breaking news
Warangal
-
డిగ్రీ పాస్ అంతంతే!
బాలికలదే పై చేయి నాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. ● మొదటి సెమిస్టర్లో బాలికలు 11,295 మందికిగాను 3,776 మంది (33.43శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాయ్స్ 14,166మందికిగాను 3,336 మంది (23.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్కంటే బాలికదే పైచేయిగానే ఉంది. ● రెండో సెమిస్టర్లో బాలికలు 25,603మందికిగాను 10,742మంది ఉత్తీర్ణత (41.96శాతం) సాధించగా, బాయ్స్24,689మంది కిగాను 5,644మంది (22.86శాతం) పాసదయ్యారు ఉత్తీర్ణత సాధించారు. ● మూడవ సెమిస్టర్లో బాలికలు 7,834మందికిగాను 3,591మంది (45.83శాతం), బాయ్స్ 10,452మందికిగాను 3,400 (32.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 4వ సెమిస్టర్లో బాలికలు 19,947మందికిగాను 9,587మంది ఉత్తీర్ణత (48.06శాతం), బాయ్స్18,086 మంది కిగాను 5,032 మంది (27.82శాతమే )ఉత్తీర్ణత సాధించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా..? డిగ్రీకోర్సుల సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలి తాలు సాధించలేకపోవటానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవటం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవటంతో కొన్ని ప్రేవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ నిర్వహించడం లే దు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలు ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం.. డీజీపీ సీవీ ఆనంద్ పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
పెద్ది జ్ఞాపకాలతో కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞా పకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం నల్లబెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, న ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ..‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేట లో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆ యనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరి ద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావో యిస్టుల ప్రభావం తగ్గడంతో అటవి ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
రూ.కోట్ల విలువైన భూమి గోల్మాల్ !
పరకాల: కోట్ల రుపాయల విలువైన తమ భూములను నకిలీ ధ్రువపత్రాలతో కొందరు అక్రమంగా పట్టా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని పరకాలకు చెందిన కొందరు భూబాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూబాధితులు లక్కం సురేశ్, పొరండ్ల రాజయ్య, రాంశెట్టి రాజేందర్తో పాటు తిక్క రాజయ్య, తిక్క శంకరయ్య, తిక్క దేవేందర్ పరకాల పట్టణంలో తమ భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై గోడు వినిపించారు. లక్కం సురేశ్ మాట్లాడుతూ.. పరకాల శివారులోని 689 సర్వే నంబర్లోని 15 గుంటల వ్యవసాయ భూమిని 2013లో కొలగాని నాగయ్య వద్ద కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. (నాగయ్య మనవడు రామిశెట్టి రాజేందర్ నుంచి పావుశెట్టి రాజు కొన్నాడు. అతడి నుంచి సురేశ్ భూమి కొన్నాడు) ఈ నేపథ్యంలో అదే సర్వే నంబర్లో కొంత భూమి నాగయ్య వారసుడు కొలగాని లింగయ్య పేరిట ఉందని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూమి తమదేనని కాగితాలు సృష్టించి లింగయ్య అక్రమంగా పట్టా చేసుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయమై పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రిజిష్ట్రేషన్ చేసిన భూములను మరొకరి పేరిట ఎలా పట్టా చేస్తారని స్థానిక తహసీల్దార్ను నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ రూ.50 కోట్ల విలువైన భూములను అన్యాయంగా ఇతరుల పేరిట మార్చినట్లు ఆరోపించారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. న్యాయం చేయాలంటూ భూ బాధితుల ఆవేదన రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం.. -
డిగ్రీ పాస్ అంతంతే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా..? డిగ్రీకోర్సుల్ల సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవటానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవటం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవటంతో కొన్ని ప్రేవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ నిర్వహించడం లేదు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా క్లాస్లకు హాజరయ్యేలా, కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలు ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను, వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీని యర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇప్పుడిప్పుడే..
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు పూర్తయినా..విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం మెటీరియల్ ఇప్పుడిప్పుడే జిల్లాకు చేరుకుంటుంది. పాఠశాలల ప్రారంభం రోజున ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నా.. ఒక పుస్తకాలు మాత్రమే సకాలంలో అందించారు. యూనిఫాం అందించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు పాత దుస్తులతోనే జరుపుకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 664 పాఠశాలలు ఉండగా 29,899 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏప్రిల్ మాసంలోనే విద్యార్థుల కొలతలు తీసుకుని పభుత్వానికి ఇండెంట్ పంపించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతంలో మెప్మా.. జిల్లాలో దుస్తులను కుట్టే బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతంలో మెప్మా పర్యవేక్షణలో మహిళా సంఘాల (ఎస్హెచ్జీ) గ్రూప్లకు బాధ్యతను అప్పగించారు. అయితే ప్రభుత్వం ఈసారి యూనిఫాం కలర్ మార్చి ఇవ్వాలనే ఆలోచన చేసింది. దీంతో జాప్యం జరిగి ఇప్పటి వరకు మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు క్లాత్ అందకపోవడంతో విద్యార్థులకు పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఆధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎమ్మార్సీ కేంద్రాలకు.. జిల్లాలో ఇప్పుడిప్పుడే క్లాత్ (మెటీరియట్) ఎమ్మార్సీ కేంద్రాలకు చేరుకుంటుంది. దీంతో ఎప్పుడు యూనిఫాం తయారవుతుంది..ఎప్పుడు పాఠశాలలకు చేరుకుంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే యూనిఫాం తయారుకావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఎమ్మార్సీలకు చేరుకుంటున్న నూతన యూనిఫాం క్లాత్ పూర్తి దుస్తులు తయారవడానికి మరో నెలరోజుల సమయం పాత దుస్తులతోనే పంద్రాగస్టు వేడుకలు జిల్లాలో 664 పాఠశాలలు, 29,899 మంది విద్యార్థులుకొత్తగా చేరిన విద్యార్థుల సంగతేంటి? ఏప్రిల్ మాసంలో పాత యూడైస్ ప్రకారం 29,899 ఉన్న విద్యార్థులకు మాత్రమే అధికారులు దుస్తులకు సంబంధించిన మెటీరియల్ పంపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం (2026–27)లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది. పాత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. -
జిల్లాలో ఇలా..
పెండింగ్ ఫారాలు: 0జిల్లా మొత్తం ఓటర్లు జిల్లాలో సేకరించలేని మొత్తం ఫారాలు మరణించినవారు5,09,01476,99114,7578,5001,4081,01,781125 అత్యధిక ఓటర్లు: హనుమకొండ మండలంలో 2,10,521 మంది తర్వాతి స్థానంలో: కాజీపేటలో 61,115 మంది అత్యధిక డిజిటలైజేషన్ శాతం: దామెర మండలంలో 95.49 శాతం తర్వాతి స్థానాల్లో: ఆత్మకూరు 93.59 శాతం, నడికూడ 93.35 శాతం అత్యల్ప డిజిటలైజేషన్ శాతం: హనుమకొండ మండలంలో 69.71 శాతం తర్వాతి స్థానాల్లో: కాజీపేట 74.66 శాతం అత్యధిక శాతం సేకరించలేని ఫారాలు: హనుమకొండ మండలంలో 30.29 శాతం తర్వాతి స్థానాల్లో: కాజీపేట 25.34 శాతం అత్యల్పంగా సేకరించలేని ఫారాలు: దామెరలో 4.51 శాతం, ఆత్మకూరులో 6.41 శాతం. అత్యధిక శాశ్వత వలసలు: హనుమకొండ మండలంలో 52,851 మంది. తర్వాతి స్థానంలో: కాజీపేటలో 11,922 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా నమోదయ్యారు. -
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
ఎల్కతుర్తి: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్ల లకు నాణ్యమైన విద్యనందించడమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. సుపరిపాలన అందించాలని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవడం సంతోషకరమన్నారు. నాబార్డ్ నిధులతో అదనపు మరుగుదొడ్లు, కిచెన్షెడ్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్ల తెలిపారు. విద్యలో ప్రతిభ కనబర్చి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రులు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్యనాయక్, డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ ప్రసాద్రావు, ఎంపీడీఓ విజయ్కుమార్, ప్రిన్సిపాల్ అనితాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేజీబీవీ నూతన భవనం ప్రారంభోత్సవం తహసీల్దార్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ -
పెద్ది జ్ఞాపకాలతో.. కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం.. మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత.. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎ ట్లా బతికామన్నదే ముఖ్యం.. సమాజం కోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్, నాయకులు గండ్ర జ్యోతి, సతీశ్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ బంగ్లా ఎదుట జైల్ భరో.. హన్మకొండ అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం సుబేదారి కలెక్టర్ బంగ్లా ఎదుట సోమవారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకోతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వారిని సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించగా, అక్కడే బైఠాయించి మరో అరగంట పాటు ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ చౌరస్తా : రైతులను, కార్మికులను అధోగతి పాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. సోమవారం వరంగల్ హెడ్ఫోస్టాఫీస్ సెంటర్ల రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదం పేరు చెప్పి ఆచరణలో అమెరికా లాంటి విదేశాలకు అనుకూలంగా విధానాల రూపకల్పన చేసి రైతులను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతోపాటు వ్యవసాయాన్ని వదిలి కూలీలుగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, కుసుంబ గంగాధర్, దయాకర్, జిల్లా కన్వీనర్లు చుక్క మొగిలి, శ్రీనివాస్, బాలరాజు, సూరి, భాస్కర్, కుమార్, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాశం రవి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాకెట్ పడితే పతకం ఖాయం! ● బ్యాడ్మింటన్లో వేదితారెడ్డి ప్రతిభ ● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో 20 వరకు పతకాలు ● అండర్–13లో జాతీయస్థాయిలో 26వ ర్యాంక్నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బ్యాడ్మింటన్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది. బ్యాడ్మింటన్ కోర్టులో దిగి బ్యాట్ (రాకెట్) పడితే పతకం ఖాయం అన్నట్లుగా పట్టుదలతో ఆడి పతకాలు సాధిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట పట్టణానికి చెందిన కట్కూరి సురేష్రెడ్డి, మమత దంపతుల కుమార్తె వేదితారెడ్డి ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. మొదటి నుంచి బ్యాడ్మింటన్పై ఆసక్తి ఉండేది. ఆటల్లో ప్రతిభ కనబరుస్తుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అండర్ 13 విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ సుమారు 20 పతకాలు సాధించింది. ఇటీవల హైదరాబాద్లో ప్రభుత్వ సహకారంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునెక్స్ సన్రైస్ 11వ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి ఒలింపిక్ ప్లేయర్ తనీషాక్రాప్టో చేతుల మీదుగా బహుమతి అందుకుంది. గతంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లోనూ రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. పట్టుదలతో పతకాలు సాధిస్తుండటంతో పట్టణానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు. ఒలింపిక్స్లో ఆడటమే లక్ష్యంవేదితారెడ్డి బ్యాడ్మింటన్పై మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తన ప్రతిభను గుర్తించి హైదరాబాద్లోని ఓ అకాడమీలో కోచ్ నిఖిల్కుమార్ పర్యవేక్షణలో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇండియా తరఫున ఒలింపిక్స్లో ఆడటమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. –వేదితారెడ్డి తండ్రి సురేష్రెడ్డి -
‘పెద్ది గద్దె’ తొలగింపుతో నర్సంపేటలో రగిలిన రాజకీయం
సాక్షి, వరంగల్: నర్సంపేటలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను రాత్రికి రాత్రే అధికారులు కూల్చివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు సమాచారం. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి పేరుతో రాత్రి వేళ కూల్చివేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ ధర్నాగద్దె కూల్చివేతకు నిరసనగా సోమవారం ఉదయం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు యత్నంధర్నా నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమించాలని సూచించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ప్రస్తుతం నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ది కుటుంబాన్ని ఆదివారం కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే.. విగ్రహ గద్దె కూల్చివేత చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నేరాల స్వరూపం మారుతోంది
సాక్షిప్రతినిధి, వరంగల్: ఒకప్పుడు నక్సలైట్ల కదలికలు, కూంబింగ్ ఆపరేషన్లతో పోలీసులకు సవాల్గా ఉన్న తెలంగాణలో ఇప్పుడు నేరాల స్వరూపం పూర్తిగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మావోయిజం పూర్తిగా అంతరించిన నేపథ్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, ఆర్థిక నేరాలే కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు. టీ–ఈగల్ ఫోర్స్, సీసీటీఎన్, ట్రాఫిక్, సీఐడీ, సైబర్ క్రైం తదితర విభాగాలకు చెందిన అధికారులతో కలిసి బృందంగా జిల్లాల పర్యటన చేస్తున్నామన్న ఆయన.. డ్రగ్స్, ఆర్థిక నేరగాళ్లపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆదివారం వరంగల్ నిట్లో అధికారులతో సమీక్షించిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాల బారినపడి ప్రజలు సుమారు రూ.1,750 కోట్లు నష్టపోయారని చెప్పారు. అయితే ఈ తరహా నేరాల అదుపులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాలు ఇప్పుడు గ్రామాలకూ చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నక్సల్ బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘టీజీ వీర్’అప్లికేషన్ ప్రారంభించామని చెప్పారు. మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉండేవారని డీజీపీ పేర్కొన్నారు. వారు ఉన్న సమయంలో గంజాయి సరఫరా చేసేందుకు ఎవరూ ధైర్యం చేసేవారు కాదని తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించి, మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బ్యూరోను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. భద్రత తగ్గింపుపై రాజకీయం వద్దు.. నక్సల్స్ సమస్య ఉన్న సమయంలో రాజకీయ నేతలకు భద్రత కల్పించామని, ఇప్పుడు ఆ అవసరం తగ్గిన నేపథ్యంలో భద్రతను సమీక్షిస్తున్నామని డీజీపీ ఆనంద్ చెప్పారు. కొందరికి భద్రత తగ్గించామని, దీనిని రాజకీయ కోణంలో చూస్తూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన కాన్వాయ్ మూడు వాహనాలకు తగ్గించుకున్నారని, తాను కూడా తన భద్రతను తగ్గించుకున్నానని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. రోడ్డు మార్గంలో కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెలికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పెద్ది కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్నకుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటం వద్ద నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంప్రముఖుల పరామర్శ..మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
‘కార్ల’ సైన్యం!
● కిక్కిరిసిన జాతీయ రహదారి నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కార్లతో కూడిన కాన్వాయ్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి నల్లబెల్లికి ఆదివారం వచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కేసీఆర్ కాన్వాయ్ వరంగల్కు చేరుకోగానే కార్లతో అనుసరించి నల్లబెల్లికి చేరుకోవడంతో భారీ కార్ల ర్యాలీ ఏర్పడింది. మల్లంపల్లి నుంచి నర్సంపేట వరకు 365 జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీ సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా సైబర్ మోసాలకు తావుండదని చెప్పారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. సోషల్ మీడియాకు ప్రజలు బానిసలవుతున్నారని, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో విడదీయరాని అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతీ రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కి పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కి, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదైనట్లు డీజీపీకి అధికారులు వివరించారు. చోరీల ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించా లని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్లతో నేరాలు పెరుగుతున్నాయన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నర్సంపేట: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలో ఆదివాసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణరెడ్డి, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి, ఆదివాసీ సంఘం నాయకులు గట్టి పాపయ్య, జగ్గారావు, నర్సింహారావు, గొంది నాగేశ్వర్రావు, ఎల్లయ్య, ప్రణయ్దీప్, రవి, లక్ష్మ య్య, పాపయ్య, రామస్వామి, కృష్ణమూర్తి, సమ్మయ్య, వీరస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు. అలాగే మహేశ్వరం గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి చిన్న చంద్రన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. -
ఇక తప్పించుకోలేరు!
సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు. నేరస్తులను ఎలా గుర్తిస్తారంటే.. ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది. కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు. పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. సైబర్ నేరాల్లో కీలకం.. ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి. ‘నాట్గ్రిడ్’తో నేరస్తుల జాడ ఆధారాలను అనుసంధానించి నిందితుల గుర్తింపు వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం ఇక నేరస్తులను పట్టుకోవడంలో పెరగనున్న మరింత వేగం‘డేటా’తో దర్యాప్తులో వేగం.. గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్గ్రిడ్ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్గ్రిడ్తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది. -
దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలి
ఖానాపురం: దివ్యాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం దివ్యాంగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క దివ్యాంగుడికి పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,500 మంది దివ్యాంగులు నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మేరుగు శంకర్, ఉపాధ్యక్షుడు మద్దూరి రవి, ప్రధాన కార్యదర్శి లావుడ్య రామోజీ, సహాయ కార్యదర్శి ధరావత్ భద్రు, కోగంటి ప్రభాకర్రావు, రాములు, తదితరులు పాల్గొన్నారు. నేటి ‘జైల్భరో’ను జయప్రదం చేయండిసంగెం: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నేటి (సోమవారం) ‘జైల్భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు కోరారు. ఆదివారం సంగెం మండలకేంద్రంలో ఆటో జాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల అనిల్కుమార్, ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండేటి స్వామి, సీఐటీయూ మండల కన్వీనర్ దుపాకి రాజు, మండల నాయకులు మెట్టుపల్లి శంకర్, గుండేటి రామృష్ణ, మెట్టుపల్లి బాబు, నీరటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. -
నేడు ఎల్కతుర్తికి మంత్రులు
ఎల్కతుర్తి: మండల కేంద్రంలో నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాయకులు, అఽధికారులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థలాన్ని పరిశీలించిన ఇన్చార్జ్ కలెక్టర్ రవి.. తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి ఆదివారం మండల కేంద్రంలో స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రసాద్రావు, ఈఈ దేవక చౌహాన్ తదితరులు ఉన్నారు. -
నెరవేరుతున్న పేదల సొంతింటి కల
కమలాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరబోతోందని కుడా చైర్మన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. మండలంలోని కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలించి మాట్లాడారు. నిరుపేదలు కలలుగన్న సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైందని, సోమవారం రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడత మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిపేదవారిని ఆదుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ జెండా గద్దె ఆవిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, హుజూరాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేడు కమలాపూర్కు రానున్న మంత్రులు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కమలాపూర్కు రానున్నట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను గూడూరులో ప్రారంభించిన అనంతరం మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్స్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి -
ఆదివాసీల సంస్కృతిని పరిరక్షించుకోవాలి
ఖిలా వరంగల్: ఆదివాసీ, గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జూనియర్ సివిల్ జడ్జి రాజ్ నిధి అన్నారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వరంగల్ యాకూబ్పురంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో గిరిజనుల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి రాజ్నిధి హాజరై మాట్లాడారు. గిరిజనులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సాయం పొందవచ్చునని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ నిహారిక, న్యాయవాది పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ హేమంత్, సిబ్బంది పాల్గొన్నారు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్తంగా తైక్వాండో పోటీలు నిర్వహించారు. మాతంగి ప్రవీణ్ బ్లాక్ బెల్ట్ మూడో డాన్ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబర్చి తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు తెలిపారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం
కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. ● ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు -
పోలీస్ శాఖలో ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్ శాఖలో ఎన్నికల సందడి పెరిగింది. సుమారు పదమూడేళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరగలేదు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇటీవలే డీజీపీ సీవీ.ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, వివిధ యూని ట్లలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ఇందులో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల అధికారిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఆర్.ప్రభాకర్రావు వ్యవహరిస్తుండగా.. మూడు జిల్లాల్లో 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. వీరంతా కార్యవర్గ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు 13 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది. 13 ఏళ్ల తర్వాత.. టీజీపీఓఏకు మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో సుమారు 13 ఏళ్లుగా పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు లేకుండాపోయాయి. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంఘం ఎన్నికలపై దృష్టి సారించారు. డీజీపీ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష పదవిని సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్కు చెందిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు చేపట్టవచ్చు. ఎస్ఐ/ఇన్స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ అధ్యక్షుడైతే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్ఐ/ఇన్స్పెక్టర్ స్థాయికి చెందిన వారై ఉండాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానాన్ని మహిళా పోలీసులకు రిజర్వ్ చేసినట్లు పోలీసువర్గాల సమాచారం. కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు 13 పోస్టులకు 13న ఎన్నికలు జరగనున్నాయి. ‘పొలిటికల్’ను తలపిస్తూ.. కమిషనరేట్ పరిధి అన్ని సర్కిళ్ల వారీగా 50 మందికి ఒకరు చొప్పున మొత్తం 110 మంది ప్రతినిధులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందులో నుంచి 13 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్న తర్వాత మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో సంఘం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, సేవా పరిస్థితులు, ఇతర అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరుగుతుండడంతో వరంగల్ కమిషనరేట్లోనూ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యవర్గ సభ్యుడు మొదలుకొని అధ్యక్ష పదవి కోసం అర్హులైన పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు తమ అనుయాయులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం. అభ్యర్థులుగా బరిలోకి దిగే కొందరు మద్యం, డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ పార్టీలను తలపించే రీతిలో మరికొందరు ప్రచారం నిర్వహిస్తుండడం పోలీస్శాఖలో చర్చనీయాంశమవుతోంది.సుమారు 13 ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తి 13 పోస్టులకు 13న ప్రత్యక్ష ఎన్నిక పోటాపోటీగా ప్రచారం -
ఇక తప్పించుకోలేరు!
సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ అర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు. ‘డేటా’తో దర్యాప్తులో వేగం.. గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్గ్రిడ్ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్గ్రిడ్తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది. ‘నాట్గ్రిడ్తో నేరగాళ్ల జాడ ఆధారాలను అనుసంధానించి నిందితుల గుర్తింపు వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం ఇక నేరస్తులను పట్టుకోవడంలో పెరగనున్న మరింత వేగంనేరస్తులను ఎలా గుర్తిస్తారంటే.. ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది. కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు. పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి. -
మత్స్యసంపదకు ఎల్ నినో దెబ్బ!
● నిండని చెరువులు, కుంటలు ● జిల్లాలో 1.95 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం ● 17న తెరవనున్న టెండర్లుగీసుకొండ: జిల్లాలో ఈసారి మత్య్ససంపదకు ‘ఎల్నినో’ దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. గతేడాది వర్షాలు మెండుగా కురవడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లోకి సరిగా నీరు చేరలేదు. ఈ పరిస్థితి మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతీఏడాది ప్రభుత్వం ఉచితంగా అందించే చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా సాగుతోంది. సరైన సమయంలో చేపపిల్లలను చెరువులోకి వదలక పోవడంతో అవి సరిగా ఎదగడం లేదని మత్స్య సంఘాల వారు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలాఖరు వరకు చేపపిల్లలను వదిలితే బాగుంటుందని, అలా కాకుండా అక్టోబర్ నెల ముగిసే వరకు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలను పోయడానికి పలు ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్గా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సభ్యులుగా జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), మెంబర్ కన్వీనర్గా జిల్లా మత్స్యశాఖ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీ దాఖలైన టెండర్లను పరిశీలించి చేపపిల్లలను సరఫరా చేయడానికి అర్హులను గుర్తిస్తుంది. టెండర్లు వేయడానికి గత మూడేళ్ల నుంచి ముందుకు రావడం లేదు. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది చేపపిల్లలను పంపిణీ చేసే టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో నవంబర్, డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చేపపిల్లలను సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. టెండరు ఖరారు విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో జిల్లాలోని పెద్ద చెరువులకు చేపపిల్లలను సరఫరా చేస్తామని, చిన్న చెరువులకు అందించలేమని వారు చేతులెత్తారు. ఆ ఏడాది జిల్లాలోని 71 పెద్ద (పెరినియల్) చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. మిగతా 635 చిన్న (సీజనల్) చెరువులకు చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. చేపపిల్లల సరఫరాలో ఈసారి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. జిల్లాలో 706 చెరువులు జిల్లాలో 706 చెరువులు ఉండగా వాటిలో సుమారు 71 పెద్ద చెరువులు ఉన్నాయని మత్స్యశాఖ జిల్లా అధికారి పిల్లి శ్రీపతిరావు తెలిపారు. 192 మత్స్య సహకార సంఘాలు ఉండగా వాటిలో 52 మహిళా సంఘాలు, ఒకటి ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు మార్కెటింగ్ సంఘాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిలో 16,160 మంది సభ్యులు ఉన్నారని, జిల్లాలోని చెరువుల్లో పోయడానికి 1,95,89,000 చేపపిల్లలు అవసరం ఉందన్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న టెండర్లను తెరుస్తామన్నారు. -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పా టు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాల ను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యా హ్నం ఒంటి గంటకు వచ్చి 1.30 నిమిషాలకు వెళాల్సి ఉంది. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలు చోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటానికి నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎం -
జైళ్లలో ఖైదీల కిటకిట
సాక్షిప్రతినిధి, వరంగల్: ఖైదీలతో జైళ్లు దేశవ్యాప్తంగా కిక్కిరిసిపోతున్నాయి. 4.54 లక్షల మంది ఖైదీలకు సరిపడే జైళ్లలో ఏకంగా 5.12 లక్షల మంది ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2024, డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్ల మొత్తం అందుబాటులో ఉన్న సామర్థ్యం 4,53,769 కాగా.. వాస్తవంగా 5,11,542 మంది ఖైదీలు ఉన్నారు. అంటే జైళ్ల సామర్థ్యానికి మించి 57,773 మంది అదనంగా ఉన్నారు. మొత్తం ఆక్యుపెన్సీ 112.7 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా 609 జైళ్లు నిర్దేశిత సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024 ఆధారంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి రాజ్యసభలో ఈ గణాంకాలను ఈ నెల 5న వెల్లడించారు. ఏటా పెరుగుతున్న ఖైదీలు నేరాలు, నేరస్థుల సంఖ్య పెరుగుతుండటంతో జైళ్లన్నీ ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి సీరియస్గా ఉంది. మధ్యప్రదేశ్ జైళ్ల సామర్థ్యం 30,644లకు గాను 45,092 మంది ఖైదీలున్నారు. ఇది అక్కడి జైళ్ల సామర్థ్యం కంటే 14,448 (147.1 శాతం) అధికం. అలాగే మహారాష్ట్రంలో 27,110లకు 39,003 మంది కాగా 11,893 (143.9 శాతం) అదనంగా ఖైదీలు జైళ్లల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 76,162లకు 86,762 (113.9 శాతం), ఛత్తీస్గఢ్లో 14,733లకు 18,798 (127.6 శాతం), గుజరాత్లో 14,108లకు 17,766 (125.9 శాతం) ఉన్నారు. ఇలా దేశ వ్యాప్తంగా 609 జైళ్లలో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. తెలంగాణలో భిన్న పరిస్థితి.. దేశవ్యాప్తంగా జైళ్లు ఓవర్లోడ్తో సతమతమవుతుండగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని జైళ్ల అందుబాటులో ఉన్న సామర్థ్యం 8,013 మంది కాగా.. 2024 డిసెంబర్ 31 నాటికి 6,782 మంది ఖైదీలు ఉన్నారు. అంటే ఆక్యుపెన్సీ 84.6 శాతం మాత్రమే. సామర్థ్యంతో పోలిస్తే 1,231 మంది మేర స్థలం అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా 2020లో రాష్ట్ర జైళ్ల సామర్థ్యం 7,845 కాగా 6,114 మంది ఖైదీలు ఉన్నారు. 2021లో సామర్థ్యం 7,997కి పెరగగా ఖైదీల సంఖ్య 7,316కు చేరింది. అదే ఏడాది ఆక్యుపెన్సీ 91.5 శాతానికి చేరుకుంది. 2022లో 6,497 మంది, 2023లో 5,853 మంది ఖైదీలు ఉండగా.. 2024లో ఈ సంఖ్య మళ్లీ పెరిగి 6,782కు చేరింది. ఉమ్మడి వరంగల్లో నాలుగు జైళ్లు... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, పరకాల, మహబూబాబాద్, నర్సంపేట జైళ్లు వరంగల్ జిల్లా సబ్ జైళ్ల అధికారి పరిధిలో ఉన్నాయి. మొత్తం ఈ జైళ్లలో ఖైదీల సామర్థ్యం 220 మంది. 2021 జూన్ 14న 680 నుంచి 1000 మంది ఖైదీలుండే వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. ఆ జైలు ప్రత్యామ్నాయంగా మామునూరు 4వ బెటాలియన్ ప్రాంతంలో వంద ఎకరాల్లో చేపడుతామన్న సెంట్రల్ జైలు నిర్మాణానికి ఇప్పటికీ మోక్షం లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ సెంట్రల్ జైలును ఆగమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వం మారగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్మాణంలో ఆ చొరవ చూపడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసుల్లో నిందితులను ఈ నాలుగు జైళ్లకే పంపడం అనివార్యం అవుతోంది. వరంగల్ సెంట్రల్ జైలు ఎత్తివేత ప్రభావం మిగతా జైళ్లపై పడుతోందన్న చర్చ జరుగుతోంది. -
మోతాదు మించితే అనర్థమే!
ఖిలా వరంగల్: పంటలకు ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత అధికంగా దిగుబడులు వస్తాయనే అపోహతో మోతాదుకు మించి రైతులు చల్లేస్తున్నారు. ఈ రకమైన ధోరణి తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. రైతులు అనుసరిస్తున్న పద్ధతులతో జీవజాలానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఎరువుల కొరత లేదు జిల్లాలో వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరి సాగు 50శాతానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అంచనా ప్రకారం 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30వేల ఎకరాల వరకు వరినాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి 90 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గత వానాకాలం, యాసంగిని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత లేకుండా సరిపడా ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ వానాకాలం యూరియా 41,000 టన్నులు, డీఏపీ 17,500 టన్నులు, ఎస్ఎస్పీ 6,500 టన్నులు, ఎంఓపీ 14,500 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 28,000 టన్నులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకనుగుణంగా కావాల్సిన ఎరువులను దిగుమతి చేసుకుని గోదాముల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వలు అధికంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జరిగే నష్టం ఇలా.. యూరియా అధికంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు భూములు క్రమంగా ఆమ్ల నేలలుగా మారి భూసారం దెబ్బతింటుంది. మొక్కలు ఏపుగా పెరిగినా ఆకులు లేతగా మారి తెగుళ్లు, పురుగు బెడద అధికమవుతుంది. దీంతో క్రిమిసంహారక మందులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కాండం బలహీనపడి కొద్దిపాటి గాలులు, వర్షాలకు పంట నేలవాలుతుంది. ఆకుల అధికంగా పెరిగి పూత, పిందె, గింజ తక్కువై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. నేలలో జింక్, ఇనుము, సూక్ష్మ పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అవసరమైతే రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీంతో భూమిలో సహజంగా లభించే పోషకాల స్థాయి తెలుస్తుంది. నేలల రకాలను బట్టి ఎంత మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియం వేసుకోవాలో తెలుస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూసారం దెబ్బతిని జీవజాలానికి ముప్పు అందుబాటులో సరిపడా యూరియా నిల్వలు భూసార పరీక్షలు చేయించుకోవాలంటున్న వ్యవసాయాధికారులుభూసారం దెబ్బతింటుందిప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రైతులు వరిలో యూరియాను విడతల వారీగా విచ్చలవిడిగా చల్లుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా నేలలపై తీవ్ర ప్రభావం పడి భూసారం దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది అధిక మోతాదులో యూరియా వాడడం వల్లనే కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్ల బెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. కిరాణా షాపులో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నర్సంపేట రూరల్: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత ఈస్ట్ పౌడర్ ప్యాకెట్లను అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఓ కిరాణా షాపులో 38 ప్యాకెట్ల ఈస్ట్ పౌడర్, 40కిలోల చక్కెరను స్వాధీనం చేసుకొని షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రజితరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర కిరాణం అండ్ జనరల్ స్టోర్స్పై ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించి నిషేధిత ఈస్ట్ పైడర్ స్వాధీనం చేసుకుని, షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలిహసన్పర్తి: భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర శనివారం హసన్పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ పేద ప్రజల వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేసి దేశ సంపదను పెట్టుబడిదారీ వర్గానికి దోచి పెట్టాడని ఆరోపించారు. దోపీడీ వర్గానికి వ్యతి రేకంగా యువత కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ఈనెల 14వ తేదీ వరకు ప్రచార యాత్రను కొనసాగించాలని చాడా వెంకట్రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, మోతె లింగారెడ్డి, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మిద్దెల ఎల్లేశ్, తోట భిక్షపతి, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు. -
సహజమైన రంగు..
మొక్క నుంచి లభించే సహజ రంగునిచ్చే పదార్థం గోరింట. అలంకరణలో ప్రత్యేకమైంది. భారతీయ సంప్రదాయాల్లో వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆషాఢమాసంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గోరింటాకు పెట్టుకునే సనాతన సంప్రదాయం కొనసాగుతోంది. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. ఈ మాసంలో కొందరు మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. – చందనాల జ్యోతి, తిలక్రోడ్డు, వరంగల్ చిట్కాలు పాటిస్తే మరింత ఎరుపు గోరింటాకు ఎర్రగా పండాలంటే పటిక, చింతపండు, పెరుగు, టీ పొడి ఏదో ఒకటి వేసి ముద్దగా రుద్దుకోవాలి. వివాహ సమయంలో పెళ్లి కుమార్తెలకు మెహందీ పెడుతుంటారు. ఈ సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. చేతులు ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడనేది ఒక నమ్మకమైతే గోరింటాకులో ఉండే ఔషధ గుణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. – చందనాల పద్మ, కాశిబుగ్గ, వరంగల్ గోరింటాకు పెట్టుకోవడమంటే ఇష్టం.. గోరింటాకు పెట్టుకోవడమంటే చిన్నతనం నుంచి ఆసక్తి. గోరింటాకు శుభప్రదమైందిగా భావించి ముఖ్యంగా వివాహ వేడుకల్లో భాగంగా గోరింటాకు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందంతో పాటు ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటే మంచిదని పోటీ పడి మరీ గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండే వరకు వేచి చూస్తాం. – రామగిరి జ్యోతి, వరంగల్ ప్రకృతి ప్రసాదంగా.. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రకృతి ఇచ్చిన సంపద గోరింటాకు. ఆధునిక కాలంలోనూ యువతులు గోరింటాకు ఇష్టపడుతున్నారంటే సంప్రదాయమంటే గౌరవం. ఔషధ గుణాలు ఉండడమే కారణం. రసాయనాలు ఉపయోగించే కోన్స్ వాడడం కంటే ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు ఉపయోగించుకోవడం శ్రేష్టం. – సంఘ జీవనజ్యోతి, వరంగల్ -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో పోలీసు అధికారుల ఘన స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో పోలీసు అధికారుల ఘన స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మహత్యల నివారణ.. సామాజిక బాధ్యత
● అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్హన్మకొండ: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్పడొద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్లవుతుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏళ్లుగా తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం గొప్ప విషయమన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యుడు రాంపెల్లి లింగమూర్తి, భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్
వరంగల్లో వేడుకలు.. వరంగల్ కాశిబు గ్గ తిలక్రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు. -
ఆషాఢంలో మైదాకు పెట్టుకునేందుకు మహిళల ఆసక్తి
కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్ని వ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి. బ్యాక్టీరియా బారిన పడకుండా కాళ్లు, చేతులకు రక్షణ అందం, ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. -
పెద్ది పోరాటం ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెన్నారావుపేట: తెలంగాణ సాధనలో పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన ఉద్యమం బీఆర్ఎస్ ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తి కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇటీవల మృతిచెందగా, మండల కేంద్రంతో పాటు అమీనాబాద్ గ్రామంలో శనివారం సంతాపసభ, మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, మండల కన్వీనర్ నాయకులు కొమ్ము రమేష్, జక్క అశోక్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాంరెడ్డి, పత్తినాయక్, సొసైటీ మాజీ అధ్యక్షుడు వంశీ, రవి, కుమారస్వామి, కుండె మల్లయ్య, ప్రదీప్ పాల్గొన్నారు. పెద్ది సంస్మరణ సభకు ఏర్పాట్లు నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాగణంలో ఈనెల 10న నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను అధిక సంఖ్యలో తరలించేలా సమీకరణపై నాయకులు దృష్టి సారించారు. సంస్మరణ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మండలాల వారీగా సమన్వయం చేస్తున్నారు. సభ ప్రాంగణంలో వేదిక, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాల కల్పనపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సంస్మరణ సభ వివరాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. -
బస్టాండ్కు స్థలం కేటాయించాలి
మంత్రులకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వినతికమలాపూర్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు ప్రభుత్వాస్పత్రి స్థలాన్ని కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులతో శనివారం జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి పాల్గొని మంత్రులకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కమలాపూర్లోని పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లు ఆన్ చేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరందించాలని కోరారు. నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.1,500కు దొరకాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయిస్తున్నారని, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాల మాదిరిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇసుక ట్రాక్టర్లకు ఆన్లైన్ విధానం లేకుండా తరలింపునకు అనుమతులు కల్పించాలని కోరారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఇటీవల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతిచెందగా.. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.తద్వారా మొత్తంగా 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలనపరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ -
కళాశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ
కాళోజీ సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. విద్యార్థులు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూ, స్టేషనరీ అందిస్తున్నట్లు వివరించారు. నగరంలోని కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత రాతపుస్తకాల (అన్ రూల్డ్ నోట్ బుక్స్) పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 2,704 విద్యార్థులకు 32,448 నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలికాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలపై జీఓ జారీ చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ డిమాండ్ చేశారు. యూపీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ మేరకు రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉపాధ్యాయులు రోజూ పాఠశాలకు నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతారని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వీరాచారి, ఉపాధ్యాయులు సీహెచ్ ప్రవీణ్ కుమార్, టి.సునీల్ కుమార్, ఎం.ఉషారాణి, టి.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. రాయపర్తి పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన డీసీపీరాయపర్తి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు. ‘విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు’నర్సంపేట రూరల్: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరాబాయి హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని పాత భవనంలో కొనసాగుతున్న ఎంసీహెచ్, పీపీ యూనిట్, డయాలసిస్, తెలంగాణ టీహబ్ను శుక్రవారం తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్కు ఇటీవల వచ్చిన రెండ్ బెడ్స్ను ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని సిబ్బందిని దామెదరాబాయి ప్రశ్నించారు. రిజిస్ట్రర్లను పరిశీలించి రోస్టర్ వారీగా హాజరు వేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందుల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సూపరింటెండెంట్ వెంట ఆర్ఎంఓలు సుధీర్ ఉన్నారు. కాశిబుగ్గ: ‘వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల నుంచి ఎవరరు డబ్బులు డిమాండ్ చేసినా తొలగింపు తప్పదు. పేషెంట్ కేర్ మొదలుకుని వార్డు బాయ్ వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో డబ్బులు వసూలు చేసిన పేషెంట్ కేర్ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈనేపథ్యంలో వరంగల్లోని ఎంజీఎం, సీకేఎం ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, సిటీ స్కాన్, వార్డులు, కట్లు కట్టడంతో పాటు గేట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తారని తరచూ ఆరోపణలు వస్తున్నాయి. -
మంత్రికి పండుగల నివేదిక అందజేత
హన్మకొండ కల్చరల్: కొన్నేళ్లుగా హిందువుల పండుగల తేదీల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు పండుగల తేదీల నిర్ణయాలను శాస్త్రబద్ధంగా పరిశీలించి తీర్మానించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లో ఽతెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. ధృక్ సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అవసరాల ప్రసాద్శర్మ, సిద్ధాంతి పురోహితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర నాగేంద్రశర్మ, ధూపదీప వైవేద్య రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు పెరంబదూర్ శ్రీకాంత్ మంత్రికి నివేదికను అందించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పండితులు అందించిన నివేదికను పురోహితులకు, అన్ని కులాల అర్చకులకు ప్రభుత్వం ద్వారా ముందస్తుగా పండుగల వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. -
డయాబెటిస్.. హైపర్టెన్షన్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డయాబెటిస్, హైపర్టెన్షన్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైపర్టెన్షన్).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిక వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామం నుంచి నగరం వరకు సర్వే.. ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతినెలా ఆరోగ్య కేంద్రాలకు పిలిపించి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామాలపై సూచనలు అందిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు.. డయాబెటిస్: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా శరీరంలోని కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం.. షుగర్, బీపీ రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు, సరిపడా మందులు ఇస్తోంది. – రాజారెడ్డి, డీఎంహెచ్ఓ, వరంగల్ వరంగల్ జిల్లాలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు ఆరోగ్య నియమాలు పాటించాలంటున్న వైద్యులు -
పెద్ది సేవలు చిరస్మరణీయం
నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విశేష కృషి చేశారని, ప్రజా నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. మండల కేంద్రంలోని పెద్ది స్వగృహంలో ఆయన సతీమణి స్వప్న, కుటుంబ సభ్యులను వారు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అలాగే, పెద్ది కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఓదార్చారు. -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారంనుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయల్దేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులువరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో భేటీ డీజీపీగా తొలిసారి సీవీ ఆనంద్ రాక -
వరంగల్ కమిషనరేట్ పరిధిలో జోరుగా జూదం
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026కమిషనరేట్లో పేకాట కేసులు ఇలా..వరంగల్ క్రైం: ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లు పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరం చుట్టు పక్కల జోరుగా సాగిన జూదం ఇప్పుడు ట్రైసిటీలో విచ్చలవిడిగా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ దాడుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్, పోలీస్స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాడుతూ పట్టుబడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పేకాట జోరుగా సాగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రైసిటీ పరిధిలో చీకటి వ్యాపారాలతో పాటు జూదం శిబిరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయనే వాదనలున్నాయి ఒక్క జూలై నెలలోనే పేకాట శిబిరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆరు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడం గమనార్హం. ఈనెలలో ఒకే రోజు రెండు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. దీన్ని బట్టి కమిషనరేట్ పరిధిలో ఏ స్థాయిలో పేకాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ?‘ట్రైసిటీలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు’. ఇది పదే పదే పోలీస్ ఉన్నతాధికారులు చెప్పే మాట. కానీ, చీకటి వ్యాపారాలు, పేకాట శిబిరాలు ఎక్కడా ఆగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి దందాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుంటే తప్ప స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్పై కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో షిఫ్టుల వారీగా బ్లూకోల్ట్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ముందస్తుగా ఆయా ఏరియాల్లో ఏం జరుగుతుందో సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నిత్యం గస్తీ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి, పెట్రోలింగ్ సిబ్బందికి ఇలాంటి పేకాట శిబిరాలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రైసిటీ పరిధి పోలీస్ స్టేషన్లు భూ పంచాయితీలు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తూ పేకాట శిబిరాల్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.2026 (ఆగస్టు 6 వరకు)20252024 గత నెలలో ఆరు చోట్ల దాడులు పట్టుబడుతున్న బడా బాబులు పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాట శిబిరాలు -
15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్న కార్డులను శుక్రవారం ఆయన పరిశీలించి, పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 14 మండలాలకు 2,56,838 స్మార్ట్ రేషన్కార్డులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపు పరిధిలో లబ్ధిదారులకు కార్డులు సులభంగా, పారదర్శకంగా అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీఈఓకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పు, సర్దుబాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు రూపొందించిన రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఈనెల 10న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కారణాలతో 14 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని అనువైన భవనాలకు మార్చేందుకు ప్రతిపాదించారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను సమీప కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
● 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన.. ● ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ ● పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభసాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన.. పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారంనుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామూనూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్ డీజీపీగా జిల్లాకు తొలిసారి రానున్నసీవీ ఆనంద్ -
నూతన డిజైన్ వస్త్రాల ఉత్పత్తితో ఆదాయం
కాశిబుగ్గ: చేనేత కార్మికులు కాలానుగుణంగా మార్కెటింగ్ పెంచుకోవడానికి, ఆర్థికాభివృద్ధికి నూతన డిజైన్ వస్త్రాలను ఉత్పత్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలో చేనేత వాక్ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చేనేత కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. లేటెస్ట్ డిజైన్లతో కూడిన ఉత్పత్తులను చేస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. దాంతో చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కొత్తవాడ దర్రీస్కు ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని వివరించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులు మార్కెట్కు తగిన ఉత్పత్తులు చేసి, చేనేత సంఘాలు పరిపుష్ఠి అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వై.శ్రీకాంత్రెడ్డి, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ నర్సింహమూర్తి, డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్, సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, డీఎస్ మూర్తి, యెలగం కొమురయ్య, యెలగం రవిరాజ్, విజయ్కుమార్, గుండేటి నరేంద్రకుమార్, యెలగం సాంబయ్య, రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సుకన్య సమృద్ధి యోజనతో మేలుఖిలా వరంగల్: బాలికల భవిష్యత్ విద్య, ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ప్రాజెక్టు లక్ష్మీనగర్ సెక్టార్ విద్యానగర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి, సీడీపీఓ విద్యతో కలిసి ఆమె శుక్రవారం సందర్శించారు. గర్భిణులకు పండ్ల బుట్టలను కలెక్టర్ అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల సూపరింటెండెంట్ రజినీతో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంట్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేనేత దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
డయాబెటిస్.. హైపర్టెన్షన్
ఏడాదిలో ఎంత పెరిగాయంటే..సాక్షి, వరంగల్: జిల్లాలో డయాబెటిస్, హైపర్టెన్షన్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైపర్టెన్షన్).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిక వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామం నుంచి నగరం వరకు సర్వే.. ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు డయాబెటిస్: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం.. షుగర్, బీపీ వచ్చాక చికిత్స కంటే.. రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న గణాంకాలు చూస్తే ప్రతీ కుటుంబం కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఉచిత వైద్య పరీక్షలు చేయడంతో పాటు నెలకు సరిపడా మందులు ఇస్తోంది. – రాజారెడ్డి, డీఎంహెచ్ఓ డయాబెటిస్ హైపర్టెన్షన్ జిల్లాలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు మారుతున్న జీవనశైలితో అసంక్రమిత వ్యాధుల ముప్పు వయస్సుతో సంబంధం లేకుండా వెంటాడుతున్న షుగర్, బీపీ ఆరోగ్య నియమాలు పాటించాలంటున్న వైద్యులు -
వరంగల్
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026వరంగల్ కమిషనరేట్ పరిధిలో జోరుగా జూదంరాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు షురూ హనుమకొండలోని జేఎన్ఎస్లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు, జావెలిన్ డే వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.కమిషనరేట్లో పేకాట కేసులు ఇలా..వరంగల్ క్రైం: ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లు పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరం చుట్టు పక్కల జోరుగా సాగిన జూదం ఇప్పుడు ట్రైసిటీలో విచ్చలవిడిగా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ దాడుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్, పోలీస్స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాడుతూ పట్టుబడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పేకాట జోరుగా సాగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రైసిటీ పరిధిలో చీకటి వ్యాపారాలతో పాటు జూదం శిబిరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయనే వాదనలున్నాయి ఒక్క జూలై నెలలోనే పేకాట శిబిరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆరు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడం గమనార్హం. ఈనెలలో ఒకే రోజు రెండు శిబిరాల్లో పేకాట రాయుళ్లు పట్టుబడడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. దీన్ని బట్టి కమిషనరేట్ పరిధిలో ఏ స్థాయిలో పేకాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. విజిబుల్ పోలీసింగ్ ఏది?‘ట్రైసిటీలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు’. ఇది పదే పదే పోలీస్ ఉన్నతాధికారులు చెప్పే మాట. కానీ, చీకటి వ్యాపారాలు, పేకాట శిబిరాలు ఎక్కడా ఆగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి దందాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుంటే తప్ప స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్పై కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో షిఫ్టుల వారీగా బ్లూకోల్ట్ సిబ్బంది విజిబు ల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ముందస్తుగా ఆయా ఏరియాల్లో ఏం జరుగుతుందో సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నిత్యం గస్తీ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి, పెట్రోలింగ్ సిబ్బదికి ఇలాంటి పేకాట శిబిరాలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రైసిటీ పరిధి పోలీస్ స్టేషన్లు భూ పంచాయితీలు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తూ పేకాట శిబిరాల్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.2026 (ఆగస్టు 6 వరకు)20242025 గత నెలలో ఆరుచోట్ల దాడులు పట్టుబడుతున్న బడా బాబులు పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో పేకాట శిబిరాలు -
సహకార సంఘాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండొద్దు
● న్యాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుకమలాపూర్: సహకార సంఘాలు స్వయం ప్రతిపత్తి సంఘాలని, ఈ సంఘాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండకూడదని న్యాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. కమలాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న 0.5 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతుల కోసం పార్టీలకతీతంగా పనిచేసినప్పుడే సంఘాలు బాగుపడుతాయన్నారు. సహకార సంఘాలు రైతుల వాటాధనం, డిపాజిటర్ల వడ్డీతో మాత్రమే నడుస్తున్నాయని, వీటిపై అధికారుల పర్యవేక్షణ మాత్రమే ఉండాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న ఈ సోలార్ వపర్ప్లాంట్ ఏడోది అని పేర్కొన్నారు. తెలంగాణలోని సహకార వ్యవస్థకు మంచి పేరు ఉందని, దేశ వ్యాప్తంగా ఏ కొత్త పని చేయాలన్నా ముందుగా కరీంనగర్ వెళ్లి చూసి రమ్మని ఆదేశాలు వస్తున్నాయని వివరించారు. పాలకవర్గాల గడువు ముగిసిన సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. డీసీఓ మోహన్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ పబ్బు సతీశ్, బండి వనజకళాధర్, పీఏసీఎస్ సీఈఓ రావుల వెంకటేశ్ పాల్గొన్నారు. -
కాకతీయుల వారసత్వ సంపద అద్భుతం
రిటైర్డ్ ఐఏఎస్ కేకే ఛాత్రత్ కాజీపేట అర్బన్: కాకతీయుల వారసత్వ సంపద అద్భుతమని 1967 బ్యాచ్ ఒడిశా రిటైర్డ్ ఐఏఎస్ కె.కె.ఛత్రత్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని దక్షిణకాశీగా పేరుగాంచిన మెట్టురామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఛత్రత్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మెట్టుగుట్టపై ఉన్న దొంతులమ్మ గుండాలను, జీడి గుండంలోని భీముడి పాదముద్రలను పరిశీలించి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. పురావస్తు కళాఖండాలను దర్శించుకోవాలనే కాంక్షతో ఓరుగల్లుకు విచ్చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, రఘుచందర్, అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ పాల్గొన్నారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న సహారా బాధితుల ధర్నా
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు వినతిపత్రం భీమదేవరపల్లి: సహారా ఇండియాలో డిపాజిట్ చేసిన తమ సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ భీమదేవరపల్లి మండలానికి చెందిన సహారా కార్యకర్తలు, బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ధర్నా గురువారానికి మూడో రోజుకు చేరింది. ‘మా డబ్బులు మాకివ్వాలి’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. డిపాజిట్దారులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను ఢిల్లీలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీ ఈటల సానుకూలంగా స్పందిస్తూ.. బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ములుకనూరు సహారా మేనేజర్ గడల కుమార్ తెలిపారు. మండలానికి చెందిన మండ మహేందర్, చిత్రాల మహేశ్తో పాటు పలువురు బాధితులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో జయశంకర్కు నివాళి
న్యూశాయంపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం ప్రతిఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ కళా శాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ–పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యార్థి తప్పనిసరిగా మీసేవ కేంద్రంలో ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండలోని బీసీ సంక్షేమాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.నూతన కమిటీ ఎన్నికగీసుకొండ: పామాయిల్ రైతు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చాడా కొమురారెడ్డి తెలిపారు. మండలంలోని కొనాయమాకుల రైతుల వేదికలో గురువారం కొమురారెడ్డి అధ్యక్షతన పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. ముందుగా రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంద్యాల కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా చాడా కొమురారెడ్డి, గుడిపూరి అరుణ, ప్రధాన కార్యదర్శిగా కుంచారపు వెంకట్రెడ్డి, కోశాధికారిగా బుస్సారి బాబురావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న నర్సంపేటలో నిర్వహించే సర్వసభ్య సమవేశంలో జిల్లా పామాయిల్ రైతుల సమస్యలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కానిస్టేబుళ్లకు నగదు పురస్కారం కాజీపేట అర్బన్: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత మడికొండ పీఎస్ కానిస్టేబుళ్లు సంపత్, గోవర్ధన్ను గురువారం అభినందించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని సాయినాథ్ వెంచర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరీమాబాద్కు చెందిన మెరుగు పవన్ ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన మడికొండ కానిస్టేబుళ్లు పవన్ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు కానిస్టేబుళ్లు గోవర్ధన్, సంపత్ను సీపీ శ్వేత నగదు పురస్కారం అందించి సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పనులు వేగిరం చేయండి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవన నిర్మాణ పనుల పురోగతిని గురువారం కమిషనర్ టి.వెంకన్న తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలిచ్చారు. మ్యూజియం ప్రాంగణంలోని శిల్పాలను పురావస్తు శాఖ ద్వారా సురక్షితంగా తగిన ప్రదేశానికి తరలించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. -
అమృత్ భారత్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ స్టేషన్ రీ డెవలప్మెంట్ పనులను గురువారం సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఐ) ముత్యాలనాయుడు తనిఖీ చేశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక స్పిక్లో కాజీపేట జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు కాజీపేట జంక్షన్ లోపల, స్టేషన్ బయట జరుగుతున్న అమృత్ భారత్ పనులు క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం స్పిక్లో సికింద్రాబాద్కు తరలివెళ్లారు. ఆయన వెంట సికింద్రాబాద్ డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్, రైల్వే ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఫార్మసీ అధికారులు, నర్సింగ్ అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఫార్మసీ అధికారులు, నర్సింగ్ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ఫార్మసీ అధికారులు ఈ–ఔషధి పోర్టల్లో మందుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మాత్రమే రిఫర్ చేయాలని సూచించారు. సమావేశాల్లో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి. మదన్మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్రెడ్డి, మాతా–శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి రజిత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకృష్ణారావు, ఎన్సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ మురళి, డెమో అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కాజీపేట: ఈఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లలో చేరేందుకు రెండో విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15 వరకు పెంచినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ పొన్నాల వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్ ట్రేడ్లలో (ఏటీసీ కోర్సులు) అడ్వాన్స్డ్ సీఎస్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబొటిక్స్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్లో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. iti.telangana.gov.in వెబ్సైట్లో రూ.100 రుసుంతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడత దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. కాజీపేట అర్బన్: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత.. మడికొండ పీఎస్ కానిస్టేబుళ్లు సంపత్, గోవర్ధన్ను గురువారం అభినందించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని సాయినాథ్ వెంచర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరీమాబాద్కు చెందిన మెరుగు పవన్ ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన మడికొండ కానిస్టేబుళ్లు పవన్ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు కానిస్టేబుళ్లు గోవర్ధన్, సంపత్ను సీపీ శ్వేతరెడ్డి నగదు పురస్కారం అందించి సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో రోగులకు నాసిరకం భోజనం
డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలి: సీపీఎం కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని, వెంటనే డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆస్పత్రి సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వారు చికిత్స పొందుతున్న రోగులు, వారి అటెండెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాసిరకంగా ఉందని, అన్నం సరిగ్గా ఉడక్కపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నాయకులు.. సంబంధిత కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు అవసరమైన కిట్లు, మందులివ్వకుండా, బయట కొనాలని వైద్యులు చెబుతున్నట్లు సీపీఎం నాయకులకు రోగులు విన్నవించారు. దీనివల్ల ప్రతీవారం రోగులపై అదనపు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకుడు సింగారపు బాబు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరుణ్కుమార్, ఎండీ.మహబూబ్ పాషా, ఎన్.చంద్రమౌళి, సింగారం చుక్కయ్య, రాజమణి, అనిల్, శివ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేయాలి ● హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికమలాపూర్: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. కమలాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలు, సమస్యలపై గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల పని తీరును సమీక్షించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాల కోసం కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశం ద్వారా సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన బెల్టు షాపుల మూసివేత, గ్రామాల్లో తాగు నీటి సమస్య వంటి పలు సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి వచ్చే సమావేశంలోపు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బంది పడకుండా అసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని వ్యవసాయాధికారులకు సూచించారు. అనంతరం సర్పంచులను సన్మానించారు. సమావేశంలో డీటీడీఓ, మండల ప్రత్యేకాధికారి సత్యవతి, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీ, పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, హౌసింగ్ డీఈ రవీందర్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం
కాశిబుగ్గ: సమాన పని–సమాన స్టైఫండ్ నినాదంతో హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహిస్తున్న ఆయుష్ హౌస్ సర్జన్ల సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ముందుగా.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమ్మెకు సంఘీభావం అలోపతిక్ డాక్టర్లతో సమానంగా ఉపకార వేతనాలివ్వాలని ఆయుష్ హౌస్ సర్జన్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు అనంతలక్ష్మి పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ హరిరమాదేవి, డాక్టర్ రాజేశ్వరి సంపూర్ణ మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థుల నిరసన శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణాచర్యలు హౌస్సర్జన్ల సమ్మెకు సంఘీభావం తెలిపితే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో యూజీ విద్యార్థులు పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తానన్నారు. దీనిపై హౌస్సర్జన్లు మాట్లాడుతూ.. డిమాండ్లను పరిష్కరించే సమయంలో ఆంక్షలు విధిస్తూ, సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ -
ఏసీల మరమ్మతుకు చర్యలు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బర్న్స్ వార్డును సూపరింటెండెంట్ డాక్టర్ రామ్కుమార్రెడ్డి గురువారం సందర్శించారు. సాక్షిలో ‘నా శరీరం కాలి మండుతోంది.. చల్లదనం కావాలి’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డితో పాటు ఆర్ఎంఓ–2 డాక్టర్ మధుకర్ యాదవ్ స్పందించారు. బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. ఏసీలు పనిచేయకపోవడం వల్ల పేషెంట్ ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం సంబంధిత వైద్యులతో మాట్లాడి ఏసీల మరమ్మతుపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. -
రీ సర్వే వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూములు, కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. జిల్లాలో రీ సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని, సర్వేయర్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని అభినందించారు. సమావేశంలో భూములు కొలతల శాఖ ఏడీ నూర్ సింగ్, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు. భూభారతి పోర్టల్పై అవగాహన ఉండాలి.. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ మాడ్యూళ్లపై జూనియర్ అసిస్టెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన భూభారతి పోర్టల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ఏఓ నాగరాజు, రెవెన్యూ అధికారులు, జిల్లాలోని 14 మండలాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయి ప్రజావాణి ఏర్పాటు, నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
కాకతీయుల వారసత్వ సంపద అద్భుతం
గీసుకొండ: కాకతీయుల వారసత్వ సంపద అద్భుతమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేకే ఛాత్రత్ అన్నారు. మొగిలిచర్లలోని కాకతీయుల కాలం నాటి ఏకవీరాదేవి ఎల్లమ్మ దేవాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పురావస్తు కళాఖండాలను వీక్షించారు. ఆలయ చరిత్ర గురించి ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆడెపు రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శిల్పాన్ని తన కెమెరాతో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం ఛాత్రత్ మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. గ్రామస్తులు అందరూ ఏకమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట బిల్లా రమేశ్, కుమారస్వామి, చంద్రమౌళి, స్వామి, రంజిత్ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేకే ఛాత్రత్ -
విద్యాసంస్థలు భద్రమేనా?
గ్రేటర్ వరంగల్లోని కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఫైర్ ఎన్ఓసీలపై సందేహాలుసాక్షి, వరంగల్: హైదరాబాద్లో నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో 52 జూనియర్ కళాశాలలు నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసు కేసులు, ఫైర్ ఎన్ఓసీల రద్దు వరకు పరి స్థితి వెళ్లింది. ఈ ఘటనతో గ్రేటర్ వరంగల్ పరిధి లోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లో ఫైర్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రత్యేక తనిఖీలు చేపట్టకపోతే విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్లో ప్రతిరో జూ వేలాది మంది విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న విద్యాసంస్థలకు హాజరవుతున్నారు. కానీ, వాటిలో ఎన్ని విద్యాసంస్థలకు చెల్లుబాటు అయ్యే ఫైర్ ఎన్ఓసీలు ఉన్నాయి? ఎన్ని సంస్థలు ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకుంటున్నాయి? ఫైర్ అలారాలు, స్మోక్ డిటెక్టర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు పనిచేస్తున్నాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం సంబంధిత అధికారుల నుంచి రావడం లేదు. ప్రమాదం జరిగాక.. స్పందిస్తే ప్రయోజనం ఏమిటి? రాష్ట్రంలో గతంలో పలు అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఘటనల తర్వాతే అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం వెలుగులోకి వచ్చినా వరంగల్లో ఇప్పటివరకు సమగ్ర తనిఖీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు తనిఖీలతో ప్రమాదాలను నివారించడమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అనేక విద్యాసంస్థల్లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయా? గడువు ముగిసిందా? అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలపై తరచూ తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. అలారాలు, స్మోక్ డిటెక్టర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై అనుమానాలు ప్రమాదం తర్వాత స్పందించడం కంటే అధికారులు ముందే తనిఖీలు చేయాలి హైదరాబాద్లో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వెలుగుతో నగరంలో చర్చజిల్లా అగ్నిమాపకశాఖ, విద్యాశాఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫైర్ ఎన్ఓసీలు మాత్రమే కాకుండా భవన అనుమతులు, ఆక్యుపెన్సీ, అత్యవసర మార్గాలు, విద్యార్థుల సామర్థ్యానికి మించి అడ్మిషన్ల వంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. కాగా, ఫైర్ ఎన్ఓసీల సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. -
సమన్వయంతో ఇండెంట్లు రూపొందించాలి
నర్సంపేట రూరల్: వైద్య కళాశాల విభాగాధిపతులు, జనరల్ ఆస్పత్రి విభాగాధిపతులు సమన్వయంతో మందులు, సర్జికల్ ఇండెంట్లు రూపొందించాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి అన్నారు. తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ అధికారులతో గురువారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని విభాగాల వైద్యుల సమన్వయంతో వినియోగం ఆధారంగా ఇండెంట్లను రూపొందించుకోవాలని, సీఎంఎస్ స్టోర్స్లో అందుబాటులో ఉన్న ఔషధాలు, సర్జికల్స్ కోసం పోర్టల్లో చూడాలని కోరారు. అనంతరం సీఎస్ఎం నుంచి సరఫరా చేయనున్న 638 ఔషధాలు, 536 రకాల సర్జికల్ పరికరాలకు సంబంధించిన జాబితాను వైద్యాధికారులు అందించారు. సమావేశంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసీ అధికారులు, ఉప్పల భాస్కర్రావు, వంగ సుధాకర్రెడ్డి, వైద్య విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి -
విద్యార్థులకు సైన్స్ నాటిక పోటీలు
కాళోజీ సెంటర్: తరగతి గది దాటి పుస్తకాల్లోని విజ్ఞానాన్ని నాటకరంగం ద్వారా సమాజానికి చాటిచెప్పేందుకు పాఠశాలల విద్యార్థులు సిద్ధమవుతున్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉద్దేశించిన దక్షిణ భారతస్థాయి సైన్్స్ నాటిక పోటీలు–2026 షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో పోటీలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. ఈ ఏడాది నాటిక పోటీలకు సైన్స్ అండ్ సొసైటీ ప్రధాన అంశంగా నిర్ణయించారు. నాటిక పోటీల అంశాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్: కృత్రిమ మేధ నేస్తమా? సాధనమా? లేక భవిష్యత్ ముప్పా? ఈవీ వాహనాలు : పర్యావరణ పరిరక్షణలో ముందడుగు. నక్షత్రాంతర ఆవాసాలు : నింగిలో మనుషుల కొత్త కాపురాలు. సముద్రాల పునరుద్ధరణ : భవిష్యత్ తరాల భద్రత పోటీల నిబంధనలు ఇవే.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు పోటీ పడవచ్చు. నాటిక నిడివి గరిష్టంగా 30 నిమిషాలు మించకూడదు. స్టేజ్ ఆర్గనైజేషన్కు 15 నిమిషాలు ఇస్తారు. ఒక బృందంలో గరిష్టంగా 10 మందికి (ఒక దర్శకుడు, ఒక రచయిత, 8 మంది నటులు) మాత్రమే అవకాశం ఉంటుంది. తెలుగు లేదా ఇంగ్లిష్తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రదర్శించవచ్చు (ఇతర భాషల వారు ఇంగ్లిష్లో అనువాదం ఇవ్వాలి). కంటెంట్ పూర్తిగా సొంతంగా రాసిందై ఉండాలి. మూఢనమ్మకాలు, తప్పుడు శాసీ్త్రయ ప్రకటనలు నాటికలో ఉండకూడదు.స్థాయి గడువు తేదీలు వేదిక మండల, జిల్లా సెప్టెంబర్ 3 లోపు –––– రాష్ట్రస్థాయి సెప్టెంబర్ 25, 26 హైదరాబాద్ దక్షిణ భారత నవంబర్ 19, 20 బెంగళూరు జాతీయ జనవరి 2027 కోల్కతా ఈ ఏడాది ఇతివృత్తం సైన్స్ అండ్ సొసైటీ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్పాట్లుకళలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో తెలంగాణకు జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. ఆ ఘనతను ఈ సైన్స్ నాటిక పోటీల్లోనూ నిలబెట్టుకోవాలి. పాఠశాలస్థాయిలో విద్యార్థులు కేవలం మమ అనిపించకుండా, సాంస్కృతిక రంగానికి పేరుతేవాలి. పాఠశాలలను గుర్తించి ప్రత్యేక శిక్షణతో పోటీలకు సిద్ధం చేయాలి. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి -
హెపటైటిస్ నియంత్రణకు కృషిచేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో వైరల్ హెపటైటిస్ నియంత్రణకు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్ర (ఎన్వీహెచ్సీపీ) అమలులో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ గ్రూపులకు హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉష, వర్ధన్నపేట డీసీహెచ్ఎస్ డాక్టర్ రామ్మూర్తి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ నిర్మల, అధికారులు పాల్గొన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు వసతులు కల్పించాలి ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా, మండలస్థాయి ప్రత్యేక అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 74 ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత అధికారులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షఖిలా వరంగల్ ఖుష్మహల్ వేదికగా ఈనెల 15న నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్, భద్రత, వైద్య సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం
కాశిబుగ్గ: సమాన పని–సమాన స్టైఫండ్ నినాదంతో హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహిస్తున్న ఆయుష్ హౌస్ సర్జన్ల సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. సమ్మెకు సంఘీభావం.. ఆయుష్ హౌస్ సర్జన్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు అనంతలక్ష్మి పూర్వ వైద్య విద్యార్థులు హరిరమాదేవి, రాజేశ్వరి సంపూర్ణ మద్దతు తెలిపారు. సమ్మెలో పాల్గొంటే చర్యలు..హౌస్సర్జన్ల సమ్మెకు సంఘీభావం తెలిపితే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో యూజీ విద్యార్థులు పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. సమస్యను జఠిలం చేస్తున్నారని హౌస్సర్జన్లు తెలిపారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ -
వైన్ షాపుల్లో చోరీ
పర్వతగిరి: అన్నారం షరీఫ్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి రెండు వైన్ షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై బోగం ప్రవీణ్ కథనం ప్రకారం... గ్రామంలోని వెంకటేశ్వర వైన్స్, దుర్గశ్రీ వైన్స్ వెనుక భాగంలో దొంగలు డోర్ గ్రిల్స్ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. రూ.1.50 లక్షల నగదు, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. యజమాని జి.రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు చెక్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు చెక్ పడనుంది. ఉమ్మడి వరంగల్లో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. వీటి కోసం ఏకంగా రూ.197 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఒకచోట టెండర్ ఖరారుకాగా.. మరోచోట డిజైన్లు, అంచనాల రూపకల్పన జరుగుతోంది. ఇంకోచోట రైల్వే వాటా పనులు పూర్తికాగా.. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఒక ఆర్యూబీ పనులు మాత్రం నిలిచిపోయాయి. పెండింగ్ పనులపైన దృష్టి సారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రం నుంచి మరో మూడు.. కేంద్ర రైల్వేశాఖ చేపట్టిన నాలుగు పనులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో మూడు ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. కాజీపేట–వరంగల్ మార్గంలోని ఎల్సీ నంబర్ 60, ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 66, 67 వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాకపోకల అంతరాయానికి చెక్.. రాష్ట్రంలో మరో 118 ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అంచనా వ్యయం సుమారు రూ.4,883 కోట్లుగా స్పష్టం చేసిన రైల్వేశాఖ.. ఇందులోనే మూడు ఆర్వోబీలు, ఏడు ఆర్యూబీలు, ఎనిమిది లెవల్ క్రాసింగ్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వివరించింది. క్రాసింగ్ల వద్ద రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండడంతో.. వీటి స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణంలో భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు, వాతావరణ పరిస్థితుల వల్ల జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పనులను వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, ఆమోదంలో జాప్యం లేకుండా ముందస్తుగా ప్రామాణిక డ్రాయింగ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లాలో నాలుగుచోట్ల ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం వరంగల్లో రైల్వే వంతెనలకు రూ.197 కోట్లు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరో 3 చోట్ల రాష్ట్ర నిధులతో పనులు.. అసంపూర్తి పనులపై దృష్టి రైల్వే పెండింగ్ పనుల్లో ఎట్టకేలకు కదలిక నాలుగు లెవల్ క్రాసింగ్ల వద్ద చేపట్టనున్న పనుల అంచనా వ్యయం రూ.197 కోట్లు కాగా, ఆ మేరకు నిధులు కేటాయించారు. ఈ నాలుగు పనుల్లో ఒక్కదానికి టెండర్ సైతం ఖరారు చేశారు. మిగతా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్–చింతలపల్లి మార్గంలోని ఎల్సీ నంబర్ 64 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.77 కోట్లు అంచనా వేశారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 69/ఎం వద్ద రూ.100 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ (జీఏడీ), అంచనాల తయారీ పనులు జరుగుతున్నాయి. ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 70 వద్ద రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో రైల్వేవాటా పూర్తయ్యింది. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. నెక్కొండ–ఇంటికన్నె మార్గంలోని ఎల్సీ నంబర్ 74 వద్ద రూ.8 కోట్లతో చేపట్టాల్సిన ఆర్యూబీ పనులు కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. -
ఎంజీఎంలో రోగులకు నాసిరకం భోజనం
డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలి : సీపీఎం కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని, వెంటనే డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆస్పత్రి సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వారు చికిత్స పొందుతున్న రోగులు, వారి అటెండెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాసిరకంగా ఉందని, అన్నం సరిగ్గా ఉడక్కపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నాయకులు.. సంబంధిత కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు అవసరమైన కిట్లు, మందులివ్వకుండా, బయట కొనాలని వైద్యులు చెబుతున్నట్లు సీపీఎం నాయకులకు రోగులు విన్నవించారు. దీనివల్ల ప్రతీవారం రోగులపై అదనపు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకుడు సింగారపు బాబు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరుణ్కుమార్, ఎండీ.మహబూబ్ పాషా, ఎన్.చంద్రమౌళి, సింగారం చుక్కయ్య, రాజమణి, అనిల్, శివ పాల్గొన్నారు. -
లక్ష్యం చేరేనా?
శాఖ లక్ష్యం నాటిన మొక్కలు అటవీశాఖ 36,000 13,010 బీసీ వెల్ఫేర్ 640 600 ఎస్సీ వెల్ఫేర్ 320 200 హార్టికల్చర్ 1,00,000 36,574 డీఆర్డీఓ 6,20,000 2,22,544 జీడబ్ల్యూఎంసీ 72,000 2,60,982 డీపీఓ 4,48,000 0 ఐసీడీఎస్ 2,240 484 సివిల్ సప్లయీస్ 3,200 452 సెరికల్చర్ 1,00,000 11,000 ఫిషరీష్ 640 50న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణ హరితహారం స్ఫూర్తితో ఏటా వర్షాకాలం ప్రారంభంలో జోరుగా సాగాల్సిన వనమహోత్సవం (మొక్కలు నాటడం) ఈ సంవత్సరం జిల్లాలో ఊపందుకోలేదు. ఆగస్టు మాసం వచ్చినా క్షేత్రస్థాయిలో నాటాల్సిన మొక్కల సంఖ్య కేటాయించిన లక్ష్యాలపై అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైన ఊసే వినిపించడంలేదు. ఈ ఏడాది జిల్లాకు 25,51,248 లక్ష్యం నిర్దేశించగా కేవలం 5,45,896 మొక్కలు మాత్రమే నాటారు. మొత్తంగా 27 శాతం లక్ష్యం నెరవేరింది. వనమహోత్సవం కార్యక్రమం అధికారుల్లో ప్రకటనలు నామమాత్రపు ఫొటో సెషన్లకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పచ్చదనం పెంచేందుకు కావాల్సిన ముందస్తు ప్రణాళికలు, శాఖల మధ్య సమన్వయం కరువైంది. గతంలో పోటీ పడి మొక్కలు నాటిన ప్రభుత్వ విభాగాలు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఏడాది నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలను గ్రేటర్ వరంగల్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అనుకున్న సమయానికి చేరుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాలకే పరిమితం.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మొక్కలు నాటడానికి అనుకూలమైనవి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఆ తర్వాత నాటే మొక్కలు బతికే అవకాశం తక్కువగా ఉంటుంది. కేవలం గణాంకాలతో కాగితాలు నింపే సంస్కృతికి స్వస్తి పలికి క్షేత్రస్థాయిలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్లో తీవ్ర ఉష్ణోగ్రతలు పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రత్యేక కార్యాచరణతో వనమహోత్సవాన్ని వేగవంతం చేయాలని పర్యావరణ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో, వర్షాభావ పరిస్థితులే కారణమా.. ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వనమహోత్సవం ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. జూన్, జూలై తొలి వారాల్లో ఎల్నినో కారణంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఆ సమయంలో మొక్కలు నాటితే ఎండిపో యి ప్రజాధనం వృథా అవుతుందని, అందుకే కొంత వేగం తగ్గించామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో శాఖల వారీగా నాటిన మొక్కలు వనమహోత్సవం వట్టిమాటేనా! జిల్లాలో మందగించిన లక్ష్యం నెలలు గడుస్తున్నా.. లేని ఉత్సాహం వర్షాభావ పరిస్థితులతోనే ఆలస్యం అంటున్న అధికారులువనమహోత్సవంలో భాగంగా పలుశాఖలకు కేటాయించిన లక్ష్యంలో ఇప్పటి వరకు ఒక్క మొక్కను కూడా నాటలేదు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలతో పాటు, డీఈఓ, ఇరిగేషన్, పశుసంవర్ధకశాఖ, పరిశ్రమలశాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, వైద్య ఆరోగ్యశా ఖ, పోలీస్శాఖ, మైనార్టీ శాఖలకు కేటాయించిన లక్ష్యంలో ఇప్పటి వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. -
జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
● హనుమకొండ అదనపు కలెక్టర్ శేషాద్రి హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా పంట కుంటల ఏర్పాటుతో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కుంటలతో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, సాగునీటి లభ్యత మెరుగుపడుతాయని అన్నారు. పంట కుంటల ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్డీఓ మేన శ్రీను మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి పంట కుంటలు, ఊర కుంటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో డీపీఓ ఎల్.రమాకాంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు
ఖానాపురం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ నోట్బుక్స్, యూనిఫాంలు పంపిణీ చేస్తున్నామన్నారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. రోజువారి అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు చేరిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,172 మంది ఉన్నారని, మరింత మంది విద్యార్థులు చేరి ప్రభుత్వం అందించే వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకు దిక్సూచిగా వరంగల్ నగరం భవిష్యత్లో మెగా కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, కాజీపేట రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు వరంగల్ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, రియల్ ఎస్టేట్ రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉంది. రానున్న ఐదేళ్లలో వరంగల్ను ఉత్తర తెలంగాణ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు మెగా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. 68.015 కిలోమీటర్ల కరీంనగర్–వరంగల్ (ఎన్–563) జాతీయ రహదారి పనులు, వరంగల్–ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే (ఎన్హెచ్–163జీ) రహదారి నిర్మాణ పనులు పూర్తయితే మెగా కనెక్టివిటీ వరంగల్కు అనుసంధానం కానుంది. ఇప్పటికే హైదరాబాద్– వరంగల్ (ఎన్హెచ్ 163), ప్రస్తుత వరంగల్ ఎన్హెచ్ 163 వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాతీయ రహదారులతో పాటు మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలు కానుండడంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. కాకతీయ టెక్స్టైల్ పార్కులోకి మరిన్ని కంపెనీలు.. రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఒకే నగరంలో అందుబాటులో ఉండటంతో వరంగల్ భవిష్యత్లో లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. టూరిస్ట్ హబ్గాను నిలవనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశ్రామిక వస్తువుల రవాణా వేగవంతమవుతుంది. పీఎం మిత్ర కింద ఎంపికైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోకి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే, వరంగల్ కనెక్టివిటీకి రూ. 13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేశామని.. లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానం ఇవ్వడంతో వరంగల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.● రూ.2,414.46 కోట్లతో 68 కిలోమీటర్ల నిడివితో ఎన్హెచ్–563 కరీంనగర్–వరంగల్ నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికిపైగా పూర్తి అయ్యాయి. ● రూ.3,718 కోట్లతో ఎన్హెచ్–163జీ వరంగల్–ఖమ్మం హైవే నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టారు. భారత్ మాల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే పనుల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. ● రూ.2,972 కోట్లతో 201 కిలోమీటర్ల బల్లార్షా–కాజీపేట నాలుగో రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 118 కిలోమీటర్ల కాజీపేట–విజయవాడ మూడో రైల్వే లేన్ పూర్తవుతుంది. రూ.208 కోట్లతో 21 కిలోమీటర్ల ఆర్ఓఆర్ (రైల్ ఓవర్ రైల్) పూర్తి 2026లో అందుబాటులోకి వచ్చింది. దీంతో కాజీపేట జంక్షన్లో రైళ్ల నిలిపివేత తగ్గింది. ● 949.44 ఎకరాల విస్తీర్ణమున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే రూ.203.49 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిచింది. ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేశాక పనులు ప్రారంభం కానున్నాయి. రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణాలు సులభం అవుతాయి.రూ.13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులతో వరంగల్కు మెగా కనెక్టివిటీ రోడ్లు, రైలు, విమాన మార్గాల అభివృద్ధి దిశగా అడుగులు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకానికి భారీ ఊతం లాజిస్టిక్స్ హబ్ నగరాల జాబితాలో ఓరుగల్లు చేరే అవకాశం లోక్సభలో కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబువరంగల్ మెగా కనెక్టివిటీ ఇలా.. -
వరంగల్
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఇరుకు గదులు .. అరకొర వసతులు క్రీడా పాఠశాల ప్రారంభమైన రెండో విద్యా సంవత్సరానికే నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. సరైన వసతులు కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకు దిక్సూచిగా వరంగల్ నగరం భవిష్యత్లో మెగా కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, కాజీపేట రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు వరంగల్ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, రియల్ ఎస్టేట్ రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉంది. రానున్న ఐదేళ్లలో వరంగల్ను ఉత్తర తెలంగాణ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు మెగా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. 68.015 కిలోమీటర్ల కరీంనగర్–వరంగల్ (ఎన్–563) జాతీయ రహదారి పనులు, వరంగల్–ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే (ఎన్హెచ్–163జీ) రహదారి నిర్మాణ పనులు పూర్తయితే మెగా కనెక్టివిటీ వరంగల్కు అనుసంధానం కానుంది. ఇప్పటికే హైదరాబాద్– వరంగల్ (ఎన్హెచ్ 163), ప్రస్తుత వరంగల్ ఎన్హెచ్ 163 వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాతీయ రహదారులతో పాటు మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలు కానుండడంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. కాకతీయ టెక్స్టైల్ పార్కులోకి మరిన్ని కంపెనీలు.. రోడ్డు, రైలు, విమాన మా ర్గాలు ఒకే నగరంలో అందుబాటులో ఉండటంతో వరంగల్ భవిష్యత్లో లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. టూరిస్ట్ హబ్గాను నిలవనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశ్రామిక వస్తువుల రవాణా వేగవంతమవుతుంది. పీఎం మి త్ర కింద ఎంపికై న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే వరంగల్ కనెక్టివిటీకి రూ. 13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేశామని లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించడంతో వరంగల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.● రూ.2,414.46 కోట్లతో 68 కిలోమీటర్ల నిడివితో ఎన్హెచ్–563 కరీంనగర్–వరంగల్ నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ● రూ.3,718 కోట్లతో ఎన్హెచ్–163జీ వరంగల్–ఖమ్మం హైవే నిర్మాణ పనులు మూడు ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టారు. భారత్ మాల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే పనుల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. ● రూ.2,972 కోట్లతో 201 కిలోమీటర్ల బల్లార్షా–కాజీపేట నాలుగో రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 118 కిలోమీటర్ల కాజీపేట–విజయవాడ మూడో రైల్వే లేన్ పూర్తవుతుంది. రూ.208 కోట్లతో 21 కిలోమీటర్ల ఆర్ఓఆర్ (రైల్ ఓవర్ రైల్) పూర్తి 2026లో అందుబాటులోకి వచ్చింది. దీంతో కాజీపేట జంక్షన్లో రైళ్ల నిలిపివేత తగ్గింది. ● 949.44 ఎకరాల విస్తీర్ణమున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే రూ.203.49 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల టెండర్లు పిలిచింది. ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశమిచ్చారు. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేశాక పనులు ప్రారంభం కానున్నాయి. రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణాలు సులభం అవుతాయి. రూ.13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులతో వరంగల్కు మెగా కనెక్టివిటీ రోడ్లు, రైలు, విమాన మార్గాల అభివృద్ధి దిశగా అడుగులు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకానికి భారీ ఊతం లాజిస్టిక్స్ హబ్ నగరాల జాబితాలో ఓరుగల్లు చేరే అవకాశం లోక్సభలో కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబువరంగల్ మెగా కనెక్టివిటీ ఇలా.. -
డిగ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం
నర్సంపేట: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ప్రభుత్వం చివరి అవకాశాన్ని కల్పించిందని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. బుధవారం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు (గురువారం) నుంచి దోస్త్ ద్వారా చివరి విడత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్న నేపధ్యంలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చదువుతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందించే వినూత్న కోర్సులను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి బలం
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హన్మకొండ చౌరస్తా: క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియపై మండల అధ్యక్షులు, ఇన్చార్జ్లతో జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఈనెల 15వ తేదీలోపు తప్పకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు కూడా కమిటీలలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించి, అన్ని వర్గాల కలయికతో కమిటీలను సమతుల్యంగా రూపొందించాలన్నారు. సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పల్లె శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట ఇన్చార్జ్ కూచన రవళి హాజరయ్యారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాశిబుగ్గ: ఎంజీఎంలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న కె.ఉమాదేవి, కె.సత్యం చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందగట్ల శరత్బాబు ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డిని వారు మర్యాపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, ఫార్మసీ ఆఫీసర్లు మరియమ్మ, సునీత, వెంకటరమణ పాల్గొన్నారు. -
నిట్లో సైబర్ జాగుర్తా దివస్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సౌజన్యంతో సైబర్ జాగుర్తా దివస్, సురక్షా కా తిరంగా – మంత్ ఎండ్ చాంపియన్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు భయం, ఆశ, అత్యవసర భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిట్ వరంగల్ విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ భద్రత పరిశోధనలను చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. సైబర్ నేరాలను నివారించేందుకు త్వరలో నిట్లో సైబర్ సెక్యూరిటీ హకథాన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్ మెహతా, డీసీపీ దార కవిత, నిట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
హన్మకొండ: విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో వరంగల్ సర్కిల్ పరిధిలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతపై అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం తగదన్నారు. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ కె.గౌతమ్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ భద్రత విషయంలో రాజీకి తావులేదని, ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తిచేస్తూ సంస్థ ప్రతిష్టను మరింత పెంచేందుకు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎస్ఈ ఎ.ఆనందం, డీఈలు రాంబాబు, ఎస్.మల్లికార్జున్, తిరుపతి, హర్జి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంజీవరావు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ -
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
దుగ్గొండి: విద్యార్థులు లక్ష్యానిన నిర్దేషించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా లోకల్బాడీ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్య శిక్షణ పొందాలన్నారు. ప్రతి సబ్జెక్టుపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుందతి, పాఠశాల ప్రిన్సిపాల్ ఓదేల మల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మల్లంపల్లిలోని కేజీబీవీలో నిర్వహించిన స్ఫూర్తి సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ డీఎం సంధ్యారాణి పాల్గొన్ని మాట్లాడారు. ఆడపిల్లలు అన్నీ రంగాల్లో స్ఫూర్తి దాయకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి మంజుల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం
కాశిబుగ్గ: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి డాక్టర్ రోహిత్ బస్రే స్పష్టం చేశారు. స్టైఫండ్ పెంపుకోసం వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో తెలంగాణ ఆయుష్ జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ హౌస్సర్జన్లకు సమాన పనికి సమానవేతనం అందే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవరసమైతే సమస్యల పరిష్కారం కోసం ఆత్మార్పణ ఘోష చేయడానికి వెనుకాడనని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టైఫండ్ను పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరవధిక సమ్మె గురించి ప్రభుత్వానికి తెలపాలని కోరుతూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మారాజుకు హౌస్సర్జన్లు వినతిపత్రం సమర్పించారు. అలాగే, స్టైఫండ్ పెంపు విషయంపై వారు వివరించారు. విశ్వ ఆయుర్వేద పరిషత్, ఎన్ఎంఏ సభ్యుల మద్దతు.. ఆయుష్ హౌస్సర్జన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు విశ్వ ఆయుర్వేద పరిషత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ చిలువేరు రవీందర్, డాక్టర్ మోహన్రావు, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ సాంబమూర్తి తెలిపారు. అదేవిధంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ కార్యదర్శి డాక్టర్ రోహిత్ బస్రే -
అప్రమత్తతతోనే సైబర్ నేరాల నివారణ
సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత హన్మకొండ అర్బన్: దురాశ, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ఇలాంటి నేరాలను నివారించవచ్చని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో సిబ్బందికి బుధవారం నిర్వహించిన సైబర్ భద్రత అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, పెట్టుబడులపై అధిక లాభాల పేరుతో అమాయకులను సైబర్ నేరగాళ్లు వలలో వేస్తున్నారని తెలిపారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి పెట్టుబడి పెట్టరాదన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ మోసాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. -
‘సీకేఎం’ను సందర్శించిన డీఎంహెచ్ఓ
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విభాగానికి మెడికల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే, ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు వారంలో ఒకసారి శానిటేషన్ సిబ్బందిని ఇక్కడికి పంపిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆస్పత్రి ఎదుట పంపిణీ చేస్తున్న రూ.5 భోజనం వల్ల అపరిశుభ్రత నెలకొంటున్న క్రమంలో ఆస్పత్రి వెనుకభాగంలోని ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, పలువురు ఆర్ఎంఓలు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు ఉన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో తనిఖీలు వరంగల్లోని దేశాయిపేట, చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను డీఎంహెచ్ఓ రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేశాయిపేటలో ఇమ్యూనైజేషన్ సెషన్ను పర్యవేక్షించి, టీకాల నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, రికార్డులు పరిశీలించారు. చింతల్లో రికార్డులను పరిశీలించి, డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. అలాగే, డాక్టర్స్ కాలనీ –2లో డెంగీ నివారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్కుమార్, డాక్టర్ దిలీప్కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కె.కుమారస్వామి, హెచ్ఈఓ సదానందం, మధుకర్, కోర్నేలు పాల్గొన్నారు. -
బోనమెత్తిన వంచనగిరి
గీసుకొండ: మండలంలోని కోటమైసమ్మ తల్లికి వంచనగిరి మహిళలు బుధవారం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మంత్రి కొండా సురేఖ గ్రామంలోని తన ఇంటి నుంచి ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మహిళలు వెంట రాగా బంగారు బోనంతో కాలినడకన రెండు కిలోమీటర్ల దూరంలోని అమ్మవారి ఆలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కొండా దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వందలాది మంది భక్తులు, అభిమానులు పసుపు, కుంకుమ చల్లుతూ మంగళవాయిద్యాల మద్య పోతరాజుల విన్యాసాలతో బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొండా దంపతులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల కష్టాలు తీరాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, జిల్లా నాయకులు గోపాల నవీన్రాజు, కొమ్ముల కిషోర్, సర్పంచ్లు రడం భరత్, వీరగోని రాజ్కుమార్, కొమ్ముల కమల, పేర్ల శ్రవన్, బానోతు రాఘవేంద్ర, కేలోతు భిక్షపతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కోటమైసమ్మకు బంగారు బోనం సమర్పించిన మంత్రి సురేఖ -
గిజిగాడు గూళ్లు
గిజిగాడు ఇల్లు చూస్తే ఏ ఇంజనీర్ కూడా చెప్పలేనంత నిర్మాణ శైలి ఉంటుంది. గాలికి తెగకుండా, వర్షానికి తడవకుండా అల్లికలతో బలంగా నిర్మాణం చేసుకుంటాయి. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యంతో పక్షులు, జంతువులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. వాటి గూళ్లను చూడాలంటే ఏ మారుమూల గ్రామానికి వెళ్లాల్సిందే. ఎక్కడో ఒక చెట్టుకు ఒకటి, రెండు పిచ్చుకల గూళ్లు కనిపిస్తేనే ఆనందపడతాం. నెక్కొండ ఊర చెరువు సమీపంలోని శ్మశాన వాటిక బావి ఒడ్డుపై ఉన్న చెట్టు కొమ్మలకు గిజిగాడు గూళ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ దారిగుండా వెళ్లే వాహనదారులు గిజిగాడు గూళ్లను చూసి ఆనంద పడుతున్నారు. ఈ పక్షుల గూళ్లు బుధవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – నెక్కొండ -
విద్యార్థినుల్లో చైతన్యం పెంపొందించాలి
వర్ధన్నపేట: స్ఫూర్తి కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో చైతన్యం పెంపొందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామగ్రిని పరిశీలించారు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ పిల్లలతో ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ స్ఫూర్తి కార్యక్రమంలో రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజం ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్ట్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థినులు భవిష్యతుపై స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని స్వీయ చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, డీటీడీఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల అస్వస్థతపై విచారణ హాస్టల్లోని 27 మంది విద్యార్థినులు కలుషిత ఆహారంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన ఘటనపై అధికారులతో కలెక్టర్ సత్యశారద విచారణ జరిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడిగా పాఠశాల ప్రిన్సిపాల్ వాంకడోతు రాంథన్పై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వార్డెన్ బాధ్యతలను సైతం మరో అధికారికి అప్పగించారు. సోలార్ యూనిట్ల ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేయాలి రాయపర్తి: సోలార్ యూనిట్ల ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధవారం రాయపర్తి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆదర్శ మోడల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్ధేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉన్నారు. కలెక్టర్ సత్యశారద -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రం శ్రీనివాసకాలనీ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి సిబ్బందితో కలిసి యంత్రాల సాయంతో నిర్మాణాలను తొలగించారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఆక్రమణదారులు స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్రభుత్వ భూములతో పాటు రహదారులను సైతం ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందగా కూల్చివేతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను కొనుగోలు చేసిన వారూ నష్టపోయే అవకాశం ఉందని, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. -
పోలీస్ బైక్పై రాపిడో బిజినెస్ వరంగల్లో వైరల్
హనుమకొండ: పోలీసుల వేగవంతమైన విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన అధికారిక ద్విచక్ర వాహనం.. రోడ్లపై ర్యాపిడో బైక్గా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసు శాఖకు కేటాయించిన అధికారిక బైక్ను ర్యాపిడో సేవల కోసం వినియోగిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.వరంగల్లో పోలీస్ బైక్పై ర్యాపిడో బిజినెస్ pic.twitter.com/uvWb20Nx1E— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026 సమాచారం ప్రకారం.. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి సుబేదారి జంక్షన్కు వెళ్లేందుకు ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే వచ్చిన బైక్పై పోలీసు శాఖ అధికారిక గుర్తులు ఉండటాన్ని గమనించి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. బైక్ గురించి రైడర్ను ప్రశ్నించగా, ఆ బైక్ తన పోలీసు స్నేహితుడిదని, తాను ర్యాపిడో సేవల కోసం ఉపయోగిస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ సంభాషణను ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వైరల్ అయిన వీడియోలో కనిపించిన TS 09 PC 2795 నంబర్ గల బ్లూ కోట్స్ పోలీసు ద్విచక్ర వాహనం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్కు కేటాయించినదిగా గుర్తించారు. -
గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్తో 27 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించారు. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారికి ఏఎన్ఎం మాత్రలు అందించగా తగ్గాయని చెబుతున్నారు.సోమవారం ఉదయం విద్యార్థినులు కిచిడి తిన్నాక కొంతసేపటికి 27 మంది అస్వస్థతకు గురవడంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స అందించారు. సమాచారం అందుకున్న జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్ విజయసాగర్ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. అనంతరం హాస్టల్కు వెళ్లి మిగతా విద్యార్థినుల పరిస్థితిని పరిశీలించారు. కాగా, అన్నంలో పురుగులు వస్తున్నాయని, భోజనం బాగుండడం లేదని విద్యార్థినులు వాపోయారు.వార్డెన్ షేక్ యాకూబ్ సమయపాలన లేకుండా విధులకు హాజరవుతారని తెలిసింది. విద్యార్థినుల ఆరోగ్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విరీన్ మాట్లాడుతూ విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. -
ముఖ్యనాథాలయంలో ప్రత్యేక పూజలు
ధర్మసాగర్: కాకతీయుల కాలం నాటి ముప్పారంలోని ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయాన్ని సోమవారం జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ సందర్శించారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటక అధికారికి ముఖ్యనాథస్వామి దేవాలయ పునఃవ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్ రవీంద్ర ఘనంగా స్వాగతం పలికి, అతిథి మర్యాదలతో ఆహ్వానించారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారి శివాజీ ఆలయాన్ని ఆనుకుని ఉన్న చారిత్రక ముఖ్యనాథుని చెరువును, దాని పరిసరాల్లోని ఇనుపరాతి గుట్టలను పరిశీలించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సుందరీకరిస్తే భవిష్యత్లో అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అసిస్టెంట్ లోకేశ్వర్, ఆలయ ప్రధాన అర్చకుడు విక్రమ్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సులుగూరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. మీ విజయం మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండ● -
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లికి 126, మహబూబాబాద్కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి. మనదే అత్యధిక వాటా.. పోలీస్ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 721, ఏఆర్ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్, 2 మహిళా వార్డర్ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ కానిస్టేబుల్, 15 ఫైర్ ఫైటర్, 11 పురుష వార్డర్, ఒక మహిళా వార్డర్ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 656 ములుగుకు ప్రాధాన్యం కింద 189 పోస్టులు.. మూడు జోన్లలో మరో 101 మందికి అవకాశాలు -
ల్యాదెళ్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణ
దామెర: మండలంలోని ల్యాదెళ్లలో ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టినట్లల స్థానికులు తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్ 38లో కొంత భూమి అసైన్డ్ కాగా మరికొంత భూమిలో నిర్మించిన దేవాదుల పంప్ హౌజ్ క్వార్టర్స్ను ఇటీవల స్కిల్డెవలప్మెంట్ సెంటర్కు కేటాయించారు. మిగిలిన ప్రభుత్వ భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరిగోడ నిర్మించడంతోపాటు బోర్ వేయించాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చొరవతీసుకొని, చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా మొక్కలు నాటి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అటవీశాఖాధికారి నిఖితతో కలిసి జిల్లాస్థాయి మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా మొక్కలు నాటడం, లక్ష్యాల సాధన, జియో ట్యాగింగ్ పురోగతి, మొక్కల పరిరక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాకు ఈ ఏడాది 25,51,248 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు 7,27,612 మొక్కలు నాటడం జరిగిందన్నారు. టార్గెట్ పూర్తి చేయని అధికారులను అందుకు గల కారణాలను అడిగి తెలుసుకుని గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వై.వీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అవయవదానంపై అవగాహన జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోన్రెడ్డి మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉపేందర్రెడ్డి, భారతి, నిర్మల, శ్రీనివాస్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
డీపీఆర్ను వేగంగా పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బల్దియా నుంచి కమిషనర్ టి.వెంకన్న, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఇతర పట్టణాభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టు, అర్బన్ చాలెంజ్ ఫండ్కు సంబంధించిన అన్ని ప్రక్రియలు కార్యాచరణ ప్రకారం కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె.శ్రీదేవి -
ఇక..పాఠశాలల్లో తనిఖీలు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంలోనూ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం తనిఖీ బృందాల నియమాకానికి పీఎస్లు, యూపీఎస్లు, హైస్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. బృందాల ఎంపికలో గతేడాది కొనసాగిన వారిలో పలువురు ఉండగా, మరికొందరిని నూతనంగా ఎంపిక చేశారు. ఎంపికై న వారు ఆయా పాఠశాలల నుంచి రిలీవై తనిఖీ బృందాలుగా విధులు నిర్వర్తించనున్నారు. పలువురు సోమవారం రిలీవ్ అయి డీఈఓ కార్యాలయంలో రిపోర్టు చేశారు. వీరిస్థానాల్లో మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. వీరికి కూడా తనిఖీ అంశాలపై ముందుగా శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఏడు తనిఖీ బృందాల ఏర్పాటు: హనుమకొండ జిల్లాలో పీఎస్లకు మూడు టీంలు నియమించారు. ● టీం 1లో : టి.హూన్యానాయక్ (ఎఎఫ్ఎల్ హెచ్ఎం ఎంపీపీఎస్, తరాలపల్లి) నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్.అనిల్కుమార్ (ఎస్జీటీ, మల్లికుదురు), వి.శ్రీపాల్రెడ్డి (ఎస్జీటీ, జీపీఎస్ నయీంనగర్) ఉన్నారు. ● టీం 2లో : ఎన్.ప్రవీణ్కుమార్ ఎల్ఎఫ్ఎల్ (ఎస్జీటీ ఎంపీపీఎస్ కుమ్మరిగూడెం) నోడల్ ఆఫీసర్గా, సభ్యులుగా వి.శ్యాంసుందర్ (ఎస్జీటీ, ఎంపీయూపీఎస్, తక్కలపాడు), ఎ.శ్రీనివాస్ (ఎస్జీటీ, ఎంపీపీఎస్ రేపాకపల్లి) ఉన్నారు. ● టీం–3లో : సీహెచ్.సుధాకర్ (ఎస్జీటీ, ఎంపీపీఎస్ ఒగ్గోనిపల్లి) నోడల్ ఆఫీసర్గా, సభ్యులుగా సీహెచ్.శ్రీనివాస్ (ఎస్జీటీ, జెడ్పీహెచ్ఎస్ ఒంటిమామిడిపల్లి), బి.బ్రాహ్మచారి (ఎస్జీటీ ఎంపీపీఎస్ రాంపూర్) ఉన్నారు. ● ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యు.నర్సింగరావు (శనిగరం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్) నోడల్ ఆఫీసర్గా, సభ్యులుగా వి.రవికుమార్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం (ఎంపీపీఎస్ దేవనూరు), పి.చంద్రయ్య (ఎస్జీటీ ఎంపీపీఎస్ కోతులనడుమ) ఉన్నారు. హైస్కూళ్ల స్థాయి తనిఖీ బృందాలు ఇలా.. ● టీం–1లో : మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. ఎం.వేణుఆనంద్ (జీహెచ్ఎం గ్రేడ్–2 జెడ్పీహెచ్ఎస్ రాంపూర్) నోడల్ ఆఫీసర్గా, సభ్యులుగా ఎస్ఏలు వివిధ జెడ్పీహెచ్ఎస్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్లు ఈఎస్ మహిపాల్ పట్నాయక్, ఫారూఖ్సాదాత అలీ అహ్మద్, జి.శ్రీధర్రెడ్డి, కె.తిరుపతిరెడ్డి, డి.రమేశ్, ఎస్.రాము, సీహెచ్.సుధాకర్, కె.రాజయ్య ఉన్నారు. ● టీం–2లో ఏడుగురు : ఎల్.రాజేశ్ కుమార్ (జీహెచ్ఎం గ్రేడ్–2 జెడ్పీహెచ్ఎస్, దామెర) నోడల్ ఆఫీసర్గా, మరో ఆరుగురు సభ్యులుగా స్కూల్ అసిస్టెంట్లు కె.మాధవి, సంపత్కుమార్ కొక్కుల, బి.కృష్ణమూర్తి, బి.రాము, అట్ల రవీందర్, ఎస్.రమేశ్ ఉన్నారు. ● టీం–3లో ఏడుగురు : నోడల్ ఆఫీసర్గా ఎస్.రమాదేవి (జీహెచ్ఎం –2 జెడ్పీహెచ్ఎస్ వెల్లంపల్లి), సభ్యులుగా ఎండీ నయీంపాషా, టి.రాముడు, జె.దయాకర్, పి.విజేందర్, వి.జగన్నాధం, ఆర్.సదానందం ఉన్నారు. ● ఏమేం తనిఖీ చేస్తారంటే : విద్యాబోధన, విద్యార్థులు అభ్యసనా ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్, ఉన్నత పాఠశాలల్లో లిప్ అమలు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్టుల విద్యాబోధనను పరిశీలిస్తారు. ● పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఏజెండాను సిద్ధం చేస్తారు. అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాల ఏర్పాటు పీఎస్లకు 3, యూపీఎస్లకు 1, హైస్కూళ్లకు 3 టీంల ఎంపిక మొత్తం 36 మంది ఉపాధ్యాయుల నియామకం హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉత్తర్వులు జారీ -
ఉక్కుపాదం!
సీఎంఆర్ బకాయిలపైడిఫాల్ట్ రైస్మిల్లర్లపై చర్యలకు సిద్ధం సాక్షి, వరంగల్: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ను ఏళ్లుగా నిల్వ ఉంచిన మిల్లులపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసింది. జిల్లాలో సీఎంఆర్ ఇవ్వాల్సిన 100 రైస్ మిల్లుల్లో 91 మిల్లులు పూర్తిస్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించగా, మరో తొమ్మిది మిల్లులు మాత్రం ఇప్పటికీ బకాయిలను చెల్లించలేదు. వీటి వద్ద 3,307.336 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్లో ఉండగా, దీని విలువ సుమారు రూ.8.53 కోట్లుగా ఉంది. 2023–24 ఖరీఫ్ సీజన్ నుంచి కొనసాగుతున్న ఈ బకాయిలపై పలుమార్లు గడువు ఇచ్చినా.. స్పందించకపోవడంతో అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జిల్లాలో రెండు మిల్లుల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడంతో మిగిలిన మిల్లర్లలో ఆందోళన నెలకొంది. పలు మిల్లులపై ఎఫ్ఐఆర్ నమోదు.. కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు ఉన్న తొమ్మిది మిల్లులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు మిల్లులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బకాయిలు ఉన్న అన్ని మిల్లులను బ్లాక్ లిస్ట్లో చేర్చడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం బకాయిల వసూళ్ల ప్రక్రియను ప్రారంభించారు. మూడేళ్లుగా ఇదే మిల్లులపై విడతల వారీగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో రూ.8.53 కోట్ల విలువైన బియ్యం పెండింగ్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు, బ్లాక్లిస్ట్లో మిల్లులు రెవెన్యూ రికవరీతో వసూళ్లకు అధికారుల కఠిన చర్యలుజిల్లాలో సీఎంఆర్ బకాయిల పరిస్థితి సీఎంఆర్ ఇవ్వాల్సిన మిల్లులు: 100 పూర్తిగా సీఎంఆర్ ఇచ్చిన మిల్లులు: 91 బకాయి ఉన్న మిల్లులు: 9 పెండింగ్ సీఎంఆర్: 3,307.336 మెట్రిక్ టన్నులు బకాయి విలువ: రూ.8.53 కోట్లు నోటీసులు జారీ: 9 మిల్లులు ఎఫ్ఐఆర్లు నమోదు : 4 మిల్లులు కఠిన చర్యలు తీసుకుంటాం.. మూడు సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో సీఎంఆర్ బకాయిల పరిస్థితి మెరుగుపడింది. అధిక శాతం మిల్లులు తమ బాధ్యతలను పూర్తి చేయగా, కేవలం తొమ్మిది మిల్లులు మాత్రమే బకాయిలతో మిగిలాయి. డిఫాల్టర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం. ప్రభుత్వ ధాన్యం సకాలంలో బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థకు చేరేలా చూడటం మిల్లర్ల బాధ్యత. సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లులపై రెవెన్యూ రికవరీతో పాటు అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –సంధ్యారాణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మండలం గ్రామం మిల్లు పేరు నెక్కొండ చంద్రుగొండ శ్రీవెంకటేశ్వర రైస్ మిల్, శ్రీ మల్లికార్జునస్వామి ఇండస్ట్రీస్ ఖిలావరంగల్ బొల్లికుంట సౌభాగ్య రైస్ మిల్ ఖిలావరంగల్ గాడిపల్లి శ్రీ వైష్ణవి ఇండస్ట్రీస్ సంగెం కాపులకనపర్తి సతీష్ రైస్ మిల్ -
తల్లిపాలే శ్రీరామరక్ష!
నల్లబెల్లి: శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష. ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ‘స్థిరమైన జీవితానికి తల్లిపాలు.. ఫ లితాన్నిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ఈనెల 1న ప్రారంభమైన వారోత్సవాలు ఏడో తేదీ వరకు సంబంధిత శాఖల సమన్వయంతో అవగా హన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.. తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని రకాల పోషకాలను సమృద్ధిగా అందించడంతో పాటు సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడంతో ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది పడుతుంది. శిశువు జన్మించిన నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ దశలో నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని వైద్యులు చె బుతున్నారు. ఆ తర్వాత అనుబంధ ఆహారంతో పా టు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం శిశువు శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరమంటున్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో జిల్లాలో ర్యాలీలు, అవగాహన సదస్సులు, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతీ తల్లి శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించేలా చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధా న లక్ష్యమని అధికారులు తెలిపారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం ఈనెల 7వ తేదీ వరకు వారోత్సవాలు జిల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలు -
వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026●అన్ని ఎరువులకు ఒకే యాప్ యూరియాతో పాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ను తీసుకొస్తుంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లికి 126, మహబూబాబాద్కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి. మనదే అత్యధిక వాటా.. పోలీస్ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 721, ఏఆర్ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్, 2 మహిళా వార్డర్ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ కానిస్టేబుల్, 15 ఫైర్ ఫైటర్, 11 పురుష వార్డర్, ఒక మహిళా వార్డర్ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి.వరంగల్ కమిషనరేట్ పరిధిలో 656 ములుగుకు ప్రాధాన్యం కింద 189 పోస్టులు.. మూడు జోన్లలో మరో 101 మందికి అవకాశాలు -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్లో మొత్తం 153 దరఖాస్తులు రాగా రెవెన్యూశాఖకు 41, జీడబ్యూఎంసీ 30, హౌసింగ్ 20, ఇతర శాఖలకు సంబంధించిన 62 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తులతో పాటు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండ -
పెండింగ్ వినతులపై ప్రత్యేక దృష్టి
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: ప్రజావాణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న వినతులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ వినతిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్లో సోమవారం మొత్తం 252 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్న్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, అధికారులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ ధర్నా ఉద్రిక్తం
హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో ఏబీవీపీ చేపట్టిన ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సోమవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులచే స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. అనుమతి మేరకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసులు విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈక్రమంలో విద్యార్థులు పోలీసులను దాటి వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. పోలీసులు కలెక్టరేట్ గేట్ మూసేశారు. ఏబీవీపీ నాయకులు గేట్ ఎక్కి కలెక్టర్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గేట్ ఎక్కిన విద్యార్థులు అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించే క్రమంలో విద్యార్థులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాచెర్ల రాంబాబు, జూపల్లి దీపిక, సుజిత్, కార్తీక్, బానోతు శ్రవణ్కుమార్, ప్రేమ్, రాజకుమార్, అభిలాష్, సంతోశ్, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్ మార్చ్ను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే నిరసన తెలిపిన విద్యార్థులు -
గడువు ముగిసిన పాలు తాగి బాలింతకు అస్వస్థత
భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి గట్లనర్సింగాపూర్–5 అంగన్వాడీ కేంద్రంలో గడువు ముగిసిన పాలు సరఫరా చేయడంతో అవి తాగిన బాలింత అంబాల సుకన్య అస్వస్థతకు గురైంది. పాలప్యాకెట్లు జూలై 8వ తేదీ వరకు మాత్రమే వినియోగించాలని ఎకై ్పరీ డేట్ ముద్రించి ఉంది. పంపిణీదారులు దీన్ని పట్టించుకోకుండా సరఫరా చేయడంతో బాలింత సుకన్య తాగింది. అనంతరం వాంతులు, విరోచనాలయ్యాయి. స్థానికంగా చికిత్స పొందింది. అధికారులు తనిఖీలు చేయకపోవడంతోనే గడువు ముగిసిన పాలప్యాకెట్లు సరఫరా అవుతున్నాయని, కాలం చెల్లిన పాలు తాగడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అస్వస్థతతకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గడువు ముగిసిన పాలప్యాకెట్ -
పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
కాళోజీ సెంటర్: పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ డిమాండ్ చేశారు. రంగశాయిపేటలో ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా నివేదిక తెప్పించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్లో ఉంచడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.వేయి కోట్లు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ టీచర్లకు మెమో 57 ప్రకారం ఓపీఎస్ వర్తింపజేయాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, జీఓ 25ను సవరించాలని, 10 వేల పీఎస్హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని, సెన్సస్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాలని, టెట్ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరారు. టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ -
నర్సంపేట వాసికి ఎక్స్లెన్స్ అవార్డు
నర్సంపేట: ఓ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో పలు విభాగాలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నర్సంపేటకు చెందిన పడిదాల నవీన్కుమార్కు ఎక్స్లెన్స్ ఇన్ కార్పొరేట్ సివిల్ అండ్ ఇంటీరియల్ సొల్యూషన్స్లో అవార్డును తెలంగాణ గవర్నర్ శివ్ప్రతాప్శుక్లా సమక్షంలో ప్రముఖ నటుడు సోనూసూద్ అందించారు. పీహెచ్ఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ పారిశ్రామికంగా కృషి చేస్తున్నందువల్ల ఓ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గుర్తింపులో భాగంగా పలు రంగాల వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ఇంజినీరింగ్ కచ్చితత్వం, ఆవిష్కరణ, సమగ్రత పట్ల తనకున్న నిబద్ధత ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థలు, ప్రతిష్టాత్మక సంస్థల నమ్మకాన్ని పొందినట్లు ఆయన చెప్పారు. -
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కొనసాగుతున్న ‘తల్లిపాల వారోత్సవాలు’ ● శిశువుకు ఆరు నెలల వరకు నీళ్లు కూడా తాగించొద్దు ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య హన్మకొండ అర్బన్: జన్మించిన ప్రతీ శిశువుకు తల్లి పాలే సంజీవని అని, అవి ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య అన్నారు. శనివారం నుంచి మొదలైన ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’ 7వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా ప్రతి కుటుంబంలో తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ముర్రుపాలు అమృతంతో సమానం! ప్రసవించిన వెంటనే బిడ్డకు తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం అత్యంత ఆవశ్యకం. కాన్పు అయిన మొదటి కొద్ది రోజులు వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను ‘ముర్రుపాలు’ (కొలస్ట్రమ్) అంటారు. ఇవి బిడ్డకు అమృతంతో సమానం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్ ‘ఎ’, ‘బి’, పాటు సహజ రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. ఇవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కామెర్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షిస్తాయి. తల్లులకు కలిగే ఆరోగ్యం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి–శిశువు మధ్య అను బంధం మరింత బలపడుతుంది. ప్రసవానంతరం తల్లి త్వరగా కోలుకోవడమే కాక, నెలసరి రక్తస్రావం తక్కువగా ఉంటుంది. పాలిచ్చినంత కాలం ఇది సహజ గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. భవిష్యత్లో రొమ్ము, అండాశయ (ఓవరీ) క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.తల్లులు సమతుల్య పోషకాహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ పరిశుభ్రత పాటించాలి. తల్లిపాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు లేదా ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను సంప్రదించాలి. ప్రతీ బిడ్డకు ఆరోగ్యవంతమైన భవిష్యత్ను అందించేందుకు కుటుంబ సభ్యులు, సమాజం తల్లులకు సహకరించాలి. – డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్ఓ ● బలానికి, తెలివితేటలకు మూలం: సీసా పాలు తాగే పిల్లల కంటే తల్లిపాలు తాగే పిల్లలు శారీరకంగా బలంగా, తెలివిగా ఉంటారు. వ్యాధుల నుంచి రక్షణ: శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. పాలు తాగడం వల్ల బిడ్డ దవడలు బాగా బలపడతాయి. సులభ జీర్ణం: ఎలాంటి క్రిములు లేని అత్యంత ,సురక్షితమైన తేలికగా అరిగే పరిశుభ్రమైన ఆహారం తల్లిపాలే. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో నీరు, తేనె, గ్లూకోజ్, డబ్బా పాలు పొరపాటున కూడా ఇవ్వకూడదు. వగలు, రాత్రి కలిపి రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలివ్వాలి. 7 నుంచి 8 నెలలు తల్లిపాలతో పాటు రోజుకు 3 సార్లు పైఆహారం (పౌష్టికాహారం) ప్రారంభించాలి. 9 నుంచి 11 నెలలు తల్లిపాలతో పాటు రోజుకు 4 సార్లు పై ఆహారం అందించాలి. ఈ క్రమాన్ని రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించాలి. పాలు పట్టే సరైన పద్ధతి బిడ్డ తల, శరీరం అడ్డంగా ఉండేలా తల్లి ఒడిలో పూర్తి ఆసరా (సపోర్ట్) ఇస్తూ పట్టుకోవాలి. బిడ్డ తల స్తనం వైపు, ముక్కు చనుమొన వైపు ఉండేలా ఉంచాలి. బిడ్డ నోరు పూర్తిగా తెరవగానే చనుమొనతో పాటు దాని చుట్టూ ఉండే నల్లటి భాగం (క్రింది పెదవి సహా) నోట్లోకి వెళ్లేలా అందించాలి. రెండు వైపులా మార్చి పాలు పట్టాలి. ఒకవైపు పాలు పూర్తిగా తాగడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. -
ఓబీసీ మహా సభను విజయవంతం చేయండి
హన్మకొండ: బెంగళూరులో ఈనెల 7న జరగనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ల సాధనే లక్ష్యంగా బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ వేదికగా అఖిల భారత జాతీయ ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేల శోభారాణి, మాధం పద్మజాదేవి, సుశీల, తేళ్ల సుగుణ, తేళ్ల కిశోర్, అంబాల రవి పటేల్, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్గౌడ్, తంగళ్లపెల్లి రమేశ్, దాడి రమేశ్ యాదవ్, కోలా ప్రతాప్ గౌడ్, అమరావతి సారంగపాణి, శనిగరపు సుమన్, చాగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కిల్ చుట్టూ తిరుగుడేనా?
వరంగల్ అర్బన్: బల్దియా సేవలను నగర ప్రజలకు మరింత చేరువ కావాలని రెండు సర్కిళ్లను 6 సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి తొమ్మిదేళ్లు దాటింది. అయినప్పటికీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందితో నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. కానీ, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేరు గొప్ప.. ఊరు దిబ్బ నగర శివారులోని 42 గ్రామాలను 2013 మార్చి 19న కార్పొరేషన్లో విలీనం చేస్తూ.. అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో గ్రేటర్ పరిధి 110 చదరపు కిలోమీటర్లు నుంచి 407 కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా 9 లక్షలు కాగా.. విలీన గ్రామాలతో 12 లక్షలకు చేరింది. అప్పటి ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 12 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 2015 జనవరిలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. గ్రేటర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2017 ఫిబ్రవరి 2న అప్పటి బల్దియా పాలకవర్గం కొత్తగా నాలుగు సర్కిల్ కార్యాలయాలు కావాలని కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర పురపాలక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. 6 సర్కిళ్లకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ 267 జీఓ విడుదల చేశారు. దీంతో బల్దియాలో 6 సర్కిల్ కార్యాలయాలకు ప్రాంతాలు, భవనాలు గుర్తించి వదిలేశారు. రెండు సర్కిళ్లతోనే సరి.. బల్దియాలో సరిపడా అధికారులు, ఉద్యోగులు లేరనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా రెండు సర్కిల్ కార్యాలయాలతోనే కాలం వెళ్లదీన్నారు. ఫర్వాలేదు అన్నట్లుగా అధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు. నలుగురు డిప్యూటీ కమిషనర్లు ఉండగా, కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్లలో ఇద్దరు విధులు నిర్వరిస్తున్నారు. మరో ఇద్దరిలో ఒకరు సెక్రటరీగా, అడ్మిన్గా పనిచేస్తున్నారు. ఐదుగురు సూపరింటెండెంట్లు ఉండగా.. మరో మూడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, 30 మంది జూనియర్ అసిస్టెంట్లు, 70 మంది వార్డు ఆఫీసర్లు ఉన్నారు.6 సర్కిళ్లు కాకపోయినా మరో రెండు సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజలు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధి రంగశాయిపేట లేదా ఉర్సు బల్దియా వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్, అదేవిధంగా కాజీపేట సర్కిల్ పరిధిలో నక్కలగుట్ట లేదా నయీంనగర్ వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్ కార్యాలయం అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. ప్రస్తుతం బల్దియా ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో చాంబర్లు ఖాళీ చేశారు. మేయర్ భవనంలో కొన్ని బ్లాక్లు కేటాయించారు. అవి ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది పడుతూ విధులు నిర్వర్తించాల్సి వ స్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు ఆఫీసర్లకు కనీసం కుర్చీలు కూడా ఏ ర్పాటు చేయలేని దుస్థితి ఉంది. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయిస్తే మరో రెండు సర్కిల్ కార్యాలయాలు సిద్ధమవుతాయి. నగర ప్రజల ముంగిటకు పా లన వస్తుంది. దూపకుంటకు చెందిన దేవేందర్, శాంతమ్మ పనుల కోసం కాశిబుగ్గ సర్కిల్ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. అందుబాటులో కార్యాలయం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా నగరం, శివారు ప్రాంతాల్లోని ప్రజలు బల్దియా ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, పట్టింపులేని తనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముచ్చర్లకు చెందిన చిర్ర సుమన్ బల్దియాకు చెందిన ఏ అనుమతి కోసమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నాడు. సిటిజన్ చార్టర్ ప్రకారం పరిష్కారం కావడం లేదు. దీంతో కాజీపేట సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. రానూపోను 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కసారి వెళ్తే పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు వ్యయప్రయాసాలకు గురై కాజీపేటకు వెళ్తున్నాడు.కలగానే కార్యాలయాల ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు తప్పని ఇబ్బందులు సర్కిళ్లు విస్తరించక దూరమవుతున్న సేవలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు -
రుద్రేశ్వరస్వామికి అన్నపూజ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ చవితి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల మహాగణపతికి హరిద్రాకుంకుమ విలేపనాభిషేకం, గరికపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్కు చెందిన శివభక్తుడు వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ సౌజన్యంతో 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్ర పఠనంతో రుద్రేశ్వర మహాశివలింగాన్ని రుద్రగణపతిగా అలంకరించి మహాన్నపూజ చేశారు. అనంతరం మహాహారతి, మహానివేదన, నీరాజనమంత్రపుష్పం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ కుటుంబ సభ్యులతో దేవాలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
మరింత దిగువకు..
హన్మకొండ: ఎల్నినో ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. దీంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ జిల్లాలో 45 శాతం లోటు వర్షపాతం ఉంది. ఎల్కతుర్తి, ఆత్మకూరు మండలాల్లో భారీ లోటు వర్షపాతం నెలకొంది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోయాయి. వర్షకాలం ప్రారంభమైనా ప్రతి నెల భూగర్భ జలాలు అడగంటుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో పాటు చెరువులు, కుంటల్లో నీరు లేక భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీనికి తోడు వర్షం ఆశతో వరి నారు పోసుకున్న రైతులు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలతో పొలాలు దున్ని నాట్లు వేస్తున్నారు. వరి సాగుకు భూగర్భ జలాలు తోడుతుండడం కూడా భూగర్భ జలాలు పడిపోవడానికి ఒక కారణం. జిల్లాలో ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 410.2 మిల్లీమీటర్లు కాగా, 227.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. ఇంకా 45 శాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అంచనాలు తలకిందులు.. జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి ఈ వానా కాలంలో 2.38.830 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. 1,17,857 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటి వరకు 49 శాతం పంటల సాగు జరిగింది. ప్రధాన పంటలైన వరి ఈ వానాకాలంలో 1,48,500 ఎకరాల్లో సాగవుతుందని అంచానా వేయగా.. ఇప్పటి వరకు 37,944 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 84,400 ఎకరాలకుగాను 69,077 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 5,000 ఎకరాల్లో సాగువుతుందని అంచనా వేయగా, 6,026 ఎకరాల్లో సాగైంది. నూనె గింజల పంటలు 120 ఎకరాలు, పప్పు దినుసులు 810 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, 760 ఎకరాల్లో సాగైంది. భూగర్భ జలాలు జిల్లాలో సగటున జూన్లో 7.25 మీటర్ల వద్ద ఉండగా జూలై మాసాంతానికి 7.71 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా పీచరలో 16.3 మీటర్ల లోతులో వంగరలో 13.58 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు జిల్లా సగటు భూగర్భ జలమట్టం 7.71 మీటర్లు అత్యధికంగా వేలేరు మండలం పీచరలో 16.3 మీటర్ల లోతున నీరు.. అత్యల్పంగా ధర్మసాగర్లో 2.8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు 45 శాతం లోటు వర్షపాతం -
పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
కాళోజీ సెంటర్: పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ డిమాండ్ చేశారు. రంగశాయిపేటలో ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా నివేదిక తెప్పించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్లో ఉంచడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.వేయి కోట్లు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ టీచర్లకు మెమో 57 ప్రకారం ఓపీఎస్ వర్తింపజేయాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, జీఓ 25ను సవరించాలని, 10 వేల పీఎస్హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని, సెన్సస్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాలని, టెట్ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరస్వామి, మాజీ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ -
భద్రకాళిని దర్శించుకున్న సీపీ
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐఆర్ఎస్ అధికారి అపూర్వ సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశ్వీచనం అందజేశారు. క్యాంపస్ సెలక్షన్స్కు ‘కాన్క్లేవ్ –26’ దోహదం కాజీపేట అర్బన్: క్యాంపస్ సెలక్షన్స్లో నిట్ విద్యార్థులకు ఇండస్ట్రీ కాన్క్లేవ్–26 దోహదపడుతుందని నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్ తెలిపారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ సీసీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ కాన్క్లేవ్ కెరీర్ లాంచ్ సమ్మిట్–26 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ వివరాలతో కూడిన బ్రౌచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. నిట్ విద్యార్థులు పరిశ్రమల్లో రాణించేందుకు తొలిసారిగా ఇండస్ట్రీ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్లైన్లో సదస్సును వీక్షించారు. ప్లేస్మెంట్లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్, ఎక్సాన్ మొబైల్, మైక్రాన్, ట్రూవేటా పరిశ్రమల ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు. -
యువజనాభివృద్ధికి ‘మేరా యువ భారత్’
హన్మకొండ: యువజనాభివృద్ధికి మేరా యువ భారత్ దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా యువజన అధికార భూక్యా సంజీవ్ అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ వరంగల్ సంస్థ నేతృత్వంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ దేశ యువత కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ జాతీయ డిజిటల్ వేదికను ప్రారంభించిందన్నారు. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు వారికి వలంటీర్ అవకాశాలు, నాయకత్వ శిక్షణ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వేదిక దోహదపడుతుందని వివరించారు. వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం మాట్లాడుతూ యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ జిల్లా యువజన అధికారి భూక్యా సంజీవ్ -
‘సర్కిల్’ చుట్టూ తిరుగుడేనా?
● ముచ్చర్లకు చెందిన చిర్ర సుమన్ బల్దియాకు చెందిన ఏ అనుమతి కోసమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నాడు. సిటిజన్ చార్టర్ ప్రకారం పరిష్కారం కావడం లేదు. దీంతో కాజీపేట సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. రానూపోను 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కసారి వెళ్తే పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు వ్యయప్రయాసాలకు గురై కాజీపేటకు వెళ్తున్నాడు. ● దూపకుంటకు చెందిన దేవేందర్, శాంతమ్మ పనుల కోసం కాశిబుగ్గ సర్కిల్ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. అందుబాటులో కార్యాలయం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా నగరం, శివారు ప్రాంతాల్లోని ప్రజలు బల్దియా ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, పట్టింపులేని తనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ అర్బన్: బల్దియా సేవలను నగర ప్రజలకు మరింత చేరువ కావాలని రెండు సర్కిళ్లను 6 సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి తొమ్మిదేళ్లు దాటింది. అయినప్పటికీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందితో నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. కానీ, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేరు గొప్ప.. ఊరు దిబ్బ నగర శివారులోని 42 గ్రామాలను 2013 మార్చి 19న కార్పొరేషన్లో విలీనం చేస్తూ.. అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో గ్రేటర్ పరిధి 110 చదరపు కిలోమీటర్లు నుంచి 407 కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా 9 లక్షలు కాగా.. విలీన గ్రామాలతో 12 లక్షలకు చేరింది. అప్పటి ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 12 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 2015 జనవరిలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. గ్రేటర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2017 ఫిబ్రవరి 2న అప్పటి బల్దియా పాలకవర్గం కొత్తగా నాలుగు సర్కిల్ కార్యాలయాలు కావాలని కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర పురపాలక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. 6 సర్కిళ్లకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ 267 జీఓ విడుదల చేశారు. దీంతో బల్దియాలో 6 సర్కిల్ కార్యాలయాలకు ప్రాంతాలు, భవనాలు గుర్తించి వదిలేశారు. రెండు సర్కిళ్లతోనే సరి బల్దియాలో సరిపడా అధికారులు, ఉద్యోగులు లేరనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా రెండు సర్కిల్ కార్యాలయాలతోనే కాలం వెళ్లదీన్నారు. ఫర్వాలేదు అన్నట్లుగా అధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు. నలుగురు డిప్యూటీ కమిషనర్లు ఉండగా, కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్లలో ఇద్దరు విధులు నిర్వరిస్తున్నారు. మరో ఇద్దరిలో ఒకరు సెక్రటరీగా, అడ్మిన్గా పనిచేస్తున్నారు. ఐదుగురు సూపరింటెండెంట్లు ఉండగా.. మరో మూడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, 30 మంది జూనియర్ అసిస్టెంట్లు, 70 మంది వార్డు ఆఫీసర్లు ఉన్నారు. మరో రెండు సర్కిళ్లు ఏర్పాటు చేయాలి 6 సర్కిళ్లు కాకపోయినా మరో రెండు సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజలు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధి రంగశాయిపేట లేదా ఉర్సు బల్దియా వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్, అదేవిధంగా కాజీపేట సర్కిల్ పరిధిలో నక్కలగుట్ట లేదా నయీంనగర్ వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్ కార్యాలయం అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. ప్రస్తుతం బల్దియా ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో చాంబర్లు ఖాళీ చేశారు. మేయర్ భవనంలో కొన్ని బ్లాక్లు కేటాయించారు. అవి ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది పడుతూ విధులు నిర్వర్తించాల్సి వస్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు ఆఫీసర్లకు కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఉంది. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయిస్తే మరో రెండు సర్కిల్ కార్యాలయాలు సిద్ధమవుతాయి. నగర ప్రజల ముంగిటకు పాలన వస్తుంది. ఈ నేపథ్యంలో బల్దియా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. కలగానే కార్యాలయాల ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు తప్పని ఇబ్బందులు సర్కిళ్లు విస్తరించక దూరమవుతున్న సేవలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు -
యువజనాభివృద్ధికి ‘మేరా యువ భారత్’
హన్మకొండ: యువజనాభివృద్ధికి మేరా యువ భారత్ దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా యువజన అధికార భూక్య సంజీవ్ అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ వరంగల్ సంస్థ నేతృత్వంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ దేశ యువత కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ జాతీయ డిజిటల్ వేదికను ప్రారంభించిందన్నారు. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు వారికి వలంటీర్ అవకాశాలు, నాయకత్వ శిక్షణ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వేదిక దోహదపడుతుందని వివరించారు. వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం మాట్లాడుతూ యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనంతరం మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. -
‘ఆటా’ మహాసభలకు ఎమ్మెల్యే దొంతి హాజరు
నర్సంపేట: తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రవాస తెలుగు సమాజంతో మమేకమయ్యేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐసీసీ–యూఎస్ఏ) టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్, అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆటా సదస్సులో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. -
ఏడాదిగా ఏపీఓ పోస్టు ఖాళీ
కాళోజీ సెంటర్: జిల్లా విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ) పోస్టు ఏడాదిన్నర కాలంగా ఖాళీగా ఉండడంతో ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. 2025వ సంవత్సరంలో విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను అక్రమ డిప్యూటేషన్లపై డీఈఓ కార్యాలయంలో వివిధ పోస్టుల్లో భర్తీ చేశారని కలెక్టర్ భావించారు. విద్యాశాఖ (అప్పటి డీఈఓ) వ్యవహార శైలిపై సమీక్షించి డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తిరిగి వెనక్కి పంపాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అందులో భాగంగా దీర్ఘకాలంగా ఏపీఓ స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుని కూడా 2025, ఫిబ్రవరిలో వెనక్కి పంపారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆ స్థానం భర్తీ చేయకుండా ఖాళీగానే ఉంటోంది. దాంతో సంబంధిత సెక్షన్ అధికారి చేయాల్సిన పని పెండింగ్ పడి వ్యవస్థ కుంటుపడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేయాలి. కానీ, తొమ్మిది నెలల క్రితం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే ఒక స్కూల్ అసిస్టెంట్ను కలెక్టర్కు డీఈఓ ప్రతిపాదించి అనుమతి తీసుకున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతో ఇప్పటికి ఏపీఓ పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీఓ పోస్టు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. భర్తీ కాకపోవడంతో పనులు పెండింగ్ -
నేడు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి: కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని ఆమె సూచించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్హాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంద అనిల్దుగ్గొండి: కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మంద అనిల్ నియమితులయ్యారు. ఈ మేరకు అనిల్కు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆదివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ కార్యకర్తలకు తోడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఖిలా వరంగల్: ఓబీసీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా విశ్వనాథ కాలనీకి చెందిన కర్నె రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓబీసీ బలోపేతానికి కృషి చేస్తానని రవీందర్ పేర్కొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా రమేష్ యాదవ్నల్లబెల్లి: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా మండలంలోని నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన వల్లె రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతి కుమార్ ఆదివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతికుమార్, నియోజకవర్గ నాయకుడు కంభంపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో కృషి చేస్తానని రమేష్ పేర్కొన్నారు. సంగెం: ఎల్నిలో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ఎద్దడితో అల్లాడుతున్న అన్నదాతకు దేవాదుల ఎత్తిపోతల నీరు ఉపశమనం కలిగించింది. స్టేషన్ ఘన్పూర్ మండలం నుంచి దేవాదుల ఎత్తిపోతల నీరు డీ–8 ద్వారా సంగెం మండలంలోని గవిచర్లకు గోదావరి జలాలు ఆదివారం చేరాయి. సర్పంచ్ బాషిపాక సదయ్య శ్రమించి ఐనవోలు మండలం సింగారం నుంచి గ్రామానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు. కాల్వ ద్వారా వచ్చిన నీటిని రాయకుంటలోకి అనంతరం ఊర చెరువు నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాల్వలోని గోదావరి నీటిని సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్, నాయకులు గోలి రవి, గుళ్లపల్లి తిరుపతి, రావుల చిన్న రామకృష్ణ, మహబుబ్పాషా తదితరులు పరిశీలించారు. -
ఓబీసీ మహాసభను విజయవంతం చేయండి
హన్మకొండ: బెంగళూరులో ఈనెల 7న జరగనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో జాతీయ ఓబీసీ మహాసభ వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ల సాధనే లక్ష్యంగా బెంగుళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ వేదికగా అఖిల భారత జాతీయ ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేల శోభారాణి, మాధం పద్మజాదేవి, సుశీల, తేళ్ల సుగుణ, తేళ్ల కిశోర్, అంబాల రవి పటేల్, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్గౌడ్, తంగళ్లపెల్లి రమేశ్, దాడి రమేశ్ యాదవ్, కోలా ప్రతాప్ గౌడ్, అమరావతి సారంగపాణి, శనిగరపు సుమన్, చాగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు లేక.. నాట్లు పడక
ఎల్నినో ప్రభావంతో అన్నదాతల్లో ఆందోళనఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీతండా గ్రామానికి చెందిన నునావత్ రమేష్. ఇతనికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరంన్నర పొలం, మరో ఎకరం గడ్డ భూమి ఉంది. వర్షాలు కురిసే పరిస్థితి లేదని గడ్డ భూమిలో జొన్నపంట సాగుచేశాడు. కొత్తకుంట చెరువు కింద ఎకరంన్నర పొలం ఉంది. చెరువులోకి ఇంకా నీరు రాలేదు. నారు 45 రోజులు దాటింది. చెరువులోకి చుక్కనీరు రాకపోవడం వల్ల నాటు వేయలేని పరిస్థితి నెలకొంది. మరో వారం రోజుల వరకు చెరువులోకి నీరు రాకుంటే ఇక నాటు వేయడం కష్టమే. ఇలా ఆ చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు లేక బీడును తలపిస్తోంది. ఇది ఒక్క రమేష్ పరిస్థితి కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరిదీ ఇదే పరిస్థితి.● ముదురుతున్న నారు.. మొదలుకాని సాగు పనులు● జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో బీళ్లుగా మారిన భూములు ● ఇంకా చెరువుల్లోకి చేరని వాననీరుదుగ్గొండి: వానాకాలం సీజన్ ఆరంభం అయినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎస్సారెస్పీ నీరు రాకపోవడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కాలం కాకపోయినా కాల్వ నీరు రాకపోతుందా అనే ఆలోచనతో అన్నదాతలు రోహిణి కార్తెలోనే నార్లు పోశారు. అయితే నేటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం లేక నారుపోసి 40 రోజులు దాటుతున్నా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో.. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 2,30,377 ఎకరాల సాగు భూమి ఉండగా, అందులో లక్ష ఎకరాల్లో పత్తి, మిరప, పసుపు, ఇతర ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు మొదట అంచనా వేశారు. అయితే, ఎల్నినో ప్రభావంతో సాగు అంచనాను లక్ష ఎకరాలకు కుదించారు. వర్షాలు లేని కారణంగా రైతులు 27 వేల నుంచి 30 వేల ఎకరాలకు మాత్రమే నార్లు పోశారు. వాటిలో బావుల కింద ఇప్పటికి అక్కడక్కడ 2వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. చెరువుల కింద నేటికీ నార్లు పోయలేదు. ఇప్పుడు పోసినా ఫలితం లేదు. నార్లు పోసిన రైతులు నీరు లేకపోవడంతో నష్టపోతున్నారు. దీంతో క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో రైతులు ఉండడం కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఆరుతడి పంటలు పండించాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నా కొన్ని పొలాల్లో ఆరుతడి పంటలు పండే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలు వేసి నష్టపోవడం కన్నా పంటలు వేయకుండా ఉండడమే మేలని పలువురు రైతులు భావిస్తున్నారు. దీంతో సాగు భూములు బీళ్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూసి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి మిడ్మానేరు నింపి లోయర్ మానేరు ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీరు విడుదల చేయాలని కర్షకులు కోరుతున్నారు. -
రుద్రేశ్వరస్వామికి అన్నపూజ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ చవితి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల మహాగణపతికి హరిద్రాకుంకుమ విలేపనాభిషేకం, గరికపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్కు చెందిన శివభక్తుడు వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ సౌజన్యంతో 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్ర పఠనంతో రుద్రేశ్వర మహాశివలింగాన్ని రుద్రగణపతిగా అలంకరించి మహాన్నపూజ చేశారు. అనంతరం మహాహారతి, మహానివేదన, నీరాజనమంత్రపుష్పం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ కుటుంబ సభ్యులతో దేవాలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026‘సాక్షి’ సర్వే.. యువత మనోగతంప్రస్తుత రోజుల్లో స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? స్కూల్/కాలేజీ రోజుల్లోని ప్రాణస్నేహితులతో ఇప్పటికీ అదే సాన్నిహిత్యం ఉందా? మీ బెస్ట్ ఫ్రెండ్ను వారంలో ఎన్నిసార్లు నేరుగా కలుస్తారు? ఒకరికొకరి ఆలోచనలు కలిస్తేనే స్నేహబంధం పటిష్టంగా ఉంటుందని యువతీ యువకులు అభిప్రాయపడ్డారు. బెస్ట్ ఫ్రెండ్ను నెలకు ఒకసారైనా కలుస్తామని, ఫోన్లో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో యువతీ యువకులను సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏర్పడిన స్నేహం ఎన్నిరోజులైనా చెక్కు చెదరని అధికమంది అభిప్రాయపడ్డారు. – సాక్షి నెట్వర్క్ A) ఫోన్ కాల్స్ B) వాట్సాప్ చాటింగ్ C) వీడియో కాల్స్A) రోజువారీ B) నెలకు ఒకసారి C) అసలు కలవంA) అవును, అలాగే ఉంది B) పరిచయం ఉంది కానీ, మాట్లాడడం తగ్గింది C) అసలు టచ్లో లేరుA) ఆలోచనలు కలవడం B) ఒకే ఆఫీస్ లేదా వృత్తి C) ఆర్థిక లేదా సామాజిక హోదాసర్వే శాంపిల్స్ : 300 (ఆరు జిల్లా కేంద్రాలనుంచి 50 మంది చొప్పున) సర్వే చేసిన ప్రాంతాలు : హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి స్నేహితులతో మాట్లాడడానికి మీ ప్రాధాన్యం ఏంటి? -
‘సర్’.. మరోసారి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో గడువు పొడిగింపు అధికారులు, సిబ్బందికి ఊరటనిచ్చింది. ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియకు ఈ నెల10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ విడుదల చేసిన తాజా స్టేటస్ రిపోర్టు ప్రకారం.. ఉమ్మడి వరంగల్లో 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. వీరందరికీ ఎస్ఐఆర్ ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 26,68,980 ఫారాలు డిజిటైజ్ చేశారు. దీంతో డిజిటైజేషన్ 87.41 శాతానికి చేరింది. జనగామ టాప్.. హనుమకొండ లాస్ట్ ఉమ్మడి వరంగల్లో ఎస్ఐఆర్ ఫారాల డిజిటైజేషన్లో జనగామ జిల్లా 91.49 శాతంతో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో 7,67,484 మంది ఓటర్లకు ఫా రాలు పంపిణీ చేయగా.. 7,02,192 ఫారాలు డిజి టైజ్ అయ్యాయి. మహబూబాబాద్ 90.09 శాతంతో రెండో స్థానంలో ఉంది. ములుగు 88.36, వరంగల్ 87.01, భూపాలపల్లి 86.81 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. హనుమకొండ 79.23 శాతంతో చివరి స్థానంలో కొనసాగుతోంది. జిల్లాల వారీగా పరిస్థితి... ● హనుమకొండ జిల్లాలో 5,09,014 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 4,03,271 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. డిజిటైజేషన్ 79.23 శాతం. ● వరంగల్ జిల్లాలో 7,76,953 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 6,76,026 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. డిజిటైజేషన్ 87.01 శాతం. ● జనగామ జిల్లాలో 7,67,484 మంది ఓటర్లకు ఫారాలు అందజేశారు. 7,02,192 ఫారాలను డిజిటైజ్ చేశారు. డిజిటైజేషన్ 91.49 శాతం. ● మహబూబాబాద్ జిల్లాలో 4,84,935 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 4,36,864 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. డిజిటైజేషన్ 90.09 శాతం. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,77,882 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు.. 2,41,236 ఫారాలు డిజిటైజ్ చేశారు. డిజిటైజేషన్ 86.81 శాతం. ● ములుగు జిల్లాలో 2,36,970 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 2,09,391 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. డిజిటైజేషన్ 88.36శాతం. 87.41 శాతం డిజిటైజేషన్.. జూలై 31 సాయంత్రం నాటికి ఉమ్మడి వరంగల్లో డిజిటైజేషన్ 87.35 శాతంగా ఉండగా.. శనివారం సాయంత్రానికి 87.41 శాతానికి చేరింది. అంటే ఒక్కరోజులో స్వల్పంగా పురోగతి నమోదైంది. గడువు ఈ నెల10 వరకు ఉండడంతో మిగిలిన ఫారాల డిజిటైజేషన్ను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేయాల్సి ఉంది. వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ భూపాలపల్లి ములుగుమొత్తం ఓటర్లు పంపిణీ ఫారాలు డిజిటైజేషన్ ఫారాలు ఇంకా పెండింగ్లో 3.84 లక్షల ఫారాలు...30,53,238 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు 26.69 లక్షల మేర ఫారాల డిజిటైజేషన్ పూర్తయ్యింది. దీంతో మరో 3.84 లక్షలకుపైగా ఫారాలను డిజిటైజ్ చేయాల్సి ఉంది. హనుమకొండలోనే అత్యధికంగా 1,05,743 ఫారాలు డిజిటైజేషన్ కావాల్సి ఉండగా.. వరంగల్లో 1,00,927 ఫారాలు పెండింగ్లో ఉన్నాయి. జనగామలో 65,292, మహబూబాబాద్లో 48,071, జయశంకర్ భూపాలపల్లిలో 36,646, ములుగులో 27,579 ఫారాలు డిజిటైజేషన్ చేయాల్సి ఉంది. గడువు ఈ నెల 10వ తేదీకి పెంచడంతో ఊరట 30.53 లక్షల మంది ఓటర్లకు ఫారాల పంపిణీ 26.69 లక్షల ఫారాల డిజిటైజేషన్.. జనగామ 91.49, హనుమకొండ 79.23 శాతం -
వెట్టిచాకిరీపై అవగాహన అవసరం
హన్మకొండ అర్బన్: వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన పెరగాలని హనుమకొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సుబేదారిలోని అసుంత భవన్లో పోలీస్, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థంతో ఇతరులను దోపిడీకి గురిచేయడం, వెట్టిచాకిరిలోకి నెట్టడం వంటి ఘటనలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం కల్పించడంతో పాటు సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కృషి చేస్తుందని కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామలింగయ్య తెలిపారు. కాజీపేట రూరల్: ప్రయాణికుల ఫుడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైళ్లు, స్టేషన్ ప్లాట్ఫాంలపై యాంటీ హాకింగ్ డ్రైవ్ నిర్వహించినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. జూలై 28 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఈ డ్రైవ్లో రైల్వేశాఖ అనుమతి, ఐడెంటిటీ కార్డు లేకుండా తినుబండారా లు విక్రయిస్తున్న 33 మంది హాకర్స్, వెండర్స్ను అదుపులోకి తీసుకొని రైల్వే ప్రొటెక్షన్ ఫో ర్స్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ అనుమతించిన హాకర్స్, వెండర్స్ వారు మాత్రమే తినుబండారాలు వి క్రయించాలని, నాణ్యతతో కూడిన ఆహార ప దార్థాలు విక్రయించేలా ఆదేశించినట్లు తెలి పారు. డ్రైవ్లో కమర్షియల్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు వారు వివరించారు. మామునూరు: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 7వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ ఎస్.ప్రవీణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హన్మకొండ అర్బన్: సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలులో హెల్త్ సూపర్వైజర్ల పాత్ర కీలకమని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహిస్తూ డెంగీ, మలేరియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణులను తొలి మూడు నెలల్లోనే నమోదు చేసి హైరిస్క్ కేసులను గుర్తించాలని, హెచ్పీవీ వ్యాక్సిన్ అర్హులైన బాలికలకు అందించి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. 2025లో జిల్లాలో 191 డెంగీ కేసులు నమోదుకాగా, 2026లో ఇప్పటివరకు 21 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
స్నేహం పేరిట మోసం
● కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు నమోదు ● సైబర్ మోసం రూ.6.85 కోట్లు.. రికవరీ రూ.1.60 కోట్లు ● వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు ● ‘సాక్షి’తో సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ వరంగల్ క్రైం: ఫ్రెండ్ అంటూ పరిచయమవుతారు. తియ్యగా మాట్లాడి స్నేహం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడతారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ ‘సాక్షి’తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసుల సంఖ్య పెరుగుతోంది.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2,400 సైబర్ క్రైం కేసులు నమోదయ్యయి. వివిధ రకాల కేసుల్లో బాధితులు రూ.6.85 కోట్లు నష్టపోయారు. గోల్డెన్ అవర్లో టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్చేసి సమాచారం అందించగా.. ఇప్పటి వరకు బ్యాంకుల్లో హోల్డ్ చేసిన డబ్బులు రూ.1.68 కోట్లు రికవరీ చేశాం. మోసాలు పలు రకాలు.. కస్టమర్ కేర్, ఆన్లైన్ షాపింగ్, పార్ట్టైం జాబ్, స్టాక్ మార్కెట్, గేమింగ్ మోసం, డేటింగ్, స్టాకింగ్, ఏపీకే ఫైల్స్ ఓపెన్, క్రెడిట్కార్డు లిమిట్ పెంపు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్, కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్టు, లోన్యాప్, మ్యాట్రిమనీ ఇలాంటి రకరకాల పేర్లతో తియ్యగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నారు. స్నేహం పేరుతో మోసాలు.. మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయం పెంచుకొని ఆ తర్వాత పెళ్లి పేరుతో నేరగాడు ఓ యువతికి దగ్గరయ్యాడు. ఒక రోజు యువతికి ఫోన్ చేసి నా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. నీ పేరుతో మూడు అకౌంట్లు ఓపెన్ చేసి వాటి వివరాలు పంపాలని కోరగా.. నమ్మిన సదరు యువతి మూడు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ పాస్ బుక్లు, ఏటీఎం కార్డులు అందజేసింది. ఆ తర్వాత అతడు ఆ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. అనంతరం సైబర్ మోసాల కింద యువతిపై కేసులు నమోదయ్యయి. అప్రమత్తంగా ఉండకపోతే గోవిందా... ప్రస్తుతం సైబర్ మోసాలపై అవగాహన లేకపోతే నష్టపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. ఫోన్నంబర్లు, ఓటీపీలు, ఏటీఎం, డెబిట్ కార్డుల వివరాలు, ఆధార్కార్డులు, అకౌంట్ నంబర్లు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఏదైనా కారణం చేత మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. -
పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: రైతులు పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయాన్ని పొందాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్లో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నిర్వహించిన జిల్లాస్థాయి వాటాదారుల సంప్రదింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు భువన, తిరుపతిరెడ్డి, జాయింట్ డైరెక్టర్ అనసూయ, అసిస్టెంట్ డైరెక్టర్ (సెరికల్చర్) తిరుపతిరెడ్డి, సెరికల్చర్ అధికారి మల్లయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్రావు, అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ కాళోజీ సెంటర్: ఐసీడీఎస్ వరంగల్ ప్రాజెక్టు ఉర్సు సెక్టార్ 42 డివిజన్ పరిధిలోని మేరవాడ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ పరిసరాలు, ప్రీస్కూల్ కార్యక్రమాలు, బోధన విధానాన్ని గమనించి సలహాలు, సూచనలు చేశారు. అనంతరం బాలామృతం పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి, సీడీపీఓ విద్య, సూపర్వైజర్ బత్తిని రమాదేవి, అంగన్వాడీ టీచర్ వినీత తదితరులు ఉన్నారు. శిశువుకు తల్లిపాలు శ్రేష్టమైనవి పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు) జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. -
గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయాలి
ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో 2025–26 ఖరీఫ్, రబీ సీజన్ల సీఎంఆర్ డెలివరీల పురోగతిని శనివారం సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్రమం తప్పకుండా రైస్మిల్లులను మానిటరింగ్ చేయాలని, మిల్లింగ్ పురోగతి, సీఎంఆర్ డెలివరీలపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని సూచించారు. సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లు వెంటనే డెలివరీలు పూర్తి చేయాలని, రబీ సీజన్కు సంబంధించి మిల్లింగ్ ప్రారంభించని వారు తక్షణమే కార్యకలాపాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే జమ చేయాలని, డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సర్ గడువు పొడిగింపు.. భారత ఎన్నికల సంఘం సర్ దరఖాస్తుల గడువును ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 వరకు పొడిగించిందని ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటైజేషన్ వేగంగా జరుగుతోందని, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రీ–వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. గడువులోగా సంబంధిత బీఎల్ఓలకు సర్ ఫారాలు అందజేయాలని సూచించారు. -
సాయం చేసి.. ధైర్యం నూరిపోసి
కులమతాలకు అతీతం.. బాధకు దివ్యౌషధం. కళ్లు వర్షించలేని ఆనందభాష్పం.. కవులు వర్ణించలేని పదబంధం. నిత్య సుగంధాల పరిమళం.. అంతులేని సంపదల సాగరం.. చెలిమి, మైత్రి, ఫ్రెండ్, దోస్త్.. పేరేదైనా పిలిస్తే పలికేదే నేస్తం. నేనున్నాననే ధైర్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు, అంతకు మించి ఉంటారు. వారే ఆనందాలకు వారధులవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాంటి వారెందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారిలో కొందరి గురించి ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. నల్లబెల్లి: నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2005–06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏ చిన్న ఆపదొచ్చినా మేమున్నామంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. స్నేహితుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వివాహాలు చేసినా, ఏదైనా శుభకార్యాలు చేసినా, కుటుంబంలో ఏదైనా ఘటన జరిగినా అండగా నిలుస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో ఆర్థిక చేయూతనందిస్తున్నారు. వీరి సేవల్లో అప్పటి గురువులు సైతం భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది స్నేహితులకు రూ.4,50,000 ఆర్థిక సాయం అందించారు. -
పట్టు పరిశ్రమతో స్థిరమైన ఆదాయం
న్యూశాయంపేట: రైతులు పట్టు పరిశ్రమను లాభదాయకమైన అనుబంధ వ్యవసాయ కార్యకలాపంగా చేపట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్లో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ సమన్వయంతో నిర్వహించిన జిల్లా స్థాయి వాటాదారుల సంప్రదింపు సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయిల్పామ్ తోటల్లో మల్బరీని అంతర పంటగా సాగు చేయాలన్నారు. పట్టు ఉత్పత్తులకు విలువ జోడింపు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలను మరింతగా వినియోగించుకోవడానికి టెక్స్టైల్ పార్క్ సౌకర్యాలు, జిల్లాలోని ఎగుమతి హబ్ను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు భువన, తిరుపతిరెడ్డి, జాయింట్ డైరెక్టర్ అనసూయ, అసిస్టెంట్ డైరెక్టర్ (సెరికల్చర్) తిరుపతి రెడ్డి, సెరికల్చర్ అధికారి మల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్రావు, అధికారులు పాల్గొన్నారు. శిశువుకు తల్లిపాలు శ్రేష్టమైనవి కాళోజీ సెంటర్: తల్లిపాలు ప్రతీ శిశువుకు శ్రేష్టమైనవని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లా మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు) జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ త ల్లిపాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూఓ రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయ బృందం సభ్యులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ కాళోజీ సెంటర్/ఖిలావరంగల్: ఐసీడీఎస్ వరంగల్ ప్రాజెక్టు ఉర్సు సెక్టార్ 42 డివి జన్ పరిధిలోని మేరవాడ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ ప రిసరాలు, ప్రీస్కూల్ కార్యక్రమాలు, బోధన విధానాన్ని గమనించి సలహాలు, సూచనలు చేశారు. అ నంతరం బాలామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ విద్య, సూపర్వైజర్ బత్తిని రమాదేవి, వినిత తదితరులు ఉన్నారు.కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
స్నేహం పేరిట మోసం
● కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు నమోదు ● సైబర్ మోసం రూ.6.85 కోట్లు.. రికవరీ రూ.1.60 కోట్లు ● వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు ● ‘సాక్షి’తో సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ వరంగల్ క్రైం: ఫ్రెండ్ అంటూ పరిచయమవుతారు. తియ్యగా మాట్లాడి స్నేహం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడతారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ ‘సాక్షి’తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసుల సంఖ్య పెరుగుతోంది.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2,400 సైబర్ క్రైం కేసులు నమోదయ్యయి. వివిధ రకాల కేసుల్లో బాధితులు రూ.6.85 కోట్లు నష్టపోయారు. గోల్డెన్ అవర్లో టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్చేసి సమాచారం అందించగా.. ఇప్పటి వరకు బ్యాంకుల్లో హోల్డ్ చేసిన డబ్బులు రూ.1.68 కోట్లు రికవరీ చేశాం. మోసాలు పలు రకాలు.. కస్టమర్ కేర్, ఆన్లైన్ షాపింగ్, పార్ట్టైం జాబ్, స్టాక్ మార్కెట్, గేమింగ్ మోసం, డేటింగ్, స్టాకింగ్, ఏపీకే ఫైల్స్ ఓపెన్, క్రెడిట్కార్డు లిమిట్ పెంపు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్, కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్టు, లోన్యాప్, మ్యాట్రిమనీ ఇలాంటి రకరకాల పేర్లతో తియ్యగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నారు. స్నేహం పేరుతో మోసాలు.. మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయం పెంచుకొని ఆ తర్వాత పెళ్లి పేరుతో నేరగాడు ఓ యువతికి దగ్గరయ్యాడు. ఒక రోజు యువతికి ఫోన్ చేసి నా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. నీ పేరుతో మూడు అకౌంట్లు ఓపెన్ చేసి వాటి వివరాలు పంపాలని కోరగా.. నమ్మిన సదరు యువతి మూడు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ పాస్ బుక్లు, ఏటీఎం కార్డులు అందజేసింది. ఆ తర్వాత అతడు ఆ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. అనంతరం సైబర్ మోసాల కింద యువతిపై కేసులు నమోదయ్యయి. అప్రమత్తంగా ఉండకపోతే గోవిందా... ప్రస్తుతం సైబర్ మోసాలపై అవగాహన లేకపోతే నష్టపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. ఫోన్నంబర్లు, ఓటీపీలు, ఏటీఎం, డెబిట్ కార్డుల వివరాలు, ఆధార్కార్డులు, అకౌంట్ నంబర్లు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఏదైనా కారణం చేత మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. -
కేసులు త్వరగా పరిష్కరించాలి
సంగెం: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సంగెం పోలీస్స్టేషన్ను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటా రు. స్టేషన్ పరిసరాలను, సిబ్బంది కిట్లను, పోలీస్స్టేషన్లోని రికార్డులను స్టోర్ రూంలను పరిశీలించారు. అనంతరం పోలీస్సిబ్బందితో సమావేశమై శాఖ పరమైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల స్వభావం, పెండింగ్ కేసులు, దర్యాప్తులో పురోగతి, రౌడీషీటర్లు వారి కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్సై వంశీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మకం, భద్రత, భరోసా కలిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. డయల్ 100పై స్పందించి వేగంగా ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఈ తనిఖీల్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం, పర్వతగిరి, ఐనవోలు ఎస్సైలు వంశీకృష్ణ, ప్రవీణ్, అశోక్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సంగెం పోలీస్స్టేషన్ సందర్శన -
సాయం చేసి.. ధైర్యం నూరిపోసి
కులమతాలకు అతీతం.. బాధకు దివ్యౌషధం. కళ్లు వర్షించలేని ఆనందభాష్పం.. కవులు వర్ణించలేని పదబంధం. నిత్య సుగంధాల పరిమళం.. అంతులేని సంపదల సాగరం.. చెలిమి, మైత్రి, ఫ్రెండ్, దోస్త్.. పేరేదైనా పిలిస్తే పలికేదే నేస్తం. నేనున్నాననే ధైర్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు, అంతకు మించి ఉంటారు. వారే ఆనందాలకు వారధులవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాంటి వారెందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారిలో కొందరి గురించి ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. నల్లబెల్లి: నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2005–06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏ చిన్న ఆపదొచ్చినా మేమున్నామంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. స్నేహితుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వివాహాలు చేసినా, ఏదైనా శుభకార్యాలు చేసినా, కుటుంబంలో ఏదైనా ఘటన జరిగినా అండగా నిలుస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో ఆర్థిక చేయూతనందిస్తున్నారు. వీరి సేవల్లో అప్పటి గురువులు సైతం భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది స్నేహితులకు రూ.4,50,000 ఆర్థిక సాయం అందించారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’‘సాక్షి’ సర్వే.. యువత మనోగతంకేయూలో విద్యార్థుల ధర్నా కేయూలోని కామన్ మెస్ విద్యార్థులు తమకు మెస్బిల్లులు అధికంగా వచ్చాయని నిరసిస్తూ శనివారం క్యాంపస్లోని పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. ఆర్టీసీలో ఫైళ్లు మాయం టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఫైళ్లు మాయమవుతున్నా..పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. స్కూల్/కాలేజీ రోజుల్లోని ప్రాణస్నేహితులతో ఇప్పటికీ అదే సాన్నిహిత్యం ఉందా? మీ బెస్ట్ ఫ్రెండ్ను వారంలో ఎన్నిసార్లు నేరుగా కలుస్తారు? ప్రస్తుత రోజుల్లో స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకరికొకరి ఆలోచనలు కలిస్తేనే స్నేహబంధం పటిష్టంగా ఉంటుందని యువతీ యువకులు అభిప్రాయపడ్డారు. బెస్ట్ ఫ్రెండ్ను నెలకు ఒకసారైనా కలుస్తామని, ఫోన్లో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో యువతీ యువకులను సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏర్పడిన స్నేహం ఎన్నిరోజులైనా చెక్కు చెదరని అధికమంది అభిప్రాయపడ్డారు. – సాక్షి నెట్వర్క్ A) రోజువారీ B) నెలకు ఒకసారి C) అసలు కలవంA) ఫోన్ కాల్స్ B) వాట్సాప్ చాటింగ్ C) వీడియో కాల్స్A) అవును, అలాగే ఉంది B) పరిచయం ఉంది కానీ, మాట్లాడడం తగ్గింది C) అసలు టచ్లో లేరుA) ఆలోచనలు కలవడం B) ఒకే ఆఫీస్ లేదా వృత్తి C) ఆర్థిక లేదా సామాజిక హోదాసర్వే శాంపిల్స్ : 300 (ఆరు జిల్లా కేంద్రాలనుంచి 50 మంది చొప్పున) సర్వే చేసిన ప్రాంతాలు : హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి స్నేహితులతో మాట్లాడడానికి మీ ప్రాధాన్యం ఏంటి? -
గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన
గీసుకొండ: మండలంలోని ఊకల్ సొసైటీ భూమిలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను నిర్మించడానికి ప్రతిపాదించామని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ వి.దీపిక అన్నారు. శనివారం ఊకల్ సొసైటీ భవనం ఎదరుగా ఉన్న సొసైటీ భూమిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రాంతీయంగా ధాన్యం నిల్వ సామర్ాధ్యన్ని పెంచేందుకు గోదాం నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించామన్నారు. స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి, మద్దతు ధర పొందటానికి గోదాం ఉపయోగపడుతుందన్నారు. స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు స్థల పరిశీలన చేయగా జిల్లా సహకార అధికారి నీరజ వారికి సొసైటీకి సంబంధించిన భూమి వివరాలు, రవాణా వసతుల గురించి వివరించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ శోభన్బాబు, ఏఈ శంకర్, ఎఫ్సీఐ మేనేజర్ జేడీ ప్రసన్నకుమార్, క్యూసీ మేనేజర్ శివకుమార్, అకౌంట్స్ మేనేజర్ భాస్కరరావు, జేఈ ఎన్.గౌతం, ఊకల్ సొసైటీ చైర్మన్ బొమ్మల రమేశ్, మేనేజర్ బి.శివ, సీఈఓ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం
గీసుకొండ: రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ప్రతీ బూత్ కమిటీని పటిష్టం చేసుకుని ఎన్నికల కోసం సిద్ధం కావాలన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసి న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, తప్పులను సవరించడానికి సర్ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి, రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ వన్నాల వెంకటరమణ, రత్నం సతీష్, గురుమూర్తి శివకుమార్లు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, కన్నయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు కాళోజీ సెంటర్: తెలంగాణ రాష్ట్ర ఇటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత అడ్మిషన్ల గడువు జూలై 31వ తేదీతో ముగిసినప్పటికీ పలు కళాశాలల విద్యార్థుల అభ్యర్థన మేరకు అడ్మిషన్ల గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సర్వేను అడ్డుకున్న రైతులువర్ధన్నపేట: మండలంలోని దమ్మన్నపేట గ్రా మంలో శనివారం అధికారులు దేవాదుల లింక్ కెనాల్ భూ సర్వేను చేపట్టగా రైతులు తమకు తీ వ్ర నష్టం వాటిల్లుతుందని అడ్డుకున్నారు. దేవా దుల లింక్ కెనాల్ కాల్వను ప్రభుత్వ పాఠశాల వెనుక వైపు నుంచి తమ వ్యవసాయ భూముల నుంచి దమ్మన్నపేట చెరువు, కోనారెడ్డి చెరువులోకి వదలడంతో తమ పంట భూములు జలమయమవుతాయని రైతులు వాపోయారు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ సుమ, తహసీల్దార్ విజయసాగర్, దేవాదుల ఎస్ఈ సర్వే వద్దకు వెళ్లి రైతులకు సముదాయించే ప్రయత్నం చేయగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు సర్వే నిలిపేసి వెనుదిరిగి వెళ్లి పోయారు. అనంతరం పలువురు రైతులు మా ట్లాడుతూ ఈ కాల్వ వెళ్లే పంట భూములు కేవలం సన్న చిన్నకారు రైతులవి మాత్రమే ఉన్నారన్నారు. కాల్వ నిర్మాణంతో ఎవరికీ ప్రయోజనం లేకపోగా మరింత నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణం చేయనివ్వమన్నారు. ఎమ్మెల్యే నాగరాజు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. అగ్నిమాపక సేవలు అందుబాటులోకి తేవాలి వరంగల్ అర్బన్: అగ్నిమాపక సేవలు ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆధునిక వెబ్సైట్ను రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సైట్ రూపకల్పనపై నిర్వహించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను కమిషనర్ పరిశీలించారు. -
81.74 శాతం
సాక్షి, వరంగల్: అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రవేశ పెట్టింది. జిల్లాలో మొత్తం 8,93,213 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 7,30,072 (81.74 శాతం) మంది ఈకేవైసీ చేసుకోగా ఇంకా 1,63,141 (18.26శాతం)మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఽధ్రువీకరణ ద్వారా లబ్ధిదారుల వివరాలు నవీకరించబడి.. నకిలీ లేదా అనర్హ నమోదులను గుర్తించే అవకాశమున్న ఈ–కేవైసీ ప్రక్రియకు ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతో ఇప్పటికై నా మిగిలిన లబ్ధిదారులు వేగిరంగా ఈ–కేవైసీ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరా విభాగాధికారులు కోరుతున్నారు. జూలై 31తో ముగియాల్సిన గడువును ఆగస్టు 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా ఈ నెలంతా రేషన్ దుకాణాలు తెరిచే ఉండనుండడంతో ఈ–కేవైసీ పూర్తిస్థాయిలో జరుగుతుందని అధికారులు భా విస్తున్నారు. గడువు పెరిగిందని నిర్లక్ష్యం చేయకుండా, బియ్యం కోసం వచ్చే మిగిలిన లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకొని ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రేషన్ స్మార్ట్కార్డులు అందించే అవకాశం కనబడుతోంది.జిల్లాలో ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులుజిల్లాలో ఈ–కేవైసీ పరిస్థితి ఇలా.. పూర్తి చేయాల్సిన వి ఇంకా చేసుకోవాల్సిన వారు 1,63,141 మంది ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచిన ప్రభుత్వం ఆలస్యం చేయొద్దంటున్న అధికారులుచివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం గడువు ముగిసే వరకు వేచి చూడకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాలి. చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే ఈ–కేవైసీ పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. లేదంటే రేషన్ బియ్యం తీసుకొని వెళ్లేందుకు వచ్చే సమయంలో తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకొని రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే భవిష్యత్లో రేషన్ పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండనుంది. –కిష్టయ్య, జిల్లా పౌరసరఫరా విభాగాధికారిమొత్తం రేషన్ కార్డులుమొత్తం లబ్ధిదారులుపూర్తైన శాతంఈ–కేవైసీ పూర్తి చేసిన వారు -
కాపాడాల్సిన పోలీసే కాటేశాడు..!
వరంగల్ క్రైం: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్ బుక్ ద్వారా శ్రీకాంత్ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
రైస్ మిల్లుల్లో విచారణ
● మిల్లర్లపై గ్రేవ్ క్రైమ్ కేసు నమోదుశాయంపేట: మండలంలోని గట్లకానిపర్తిలో శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రెండు మిల్లుల్లో రూ.9.5 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తేలడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు శాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పరకాల ఏసీపీ సతీశ్బాబు శుక్రవారం గట్లకానిపర్తి గ్రామంలోని వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహా ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో పంచుల సమక్షంలో విచారణ చేపట్టి పంచానామా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గట్లకానిపర్తిలోని రెండు మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ అధికారులు సోదాలు చేయగా.. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, వారి వద్ద ఉన్న ధాన్యాన్ని చూడగా.. తేడా ఉందని శాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రూ. 9.5 కోట్ల పైన తేడా ఉన్నందున మిల్లర్లపై చీటింగ్, గ్రేవ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నింధితులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన తర్వాత నింధితులను అరెస్ట్ చేసి చార్జీషీట్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ సుధాకర్రెడ్డి, దామెర ఎస్సై వీరభద్రారావు సిబ్బంది ఉన్నారు. ఫైర్ సేఫ్టీ పాటించాలివరంగల్ అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం ఆస్పత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగంతో కలిసి కాజీపేటలోని డీమార్ట్, రోహిణి ఆస్పత్రి, హనుమకొండ, వరంగల్ నగరాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు పరిశీలించారు. -
వేయిస్తంభాల ఆలయానికి పునర్వైభవం
హన్మకొండ కల్చరల్: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల ఆలయానికి పునర్వైభవం తీసుకురావడమే పురావస్తుశాఖ లక్ష్యమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్ అన్నారు. హనుమకొండకు చెందిన ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి సౌజన్యంతో రూ.10 లక్షలతో దేవాలయం మెట్ల నుంచి గర్భాలయం, నాట్యమండపం చుట్టూ నూతనంగా క్యూలైన్లను నిహీల్దాస్ పురావస్తుశాఖ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కల్యాణ మండపం చుట్టూ ప్రదక్షణ పథం, విరిగిన ద్వారపాలకుల శిల్పాలను శిల్పులతో తిరిగి చెక్కించేందుకు పూజలు నిర్వహించారు. గార్డెన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా నిహీల్దాస్ మాట్లాడుతూ.. నీరు లీకవ్వకుండా రూ.30 లక్షలతో కల్యాణ మండపం పైకప్పు పనులు, నంది మంటపం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, పురావస్తుశాఖ అధికారులు పాల్గొన్నారు.ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్ -
ఉద్యమ పెద్దన్నకు ఊరూవాడా కన్నీటి వీడ్కోలు
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026నర్సంపేటలోని అమరవీరుల స్తూపం జంక్షన్ వద్ద పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని7నర్సంపేట/దుగ్గొండి/నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమకారుడి ఊపిరి ఆగిందని తెలిసి వేలాది గుండెలు తల్లడిల్లాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్థివదేహం తమ గ్రామం మీదుగా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో తరలివచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయామని ఆర్థనా దాలు చేశారు. ఉద్యమకారులు తమ సహచరుడిని కోల్పోయామని విలపించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు సాగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునివాళులు అర్పించారు.. ‘మల్లెప్పుడొస్తవ్ పెద్దన్నా’ అంటూ మహిళలు రోదించిన తీరు కంట తడి పెట్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రంలో ఉద్యమనేతగా గుర్తింపు పొందిన గులాబీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి(54)కి శుక్రవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హనుమకొండలోని తన స్వగృహంలో గత ఆదివారం ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనకు వెంటనే రోహిణి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్లో భారీ కాన్వాయ్తో హనుమకొండకు తీసుకురాగా, అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ మీదుగా గిర్నిబావికి చేరుకుంది. అక్కడ ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్ నుంచి ప్రత్యేక రఽథంపై ఉంచి అంతిమయాత్ర ప్రారంభించారు. గిర్నిబావి ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర జనసంద్రమైంది. కార్యకర్తలు దారి పొడవునా పుష్పాంజలి ఘటిస్తూ జోహార్ పెద్దన్నా అంటూ నినదించారు. లక్నెపల్లి, మహేశ్వరం మీదుగా అంతిమయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సంపేటకు చేరుకుంది. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి స్డేడియం వరకు దాదాపు మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. నర్సంపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి బంద్ పాటించారు. తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం.. పెద్ది అంత్యక్రియలకు బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా తరలివచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్నాయక్, రెడ్యానాయక్, ఒడితల సతీశ్, బాల్క సుమన్, మాజీ మేయర్ గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తదితరులు నివాళులర్పించారు. నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు.. సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. పెద్ది భౌతికకాయంపై కేటీఆర్, హరీశ్రావు, మాజీ మంత్రులు కలిసి బీఆర్ఎస్ జెండా కప్పారు. కేటీఆర్, హరీశ్రావు చేతులు పట్టుకుని స్వప్న బోరున విలపించారు. నేతలు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని విలపించడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల తర్వాత నల్లబెల్లిలోని నివాసంనుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మండల కేంద్రంలోని వీధులగుండా సాగింది. ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, దయాకర్రావు, పాడికౌశిక్రెడ్డి పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది అభిమానుల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.అంతిమయాత్ర సాగిందిలా...– వరంగల్ డెస్క్సుదర్శన్రెడ్డి పాడె మోస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ప్రభుత్వ లాంఛనాలతో..అభిమానులు అశ్రునయనాల నడుమ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవిందర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన చితికి కుమారుడు నిదర్శన్ రెడ్డి నిప్పంటించారు. పోలీసుల గౌరవ వందన సమయంలోనూ ‘పెద్ది జిందాబాద్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సుదర్శన్రెడ్డి పార్థివదేహం హనుమకొండ, గిర్నిబావి, నర్సంపేట మీదుగా నల్లబెల్లికి తరలింపు ఊరూరా రోడ్ల వెంట వేచి ఉన్న ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట, నల్లబెల్లిలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు కేటీఆర్, హరీశ్రావుతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల నివాళి మంత్రి సీతక్క, మంద కృష్ణ, గోరటి వెంకన్న, పలువురు ఎమ్మెల్యేల పుష్పాంజలి అంతిమయాత్రలో పెద్ది స్వప్న ఆగ్రహం పెద్ది అంతిమయాత్ర నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగా.. పెద్దికి వ్యతిరేకంగా గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టెంట్ వేసిన బోర్ వెల్ షాపు యజమానుల వైపు చూస్తూ మీరు చేసిన మనోవేదన వల్లే తన భర్త చనిపోయాడని దూషిస్తూ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పెద్దికి వ్యతిరేకంగా బోర్ వెల్ షాపు యజమానులు టెంట్ వేసి నిరసన దీక్షకు కూర్చున్న ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.‘పెద్ది’ లేక.. పొద్దు పొడవక! -
ప్రణాళికలు పటిష్టంగా రూపొందించాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ, బీపీడీపీ, డీపీడీపీ) సమగ్రంగా రూపొందించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు 2026–27 కార్యాచరణ ప్రణాళికలు, అమలులో ఉన్న పథకాలు, ప్రతిపాదిత పనులు, అందుబాటులో ఉన్న వనరులు, లబ్ధిదారుల వివరాలు, నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేసి జీపీడీపీ ప్రణాళికల్లో పొందుపర్చాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయండి ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఏర్పాట్లు సమీక్షించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్ రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇజ్రాయిల్ పర్యటన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ‘అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్మెంట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరవుతున్న ఇద్దరు ఐఏ ఎస్ అధికారుల్లో హనుమకొండ కలెక్టర్ ఒకరు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జరిగే సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయన కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఇజ్రాయిల్లో అమలవుతున్న ఆధునిక నీటి నిర్వహణ విధానాలు, పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థలపై అవగాహన పెంపొందించుకుని, వాటిలో అనువైన విధానాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు. కాగా, ఇన్చార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.రవికి అప్పగించారు. -
ఉపాధ్యాయుడికి నరకయాతన
శాయంపేట: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ఉపాధ్యాయుడు సుమారు రెండు గంటలకుపైగా నరకయాతన అనుభవించాడు. మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు 10 మంది హనుమకొండ నుంచి భూపాలపల్లి, కొత్తపల్లి, మహదేవపూర్ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ నుంచి పరకాల వైపు వెళ్తున్న నూతన ట్రాక్టర్ మండలంలోని మాందారిపేట హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. డ్రైవర్ ఒక్కసారిగా ట్రాక్టర్ను బంక్ పైపు తిప్పాడు. వెనకాలే వస్తున్న (టీఎస్ 03 యూడీ 0468) మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనం ట్రాక్టర్ను ఢీకొని పల్టీ కొట్టింది. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో మహేంద్ర సూపర్ వావానాన్ని పైకి లేపారు. వాహనంలో 10 మంది ఉపాధ్యాయులుండగా.. డ్రైవర్ వేణుకు తీవ్ర గాయాలలయ్యాయి. అతడిని ఆత్మకూరుకు చెందిన 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనలో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఉపాధ్యాయుడు రామ్మూర్తి కాలు వాహనంలో ఇర్కుపోయింది. మిగతా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు తక్కళ్ల సాంబయ్య, భాస్కర్ జేసీబీసీ సాయంతో ఎంతో శ్రమించి రామ్మూర్తిని బయటకు తీశారు. రామూర్తికి తొడ భాగం, కాలు రెండు చోట్ల విరిగిపోయాయి. రామ్మూర్తిని బయటకు తీసుకొచ్చిన స్థానికులు 108 అంబులెన్స్ అంబాటులో లేక సుమారు గంటకు పైగా రోడ్డు పక్కన పడుకోబెట్టారు. గంట తర్వాత 108 అంబులెన్స్ రావడంతో రామూర్తిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. 108 అందుబాటులో లేక ఇబ్బంది మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది లేకపోవడంతో హనుమకొండ నుంచి 108 వాహనం రావడంతో తీవ్ర ఆలస్యమైంది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు నరకయాతన అనుభవించాడు. రెండు వాహనాలు ఢీ.. కాలు ఇరుక్కుని టీచర్కు నరకం జేసీబీతో కాపాడిన స్థానికులు 108 కోసం దాదాపు గంట పాటు రోడ్డుపైనే క్షతగాత్రుడు -
‘వెట్ల్యాండ్స్’ పనులు వేగవంతం చేయాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో వెట్ల్యాండ్స్ (చిత్తడి నేలలు) సంరక్షణ, గుర్తింపు నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వెట్ల్యాండ్ కమిటీ సమావేశాన్ని డీఎఫ్ఓ నిఖితతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 433 వెట్ల్యాండ్స్కి సంబంధించిన సరిహద్దుల నిర్ధారణ, సంయుక్త క్షేత్ర పరిశీలన పనులు వేగవంతం చేయాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి రాష్ట్ర వెట్ ల్యాండ్ అథారిటీకి నివేదికలను సకాలంలో పంపించాలని సూచించారు. గుర్తించిన 7 వెట్ల్యాండ్స్ సరిహద్దులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేచేయించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత మాట్లాడుతూ ఇప్పటి వరకు నీటిపారుదలశాఖ 129 వెట్ల్యాండ్స్ సంబంధించిన వివరాలను సమర్పించాలని, మిగిలిన వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తిచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయశాఖాధికారి విజయ్భాస్కర్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్రావు, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ‘సర్’పై కలెక్టర్ సమీక్ష ఎస్ఐఆర్–2026 ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సలహాలు, అభ్యంతరాలను ఎన్నికల నిబంధనల మేరకు సమర్పించాలని సూ చించారు. అర్హులు ఓటరు జాబితాలో పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హుల వివరాలను కూడా నిబంధనల ప్రకారం పరి శీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, రజినీకాంత్, కుసుమ శ్యాం, ఫైజుల్లా, రాజేశ్, సుల్తాన్ పాల్గొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఉద్యమ పెద్దన్నకు ఊరూవాడా కన్నీటి వీడ్కోలునర్సంపేటలోని అమరవీరుల స్తూపం జంక్షన్ వద్ద పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని7నర్సంపేట/దుగ్గొండి/నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమకారుడి ఊపిరి ఆగిందని తెలిసి వేలాది గుండెలు తల్లడిల్లాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్థివదేహం తమ గ్రామం మీదుగా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో తరలివచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయామని ఆర్థనా దాలు చేశారు. ఉద్యమకారులు తమ సహచరుడిని కోల్పోయామని విలపించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు సాగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునివాళులు అర్పించారు.. ‘మల్లెప్పుడొస్తవ్ పెద్దన్నా’ అంటూ మహిళలు రోదించిన తీరు కంట తడి పెట్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రంలో ఉద్యమనేతగా గుర్తింపు పొందిన గులాబీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి(54)కి శుక్రవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హనుమకొండలోని తన స్వగృహంలో గత ఆదివారం ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనకు వెంటనే రోహిణి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్లో భారీ కాన్వాయ్తో హనుమకొండకు తీసుకురాగా, అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ మీదుగా గిర్నిబావికి చేరుకుంది. అక్కడ ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్ నుంచి ప్రత్యేక రఽథంపై ఉంచి అంతిమయాత్ర ప్రారంభించారు. గిర్నిబావి ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర జనసంద్రమైంది. కార్యకర్తలు దారి పొడవునా పుష్పాంజలి ఘటిస్తూ జోహార్ పెద్దన్నా అంటూ నినదించారు. లక్నెపల్లి, మహేశ్వరం మీదుగా అంతిమయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సంపేటకు చేరుకుంది. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి స్డేడియం వరకు దాదాపు మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. నర్సంపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి బంద్ పాటించారు. తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం.. పెద్ది అంత్యక్రియలకు బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా తరలివచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్నాయక్, రెడ్యానాయక్, ఒడితల సతీశ్, బాల్క సుమన్, మాజీ మేయర్ గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తదితరులు నివాళులర్పించారు. నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు.. సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. పెద్ది భౌతికకాయంపై కేటీఆర్, హరీశ్రావు, మాజీ మంత్రులు కలిసి బీఆర్ఎస్ జెండా కప్పారు. కేటీఆర్, హరీశ్రావు చేతులు పట్టుకుని స్వప్న బోరున విలపించారు. నేతలు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని విలపించడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల తర్వాత నల్లబెల్లిలోని నివాసంనుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మండల కేంద్రంలోని వీధులగుండా సాగింది. ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, దయాకర్రావు, పాడికౌశిక్రెడ్డి పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది అభిమానుల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.అంతిమయాత్ర సాగిందిలా...– వరంగల్ డెస్క్సుదర్శన్రెడ్డి పాడె మోస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ప్రభుత్వ లాంఛనాలతో..అభిమానులు అశ్రునయనాల నడుమ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవిందర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన చితికి కుమారుడు నిదర్శన్ రెడ్డి నిప్పంటించారు. పోలీసుల గౌరవ వందన సమయంలోనూ ‘పెద్ది జిందాబాద్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సుదర్శన్రెడ్డి పార్థివదేహం హనుమకొండ, గిర్నిబావి, నర్సంపేట మీదుగా నల్లబెల్లికి తరలింపు ఊరూరా రోడ్ల వెంట వేచి ఉన్న ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట, నల్లబెల్లిలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు కేటీఆర్, హరీశ్రావుతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల నివాళి మంత్రి సీతక్క, మంద కృష్ణ, గోరటి వెంకన్న, పలువురు ఎమ్మెల్యేల పుష్పాంజలి అంతిమయాత్రలో పెద్ది స్వప్న ఆగ్రహం పెద్ది అంతిమయాత్ర నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగా.. పెద్దికి వ్యతిరేకంగా గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టెంట్ వేసిన బోర్ వెల్ షాపు యజమానుల వైపు చూస్తూ మీరు చేసిన మనోవేదన వల్లే తన భర్త చనిపోయాడని దూషిస్తూ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పెద్దికి వ్యతిరేకంగా బోర్ వెల్ షాపు యజమానులు టెంట్ వేసి నిరసన దీక్షకు కూర్చున్న ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.‘పెద్ది’ లేక.. పొద్దు పొడవక! -
వేయిస్తంభాల ఆలయానికి పునర్వైభవం
హన్మకొండ కల్చరల్: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల ఆలయానికి పునర్వైభవం తీసుకురావడమే పురావస్తుశాఖ లక్ష్యమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్ అన్నారు. హనుమకొండకు చెందిన ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి సౌజన్యంతో రూ.10 లక్షలతో దేవాలయం మెట్ల నుంచి గర్భాలయం, నాట్యమండపం చుట్టూ నూతనంగా క్యూలైన్లను నిహీల్దాస్ పురావస్తుశాఖ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కల్యాణ మండపం చుట్టూ ప్రదక్షణ పథం, విరిగిన ద్వారపాలకుల శిల్పాలను శిల్పులతో తిరిగి చెక్కించేందుకు పూజలు నిర్వహించారు. గార్డెన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా నిహీల్దాస్ మాట్లాడుతూ.. వర్షపు నీరు లీకవ్వకుండా రూ.30 లక్షలతో కల్యాణ మండపం పైకప్పు పనులు, నంది మంటపం నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, పురావస్తుశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, సీనియర్ సీఐ అజిత్, మల్లేశం, కాంట్రాక్టర్ శ్రీనివాస్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహీల్దాస్ దేవాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం


