండ్రులు లేరనే బాధ నాకు కలగనివ్వలేదు. సామాజిక, మతపరమైన వ్యత్యాసాల కంటే ప్రేమాభిమానాలే గొప్పవని మా అన్న నిరూపించాడు అంటూ భావోద్వేగానికి లోనైంది. నీరు నిండిన కళ్ళతో వారికి కృతజ్ఞతలు తెలిపింది.ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!నెటిజన్ల ప్రశంసలుఈ పెళ్లికి హాజరైన స్థానికులు బబ్లూ సిద్ధిఖీ మానవత్వాన్ని, మతసామరస్యాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు . సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడంతో, నెటిజన్లు "నిజమైన భారతదేశం అంటే ఇదే" అంటూ ఈ అన్నాచెల్లెళ్ల బంధాన్ని, బబ్లూ సంస్కారాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మతాల పేరుతో సమాజంలో విభేదాలు తలెత్తుతున్న ఈ రోజుల్లో బబ్లూ మతంకంటే మానవత్వం మిన్న అని చాటిచెప్పాడు అంటూ కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: సీక్రెట్గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ ఫేమ్ : స్పెషాల్టీ ఏంటంటే A Muslim man named Bablu (Riyasat) Siddiqui in Badaun, Uttar Pradesh, organised a lavish, fully traditional Hindu wedding for his adopted Hindu sister Deepanshi, personally performing her kanyadaan and hosting more than 800 guests with food and refreshments. pic.twitter.com/6CGEaM1VT1— Shakeel Yasar Ullah (@yasarullah) July 10, 2026 -
56 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ..! పట్టరాని సంతోషంలో కుమార్తె..
భర్తను కోల్పోయి ఒంటిరి తల్లిగా పిల్లలను పెంచుతున్న ఓ మహిళ సాధించిన అసాధారణ విజయ గాథ నెట్టింట వైరల్గా మారింది. ఆమె కుమార్తె షేర్ చేసిన ఈ పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక.. మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించింది. ఒకపక్క పిల్లలు బాధ్యత, కుటుంబ నిర్వహణ, ఉద్యోగం అన్ని చూసుకుంటూనే తన కలను నెరవేర్చుకోవడం అంటే మాటలు కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. మరి ఆమె ఎలా సాధ్యం చేసిందంటే..56 ఏళ్ల తల్లికి దుబాయ్కు చెందిన కంటెంట్ క్రియేటర్ నుమయా కారు సోషల్మీడియా వేదికగా హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఇలా రాసుకొచ్చింది. దశాబ్దాలుగా కుటుంబ అభ్యున్నతికి పాటుపడిన తన తల్లి ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుందంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా పిల్లలను పెంచుతూ..ఓ పక్క తల్లిదండ్రులను కూడా పోగొట్టుకుని పుట్టెడు బాధను దిగమింగుతూ.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన స్ట్రాంగెస్ట్ విమెన్. అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని కూడా సమతుల్యం చేసుకుంటూ..కుటుంబాన్ని చక్కదిద్దిన మహిళ ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తన జీవితం మొత్తం తన పిల్లల కోసమే బతికింది. నాన్న చనిపోయాక..తొమ్మిదేళ్లుగా అమ్మగా నాన్నగా వ్యవహరించి..ఒంటరిగా ఆ బాధను మొత్తం మోసిన ధీర వనిత. పూర్తి సమయం పనిచేస్తూ పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి మూసి ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలకు తొలి ప్రిన్స్పాల్గా నియమాకం అందుకుంది. ఇన్నేళ్లకు తన కోసం ఆలోచించడం మొదలు పెట్టి..మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి, తన కలను సాకారం చేసుకుంది. "అమ్మా.. ఈ డిగ్రీ నీదే. ఒక కూతురుగా నాకెంతో గర్వంగా ఉంది. ఆమె గ్రాడ్యుయేషన్ డేలో తాను లేకపోవడం ఎంతో బాధగా ఉందని, అయినప్పటికీ ఒక కుమార్తెగా గర్వించే క్షణం ఇది అని" పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం తాను వేరే దేశంలో ఉన్నానంటే అందుకు ఆమెనే కారణం, అది ఆమె కోరుకున్న జీవితమే అని పేర్కొంది. "అమ్మా..నిజమైన బలం, నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటాయో చూపిచావు. నేను మీలో కనీసం సగం అయిన ఉండగలిగితే బాగుండు. ఈ డిగ్రీ ఈదే. దీనికి మీకంటే ఎక్కువ అర్హులు ఎవరూ లేరు అంటూ తనపోస్టుని ముగించింది." నెటిజన్లు కూడా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు అంటూ..సదరు తల్లికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Numaya Karu✨Dubai Content Creator ✨ (@double_n_karu) (చదవండి: 'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!) -
'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!
కొన్ని మనసుకు తాకే కొంగొత్త విషయాలు చూస్తే..స్ఫూర్తిదాయకమైన పాటలను గుర్తుకుతెస్తాయి. అందుకు నిదర్శనం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్. ఎప్పటిలానే ఈ సారి ప్రేరణ కలిగించే కథతో మనముందుకు వచ్చారు. అయితే ఈ పోస్ట్ అత్యంత ప్రత్యేకం, అందర్నీ చైతన్యపరిచే గొప్ప విషయం కూడా. ఇంతకీ ఆయన పోస్ట్లో ఎవరి గురించి రాసుకొచ్చారంటే..మన పరిసరాలను, నగరాలను దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ మనం తరచుగా విస్మరించే విషయాల విలువను గుర్తు చేసేలా ఒక వ్యక్తి దృఢ సంకల్పం కనులముందు కనిపించేంత వరకు తెలియదు. అలాంటి వ్యక్తే ఈ 80 ఏళ్ల ఐరిష్ వ్యక్తి కారోన్ రాన్స్లీ . పదేళ్లకు పైగా గుర్తింపుకు నోచుకోని మెట్లబావులను శుభ్రం చేస్తూ సాంప్రదాయ నీటి నిర్మాణాల పట్ల తిరిగి చూసేలా అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానికంగా "పాగల్ సాబ్"గా పిలిచే రాన్స్లీ నిర్లక్ష్యానికి గురైన మెట్లబావులు, మెట్టు కలిగిని నీటి కుంటల తదితర నిర్మాణాలను తన స్వహాస్తాలతో పునరుద్ధరించారు. ఆయన నిస్వార్థ సేవ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్మహీంద్రాను సైతం కదిలించింది. ఆ మహానుభావుడి కృషికి ఫిదా అవ్వతూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చాలా మంది జోధ్పూర్ పురాతన మెట్ల బావుల అందాన్ని చూసి మురిసిపోతుంటారే తప్ప..రాన్స్ లీ మాదిరిగా కనుమరుగైపోయేలా అధ్వాన్నంగా ఉన్న వాటి స్థితిని గుర్తించారు. ఆయన అద్భుతమైన వాస్తు శిల్పం, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆ నీటి బావులు వ్యర్థాలతో నిండిపోయి..వాటివైపు కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్న వాటిని చూసి చలించిపోయారు అయితే ఆయన తాను ఒక పర్యాటకుడిలా చూసి వెళ్లిపోవాలని అనుకోకపోవడం విశేషం.వాటిని పునరుద్ధరించే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించకోవడమే గాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. అలా మొత్తం పదేళ్లు ఆ మెట్లబావుల సంరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారంటూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేగాదు వారసత్వ సంపదను పరిరక్షించడానికి నిపుణులుగా లేదా ఒకే ప్రదేశానికి చెందినవారై ఉండాల్సిన అవసరం లేదని చెప్పే సంఘనట ఇది అన్నారు. అంకితభావం ఉన్న ఎవరైనా భారతదేశంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించడంలో తన వంతు సహకారం అందించగలరని అన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ చాంద్బావిని పరిరక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ..భారతదేశం అంతటా ఉన్న వాలంటీర్లు, పర్యావరణ పరిరక్షకులు, ఎన్జీవోలు, గ్రామీణ సంఘాలు ఇలాంటి చారిత్ర కట్టడాల కోసం చేస్తున్న కృషిని గుర్తుకుతెచ్చుకున్నారు. అంతేగాదు జోధ్పూర్ పై రాన్స్ లీకి ఉన్న ప్రేమకు, వారసత్వం పట్ల ఉన్న నిస్వార్థ సేవకు, అభిరుచికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా.. ఆయన పని ఇంతటితో ఆగకూడదు అంటూ పోస్ట్ని ముగించారు. నెటిజన్లు కూడా ఆ ఐరిష్ వ్యక్తి నిబద్ధతను, నిస్వార్థంగా చేస్తున్న అతడి ప్రయత్నాలను కొనియాడారుమెట్ల బావుల ప్రాముఖ్యత..మెట్లబావులు కేవలం రాతితో కట్టిన పాత కట్టడాలు మాత్రమే కాదు. శతాబ్దాలుగా, ముఖ్యంగా నీటి కొరత ఎప్పుడూ ఒక సవాలుగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతాలలో, ఇవి కీలక పాత్ర పోషించాయి. మెట్ల బావులు కేవలం నీటి వనరులుగానే కాకుండా, ప్రజలు సమావేశమై.. ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకునే ప్రదేశాలుగా కూడా మారాయి. ఇవి ఆ కాలంలోని టెక్నాలజీ, నాటి తరం వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు కొలమానం. కాగా, రాన్సీలీ ఒక మీడియా ఇంటర్వ్యూలో తన ప్రయత్నం గురించి ఇలా వివరించారు. తాను 2014లో జోధ్పూర్కి వచ్చినప్పుడు ఈ అందమైన మెట్లబావులను చూశానని చెప్పారు. అయితే వాటిలో కొన్ని నీటి నిల్వ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడం చూసి దిగ్బ్రాంతి చెందానన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రదేశాలను శుభ్రంచేసి మంచి స్థితిలోకి వచ్చేలా తన వంతు కృషిని చేశానని అన్నారు. ఇదంతా తన స్వహస్తాలతోనే చేశానని తెలిపారు..They nicknamed 80 year old Irishman, Caron Rawnsley, ‘Paagal Saab’ for his obsession with cleaning Jodhpur’s Bawris & Jhalaras. Fortunately, today, you don’t need to be either ‘paagal’ or ‘phirang’ to devote yourself to reviving India’s stepwells. Earlier this year, I had… pic.twitter.com/xKTUzO72Zx— anand mahindra (@anandmahindra) July 10, 2026(చదవండి: ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..) -
అయ్యో అమైరా..! వినిపించని చిట్టితల్లి ఆర్తనాదం
తోటి విద్యార్థుల వేధింపుల మధ్య ఓ చిన్నారి చేసిన పోరాటం.. చివరకు విషాదంగా ముగిసిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం.. తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలన్న ఆరాటం.. టీచర్లు సైతం పట్టించుకోలేదనే చిట్టితల్లి అసహనం.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలతో మరోసారి తెరపైకి వచ్చాయి. చిన్నారి అమైరా చివరి క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.రాజస్థాన్లోని జైపూర్లో గత ఏడాది సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల అమైరా మీనా మృతి కేసు తాజాగా విడుదలైన తరగతి గది సీసీటీవీ వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు విడుదల చేసిన ఈ దృశ్యాల్లో.. అమైరా ఆందోళనకు గురైనట్లు, పలుమార్లు క్లాస్ టీచర్ను ఆశ్రయించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది.వీడియోలో కనిపించిన ఆ రోజు దృశ్యాలు2025 నవంబర్ 1న జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న అమైరా పాఠశాల నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచే అమైరా తల్లిదండ్రులు.. తమ కుమార్తె వేధింపులకు గురైందని, పాఠశాల నుంచి తగిన స్పందన లభించలేదని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.సీసీటీవీలో కనిపించిన ఆ క్షణాలుతాజాగా బయటకు వచ్చిన వీడియోలో అమైరా మొదట సాధారణంగానే తరగతి గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సహ విద్యార్థులతో మాట్లాడుతున్న చిన్నారి.. కొంతసేపటి తర్వాత అసౌకర్యంగా, ఆందోళనగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆమెకు ఓ డిజిటల్ స్లేట్ చూపించిన తర్వాత అమైరా ప్రవర్తనలో మార్పు కనిపించిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆమె క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి తన సమస్యను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.చేతులు జోడించడం, ఆందోళనగా కనిపించడం, ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయని, అవి ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని తెలియజేస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.On Nov 1, 2025, Amaira, a Class 4 student, died by suicide after jumping from the fourth floor of the Neerja Modi School in Jaipur.She had been bullied for 18 months, with classmates targeting her using "bad words," many of which carried sexual undertones. However, her class… pic.twitter.com/iiS4J6UFwm— THE SKIN DOCTOR (@theskindoctor13) July 9, 2026సహాయం కోరింది.. స్పందన రాలేదా?అమైరా తల్లి శివానీ మీనా మాట్లాడుతూ.. తమ కుమార్తె పలుమార్లు సహాయం కోసం ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. “ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు. తరగతి గది నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లేంతవరకు ఎవరూ గమనించకపోవడం ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆరోపిస్తోంది.మరీ ఇంత నిర్లక్ష్యమా?ఈ ఘటనపై నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు సమాచారం. సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా కమిటీ ఏర్పాటు, పై అంతస్తుల్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమైరా చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ.. వాటిపై తగిన స్పందన లేదన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.కన్నీటి ప్రశ్నతాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో అమైరా కేసులో న్యాయం కోసం కుటుంబం చేస్తున్న పోరాటం మరింత బలపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమైరా ఘటన మరోసారి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, బుల్లీయింగ్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమైరా ఎదుర్కొన్న బాధను సకాలంలో ఎవరైనా గుర్తించి ఉంటే.. ఈ విషాదం జరిగేదా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
క్యాన్సర్తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు
కోడళ్లను వేధించే అత్తమామల గురించి విన్నాం. కానీ కోడల్ని కన్న కూతురి కంటే మిన్నగా భావించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్తామామల గురించి తెలుసా? క్యాన్సర్ మహమ్మారి కొడుకును బలితీసుకుంటే, వారు కోడలికి అండగా నిలిచారు. అంతేకాదు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.కొన్ని సంబంధాలు కేవలం రక్త సంబంధాలు కాదు. అవి ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించినవ అని ఈ ఘటన నిరూపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. మరో ఇంటికి కోడలిగా తమ కోడలిని అత్తారింటికి సాగనంపిన క్షణాన, అక్కడున్నవారంతా ఆనంద భాష్పాలు రాల్చారు.మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్కు, ప్రియాంకతో 2018లో వివాహం జరిగింది. ప్రియాంక తన ఉన్నత చదువులను పూర్తి చేసి ఆ తరువాత 2023లో అత్తగారింట్లో అడుగుపెట్టింది. వచ్చిన కొద్ది రోజులకే ఆమె తన ప్రేమపూర్వక ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనసు గెలుచుకుంది. అంతా హ్యాపీగాగడిచిపోతుందనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తూ, ఆమె వచ్చిన కొన్ని నెలలకే భర్త కపిల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. కానీ ప్రియాంక భయపడిపోలేదు. ఆ కష్టకాలంలో క తన భర్తకు కొండంత అండగా నిలిచింది. కానీ, 2024లో కపిల్ క్యాన్సర్తో పోరాడుతూ మరణించాడు. ఆ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) కోడలు కాదు.. కూతురు మామగారి గొప్ప నిర్ణయంచిన్న వయసులోనే భర్తను కోల్పోయి సమాజంలో కష్టాల పాలౌతున్న వారిలా తమ ప్రియాంక జీవితం ముగిసిపోకూడదని ఆమె మామ దినేష్ బైరాగి భావించారు. కొడుకు చనిపోయినంత మాత్రాన కోడలి పట్ల తమ బాధ్యత తీరిపోలేదంటూ భార్యను కూడా ఒప్పించారు. ప్రియాంకకు మారు మనువు చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి వద్ద ప్రస్తావించగా, ఆ కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా భర్త చనిపోతే అత్తగారింటితో బంధాలు తెగిపోయే ఈ రోజుల్లో, కోడలి భవిష్యత్తు కోసం అత్తమామలే ఇంతటి నిర్ణయం తీసుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక కోడలు కాదు, తమ కూతురు అని దినేష్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్తండ్రిగా కన్యాదానందినేష్ బైరాగి విదిషా జిల్లాలోని అరారి ఖేజ్దా గ్రామానికి చెందిన గోవింద్ బైరాగీతో వివాహం నిశ్చయించారు. వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్యక్తిని ప్రియాంక కోసం సంబంధం చూశారు. ఈ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ మరియు ఖర్చులన్నీ దినేష్ స్వయంగా భరించారు. పెళ్లి వేడుకలో అత్యంత భావోద్వేగ క్షణం ఏంటంటే, స్వయంగా మామగారే తండ్రి స్థానంలో కూర్చుని ప్రియాంకకు 'కన్యాదానం' చేశారు. పెళ్లికొడుకు చేతిలో ప్రియాంక చేయి పెట్టి, ఆమె కొత్త జీవితం సంతోషంగా సాగాలని ఆశీర్వదించారు.తండ్రి భావోద్వేగంఈ సందర్భంగా ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డ పునర్వివాహ బాధ్యతను ఆమె అత్తమామలు పూర్తిగా తీసుకుని సమాజానికి ఇంత గొప్ప ఆదర్శాన్ని అందిస్తారని తాను కలలో కూడా ఊహించలేదంటే కంటతడిపెట్టుకున్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు!
తాను చేస్తున్న వెదవ పనిని ఎవరూ చూడడం లేదనుకుని రెచ్చిపోయాడో బ్యూటీ పార్లర్ యజమాని. అతడి కుటిల పన్నాగాన్ని సీక్రెట్ కెమెరా బట్టబయలు చేసింది. దీంతో మనోడు కట్టుకథతో కవర్ చేసేందుకు ప్రయత్నించగా చెప్పు దెబ్బలతో బుద్ధిచెప్పారు బాధిత మహిళలు. 6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు కొట్టి చాకిరేవు పెట్టేశారు. అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్లోని చూరూ జిల్లాలోని సాదుల్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీ పార్లర్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?బ్యూటీ పార్లర్లోని తాగేనీటిలో యజమాని భవానీ శంకర్ ఖత్రి ఏదో కలుపుతున్నట్టు రహస్య కెమెరా ద్వారా గుర్తించిన నలుగురు మహిళా ఉద్యోగులు అతడిని చెప్పులతో ఎడాపెడా వాయించేశారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. జూన్ 29న ఈ ఘటన చోటు చేసుకుంది. దురుద్దేశంతోనే తాగునీటిలో మత్తు పదార్థం కలిపేందుకు అతడు ప్రయత్నించాడని వారు ఆరోపించారు. ఈ మేరకు రాజ్గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తాగునీటిలో భవానీ శంకర్ ఏదో కలుపుతున్నాడనే అనుమానం జూన్ 27నే తాము కనిపెట్టామని, అతడిని ఆధారాలతో పట్టించాలనే రహస్య కెమెరా పెట్టామని బాధిత యువతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అతడి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని వెల్లడించారు. గతంలో బ్యూటీపార్లర్ జమాఖర్చులు చూసుకోవడానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడని, కొన్ని రోజుల నుంచి తరచుగా రావడం చేస్తున్నాడని తెలిపారు. తాగే నీటిలో మత్తు మందు కలుపుతున్నాడనే అనుమానం రావడంతో ఫోన్లో రహస్యంగా వీడియో తీయడంతో దొరికిపోయాడని వివరించారు.పోలీసులు ఏమన్నారు?భవానీ శంకర్ అనుమానాస్పద వ్యవహారంపై యువతుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ సిహాగ్ మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. భవానీ శంకర్ నిజంగా మత్తు మందు కలిపాడా, లేదా అనేది విచారణలో తేలుతుందని చెప్పారు.చదవండి: రైలు బోగీనే హనిమూన్ సూట్!'మత్తు మందు కాదు ఆవాలు'తనపై నలుగురు యువతలు చేసిన ఆరోపణలను భవానీ శంకర్ ఖత్రి తోసిపుచ్చాడు. కొంతకాలంగా తన పార్లర్ వ్యాపారం సరిగా నడవడం లేదని, అందుకే పసుపు కలిపిన ఆవాలు పార్లర్లో ఉంచానని చెప్పుకొచ్చాడు. అలాగే తాగే నీటిలో తాను కలిపింది గంగాజలం అని, అందరూ అనుకుంటున్నట్టుగా మత్తు పదార్థం కాదని చెప్పాడు. అతడు చెప్పింది వాస్తమో, కాదో పోలీసులే తేల్చాలి. తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగిక దాడిరాజస్థాన్లోని చురు జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ యజమాని భవానీ శంకర్ తాము తాగే నీటిలో మత్తుమందు కలిపి, తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే నిజాన్ని నలుగురు మహిళా ఉద్యోగులు కనిపెట్టారు. రహస్య కెమెరా ద్వారా అతడు నీళ్లలో మత్తు బిళ్ళలు… pic.twitter.com/liglkzNEp3— greatandhra (@greatandhranews) July 9, 2026 -
తత్కాల్ టికెట్ ఉన్నా.. రాత్రంతా జాగారమే!
అత్యవసర ప్రయాణాల్లో భాగంగా టికెట్ కంటే అధిక డబ్బులు చెల్లించే ప్రయాణికుడికి.. కనీస సౌకర్యాలు కూడా దక్కకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి?. ఇలాంటి పరిస్థితి ఎదురైన ప్రయాణికుడు న్యాయం కోసం వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించాడు. తత్కాల్ టికెట్ ఉన్నా.. రాత్రంతా అతనికి నిద్ర లేకుండా చేసిన నేరానికిగానూ.. ఇండియన్ రైల్వేస్కు రూ.50 వేల జరిమానా విధించాల్సి వచ్చింది. తత్కాల్ టికెట్ తీసుకున్న ఓ ప్రయాణికుడు.. తన ప్రయాణం సౌకర్యంగా సాగుతుందని భావించాడు. అయితే.. ఆ ప్రయాణంలో అతనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు భారీ సంఖ్యలో అదే కోచ్లోకి రావడంతో కోచ్ కిక్కిరిసిపోయింది. కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడటమే కాకుండా.. రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. ప్రయాణం మొత్తం తీవ్ర అసౌకర్యంగా మారడంతో.. వినియోగదారుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఘటనపై విచారణ జరిపిన తిరువనంతపురం జిల్లా(కేరళ) వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతను అనుభవించిన మానసిక, శారీరక వేదనకు గానూ రూ.50 వేల పరిహారం చెల్లించాలని భారతీయ రైల్వేస్ను ఆదేశించింది. రిజర్వ్డ్ కోచ్లలో అనధికార ప్రయాణికులను నియంత్రించడం రైల్వేల బాధ్యత అని.. అది సరిగా జరగలేదు కాబట్టే అతను తనకు కేటాయించిన రిజర్వేషన్ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాడని స్పష్టం చేసింది. అంతేకాదు.. అదనంగా న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని సూచించింది.రిజర్వేషన్ ఉన్నవారికి హక్కు ఉందని స్పష్టంరైలు ప్రయాణాల్లో రిజర్వ్డ్ కోచ్లలో అనధికార ప్రయాణికుల సమస్య తరచూ తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి అందాల్సిన సేవలను నిర్లక్ష్యం చేయలేమని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది. -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ జల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్టాపిక్గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
ఇథనాల్ పెట్రోల్.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కొంతకాలంగా.. కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పెట్రోల్తో గడ్కరీ కుటుంబం విపరీతంగా లాభపడుతోందని.. ఆ ఉద్దేశంతో ఆయన ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అయితే ఇథనాల్ విధానాన్ని తానే రూపొందించి.. వ్యక్తిగతంగా లాభపడుతున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతేకాదు ఈ20 పెట్రోల్తో వాహనాలు దెబ్బతింటున్నాయనే ఘటనకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాజాగా ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. దాని వెనుక నేను మాత్రమే ఉన్నానన్నది ఆరోపణలే. శాస్త్రీయ పరిశోధనలు, పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీల్లో తన కుటుంబానికి(కుమారులకు) సంబంధాలున్నాయనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. తమ కుటుంబం చెరుకు పరిశ్రమలో చాలాకాలం కిందటే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా చాలా కొద్దిమాత్రమేనని చెప్పారు. "నా వాటా 0.07 శాతం మాత్రమే. అంత చిన్న వాటాతో దేశ ఇథనాల్ విధానాన్ని నా ప్రయోజనం కోసం ప్రభావితం చేయడం అసాధ్యం. ఈ విధానం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదు. పైసా రాదు" అని గడ్కరీ స్పష్టం చేశారు.ఆధారాలు చూపండి.. ఈ20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలపై కూడా గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "ఈ20 వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా డీలర్కు, మా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయండి. మేం విచారణ చేసి న్యాయం చేస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి వాహనాలైనా ఈ20 కారణంగా దెబ్బతిన్నాయని చెప్పగలరా?" అంటూ ప్రశ్నించారు.ప్రముఖ కంపెనీల నుంచి ఫిర్యాదుల్లేవుదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటర్స్, మహీంద్రా&మహీంద్రా నుంచి ఈ20 ఇంధనం కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయని ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల టయోటా కారుకు సంబంధించిన ఓ ఘటనలో కూడా ఇథనాల్ కారణం కాదని.. ఇంధనంలో నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందని చెప్పారు.నాలుగేళ్ల పరీక్షల తర్వాతే అనుమతిఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని హడావుడిగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదని గడ్కరీ వివరించారు. వాహనాలను నాలుగేళ్లపాటు పరీక్షించి, లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాతే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇది ప్రయోగాత్మక విధానం కాదని, శాస్త్రీయంగా నిర్ధారించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.రైతులకు లాభం.. దిగుమతులు తగ్గుతాయితాను ఇథనాల్ను మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఇంధనాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. దేశ ఇంధన భద్రతకు కూడా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.నాపై దుష్ప్రచారం చేస్తోంది.. ఇథనాల్ విధానంపై వస్తున్న వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని గడ్కరీ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఇథనాల్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.ప్రపంచమంతా ఇదే దారిఇథనాల్ వినియోగంలో భారత్ కొత్త ప్రయోగం చేయడం లేదని గడ్కరీ గుర్తు చేశారు. అమెరికా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, థాయ్లాండ్, స్వీడన్ ఇలా.. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారని చెప్పారు.అసలు ఈ20 వివాదం ఏంటి?ఈ20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యాలు. అయితే పాత మోడల్ వాహనాల్లో దీర్ఘకాలంలో ఇంజిన్, మైలేజ్పై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోంది. -
విజయ్ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నైలోని ప్రభుత్వ చిన్నారుల ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ‘నిర్లక్ష్యం’పై వేటు వేయాలని ఆదేశించిన ఆయన.. చిన్నారులతో సరదాగా గడిపారు.ఇటీవల ఆస్పత్రిలో సౌకర్యాల లోపాలు, సిబ్బంది వ్యవహారశైలిపై ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సీఎంవో నుంచి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఆస్పత్రికి చేరుకున్న విజయ్.. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. చికిత్సా విధానం, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఆస్పత్రిలోని వార్డులు, ఇతర సదుపాయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సీఎం ఆకస్మిక రాకతో ఆస్పత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించిన విజయ్.. లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా సంబంధిత అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆయన ఆదేశించారు.విజయ్ అన్నా.. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆస్పత్రి పరిస్థితులపై సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. సీఎం విజయ్ను అన్నా.. అని సంబోధిస్తూ.. తాను పేద కుటుంబానికి చెందిన మహిళనని పేర్కొంటూ.. ఆస్పత్రి సిబ్బంది లంచాలు అడుగుతున్నారని, రోగులకు ఆహారం సకాలంలో అందడం లేదని, కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆరోపించింది. అయితే.. విజయ్ ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ (Ma Subramanian) మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మరిన్ని మరుగుదొడ్లు, అదనపు వార్డులు, క్యాంటీన్ అవసరం ఉందని రోగులు, సందర్శకుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.The Humbleness he has 🤌🤌#Vijay #TVKVijay pic.twitter.com/h9F8R3fbrv— Think_Big (@okate_brathuku) July 8, 2026సీఎం రాకతో ఆస్పత్రి వద్ద సందడివిజయ్ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లు పెంచాల్సి వచ్చింది. కొంతసేపు ఆస్పత్రి పరిసరాల్లో సందడి నెలకొంది.స్వయంగా స్పందించింది అందుకేనా?సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. యువతతో పాటు మహిళలు, చిన్నారుల్లో ఆయనకు మంచి ఆదరణ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వర్గాల మద్దతే ఆయన పార్టీ తమిళగ వెట్రి కగళం ఎన్నికల ప్రస్థానంలో కీలకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని విజయ్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ తనిఖీని చూస్తున్నారు.ఇటు విజయ్ ఆకస్మిక తనిఖీతో పాటు ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారితీసింది. సీఎం ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్లక్ష్యం, లోపాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తప్పవన్న భావన అధికార వర్గాల్లో నెలకొంది. -
హాట్ టాపిక్గా బిగ్బీ అమితాబ్ రూ. 15 కోట్ల ల్యాండ్ డీల్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిర్లో విరాళాల గోల్మాల్ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో స్థలం కొనుగోలుకు సంబంధించిన అంశం ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. 'హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమిట్ 2026'లో రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్త అభినందన్ లోధాఅమితాబ్ ల్యాండ్ డీల్ గురించిన విశేషాలను పంచుకున్నారు.2023లో తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ నుండి కొన్ని మిస్డ్కాల్స్, ఒక మెసేజ్ వచ్చిందని లోధా గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అభినందన్ లోధాకు అమితాబ్ స్వయంగా ఫోన్ చేశారట. స్థలం ధర తెలుసుకున్న మరుసటి రోజే రూ. 15 కోట్లు డీల్ ఒకే చేయడంతోపాటు, సంబంధిత సొమ్మను బదిలీ చేశారని లోధా వెల్లడించారు."కొన్ని మిస్డ్కాల్స్ తర్వాత, 'నేను అమితాబ్ బచ్చన్ను, మీకు వీలైనప్పుడు తిరిగి కాల్ చేయండి' అని ఒక మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఆయనకు తిరిగి కాల్ చేసానని లోధా చెప్పారు. ఈ సందర్బంగా తమ సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘‘అభినందన్ జీ, నేను ఉత్తరప్రదేశ్ వాసిని, నాకు పవిత్ర అయోధ్య నగరంలో స్థలం కావాలి" అని బచ్చన్ తనతో చెప్పినట్లు లోధా పేర్కొన్నారు. అమితాబ్ మొదట స్థలం ధర ఎంత అని అడిగి, తనకు 15,000 చదరపు అడుగుల స్థలం కావాలని అడిగారని లోధా చెప్పారు. కి సుమారు రూ. 15 కోట్లు కావచ్చని తాను చెప్పగా, మరుసటి రోజే ఆయన రూ. 15 కోట్లు పంపించారన్నారు.బాలీవుడ్లో బిగ్బీ పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ గత కొన్నేళ్లుగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అమితాబ్ ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టారు. ఒక్క లోధా ప్రాజెక్ట్ల్లో మూడు చోట్ల, మొత్తంగా అయోధ్యలో నాలుగు చోట్ల పెట్టుబడులు పెట్టారు.మార్చి 2026 పెట్టుబడి: 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' సంస్థ నుండి అమితాబ్ బచ్చన్ రూ. 35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలో ఆయనకు ఇది మూడవ పెట్టుబడి కాగా, HoABL సంస్థతో నాలుగవ ప్లాట్ కొనుగోలు. ఈ స్థలం కంపెనీకి చెందిన 75 ఎకరాల భారీ ప్రాజెక్ట్ 'ది సరయు' (The Sarayu) సమీపంలో ఉంది.2025,మే : 'ది సరయు' ప్రాజెక్ట్కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్ను అమితాబ్ బచ్చన్ దాదాపు రూ. 40 కోట్లకు కొనుగోలు చేశారు.2024లో : అంతకుముందు 2024లో, HoABL కి చెందిన ఫ్లాగ్షిప్ మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 'ది సరయు'లో 10,000 చదరపు అడుగుల ప్లాట్ను రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఈ పెట్టుబడులపై అభినందన్ లోధా స్పందిస్తూ.. భూమి తరతరాల ఆస్తి, అది దీర్ఘకాలంలో విలువను మరింత పెంచుతుందనే నమ్మకానికి బచ్చన్ పెట్టుబడులే నిదర్శనమని పేర్కొన్నారు. అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడుల మద్దతు కారణంగా, ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అద్భుత మైన గమ్యస్థానంగా మారుతోందన్నారు.ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్ -
ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..
మధ్యతరగతి కుటుంబంలో పిల్లల చదువులు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంటుంది. అయితే వాళ్లు చేసిన త్యాగాలకు అనుగుణంగా ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఉండదు. అలాంటి కథే నెట్టింట వైరల్గా మారింది. మైక్రోసాప్ట్ ఉద్యోగి లిక్డ్ఇన్లో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో ఆయన తన కాలేజీ ఫీజు చెల్లించడం కోసం తన తల్లి బంగారు గాజులు అమ్మిన భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు. తాను బీసీఏ చదువుతున్నప్పుడూ తన సెమిస్టర్ ఫీజుల కట్టడం కోసం పేరెంట్స్ ఎంతగా ఇబ్బందిపడ్డారో గుర్తుచేసుకున్నారు. ఆ ఫీజు కోసం ఒకరోజు అమ్మ బంగారు గాజులు తీసి ఇచ్చిన ఘటన ఇప్పటికీ మర్చిపోనన్నారు. ఆ రోజు అమ్మ ఏ మాత్రం బాధపడకుండా అమ్మడానికి ఆభరణాలు ఇచ్చింది. ఆ రోజు అమ్మ చేసిన త్యాగం కారణంగా తాను మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సంపాదించగలిగానని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేసి ఐటీ రంగంలో పనిచేస్తూ..వార్షిక ఆదాయం రూ .1.9 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నాని చెప్పారు. ఆ రోజు అమ్మ అలా బంగారపు గాజులు తీసిస్తున్నప్పుడు ఆమె బాధపడలేదు గానీ తనకు మాత్రం ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన పొజిషన్ మంచి స్థాయిలో ఉన్నాక..అమ్మ నీకు కావల్సిన బంగారం కొనుక్కోమని చెప్పగా..అరే బేటా నువ్వు వచ్చాక నాకు అన్ని తిరిగి దక్కాయి. అప్పులనే ఆర్థికపరమైనవి మాత్రమే అని తేలిగ్గా కొట్టిపారేసిందన్నారు. తన కథలా చదువు కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ఈ పోస్ట్ అంకితం అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసును తాకింది. ఎన్నో కార్పొరేట్ ఉద్యోగుల విజయగాధ వెనుక తలిదండ్రుల నిశబ్ద త్యాగం ఉంటుందంటూ పోస్టులు పెట్టారు.కాగా అతడి లిక్డ్ఇన్ ప్రొఫెల్ ప్రకారం..అగర్వాల్ 2016లో హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్లో సమ్మర్ ఇంటర్న్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2017లో మైక్రోసాఫ్ట్లో పూర్తిస్థాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా చేరడానికి ముందు, ఆయన బెంగళూరులోని GE హెల్త్కేర్లో కూడా ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ రెడ్మండ్ (వాషింగ్టన్) కార్యాలయానికి మారారు, అక్కడ 2020 వరకు పనిచేశారు. బెంగళూరులోని గూగుల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన తర్వాత, 2025లో బెంగళూరులోని మైక్రోసాఫ్ట్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తిరిగి చేరారు. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!) -
లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్ కోసం..
లగ్జరీ కారులు నడిపే వాళ్లు ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. అంత సులభంగా ఓ సాదాసీదా వ్యక్తులతో మాటలు కలపడం అత్యంత అరుదు. అలాంటిది సరదాగా వాళ్ల వస్తువులను ఒక్కసారి ట్రై చేస్తాం అని అడగడం అంత సులభం కానే కాదు. ఒక వేళ అడిగినా.. ఇస్తారని గ్యారంటీ లేదు. కానీ ఈ లంబోర్ఘిని యజమాని తన గొప్ప మనసును చాటుకుని..నెట్టింట నెటిజన్లను ఫిదా చేశాడు. అసలేం జరిగిందంటే..రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో అతను లంబోర్ఘినిని నడుపుతుండగా రోడ్డుపై ఒక ఆటోరిక్షాను గమనిస్తాడు. సాధారణంగా మొదలైన పరిచయం తర్వాత..ఆ డ్రైవర్ నెమ్మదిగా తన మనసులోని మాటను బయటపెడతాడు. వెంటనే యజమాని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సమ్మతి తెలపడమే కాకుండా ఇరువురు వాళ్ల వాహనాల తాళాలను మార్చుకుంటారు. ఆ డ్రైవర్ చక్కగా లంబోర్ఘిని నడుపుతూ తన కోరికని తీర్చుకుంటాడు. ఇక సదరు యజమాని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ ఆటో రిక్షాను డ్రైవ్ చేస్తాడు కూడా. అక్కడితో వీడియో ముగుస్తుంది. ఇక కుమార్ ఈ వీడియోని షేర్ చేస్తూ..ఈ మరపురాని క్షణం కోసం నేను నా లంబోర్ఘినిని పణంగా పెట్టాను! నిజం చెప్పాలంటే, అతని ఆటో నడపడం నన్ను బాగా కదిలించింది. ఆటో మీటర్ డబ్బులు కట్టడమే ఒక సవాలుగా ఉన్న నా కష్టాల రోజుల్లోకి ఇది నన్ను తీసుకువెళ్ళింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. ఈ క్లిప్పై విశేషమైన స్పందన వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ ముఖం నవ్వుతో వికసించగా, ..ఈ యజమాని గొప్ప మనసు దయకు మాటల్లేవ్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by RAKESH KUMAR (@rakesh_knv) (చదవండి: Aamir Khan And Gauri Spratt : అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే..) -
నాన్నకు ప్రేమతో..! వైరల్గా కూమార్తె పోస్ట్..
అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్ ఇది. ఆమె పోస్ట్లో నాన్న త్యాగాలు గురించి రాసిన విధం చూడగానే ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలోనిఏ కష్టమేదురోచ్చినాకన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం అనే పాట గుర్తుకొస్తుంది. అంత భావోద్వేగంగా నాన్న గురించి రాసుకొచ్చిందామె పోస్ట్లో.ఇన్స్టాగ్రామ్ 'Growing with Artha' అనే ఖాతాలో షేర్ చేసిన వీడియలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ వీడియో వేలాదిమంది మనసులను తాకింది. ఆ కూతురు పోస్ట్లో తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చింది. " మా నాన్న 35 ఏళ్లకు పైగా ఆటో రిక్షాని నడుపుతున్నారు. అందువల్లే తనకు తనకు మంచి విద్య, స్వతంత్ర, మంచి కెరీర్ లభించాయని అంటోంది. నర్సరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు నా చదువు ఆయన కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. మా చుట్టుపక్కల చాలా మంది తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకుంటున్న సమయంలో, మా నాన్న మాత్రం మా చదువుపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి విద్య కాదు, స్వతంత్రత. నాకు ఒక ఒక సోదరి కూడా ఉంది. ఆడపిల్లలమని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒంటిరిగా ప్రయాణించడం నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవడం వంటి విషయాల వరకు ప్రతిదాంట్లో మాపై నమ్మకం ఉంచారు. తాను తన సోదరి ఇద్దరం కెరీర్లో బాగా రాణించాం. కోవిడ్ మహమ్మారి సమయంలో, తమ తల్లిదండ్రులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక వ్యవసాయ క్షేత్రాన్ని (ఫామ్) ప్రారంభించాం అప్పటి నుంచి, ఆయన దాని బాగోగులు స్వయంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు పెళ్లై తల్లిగా మారాక ఉద్యోగం కొనసాగించాలా వద్ద అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా నాకు అండగా నిలిచారు. పైగా నా కెరీర్ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. బిడ్డ పెంపకంలో మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం మానేయకు' అని చెప్పారు. అంతేకాకుండా, నాతో ఉండటానికి మా అమ్మను పంపించారు. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు నా కూతురిని చూసుకోవడానికి మా అమ్మ ప్రతి వారం బెంగళూరుకు వస్తుంటారు. ఆమె తల్లి బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తుండగా, ఆమె తండ్రి ఇంట్లో అన్ని పనులూ ఒంటరిగా చూసుకుంటారని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణాన్ని నడుపుతారు, పొలాన్ని చూసుకుంటారు, వంట చేస్తారు, దాంతోపాటు పగటిపూట తన ఆటో నడుపుతూ సాయంత్రం తిరిగి వచ్చి దుకాణాన్ని తెరుస్తారు. దీన్ని బట్టి నాకో విషయం అర్థమైది. తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఒక బిడ్డను స్వతంత్రంగా పెంచి తర్వాత వారికి అండగా నిలబడటమే. నాకు మాత్రం ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు అందుకు మా నాన్న సదా ధన్యావాదాలు. అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్ల సైతం ఆమె పోస్ట్ మద్దతిస్తూ..నిజమైన హీరో నాన్నే అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Growing with Artha (@arthasfirstbites) (చదవండి: యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!) -
చీమలు పడతాయా? ఇంజిన్లు పాడైపోతున్నాయా?
కొత్త వాహనం కొంటే ఈ20 పెట్రోల్ పోయొచ్చా? కొత్తగా వచ్చిన ఈ పెట్రోల్ అసలు పాత బండ్లకు పనికొస్తుందా?. ఇథనాల్తో ఇంజిన్ పాడు కాదా? మైలేజ్ తగ్గిపోదా? చెరకు నుంచి తయారయ్యే ఇథనాల్ కోసం నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారా? తీపి గుణం వల్ల బండికి చీమలు పడుతున్నాయా? దీని తయారీలో పర్యావరణ కాలుష్యం జరుగుతుందా?.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ క్లెయిమ్స్తో ఈ ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్రం ఈ20ను "ప్రయోగం"గా అభివర్ణించిందంటూ వచ్చిన వార్తలు మరింత గందరగోళానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది.ఈ20 ఎలాంటి ప్రయోగం కాదని.. శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో విస్తృత సంప్రదింపులు, నిపుణుల సిఫార్సుల తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపింది. 2023 నుంచి తయారవుతున్న చాలా కొత్త వాహనాలు ఈ20 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించబడినవేనని పేర్కొంది.సోషల్ మీడియాలో ప్రచారం.. కేంద్రం వివరణ👉"ఈ20 వల్ల ఇంజిన్ పాడవుతుంది" అనేదే. దీనిపై కేంద్రం స్పష్టంగా స్పందించింది. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ దెబ్బతింటుందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పటికే లక్షలాది వాహనాలు ఈ20ను ఉపయోగిస్తున్నప్పటికీ, పెద్దఎత్తున ఇంజిన్ సమస్యలు నమోదైన దాఖలాలు లేవని వివరించింది.👉ఇథనాల్ ఎక్కువగా నీటిని పీల్చుకుంటుందన్న ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇంధన ట్యాంకులోకి నీరు చేరడం ఏ రకమైన పెట్రోల్కైనా సమస్యేనని, అది ఈ20కు మాత్రమే సంబంధించిన అంశం కాదని వివరించింది. ఆధునిక వాహనాల్లో ఇందుకు తగిన సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది.👉మరోవైపు చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్లో కలుపుతున్నారు. ఇథనాల్ వల్ల బండికి చీమలు వస్తున్నాయి అంటూ సో.మీ.లో జరుగుతున్న ప్రచారాలను కూడా కేంద్రం అవాస్తవాలుగా కొట్టిపారేసింది. ఇంధనంగా వినియోగించే ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి ముడి పదార్థాల నుంచి పలు పారిశ్రామిక ప్రక్రియల ద్వారా తయారవుతుందని వివరించింది. అందులో చక్కెర ఉండదని, కాబట్టి చీమలు వస్తాయన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది.👉ఈ20 వాడితే వాహన బీమా చెల్లదన్న ప్రచారాన్నీ కేంద్రం ఖండించింది. బీమా సంస్థల నిబంధనల్లో అలాంటి షరతులేమీ లేవని తెలిపింది. అలాగే ఈ20 ఇంధనం భారత్కు కొత్తైనా... ప్రపంచానికి కొత్త కాదని గుర్తు చేసింది. బ్రెజిల్లో ఈ27, అమెరికాలో ఈ15, ఈ85 వంటి ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు చాలాకాలంగా వినియోగంలో ఉన్నాయని వివరించింది.ఇలా.. ఈ20పై వైరల్ అవుతున్న ప్రతి అపోహకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పింది. వాస్తవానికి ఈ వివాదానికి కారణం సుప్రీంకోర్టులో జరిగిన ఓ విచారణ. ఇథనాల్ కేటాయింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ20 కార్యక్రమం ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కోర్టుకు చెప్పిందంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో "ప్రజలపై ప్రయోగం చేస్తున్నారా?" అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ వార్తలను అటార్నీ జనరల్ కార్యాలయం వెంటనే ఖండించింది. కోర్టులో ప్రభుత్వం అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని, న్యాయవాదనలను తప్పుగా అర్థం చేసుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని స్పష్టం చేసింది. ఇటు.. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరణ విడుదల చేసింది.ఈ20 కార్యక్రమం వల్ల దేశానికి కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రభుత్వం వివరించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో ఇప్పటివరకు రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని తెలిపింది. రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని, కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయని పేర్కొంది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఈ20 కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించింది.సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వచ్చిన గందరగోళం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అపోహలు... ఈ రెండింటి నేపథ్యంలో కేంద్రం స్వయంగా వివరణ ఇవ్వడం ఇప్పుడు ఈ20పై నెలకొన్న అనేక సందేహాలకు తెరదించింది. అయినప్పటికీ పాత వాహనాల్లో ఈ20 వినియోగానికి సంబంధించి తయారీ సంస్థల సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
యూఎస్లో రూ. 85 వేల టాబ్లెట్, ఇండియాలో రూ.35లకే
భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్లోని వైద్య ధరల మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో తమని దోచుకుంటున్నారంటూ ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ వీడియో విశేషాలు'లిజ్' అనే అమెరికన్ మహిళ "ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్" అనే టైటిల్తో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా తక్కువని, అమెరికాలో ప్రజలను 'దోచుకుంటున్నారని' ఆరోపించింది. ఇందుకు 'రెవ్లిమిడ్' (Revlimid) అనే టాబ్లెట్ ధరను ఆమె ఉదాహరణగా చూపింది.తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే టాబ్లెట్ ధర అమెరికాay 900 డాలర్లు (సుమారు రూ. 85,000) ఉండగా, భారతదేశంలో దీని జెనరిక్ ప్రత్యామ్నాయం కేవలం 30 సెంట్ల నుండి 3 డాలర్ల (రూ. 35 నుండి రూ. 300) లోపే లభిస్తోందని వెల్లడించింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోని చౌకైన వైద్య విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని ఒక యూజర్ పేర్కొనగా, అమెరికన్లు భారత్కు వచ్చి మందులు కొనుగోలు చేసినా ప్రయాణ ఖర్చులు పోను డబ్బులు మిగులు తాయని మరొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori)గత నెలలో 'విక్టోరియా' అనే మరో అమెరికన్ మహిళ కూడా యూఎస్ హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించింది. అమెరికాలో ఆమెకు అత్యవసరమైన మందును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవడంతో, అక్కడ వెయ్య డాలర్లు పలికే ఆ మందును, ఇండియాలోని తయారీదారు నుండి నేరుగా కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ఇంత భారీ మొత్తంలో అదనపు డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్! -
నా దుస్తులు విప్పేస్తా… నీ గతి అదోగతే!
కొన్నిరోజులుగా ఇంట్లో వరుసగా డబ్బు, నగలు మాయం అవుతుండటంతో యజమానికి అనుమానం పెరిగింది. ఇంటా బయట సీసీటీవీలు ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కనిపించిన దృశ్యాలు ఆయనను షాక్కు గురి చేశాయి. వెంటనే అప్రమత్తమై దొంగను అడ్డుకోగా.. ఆమె చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.రాజస్థాన్లోని జైపూర్ ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కొద్దిరోజులుగా అనుమానాస్పద చోరీలు జరుగుతున్నాయి. మొదట్లో చిన్నగా డబ్బు మాయం కావడం ప్రారంభమై, తర్వాత నగలు కూడా కనిపించకపోవడంతో యజమాని అనుమానం బలపడింది. దీంతో ఆయన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.గురువారం కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్లో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అల్మారా తెరిచి నగల పెట్టెను పరిశీలిస్తున్న దృశ్యాలను చూసిన యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తక్షణమే అప్రమత్తమైన యజమాని పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటి గేటును లాక్ చేయించాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఇంట్లోనే అడ్డుకున్నారు.అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బయటపడే మార్గం లేకపోవడంతో ఆమె తీవ్రంగా బెదిరింపులకు దిగింది. పోలీసులు వస్తారా? రానివ్వు.. వాళ్లు వచ్చేలోపు నా దుస్తులు విప్పేస్తా!. నువ్వు నన్ను బలవంతం చేయబోయావని ఏడుస్తా.. వాళ్లు నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నీ గతి అదోగతే.. నన్ను బయటకు పోనివ్వండి’’ అంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ ఓనర్, స్థానికులు నిర్ఘాంతపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
భార్యపై ఇంత ప్రేమా..!
ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్ క్రియేటర్ ఆశిష్ మాథ్యు ఈ వీడియోని షేర్ చేశారు. ఆ కంటెంట్ క్రియేటర్ ఆటోడ్రైవర్తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్ క్రియేటర్ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్ జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్ చేశాశ్ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by asish matthew (@asishmatthew.exe) (చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్గా ఓ తల్లి గైడెన్స్..) -
కదిలొచ్చిన దేవతలు
రోడ్డంతా ట్రాఫిక్ జామ్. వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆ సమయంలో ఓ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నంలోనే ఆయన స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్నవారికి ఏం చేయాలో అర్థం కాక అయోమయం నెలకొంది. కారులో ఉన్నవాళ్ల కేకలు.. ఆర్తనాదాలు. ఏ దేవుళ్లను తల్చుకున్నారో.. ఏమో ఇద్దరు యువతులు హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చారు. ఆ వ్యక్తిని రక్షించారు.హృదయాన్ని కదిలించే ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థన్నిపుజ సమీపంలోని ఒక్కల్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల సినోజ్ కారులో కుటుంబంతో వెళ్తుండగా.. తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. అలా తానే నడిపించుకుంటూ కారులోనే ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే కలాడి వంతెన సమీపంలో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. నొప్పి మరింత పెరగడంతో కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అదే సమయంలో పక్కనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు ఆ పరిస్థితిని గమనించారు. వెంటనే బస్సు దిగి కారువద్దకు పరుగెత్తారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సినోజ్కు సీపీఆర్ ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. సినోజ్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న కారులోనే నిరంతరం సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆస్పత్రికి చేరేసరికి ఆయనలో మళ్లీ కదలిక వచ్చింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని పూర్తిగా బ్లాక్ కావడంతో.. వెంటనే అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి వైద్యులు రక్షించారు. సకాలంలో సీపీఆర్ చేసి సినోజ్ ప్రాణాలు కాపాడినందుకు వైద్యులు ఆ ఇద్దరినీ అభినందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల పేర్లు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్. అంజలి అంగమాలిలోని ఎల్ఎఫ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. ఆర్ధ్రరాజ్ ఏమో బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి. ఈ మొత్తం ఎపిసోడ్లో.. స్థానికుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. సినోజ్కు గుండెనొప్పి వచ్చిందని తెలుసుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ కారు స్టీరింగ్ చేపట్టి ఆస్పత్రి వైపు నడిపించాడు. మరికొందరు ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో సహకరించగా, ఇంకొందరు అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేశారు. అందరి సమిష్టి సహకారంతో విలువైన సమయం ఆదా కావడంతో ఒక ప్రాణం నిలిచింది. వైద్య వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అని అంజలి, ఆర్ద్ర మరోసారి నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన సమయంలో అందించిన సీపీఆర్ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలదో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది. -
ప్చ్.. మూడు నెలలైనా గడవకముందే!
న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్ప్రెస్వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.👋Hello @narendramodi Ji,This is the Delhi–Dehradun Expressway, inaugurated by you just a couple of months ago.It took around 5 years to build, yet it hasn't even seen its first monsoon. Look at the pathetic condition. People are forced to stand in the middle of the… pic.twitter.com/4GZF84Hgia— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 2, 2026వైరల్ వీడియోలో ఎక్స్ప్రెస్వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.This is the video..😰 pic.twitter.com/rbTwggZLbC— bindasspahadi (@bindasspahadi) July 2, 2026ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
లక్షల జీతం వదులుకుని వెయిటర్గా..! ఎందుకంటే..
కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏ రేంజ్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయో తెలిసిందే. చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ షాక్కి గురి చేసింది. ఆ కార్పొరేట్ ఉద్యోగం వదిలేశాక హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చేసిన పోస్ట్ అందరిలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తింది. వివరాల్లోకెళ్తే..33 ఏళ్ల మహిళ మంచి కార్పొరేట్ జీతాన్ని వదిలి వెయిటర్గా మారానంటూ పెట్టిన వీడియో నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఉద్యోగం తన ఆరోగ్యాన్ని ఎలా హరించేసిందో పంచుకుంది. అంతులేని వైద్య పరీక్షలతో ఆస్పత్రులు చుట్టూ ఎలా తిరింగిందో వెల్లడించింది. తన అనారోగ్యానికి మూలం ఆ ఆరు అంకెల జీతం ఆర్జించే ఉద్యోగమే అని అనిపించి తక్షణమే మానేసి వెయిటర్ మారానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ అంతకమునుపు ఆ కార్పొరేట్ ఉద్యోగం కారణంగా చివరి ఆరు నెలలు తీవ్రమైన ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే వ్యాధితో బాధపడ్డానని, దానికోసం ఆస్పత్రులు చుట్టూ ఎంతలా తిరిగిందో పేర్కొంది. చివరికి ఈ సమస్యకు ప్రధాన కారణం కార్పొరేట్ ఒత్తిడేనని అని తేలడంతో తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పింది. ఎప్పుడైతే ఉద్యగోం మానేసానో ఆ తదనంతరం తన అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. అంతేగాదు ఆరు అంకెల జీతాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో ఆ తదనంతరం ఐబీఎస్ సమస్య పూర్తిగా తగ్గిందని పేర్కొది. పైగా ఆ సమస్య మళ్లీ రాకూడదనే.. ఈ ఉద్యోగంలోనే కొనసాగుతానని అంటోంది. అంతేగాదు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని తెలసుకున్నా అంటూ నవ్వుతూ నేలను తుడుస్తూ వీడియోలో కనిపించడం చూడొచ్చు. అయితే నెటిజన్లు..ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా వెయిటర్గా బతకడం అంత సులభం కాదు. పైగా అక్కడున్న వారికి సర్వ్ చేస్తున్నప్పుడూ కూడా కస్టమర్ల నుంచి వచ్చే చీత్కారాలు, సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయని..అది కూడా ఏమంత ఆరోగ్యదాయకమైన ఉద్యోగం కాదంటూ పోస్టులు పెట్టారు. కానీ కొందరు మాత్రం నచ్చిన ఉద్యోగంలో కొనసాగితే..సంతోషం, ఆరోగ్యం రెండూ ఉంటాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Sarame Cornish (@girlswhodetach) (చదవండి: జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్) -
దుబాయ్లో మిడిల్ కాస్ల్ ఫ్యామిలీ నెల ఖర్చు ఇదీ : వైరల్ వీడియో
దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయ జంట తమ నెలవారీ ఖర్చులకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఇన్స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం సౌకర్యవంతంగా జీవించడానికి నెలకు దాదారు నెలకు సుమారుగా 13,000 నుండి 14,000 దిర్హామ్లు (రూ. 3.6 లక్షలు) ఖర్చు అవుతోందని పేర్కొనడం వైరల్గా మారింది.ఇటీవలి కాలంలో ఐటీ, ఇతర వృత్తి నిపుణులు తమ జీతాలు, నెలవారీ ఖర్చులు, పొదుపు గురించి వివరాలను పంచుకునే వీడియోలు, పోస్టులు చాలా కామన్గా మారిపోయాయి. ఇవి వైరల్ అవుతుంటాయి కూడా. అలా ఇన్స్టాగ్రామ్లో @vis_and_vadapav అనే ఐడీతో పోస్ట్లు చేసే ఒక భారతీయ జంట తమ బడ్జెట్ కేవలం రోజువారీ జీవనానికి మాత్రమేనని, ఇందులో ప్రయాణాలు, షాపింగ్ లేదా విహారయాత్రలు చేర్చలేదని చెప్పారు. "దుబాయ్లో నివసిస్తున్న ఒక జంటగా మాకు అయ్యే ఖర్చు ఇదిగో... దయచేసి గమనించండి’’ అంటూ పోస్ట్ చేశారు. నెలకు దాదాపు రూ.3.3 లక్షల నుండి రూ.3.6 లక్షలు ఖర్చవుతుందని లెక్కలతో సహా వివరించారు. ఇందులో షాపింగ్, విహారయాత్రలు (ట్రావెలింగ్) , పండగ సెలవుల ఖర్చులు చేర్చలేదని, ఇవి కేవలం రోజువారీ ఖర్చులని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Desis in Dubai | Priyanka (@visa_and_vadapav) ముఖ్యంగా ఇంటి రుణంకు లక్షన్నర; కరెంట్, నీరు, ఇతర బిల్లుల కోసం రూ. 39వేలు ఖర్చు చేస్తారు. ఇక ఫుడ్ కోసం మరో 39వేల రూపాయలు ఖర్చవుతాయి. వీటితోపాటు కారు, పెట్రోల్ ఖర్చులు, పనిమనిషి ఖర్చులు ఇలా మొత్తం నెలకు రూ. 3.3 లక్షలు- 3.6 లక్షలవుతాయి. దీంతో పాటు భార్య ఉద్యోగ నిమిత్తం వారంలో కొన్ని రోజులు దుబాయ్ నుండి అబుదాబికి ప్రయాణించాల్సి రావడంతో ఆమె ప్రయాణానికే నెలకు రూ. 50 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీదీంతో దుబాయ్లో లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్పై నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అంటే కొంతమంది కామెంట్ చేశారు. ఎందుకంటే దుబాయ్లో నెలకు 400-500 దిర్హామ్లకే బతికేయచ్చంటూ చాలామంది తప్పుడు సమాచారం ఇస్తుంటారని, కానీ ఈ జంట దుబాయ్ జీవితం గురించిన అసలు నిజాన్ని, వాస్తవిక చిత్రాన్ని చూపించారని ఒక యూజర్ కామెంట్ చేశారు."దిర్హామ్లలో ఏడుపు వస్తోంది" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేయగా, మెజారిటీ నెటిజన్లు ఈ ఖర్చులు చాలా ప్రాక్టికల్గా ఉన్నాయని అంగీకరించారు.ఇదీ చదవండి: యజమాని కోసం బ్లాక్ కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ -
యజమాని కోసం బ్లాక్ కోబ్రాతో పెంపుడు కుక్క పోరాటం, కానీ
పెట్ డాగ్స్ తమ యజమానిని, అతని కుటుంబాన్ని కాపాడేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటాయి.. ఈ పోరాటంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా హర్యానాలో తన యజమానిని కాపాడటం కోసం ఒక పెంపుడు కుక్క తాచు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది.హర్యానాలోని కర్నాల్ జిల్లా నిసింగ్ ప్రాంతంలో తన యజమానిని కాపాడేందుకు 'జిమ్మీ' అనే తొమ్మిదేళ్ల పెంపుడు కుక్క నల్లతాచుపాముతో వీరోచితంగా పోరాడింది. పాము పలుమార్లు కాటు వేసినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి, చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే? ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో యజమాని సుమిత్ ఠాకూర్ తన రెండు పెంపుడు కుక్కలైన 'జిమ్మీ', 'మాక్స్'లను వాకింగ్కు తీసుకెళ్తుండగా ఇంటి ప్రధాన ద్వారం (గేట్) వద్దకు ఒక పెద్ద నల్ల తాచుపాము దూసుకొచ్చింది. సుమిత్ స్పందించే లోపే రెండు కుక్కలు పాము వైపు దూసుకెళ్లాయి. జిమ్మీ మరో క్షణం ఆలోచించకుండా ముందుకు దూకింది. పడగ విప్పి బుసలుకొడుతున్న తాచుపాముపైకి లంఘించింది. ఈ భీకర పోరాటంలో పాము జిమ్మీ నోటిపై, ఒక కాలుపై తీవ్రంగా కాటు వేసింది. అయినా జిమ్మీ వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉంది. మరో కుక్క 'మాక్స్' ఆ పాము ఇంటి లోపలికి వెళ్లకుండా చుట్టూ తిరుగుతూ అడ్డుకుంది. 8 నిమిషాల్లోనే విషాదం పాము కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే జిమ్మీ శరీరంపై విషప్రభావం చూపడం ప్రారంభమైంది. సుమిత్ చూస్తుండగానే కేవలం 8 నిమిషాల్లో జిమ్మీ పరిస్థితి విషమించింది. సుమిత్ వెంటనే పశువైద్యుడిని పిలిపించినప్పటికీ, వైద్యం అందేలోపే జిమ్మీ కన్నుమూసింది. ఈ లోపల పాము ఒక గోడ వెనుకకు పోయింది. వెంటనే స్నేక్ రెస్క్యూవర్ను పిలిపించి ఆ తాచుపామును పట్టుకుని అడవిలో వదిలేశారు. A Hero With Four Paws❤️ 🐾HUMANS DO NOT DESERVE DOGS 🐕📍Karnal, Haryana9-year-old pet Jimmy took on a black cobra to save his family. Bitten repeatedly, his loyalty cost him his life.Rest easy, brave soul. 💔 pic.twitter.com/uPICiHIqRq— The Lie Lamaa 🏹 (@The_LieLamaa) July 1, 2026కన్నీటి వీడ్కోలు కుటుంబంలో ఒకడిగా పెరిగిన తన జిమ్మీ ఇక లేదని లేదని తెలిసి సుమిత్ ఠాకూర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తనను కాపాడటం కోసం జిమ్మీ తన ప్రాణాలొడ్డిందని భావోద్వేగానికి లోనయ్యారు. తొమ్మిదేళ్లుగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న జిమ్మీని ఎండాకాలం, చలికాలంలో ఎంతో అపురూపంగా చూసుకున్నామని గుర్తు చేసుకున్నారు. మరోవైపు జిమ్మీ చూపిన విశ్వాసం, ధైర్య సాహసాలను, త్యాగాన్ని స్థానికులతో పాటు నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం! -
'చెవిలో పువ్వులు పెడుతున్నారా?.. అదంతా ప్రజల సొమ్మే!'
వీధి కుక్కల నియంత్రణ అంశంలో పలు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తీవ్ర నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అది ఎలా ఉందో తెలియజేసే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి వచ్చిన అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడంపై ఆయన వాళ్లపై మండిపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంగళవారం బెంగళూరులో కర్ణాటక మంత్రి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ నేతృత్వంలో వీధికుక్కల నియంత్రణం అంశంపై సమీక్ష సమావేశం జరింది. దీనికి పశుసంవర్ధక శాఖకు చెందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్ల ఖర్చు, ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు, ప్రస్తుతం వీధికుక్కల సంఖ్య ఎంత వంటి ప్రాథమిక వివరాలు కూడా వారి వద్ద లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు."మీరు సమావేశానికి ఎందుకు వచ్చారు? కనీస డేటా కూడా లేకుండా ఎలా వచ్చారు? అదంతా ప్రజల డబ్బు కదా? ఎక్కడికి పోయింది? అలా ఎలా ఖర్చు పెట్టారు?" అంటూ కాస్త కఠినంగానే అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యయ వివరాలు వెంటనే ఇవ్వాలని, డేటా లేకుండా సమావేశానికి రావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ఈ క్రమంలో అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో మంత్రి మరింత అసహనం వ్యక్తం చేశారు. "నేను చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.. మీరు చెప్పిందల్లా వినడానికి" అంటూ కన్నడలోని ఒక సామెతను ఉపయోగిస్తూ.. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. వీధికుక్కల సంఖ్య యథాతథంగా ఉండటంపై ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.Bengaluru Development Minister @krishnabgowda on Tuesday pulled up Animal Husbandry Department officials during a review meeting over the stray dog sterilisation programme. Questioning how stray dog population had remained unchanged despite sterilisation being carried out for… https://t.co/a3bPBWvJcI pic.twitter.com/b3HQPZ5Ls9— ChristinMathewPhilip (@ChristinMP_) June 30, 2026ఈ సందర్భంగా సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సమావేశంలోనే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, స్టెరిలైజేషన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు.కృష్ణ బైరెగౌడ కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుని, అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కృష్ణ బైరెగౌడ.. ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనంపై రాజీ పడని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణ బైరెగౌడ అధికారుల పనితీరుపై కఠిన వైఖరికి పేరుగాంచారు. ఇటీవల కూడా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులను గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్కు జరిమానా విధించారు. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.సుప్రీంకోర్టు కూడా సీరియస్..దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై భారత సుప్రీంకోర్టు కూడా పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జంతు సంక్షేమ నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం కాకుండా.. వాటి ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉండాలని కోర్టు పరోక్షంగా సూచించింది. ఈ నేపథ్యంలో.. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై కర్ణాటక మంత్రి కృష్ణ బైరెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
30 రిజెక్షన్లు, కట్ చేస్తే : కోటిన్నర వేతనంతో ఐటీ జాబ్
తన డ్రీమ్ జాబ్ కోసం ఎదురు చూసి, చూసి విసిగిపోయిన వ్యక్తికి అనుకోని అదృష్టం కలసి వస్తే. ఆ ఆనందానికి హద్దే ఉండదు కదా. సరిగ్గా ఇలాగే ఎన్నో రిజెక్షన్ ఈ మెయల్స్ తరువాత, అదీ ఐటీ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉద్యోగ కొనసాగుతున్న వేళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1.4 కోట్ల బేస్ శాలరీతో రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగం సాధించిన వైనం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎన్ని రిజెక్షన్లు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తే చివరికి అనుకున్న విజయం సాధించవచ్చని ఈ ఇంజనీర్ జర్నీ నిరూపించింది.ఒక సంవత్సరం పాటు సాగించిన అవిశ్రాంత ఉద్యోగ వేట, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. దాదాపు 25 కి పైగా రిజెక్షన్ల (తిరస్కరణల) తర్వాత ఎట్టకేలకు తన డ్రీమ్ జాబ్ కొట్టేశాడు. దీనికి సంబంధించిన వివరాలను అతను నెట్టింట పంచుకోవడంతో ఈ స్టోరీ వైరల్గా మారింది.తనకు ఆరేళ్ల అనుభవం ఉందని, ఒక టైర్ 1 కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారని, ఇటీవలే ఒక సీడ్ స్టేజ్ స్టార్టప్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కు ఎంపికైనట్టు అతను తెలిపాడు.ఆ ఇంజనీర్ అందుకున్న భారీ ఆఫర్ వివరాలుబేస్ శాలరీ : రూ. 1.4 కోట్లు, బోనస్: పర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్ESOPs (షేర్లు): 4 సంవత్సరాల వెస్టింగ్ పీరియడ్తో కూడిన 1,20,000 యూఎస్ డాలర్ల (సుమారు రూ. 1 కోటి) విలువైన స్టాక్స్. (హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)మొదటి ఏడాది మొత్తం ప్యాకేజీ: దాదాపు రూ. 1.7 కోట్లు.పాత జీతం ఎలా ఉందంటే : బేస్ శాలరీ రూ. 60 లక్షలు, బోనస్ రూ. 4 లక్షలు , 25,000 డాలర్ల విలువైన స్టాక్స్ ఉండేదట.టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్లు కొనసాగుతున్న ప్రస్తుత కష్టసమయంలో తనకు ఇంత మంచి ఆఫర్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆ ఇంజనీర్ తెలిపాడు. గత ఎనిమిదేళ్లుగా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లీట్కోడ్ (LeetCode) ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎంత కష్టపడినా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూనే వచ్చానంటూ ఆ పోస్ట్లో రాసుకొచ్చాడు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్నిలకడగా (Consistency) ప్రిపేర్ అవ్వడమే తనకు ఎదురైన అతిపెద్ద సవాలని అతను అంగీకరించాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపి మళ్లీ మొదలుపెట్టినప్పుడు, అంతా మొదటినుంచీ నేర్చుకుంటున్నట్టు అనిపించిందని వివరించాడు. అంతేకాదు తన ఉద్యోగ వేటలో తనను రిజెక్ట్ చేసిన దాదాపు 29 కంపెనీల పేర్లను కూడా ఓపెన్గా పంచుకున్నాడు. వీటిలో అమెజాన్, బ్లూమ్బెర్గ్, క్లౌడ్ఫ్లేర్ (Cloudflare), కోర్సెరా, డి.ఇ. షా , అగోడా, ప్రోటోకాల్ ల్యాబ్స్, బిట్గో, నానోనెట్స్, ఫిన్బాక్స్, యుగాబైట్, డెకాగాన్, , అపోలో ఏఐ కోడింగ్ వంటి సంస్థలు ఉన్నాయి. -
ఆటో డ్రైవర్ రిప్లై చూసి షాకైన యువతి, వైరల్ వీడియో
ఒక సాధారణ ఆటో ప్రయాణం, పేమెంట్ ఫెయిల్ , ఆ తర్వాత సదరు ఆటో డ్రైవర్తో జరిగిన కార్పొరేట్ లెవల్ సంభాషణ విధంగా ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆఫీస్ ఈమెయిల్స్ను తలపించేలా సాగిన ఈ చాటింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిష్ఠా శెట్టి అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో ఈ ఆసక్తికర కథనాన్ని షేర్ చేసింది. అసలేం జరిగిందంటే?నిష్ఠా శెట్టి ఒకరోజు ఆఫీస్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్కు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపింది. అయితే, ఐడీ సమస్య వల్ల ఆ పేమెంట్ ఫెయిల్ అయిందని ఆమె తర్వాత గమనించింది. దీని గురించి డ్రైవర్కు హిందీలో మెసేజ్ చేస్తూ.. "ఆప్కా పేమెంట్ ఫెయిల్ హో గయా హై బికాజ్ యే ఐడీ కా కుచ్ ఇష్యూ హో రహా హై" (ఐడీ సమస్య వల్ల మీ పేమెంట్ ఫెయిల్ అయింది) అని పంపింది. దానికి ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Nishta🌸 (@shettynishta)ఆమె పంపిన సాధారణ మెసేజ్కు ఆ ఆటో డ్రైవర్ ఎంతో ప్రొఫెషనల్గా, ఒక కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ తరహాలో ఇంగ్లీష్లో కార్పొరేట్ కంపెనీ మేనేజర్ లెవల్లో సమాధానం పంపాడు."ఒకవేళ మీరు ఆటోలోనే తిరిగి రావాలని ప్లాన్ చేసుకుంటుంటే, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, ఈజ్ దట్ ఓకే (సరేనా)? వీలైతే ఆ సమయంలో నాకు క్యాష్ ఇవ్వచ్చు. మీకు ఓకేనా? లేదా నేను మిమ్మల్ని ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడికే వస్తాను, మీ దగ్గర క్యాష్ ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకుంటాను."డ్రైవర్ చాటింగ్ టోన్ చూసి నిష్ఠా ఆశ్చర్యపోయింది. "అతనేంటి ఆఫీస్ ఈమెయిల్కు రిప్లై ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడు?" అని వీడియోలో పేర్కొంది. అతని ప్రొఫెషనలిజం చూసి కాస్త కంగారు పడ్డానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె కూడా తన టోన్ మార్చేసి, ఇంగ్లీష్లోనే.. "ప్లీజ్ కమ్ బై 6 పీఎం. వైల్ రిటర్నింగ్" (తిరిగి వెళ్లేటప్పుడు సాయంత్రం 6 గంటలకల్లా రండి) అని మెసేజ్ పెట్టింది. దానికి ఆ డ్రైవర్ కేవలం ఒకే ఒక్క ముక్కలో "Noted" (నోటెడ్) రిప్లై ఇవ్వడంతో మరింత ఆశ్చర్యపోవడం నిష్ఠా వంతైంది. ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులునెటిజన్ల కామెంట్లు ఈ చాటింగ్పై నిష్ఠా జోక్ చేస్తూ తాను సగం మందితో పోలిస్తే ఈ ఆటో డ్రైవర్కే కార్పొరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉన్నాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!"ఈ ఆటో డ్రైవర్కు కచ్చితంగా ఒక లింక్డ్ఇన్ (LinkedIn) ప్రొఫైల్ ఉండాలి" అని ఒకరు కామెంట్ చేయగా. చివర్లో 'Noted' అని చెప్పడం పీక్ కార్పొరేట్ బిహేవియర్" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.ఒక చిన్న పేమెంట్ సమస్య వల్ల జరిగిన ఈ సంభాషణ, ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. -
పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్ ఇంతలా ఉంటాయా?
ఏళ్ల తరబడి దూరమైన ఇద్దరు స్కూల్ స్నేహితులు మళ్లీ కలుసుకున్న క్షణం... ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యం. సాధారణంగా హృదయాలను తాకాల్సిన ఆ 42 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చకు తెరలేపింది. కొందరు దాన్ని స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా కొనియాడితే.. మరికొందరు అనుమానాల కోణంలో చూడడంతో రచ్చ రచ్చగా మారింది..సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది. వీడియోలో ఓ మహిళ 14 ఏళ్ల తర్వాత తన పాత స్కూల్ స్నేహితుడిని కలుస్తుంది. అతను విదేశాల్లో సెటిల్ అయ్యాడట. తన వివాహానికి కూడా రాలేదట. తనకంటే తన కూతురు ఆ అంకుల్ను కలవడానికి ఎగ్జయిటింగ్గా ఉందని వీడియో షేర్ చేసింది. పైగా తనను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ.. తన కూతురితో పాటు తనకూ లాలీపాప్ ఇచ్చాడని సంబురంగా చెప్పింది. ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరూ ఆనందంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపిస్తుంది. చివర్లో.. ఆనాడు.. ఈనాడు అంటూ ఓ ఫొటోను ఉంచిందామె. ఆ వీడియో ఎక్కడిది? అందులో ఉంది ఎవరు? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ వివాహిత మహిళ ఇలా ఒంటరిగా కలవడం సరైందేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు.ఇంజినీర్ ఆదిత్య అనే ఎక్స్ (X) యూజర్ ఈ 42 సెకన్ల వీడియోను.. మీ ఆయన్ని తల్చుకుంటే బాధగా ఉంది "Feeling sad for her husband" అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. మిలియన్ పైగా వ్యూస్.. వేలాది లైక్లను సొంతం చేసుకోవడమే కాకుండా, కామెంట్ల రూపంలో పెద్ద చర్చకు దారితీసింది.అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ప్రతి పురుషుడు–మహిళ మధ్య ఉండే బంధాన్ని ప్రేమగా చూడాల్సిన అవసరం లేదు", "14 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిస్తే అలాంటి ఆనందం సహజమే", "ఇది ఎంతో స్వచ్ఛమైన స్నేహం" అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కూడా బిడ్డను తీసుకెళ్లడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.Feeling sad for her husband pic.twitter.com/rCsgNH95Og— Aditya (@adityacasm_) June 29, 2026కొందరు నేరుగా వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తినే విమర్శించారు. "నీ తల్లిని తల్చుకుంటే బాధగా ఉంది.. ఎలాంటి కొడుకును కన్నదో ఆమె", "నీ భార్యను తల్చుకుంటేనే బాధగా ఉంది", "అరేయ్.. అసలు నీ ఆలోచనా విధానమే బాగోలేదురా", "స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా తప్పుగా చూడొద్దు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మరికొందరు "ద్వేషపూరిత క్యాప్షన్ను పక్కన పెడితే వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది" అంటూ స్పందించారు.ఈ ఘటనతో మరోసారి పెళ్లైన ఓ మహిళ, ఓ పురుషుడి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉండగలదా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక వర్గం ప్రతి బంధాన్ని అనుమానంతో చూడకూడదని వాదిస్తుంటే, మరొక వర్గం సామాజిక పరిమితుల గురించి మాట్లాడుతోంది. మొత్తానికి, ఇద్దరు పాత స్నేహితుల భావోద్వేగ కలయికగా మొదలైన ఈ వీడియో... ఇప్పుడు స్నేహం, నమ్మకం, సామాజిక దృక్పథం గురించి దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు కేంద్రబిందువుగా మారింది. -
అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
ఉత్తర ప్రదేశ్లోని షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దేవరాజ్ మాలిక్ కుమారుడు 30 ఏళ్ల ఆయుష్ మాలిక్ గుర్తున్నాడా? ముస్లిం యువతిని వివాహం చేసుకొనేందుకు ముస్లింగా మారి ఈద్ పండుగ రోజున నమాజ్ చేస్తూ సోషల్మీడియాలో వైరల్గా మారాడు. మత మార్పిడి నిరోధక చట్టం కింద ఆయుష్పైనా, వధువు తల్లిదండ్రులపైనా కేసు నమోదు కావడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఇపుడీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్ మాలిక్, ఇప్పుడు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం కింద దేవరాజ్ మాలిక్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషి ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Ayush Malik, who had earlier claimed to adopt Islam in Shamli, Western Uttar Pradesh, has returned to Sanatan Hindu Dharma. Ayush Malik reconverted to Hinduism at his home in the presence of his family. Yashvir Maharaj stated that Ayush Malik embraced Hindu religion once… pic.twitter.com/jYtLN4QHF2— VARAHA WARRIOR (@VarahaWarrior) June 30, 2026తన తల్లిదండ్రులు పడుతున్న బాధను గమనించిన తర్వాత, స్వచ్ఛందంగానే తిరిగి హిందూ మతాన్వి స్వీకరించాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుష్ హిందూ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ, ప్రార్థనలు చేయడం విశేషం. తాను గతంలో ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, ఇప్పుడు స్వచ్ఛందంగా సనాతన ధర్మానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నానని ఆ వీడియోలో చెప్పాడు. తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాడని అతని తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు. ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!గతంలో ఏం జరిగింది?బి-ఫార్మా పట్టభద్రుడైన ఆయుష్ తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్ నిర్వహణలో సహాయపడేవాడు. 2018లో కాలి గాయానికి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి చాందినీ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ , చాందినిని వివాహమాడాడు. ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందగానే ఇస్లాంను స్వీకరించానని, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన ఆయుష్ ప్రకటించాడు. అయితే చాందినీ,ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించేలా క్రమంగా ప్రభావితం చేశారని పోలీసులు తెలిపారు. 2023లో ఆయుష్ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ఇస్లాం మతంలోకి మార్చి 'మహ్మద్ అలీ'గా పేరు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో నికాహ్ (వివాహ) వేడుక కూడా జరిగిందని అందులో పేర్కొన్నప్పటికీ, విచారణలో ఎటువంటి వివాహ ధృవీకరణ పత్రం లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన కుటుంబ ఆస్తిని చేజిక్కించుకునే కుట్రలో భాగంగా, చాందినీ ఖురేషీ ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ కలిసి ఆయుష్ను మభ్యపెట్టి (బ్రెయిన్ వాష్ చేసి), 'మహ్మద్ అలీ' పేరుతో ఇస్లాం మతంలోకి మార్చారని దేవరాజ్ మాలిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్ హిందూ మతంలోకి మారడం ట్విస్ట్. మరి అతని భార్య పరిస్థితి ఏంటి? భార్యతో విడిపోయాడా? కలిసే ఉంటాడా అన్నే ప్రశ్నలకు సమాధానం లేదు. -
తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!
కన్నబిడ్డ సామర్థ్యం మీద ఒక తల్లి నమ్మకం ఆ కూతురు భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. కన్నతల్లి కష్టాన్ని , తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని కూతురు ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కష్టపడి చదివి, ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్కార్ట్' సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సాధించిన ఒక బెంగళూరు యువతి కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింంది. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa)అసలు ఏమైంది?కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు, తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తల్లి ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తాకట్టు పెట్టింది. తన తల్లి త్యాగాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆ కుమార్తె అహర్నిశలూ కష్ట పడింది. తన సక్సెస్ స్టోరీని అనుస్మిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించడానికి తల్లి తన చేతికున్న బంగారు గాజులను తాకట్టు పెట్టారు. ఆ రోజు తల్లి చూపిన చొరవ, చేసిన త్యాగమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె పేర్కొన్నారు.ఏమాత్రం వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా చేసిన ఆమె త్యాగమే తన సక్సెస్కు మూలమని సంతోషాన్ని ప్రకటించింది.తల్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా, ఆ యువతి, చదువులో నిరంతరం శ్రమిస్తూ అద్భుతమైన ప్రతిభతో రాణించింది. కాలేజీ రోజుల్లోనే కోడింగ్, సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించింది. చివరకు దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్-1 గా ఉద్యోగాన్ని అమ్మకు గిఫ్ట్గా అందించింది."నా కాలేజీ అడ్మిషన్ ఫీజు కట్టడానికి అమ్మ తన బంగారు గాజులను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు, అమ్మ ఎప్పుడూ అలాగే చేస్తుంది," అని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఫ్లిప్కార్ట్' (Flipkart)లో ఉద్యోగం రావడం అనేది కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు; తన తల్లి చేసిన త్యాగానికి నిదర్శనమి పేర్కొంది. ప్రతిరోజూ ఫ్లిప్కార్ట్కు వెళ్తున్నప్పుడు, అమ్మ కోసమే వెళ్తున్నానని భావిస్తాననని ఈ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అమ్మ చేసిన త్యాగానికి రుజువు అని చెప్పింది.తన జీవితంలోని ఈఅద్భుతమైన విషయాన్ని అందరికీ చెప్పడానికి ఈ రోజు సరైనదనిపించిందంటూ ‘‘అమ్మా... ఇది నీ కోసమే. అన్నీ నీ కోసమే. ఎప్పటికీ. అన్నింటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను." అంటూ అనుస్మిత ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. -
నెలకు రూ.71 వేల ఖర్చు.. వైరల్గా టెకీ అంజలి వీడియో
దేశంలోని ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం (Cost of Living) మరోసారి చర్చనీయాంశమైంది. ఓ ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్గా మారింది. తాను మే నెలలో మొత్తం రూ.71 వేల వరకు ఖర్చు చేశానని, అయితే బెంగళూరు వంటి నగరంలో ఇది పెద్ద మొత్తం కాదని చెప్పడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మొదలైంది.వీడియోలో టెకీ అంజలి తన ఖర్చులను వివరించింది. తాను ఉంటున్న 1BHK ఫ్లాట్కు నెలకు రూ.28 వేల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ ఆహారం కోసం సుమారు రూ.7 వేలు ఖర్చవుతాయని పేర్కొంది. వారాంతాల్లో షాపింగ్, బయట తిరగడం వంటి ఖర్చులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.Bengaluru Techie Monthly Expenses Go Viral!A Bengaluru software engineer is spending ₹71,000 per month with rent alone at ₹28,000 for a 1BHK apartment!Anjali, who works as a Software Engineer at Atlassian, shared her detailed May expense breakdown on Instagram, sparking… pic.twitter.com/lswYRiwBBw— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) June 29, 2026 అంతేకాకుండా, ప్రయాణాలను ఇష్టపడే తాను టూర్ల కోసం నెలకు మరో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నానని చెప్పింది. ఈ ఖర్చులన్నీ కలిపి మే నెలలో తన మొత్తం వ్యయం రూ.71 వేలకు చేరిందని వివరించింది. అయితే, బెంగళూరులో ఉద్యోగం చేసే వారికి ఇలాంటి ఖర్చులు అసాధారణం కాదని, నగర జీవనశైలికి అనుగుణంగా ఇవి సహజమేనని అంజలి అభిప్రాయపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు "బెంగళూరులో అద్దెలు, జీవన వ్యయం నిజంగానే ఎక్కువ" అంటూ ఆమె మాటలకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం "ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది", "ఇంత డబ్బు సేవ్ చేస్తే ఏడాదికి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది", "ఇది అవసరమైన ఖర్చా.. లేక లైఫ్స్టైల్ ఖర్చా?" అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ వీడియోతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం, యువ ఉద్యోగుల లైఫ్స్టైల్ ఖర్చులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. -
విధి లోయలోకి లాగితే... అదృష్టం వెనక్కి తీసుకొచ్చింది!
ఒక్క క్షణం ముందు వరకు అదొక సాధారణ ప్రయాణం.. మరుసటి క్షణమే మృత్యువుతో పోరాటం. కళ్లముందే కొండచరియలు విరిగిపడి బైక్తో సహా అతడిని లోయవైపు ఈడ్చుకెళ్లాయి. ‘అరే పాపం..’ అని అంతా అనుకునేలోపే.. ఏదో అద్భుతం జరిగినట్లు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చావును కళ్లారా చూసి తిరిగి వచ్చిన ఈ ఉత్కంఠభరిత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈశాన్య భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా.. తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 28న ఓ బైకర్ అత్యంత ఇరుకైన కొండ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే రహదారిపై బురద పేరుకుపోయి, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నెమ్మదిగా ముందుకు సాగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియ విరిగిపడింది.ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే.. భారీ మట్టి, రాళ్లతో పాటు బైక్, బైకర్ కూడా లోయవైపు జారిపోయారు. కొన్ని క్షణాల పాటు అతడు మట్టిపెళ్లల మధ్య కనిపించకుండా పోవడంతో అక్కడున్నవారంతా ప్రాణాలు దక్కడం అసాధ్యమేనని భావించారు. కొండచరియలు కిందకు దూసుకెళ్లి అక్కడే ఓ నదిలో చేరడంతో భారీగా దుమ్ము, మట్టి మేఘాలు ఎగిసిపడ్డాయి.అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అరుణాచల్ప్రదేశ్లోని లోయర్ సియాంగ్ జిల్లాలోని సీజీ లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది.🇮🇳 Absolutely terrifying footage from India shows a biker being swept away as a massive landslide tears down a mountainside after relentless rain in Arunachal Pradesh.The landslide also blocked the Siji River.Against all odds, the biker survived without injuries. A miracle…— Mario Nawfal (@MarioNawfal) June 29, 2026వీడియో చూసిన నెటిజన్లు "ఇది రెండో జన్మ", "అతడి అదృష్టం అసాధారణం", "లాటరీ టికెట్ కొనాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధి తన పని చేయాలనుకుంది... అదృష్టం అడ్డొచ్చింది. క్షణాల్లో లోయలోకి జారిపోయిన ఆ బైకర్.. చివరి క్షణంలో చావునే మోసం చేసి సురక్షితంగా బయటపడ్డాడు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల ప్రమాదాల తీవ్రతను గుర్తు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. -
ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్ చేసుకుంది.అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది. తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో చేరిందని. నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. అంతేగాదు నిట్లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్షిప్లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్ ఫీజులను ప్రతి సెమిస్టర్కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్టాప్ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది. అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa) (చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..) -
ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్.. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.బల్లభ్గఢ్లో నివసించే రాహుల్కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్ షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.మరణానికి ముందు ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.Faridabad News: सेक्टर-3 फरीदाबाद में राहुल की मौत के बाद मर्चरी के बाहर पिता का दर्द छलक पड़ा। परिजनों ने निष्पक्ष जांच और न्याय की मांग की। पुलिस पूरे मामले की जांच में जुटी है।#FaridabadNews #BreakingNews #HaryanaNews #CrimeNews #ViralNews #HindiNews #HindustanTehelka pic.twitter.com/XWn71XZ7FO— Hindustan Tehelka News (@htehelkanews) June 28, 2026అయితే వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రైల్వేస్టేషన్లో హైడ్రామా.. ప్రయాణికుడికి చితకబాదిన ఎస్ఐ
ప్రయాణికులను కాపాడాల్సిన రైల్వే పోలీసే.. క్షణికావేశంలో మితిమీరి ప్రవర్తించారు. సామాన్య పౌరులపై ప్రతాపం చూపించాడు. రైల్వే స్టేషన్లో వందలాది మంది చూస్తుండగానే జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్లో రికార్డ్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనకు కారణమైన సదరు ఉద్యోగిని అధికారులు బదిలీ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్లోని సూరత్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉధ్నా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బీహార్లోని జయనగర్ వెళ్లే ఒక ప్రత్యేక రైలు (Special Train) ఉధ్నా రైల్వే స్టేషన్కు చేరుకుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్ఫారమ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులను క్రమబద్ధీకరించడానికి, వారు రైలును క్యూ లైన్లలో ఎక్కేలా చూడటానికి రైల్వే పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఒక ప్రయాణికుడు రద్దీ కారణంగా క్యూ లైన్ను దాటి నేరుగా రైలు పెట్టెలోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.ఇది గమనించిన ఉధ్నా రైల్వే స్టేషన్ జీఆర్పీ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎమ్.రాథోడ్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు ప్రయాణికుడిని పట్టుకుని బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. అతని జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్లో రికార్డ్ చేసింది. సదరు వ్యక్తి ఎలాంటి తప్పు చేయలేదని, తన గ్రామానికి వెళ్తుండగా పోలీసులు ఉద్దేశపూర్వకంగా, ఎలాంటి ఉసిగొల్పు లేకుండానే దాడికి తెగబడ్డారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పడం వినిపించింది. పోలీసుల అరాచకాన్ని చూసి భయపడిపోయిన ఇతర ప్రయాణికులు అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తడం కూడా ఆ వీడియోలో రికార్డయ్యింది.అనంతరం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు.. సామాన్య పౌరులపై పోలీసుల ప్రవర్తన ఇలాగేనా ఉండేది? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో సూరత్ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుడి పట్ల అంతటి అమానవీయంగా ప్రవర్తించిన అధికారిని ఉధ్నా స్టేషన్ నుండి తక్షణమే వడోదర జీఆర్పీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. కేవలం బదిలీతోనే సరిపెట్టకుండా, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని డిప్యూటీ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. -
జెన్జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్!
టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తుంటే.. అనవసరంగా ఎందుకు కష్టపడాలి?. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ పోస్ట్.. దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యంగా జెన్జీ (Gen Z) యువత జీవితం, పని, విజయం, కష్టం గురించి ఎలా ఆలోచిస్తోందనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.ఈ చర్చకు కారణమైనది ఎక్స్ (X) వేదికపై ప్రేమ్ సోని అనే యూజర్ చేసిన ఓ పోస్ట్. పాతతరం కష్టాన్నే విజయానికి కొలమానంగా భావిస్తుంటే.. జెన్జీ మాత్రం సమయం, సామర్థ్యం, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తోందని ఆ యూజర్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఒక పనిని సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంటే.. అదే పనిని అనవసరంగా కష్టపడి చేయడంలో అర్థం లేదనేదే జెన్జీ ఆలోచనగా వివరించారు.దీనికి ఉదాహరణగా.. కూరగాయలు కొనడానికి ట్రాఫిక్, దుమ్ము, బేరసారాలతో గంటసేపు గడపడం కంటే.. మొబైల్ యాప్లో కొన్ని నిమిషాల్లో ఆర్డర్ చేయడాన్నే జెన్జీ తెలివైన నిర్ణయంగా భావిస్తోందని చెప్పారు. అలాగే రద్దీ బస్సుల్లో ప్రయాణించడం కంటే క్యాబ్ లేదంటే రైడ్-హైలింగ్ యాప్ను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసే మార్గమని యువత చూస్తోందని పేర్కొన్నారు.అంతేకాదు, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకునే తల్లిదండ్రులే.. అదే పిల్లలు టెక్నాలజీ సాయంతో సమయం ఆదా చేసుకుంటే వారిని బద్ధకస్తులుగా చూడడం ఒక వైరుధ్యమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కష్టాన్ని, పొదుపును గొప్పగా చెప్పిన పెద్దలే.. ఇప్పుడు తమ స్మార్ట్ఫోన్లలో క్విక్ కామర్స్ యాప్ల ద్వారా వచ్చే డెలివరీలను ట్రాక్ చేయడం కూడా ప్రస్తావించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.Indian parents are facing a massive existential crisis because Gen Z refuses to suffer for no logical reason.It is deeply offensive to our culture that a 24 year old will order groceries on Blinkit instead of spending 45 minutes inhaling road dust and fighting a vendor to save…— Prem Soni (@ValueWithPrem) June 28, 2026సమయానికి విలువ ఇవ్వడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం బద్ధకం కాదని, అదే ఆధునిక జీవనశైలి అని చాలామంది జెన్జీకి మద్దతు తెలిపారు. మరోవైపు, జీవితంలో కొంత కష్టాన్ని అనుభవించడం వల్లే సహనం, క్రమశిక్షణ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని మరికొందరు వాదించారు.మొత్తానికి.. ఈ చర్చ కేవలం ఆన్లైన్లో కూరగాయలు కొనడం, క్యాబ్లో ప్రయాణించడం గురించి మాత్రమే కాదు. కాలం మారుతున్న కొద్దీ 'కష్టం' అనే పదానికి అర్థం కూడా మారుతోందా? సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవడం తెలివా? లేదంటే కష్టపడటమే జీవిత విలువను నేర్పుతుందా?అనే ప్రశ్నలను మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందుకే.. జెన్జీ కొత్త ఫార్ములాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి మీరేమంటారు?.. ఈ వాదనతో ఏకీభవిస్తారా??. -
బస్స్టాపే పాఠశాలగా..!
కొంతమంది నిస్వార్థ సేవకు కేరాఫ్గా ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ..నిశబ్దంగా ఉంటారు. వారి సేవ ప్రజలో, మరెవరూ చూసి గుర్తించి చెబితే గానీ తెలియదు. అయినా మంచి పనికి హంగామా, ఆర్భాటాలతో పని ఉండదనిపిస్తుంది అలాంటి వాళ్లను చూస్తే. అచ్చం అలాంటి నిస్వార్థ సేవనే చేసున్నాడో వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూస్తే మానవత్వంపై నమ్మకం వస్తుంది. స్వార్థపూరిత ప్రప్రంచంలో నిస్వార్థం మిణమిణకుమంటూ ఇంకా ఉందని అనిపిస్తుంది. ఆ వీడియోలో గురుగ్రామ్కు చెందిన ఒక వ్యక్తి బస్స్టాప్ వద్ద పేద పిల్లల సముహానికి పాఠాలు చెబుతుంటాడు. ఆ వీడియోలో పిల్లలంతా నేలపై చాప మీద కూర్చొని పుస్తకాలు, నోట్బుక్లతో కనిపించగా, మరొక చిన్నారి బోర్డుపై ఏదో రాస్తూ కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడి కనిపిస్తున్న వ్యక్తి పిల్లల వెనుక నిలబడి వారేవిధంగా నేర్చుకుంటున్నారో నిశితంగా పరిశీలిస్తుండటం చూడొచ్చు. ఈ తతంగం మొత్తం అటుగా వెళ్తున్న కారులోని ఒక ప్రయాణికుడు రికార్డు చూసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి నిస్వార్థమైన పని చూని ముగ్ధుడవ్వడమే కాదు ఆ వ్యక్తిని అభినందించినట్లు తెలిపాడు. అక్కడున్న పిల్లలు కూడా ట్రాఫిక్ని, వాహనాలను ఏమి పట్టించుకోకుండా చదువుపై దృష్టిసారించడం విశేషం. ఇలా బహిరంగ ప్రదేశాన్ని తరగతి గదిగా మార్చి, చదువుకోవడానికి వచ్చే పేద పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మనుసుకు హత్తుకునే ఈ దృశ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తరగతి గది నాలుగు గోడల మధ్యే కాకుండా, ఆరు బయట కూడా విద్యను అభ్యసించవచ్చని ఈ సంఘటన గుర్తుచేస్తుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Global Hues (@theglobalhues) (చదవండి: జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు తగ్గింది..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..) -
'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..!
కుంచె పట్టుకుని చిత్రాలు గీసి ఉండటం చూశాం. పోనీ రంగులతో, చేతితో,కాలితో.. వాటన్నింటిని కాలదన్నేలా నోటితో కూడా చిత్రాలు వేయడం చూశాడు. టైపింగ్ మిషన్ సాయంతో చిత్రాలు గీయడం గురించి విన్నారా? ఔను అది కూడా టైప్ చేస్తూ కళాకృతి అంటే..మాటలకందనిది..సాధ్యమా? అని ఆశ్చర్యం రేకెత్తించే అంశం. కానీ ఈ వ్యక్తి ఎంత అద్భుతంగా టైప్రైటర్తో చిత్రం గీశాడో చూస్తే షాకవ్వుతారు. కళాకారుడు జేమ్స్ కుక్ పూర్తిగా టైప్రైటర్ సాయంతో గీసిన చిత్రాన్ని పంచుకున్నాడు. అది కూడా 2026 వింబుల్డన్ ఛాంపియన్షిప్లకు ఒక అసాధారణమైన నివాళిగా ఇలా చిత్రించడం విశేషం. అతను మొత్తం కళాకృతిని పూర్తి టైప్రైటర్తో సృష్టించాడు. ప్రతి కీస్ట్రోక్తో ప్రతి వివరాలను జాగ్రత్తగా రూపొందించాడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియోలో జేమ్స్ కుక్ తన టైప్రైటర్ వద్ద కూర్చుని..ఒక ఖాళీ కాగితాన్ని ఉంచడం నుంచి మొదలయ్యి.. కీలను నొక్కిన ప్రతిసారీ, స్టేడియం వంటి వాటితో జీవం పోసుకుంటుంది. కెమెరా జూమ్ చేయగా, స్టేడియంతో కళకళలాడుతున్న ప్రేక్షకుల నుంచి ఐకానిక్ గ్రీన్ టెన్నిస్ కోర్ట్ వరకు, ప్రతి క్లిష్టమైన వివరాలు స్పష్టమవుతాయి. ఆ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి స్కోర్బోర్డ్. దానిపై "రోజర్ ఫెదరర్", "ఎన్. జొకోవిచ్" అని రాసి ఉండటం. ఈ వింబుల్డన్ చిత్రం ఇద్దరు గొప్ప ఛాంపియన్లను నివాళులర్పిస్తుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు..వందలాది ప్రత్యేకమైన టైప్ చేసిన ఫ్రేమ్లను సృష్టించి, వాటిన్నింటిని కలిపి ప్లే చేస్తే.. కదులుతున్నాయనే భ్రమను కలిగించే యానిమేషన్ చిత్రం ఇది. ఆ చిత్రంలో ఆటగాళ్లు కోర్టు అంతటా ర్యాలీ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ ఆ కళాకృతిని పూర్తిగా టైప్రైటర్తో రూపొందించినా..చివరల్లో మంత్రముగ్ధులను చేసే యానిమేషన్ మారుతుంది. అంతేగాదు ఆ వీడియోకి నేను నా టైప్రైటర్తో చిత్రాలు గీస్తాను. 2026 వింబుల్డన్ ఛాంపియన్షిప్లను పురస్కరించుకుని నేను రూపొందించిన కళాకృతి ఇదిగో అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు జేమ్స్. అలాగే పోస్ట్లో.. "ఒక అభిమానిగా కళను, యానిమేషన్ను మిళితం చేసేలా యానిమేషన్ చిత్రాన్ని సృష్టించాలనుకున్నా. అందుకు వందలాది ఫ్రేమ్లను ఒక్కోక్కటిగా చేతితో టైప్ చేసి, ఫ్రేమ్ ఫ్రేమ్గా ఈ కళాకృతికి జీవం పోశాను. ఇది ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్టులలో అత్యంత క్లిష్టమైనది. పైగా ఈ చిత్రంలో టైప్చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా అని రాసుకొచ్చాడు". జేమ్స్ పోస్ట్లో. ఈ చిత్రం వెనుకున్న అపారమైన సహనం, క్రియేటివిటీకి మత్రముగ్ధులవుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by James Cook Artwork (@jamescookartwork) (చదవండి: మనవడి కోసం.. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా 75 ఏళ్ల వృద్ధుడు!) -
మనవడి కోసం.. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా 75 ఏళ్ల వృద్ధుడు!
మనవడి కోసం ఓ తాత బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. అతడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం సామాజిక మాధ్యమంలో లైవ్ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు కూడబెడుతున్నాడు ఈ 75 ఏళ్ల తాత. అంతేగాదు ఫిజెయోథెరపీ కోసం తానే స్వయంగా ఎలాగో నేర్చుకుని మనవడికి మసాజ్ చేస్తూ..అతడు కోలుకోవాలని వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నాడు ఆ ముసలి తాత. ఆ వయసులో అంత పెద్ద బాధ్యతను టీవీల్లోని కార్టూన్ పాత్రల్లో చూసే సూపర్మ్యాన్లా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇంతకీ ఎవరా తాతా? ఏమా కథ అంటే..చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్కి చెందిన ఝూ యున్చాంగ్ అనే 75 ఏళ్ల తాతన తన తొమ్మిదేళ్ల మనవడు కావో జింగ్వాన్ కోసం కష్టపడుతున్నారు. అతుడు అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరు నెలల వయసున్నప్పుడు ఈ అరుదైన జన్యు వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ వ్యాధి వెన్నుపాములోని మోటార్ న్యూరాన్లను దెబ్బతీసి, క్రమంగా కండరాల బలహీనత, శ్వాసకోస సమస్యలకు దారితీసుకుంది. చైనాలో ఇలాంటి కేసులు ప్రస్తుతం 30 వేల ఎస్ఎంఏ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది కొత్తగా సుమారు 12 వేల కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్క ఈ చిన్నారి జింగ్వాన్కు SMA టైప్ 1 ఉంది. ఇది ఈ అరుదైన వ్యాధి తీవ్రమైన రూపం. అంతేగాదు అతడికి సకాలంలో చికిత్స అందకపోతే కేవలం 18 నెలలు మాత్రమే జీవిస్తాడని వైద్యులు తేల్చి చెప్పారు. ఆ వార్త ఆ చిన్నారి తల్లి జూవెయ్ని కుంగదీసింది. జువెయ్ ఈ ముసిలా తాత ఒక్కగానొక్క కూతురు. తన కూమార్తెకి వచ్చిన కష్టం చూసి చలించిపోయినా ఆ వృద్ధుడి తన మనవడిని ఎలాగైన కాపాడాలని ముఖానికి రంగులు వేసుకుంటూ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. ప్రత్యక్ష మేకప్ వీడియో ప్రసారాలతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలను పొందాడు. అంతేగాదు కూతురు కూడా తనకంటే తన తండ్రే బాగా మేకప్ వేయగలడని చెప్పడం విశేషం. అలా ఇన్ఫ్లుయెన్సర్గా ఆర్జించిన సొమ్ముని మనవడి చికిత్స కోసం ఉపయోగిస్తున్నాడు. అంతేగాదు మంచానికే పరిమితమైన మనవుడు లేచి నిలబడేలా చేసేందకు ఫిజియోథెరపీ కూడా నేర్చుకుని మరి చికిత్సలు అందిస్తున్నాడు. తనకు బాగాలేకపోతే తగిన సంరక్షక జాగ్రత్తలు తీసుకుని మరి మసాజ్లు చేస్తుంటాడట. అయితే 2019లో, ఈ వ్యాధికి సంబంధించిన 'నుసినెర్సెన్' అనే మందుని కనిపెట్టారు. ఇది మనుగడ రేట్లను గణనీయంగా పెంచి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని నిర్థారణ అయ్యింది. అయితే ఒక్కో ఇంజెక్షన్కు 700,000 యువాన్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 97 లక్షలు)ఖర్చవుతుంది. ఇక ఈ చిన్నారి జింగ్యాన్కు ప్రతి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు ఇప్పించాల్సి ఉంది. ఈ చికిత్స కోసం ఈ తాతగారు తన ఫ్లాట్ని అమ్మేశాడు. అలాగే బంధువుల నుంచి కొంత అప్పు తీసుకున్నాడు. బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గానే ఎందుకంటే..ఇక అతని కుమార్తె పగటిపూట పనిచేసి సాయంత్రాలలో లైవ్-స్ట్రీమింగ్ చేసేది. ఈ 70 ఏళ్లు పైబడిన తాత గారిని ఏఉత్పత్తులకు ప్రచారం చేయడానికి ఏ కంపెనీ కూడా నియమించకోదు. దాంతో ఆయన కుమార్తె కొనుగోలు చేసిన సౌందర్య ఉత్పత్తులతో లైవ్-స్ట్రీమింగ్ చేసేందుకు బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా అవతారమెత్తాడు. అలా వచ్చిన ఆదాయన్ని మనవుడి చికిత్స కోసం వెచ్చిస్తున్నాడు. అలాగే అతడి కష్టానికి చైనా ప్రభుత్వం కూడా వైద్యబీమా రూపంలో సాయం అందించింది. 2021లో ఈ వ్యాధికి సంబంధించిన మందుల ఖర్చును చైనా వైద్య బీమా పరిధిలోకి తీసుకురావడంతో ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 4 లక్షలు తగ్గి..ఆ తాతకు కొంత ఉపశమనం లభించింది . ఇప్పుడు ఆయన మనవడికి తొమ్మిదేళ్లు నిండాయి. ఆరోగ్యం బాగున్న రోజుల్లో పాఠశాలకు వెళ్లి చుదువుకోవడం తోపాటు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటాడని ఆనందంగా చెబుతున్నాడు. ఆయన కుమార్తె తన తండ్రిని.. తన కుమారుడి ఇంజెక్షన్ల భారాన్ని మోస్తున్న సూపర్మ్యాన్.. సూపర్ డాడ్.. సూపర్ తాత.. అని సగర్వంగా చెబుతోంది. కానీ ఆ తాత ఝూ మాత్రం తన మనవడు స్వతంత్రంగా తన కాళ్లపై లేచి నిలబడితే చాలని భావోద్వేగంగా చెబుతున్నాడు.(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..) -
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026అయితే ఈ ట్రెండ్కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్లు విస్తృతంగా వినిపించాయి.అంతేకాదు, కేజీఎఫ్, జైలర్లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్లా అన్న సందేహం కలగడం సహజమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.అయితే ఈ ట్రెండ్పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!".. -
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్లోని హెచ్-8 గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్ను చాలాసార్లు ఓపెన్గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. తన సొంత గ్రామంలోనే సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. కేవలం మూడు నెలల్లోనే విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇది.శ్రీలంకకు చెందిన సమీత సులక్కన అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్న తన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. కంపెనీలో జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు.ఐటీ ఉద్యోగం నుండి వ్యాపారం వైపు..సమీత సులక్కన తన విజయ గాథను లింక్డ్ఇన్ పోస్ట్లో వివరించారు. దీని ప్రకారం ఇటీవల కంపెనీలో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు సమిత. మిగిలిన వారిలాగే భవిష్యత్తుపై ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. టెకీలకు ఐటీ రంగంలోనే కెరీర్ ఉంటుందని భావించాడు. పైగా ఐటీ అనేది ప్యాషన్. కానీ, ఆ కష్టకాలంలో అవకాశాలు ఎప్పుడూ మనం అనుకున్న రూపంలోనే రావని చాలా తొందరగానే గ్రహించాడు. అందుకే మరో టెక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా, తన గ్రామంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించే ఒక మినీ సూపర్ మార్కెట్ కూడా లేదని గమనించి, ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని స్వయంగా ఒక స్టోర్ను ప్రారంభించాడు.సంప్రదాయ వ్యాపారానికి టెక్నాలజీ హంగులుతాను చదువుకున్న చదువును, టెక్నాలజీ నేపథ్యాన్ని తన వ్యాపారంలో ఉపయోగించాలని సమిత నిర్ణయించుకున్నాడు. సాధారణ కిరాణా దుకాణంలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. కస్టమర్ల సౌకర్యం కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) సదుపాయంతో కూడిన ఒక సాధారణ ఆన్లైన్ ఆర్డరింగ్ విధానాన్ని ఆయనే స్వయంగా డెవలప్ చేసుకున్నాడు. దీనివల్ల కస్టమర్లు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వీలు కలిగింది. అంతే ఆర్డర్లు భారీగా వచ్చాయి. వ్యాపారం చాలా వేగంగా పుంజుకుంది. కేవలం మూడు నెలల్లోనే రోజువారీ టర్నోవర్ రూ. 50,000 దాటింది. ఈ సూపర్ మార్కెట్తో పాటు, తన గ్రామంలో 'ప్యూరిఫైడ్ వాటర్' (శుద్ధి చేసిన తాగునీరు) సరఫరా చేసే మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని సమిత యోచిస్తున్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్నిరుద్యోగులకు, యువతకు సమిత సలహా"ఈ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది: మనం మారడానికి, ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే.. మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలే కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఉద్యోగ రంగంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారు ఎవరూ అందోళన పడకండి. ప్రణాళిక వేసుకోండి, అవసరమైతే చిన్నగా ప్రారంభించండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారేవరకు వేచి చూస్తే విజయం రాదు. ఇతరులు అడుగు ముందుకు వేయడానికి భయపడు తున్నప్పుడు, మనం మొదటి అడుగు వేస్తేనే విజయం లభిస్తుంది." అంటూ తన లాంటివారికి సూచిస్తున్నారు సమిత.ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్లోనే పెళ్లి, అంతలోనే..!నెటిజన్ల ప్రశంసలుసమిత తీసుకున్న నిర్ణయం, సాధించిన విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అద్భుతం, నువ్వు నిజంగా ఒక స్ఫూర్తివి సమిత అని ఒకరంటే, "గతేడాది నాకూ ఇలాగే ఉద్యోగం పోయింది బ్రదర్. దాంతో నేను నా సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభించాను. నాణ్యత అనేది కేవలం సాఫ్ట్వేర్కే కాదు, మన చుట్టూ ఉన్న అన్నిటికీ వర్తిస్తుంది. ప్రస్తుతం నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ని" అంటూ మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, సమితను అభినందించారు.(ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన సైనికులు వీరే!) -
తండ్రి చివరి కోరిక : వీడియో కాల్లోనే పెళ్లి, అంతలోనే..!
ఒకవైపు కన్నకూతురి పెళ్లి కళ్లారా చూడాలన్న కన్నతండ్రి కోరిక, మరవైపు అనూహ్యంగా తీవ్ర అనారోగ్యం బారిన తండ్రి. చివరికి ఆసుపత్రి బెడ్పై నుంచే వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. కానీ అంతలోనే తీవ్ర విషాదం అలుముకుంది.బిహార్లోని సీతామఢీ జిల్లా సోన్బర్సాకు చెందిన లాల్బాబు మహతో ఒక ట్రావెల్ కంపెనీలో బస్సు కండక్టర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. తన చిన్న కూతురు నిధి కుమారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ శుభఘడియ కోసం ఏళ్లుగా ఎదురు చూశారు. అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయన్ను లక్నోలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. లాల్బాబు మహతో చివరి కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య మీనూ దేవి, కుమారుడు రాజేష్ కలిసి ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా నిధి పెళ్లి చూసే ఏర్పాటు చేశారు.అలా కూతురి వివాహ వేడుకను ఆసుపత్రి బెడ్పై నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని హల్దీ వేడుక, పూలదండలు మార్చుకోవడం, ప్రధాన వివాహ ఘట్టం వరకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసి తన కోరిక నెరవేర్చుకున్నారు. కొత్త పెళ్లికూతురిగా కుమార్తె అలా అత్తగారింటికి వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే ఒక తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా ఆమె కూతురి వీడ్కోలు వేడుక ముగిసి, ఇల్లు వదిలి వెళ్తుండగా ఆ తండ్రి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలాగా చివరి శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కంట కన్నీరు తెప్పించింది. (ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన సైనికులు వీరే!)ఒకేరోజు చెల్లి పెళ్లి.. తండ్రి మరణంలాల్బాబు కుమారుడు రాజేష్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు చెల్లి వీడ్కోలును, మరోవైపు తండ్రి మరణాన్ని చూడాల్సి వచ్చింది. నిధి సీతామఢీ జిల్లాలోని మోహన్పూర్కు చెందిన తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తగారింటికి బయలుదేరి వెళ్లడం, మరోవైపు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ అన్న ఆవేదనకు అంతులేకుండా పోయింది. లాల్బాబు మహతోకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇదీ చదవండి: కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్ -
కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక!
94 ఏళ్ల బామ్మ భారతీయ పౌరసత్వం కోసం కలెక్టర్ని ఆశ్రయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తన శేష జీవితం భారతీయురాలిగా గడపాలంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పిన తీరు అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె కథేంటంటే..ఆ బామ్మే ఆంద్రప్రదేశ్కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. భర్త మరణానంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్బర్గ్లో ఆంకాలజిస్ట్గా (క్యాన్సర్ వైద్య నిపుణుడిగా) పనిచేసేవారు. 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మ అమెరికా పౌరురాలిగా మారారు. ఆమె అక్కడ సుమారు 18 ఏళ్లు నివసించారు. ఆ తర్వాత తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరడంతో ఆమె 2018లో తిరిగి భారతదేశానికి వచ్చారు. దాంతో ఆమెకు మళ్లీ భారతీయ పౌరురాలిగా మారాలనే కోరిక కలిగింది. ఈ ప్రక్రియ వేగంతంగా అవ్వాలని కోరుతూ మహాలక్ష్మమ్మ కలెక్టర్ గారిని కలిశారు. ఆయనతో బామ్మ "కలెక్టర్ గారు నాకు 95 ఏళ్లు నిండనున్నాయి. నా చివరి రోజులను నా మాతృభూమిలో భారతీయ పౌరురాలిగా గడపడమే నా ఏకైక కోరిక. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే నా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారతీయ పౌరసత్వం లభించేలా సహాయం చేయండి." అని కోరింది. తాను ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కేవలం తన మిగిలిన జీవితాన్ని తన జన్మస్థలంలోనే గడిపేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని స్థానికి అధికారులను కోరారు. దీనికి జిల్లా కలెక్టర్గారు స్పందిస్తూ..పౌరసత్వంపై తుది సిఫార్సును కేంద్ర అధికారులకు పంపే ముందు స్థానిక విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ తర్వాత ఈ అభ్యర్థనపై నిర్ణీత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ బామ్మకు హామీ ఇచ్చారు. (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
ఫొటో వైరల్.. మహిళా కానిస్టేబుల్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వృద్ధుడి ఎదుట టేబుల్పై కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ సంబంధిత కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.వివరాల మేరకు.. ఈ ఘటన డూంగర్పూర్ జిల్లాలోని బిచ్చివాడా పోలీస్ స్టేషన్లో జరిగింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రీనా గర్గ్ తన ఎదుట ఫిర్యాదు కోసం వేచి ఉన్న వృద్ధుడిని పట్టించుకోకుండా టేబుల్పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న దృశ్యం ఫొటోలో కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వచ్చే ప్రజల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమిటని ప్రశ్నించారు.Is this what Rajasthan Police teaches? This viral photo is claimed to be from a police station in Dungarpur district. A poor man reportedly went there to file a complaint about his suffering, but the woman constable was sitting in the office with her legs stretched out on… pic.twitter.com/DF71sndix8— Spider (@SpiderAlert24) June 26, 2026వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో డూంగర్పూర్ ఎస్పీ మనీష్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ రీనా గర్గ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగా, సున్నితంగా చూడటం పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు. వైరల్ ఫొటోలో కనిపించిన తీరు పోలీస్ సేవా నియమాలకు, క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, వైరల్ అయిన ఫొటో ఎప్పుడు తీసిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆ ఫొటో నిజానిజాలు, ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులను శాఖాపరమైన విచారణలో పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాజస్థాన్లో చర్చనీయాంశంగా మారింది. -
కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన మణిమ అనే మహిళ చూపిన సమయస్ఫూర్తి, తెగువ నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే భారీ పామును చూస్తేనే అంతదూరం పారిపోతాం. కానీ అంత పెద్ద పాము కాటేసినా కూడా ఏ మాత్రం భయపడలేదు. సరికదా ఆ విష సర్పాన్ని బంధించి మరీ వైద్యుల వద్దకు రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. చికిత్సలో అతి ముఖ్యమైన యాంటీ-వెనమ్ను ఇంజక్షన్ అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.ఈ సంఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు మథిలి బ్లాక్ పరిధిలోని కురుంపాలి గ్రామంలో జరిగింది. మణిమా నాయక్ అనే ఆ మహిళ సాయంత్రం వేళ తన ఇంట్లో ఉండగా, ఒక విషపూరిత పాము ఆమె కాలిపై కాటు వేసింది. సాధారణంగాఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు, కానీ మణిమా మాత్రం ప్రశాంతంగా ఉండటమేకాదు, అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఆ పామును ఒక బిస్కెట్ డబ్బాలో బంధించి మరీ ఆసుపత్రికి చేరింది.Quick thinking saves a life in Odisha's Malkangiri! A woman bitten by a venomous snake captured the reptile in a container and carried it to the hospital to ensure accurate identification and treatment. She is currently stable and receiving medical care. 🩺📦#Malkangiri #Odisha pic.twitter.com/SiZmobe7d0— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) June 26, 2026 ఈ సంఘటన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అంబులెన్స్లో మథిలి సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. రోగి బంధువులు ఆ సజీవ పామును కూడా ఆసుపత్రికి తీసుకురావడం వైద్యులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఇలా చేయడం వల్ల పాము జాతిని ఖచ్చితంగా గుర్తించి, అవసరమైన యాంటీ-వెనం (విష విరుగుడు మందు) అందించడానికి వీలుగా తాము ఆ పామును తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కూడా ఆమె సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు.ప్రస్తుతం మణిమా వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఆ ప్రాంతంలో శరవేగంగా వ్యాపించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురు మణిమా సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె చర్య వైద్యులు పామును గుర్తించడంలో సహాయ పడటమే కాకుండా, పాము కాటుకు గురైనప్పుడు ప్రశాంతంగా ఉండి, వెంటనే వైద్య సహాయం పొందడం ఎంత ముఖ్యమో కూడా తెలియ జేశాయి.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్ -
ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!
చదువులో రాణించలేకోపోయాడు..అడగడుగునా అవమానం, వైఫల్యమే. ఛీ ఈ బతుకు వద్దనుకున్నాడు..చివరికి దేవుడి స్రిప్ట్ మరోలా ఉంది. పాటే నీగమ్యం అంటూ అందులో రాణించేలా చేసింది. అక్కడితో ఆగక ప్రపంచ పర్యాటకుడిలా మారి మొత్తం ప్రపంచాన్నే చుట్టేశాడు. అది కూడా జస్ట్ ఆరేళ్లలోనే ఈ ఘనత సృష్టించిన తొలి పర్యాటకుడిగా నిలిచాడు. మనం ఒకటనుకుంటే..జీవితం మరోలా నడిపించి..విజేతగా నిలుపుతుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ సంగీత కారుడు. బెంగళూరుకి చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్ తన జీవితకాలంలోనే ఒక గొప్ప ప్రయాణ రికార్డుని ప్రదర్శించి నెట్టింట వైరల్గా మారాడు. మొత్తం 245 దేశాలు సందర్శించాడు. అందుకు నిదర్శనంగా ఆయా దేశాల స్టాంపులు, వీసాలతో సహా మొత్తం 16 భారతీయ పాస్పోర్ట్లను చూపించడం విశేషం. అందుకు సంబంధించిన సేకరణను రికార్డు చేసి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో తన పాస్పోర్ట్ల జాబితా, అంటార్కిటికాతో సహా ఆరు ఖండాల ప్రవేశ స్టాంపులు, వాటిలోని వీసాల ముద్రలతో నిండిన పేజీలతో సహా విపులంగా చూపించాడు. తాను భారత దేశానికి చెందిన వాడినని, అతి తక్కువ సమయంలోనే ప్రతి దేశానికి వెళ్లానని చెబుతుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. కేవలం ఆరేళ్ల, ఆరు నెలల, 22 రోజుల అంటార్కిటికాతో సహా సార్వభౌమ ఆధారిత 245 దేశాలకు వెళ్లాను అని వీడియో క్లిప్లో వెల్లడించాడు ప్రసాద్. అంతేగాదు కొన్ని దేశాలకు వీసా తోపాటు ఇతర పత్రాలు, అందుకోసం ఎదురైన సవాళ్ల గురించి కూడా సవివరంగా వివరించారు ప్రసాద్. స్వతహాగా సంగీతకారుడు కావడంతో సంగీత ప్రదర్శనలు ఇస్తూ మొత్తం 16 పాస్పోర్ట్లను వీసాలు, స్టాంపులు సునాయాసంగా సంపాదించాడు. అయితే ఇందుకు కొంత ఓపిక కూడా అవసరమని అన్నారు. నెటిజన్లు కూడా ఆ 16 పాస్పోర్ట్ల కట్టను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇందుకు ఎన్ని పత్రాలు అవసరమయ్యాయో అని తలుచుకుంటేనే గుండెల్లో వణుకుపుడుతోందంటూ కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు.ఎవరీ బెన్నీ ప్రసాద్..బెన్నీ ప్రసాద్ గిటారిస్ట్ కమ్ ప్రపంచ యాత్రికుడు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. తాను 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించినట్లు పేర్కొన్నారు. కుటుంబంలో తన తరంలో అతనే మొదటివాడు కావడంతో, అతని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుందట అతడి ఫ్యామిలీ. అయితే తన జీవితారంభం అంత బాగాలేదని, తను తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డానని, అందుకోసం కార్టిసోన్ స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాని కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, 60% ఊపిరితిత్తుల నష్టం, నిరంతరం బలహీనపడే రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య సమస్యలు ఎదర్కొన్నానని అన్నారు. ఆ సమస్యలు ఇప్పటికీ తన ప్రాణానికి ముప్పుగానే ఉన్నాయన్నారు. అతడి పేరెంట్స్ తనను చదువులో బాగా రాణించాలని ఆశించారు. ఆ నేపథ్యంలోనే తనకు గణితం, సైన్సు నేర్పించే ప్రయత్నం చేశారని, కానీ అవన్నీ వృధా అయ్యాయని తెలిపారు. దాంతో అవమానం తట్టుకోలేక 16 ఏళ్ల వయసులో చనిపోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాను సంగీతం వైపుకి మళ్లడంతో తన జీవితమే మారిపోయిందన్నారు. అలా బెన్నీ సంగీత ద్వారా ప్రతి ఏడాది మొత్తం 40 నుంచి 50 దేశాలకు ప్రయాణిస్తూ వేలాది మందికి జీవితంపై ఆశను కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు. అంతేగాదు నాలాంటి వాడినే ఉపయోగపడేలా జీవితం మారేస్తే..మీ జీవితాలు ఎందుకు మారవు అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడే మార్చలేనంత చెడ్డవారు లేదా పాపాత్ములు కూడా ఎప్పటికీ ఉండరు అని గుర్తించుకోండి అని చెబుతుంటాడు బెన్నీ ప్రసాద్. View this post on Instagram A post shared by MTP - Most Traveled People (@mosttraveledpeople) (చదవండి: రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..) -
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్లో కుప్పకూలింది!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, టీకా తీసుకున్న వెంటనే మరణం సంభవించినప్పటికీ, టీకానే మరణానికి కారణమని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్, శాస్త్రీయ దర్యాప్తు అనంతరమే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.ఘటన ఎలా జరిగింది?నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు టీకా తీసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తల తిరుగుతోందని చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. పడిపోయే సమయంలో తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.సీసీటీవీలో రికార్డైన ఘటనఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, బాలిక మరణానికి టీకానే కారణమని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు వాటిని ఖండించారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేసిన వివరాల మేరకు.. ప్రస్తుతం టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది టీకా వల్ల వచ్చిన అరుదైన ప్రతికూల ప్రతిస్పందనా? లేక ముందుగా ఉన్న గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా?. లేదా కిందపడినప్పుడు తలకు తగిలిన గాయం కారణమా? అనే కోణాల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.Nashik - A tragic and shocking incident has sent shockwaves through Nashik, where a 17-year-old girl died within minutes after receiving a routine vaccination. Shravani Anil Patil collapsed shortly after being administered the TT vaccine — meant to prevent tetanus, often given in… pic.twitter.com/iBVVxIsTWh— NextMinute News (@nextminutenews7) June 25, 2026టీకా బ్యాచ్ నిలిపివేత.. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు. ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు, బాలికకు ఇచ్చిన అదే టీకా బ్యాచ్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్కు చెందిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే టీకా సీసా నుంచి మరో ఆరుగురికి టీకాలు ఇచ్చారు. వీరిలో నలుగురు గర్భిణులు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నమోదు కాలేదు. అదే టీకా బ్యాచ్కు చెందిన డోసులతో ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 120 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఆరోపణలుమృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం టీకా తీసుకున్న వెంటనే తమ కుమార్తె కుప్పకూలిందని, అందువల్ల ఈ మరణానికి టీకానే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువతి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆరోగ్య శాఖ పలు స్థాయిల్లో విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా యువతికి పూర్తి స్థాయి పోస్ట్మార్టం నిర్వహించారు. రక్తం, ఇతర జీవ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. టీకా బ్యాచ్ నాణ్యతపై ప్రత్యేక ప్రయోగశాల పరీక్షలు జరుగుతున్నాయి. అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం కూడా కేసును విశ్లేషించనున్నారు.ఆరోగ్య శాఖ ఏమంటోంది?ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక నివేదికలు వెలువడే వరకు టీకాలపై అపోహలు సృష్టించవద్దు. టీకాలు ఇప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పోస్ట్మార్టం, ఫోరెన్సిక్, ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాతే బాలిక మరణానికి గల అసలు కారణంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అడవిలో ఆగిన ట్రాఫిక్… సైరన్లేకుండా వీఐపీ ఎంట్రీ!
అడవులు తగ్గిపోతున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి… ఈ రెండు ప్రపంచాలు కలిసిన చోట తరచూ కనిపించేది ఘర్షణే. కానీ అప్పుడప్పుడూ అలాంటి చోటే మనసును తాకే చిన్న మానవత్వపు క్షణాలు కూడా పుట్టుకొస్తాయి. అలాంటి ఓ దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అడవి అంచున ఉన్న ఓ రహదారిపై సాధారణంగా వాహనాలు రద్దీగా వెళ్తున్నాయి. ఆ రోజు కూడా అలాగే ట్రాఫిక్ సహజంగానే సాగుతోంది. కానీ ఒక్కసారిగా అడవి వైపు నుంచి ఓ భారీ దంతం కలిగిన ఏనుగు దాగుడు మూతలాడుతోంది. అది రోడ్డు దాటాల్సిన సమయం. అందుకే అలా!. ఆ క్షణంలో వాహనాల వేగం ఆగిపోయింది… కానీ అది ట్రాఫిక్ జామ్ కాదు, ఒక బాధ్యత ఆగిన క్షణం.అక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డ్ వెంటనే స్పందించాడు. ఎలాంటి ఆలస్యం లేకుండా రోడ్డుమధ్యకు వచ్చి చేతులతో సంకేతాలు ఇస్తూ వాహనాలను నిలిపివేశాడు. సాధారణంగా ఇలాంటి ఆపడం వీఐపీ కాన్వాయ్ల కోసం చూస్తాం. కానీ ఇక్కడ కారణం వేరే. ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి మనిషికి అతను ఒకే సందేశం ఇచ్చాడు.వాహనాలు నిలిచిపోయాయి. ఇంజిన్ల శబ్దం కొద్దిసేపు తగ్గిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఏనుగు ఎలాంటి భయమూ లేకుండా మామూలుగానే రోడ్డుపైకి వచ్చింది. ఎటువంటి ఆందోళన లేకుండా అది ఒక్క అడుగు తర్వాత ఒక్క అడుగు వేస్తూ మరో వైపు అడవిలోకి సాగిపోయింది. మనుషుల ప్రపంచం ఆ క్షణం కోసం పూర్తిగా ఆగిపోయింది.. కానీ ప్రకృతి మాత్రం తన మార్గంలో ప్రశాంతంగా సాగిపోయింది.A forest guard halts traffic, not for a VIP convoy, but for a wild elephant to cross the road.Sometimes the road belongs to those who were here long before us.This is how humans and wildlife can coexist. pic.twitter.com/Dc1aNZWnfU— Manas Muduli (@manas_muduli) June 25, 2026ఈ మొత్తం దృశ్యాన్ని ఒక వాహనంలో నుంచి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను మానస్ ముదులి అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్య కూడా అందరి హృదయాలను తాకింది. “ఇది వీఐపీ కోసం ఆపిన ట్రాఫిక్ కాదు… మన కంటే ముందే ఇక్కడ ఉన్న జీవి కోసం ఇచ్చిన గౌరవం” అన్న భావం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ వైరల్ వీడియో ఎప్పుడు? ఎక్కడ? చిత్రీకరించారనే దానిపై క్లారిటీ లేదు. వీడియోను షేర్ చేసిన మానస్ ముదులి సాధారణంగా ఒడిశా, తూర్పు భారతదేశంలోని వన్యప్రాణుల అంశాలపై పోస్టులు చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో.. యూనిఫాం, రహదారి, అడవి వాతావరణం చూస్తే ఇది ఏనుగుల కారిడార్ ప్రాంతాల్లో తీసిన వీడియోగా తెలుస్తోంది. నెటిజన్లను మాత్రం ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు ఇది నిజమైన మానవత్వం అన్నారు. మరికొందరు మనిషి–ప్రకృతి సహజీవనానికి ఇది చిన్న కానీ బలమైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. ఫారెస్ట్ గార్డ్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ధైర్యంగా, సరైన చర్యగా అభినందించారు. అభివృద్ధి పేరుతో అడవులు కుంచించుకుపోతున్న ఈ రోజుల్లో.. వన్యప్రాణులు తమ సహజ మార్గాల్లో ప్రయాణించడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి చిన్న జాగ్రత్తలే కదా పెద్ద ప్రమాదాలను నివారించేది!. -
విజయ్ Vs స్టాలిన్.. బస్సు ప్రయాణం వీడియోలు వైరల్
చెన్నై: తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులను ప్రారంభించడంతో పాటుగా ఆయన కూడా బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి స్టాలిన్ బస్సులో ప్రయాణించిన వీడియోలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో, విజయ్, స్టాలిన్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం రూ.127 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ స్వయంగా కొత్త బస్సులో ప్రయాణించారు. చెన్నైలో ప్రారంభ కార్యక్రమం అనంతరం మెరీనా బీచ్ వరకు బస్సులో ప్రయాణించిన ఆయన, సాధారణ ప్రయాణికుడిలా కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. టికెట్కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా టికెట్ ఇస్తున్న సమయంలో "చిల్లర ఇవ్వండి" అనేది కండక్టర్ల నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. అయితే సీఎం విజయ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన చిల్లరతో టికెట్ కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.300 new buses inaugurated by CM Vijay today!! pic.twitter.com/X51NeJ2zDE— TVK Mathan (@VMathanRaj29086) June 25, 2026ప్రారంభించిన 300 బస్సుల్లో డీజిల్, సీఎన్జీ వాహనాలు ఉన్నాయి. ఈ బస్సులు చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఆరు రవాణా జోన్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణా సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా నెట్వర్క్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. The reason people rejected MK Stalin and accepted Thalaivar Vijay as the CM ❤ pic.twitter.com/gFlNLKQqkz— George 🍿🎥 (@georgeviews) June 25, 2026 -
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
చప్పట్లు కొట్టే ప్రేక్షకులు లేరు. పెద్ద వేదిక లేదు. కానీ చేతిలో వయోలిన్, హృదయంలో సంగీతం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీధుల్లో దశాబ్దాలుగా వయోలిన్ వాయిస్తూ జీవనం సాగిస్తున్న 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఆయన పరిస్థితికి చలించి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఈ కథ మరింత మందికి చేరింది.పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన భగవాన్ మాలిక్.. యుక్తవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే తండ్రి నేర్పించిన సంగీతమే ఆయనకు ఆధారం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీధుల్లో వయోలిన్ వాయిస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు 80 దాటినా, కంటి చూపు మందగించినా, చేతిలోని వయోలిన్ పాతబడిపోయి శిథిలావస్థకు చేరినా ఆయన సంగీత ప్రయాణం మాత్రం ఆగలేదు.ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో వయోలిన్ వాయిస్తూ కనిపించే మల్లిక్ రోజుకు వంద రూపాయల వరకే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయన భార్య కూడా తరచూ పక్కనే కూర్చొని తోడుగా ఉంటోంది. అద్దె ఇంట్లో జీవిస్తున్న ఈ వృద్ధ దంపతుల పరిస్థితిని.. కంటెంట్ క్రియేటర్ ఆరాధనా చటర్జీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కథనం వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందిస్తూ, “ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా సాయం చేయాలనుకుంటున్నాను. ఆయనకు ఎలా సహాయం చేయాలో వివరాలు కావాలి” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన స్పందనతో మరింత మంది భగవాన్ మల్లిక్ పరిస్థితి గురించి తెలుసుకుని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev— anand mahindra (@anandmahindra) June 24, 2026ఇప్పటికే ఆరాధనా చటర్జీ మల్లిక్కు కొత్త వయోలిన్ను బహుమతిగా అందించడమే కాకుండా, ప్రజల సహకారంతో లక్ష రూపాయల నిధులు కూడా సమీకరించినట్లు వెల్లడించారు. ఒక సాధారణ వీడియోతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వానికి నిదర్శనంగా మారింది. దశాబ్దాలుగా జీవన పోరాటంలో సంగీతాన్ని ఆయుధంగా మార్చుకున్న భగవాన్ మల్లిక్ కథ... ప్రతిభకు వయసు అడ్డుకాదని, నిజమైన కళాకారుడు పరిస్థితులు ఎంత కఠినమైనా తన కళను వదలడని మరోసారి గుర్తు చేస్తోంది. -
పాక్ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్?!
ఇరాన్-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో.. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందా?.. ఇందుకోసం ఆ దేశపు గూఢచారి సంస్థ మొస్సాద్ను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దించారా?.. ఓ బ్రెజిలియన్ జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. పాకిస్థాన్తో పాటు ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం "ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్"గా పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశపు సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ కూడా హాజరయ్యారు.అయితే.. ఈ నేపథ్యంతో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మారియో నాఫల్ నిర్వహించిన పోడ్కాస్ట్లో బ్రెజిలియన్ జర్నలిస్టు, జియోపాలిటికల్ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలకు దిగాడు. మొస్సాద్(Mossad) సంస్థ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాల మేరకు అసీం మునీర్తో పాటు పాకిస్థాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైంది. ఈ విషయమై పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది అని పేర్కొన్నాడు. అంతేకాక.. ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్ చెప్పారు. "మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని ప్రపంచ పటంలో నుంచి చెరిపేస్తాం" అనే సందేశం పాక్ ఇజ్రాయెల్కు పంపిందని ఆయన ఆ పాడ్కాస్ట్లో వెల్లడించారు. మొస్సాద్ అనేది ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలక విదేశీ గూఢచారి సంస్థ. దీని పూర్తి పేరు "ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్". 1949లో స్థాపించబడిన ఈ సంస్థ.. విదేశాల్లో గూఢచర్యం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, రహస్య సమాచార సేకరణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో, ఇజ్రాయెల్కు ముప్పుగా భావించే వ్యక్తులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో మొస్సాద్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన అమెరికా సీఐఏ, బ్రిటన్ ఎంఐ6, రష్యా ఎఫ్ఎస్బీ(గతంలో KGB) వంటి ప్రముఖ గూఢచారి సంస్థల సరసన దీనికి చోటు ఉంది.ఇదిలా ఉండగా, పాకిస్థాన్-ఇజ్రాయెల్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్థాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. గాజా విషయంలోనూ ఇజ్రాయెల్పై పాక్ ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ వస్తోంది. ఈ విషయమై ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పాకిస్థాన్ ‘ఇరాన్-అమెరికా’ చర్చల్లో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా? అనే సందేహాలు ఇజ్రాయెల్ వర్గాలు వ్యక్తం చేశాయి.అయితే మునీర్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే.. ఎస్కోబార్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రముఖ జర్నలిస్టు సయ్యద్ తలత్ హుస్సేన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ "ఇందులో ఒక్క ముక్క నిజం కూడా లేదు. అలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని స్పష్టం చేశారు. ఒక సీనియర్ భద్రతాధికారి కూడా ఈ కథనాన్ని "వక్రీకృత ప్రచారం"గా అభివర్ణించినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి అసీం మునీర్పై మొస్సాద్ హత్యాయత్నం జరిగిందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ఆరోపణగానే ఉంది. -
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ఫీల్డ్తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
వహ్! స్మార్ట్ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్ నేరాలకు సమాధి కట్టారు!!
స్మార్ట్ఫోన్.. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ అదే.. కొన్నిసార్లు వ్యసనంగా మారి కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వ్యసనాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ పల్లెటూరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సైబర్ నేరాలకు దూరంగా ఉంటాం.. వాటి బారిన పడబోం.. అంటూ ఖరీదైన స్మార్ట్ఫోన్లను పగలగొట్టారు ఇక్కడో ఊరి ప్రజలు. పైగా సామూహికంగా వాళ్లంతా ప్రతిజ్ఞ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఉన్న సుఖ్పురి గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో పలువురు యువకులు తమ ఖరీదైన స్మార్ట్ఫోన్లను నేలకేసి కొడుతూ ధ్వంసం చేస్తూ కనిపించారు. మొత్తం 55 ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామంలో స్మార్ట్ఫోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇకపై కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగించాలని నిర్ణయించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా చూడటం, స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తగ్గించడం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రామ పెద్దలు చెబుతున్నారు.నుహ్ జిల్లా ఎస్పీ డాక్టర్ అర్పిత్ జైన్ ఇటీవల నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులు మార్పు దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రభావంతో గ్రామ యువకులు ఈ ప్రతీకాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా హాజరయ్యారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, మార్పు కోరుకునే వారికి అవకాశాలు కల్పించడం కూడా తమ బాధ్యతేనని వారు పేర్కొన్నారు. సాధారణ జీవితంలోకి తిరిగి రావాలనుకునే వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువతలో తప్పుదోవ పట్టే ధోరణి పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు అయితే మొబైల్ ఫోన్ల కారణంగా కుటుంబాల్లో విభేదాలు పెరిగాయని, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని కూడా పేర్కొన్నారు. అందుకే నేర ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని గ్రామం నిర్ణయించింది.నుహ్ జిల్లా గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో గణనీయమైన కేసులు ఈ ప్రాంతంతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కారణంగా కొందరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫిషింగ్ కాల్స్, ఆన్లైన్ మోసాల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.అయితే అదే జిల్లాకు చెందిన సుఖ్పురి గ్రామం మాత్రం వేరే దారి ఎంచుకుంది. స్మార్ట్ఫోన్ను పగలగొట్టడం ద్వారా సమస్య అంతమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే... యువతను నేరాల నుంచి దూరం పెట్టాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచింది. సాంకేతికతతో వస్తున్న సవాళ్లకు తమదైన పరిష్కారం వెతికిన ఓ ఊరు తీసుకున్న నిర్ణయంగా ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. -
వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్గా మారారా?
ఫ్రాన్స్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సంగీతం, సంబరాలు, ఆనందానికి ప్రతీకగా నిలిచే భారీ ప్రజా వేడుకలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఫ్రాన్స్లో జరిగిన తాజా ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. లక్షలాది మంది పాల్గొన్న వార్షిక సంగీత ఉత్సవంలో మహిళలతో అనుచిత ప్రవర్తన, లైంగిక దాడుల ఆరోపణలు, కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఫ్రాన్స్లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ సంగీత ఉత్సవం ఫెటే డీలా ముసిక్యూ(Fête de la Musique) వేడుక ఈసారి విషాదకర ఘటనలతో వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో 145 మంది సూదులతో గుచ్చినట్లు ఫిర్యాదులు చేయగా, మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనల ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.According to reports, several incidents of violence and vandalism occurred last night during the annual "Music Festival" in Paris. pic.twitter.com/08murQ3w8c— Yumiko (@sin3950) June 22, 2026జూన్ 21న నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే వేడుకల సమయంలో అనేక మంది మహిళలు, యువతులు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 145 కేసులు నమోదవగా, వాటిలో 13 ఘటనలు పారిస్లోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించి టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూదుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.Every year, France's Fête de la Musique ends the same way. This year: violence, thefts, sexual assaults, vandalism, and over 240 arrests.THIS TELLS YOU MORE ABOUT THE FRENCH POLITICAL CLASS THAT ENDORSES THE FÊTE THAN IT DOES THE FÊTE DE LA MUSIQUE.pic.twitter.com/ITQIUS8p5u— Steve Hanke (@steve_hanke) June 22, 2026వేడుకలకు ముందు సోషల్ మీడియా వేదికలపై మహిళలను లక్ష్యంగా చేసుకోవాలంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడం ఆందోళన కలిగించింది. ఆ హెచ్చరికల తర్వాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కుట్ర కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరగా, మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 13 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ఫ్రాన్స్లో మహిళల భద్రత, భారీ ప్రజా వేడుకల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు.France’s annual Fête de la Musique was marred by widespread disorder overnight, with authorities making 243 arrests across the country. pic.twitter.com/9BW8oWf2K1— theshadeborough (@theshadeborough) June 23, 2026ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ఫ్రాన్స్ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. వీధులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు సంగీతంతో మార్మోగే ఈ వేడుక ఈసారి మాత్రం భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకప్పుడు సంగీత సంబరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం.. ఈసారి మాత్రం భయం, ఆందోళన, భద్రతా వైఫల్యాల చర్చలకు కేంద్రబిందువుగా మారింది. మహిళల భద్రత, భారీ ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న హింసాత్మక పిలుపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు
యువ డాక్టర్ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు గడిచినా.. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని విన్న బాధితురాలి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. “అధికారం కోసం కాదు.. నా కూతురికి న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హృదయాలను కదిలించాయి.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి Suvendu Adhikari మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజ్ వైద్యురాలి కేసు గురించి మాట్లాడారు..“ఆర్జీ కర్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. బెంగాల్ ప్రజలు అభయకు(బాధితురాలికి పెట్టిన పేరు) న్యాయం జరగాలని ఓటు వేశారు” అని సీఎం ప్రకటించారు.ఈ మాటలు విన్న వెంటనే బాధితురాలి తల్లి.. పానిహటి ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ (Ratna Debnath) భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.A deeply emotional scene in the Assembly. As Ratna Debnath broke down, CM @SuvenduWB Da’s message was clear: Bengal will do justice to victims of RG KAR & punish my culprits. pic.twitter.com/7L62uLGYLQ— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 23, 2026నా కూతురి కోసమే.. ఆర్జీ కర్ కేసులో న్యాయం కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాడిన రత్నా దేవనాథ్.. చివరకు రాజకీయాలనే మరో వేదికగా ఎంచుకున్నారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మహిళల భద్రత, తన కుమార్తెకు న్యాయం అనే అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై 28,836 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రత్నా దేవనాథ్కు 87,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 59,141 ఓట్లు లభించాయి. రాజకీయాల్లోకి రావడంపై ఆమె అప్పట్లో స్పందిస్తూ.. “వ్యవస్థలో ఉండి పోరాడితేనే నా కూతురికి న్యాయం సాధించగలనని భావించాను” అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి న్యాయం జరుగుతుందని ప్రకటించగానే, రెండేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపడింది.ఆనాడు ఘోరంగా..2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్లో.. విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలో లభించింది. దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. జస్టిస్ ఫర్ అభయ పేరిట వైద్య సిబ్బంది అంతా ఉద్యమంలో పాల్గొన్నారు. బాధితురాలి అసలు పేరును వెల్లడించకుండా నిరసనకారులు ఆమెను ‘అభయ’ (నిర్భయ, భయంలేని) అనే ప్రతీకాత్మక పేరుతో సంబోధించారు.కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?ఈ కేసులో కోల్కతా పోలీసులకు చెందిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా దోషిగా తేలాడు. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఈ ఘటన వెనుక మరింత పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఇందులో భాగమయ్యారని, అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బెంగాల్ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే వస్తోంది.ముగ్గురు ఐపీఎస్లపై వేటుతాజాగా ఆర్జీకర్ కేసు స్టేటస్ను సీఎం సువేందు అధికారి అసెంబ్లీలో తెలియజేశారు. కేసు దర్యాప్తులో లోపాల కారణంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన సమయంలో ఆసుపత్రి ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్(Sandip Ghosh) ను కూడా తొలగించినట్లు చెప్పారు. “ఈ కేసులో ఏదీ దాచిపెట్టం. పూర్తి నిజం బయటకు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.ఉపేక్షించేది లేదుఆర్జీ కర్ కేసుతో పాటు హన్స్ఖాలి, కామ్దుని, కస్బా లా కాలేజ్, రాంపూర్హాట్ వంటి పలు అత్యాచార, మహిళలపై దాడుల కేసులను ప్రస్తావించిన సీఎం.. తమ ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రకటించారు. -
అగ్నిపర్వతం బుసలు.. ప్రాణాల కోసం పరుగులు!
Volcan de Fuego.. అమెరికాలో అగ్నిపర్వతం బద్ధలైంది. గ్వాటెమాలాలో అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, పొగ, వేడి లావా వెలువడింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన బూడిద మేఘాలు, పేలుళ్ల వంటి శబ్దాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న పర్యాటకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వివరాల మేరకు.. సెంట్రల్ అమెరికా (Centrel America)లోని గ్వాటెమాలా (Guatemala)లో వోల్కన్ డీఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.#Video 🧗🏽♀️🌋 Circula en redes sociales un video en donde durante el ascenso de un grupo de excursionistas al Volcán de Fuego, en #Guatemala, el coloso registró una erupción repentina que lanzó ceniza, rocas y material volcánico. pic.twitter.com/zhNlXA4lpp— Canal 13 Oaxaca (@canal13oaxaca) June 22, 2026 ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని స్థానికులు తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Guatemala: Drone footage of the first seconds of the Fuego volcano eruption. pic.twitter.com/ClBvGCrmT7— ((Hurkle Durkling)) 🇺🇸 🤟 🇮🇱 (@durklinghurkle) June 22, 2026అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు సూచనలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే ప్రకృతి విపత్తులు ఎంత ఆకస్మికంగా సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.🌋 Lo que comenzó como una excursión terminó en una carrera por la supervivencia.Un grupo de senderistas fue sorprendido por una repentina erupción del Volcán de Fuego, en #Guatemala. Las imágenes muestran cómo los excursionistas corren para ponerse a salvo mientras columnas de… pic.twitter.com/mg6LJ0QfBc— GlobaLAT (@globaLATvideo) June 22, 2026 -
భార్యకు సర్ప్రైజ్.. భర్తకేమో బిగ్ షాక్!
ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్ హాల్లో గానీ కాకుండా నగరంలోని కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్కార్పెట్ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.భార్యను ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్ను పార్టీ హాల్గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.14 మంది అదుపులోకిదర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Businessman Gautam Baruah was detained by Bharalumukh Police on Monday after a video showing a birthday celebration atop the Kumar Bhaskar Varma Flyover in Guwahati went viral on social media.According to police officials, Baruah was summoned for questioning in connection with… pic.twitter.com/TSRHU8nZ2t— Hate Detector 🔍 (@HateDetectors) June 23, 2026కేసులు నమోదుగౌతమ్ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి. -
రూ. 50 రైడ్కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్ ఘరానా దందా
ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.అసలేం జరిగింది?శాను అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు.రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్ చేశారని, అప్పుడు అబ్యాక్గ్రౌండ్లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు.ఇదీ చదవండి: లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్చివరికి ఆ యువకులు బ్రతిమిలాడి, బేరసారాల తరువాత డిరూ. 2,400 చెల్లించడానికి అంగీకరించడంతో ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. ఆ యువకుల వద్ద అంత నగదు లేకపోవడంతో యూపీఐ (UPI) ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఇంజనీర్ శాను ఆ యూపీఐ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ, ఈ డిజిటల్ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు. మరి బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంBangalore auto walas are brutal to innocent people!Hoping to earn their livelihood, two young boys from a village just reached SMVT railway station. They took an auto to Attibele as they wanted to go to Hosur.After the ride, the auto driver demanded ₹3000 just for 35 km???…— Sanu (@SanuThink) June 22, 2026నెటిజన్ల ఆగ్రహంఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుండి బెంగళూరుకు వచ్చే విద్యార్థులు, యువతకుఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తాయని, ఇది నగరం పేరును చెడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Dr Dhivya Dhyana (@drdhivyadhyana)జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇరాన్ అజేయం.. ట్రంప్నకు కునుకు కరువు!
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు.. మరోవైపు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టడమే సవాల్గా మారిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు.. ఇప్పుడు వరల్డ్కప్లో అజేయంగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో ఇరాన్ పోరాటం ఎంత చర్చనీయాంశమవుతుందో.. సోషల్ మీడియాలో ట్రంప్పై వస్తున్న మీమ్స్ కూడా అంతే వైరల్గా మారుతున్నాయి.2026 ఫిఫా వరల్డ్కప్లో ఇరాన్ జట్టు కేవలం ఆటతోనే కాదు.. తమ పట్టుదల, సహనంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గ్రూప్-జీలో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో 2-2తో డ్రా చేసిన ఇరాన్.. తాజాగా బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 0-0తో సమం చేసి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి లేకుండా నిలిచింది.అయితే ఈ ఫలితాల కంటే ఎక్కువగా చర్చకు కారణమైనది ఇరాన్ జట్టు ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులే. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిమితుల కారణంగా జట్టుకు అమెరికాలో పూర్తిస్థాయిలో బస చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఇరాన్ జట్టు మెక్సికోలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకుని, ప్రతి మ్యాచ్ కోసం సరిహద్దు దాటి అమెరికాకు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే..కఠిన భద్రతా తనిఖీలు, ప్రయాణ ఇబ్బందులు, యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే బెల్జియంతో మ్యాచ్ ముగిసిన తర్వాత లాస్ ఏంజెలెస్ స్టేడియం లాకర్రూమ్లో ఆటగాళ్లు వదిలి వెళ్లిన ఓ భావోద్వేగ లేఖ వైరల్గా మారింది. “మేం గౌరవంగా బయలుదేరుతున్నాం” అంటూ అందులో పేర్కొన్న సందేశం అభిమానులను కదిలించింది.ఇరాన్ ప్రధాన కోచ్ అమీర్ ఘాలెనోయీ కూడా జట్టు పరిస్థితిని వివరించారు. “గత ఆరు నెలలు యుద్ధ వాతావరణంలో గడిచాయి. దేశీయ లీగ్ సక్రమంగా జరగలేదు. అనేక జట్లు మాతో స్నేహపూర్వక మ్యాచ్లు ఆడటానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్కు వచ్చి రెండు మ్యాచ్ల్లో ఓడిపోకుండా నిలవడం గొప్ప విజయమే” అని వ్యాఖ్యానించారు.pic.twitter.com/kQUwdEcCR4— BeeCeeForty5 🐐 (@BeeCeeForty5) June 21, 2026ఇక సోషల్ మీడియాలో అయితే ఈ విజయానికి మరో కోణం జత అయ్యింది. అమెరికాతో రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్న వేళ.. “అమెరికా గడ్డపై ఇరాన్ అజేయం”, “ట్రంప్కు నచ్చని రికార్డు ఇదే”, “ఇరాన్ అమెరికా నేలపై ఓటమి తెలియని జట్టు”, ‘‘ఆయనకు ఈ వార్త నచ్చదేమో’’ అంటూ నెటిజన్లు మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు.ప్రస్తుతం రెండు మ్యాచ్ల్లో రెండు పాయింట్లతో ఉన్న ఇరాన్.. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్ల్లో ఏమవుతుందో పక్కనపెడితే.. అన్ని అవరోధాల మధ్య అమెరికా గడ్డపై అజేయంగా నిలవడం ద్వారా ఈ ప్రపంచకప్లో ఇరాన్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.donald trump writing a felony against iran pic.twitter.com/yyvpw9UjBy— 𝖔𝖗𝖊. (@oretrafford) June 21, 2026Iran just made the host country's soil their personal playground lmaoo this is too funny 😭 pic.twitter.com/jtSmaFGtJR— ColdRevs 🏎️ (@ColdRevs) June 21, 2026రాజకీయంగా ఒత్తిళ్లు, భద్రతా సవాళ్లు, ప్రయాణ కష్టాలు.. అన్నింటినీ అధిగమించి ఇరాన్ జట్టు వరల్డ్కప్లో నిలబడిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైదానంలో సాధించిన ఈ ‘అజేయ’ ప్రయాణం.. ట్రంప్ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా సెటైర్లకు కూడా కారణమవుతోంది. ఇరాన్ తదుపరి మ్యాచ్లో ఏమి చేస్తుందన్నదానికంటే.. ఇక్కడివరకు ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద కథగా మారింది. -
బిత్తర పోయిన పాక్ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand… pic.twitter.com/NVWAxr8NMH— Amjad Taha أمجد طه (@amjadt25) June 21, 2026ముందుగా నిర్ణయించిన హ్యాండ్షేక్, జాయింట్ ఫోటో సెషన్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోటో-ఆప్ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్ బృందం వేదిక నుంచి వాకౌట్ చేయడంతో షెహబాజ్ షరీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ను పలకరించి జేడీ వాన్స్ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్ ప్రతినిధి చేసిన పనితో పాక్ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్ మీడియాలో “ప్రోటోకాల్ స్నబ్”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.Watch Qatar snub Vance. So embarrassing. pic.twitter.com/RWSpcsL5IU— 🇺🇸 Pamela Geller 🇮🇱 (@PamelaGeller) June 21, 2026ఇక.. మీటింగ్ హాల్లోకి ఇరాన్ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనా?”, “ఇరాన్ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్గా మారాయి.అయితే మరోవైపు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తం మీద, స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. -
తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్లోనే అరుదైన ఘటన
చెన్నై: తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తుత్తూకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ (Funnel Cloud) కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని "టోర్నడో అలీ" ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తుత్తూకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.Fascinating view of rare tornado taken from #Thoothukudi Airport parking space. The Tornado emerged at Vagaikulam recks damage to a toll plaza on Thoothukudi - Tirunelveli National Highway, before disappearing at airport. @xpresstn @NewIndianXpress #Tornado pic.twitter.com/wWhOhIJy6u— Godson Wisely Dass (@tnie_godson) June 21, 2026ఆదివారం సాయంత్రం తూత్తుకుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత (Atmospheric Instability), తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండటంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తిస్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీని వల్ల టోల్ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. தூத்துக்குடி: வாகைகுளம் பகுதியில் சுழல் காற்று.. வைரலாகும் காட்சிகள். அரிதினும் அரிதான நிகழ்வு என சுயாதீன வானிலை ஆய்வாளர் பிரதீப் ஜான் பதிவு#Thoothukudi | #Tornado pic.twitter.com/8PBBwrp8ub— PttvOnlinenews (@PttvNewsX) June 21, 2026టోర్నడో అంటే ఏమిటి?టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం (Thunderstorm Cloud) నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాకినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.Thoothukudi Airport 😯😲 💥 pic.twitter.com/9O9mp6JOQI— Amutha (@Amutha74247715) June 22, 2026#WATCH | Thoothukudi, Tamil Nadu | Strong cyclonic winds cause heavy damage in the region.(Visuals from the Vaagaikulam toll plaza area) pic.twitter.com/39TfpIilzs— ANI (@ANI) June 22, 2026 -
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
50 ఏళ్ల వయసులో కాలేజ్కి వెళ్తున్న మహిళ..!
చదువుకి వయసు పరిమితి కాదని చాలామంది నిరూపిస్తున్నారు. అదే కోవలోకి మరో మహిళ వచ్చింది. అందుకు సంబంధించి వీడియోని నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో ‘గైస్ ఈ రోజు నాకు పరీక్ష ఉంది’ అంటూ మొదలవుతుంది. ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న విద్యార్థులతో పరీక్ష కేంద్ర వైపుకి వెళ్తున్నట్లు చెబుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం చదువు వదిలేసిన ఆమె పరీక్షకు సిద్దమవుతున్నప్పుడు సహజంగా విద్యార్థులు పడినట్లుగానే చిన్నపాటి టెన్షన్ ఉందని చెబుతోంది వీడియోలో. తను బ్యాక్లాగ్ పేపర్ ఒకటి క్లియర్ చేయడానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె ఈ వీడియోకి ‘చదువుకోవడానికి వయసు పరిమితి కాదు’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. అంతేగాదు సుదీర్ఘ విరామం తర్వాత చదువుని కొనసాగించినందుకు చాలామంది ఆ మహిళను ప్రశంసించారు. మరికొందరు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని, నేర్చుకోవడానికి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ఆలస్యం కాదని ఆమె ఉదంతం నిరూపిస్తోందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Manju narang (@student_at_50) (చదవండి: మేమున్నాం అనే భరోసా చాలు) -
‘మోగ్లీ గర్ల్’ పూజ ఇక లేదు
అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్ (18) ఇక లేదు.చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్ అలియాస్ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్ 15నే మరణించిందట. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. అయితే జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.ఎహ్సాస్ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.ఎహ్సాస్ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు."ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘మోగ్లీ గర్ల్’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది. -
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
సోషల్మీడియాలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్ లంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్పై విన్యాసాలు చేయడం చూశారా? తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్ చేశారు. రన్నింగ్ బైక్పై బైక్ హ్యాండిల్ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.రన్నింగ్ బైక్పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు. View this post on Instagram A post shared by Viral Controversy (@viralcontroversy) నెటిజన్ల ఫన్నీ కామెంట్స్"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్ చేశారు.నోట్ : అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి. సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు ఏదో థ్రిల్ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్కు వెళ్లి లెన్స్లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.షాపింగ్ అనుభవం ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్లోని ఆప్టికల్ స్టోర్కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.నెటిజన్లు ఏమన్నారంటేఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు. కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు -
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని.. -
జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్లోని ఎవియాన్ లే బైన్స్లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు సదస్సులో పాల్గొననున్నాయి. అదీగాక ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సదస్సుకి ఓ తొమ్మిదేళ్ల చిన్నారి రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాపం అమె కెమెరా కంట పడకుండా ఉండేందుకు పడుతున్న తపన అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..ఆ ముద్దలొలికే పాప ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూమార్తె. ఫ్రాన్స్లో ఇటీవల జరుగుతున్న G7 సదస్సులో ప్రధాన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ఒక రసవత్తరమైన క్షణం ఎదురైంది. అందుకు సబంధించిన వీడియో అందరి హృదయాలను తాకింది. అంతేగాదు కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి రాకకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యి ఎవరా అమ్మాయ్ అని చర్చలు మొదలయ్యాయి. రాజకీయ చర్చలకు అతీతంగా ఆ చిన్నారే హాట్టాపిక్గా మారడం విశేషం. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని మెలోని రాగానే అధికారులకు, స్వాగత ప్రతినిధి బృంద సభ్యులకు అభివాదం చేశారు. ఆమె వెనుక నిశబ్దంగా ఉన్న గినెవ్రా జియాంబ్రూనె కెమెరాల ముందు సిగ్గుపడుతూ..తల్లి చెంత ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అయితే నెటిజన్లు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమార్తెను వెంటబెట్టుకుని అమ్మగా రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు మెలోనిపై ప్రశంసలపై వర్షం కురిపించారు. తల్లిదండ్రులుగా మారిన ప్రపంచనాయకులంతా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారు కదా అంటూ పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉంది. ఆమెకు సురక్షితమైన ప్రదేశం ఏదో బాగా తెలుసు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Giorgia Meloni's daughter steals the spotlight by avoiding itItaly's PM's shy sidekick goes viral for hiding behind her mom as they arrive at the G7 summit in Geneva pic.twitter.com/n8gmg93Cfi— RT (@RT_com) June 17, 2026 (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది. -
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు. -
‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..
ఓ అమ్మాయి కెరీర్, అభిరుచుల పరంగా సక్సెస్ అయినా ఆమె అమ్మమ్మ మాత్రం తన కారణంగా ఏదో కోల్పోయానంటూ బాధపడిపోయిందంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాపం ఆ అమ్మమ్మ చెప్పిన కారణం విని ఆమెకు చాలా హాస్యస్పదంగా ఉండటమే కాదు ఆ రెండు అక్షరాల పదం మందు ఆ అమ్మాయ్ విజయాలన్ని వృధాగా మారిపోవడం విచిత్రం. ఒక రకంగా ఈ పోస్ట్ మహిళల వ్యక్తిగత గుర్తింపుకి ఏ మాత్రం విలువ ఉండదా అనే విషయం తెరపైకి తీసుకొచ్చింది. అంతేగాదు ఆడపిల్లకు వివాహ బంధమే ముఖ్యమా అనే దానిపై ఆలోచింపచేసేలా క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో సంభాషణ. ఆ అమ్మాయే భారత సంతతి మహిళ హేమాక్షి మోట్కా. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.ఆ వీడియోలో హేమాక్షి భారత దేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ తన గురించి వివరించారామె. భారత్లో ఒక కార్యక్రమానికి తన అమ్మమ్మ హాజరైందని అక్కడ కేవలం "పెళ్లైన కుమార్తెలకు" మాత్రమే సాంప్రదాయ బహుమతులుగా దుప్పట్లు లభించడంతో ఆమె అమ్మమ్మ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. ఇదంతా ఎందుకంటే తనకింక పెళ్లికాకపోవడంతో అమ్మమ్మ ఆ దుప్పటి అందుకోలేకపోయానంటూ తన ఆవేదన వెలిబుచ్చిందని తెలిపింది. తనకు పెళ్లి కాలేదన్న కారణంగానే ఒక్క దుప్పటి కూడా అందుకోలేకపోయానని బాధపడుతోందామె. కానీ నాకు అది ఎంతో సిల్లీగా అనిపించింది. తాను అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో కోట్లాది రూపాయ కంపెనీ నిర్మించాను, సీఈవోని, పైగా 42 కిలోమీటర్ల మారథాన్ని విజయవంతంగా పూర్తి చేశా. ఇంత సక్సెస్ని అందుకున్నా.. కానీ జస్ట్ ఒక లాంఛనప్రాయమైన దుప్పటి కోసం కోల్పోయాను కాబోలు అంటూ నవ్వేసిందామె. అంతేగాదు ఇది తనపై అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధే కావొచ్చు..కానీ మహిళలకు వ్యక్తిగత గుర్తింపును త్యాగం చేయొద్దని హెచ్చరిస్తూ ఇలా పేర్కొంది. నాకు మా అమ్మమ్మ మాటలు నవ్వు తెప్పించినా.. మహిళలుగా మనం ఎంచుకున్న రంగంలోని విజయాలను జరుపుకోవాలి. పెళ్లి అనేది ఒక ప్రతిపాద, ఆమోదం అంతే. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని..మంచి కెరీర్ని నిర్మించుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, స్వంతంగా డబ్బు సముపార్జించాలి. గర్వపడే జీవితాన్ని సృష్టించుకోవాలి. అందుకు తగ్గట్టుగా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ న్యూయార్క్ కంపెనీ సీఈవో అంటూ తన సంభాషణను ముగించింది. అంతేగాదు ఆ వీడియోలో మన హోదాకి విలువలేకపోవచ్చు, ఇతరుల అభిప్రాయాలు మారవచ్చు.. కానీ మీపై మీకు సడలని ఆత్మవిశ్వాసం ఉండాలి, దుప్పటి బాగుంటుందేమో..కానీ మీ వెంట వచ్చేది, మిమ్మల్ని నిలబెట్టేది ఆత్మవిశ్వాసమే. అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దదతిస్తూ.. ఆట మార్చేయండి. మీకు నచ్చిన పనులను మీ పద్ధతిలో చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hemakshi Motka (@hemakshi126) (చదవండి: 90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..) -
ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!
ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్ జాబ్స్ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్ను సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్ హౌస్ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు. View this post on Instagram A post shared by Nishant Tomar Realtor (@nishant.in.australia) నిశాంత్ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్ వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష -
రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!
ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ స్టోరీలను చదువుకున్నాం. ఎంతోమంది విజయగాథలను తెలుసుకుని స్ఫూర్తి పొందాం. కానీ కష్టం ఎక్కువ, సంపాదన తక్కువ అయినా కూడా తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతో గౌరవంగా, హుందాగా జీవనం సాగిస్తున్న 82 ఏళ్ల పెద్దాయన గురించి తెలుసుకుందాం.ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ద్వారా మన్సుఖ్ కాకా కథ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈయన నైజం, కష్ట పడేతత్వం నెటిజనులను ఆలోచింపచేస్తోంది.ముంబైకి చెందిన 82 ఏళ్ల మన్సుఖ్ కాకా కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఆయన ప్రతిరోజూ 12 గంటల పాటు ఫుట్పాత్పై చిరుతిళ్లు (ఫర్సాన్) అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మన్సుఖ్ కాకా తన జీవితంలో ఎక్కువ భాగం ఒక చీరల దుకాణంలో సేల్స్మ్యాన్గా పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన అనారోగ్యానికి గురవడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ సమయంలో ఆయనను చూసుకోవడం కోసం ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, ఆయనఇతరులపై ఆధారపడకుండా, ఏదో ఒక చిన్న పని అయినా చేసుకొని జీవించాలని నిర్ణయించు కున్నారు. తన ఇంటికి సమీపంలోని ముంబై ఫుట్పాత్పై సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.అదీ తన సోదరి సాయంతో. ఆమె ఇంట్లోనే తాజా ఫర్సాన్ లేదా మురుకులు (సాల్టీ, సేవరీ స్నాక్స్) తయారు చేసి ఇస్తారు. మన్సుఖ్ కాకా వాటిని ప్యాకెట్లుగా చేసి తన స్టాల్కు తీసుకొచ్చి అమ్ముతారు. ఇలాసంపాదించేది ఎంతో తెలుసా? ఇలా రోజుకి 12 గంటలు శ్రమిస్తున్నప్పటికీ, ఆయనకు రోజుకు లభించే ఆదాయం కేవలం రూ. 300 మాత్రమే. అయినా ఆయన ఏ విచారం లేదు.ఎంతో నిబద్ధతగా పనిచేసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రతి చిన్న ఖర్చును, అమ్మకాలను ఒక చిన్న డైరీలో లెక్క రాసుకుంటూ ఉంటారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.నెటిజనుల ప్రశంసలు"ఈ వయసులో కూడా మన్సుఖ్ కాకా ఎంతో నమ్మకంతో, కష్టపడి తన స్టాల్ను నడుపుతున్నారు. మనమందరం కలిసి ఆయనకు మద్దతు ఇద్దాం" అని ఆరాధన ఛటర్జీ టిజన్లను కోరారు.మరోవైపు ఆయనపై పలువురు ప్రశంసలు కురిపించారు. నీట్గా ఇన్ షర్ట్ చేసుకొని, ప్రొఫెషనల్గా, చిరునవ్వుతో కస్టమర్లను ఆదరించడం సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు. ఆయనను కలిసిన వారు "ఆయన ఎంతో వినమ్రుడు, దయాగుణం గలవాడు" అని కొనియాడుతున్నారు. ముంబై ప్రజలు ఆయన స్టాల్కు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసి ఆయనకు మద్దతుగా నిలవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంట్లో మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన ఆయన కారణాలేమైనప్పటికీ రోజూ ఇలా కష్టపడటం చూస్తే మనసు ద్రవించక మానదు. మన జీవితంలో తారసపడే ఇలాంటి వారికి మన వంతుగా చేయూత నిద్దాం! ఏమంటారు? -
శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్!
పరమ శివుడి అనుగ్రహం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేసిన మునులు, మహర్షుల గురించి విన్నాం. కానీ కలియుగ భారతంలో శివానుగ్రహం కోసం ఏకంగా పుష్కరం కాలం నిలబడి పోయిన వైనం నెట్టింట వైరల్గా మారింది. హర్యానాకు చెందిన సాధువు 'దులాల్ గిరి జీ మహారాజ్' కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.కొన్ని నివేదికల ప్రకారం ఆ సాధువు కనీసం కూర్చోకుండా 12 ఏళ్ల నుంచి నిలబడే దీక్ష సాగిస్తున్నారు. గడిచాయి.'తాజా టీవీ' (Taaza TV) ప్రకారం, దులాల్ గిరి జీ మహారాజ్ శివుని సేవలో తరించడానికి చిన్న వయసులోనే యూనివర్సిటీ చదువును వదిలిపెట్టారు. హిందూ సాధువులలో సాధారణంగా కనిపించే వేషధారణలో, పైభాగంలో ఎలాంటి అచ్ఛాదన లేకుండా తలపై జడలతో నడుము చుట్టూ కాషాయ వస్త్రంతో కనిపిస్తున్నారు. ఒక వీడియోలో గొలుసులతో పైకప్పు నుండి వేలాడుతున్న ఒక చెక్క పలకపై తన శరీరాన్ని ఆనించి ఉండగా, ఆలయ వాలంటీర్లు అతని కాళ్లకు లేపనం రాస్తున్నారు. మరో వీడియోలో కాషాయ వస్త్రాల్లో కేవలం గోడకు ఆనుకుని ఉండడం కనిపిస్తోంది. దీంతో అసలు ఈ సాధువు నిజంగానే శివుడికోసం దీక్ష చేస్తున్నారా? లేక అనారోగ్య కారణాలతో ఇలా మారిపోయారా అనేదానిపై పూర్తి స్పష్టత లేదు. ఈవీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం గమనార్హం.In India, a man has been standing in one place for five years as a vow to the god ShivaHe does not sit or stretch his legs and sleeps while supported by a special harness.His legs have become severely swollen and darkened due to poor blood circulation, and temple volunteers… pic.twitter.com/fc0rIttXJ1— NEXTA (@nexta_tv) June 14, 2026ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఆయన కాళ్లు వేళ్ల నుండి పిక్కల వరకు నల్లగా మారిపోయాయి, తీవ్రంగా వాచిపోయి ఉన్నాయి. ఈయన్ని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశాడు. కొంతమంది నెటిజన్లు సాధువు అంకితభావాన్ని, క్రమశిక్షణను ప్రశంసిస్తూ, ఇది విశ్వాసానికి ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుశా అతని కాళ్లకు ప్రమాదకరమైన గాంగ్రీన్ సోకి ఉంటుందని, ఇలాగే కొనసాగితే, కాళ్లను తొలగించాల్సి వస్తుంద అంటే, ఆయన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. -
అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష
ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది. దేశంల నిరుద్యోగులు, గిగ్ ఎకానమీపై పెద్ద చర్చకు దారితీసింది. 'జిప్ ఎలక్ట్రిక్' (Zypp Electric) ఫౌండర్, సీఈఓ ఆకాష్ గుప్తా, తాజాగా తాను ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్తో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.ఆకాష్ గుప్తా షేర్ చేసిన వివరాల ప్రకారం ఆ క్యాబ్ డ్రైవర్ గతంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగం చేస్తూ నెలకు కేవలం పాతికవేల రూపాయలు సంపాదించేవాడు. అది ఏ మూలకు రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయి క్యాబ్ డ్రైవర్గా మారిపోయాడు. ఫలితంగా ఇప్పుడు నెలకు రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు. అలాగే తాను చేసే పని మీద తనకు పూర్తి నియంత్రణ లభించిందని అతను ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత పని చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ తన జీవితాన్ని మార్చేసింద న్నాడు. రోజుకు 10 గంటలు పనిచేస్తూ రూ.3 నుంచి రూ.4 వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పాడు ఈ పరిణామాన్ని ఆకాష్ గుప్తా దేశంలో ఎదుగుతున్న "గిగ్ ఎంట్రప్రెన్యూర్స్" (భారత్ కా నయా మిడిల్ క్లాస్) కు ఉదాహరణగా అభివర్ణించారు. అంతేకాదు సొంతంగా వాహనాన్ని, సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ సంపాదిస్తున్నందున, ఇకపై ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు తనను తాను ఒక బిజినెస్మ్యాన్గా చెప్పుకోవాలని ఆకాష్ గుప్తా ఆ డ్రైవర్కు సూచించారు. గిగ్ వర్కర్లు కేవలం డెలివరీ పార్టనర్లు మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకునే మైక్రో-ఎంట్రప్రెన్యూర్స్. వీరే తదుపరి మధ్యతరగతి వర్గం అని గుప్తా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash)ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?నెటిజన్ల స్పందన ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. గిగ్ వర్కర్లందరినీ గౌరవించాలి ఒకరు, అతని స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకం అని మరొకరు కమెంట్ చేశారు. గతంలో ఉద్యోగం ద్వారా నెలకు రూ. 70 వేలు సంపాదించే తాను, ఇపుడా ఉద్యోగం వదిలేసి కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఉద్యోగం కంటే ఎక్కువే సంపాదిస్తున్నాను, అన్ని ఒత్తిళ్ల నుంచి దూరంగా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.కాగా జిప్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడైన ఆకాష్ గుప్తా, ఆన్లైన్లో కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందారు. ఆయన తరచూ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇదీ చదవండి: మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
మెటా, టిక్టాక్పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ
రెండువైపులా పదునున్న కత్తి సోషల్ మీడియా. సోషల్ మీడియా యాప్స్ను స్క్రోలింగ్ అనేది పిల్లలు పెద్దలు తేడా అనే లేకుండా ఒక వ్యసనం లేకుండా మారిపోయింది. సోషల్ మీడియా అల్గారిథమ్తో యువతపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు. సోషల్ మీడియా సంస్థలపై ఉమ్మడి చట్టపరమైన చర్యలు ఇటలీలో తల్లిదండ్రులు చేస్తున్న న్యాయపోరాటం ఈ విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఐరోపా అంతటా డిజిటల్ ప్లాట్ఫారమ్లపై విమర్శలు తీవ్రమవుతున్నారు. మరోవైపు ఇటీవలే బ్రిటన్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో ఇది మరింత ప్రాధాఘ్యతను సంతరించుకుంది. 12 ఏళ్ల బాలిక రోసెల్లా ఆత్మహత్య వెనుకున్న అత్యంత విషాదకరమైన విషయాలగురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో విపరీతంగా ఆత్మహత్య , డిప్రెషన్కు సంబంధించిన కంటెంట్ను చూసిన తర్వాత తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని రోసెల్లా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆమె మరణం తర్వాతే తల్లి ఇరీన్ రొగ్గెరో ఉగ్వెస్, ఆమె భర్త రోసెల్లా డివైజ్లను అన్లాక్ చేశారు. దీంతో విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిగురించి ప్రపంచాన్ని హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు.విషయం ఏమిటంటే..తమ కుమార్తె రోసెల్లా సోషల్ మీడియాను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా ఆమె ఒక రహస్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను వాడుతోందనీ, అందులో 'o'కు బదులుగా 'zero'తో 'Just a dead pers0n' అనే పేరుతో అకౌంట్ను నడుపుతోందని గమనించారు.2023 సెప్టెంబర్లో రోసెల్లా తన మానసిక స్థితికి తగ్గట్టుగా డిప్రెషన్ కంటెంట్ కోసం వెతకడం ప్రారంభించగానే, సోషల్ మీడియా అల్గారిథమ్లు ఆమెకు అలాంటి కంటెంట్నే పదే పదే చూపించాయనీ, కేవలం ఐదు నెలల్లోనే (2024) ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.ఈ వ్యవహారంపై రోసెల్లా తల్లిదండ్రులతో పాటు ఇటలీలోనిమరికొన్ని కుటుంబాలు కలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) , టిక్టాక్ (TikTok)లపై కోర్టులో కేసు వేశారు. మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్పై కఠినమైన పరిమితులు విధించాలని, దీనివల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆ అల్గారిథం లేకపోతే, ఆమె వేదన - లేదా సైకోసిస్, లేదా మానసిక బాధను, లేదా అంతకుమించి మరేదైనా గానీ తానుతన కూతురికి జరిగిన ఘోరం మరే ఇతర బిడ్డకు జరగకూడదని, సోషల్ మీడియా వెనుక ఉన్న సాంకేతిక ప్రమాదాల గురించి మిగతా తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికే తాను ఈ న్యాయపోరాటంలో చేరానని రోసెల్లా తల్లి ఇరేన్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను మెటా, టిక్టాక్ సంస్థలు తిరస్కరించాయి. తాము టీనేజర్ల రక్షణ కోసం 'టీన్ అకౌంట్స్' హానికరమైన కంటెంట్ను తొలగించే ఫిల్టర్లను ఉపయోగిస్తున్నామని, యువత మానసిక ఆరోగ్యం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయని అవి పేర్కొన్నాయి. యూజర్ల మానసిక, ప్రవర్తనా ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడం తమ ప్రయత్నాలలో భాగమని టిక్టాక్ (ఇండియాలో నిషేధం) తెలిపింది. ఆ నిబంధనలను ఉల్లంఘించే 99శాతం కంటే ఎక్కువ కంటెంట్ను తాము తొలగిస్తున్నట్లు కూడా పేర్కొంది. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు, ఏకాగ్రత పూర్తిగా నశిస్తున్నాయని ఉదాహరణలతో చెప్పారు.24 గంటలూ ఓ కన్నేసి ఉంచడం సాధ్యమా?పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని 24 గంటలూ గమనించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదని పెద్ద కుటుంబాల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు ఇంటర్నెట్లోని ట్యుటోరియల్స్ చూసి తల్లిదండ్రులు పెట్టే ఫిల్టర్లను లేదా సమయ పరిమితులను సులభంగా దాటేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?నిపుణులేమంటున్నారు? సోషల్ మీడియాలో వచ్చే ప్రతి 'లైక్' లేదా 'నోటిఫికేషన్' మెదడులో డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుందని, ఇది స్లాట్ మెషీన్ల (జూదం) లాగా పిల్లలను వ్యసనపరులుగా మారుస్తుందని నిపుణులు కోర్టుకు తెలిపారు. అతిగా సోషల్ మీడియా వాడటం వల్ల టీనేజర్ల మెదడు అభివృద్ధి దెబ్బతింటుందని, నిద్రలేమి,మానసిక సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్మరో కోణంఅయితే కొంతమంది సైకాలజిస్టులు కేవలం సోషల్ మీడియాని మాత్రమే బ్లేమ్ చేయలేమని, పిల్లలపై మితిమీరిన నియంత్రణ కంటే వారితో మాట్లాడటం, వారిని నమ్మడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా! -
అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!
స్విట్జర్లాండ్లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్ కలగకమానదు.స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట. గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. -
ఇన్స్టాగ్రామ్లో ‘మనదే’ అంతా!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది.Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN— Jash (@jeetcasm) June 16, 2026మీమ్ నుంచి గ్లోబల్ క్రేజ్ దాకా.. మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Melodi అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్ట్యాగ్ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.మెలోనీకి టాఫీలు!ఈ మెలోడీ ఫినామినన్ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.వైరల్ కెమిస్ట్రీఅంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ కపుల్" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్ అయ్యింది. -
కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా?
తరాలు మారినా.. టీవీ సీరియళ్ల సాగదీతలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైపెచ్చు.. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రేక్షకుల అభిరుచులను మార్చేసినా, కొన్ని సీరియళ్లలో మాత్రం అదే అతి, అదే అసహజ మలుపులు, అదే విషపూరిత సంబంధాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కన్నీళ్లు, కుట్రలు, కుటుంబ కలహాలతో నిండిపోయిన కథలు.. ఇప్పుడు హింస, అవమానాలు, మానసిక వేధింపులను కూడా "ప్రేమ"గా చూపించే స్థాయికి చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి విమర్శలకు తాజాగా మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్ కేంద్రబిందువైంది. కుటుంబ కథ పేరుతో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో భర్త చేతిలో భార్యకు జరిగే శారీరక, మానసిక హింసను రొమాంటిక్గా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ప్రేమ కాదు.. గృహహింస" అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.వివాదానికి కారణమైన సీన్కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్లో.. ఇటీవల ప్రసారమైన ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కథానాయకుడు ధీరజ్.. కథానాయిక రాజ్జీని తోసేయడం, చెంపదెబ్బ కొట్టడం, ఆమెను మంచంపై బలవంతంగా అదిమిపట్టడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్జీ చేయి వేడిగా ఉన్న ఇస్త్రీకి తగిలి కాలిపోతుంది. నొప్పితో ఆమె కేకలు వేస్తుండగా, ధీరజ్ ఆమె నోరు మూసేస్తూ తనకు ఆమెపై ప్రేమ కాదని, ద్వేషమే ఉందని చెబుతాడు.సాధారణంగా చూస్తే ఇది ఇద్దరి మధ్య ఘర్షణను చూపించే సన్నివేశంలా కనిపించవచ్చు. కానీ దాన్ని చిత్రీకరించిన తీరు, పాత్రల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.నెట్టింట రియాక్షన్లు.. సన్నివేశం ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది.ఇది ప్రేమ కాదు.. హింసఆమెను తోశాడు.. కొట్టాడు.. నీళ్ల బకెట్ పోశాడు.. ఇప్పుడు ఇస్త్రీతో కాల్చేశాడు. ఇదంతా చేసి దాన్ని ప్రేమగా చూపిస్తున్నారా? They’re romanticizing abuse 🙂- pushed her around- slapped her- dumped a bucket of water on her- now burned her with an iron and he’s covering her screams in the name of romance??? End this crap !!! #MahadevandSons pic.twitter.com/qzNy2z4sQT— anj (@cokerantx) June 16, 2026గృహహింసను రొమాన్స్గా చూపించడం అత్యంత బాధ్యతారాహిత్యం మరికొందరు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. భర్త ఎంత హింసించినా భార్య భరించాలి.. చివరకు అతడిని క్షమించాలి అనే సందేశాన్ని ఇలాంటి సీరియళ్లు ఇస్తున్నాయి అంటూ విమర్శించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా ఈ కార్యక్రమాలను చూస్తారని, ఇలాంటి సన్నివేశాలు సంబంధాలపై తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అసలు సమస్య ఇదే!ఈ వివాదం కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లలో "టాక్సిక్ రొమాన్స్" అనే ధోరణిపై విమర్శలు పెరుగుతున్నాయి. కోపం, అధికారం చెలాయించడం, మానసిక వేధింపులు, అవమానించడం, కొన్నిసార్లు శారీరక హింసను కూడా ప్రేమలో భాగంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.సామాజిక వర్గాల అభిప్రాయం ప్రకారం, హింసను హింసగానే చూపించాలి. కానీ దాన్ని ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం పేరుతో సమర్థించేలా చూపించడం ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి కథనాలు విషపూరిత సంబంధాలను కూడా సాధారణం అనే భావనను కలిగించే అవకాశం ఉంటుంది.మరోవైపు వాదనఅయితే ఈ విమర్శలతో అందరూ ఏకీభవించడం లేదు. కొందరు ప్రేక్షకులు మాత్రం సన్నివేశాన్ని సందర్భం నుంచి వేరు చేసి చూస్తున్నారని వాదిస్తున్నారు. ధీరజ్ ఉద్దేశపూర్వకంగా రాజ్జీని కాల్చలేదని, కథలోని సంక్లిష్టమైన భావోద్వేగ సంఘర్షణను చూపించడానికే ఆ సన్నివేశాన్ని ఉపయోగించారని చెబుతున్నారు.సీరియళ్లకు హద్దులుండాలా?టీఆర్పీల కోసం సంచలన సన్నివేశాలు చూపించడం కొత్త విషయం కాదు. కానీ గృహహింస, మానసిక వేధింపులు, విషపూరిత సంబంధాలను ప్రేమగా లేదా కుటుంబ బంధాల పేరుతో సమర్థించేలా చూపిస్తే అది కేవలం వినోదం పరిధిలోనే మిగిలిపోదని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత సాధారణంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం మహాదేవ్ అండ్ సన్స్పై జరుగుతున్న వివాదం ఒక సీరియల్ను దాటి పెద్ద చర్చకు దారి తీసింది. ప్రేక్షకులు నిజంగానే ఈ "టాక్సిక్ రొమాన్స్" కథలతో విసిగిపోయారా? లేక ఇది మరో సోషల్ మీడియా తుఫానుగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ యుగంలోనూ టెలివిజన్ సీరియళ్ల కథన శైలి, వాటి సామాజిక బాధ్యతపై మరోసారి ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. -
చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు అదుర్స్..!
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే ఇష్టపడని వారుండరూ. ఆయనలా ఫాస్ట్గా మ్యూజిక్కి అనుగుణంగా స్టెప్లు వేసేందుకు తహతహలాడుతుంటారు. ఎందరో ఆయనకు శిష్యులుగా మారి ఎంతలా ప్రయత్నించేవారో కథలుకథలుగా విన్నాం. ఇప్పుడా మహానుభావుడు మన మధ్య లేకపోయినా..ఆయన ఆల్బమ్స్, పాటలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయ్. ఇదంతా ఎందుకంటే..ఓ మహిళ అచ్చం మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆ వీడియోలో కంటెంట్ క్రియేటర్ కోమల్ సాంప్రదాయ చీర కట్టులో మైఖేల్ జాక్సన్లా అద్భుతమైన డ్యాన్స్ చేసింది. మైఖేల్ జాక్సన్ ఐకానిక్ హిట్ అయిన 'బిల్లీ జీన్' పాటకు కాళ్లు కదిపింది. ఆమె చీర కట్టుకుని మరీ.. మేఖేల్ జాక్సన్కి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా డ్యాన్స్ చేయడం విశేషం. పాట ప్రారంభకాగానే సునాయాసంగా స్టెప్పులు వేసిందామె. అందులో పదునైన బాడీ ఐసోలేషన్స్, రోబోటిక్ పాపింగ్ సీక్వెన్సులు, లెజెండరీ మూన్వాక్ కూడా ఉన్నాయి. ప్రతి స్టెప్పు చాలా కచ్చితత్వంతో ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం విశేషం. ఆ వీడియోలో ఒక అమ్మ మేఖేల్ జాక్సన్ ఆల్బమ్స్ చూసి అభిమానిగా మారితే ఎలా ఉంటుందో అంటూ.. కంటెంట్ క్రియేటర్ కోమల్ అలా సంప్రదాయ చీర కట్టులో డ్యాన్స్ చేసి చూపిందంటూ ఇచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది. నిజానికి ఆ స్టెప్లు చీరకకట్టులో వేయడం అంత ఈజీ కాదు. కానీ కోమల్ మాత్రం అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా అమ్మా మీ స్టెప్స్ అదుర్స్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Komal kumari (@komal__aadya) (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి
బిహార్లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలేమైంది?కట్వా రసూల్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. View this post on Instagram A post shared by tvn99urdu News 24/7 (@tvn99urdu)ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..!
ఇంతవరకు పలు డ్రైవర్లు తమ ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై నుంచి పుస్తకాలు, స్నాక్స్ వంటి ఏర్పాట్లతో ఫిదా చేశారు. కానీ ఈ డ్రైవర్ ఒక అడుగు ముందుకేసి ప్రయాణికులు నచ్చినట్లు జర్నీ చేసే అనుభవాన్ని అందించాడు. అది కూడా వాళ్లకు వాళ్లుగా ఎలాంటి రైడ్ చేయలనుకుంటున్నారో ఎంచుకునే మెనూతో ఇప్రెస్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది.ఒక మహిళ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ అదరి మనసులను తాకింది. ఆ పోస్ట్లో ఆ మహిళ తానొక అద్భుతమైన ప్రశాంతమైన రైడ్ చేశానంటూ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు విదేశీ వ్యాపార పర్యటన అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు రాశారు. ఇంటికి వెళ్లేందుకు 45 నిమిషాల ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నారు. పైగా బాగా మూడు రోజులు పర్యటన కారణంగా బాగా అలిసిపోయి ఉండటంతో అస్సలు మాట్లాడే ఓపిక లేదని రాసుకొచ్చింది. ఆ డ్రైవర్ పేరు కబీర్ అని తన హెడ్రెస్ట్ వెనుకభాగంలో అంటించిన లామినేటెడ్ కార్డుని ఆమెకు అందించాడని చెప్పారు. దాన్ని ఆమె "రైడ్ మెనూ"గా వర్ణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తాము ఇష్టపడే సంభాషణను ఎంచుకునే వీలు కల్పించేలా రూపొందించాడు. ఆ కార్డులో నిశబ్దం కోసం "ది సైలెంట్ రైడ్", తమ రోజు విశేషాలు పంచుకోవాలనుకునేవారికి "ది థెరపిస్ట్ రైడ్", నగరం గురించిన వాస్తవాలు, కథలు చెప్పే "ది టూరిస్ట్ రైడ్", ప్రయాణికులు కేవలం విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినగలిగే "ది రేడియో రైడ్" వంటి ఆప్షన్లు ఉన్నాయని చెప్పారామె. అయితే తాను సైలెంట్ రైడ్ ఎంపికను ఎంచుకుని, డ్రైవర్కు నిశ్శబ్దంగా ధన్యవాదాలు తెలిపానని చెప్పింది. వెంటనే కబీర్ తల ఊపి ఎయిర్ కండిషనింగ్ సర్దుబాటు చేసి, మొత్తం ప్రయాణాన్ని నిశబ్దంగా చేశాడు. ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే అద్భుతంగా అనిపిస్తుందన్నారామె. ఈ ఏడాది తాను ఆస్వాదించిన ప్రశాంతబైన రైడ్ ఇదేనని చెప్పారామె. పైగా తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోగలిగానని పేర్కొందామె. ఆ తర్వాత తాను ఉదారంగా టిప్ ఇచ్చి, కబీర్ వ్యాపార ఆలోచనను ప్రశసించానని చెప్పారామె. అయితే డ్రైవర్ ఆ మెనూ ఏర్పాటు వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ..ఇది మెరుగైన టిప్స్ లేదా రేటింగ్లు సంపాదించడం కోసం ఈ కార్డుని తయారు చేయలేదని చెప్పడం విశేషం. తన కుమార్తె ప్రేరణతో ఈ కార్డుని రూపొందించినట్లు తెలిపాడు. ఆమె కూడి అలిసిపోయినప్పుడు..అపరిచితులతో మాములు సంభాషణ ఎంత విసుగ్గా, నీరసం తెప్పించినట్లు ఉంటుందో పంచుకుందని, దాన్ని ఆమె "మారథాన్ పరుగు"తో పోల్చిందని, చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలోనే ప్రయాణికులు విమర్శల భయం లేకుండా తమ ఇష్టపూర్వంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా వ్యక్తపరిచే మెనూని రూపొందించానని తెలిపాడు. ఆ వివరణ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చింది. ఆధునిక జీవతం ప్రజలను నిరంతరం ఎలా ఒత్తిడికి గురిచేస్తోందో కదూ అనుకుంటూ..ఔను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేయడంకు మించిన గొప దయ ఇంకొకటి లేదంటూ తన పోస్టుని ముగించారామె. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..ఇది మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. i took a 45-minute uber ride home from the airport last night after a brutal, three-day business trip. i was completely emotionally and physically drained, and my social battery was at absolute zero.when i got into the car, the driver.. an older guy named kabir.. didn't say…— noor୨୧ (@wottheberry) June 6, 2026 (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
సహారాలోనూ తప్పని డెడ్లైన్స్! ఒంటెపై ల్యాప్టాప్తో..
సహారా ఎడారికి పోయినా.. బాస్ వదలడం లేదా?. మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్లు తప్పలేదా? అన్నట్టుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఒంటెపై ప్రయాణిస్తూ, ల్యాప్టాప్ తెరిచి జూమ్ కాల్లో బిజీగా కనిపించిన దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.ఎడారి మధ్యలో అనంతమైన ఇసుక దిబ్బలపై ఒంటె హంప్పై ల్యాప్టాప్ పెట్టుకుని, జూమ్ కాల్లో పూర్తి ఫోకస్తో పని చేస్తున్నట్లుగా కనిపించిన ఆ వ్యక్తి దృశ్యం ఒక్కసారిగా వైరల్గా మారింది. ఆ వీడియోలో.. వీడు వీడి బాస్కు వర్క్ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పాడు అని క్యాప్షన్ జోడించడంతో నవ్వులు పూస్తున్నాయి. ఈ వీడియోను న్యూయార్క్కు చెందిన కంటెంట్ క్రియేటర్ షాద్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ అసాధారణ దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతూ.. రిమోట్ వర్క్ కల్చర్పై సరదా చర్చలకు దారితీసింది. కొందరు దీన్ని వర్క్ఫ్రమ్ ఎనీవేర్ ట్రెండ్కు పరాకాష్టగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు ఆధునిక ఉద్యోగ జీవనశైలి ఎక్కడికైనా వెళ్లగలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే, ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకర్షించిన విషయం.. “ఎడారి మధ్యలో కూడా జూమ్ కాల్ ఎలా సాధ్యం?” అనే కుతూహలం. “వైఫై ఎంత స్ట్రాంగ్!” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఇది టెక్నాలజీ సాధ్యాలను చూపించే ఉదాహరణగా పేర్కొన్నారు.“వర్క్ ఫ్రమ్ హోం కాదు, వేర్ ఫీల్స్ హోం అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ వైరల్గా మారింది. మరోవైపు “ఇలాంటి జీవితం మాకూ కావాలి” అంటూ సరదా కోరికలు కూడా వ్యక్తమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న “work from anywhere” ట్రెండ్లో ఇది మరో వైరల్ ఎపిసోడ్గా నిలిచింది. ఇటీవల దక్షిణ కొరియాలో రోలర్కోస్టర్పై మీటింగ్లో పాల్గొన్న వీడియో తర్వాత.. మొన్నీమధ్యే మన హైదరాబాద్లో బండి పెట్రోల్ ట్యాంకర్ మీద ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చేసిన ప్రయాణం.. ఇప్పుడు ఎడారిలో ఒంటెపై Zoom కాల్ వీడియో కూడా అదే జాబితాలో చేరింది. -
థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..
సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్వ్లాగ్లో షేర్ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే కాదు..అక్కా మొట్టమొదటి వ్లాగ్ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆమె ఏ దేశం వెళ్లింది..అక్కడ ఎలా తనను తాను పరిచయం చేసుకుందంటే..ఆ వీడియోలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అనీష్ భగత్ వద్ద పనిచేసే రేష్మా అతనితో కలిసి థాయ్లాండ్కు ప్రయాణించడం కనిపిస్తుంది. తన తొలి అనుభవాలను చిత్రీకరించి ట్రావెల్ వ్లాగ్లో షేర్ చేసిది. ఇదే తొలి ట్రావెల్ వ్లాగ్ వీడియో అని తెలిపింది. తాను ఒక పనిమనిషిగా మగతోడు లేకుండా భారతదేశం దాటి బయటకు రావడం ఇదే మొదటసారి అని వీడియోలో పేర్కొంది. తాను అనీష్ సోదరుడుతో కలిసి థాయ్లాండ్ చేరుకున్న తర్వాత ఒంటరిగా ఒకరోజంతా గడపమని చెప్పినట్లు తెలిపింది. అలాగే తన తొలి వాగ్లో, అనీష్ తనకు ఆసక్తి ఉన్న పనులు చేయమని అడిగాడని రేష్మా పంచుకుంది. అయితే తనకు దేనిపై ఆసక్తి ఉందో ఎప్పుడు ఆలోచించలేదు, పైగా అంత తీరిక కూడా దొరకలేదని చెప్పింది. అయితే తాను కేవలం పనమ్మాయినని, తనకు ఇక్కడ భాష రాదు, అలాగే చదవడం రాదని చెప్పింది. కానీ వంట చేయడం వచ్చు. అందుకే స్నేహితులను చేసుకునేందుకు బొబ్బట్లు చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. అక్కడ ఎలా స్పెండ్ చేసిందంటే..రేష్మా తనకు ఇష్టమైన చీర కట్టుకుని ఒంటరిగా థాయ్లాండ్ను అన్వేషించడానికి బయలుదేరడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశంలో కొత్త స్నేహితులను చేసుకోవడానికి ఆమె బొబ్బట్లతో నిండిన టిఫిన్ బాక్స్ను తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అందమైన ఆలయానికి చేరుకుని ఒక జర్మన్ వ్యక్తిని కలిసి బొబ్బట్లు ఇచ్చి స్నేహితుడిని చేసుకుంటుంది. ఆ తర్వాత రేష్మా ఒక 7-ఎలెవెన్ను సందర్శించింది, అక్కడ ఆమెకు పోపో అనే మహిళా ఇన్ఫ్లుయెన్సర్ పరిచయమైంది. ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇద్దరూ వెళ్లే దారిలో కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం ఆస్వాదించారు. ఆ తదనంతరం ఆమె ఇలా పేర్కొంది. బాధ్యతల కారణంగా మన ఆడవాళ్ళం తరచుగా మన గురించి మనం ఎందుకు మరచిపోతామో నాకు తెలియదు.సినిమాల్లో లాగా ఒక పుస్తకం చదువుతూ, ఒక గిన్నెడు మామిడి స్టిక్కీ రైస్ తింటూ ఆమె ఆ రోజును ముగించింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె తనలో తాను, “రేష్మా, నీ గురించి నాకు గర్వంగా ఉంది,” అని అనుకోవడం చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ, స్పందన రావడమే గాక, ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత హృద్యమైన ట్రావెల్ వ్లాగ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) (చదవండి: నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడితే..నేడు అందరూ మెచ్చే చెఫ్గా..!) -
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!ఉత్తరప్రదేశ్లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్లో షాక్లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.#मेरठ: दुकान में घुसा विशाल अजगरसिविल लाइन क्षेत्र में मची दहशतकर्मचारियों में मची अफरा-तफरीवन विभाग ने चलाया रेस्क्यूतीन घंटे बाद पकड़ा गया अजगरसुरक्षित रेस्क्यू के बाद राहत#Meerut #UPNews #BreakingNews #Python #Rescue #ForestDepartment #LocalNews #UPNow pic.twitter.com/RamOTx0ko5— UP NOW (@UPNOWTV) June 14, 2026 -
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో నైస్ ట్విస్ట్!
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది. అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది.ఫ్రాన్స్లో మాక్రాన్తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎవియన్, పారిస్లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు.ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది. ఇంగ్లిష్లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం.Nice to have met you in Nice. A productive first leg indeed. The India-France partnership will keep scaling new heights. See you in Evian and Paris…@EmmanuelMacron https://t.co/N84iSN7aDQ— Narendra Modi (@narendramodi) June 14, 2026మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నైస్ ప్రత్యేకత ఏంటంటే..నైస్(Nice City) ఫ్రాన్స్కు ఆగ్నేయ తీరంలో మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. ఫ్రెంచ్ రివేరా ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా భావిస్తారు. అందమైన బీచ్లు, సముద్రతీర విహార మార్గాలు, చారిత్రక నిర్మాణాలు, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రసిద్ధి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్లో పారిస్ తర్వాత అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే నగరాల్లో నైస్ కూడా ఒకటి.ధురంధర్ ట్విస్ట్ ఇచ్చిన మాక్రాన్మోదీ పర్యటనకు బాలీవుడ్ టచ్ ఇస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ధురంధర్ సినిమాలోని ‘ఆరి ఆరి’ పాటతో జతచేసి వీడియోను రూపొందించారు. మోదీ-మాక్రాన్ భేటీ, భారత్ ఇన్నోవేట్స్-2026 సదస్సు ప్రారంభోత్సవం, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలపై జరిగిన చర్చలను ఇందులో చూపించారు. ఈ వీడియోకు స్పందించిన ప్రధాని మోదీ.. భారత్, ఫ్రాన్స్లు సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల రంగాల్లో కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026ఇదిలా ఉండగా, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చర్చల కంటే ముందే మోదీ-మాక్రాన్ల సెల్ఫీ, దానికిచ్చిన ‘నైస్’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్ అవాల్సిందే!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న బాటసారులను డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.Poor beggar, he is begging for the cost of charging.😅😅Buy a robot to make money. pic.twitter.com/7jBKZJG12b— Sharing Travel (@TripInChina) June 13, 2026సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆనందంగా దూకింది.. సాహస యాత్రే చివరి యాత్ర..
అడ్వెంచర్ స్పోర్ట్స్ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువతి(21) నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. 40 మీటర్ల ఎత్తున్న రోప్ జంప్ (Rope Jump) ఈవెంట్లో పాల్గొన్న యువతికి భద్రతా తాడును కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.వివరాల మేరకు.. ఈ ఘటనలో మృతురాలిని మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్ (21)గా గుర్తించారు. ఆమె బ్రెజిల్లోని సావో పాలో రాష్ట్రంలోని లిమీరా ప్రాంతంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మరియా, రోప్ జంప్ అనుభవాన్ని ఆస్వాదించాలని అనుకుంది. ఈ క్రమంలో రోప్ జంప్కు ముందు యువతికి హార్నెస్, ఇతర భద్రతా పరికరాలు అమర్చారు. అయితే అత్యంత కీలకమైన ప్రధాన సేఫ్టీ తాడును హార్నెస్కు అనుసంధానం చేయడం నిర్వాహకులు మర్చిపోయినట్లు తెలుస్తోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs— Rapid Report (@RapidReport2025) June 13, 2026జంప్నకు సిద్ధమైన మరియాను ఇద్దరు సిబ్బంది వంతెన అంచుకు తీసుకెళ్లారు. కౌంట్డౌన్ ముగిసిన తర్వాత ఆమెను దూకించారు. అయితే ఆమె గాల్లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే అక్కడ ఉన్న కొందరు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు "తాడు లేదు... తాడు లేదు..." అంటూ అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. అప్పటికే యువతి నేరుగా కిందపడిపోయింది. సుమారు 40 మీటర్ల (130 అడుగులకు పైగా) ఎత్తు నుంచి కిందపడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఘటనాస్థలంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.వైరల్గా మారిన వీడియో..ఈ ప్రమాదం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయింది. అనంతరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో యువతి ఉత్సాహంగా జంప్కు సిద్ధమవడం, దూకిన తర్వాత సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా తనిఖీ చేసి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా? జంప్కు ముందు తప్పనిసరి చెక్లిస్ట్ అమలు చేశారా? అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/LPLfXyZ5qc— Pense (@creatorhouseinx) June 14, 2026 -
విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేవలం స్వల్పవిభేదాలకే కోర్టుకెక్కుతున్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఈ విడాకులు అనేది కేవలం తల్లిదండ్రులుగా వారికే కాదు.. ఇరు కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేమాభిమానాలకు, భావోద్వేగ బంధాలకు భంగం కలిగిస్తాయి. ఈ క్రమంలో ఒక విడాకుల స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది శిఖా సింగ్. ఆమెకు 2020లో సౌరభ్తో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు దాదాపు ఐదేళ్లపాటు కొనసాగింది. ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలిచి ఆమె తండ్రి న్యాయపరమైన ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు చేసేశాడు. అటు కుమార్తె భవిష్యత్తు, ఇటు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. మామగారి అనారోగ్యం గురించి తెలుకున్న శిఖా భర్త మెరుగైన వైద్యం కోసం అతడిని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆ ఖర్చులన్నింటినీ స్వయంగా భరించాడు. ఎంతో సపోర్ట్గా నిలిచాడు. ఇక్కడే అల్లుడు.. కన్న కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. దీంతో శిఖా మనసులో భర్త మీదున్న ద్వేషం పోయింది. మళ్లీ ప్రేమాభిమానాలు చిగురించాయి. ఇంతలో విడాకుల కేసు విచారణకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి. తాను కష్టకాలంలో ఉన్నపుడు సౌరభ్ చూపిన ప్రేమ, మానవత్వాన్ని చూసి శిఖా చలించిపోయింది. అంతే విడాకుల పత్రాలను చింపేసి భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లతోనే భర్తను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. Shikha Singh had a dispute with her husband and filed a false dowry case against him, demanding a divorce.The girl's father had exhausted all his money fighting the case for five years. When she suffered a heart attack, she had to be admitted to a government hospital due to… https://t.co/HAMEhtu6Mx— Sainidan. Ratnu. Ex. Adm.Judicial Officer (@Sainidan1) June 12, 2026 -
డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.من المواقف الذي تحبس الانفاس لحظة محاول العثور على جثة القعقاع رحمة الله عليه هل الذين كانوا يشجعوه يتحملوا المسؤلية؟ pic.twitter.com/y1ow1fWIPo— نوادر ومواقف (@Nawader_X) June 12, 2026 అన్తార్ యెమెన్లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.అన్తార్ అకాల మరణంపై యెమెన్లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!
తాను తట్టకోలేని జీర్ణించుకోలేని భాధను అనుభవిస్తూ కూడా మంచి పనికి పూనుకున్నాడు. భార్యభర్తలు ఎంజాయ్ చేద్దాం అనుకుని మరి పొదుపు చేసిన మొత్తం..చివరికి అనుకోని పరిస్థితుల్లో ఆ భర్త విరాళంగా ఇచ్చాడు. అదీకూడా మాతృభూమి కోసం ప్రాణాలర్పించే యుద్దవీరుల కోసం ఆ సొమ్ముని ఇచ్చి తన పెద్దమనసుని చాటుకున్నాడు.అతడే నాగ్పూర్కి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి శ్రీకాంత్ సహస్రబుద్ధే. తాను తన భార్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యామని. తామిద్దరం ప్రపంచయాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో పీఎఫ్, పొదుపు డబ్బుతో ప్లాన్ వేసుకున్నట్లు తెలిపారు. కానీ విధి మరోలా తలచి..తన భార్యను దూరం చేసిందన్నారు ఆవేదనగా శ్రీకాంత్. పదేళ్ల క్రితం తను చనిపోవడంతో ఆ యాత్ర చేయాలన్న ఆసక్తే పోయిందన్నారు. ఆమె మరణంతో తనకు ఎక్కడకు వెళ్లాలనిపించలేదన్నారు. అయితే ఒకరోజు అకోలాకు చెందిన ఒక వ్యక్తి భారత సైన్యానికి రూ. 1 కోటి విరాళం ఇచ్చినట్లు వాట్సాప్ మెసేజ్ చూశా. తాను అంత ఇవ్వలేను కానీ..దాచుకున్న పొదుపులోంచి రూ. 25 లక్షలు ఇవ్వగలని అనుకున్నా..అలా తన కలల యాత్ర కోసం ఆదా చేసిన పీఎఫ్ డబ్బులో సగం విరాళం ఇచ్చానని చెప్పుకొచ్చారు. బహుశా భార్యతో కలిసి ప్రయాణం చేస్తే కలిగే సంతోషం కంటే ఈ పని వల్ల లభిస్తుందేమోనన్న ఆశతో ఇలా చేశానని అన్నారు. పైగా ఆయన విరాళం ఇచ్చేటప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తను తన భార్యను ఎంతలా మిస్ అవ్వుతున్నారో కూడా చెప్పారు. అంతేగాదు తన భార్య ఎంత మంచి మనిషో కూడా వివరించారు. నెటిజన్లు అతడి చర్యను అభినందిస్తూ..గొప్ప మనిషి..ఆయన చేసిన పనికి సెల్యూట్, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
జనాల ప్రాణాలతో చెలగాటమా?.. నిలదీసిన బైకర్
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. కాసేపు ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. చేసేది లేక బస్సు డ్రైవర్ వెనక్కి తగ్గినట్లే కనిపించాడు. అయితే ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఓ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.నగరంలోని 195W రూట్కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఓ బైకర్ ధైర్యంగా బస్సును అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బైకర్, అక్కడే ఉన్న ట్రాఫిక్ వాలంటీర్ గట్టిగా నిలదీయగా, డ్రైవర్ తీవ్ర ఆగ్రహంతో వాళ్లపై అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బైకర్ను తప్పించి ముందుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ బైకర్ మాత్రం అస్సలు తగ్గలేదు. రైట్ రూట్లోనే వెళ్లాలంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆ బైకర్ను, ముందు ఉన్న ఓ కారును, ఆ రూట్లో వచ్చిపోయే వాహనాలను బస్సు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్తో భయపెట్టే ప్రయత్నం చేశాఉడ. ఆ తర్వాత బస్సు ముందుకు కదులుతూ ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళం నెలకొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. కొందరు డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ బస్సు నెంబర్ TG 10 T 1469 మీద చలాన్లు ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడం, ట్యాగులు చేయడంతో ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. తక్షణ విచారణ చేపట్టామని చెబుతూ రీ ట్వీట్లు చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. నగరంలో ఇలా ప్రవర్తించే ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఉన్నారని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వైఖరిని ప్రదర్శించరని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ బైకర్ను వెల్డన్ బ్రో అని అభినందిస్తున్నారు. హైదరాబాద్లో RTC డ్రైవర్ బరితెగింపు: రాంగ్ రూట్లో వచ్చి హల్చల్**195W రూట్కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్… pic.twitter.com/4KVWSidsop— AVM (@AvmNews7) June 13, 2026 -
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. -
క్రికెట్ క్యాచ్తో చిన్నారి ప్రాణాలు కాపాడాడు!
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తూర్పు లండన్లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public. pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026 -
అత్తారింట్లో అల్లుడి సరదా పని.. వీడియో వైరల్
పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు ఓ భర్త చేసిన వినూత్న ప్రయత్నం నవ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి తన ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన సరదా పని అందరి దృష్టిని ఆకర్షించింది. నా భార్యను నాతో తిరిగి పంపండి అంటూ రాసిన కేక్ తీసుకెళ్లి అత్తామామలను బతిమాలుకున్నాడు. ఇంతగా అడిగితే ఎవరైనా కాదంటారా? వెంటనే అత్తమామలు.. అల్లుడికి తన కూతురిని అప్పగించేశారు. ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వెగ వైరల్ అవుతోంది.‘కరణ్ & మోనా’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “నువ్వు లేకుండా ఉండలేని వ్యక్తినే పెళ్లి చేసుకో” అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోకు 16 లక్షల లైకులు, 8 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. వైరల్గా మారిన ఈ వీడియోలో.. తన భార్య 10 రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉండటంతో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన భర్త చేతిలో ఒక ప్రత్యేకమైన కేక్ కనిపించింది. ఆ కేక్పై ముజే మేరీ బీవీ వాపస్ దొ (నా భార్యను తిరిగి నా దగ్గరకు పంపించండి) అని రాసి ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అత్తగారు స్వయంగా కూతురిని అల్లుడికి అప్పగించడం వీడియోలో కనిపించింది. వీరు ఎక్కడి వారు అనే వివరాలు వెల్లడి కాలేదు. భార్యభర్తల పేర్లు కరణ్, మోనా అని తెలుస్తోంది.నెటిజన్ల స్పందనపుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు వినూత్న పంథా అనుసరించిన సదరు భర్తపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇల్లాలిపై ప్రేమాభిమానాలు చూపించిన ఇంటాయనను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. “వివాహ జీవితాన్ని సంతోషంగా లేదా బాధాకరంగా మార్చేది చాలా వరకు భర్త ప్రవర్తనే. అతని చిన్న చిన్న ప్రయత్నాలు భార్య హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు.“ఇది చాలా మధురమైన క్షణం. ముఖ్యంగా అమ్మ గారి స్పందన ఎంతో క్యూట్గా ఉంది”, “మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు. తన భావాలను ఇంత అందంగా వ్యక్తపరిచే భర్త చాలా అరుదు”, “కూతురిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే ఇలాంటి అల్లుడిని ప్రతి తల్లిదండ్రులు స్వాగతించాలి”, “ఇలాంటి అల్లుడు దొరికినందుకు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది” అని నెటిజనులు కామెంట్లు పెట్టారు.చదవండి: బొంగరపు ఆట కదరా జీవితం!భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, చిన్న చిన్న మధురమైన ప్రయత్నాలు ఎంతటి ఆనందాన్ని తీసుకురాగలవో ఈ వీడియో మరోసారి గుర్తు చేసిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Karan & Mona (@notperfectbutus) -
ఆ అమ్మకు ఆ జర్నీ అత్యంత స్పెషల్..!
కొన్ని చిత్రాలు చెప్పే కథ ఎంతో అపురూపంగా మనసుని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చిత్ర చెప్పే కథే. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట వైరల్గా మారింది. పైగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అంటూ అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇంతకీ ఏంటా కథా చిత్రం అంటే..ఒక తల్లి ప్రయాణి ఇద్దరు కుమారుల కారణంగా అత్యంత ప్రత్యేకంగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వుతూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఒక కుమారుడు ఆమెను విమానం ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి రాగ, మరోక కుమారుడు ఆమెను పైలట్గా గమ్యస్థానానికి చేర్చడానికి వేచి ఉన్నాడు. అందుకు సంబంధించిన భావోద్వేగ క్షణాన్ని పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తన పులులతో గర్వపడే తల్లి అనే క్యాప్షన్ జోడిస్తూ ఇలా పేర్కొన్నారు. అమ్మను నా తమ్ముడికి అప్పగిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా తమ్ముడి కెప్టన్ అమన్ సక్సేనా సారథ్యంలో అమ్మ తన గూటికి తిరిగి వెళ్తోంది. అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన రెండు ఫోటోలు ఎంతో అందంగా రెండు విషయాలను వివరించాయి. మొదటి పోటో.. ఆ తల్లి తన పెద్దకొడుకు అక్షత్తో కలిసి విమానాశ్రయంలో దిగిన చిత్రం . అక్కడ అతను ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాడు. ఇక రెండో ఫోటోలో విమానం దిగిన తర్వాత దిగిన ఫోటో. అందులో ఆ విమానాన్ని నడిపిన చిన్న కొడుకు కెప్టెన్ అమన్ సక్సేనాతో దిగిన చిత్రం. ఓ అమ్మకు ఇంతకు మించిన ధైర్యం ఇంకే కావలంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తు పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Akshat (@captain_akshat) (చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..
చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్ ఫీట్ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన. అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్ క్లిప్ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్ప్రైజ్ గిప్ట్లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్ దుస్తులతో ఆత్రుగా ఉందామె. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్ చేసింది ఆ స్టంట్. పైగా ఆ స్కైడైవింగ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అమ్మా” అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rupali Janbandhu (@nofussfitness_rup) (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్టాపిక్గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్లైన్లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!) -
కామెడీ షోలో లేడీ డాక్టర్ వల్గర్ కామెంట్లు
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026 -
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
సెల్ఫోన్ కోసం 262 అడుగుల ఎత్తులో..
పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్ 6) చోటుచేసుకుంది.ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. "Loco total"Porque un turista que estaba visitando las Cataratas de Iguazú se tiro al agua para recuperar su teléfono celular, lo recuperó, se subió a la pasarela y siguió recorriendo el lugar. pic.twitter.com/pWpmgsMLVV— Tendencias en Argentina (@porqueTTarg) June 8, 2026అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్ఫాల్ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్ఫోన్ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్పోన్ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. Se tiró en la Garganta del Diablo para recuperar su celularUn hecho insólito generó indignación en las Cataratas del Iguazú, del lado brasileño.Un hombre se arrojó desde la pasarela del circuito Garganta del Diablo para buscar su celular tras caerse, sin poder regresar por… pic.twitter.com/7G4tGj7aRR— mavica (@mavica7) June 8, 2026అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళితే..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో కొత్తగా చర్చనీయాంశంగా మారిన "ఫుడ్ క్రైమ్"పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనదైన శైలిలో స్పందించి నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. బెంగళూరుకు చెందిన యశ్ అనే ప్రొడక్ట్ మేనేజర్ ఇడ్లీలను పిజా ముక్కల్లా త్రిభుజాకారంలో కట్ చేసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి శశిథరూర్ తనదైన శైలిలో 'ఇడ్లీని పిజా ముక్కల్లా కట్ చేయడం ఏంట్రా బాబూ' అన్నట్టుగా స్పందించారు."సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళ్లి డేటాను పార్టిషన్ చేయాలని ప్రయత్నిస్తే ఇదే జరుగుతుంది. దీనిని 'ఇడ్లీ' అంటారు, 'ఇడ్-స్లైస్' కాదు. ఇటాలియన్లు దాన్ని పిజాగా పొరబడితే తప్ప ఎవరూ ఇడ్లీని ఇలా తినరు. అయితే పిజాపై సాంబార్ పోయాలని మాత్రం ప్రయత్నించకండి" అంటూ తనదైన హాస్య శైలిలో ట్వీట్ చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఇడ్లీ సంప్రదాయాల పరిరక్షకుడిగా శశి థరూర్ మరోసారి గుర్తింపు పొందారు.థరూర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజనులు కూడా సరదా కామెంట్లు పెట్టారు. కొందరు నెటిజన్లు ఇడ్లీలను "యాక్షనబుల్ యూనిట్స్"గా విభజించారని చమత్కరించగా, మరికొందరు యశ్ బ్రేక్ఫాస్ట్కే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సూత్రాలను వర్తింపజేశాడని, అందులో సెగ్మెంటేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్, చట్నీ యాక్సెసిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. సౌకర్యం కోసం అలా చేసి ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ, చాలామంది నెటిజన్లు మాత్రం దీనిని ఇడ్లీపై జరిగిన "కార్పొరేట్ ప్రయోగం"గా అభివర్ణించారు.చదవండి: బొంగరపు ఆట నేర్పే జీవిత సత్యాలు!ఇటీవల కూడా "చాయ్తో ఇడ్లీ" అనే విచిత్రమైన ఆహార కలయిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో థరూర్ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. దక్షిణ భారతీయులను ఆశ్చర్యానికి గురిచేసిన ఆ కలయికపై కూడా తనదైన స్టైయిల్లో స్పందించారు. చాయ్ కప్పులోనే ఉండాలి, ఇడ్లీ ప్లేట్లోనే ఉండాలి అంటూ సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. ఇడ్లీపై జరుగుతున్న ఈ వినూత్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నప్పటికీ, సంప్రదాయ ఆహారాల విషయంలో ప్రజల భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో మరోసారి స్పష్టమైంది.This is what happens when a software engineer gets into the kitchen and tries to partition the data! Hey @ravaldosa, it’s called ‘idli’, not ‘id-slice’. No one eats idlis this way, unless they’re Italian and mistake it for pizza. (But don’t try putting sambar on pizza, ok?) https://t.co/11l27zGHQg— Shashi Tharoor (@ShashiTharoor) June 8, 2026 -
51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం
కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. వ్యక్తిగత కోరికల్ని ఆశల్ని, ఆశయాల్ని కూడా తృణ ప్రాయంగా త్యజించే వారి త్యాగం, అంతకుమించిన అంతులేని ప్రేమ నిజంగా అందరి హృదయాల్ని కదిలించక మానదు. అలాంటి కథ ఒకటి ఎక్స్లో విశేషంగా నిలుస్తోంది. ఎక్స్లో సునీల్ కుమార్ షేర్ చేసిన వివరాల ప్రకారం 51 ఏళ్ల శీతల్, మానసిక వికలాంగుడైన 48 ఏళ్ల సోదరుడు అశ్విన్ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, ఒక అక్కగా తన సోదరుడిపై తల్లి ప్రేమకు మించి చూపిస్తున్న ఆమె ప్రేమ నెట్టింట పలువురి ప్రశంసలు దక్కించుకుంటోంది.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత, శీతల్ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. తన సొంత కలల కంటే తమ్ముడి భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. సోదరుడి సంతోషానికి ప్రాధాన్యతనిచ్చి, అనుక్షణం అతనికి చంటి పిల్లాడిలా సపర్యలు చేస్తూ, అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఇందుకోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తాను పెళ్లి చేసుకోని వెళ్లిపోతే తమ్ముడు ఒంటిరి వాడైపోతానే ఆవేదనతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించు కున్నారు.She gave up her job, her marriage,and her dreams... just to become a mother to her brother ♥️🙏एक बहन का प्यार... जो माँ से रत्ती भर भी कम नहीं होता। ❤️51 साल की शीतल... और 48 साल का उनका भाई अश्विन...एक ऐसा अटूट रिश्ता, जिसे देखकर आँखें भर आएँगी। 🥹जब सिर से माँ-बाप का… pic.twitter.com/edMH8G3bZ2— Sunil Kumar (@sunilku20403616) June 8, 2026ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!శీతల్ ప్రేమ, అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రేమ తల్లి ప్రేమకు ఏమాత్రం తీసిపోనిది.వారిద్దరి విడదీయలేని అనుబంధం. వారి ప్రేమ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందంటున్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని అందంగా మార్చే నిస్వార్థమైన ప్రేమ. సోదరి త్యాగానికి, మాతృత్వపు ప్రేమకు జోహార్లు అని కొనియాడుతున్నారు. అందరికీ ఇలాంటి సోదరి ఉండాలని అకాంక్షిస్తున్నారు.ఇదీ చదవండి: 27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్ -
రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!
నెలకు ఐదెంకల జీతం వస్తున్నా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వండి అంటూ ఒక జంట పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. నేటి తరం యువ దంపతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. నెలకు రూ. 1.7 లక్షల సంపాదన ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగలడం లేదని వాపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత జీతం వస్తున్నా ఈఎంఐలు,అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆ జంట చెప్పుకు రావడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే. నిజానికి మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు 2 లక్ష రూపాయలు జీతం అంటే సౌకర్యవంతంగానే గడిపేయొచ్చు. వీరి ఖర్చులు, కడుతున్న లోన్ల వివరాల ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే లోన్ల భారమే కారణంగా చెప్పవచ్చు. వ్యక్తిగత రుణం (Personal Loan), విద్యా రుణం (education loan), బైక్ రుణం , ఫోన్ రుణం వంటి వాటి కోసం వారి నెలవారీ EMIల మొత్తం రూ. 85,980 అవుతోంది. ఇవి కాకుండా ఆ దంపతులు ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చులు, సరుకులు, ప్రయాణం, వైద్య ఖర్చులు , ఇతర వినియోగ బిల్లుల వంటి స్థిరమైన నెలవారీ ఖర్చుల కోసం రూ. 53,500 వెచ్చిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఖర్చులు, వినోదం , కుటుంబపరమైన అత్యవసర అవసరాల కోసం వారు రూ. 28వేలు కేటాయించారు. అన్ని ఖర్చులు పోను, వారి చేతిలో నెలకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగులుతున్నాయి.ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుసోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ ఆన్లైన్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునే ముందు, ముందుగా తమ అప్పులను తీర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చాలా మంది నెటిజన్లు సూచించారు.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!ఖర్చులు కాదు బాబూ, మీ లోన్లే మీకు అసలు సమస్య: కనీసం పెర్సనల్ లోన్ అయినా తీర్చేంత వరకైనా మీకీ కష్టాలు తప్పవు. మీ బైక్ రుణం పూర్తయ్యే వరకు 4 నెలలు వెయిట్ చేసి, ఆ తర్వాత, ఆ 12 వేల రూపాయల పెర్సనల్ లోన్ చెల్లించేయండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. అంతేకాదు లోన్ తీసుకొని మరీ ఫోన్ తీసుకోవడం అవసరమా, 3-4 నెలల పాటు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని ఉంటే, ఫోన్ కోసం 20వేలు మిగిలేవి కదా అంటే ఇంకొకరు లెక్కలు చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అంటే ఈ జంట తమ సంపాదనలో సగానికి పైగా (50.5%) కేవలం అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో 30-35 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే అనవరమైన వ్యక్తిగత అవసరాలను కొన్ని త్యాగం చేసి అత్యవసర ఖర్చులకోసం, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడం కుటుంబాలకు చాలా అవసరం.ఏమంటారు? -
ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఉత్తర ప్రదేశ్లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.ఉత్తరప్రదేశ్లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులుసరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట. అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. दामाद ने बेटी से रिश्ता तोड़ मां से किया शादीयूपी के कानपुर में एक अनोखा मामला सामने आया है, जहां एक युवक ने अपनी पत्नी से अलग होने के बाद अपनी सास के साथ कोर्ट मैरिज कर ली।इस घटना के बाद इलाके में तरह-तरह की चर्चाएं हो रही हैं। pic.twitter.com/fcaNnYNle5— Priya singh (@priyarajputlive) June 8, 2026నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి. మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. కాగా 2024లో బీహార్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. -
నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది.తన రాబోయే చిత్రం 'భారత్ భాగ్య విధాత' (దర్శకుడు మనోజ్ తపాడియా) ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని, దీని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. నర్సుల యూనిఫాం విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు (colonial hangover) ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడటానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. "నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటి పైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా, చలి అయినా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్నే ధరించాలి. అవి విదేశీ స్టయిల్లా అనిపిస్తుందని పేర్కొన్నారు.అందుకే ఈ యూనిఫాంలో మార్పులు రావాలని, అది "భారతీయ శైలిలో"(Indianized) ఉండాలని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే, రోజువారీ విధుల్లో ఎలాంటి యూనిఫాం ధరించడానికి ఇష్టపడతారనే విషయంపై నర్సుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవడం అమెరికా నేవీలో ఉంటుందని అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యద్దాల్లో వాళ్లు అలానే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. తన సినిమా ఆ దిశగా కొంత మార్పును తీసుకువస్తుందని, భవిష్యత్తులో ప్రేక్షకులు నర్సులను చూసే దృక్పథాన్ని మారుస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అలాగే ఇది అంత సులభమైనవృత్తి కాదని, వేతన విధానం నుండి యూనిఫాం వరకు అనేక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.కాగా 2008 నాటి 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో లక్ష్యంగా మారిన ప్రదేశాలలో ఒకటైన 'కామా హాస్పిటల్' నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ 'నర్సెస్ ఆఫ్ కామా' (Nurses of Cama) లో కంగనా నర్సు పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ, ఆసుపత్రిని నడుపుతూ రోగులను సురక్షితంగా ఉంచడంలో నర్సుల కృషి ఎంత కీలకమో ఈ చిత్రం చూపిస్తుంది. -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
పాపం.. రన్వేపైనే కబళించిన మృత్యువు
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్వేపై ఘోరంగా తడబడింది. చూస్తుండగానే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul— FL360aero (@fl360aero) June 7, 2026ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..
రోడ్ల మీద ప్రయాణికులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిందే. కనీసం బస్తాప్ వద్ద కూడా రయ్ రయ్ అంటూ వెళ్లిపోవడమే. ప్రయాణికులు బస్సలు ఎక్కనివ్వరు, కనీసం ఫుట్పాత్పై నిలబడనివ్వరు. అలాంటి టూ వీలర్ ప్రయాణికులకు ఇక్కడొక పోలీసు అధికారి భలే గుణపాఠం చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ అధికారిపై ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. ఆ వీడియోలో పోలీసు అధికారి రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా..ట్రాఫిక్ జామ్ను దాటాలనే ఉద్దేశ్యంతో ప్రయాణికులు ఎలా మాములు ఫుట్పాత్పై వాహానాలు నడుపుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఈ పోలీసు అధికారి వెంటనే కొద్ది దూరం ప్రయాణించి ఫుట్పాత్పై బైక్తో సహా అడ్డంగా నిలబడతాడు. దీంతో రాంగ్రూట్లో వస్తున్న ఆ టూవీలర్ ప్రయాణికులు కాస్తా వెనుదిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. దాంతో నెటిజన్లు ఏం ధైర్యం సార్ అంటూ ఆ పోలీసు అధికారిని అభినందించగా, మరికొందరు హ్యాట్సాప్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by COP NAVEEN (@cop_naveensingh) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
బుడ్డోడి మ్యాజిక్కి ఆనంద్ మహీంద్ర ఫిదా! వైరల్ వీడియో
పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. నిత్యం అనేక ఇన్సిపిరేషనల్ కథనాలు, టాలెంట్ వీడియోలు, విజ్ఞానాత్మక కథనాలను పంచుకుంటూ ఉండటం ఆయనకు బాగా ఆలవాటు. అంతేకాదు అర్హులైన వారికి చేయూత నందించడం కూడా పరిపాటి. ఆయన తాజాగా ఆయన షేర్ చేసిన మట్టిలోమాణిక్యంలాంటి వీడియో ఆసక్తికరంగా మారింది.ఉత్తరాఖండ్లోని అందమైన నైనిటాల్ పట్టణ వీధుల్లో గారడీ చేసే ఓ చిన్నారి ఇంద్రజాలికుడి వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారి టాలెంట్కు ఫిదా అయిపోయారు. బోలెడు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైనమహీంద్రా ఆర్థికంగా అండగా నిలుస్తానని ప్రకటించి మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు.ఆ వైరల్ వీడియోలో విశేషం ఏమిటంటే నైనిటాల్లోని ఒక మార్గంలో సాహిల్ అనే బాలుడు వరుసగా వీధుల్లోఅద్భుతమైన మ్యాజిక్ విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తన చేతిలోని కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులతో అతడు చేసే ఇంద్రజాలం చూస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే. కేవలం రెండు స్టీల్ గిన్నెలు, చిన్న బాల్స్ సాయంతో తన చిట్టి చేతులతో అద్భుతమైన వేగంతో కప్పులను అటూ ఇటూ కదుపుతూ అద్భుత నైపుణ్యంతో కనికట్టు చేస్తున్నాడు. అసలా బంతి ఏ గిన్నె కిందినుంచి అలా అలా మాయమై, ఎలా ప్రత్యక్షమవుతుందో అర్థంకాక ఆశ్చర్య చకితులవుతారు.Yeh ladka bahut talented hai. Kya woh abhi bhi Nainital ki sadkon par kaam kar raha hai? Main na sirf uski padhai mein madad karna chahta hoon, balki jaadu mein uski dilchaspi ko bhi badhava dena chahta hoon. Kyon na woh duniya ke behtareen jaadugaron mein se ek bane? Kya… pic.twitter.com/lju2LokTBj— anand mahindra (@anandmahindra) June 5, 2026 ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుఆనంద్ మహీంద్రా కూడా అదే అనుభూతికి లోనయ్యారు. ‘‘ఈ కుర్రాడు ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతను ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లో ఇలాగే ప్రదర్శనలు ఇస్తున్నాడా? ఈ బాలుడికి ఉన్నత చదువులు చెప్పించడంతోపాటు, మ్యాజిక్పై అతని ఆసక్తిని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లభిస్తే ఈ బాలుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంద్రజాలికులలో ఒకడిగా ఎదుగుతాడు’’ అంటూ ఈ చిన్నారి గురించి లేదా అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే , వారితో మాట్లాడటానికి, వారికి సాయం చేసేందుకు తనకు సహాయం చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.నెటిజన్లు స్పందనమహీంద్రా చొరవను మంచి మనసును నెటిజన్లు ప్రశంసించారు. ఆ బాలుడిని గుర్తించి, అతని చదువుకు సాయం చేయడానికి మహీంద్రా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. సాహిల్ ,అతని కుటుంబం ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడటానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్కి భారీ ఝలక్ -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
రూ. 549 కోట్ల బ్రిడ్జ్పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్!
బిహార్లోని గోపాల్గంజ్లోని జడోపూర్-మంగల్పూర్ వంతెనపై జరిగిన ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. రూ. 549 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన పిల్లర్ల వద్ద నిర్మాణం లోపాలను వీడియో తీయాలని భావించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతను వీడియో తీస్తున్న ఆ పగులు గుండానే అతని మొబైల్ ఫోన్ కిందకి జారీ పోవడంతో వార్తల్లో నిలిచాడు.2016 మార్చిలోఈ వంతెనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో క్లిప్లో, వంతెన పిల్లర్ల వద్ద, స్పాన్లలో భారీగా గ్యాప్లు, పగుళ్లు ఏర్పడడంతో అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ పగుళ్ల గురించే అతను రికార్డ్ చేయాలను కున్నాడు. ఆ పగులు ఎంత పెద్దదిగా ఉందో చూపించడానికి ఒక ఇటుకను అందులోకి దించుతూమొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడే అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. మొబైల్ ఫోన్ చేతిలోంచి జారి ఆ గ్యాప్ గుండా వంతెన కింద పడిపోయింది.Man on Jadopur–Mangalpur bridge tries to measure a massive pavement crack with a brick, bends over and accidentally drops his phone into the deep gap😭💀pic.twitter.com/XTd8nHdwdX— Ghar Ke Kalesh (@gharkekalesh) June 4, 2026ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్చివరికి వంతెన కింద పడిన ఫోన్ను సురక్షితంగానే వెలికితీశారు. కానీ, వంతెన లోపాన్ని చూపించబోయి సొంత ఫోన్నే పోగొట్టుకోబోయిన వైనంపై నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు. పనిలో పనిగా వంతెన నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే, గుంతలు, లోపాలు కనిపించడం విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆ యువకుడి ఫోన్ దొరికి నప్పటికీ, వైరల్ వీడియోకి కారణమైన వంతెన నిర్మాణ లోపాలపై మళ్లీ అందరి దృష్టి మళ్ళేలా చేసింది.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500 -
హాట్టాపిక్గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!
ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్లైన్లో వైరల్గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్ఈ పార్లమెంటరీ ప్యానల్కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.(చదవండి: ‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!) -
రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్
చైనాలోని ఓ రోబో కలకలం రేపింది. షింజియాగ్లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది.ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.A robot kicked a little boy in the stomachWe're officially one software update away from Terminatorpic.twitter.com/iO9jv2qUuf— Mario Nawfal (@MarioNawfal) June 4, 2026ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతుండగా.. పక్కనే ఉన్న మరో బాలుడు అతడిని రోబోకు దూరంగా వెనక్కి లాగాడు. అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే, ఆ బాలుడికి తీవ్రమైన గాయాలేమీ కాలేదని తర్వాత ఓ వార్తా సంస్థ తెలిపింది. యంత్రం తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబో ఆ బాలుడిని తన్నినా.. జనాలు ఇంకా ఆ రోబో వైపే చూస్తున్నారా? బాలుడి వైపు దృష్టి సారించి.. అతడు బాగున్నాడా? లేదా? అని చూసే మానవత్వం మనలో ఎటుపోయింది? ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు."ఇది 'టెర్మినేటర్' సినిమా కాదు.. ఇక్కడ యంత్రాలు కావాలని హింసను ఎంచుకోవడం లేదు. అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే.. హార్డ్వేర్ డెవలపర్లు భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి.. బహిరంగ కార్యక్రమాలలో యంత్రాలను అమాయకపు ఆటబొమ్మల్లా వదిలేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదంగానే భావిస్తున్నా.. ఆ రోబో కావాలని ఆ చిన్నారిని తన్నలేదు. అది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పిల్లాడు దాని దారికి అడ్డంగా వచ్చాడు.. అందుకే ఈ ఘటన జరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు. -
చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు.. 2011 నుంచి ఈ విమానాలను అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఉపయోగిస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో ఈ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఈ విమానాలు సేఫేనా అనే చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానానికి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. గేట్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో విమానం ముందరి ల్యాండింగ్ గేర్ (నోస్ గేర్) ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్లో పలువురు గాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లాల్సిన LH450 విమానం అనూహ్యంగా ముందు చక్రం ఊడిపోవడం గమనార్హం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. A nearly five-month-old Lufthansa Boeing 787-9 Dreamliner at Frankfurt, preparing for a flight to Los Angeles, experienced a nose landing gear collapse at the gate. pic.twitter.com/72b6J4HyIr— Aviation (@xAviation) June 4, 2026ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్ సంస్థ కూడా విచారణలో సహకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్ కావడం గమనార్హం. -
కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్..!కట్చేస్తే..
గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్ రాజీనామా లెటర్ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్గా రిజైన్ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్ని తిర్కస్కరించాడని చెప్పారు. అప్పుడు వెంటనే అంకిత్ పాండే డోంట్.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు. ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్ బాక్స్తో ఆ అకౌంటెంట్ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్ పంచిపెట్టాడు. పైగా జాబ్లో మళ్లా జాయిన్ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్ అభ్యర్థించాడని అన్నారు. అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్ పాండే పోస్ట్లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!) -
90 ఏళ్ల అత్తను నెత్తిన మోస్తూ సింగర్ కాజల్ 260 కి.మీ.ల యాత్ర
మధుర: హర్యానాకు చెందిన గాయని కాజల్ చౌదరి తన అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 260 కి.మీ.ల పరిధిలోని సరస్సులు, అటవీ ప్రాంతాలను దాటుకుంటూ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర నెట్టింట వైరల్గా మారింది. '84-కోసుల' బ్రజ్ పరిక్రమలో ప్రత్యేక బుట్టలో తన 90 ఏళ్ల అత్తగారిని తలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నారు.బ్రజ్ ప్రాంతపు మతపరమైన ప్రదక్షిణను పూర్తి చేయాలన్న కోరికే తీర్చేందుకు అత్తగారిని మోసుకెళ్లాలని స్వయంగానే తానే నిర్ణయించుకున్నానని, ఇందులో అత్తగారి ప్రమేయం ఏదీ లేదని స్పష్టం చేశారు. సుమారు 260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ 84-కోసుల బ్రజ్ పరిక్రమ, ఉత్తరప్రదేశ్, హర్యానా ,రాజస్థాన్ రాష్ట్రాల గుండా సాగుతూ, శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడి ఉన్న అనేక ముఖ్యమైన ప్రదేశాలు, కొలనులు , అరణ్యాల గుండా వెళుతుంది.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!సాధారణంగా భక్తులు ఈ తీర్థయాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం తీసుకుంటారు, కానీ చాలామంది భక్తులు ప్రస్తుతం నడుస్తున్న 'అధిక మాసం' (Adhik Mas) లోనే దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గోవర్ధన్లోని శ్రీ ధన్ఘాటి ఆలయ సేవాయత్ (పూజారి) పవన్ కౌశిక్ తెలిపారు .హిందూ క్యాలెండర్లో వచ్చే ఈ అధిక మాసాన్ని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారని, ఈ మాసంలో బ్రిజ్ పరిక్రమ్ ఆధ్యాత్మిక యాత్ర, ఆలయాల్లో పూజలు చేయడం ,యజ్ఞాలు నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలుसासू मां की इच्छा पूरी करने के लिए बहू ने लिया अनूठा संकल्प।सिर पर बैठाकर बहू ने सासू मां को कराई 84 कोस की परिक्रमा।रिश्तों में सेवा, समर्पण और सम्मान की मिसाल । उत्तर प्रदेश के ब्रज क्षेत्र से एक भावुक कर देने वाला वीडियो।ऐसी संस्कारी बहू जिस घर में आ जाए वह घर स्वर्ग… pic.twitter.com/HWDRD4oLiQ— Satish Rajput (@StanwarSatish) June 4, 2026 -
ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!
జేఈఈ అడ్వాన్స్డ్.. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి. అలాంటి పరీక్షంలో సింగిల్, డబుల్ డిజిట్ ర్యాంకులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ర్యాంక్తో.. ఐఐటీ బాంబే లాంటి ప్రతిషాత్మక వర్సిటీలో సీటు దక్కించుకోవడం గొప్ప అవకాశం కాదంటారా?. కానీ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి.. అదెంత మాత్రం కాదనే అంటున్నాడు. ఎందరో ఆ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా చదువుతుంటే.. చేతిదాకా వచ్చిన ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ఒడిశాకు చెందిన మహరూఫ్.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో 32వ ర్యాంకర్. ఈ ర్యాంక్తో ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు సులభంగా దక్కుతుందని అతని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే.. మహరూఫ్ మాత్రం వద్దని వాళ్లతో చెప్పేశాడు. అందుకు కారణం.. అన్న మస్రూర్కు దూరం కావడమే!. మస్రూర్, మహరూఫ్ కవలలు. ఇద్దరూ ఈ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మస్రూర్ ఆల్ ఇండియాలో 169వ ర్యాంక్ పొందాడు. అయితే.. అన్నని వీడి ఉండలేని మస్రూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఐటీ బాంబే సీటు కాదని.. తన అన్నతోపాటు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను అన్నతో కలిసి చదవాలనుకుంటున్నాను” అని మహరూఫ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మస్రూర్ కూడా తన తమ్ముడి నిర్ణయాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నామని, ఇప్పుడు కూడా కలిసి చదవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారింది. అలాగే వారి విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. తండ్రి డాక్టర్గా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ జీనత్ బెగం తన ఉద్యోగాన్ని వదిలి పిల్లలతో కలిసి కోటా(రాజస్థాన్, దేశంలో కోచింగ్ హబ్)కు వెళ్లి వారి చదువుకు పూర్తిగా అంకితమయ్యారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే ఇద్దరి విజయానికి బలమైన పునాది అయింది.కోటాలో ఉన్న సమయంలో ఇద్దరూ అత్యంత క్రమశిక్షణతో చదివారు. రోజుకు సుమారు ఐదు గంటల కోచింగ్, గంటసేపు డౌట్స్ క్లియరింగ్, ఆపై గంటల తరబడి స్వీయ అధ్యయనం చేసేవారు. అదే సమయంలో పరస్పరం ఒకరికి ఒకరు క్లిష్టమైన అంశాలు వివరించడం, పరీక్షల తర్వాత కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వారి ప్రత్యేకతగా నిలిచింది.ఇప్పుడు ఈ ఇద్దరి కథ కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాదు, బంధాల విలువ గురించి కూడా చెబుతోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటును కూడా వదిలేసి కుటుంబం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి జీవితంలో సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తోంది. ర్యాంకులు, కాలేజీలు ఎంత గొప్పవైనా, బంధాలు వాటికన్నా గొప్పవని మహరూఫ్ తీసుకున్న నిర్ణయం నిరూపిస్తోంది. -
7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి
సాధారణంగా మనం ఆటోలో ప్రయాణిస్తున్నపుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు కంటే ఎక్కువ చార్జ్ వసూలు చేయకుండా, ర్యాష్గా డ్రైవ్ చేయకుండా, మనల్ని ప్రశాంతంగా గమ్యాన్ని చేర్చితే చాలు అనుకుంటాం, కదా. కానీ చెన్నైలో ఒక మహిళ షేర్-ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్ కథగా మారింది. తన ప్రయాణీకుల సేవ పట్ల చూపిన విలక్షణమైన విధానం మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. పదండి మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం.షోలింగనల్లూర్లో తనకు ఎదురైన ఒక ఊహించని ప్రయాణం గురించి వివరిస్తూ, @the_dharani_theory అనే ఇన్స్టాలో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. దీని ప్రకారం ప్రీమియం సౌకర్యాలున్న ఈ ఆటోలో అంతకుముందెన్నడూ లేని గొప్ప అనుభవం ఎదురైంది.షోలింగనల్లూరులో ఆటో ఎక్కిన వెంటనే ఎడమ వైపున ఫ్రంట్లైన్, ఫెమినా, అవుట్లుక్ నుండి UPSC ప్రిపరేషన్ మ్యాగజైన్ల వరకు అన్నీ అప్డేటెడ్ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతేనా.. చక్కగా పనిచేస్తున్న రెండు ఐప్యాడ్లు, ప్రయాణీకులందరికీ ఉచితంగా చాక్లెట్ బాక్సులు, గొడుగులు, ఒక మినీ కూలర్, కాఫీతో కూడిన ఫ్లాస్క్ ఉన్నాయి. ఆగండాగండి.. ఇంకా ఉన్నాయి. ఉచిత వైఫై , నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు , వైద్యులకు ఆటో రైడ్ ఉచితం అన్న వాక్యాలు కూడా కనిపించాయి. అతని ప్లేలిస్ట్లో షకీరా పాడిన "వెనెవర్, వెరెవర్" నుండి మురుగర్ భక్తి పాటల వరకు ఉండటం విశేషం.ఈ పోస్ట్ ఆటోలోని సౌకర్యాలను మాత్రమే కాదు ఈ ఆటో అన్న మనసారా పకలరిస్తాడు, నవ్వుతాడు , తన ప్రయాణికులను తీసుకువెళ్తున్నప్పుడు ముద్దుగా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తాడు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 7 భాషలు మాట్లాడతాడు. ఈఆటో డ్రైవర్ అన్న ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం ప్రయాణీకులపై చెరగని ముద్ర వేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయంఆ మహిళ వాహనం దిగడానికి కొద్ది క్షణాల ముందు కథ మరో ఊహించని మలుపు తీసుకుంది.మరో ప్రయాణికురాలు,కార్పొరేట్ ఉద్యోగి ఆ డ్రైవర్ను గుర్తుపట్టి, అతను వృత్తి, విద్యా రంగాలలో ఆరితేరినవాడనే విషయాన్ని ఈమెకు వివరించింది. రెండేళ్ల క్రితం తన కళాశాలకు అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఏడుసార్లు TEDX స్పీకర్. గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలలో ఉపన్యాసాలు ఇస్తాడు. View this post on Instagram A post shared by Dharani's Photoblog (@the_dharani_theory)మరోవైపు ఈమె టీచర్ కావడంతో ముందుగానే తాను ప్రకటించినట్టు, ఎంత బలిమాలినా కూడా ఆమె దగ్గర్నుండి ఒక్కపైసా కూడా చార్జ్ తీసుకోలేదు. ఆటోలో సౌకర్యాలు, అతను సాధించిన విజయాలు ప్రత్యేకంగా అనిపించినప్పటికీ, పని, జీవితం పట్ల డ్రైవర్కు ఉన్న దృక్పథమే ఆ ప్రయాణం నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. "ఆ రోజు ఆయన నాకు ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. మనమందరం మన ఉద్యోగాల గురించి ఫిర్యాదు చేస్తుంటాం, కానీ 'అన్న' నాకు ఒక విషయం నేర్పించారు. అదేంటంటే, మనం చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, మన చెడ్డ రోజుల్లో కూడా నూటికి నూరు శాతం కృషి చేస్తే, నిజాయితీగా పనిచేస్తే అందులో ఎలా విజయం సాధించవచ్చో. గుర్తుండిపోయే ఈ ప్రయాణానికి ధన్యవాదాలు @auto_anna."'ఆటో అన్న'కు నెట్టింట ప్రశంసలుఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. "ఆటో అన్న"గా పాపులర్ అయిన అన్నాదురైపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాము కూడా ఈ ఆటోలో ప్రయాణించామంటూ మరికొంతమంది తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అందరూ చేసే వృత్తిని, గౌరవించడం, మనస్ఫూర్తిగా సేవలందించడం ముఖ్యమని పేర్కొన్నారు. -
సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!
రెండు ఆనందాలు ఒకేసారి వస్తే ఆ ఫీలే వేరేలెవెల్. అందులోనూ తన కిష్టమైన వ్యక్తిని సర్ప్రైజ్ చేసేలా ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఇలా వృత్తిపరమైన వైలురాయిని వ్యక్తిగత విజయాన్ని జరుపుకుంటే అక్కడే చూసేవాళ్లకు సైతం ఆశ్చర్యం ఆనందం ఒకేసారి వస్తాయి కదూ. అలాంటి అందమైన సందర్భమే నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ ప్రపోజ్ బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు.భారత సైన్యపు ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో జరిగిన అందమైన ప్రపోజల్ వీడియో అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS)లో తన ఫ్లైట్ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యపు ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన ప్రియురాలు ఆరుషికి ఆశ్చర్యపోయేలా ప్రపోజ్ చేశాడు. ఆ అనూహ్యమైన పనికి ఆరుషి ఒక్కసారిగా విస్తుపోతూ అతడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. తన కుటుబం సభ్యులు, అధికారులు, శిక్షకులు, అతిథుల చప్పట్లు, కేరింతలు హోరెత్తిస్తుండగా చేసిన ప్రపోజల్ ఆమెకు ఎప్పటి మర్చిపోరాని జ్ఞాపకంలా అందించాడు ఆర్మీ పైలట్ భరత్. ఈ మేరకు ఈ వీడియోని షేర్ చేస్తూ..భరత్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. మేమంతా ఈ రోజు పైలట్లుగా, శిక్షకులుగా మారం. ఇది మా అందరికీ అతి ముఖ్యమైన రోజు. మా కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. గత ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఆమెకు ఇలా పెళ్లి ప్రతిపాదన చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదని అనుకుంటున్నా. నా కుటుంబానికి, కాబోయే భార్యకు ఈ రోజు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశా అని పేర్కొన్నాడు కెప్టెన్ భరద్వాజ్.#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F— ANI (@ANI) June 2, 2026 (చదవండి: విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..) -
వైరల్ వీడియో.. సుప్రీం కోర్టులో బిగ్ హైడ్రామా
ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.బిహార్లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
బిహార్లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది. ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్ రాహుల్ని వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్గా మారాడు. రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ సర్జరీ కోసం నయన్శ్రీ రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది. అన్నీ సవ్యంగా ముగిసిన తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీపూర్లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.कल तक बहन, आज जीवनसाथी ! बिहार के जमुई में एक BPSC शिक्षिका ने अपनी फुफेरी बहन से शादी कर ली। शादी से पहले बहन ने जेंडर ट्रांजिशन कराया और दोनों ने हिंदू रीति-रिवाज से विवाह किया। मामला चर्चा का विषय बना हुआ है। pic.twitter.com/xSv0NNMsFD— Yash Ahmad (@YashAhmad8) June 2, 2026 ఐదేళ్ల లవ్నయన్శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్/రాఖీ తండ్రి కోల్కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.కుటుంబంలో గొడవలురాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు. -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన ఘటన, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..బులంద్షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!Bulandshahr, UP : Monkey 🙈 snatched a bag with ₹2 Lakh , climbed on a tree and started showering cash from the top of the tree 😳 pic.twitter.com/Sy2tbz21ce— Amitabh Chaudhary (@MithilaWaaala) June 1, 2026 కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు -
బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు
పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్గఢ్లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్గా మారింది.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా! తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా లైఫ్ పార్ట్నర్తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది.. వీడియో చూస్తే వణుకే!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు భయంకరమైన విషసర్పం రెండు గంటలు ఒళ్లంతా చుట్టేసినా సురక్షితంగా బయటపడ్డాడో వ్యక్తి. ఒడిశాలోని బౌధ్ జిల్లా అదెనిగఢ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తి రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిన ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎట్టకేలకు ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతమని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.ఏం జరిగిందీ అంటే..హరభంగ బ్లాక్ పరిధిలోని అదెనిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు. ఈయన పక్షవాతం (Paralysis) బాధపడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన తన ఇంట్లో పడుకుని ఉండగా, తెరిచి ఉన్న కిటికీ లోంచి ఒక విషసర్పం గదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి గాధనిద్రలో ఉన్న సాహు ఒంటి మీదికి చేరింది. శరీరంపైఏదో పాకుతున్నట్టు గమనించిన సాహు అసలు విషయం తెలిసి తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడు. కానీ పక్షవాతం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఆయన అక్కడి నుండి త్వరగా తప్పించుకోలేకపోయాడు. ఆ గందరగోళంలో పాము ఆయన చేతికి, అలాగే పక్కనే ఉన్న కుర్చీకి కలిపి గట్టిగా చుట్టుకు పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము చేసే ఏ చిన్న పొరపాటు జరిగిన అతని ప్రాణాలకే ప్రమామని గ్రహించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.इन चाचा को इस जहरीले और खतरनाक सांप ने इस तरह जकड़ लिया है कि खुद को छुड़ाना भी मुश्किल हो रहा है। 😱क्या लगता है, ये इस मुसीबत से बच पाएंगे या नहीं? अपनी राय जरूर बताइए। pic.twitter.com/0JS6WzNOFw— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) June 1, 2026 ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్రెండు గంటల ఉత్కంఠదాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు సాహును పాము పట్టు నుండి కృష్ణ చంద్ర సాహును సురక్షితంగా విడిపించారు. అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటి వెలుపల సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ క్రమంలోసాహుకు హాని ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ కాలంలో మండించే ఎండలు, వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులు జాగ్రత్తగా మూసి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్ చేస్తే -
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్ -
విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..
కొందరు కేవలం పర్యాటనలకు వెళ్లి వచ్చేయరు. పర్యావరణ స్ఫూర్తిని రగిలించే ఆలోచింప చేస్తారు. అందుకు దేశం, సరిహద్దుతో పనిలేదు. మంచి మనసు, తనవంతుగా పర్యావరణానికి మేలు చేయాలన్న దృక్పథం చాలు అని నిరూపిస్తున్నాడు ఈ విదేశీయుడు. అంతేగాదు అతడి చర్యకు అక్కడి ప్రభుత్వం స్పందించి కదలివచ్చింది కూడా.పర్యావరణ బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తూ..అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు బ్రిటన్కు చెందిన మార్క్. ఆయన ఉత్తరాఖండ్లోని కాసర్ దేవి ప్రాంతంలో అటవీ మార్గాలు, పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నిశబ్దంగా ఏరుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సంచులు చేత బట్టుకుని సుందరమైన కొండ ప్రాంతంలో పడి ఉన్న ప్లాస్టిక్ను, చెత్తను ఏరుతూ కనిపించాడు. అక్కడి స్థానికుల ప్రకారం..మార్క్ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడట. పైగా పరిశుభ్రతను తన వ్యక్తిగత దినచర్యగా మార్చుకున్నాడని చెబుతున్నారు. అతను ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు సమీపంలోని అటవీ ప్రాంతాలను కాలిబాటను శుభ్రం చేస్తూ..ఆ ప్రాంత సహజ సౌందర్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని కృషి ఆన్లైన్లో విశేష ప్రచారం పొందింది. అతడు చేస్తున్న పని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పిందని అక్కడకి వస్తున్న పలువురు పర్యాటకులు చెబుతుండటం విశేషం.అంతేగాదు అతడొ చొరవకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫిదా అవ్వతూ అతడిని అభినిందించింది. అలాగే అతడికి అన్ని విధాల మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అంతేగాదు అక్కడి అధికారులు పర్యావరణం, పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పించడంలో సానుకూల ఉదహారణగా నిలిచాడని ప్రశంసించారు. అంతేగాదు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత పట్ల విద్యార్థులను, యువతను ప్రేరేపించే విధంగా మార్క్ను ఒక "మార్పు కారకుడిగా" ప్రోత్సహించాలని పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. View this post on Instagram A post shared by India 🇮🇳 (@postingfornation) (చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్ జల్సాలు’
కట్టుకున్న భార్యను చదివించేందుకు ఓ భర్త చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం అమ్మి భార్యను చదివిస్తే.. తీరా ఉద్యోగం వచ్చాక కుటుంబాన్ని ఎగతాళి చేసి కన్న కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాక్ తగిలింది. ఆమె తన ప్రియుడితో కలిసి చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె ఆగిపోయినంత పనైంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, ఉద్యోగం తర్వాత మారే సంబంధాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.బీహార్లోని వైశాలి జిల్లా హాజీపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను 2013లో గుంజన్ కుమారిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆమె ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తిచేసి ఉంది. అయితే, ఆమెకు టీచర్ కావాలన్న లక్ష్యం ఉందని భర్తకు చెప్పింది. దీంతో, ఆమెను చదివించాలని అమన్ అనుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, తాను కూలి పనులు చేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా 2022లో తన భూమిని అమ్మి.. ఆమె డిగ్రీ, బీఈడ్ చదువులు, బీపీఎస్సీ టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.తర్వాత గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో ఎంపికై టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సుపౌల్ జిల్లాలో శిక్షణ పూర్తిచేసిన అనంతరం బిదుపూర్ బ్లాక్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన వద్దకు పంపించి, తాను సహచర టీచర్లతో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని చెప్పింది. కానీ తర్వాత ఆ ప్రయాణానికి ఇతర టీచర్లు ఎవరూ వెళ్లలేదని అమన్కు తెలిసింది. దీంతో తన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆరా తీయగా.. శిక్షణ సమయంలో ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉండడం ప్రారంభించిందని గుర్తించాడు.🚨Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC SuccessThe shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026ఈ క్రమంలో మే 23న హాజీపూర్లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంటికి వెళ్లగా, అక్కడ ప్రేమ్ ప్రకాశ్తో కలిసి ఉండడాన్ని అమన్ చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే డయల్-112 పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. తన తల్లి మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని ఒత్తిడి చేసిందని, తాను ఆమెతో ఉండాలని అనుకోవడం లేదని బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చిన్నారి భవిష్యత్తు, మానసిక పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
30 రోజులు, 13 నగరాలు: రూ.10 లక్షల ఖర్చు
ఒక అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజుల పాటు 13 నగరాలను సందర్శించా మంటూ ఇన్స్టాలో చేసిన పోస్ట్ చేసి వైరల్గా మారారు. ఈ టూర్ కోసం ఈ జంట ఏకంగా 10,605 డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ట్రావెలర్స్ అలెక్స్, అమేలియా తమ ఇన్స్టాగ్రామ్లో ఈ ఖర్చుల వివరాలను పంచు కున్నారు. అయితే ఖర్చు తాము అనుకున్నదానికంటే ఎక్కువే అయిందని అంగీకరించారు. తాము లగ్జరీ హోటళ్లు, ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ భారీ ఖర్చుకు కారణమని వారు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Alex & Amelia | Full-Time World Travel (@checkedouttocheckin)మొత్తంగా ఇండియాలో నెల రోజుల కోసం రూ. 10 లక్షలు అంటే, రోజు రూ. 33,627 అన్నమాట అని ఆ జంట రాసుకొచ్చింది. 30 రోజుల్లోనే 13 నగరాలను సందర్శించడం వల్ల తమ ట్రిప్లోట్రాన్స్పోర్ట్ కోసమే అత్యధికంగా ఖర్చయిందని వారు తెలిపారు. తమ భారత పర్యటనలో భాగంగా ఆరు విమానాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రీమియం హోటళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖర్చు పెరిగిందని, రోజుకు సగటున హోటల్ రూమ్ కోసం రూ. 12,064 ఖర్చు చేసినట్లు చెప్పారు.మొత్తం లెక్కలు వేసి, ఒక నెలలో ఇంత ఖర్చు చేశామా అనే తామే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. కేవలం బడ్జెట్ ఎంపికల కోసం మాత్రమే చూడకపోతే, ఇతర ప్రయాణికులు చెప్పినంత చౌకగా వసతి లేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం బయట తినడంతో జేబులు ఖాళీ అయ్యాయని చెప్పుకొచ్చారు. వామ్మో..ఇది నిజంగానే ఎక్కువ : సోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆ ఖర్చు చూసి ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆ జంట మహారాజుల్లా బతికారు కాబట్టి అంత ఖర్చవ్వడంలో వింతేమీ లేదన్నారు. ఖచ్చితంగా మహారాజుల్లా రాజభోగాలు అనుభవించి ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో..ఇది నిజంగానే చాలా ఎక్కువ అని కొందరన్నారు. ప్రత్యేక అనుభూతులు మిగుల్చుకోవాలంటే.. తప్పదు మరి. అయితే కరోనా తరువాత ఖర్చులు బాగా పెరిగాయన్నారు మరొకరు. -
రెండు నెలలకొకసారి ‘టీం లంచ్’ : ఫోటో వైరల్
హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన డ్రైవర్, పనిమనిషితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ, భారతదేశంలో వర్గ భేదాలు నెమ్మదిగా తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తద్వారా తన దినచర్యలోని ఒక సాధారణమైన,కానీ హృద్యమైన సంగతులను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.హైదరాబాద్కు చెందిన నరేష్ షేర్ చేసిన ఎక్స్లో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కీమా పరాఠా తింటూ కెమెరా వైపు చూసి నవ్వుతున్న నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఉల్లాసభరితమైన సెల్ఫీ తో షేర్ చేస్తూ దేశంలోని వర్గ భేదాలు మెల్లగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.తమ ఇంట్లో పనిచేసే సిబ్బందితో( డ్రైవర్, మేడ్) కలిసి ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇలా 'టీమ్ లంచ్' చేస్తానని నరేష్ క్యాప్షన్లో రాశారు. అంతేకాదు మొదట్లో వారు తనతో కలిసి డైనింగ్ టేబుల్పై కూర్చోవడానికి ఎంతలా సంకోచించారో కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమాజంలో ఉన్న అలవాట్లు, కండిషనింగ్ వల్ల వారు అలా కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు."భారతదేశంలో ఉన్న ఈ వర్గ వ్యవస్థ పోవాలి. దేవుడి కోసమైనా గుర్తుంచుకోండి, ఇది 2026!" అని ఆయన రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెనుక ఒక మంచి సందేశం ఉన్నప్పటికీ, తాము తిన్నది మాత్రం చాలా సాధారణమైన 'కీమా పరాటా' మాత్రమేనని నరేష్ సరదాగా పేర్కొన్నారు.నెటిజన్ల ప్రశంసలుఈ పోస్ట్పై ఇంటర్నెట్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, సమాజంలోని వర్గ భేదాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు లేదా ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ పాత అలవాట్ల వల్ల విడిగా తినడానికే మొగ్గు చూపుతుంటారని, కానీ తాము కూడా వారిని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకే రకమైన పాత్రల్లో భోజనం పెట్టడం ద్వారా ఆ అదృశ్య గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు కామెంట్ చేశారు. నేటితరం శ్రమను గౌరవిస్తున్నారని పాతకాలపు వర్గ వ్యవస్థలను అంగీకరించడం లేదని, ఇలాంటి మార్పులు కొత్త తరం ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. -
సీబీఎస్ఈ టెండర్లో సంచలన ట్విస్టులు?
న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్.. డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.12వ తరగతి విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్గా మారినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.సీబీఎస్ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్పై వివాదం🔹 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్ (ప్రస్తుత కోయెంప్ట్ ఎడుటెక్)కు కాంట్రాక్ట్🔹 టెండర్ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్ఈ🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్కు టెండర్ దక్కినట్లు ఆరోపణలుసార్థక్ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్ విఫలమైతే సంస్థను భవిష్యత్లో బ్లాక్లిస్ట్ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. జవాబు పత్రాల స్కానింగ్లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెండర్ రూల్స్లో మార్పులు➡️ గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు➡️ సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు➡️ థర్డ్పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానంఇటీవల సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్లో వెలుగుచూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్ నిర్వహించాలని, పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.లేవనెత్తుతున్న ప్రశ్నలు❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది? This is an unbelievable piece of work by Sarthak and something that requires amplification. Let me explain what he found, in simple terms.Sarthak is a Class 12 student from the 2025-26 batch, one of the 17 lakh students whose answer sheets went through CBSE's new On-Screen… https://t.co/1wB5ZRx5qO— Malay Krishna (@Malay4Product) May 29, 2026అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్ఈ లేదా కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్ఈ టెండర్ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది. -
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..
వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక ఫిట్నెస్ ట్రైనర్–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్ మావో". అతనొక చైనా జిమ్ ట్రైనర్. తన క్లయింట్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్ పోస్టుల సారాంశం. A forbidden love affair between a fitness trainer and a woman ended in tragedy. When the woman's husband returned home early from work, Huang Mao, who was hanging from a balcony outside the building, fell to his death. pic.twitter.com/Q4xjNfRD9J— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) May 28, 2026Fitness coach Huang Mao has an affair, the male homeowner returns,crouching on the window ledge he accidentally falls off the building, dying on the spot. pic.twitter.com/FiB0O3GUXv— Josh Blaq (@Josh_korn1) May 28, 2026 ప్రస్తుతం ఎక్స్, టిక్టాక్ తదితర వేదికల్లో వైరల్ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. అయితే.. సాక్షి.కామ్ ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్ ట్రైనర్ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్ ట్రైనర్, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. -
లగ్జరీ బైక్పై బెంగాల్ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ బైక్ రైడ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్కత్తా వీధుల్లో ఖరీదైన హోండా గోల్డ్ వింగ్ను రాయల్గా చక్కర్లు కొట్టారు. ఈ రైడ్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia ట్యాగ్ చేయడం విశేషం ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.దీనికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి దిలీప్ ఎక్స్లో షేర్ చేశారు, Honda BigWing సూపర్ బైక్ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్ గురించి రాసుకొచ్చారు.#WATCH | West Bengal Minister Dilip Ghosh seen riding a bike, in Kolkata this morning. pic.twitter.com/OKBr643M33— ANI (@ANI) May 29, 2026 1.1 Today, I rode a Honda BigWing superbike. It is a high-speed 1800cc, 6-cylinder motorcycle.The bike is extremely comfortable & offers incredible speed.There is ample space at the back with a sofa-like passenger seat,ensuring that the pillion rider can also sit very comfortably pic.twitter.com/al8jWEKVkF— Dilip Ghosh (Modi Ka Parivar) (@DilipGhoshBJP) May 29, 2026


