breaking news
Warangal
-
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇన్నయ్యను అరెస్ట్చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. -
ఐనవోలు జాతరకు ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో మంత్రి కొండా సురేఖ హన్మకొండ అర్బన్: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో శనివారం జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా, పార్కింగ్కు ఏర్పాట్లు ఐనవోలు నుంచి కొమురవెల్లి, మేడారానికి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనానికి టోకెన్ల విధానం అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అనంతరం పర్యాటక శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు. సమీక్షలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొత్తకొండ జాతరపై సమీక్షభీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జనవరి 9 నుంచి 18 వరకు జరిగే శ్రీ వీరభద్రస్వామి జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఆలయ ఈఓ కిషన్న్రావు, డాక్టర్ అప్పయ్య, ఆర్టీసీ డీఎం అర్పిత, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్ను ఎన్నుకున్నారు. -
సృజనాత్మకత పెంపునకు సైన్స్ఫెయిర్
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ఫెయిర్ దోహదం చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు శనివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. మానవాళి ప్రకృతిని నాశనం చేస్తుండడంతో అనేక అనర్థాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చిన వరదలే ఉదాహరణ అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి బి.రాంధన్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్, హనుమకొండ, కాజీపేట ఎంఈఓలు నెహ్రూనాయక్, మనోజ్కుమార్, ప్రభుత్వ మర్కజీ హై స్కూల్ ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. -
ఆపదలో ఆదెరువు!
వడ్డేపల్లి చెరువులో చేరుతున్న మురుగునీరుకాజీపేట: కాజీపేట, హనుమకొండ పట్టణవాసులకు ఒకప్పుడు తాగు నీరందించిన వడ్డేపల్లి రిజర్వాయర్ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. కాకతీయ రాజుల కాలంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు ద్వారా దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. దాన్ని 1993లో పూర్తిగా సమ్మర్ స్టోరేజీగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా కాజీపేట పట్టణ మురుగు నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరి నీరు కలుషితమవుతూ వస్తోంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తరహాలో ఈ రిజర్వాయర్లో శవాలు తేలుతున్న ఘటనలు కూడా నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రెయినేజీలన్నీ వడ్డేపల్లి చెరువు వైపే.. కాజీపేట పట్టణ పరిధి ఆయా డివిజన్లలో నిర్మించిన డ్రెయినేజీల నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. సోమిడి ఊరచెరువు తూము నుంచి మురికి కాల్వల ద్వారా కలుషిత నీరు వడ్డేపల్లి చెరువులో చేరుతోంది. ఊర చెరువును ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన రియల్ వ్యాపారులు తూముకు గండి కొట్టడమే ఈ చెరువు నీరు కలుషితమవడానికి ఒక కారణం. గతంలో వడ్డేపల్లి ఫోర్షోర్ బండ్కు ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ అవతలి వైపున మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా కట్ట మాదిరిగా రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. అయితే రాళ్ల పక్క నుంచి మురుగు నీరు సవ్యంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ నీరంతా కట్ట మీది నుంచి చెరువులోకి ప్రవేశిస్తోంది. అనుమతి పొందడంలో జాప్యం.. మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా నివారించాలంటే.. రైల్వే ట్రాక్ కింది నుంచి మోరీ నిర్మించాల్సి ఉంది. ఈ మోరీ నిర్మాణానికి రైల్వే అనుమతి తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు రైల్వేశాఖకు పలుమార్లు లేఖలు రాసినా అనుమతులు రాకపోవడంతో మిన్నకుండిపోయారు. దీంతో లక్షల రూపాయలతో సోమిడి వైపు నిర్మించిన కట్ట వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం కాజీపేట 61వ డివిజన్లోని సిద్ధార్థనగర్ వైపు నుంచి మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా, వడ్డేపల్లి చెరువులోని నీరు సిద్ధార్థనగర్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఫోర్షోర్ బండ్ను నిర్మించారు. ఈ బండ్ నిర్మాణం జరిగినపుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ బండ్ కోతకు గుౖరవుతుంది. చెరువు నీటి తాకిడికి ఈ బండ్ ఎప్పుడు గండిపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోర్షోర్ బండ్కు ఇరువైపులా పెద్ద ఎత్తున తుమ్మచెట్లు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారింది. మలమూత్రాల విసర్జన చెరువు పరిసరాలను వాడుతున్నారు. కాగా, చెరువు కింద ఉన్న కాలనీల్లోని బోరు బావుల్లో నీరు నల్లగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, వడ్డేపల్లి చెరువు నీరు కలుషితంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ మున్సిపల్ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘బల్లార్షా రైల్వే లైన్ కింద నుంచి సైడ్ కాల్వ నిర్మించడానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించి చెరువు కలుషితం అవ్వకుండా చూస్తాం’ అని చెప్పారు. కలుషితం కాకుండా చూడాలి.. వడ్డేపల్లి చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే రిజర్వాయర్ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించి తాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలి. – మర్యాల కృష్ణ, కాజీపేట కాల్వలను మళ్లించాలి.. వడ్డేపల్లి రిజర్వాయర్లోకి నేరుగా ఉన్న మురికి కాలువలను అధికారులు గుర్తించి దారి మళ్లించడానికి ఉన్న అవకాశాలపై ప్రత్యేక సర్వే చేయాలి. చెరువులోకి పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురికినీరు వల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – ఎండీ సోనీ, కాజీపేట కోతకు గురవుతున్న ఫోర్షోర్ బండ్ రిజర్వాయర్లో తేలుతున్న శవాలు కన్నెత్తి చూడని అధికారులు ఆందోళనలో నగరవాసులు -
యాసంగి ప్రణాళిక ఖరారు
హన్మకొండ: జిల్లాలో యాసంగి ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,29,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగిలో మొక్కజొన్న 63,608 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 64,100, వేరుశనగ గత యాసంగిలో 473 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 370ఎకరాల్లో సాగుచేయనున్నారు. పప్పుదినుసులు గత యాసంగిలో 238 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. యూరియా 28,584 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,587, ఎన్పీకే 26,466, ఎంఓపీ 8,469 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఎరువులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది యాసంగిలో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే వ్యవసాయ శాఖ విస్తీర్ణాన్ని తగ్గించింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 1,97,025 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగితో చూస్తే 2,815 ఎకరాలు తగ్గింది. పరిస్థితులు చూస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,27,951 ఎకరాలు సాగు చేశారు. వానాకాలంలో చూస్తే 33,741 ఎకరాలు తగ్గింది. వానాకాలంలో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు సాగు చేయడంతో విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 1,94,210 ఎకరాల్లో పంటల సాగు యూరియా అవసరం 28,584 మెట్రిక్ టన్నులు డీఏపీ 10,587 మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 26,466 మెట్రిక్ టన్నులు -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను ప్రభుత్వం నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. పరకాల, కమలాపూర్ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్గా ఎన్.శ్రీనివాస్రావును నియమించారు. పెగడపల్లి ఎ.కృష్ణవేణి, నందనం ఎస్.సదీప్కుమార్, ధర్మసాగర్, సింగారం కె.రవీంద్ర, హసన్పర్తికి ఎ.జగన్మోహన్రావు, దర్గా కాజీపేట, మల్లారెడ్డిపల్లి ఎం.సునీల్ కుమార్, పెంచికలపేట, శాయంపేటకు రాధిక, ఎల్కతుర్తి సీని యర్ ఇన్స్పెక్టర్ ఎండీ అఫ్జలుద్దీన్, మాదారం సీనియర్ ఇన్స్పెక్టర్ వి.జ్యోతి, పెద్దాపూర్కు సీనియర్ ఇన్స్పెక్టర్ మతీన్సుల్తాన్, వంగపహాడ్ సీనియర్ ఇన్స్పెక్టర్ జె.సత్యానందం, ఆత్మకూరు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం.రాణిశ్రీలక్ష్మిని పర్సన్ఇన్చార్జ్గా నియమించారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
ఇప్పుడేం చేద్దాం?
2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లు మొత్తం సహకార సంఘాలు 99డైరెక్టర్ స్థానాలు 1,260ఏకగ్రీవంగా ఎన్నికై నవి 509ఎన్నికలు జరిగినవి 751సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్ప ట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది.సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఎలక్షన్స్పై అన్ని పార్టీల్లోమళ్లీ మొదలైన చర్చ -
ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్
వంజరపల్లి గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపులో అధికారుల తప్పిదంసాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికారులు చేసిన తప్పిదంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికే లేకుండా పోయింది. అన్ని పల్లెల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లను ఎన్నుకుంటే, ఇక్కడ మాత్రం పంచాయతీ పైఅధికారుల నిర్లక్ష్యంతో గ్రామ సారధిని ఎన్నుకోలేకపోయారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్నికలు జరిగాయని అధికారులు చెబుతున్నా.. 2018లోనూ అప్పటి ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి అప్పుడూ జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. దీని ప్రకారమే వంజరపల్లిలో భాగమైన ఎస్టీ జనాభా ఉండే రేఖ్యానాయక్ తండా (212 మంది ఎస్టీ ఓటర్లు) విడిపోయి పోచమ్మ తండాలో కలిసింది. ఈ మేరకు వంజరపల్లిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో ఎస్టీ మహిళ రిజర్వ్ అయి ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు కూడా పోచమ్మ తండాలో మళ్లీ ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా, వంజరపల్లిలో మాత్రం ఒక్క ఎస్టీ లేకున్నా కూడా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు రిజర్వ్ చేశారు. పనిలో పనిగా మూడు వార్డులు కూడా ఎస్టీకి అధికారులు రిజర్వ్ చేయడం చర్చనీయాంశమైంది. మిగిలిన ఐదు వార్డులకు ఎన్నికలు జరగగా, ఉపసర్పంచ్గా మోర్తాల చందర్రావు ఎన్నికయ్యారు. ముమ్మాటికి అధికారుల తప్పిదమే.. ● 2011 జనాభా లెక్కల ప్రకారం వంజరపల్లిలో 212 మంది ఎస్టీలు, 56 మంది ఎస్సీలు, 270 మంది బీసీలు మొత్తం 538 మంది జనాభా ఉంటే 438 మంది ఓటర్లున్నారు. అప్పుడూ రేఖ్యానాయక్ తండా కూడా వంజరపల్లిలోనే ఉంది. అయితే 2018లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా మార్చడంతో 212 మంది ఎస్టీ జనాభా ఉన్న రేఖ్యానాయక్ తండాతో పాటు జారబండా తండా, బోరింగ్ తండా, మహారాజు తండాలు కూడా పోచమ్మ తండాలో విలీనమయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 561 మంది ఎస్టీలుండగా, 2018లో ఇతర తండాలు కలవడంతో ఓటర్ల సంఖ్య 860కు చేరుకుంది. అలాగే, వంగరపల్లిలో ఉన్న 373 మంది ఓటర్లు (324 మంది బీసీలు, 49 మంది ఎస్సీలు) ఉండడంతో 2018లో బీసీ మహిళ రిజర్వేషన్తో ఎన్నికలు జరిగాయి. ● 2018లో వంజరపల్లి గ్రామం సర్పంచ్ స్థానం మాత్రం బీసీ మహిళకు రిజర్వ్ కాగా, ఈసారి ఎస్టీ జనరల్కు అధికారులు కేటాయించారు. ఇక్కడా ఎస్టీ జనాభా లేదని, బీసీ, ఎస్సీలే ఉన్నారని 373 మంది ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు జిల్లా అధికారులకు సమర్పించినా ఎస్టీ జనరల్కు సర్పంచ్ స్థానం, మూడు వార్డులు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అదే వంజరపల్లి గ్రామం నుంచి రేఖ్యానాయక్ తండా వెళ్లి కలిసిన పోచమ్మ తండాలో మాత్రం 2018లో మాదిరి గానే 860 ఓటర్లతో ఈసారి ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండావాసులు మాలోతు రాజుకుమార్, బానోతు శ్రీదేవి వార్డు సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. దీన్నిబట్టి చూస్తే పోచమ్మ తండాకు న్యాయం జరిగితే, వంగరపల్లికి అన్యాయం జరగడమేంటని ఇప్పటికే కలెక్టర్లు, పంచాయతీ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారు. అయితే డ్రా తీసే సమయంలో వంజరపల్లికి ఎస్టీ జనరల్ వస్తే, అక్కడా బీసీ, ఎస్సీ ఓటర్లే ఉన్నారు కదా అని అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ అన్యాయం జరిగి ఉండేది కాదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికా రులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ ఊరి నుంచి ఎస్టీ జనాభా వెళ్లి కలిసిన పోచమ్మ తండాకు వాస్తవ రిజర్వేషన్ 2018లో మాదిరిగానే 860 ఓట్లతో పోచమ్మ తండాలో సర్పంచ్ ఎన్నికలు అలాంటప్పుడూ ఇక్కడా ఎస్టీ జనాభా లేదని తెలిసి మరీ రిజర్వేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే వంజరపల్లికి అన్యాయమనే చర్చ ఇప్పటికై నా తప్పు సరిదిద్దుకొని ఎన్నికలు నిర్వహించాలంటున్న గ్రామస్తులుఅధికారుల తప్పిదమే.. 2018లో వంజరపల్లి, రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో బీసీ మహిళ, ఎస్టీ మహిళ అభ్యర్థులుగా పోటీచేశారు. కిందిస్థాయి అధికారులు వంజరపల్లిలో బీసీలు, ఎస్సీలే ఉన్నారంటూ ఓటరు జాబితాను సమర్పించినా కూడా పైస్థాయి అధికారుల తప్పిదంతో మా ఊరికి అన్యాయం జరిగింది. అదే పోచమ్మతండాకు మాత్రం ఆ ఊరులో కలిసిన రేఖ్యానాయక్ తండా, ఇతర తండాలతో ఓటర్లను కలుపుకొని ఈసారి ఎన్నికలు నిర్వహించారు. 2018లో మాదిరిగానే రేఖ్యానాయక్ తండా రెండు వార్డులు, మహారాజు తండా రెండు వార్డులు, పోచమ్మ తండా రెండు వార్డులు, జారుడు తండా ఒకటి, బోరింగ్ తండా ఒకటి వార్డులకు ఎన్నికలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే జిల్లా ఉన్నతాధికారుల తప్పిదం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికై నా 2018లో మాదిరిగానే ఇక్కడా జనాభా ఉన్న రిజర్వేషన్ కలిపించి ఎన్నిక నిర్వహించాలి. – సోమిడి శ్రీనివాస్, వంజరపల్లి -
20 రోజులుగా తాగునీరు బంద్
నర్సంపేట: నర్సంపేట పట్టణం ఒకటో వార్డులో గత 20 రోజులుగా తాగునీరు సరిగారాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల మాట్లాడుతూ గతేడాది నుంచి మిషన్ భగీరథ పైపులైన్కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయని అన్నారు. అలాగే, పలు ఇళ్లకు మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదని తెలిపారు. లీకేజీలకు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తిరుమల విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ.అబ్దుల్పాషా, దంచనాదుల సతీష్, కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల రాజు, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య మంజుల, భూక్య సునీత, జాటోత్ విజయ, నల్లబెల్లి మంజుల, విజయ, ఎండీ.గౌస్యబేగం, ఎండి.కౌసర్, ఎండి.హసినా, ఎండి.జరానీ, ఎండి.సాజియా, ఎండి.నూర్, జాటోతు రమేష్, ఎండి.సర్వర్, బోడ శివరామకృష్ణ, శ్రీపెళ్లి రమ, మల్యాల నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానికులు, మహిళల నిరసన -
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్నకు దరఖాస్తులున్యూశాయంపేట: జిల్లాలోని అల్పసంఖ్యాక వర్గాల (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విద్యార్థులు విదేశాల్లో పైచదువులు చదువుకొనేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు 93988 60995 నంబర్లో సంప్రదించాలన్నారు. ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంకాళోజీ సెంటర్: జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం కింద రూ.75 వేల చొప్పున 8 యూనిట్లకు 100 శాతం సబ్సిడీపై అవకాశం కల్పించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నేడు జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల ఎంపికలుసంగెం/వర్ధన్నపేట: జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ ఎంపిక పోటీలను పర్వతగిరి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు సమ్మయ్య, కార్యదర్శి డెక్క లోకేష్, కోశాధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సీనియర్ పురుషులు, సీ్త్రల కబడ్డీ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 17 సంవత్సరాల పైబడి 85 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26నుంచి ఖమ్మంలో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77807 05024, 87901 54679 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికసంగెం: జిల్లాస్థాయి గణిత ప్రతిభా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు మండల గణిత ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు సత్యమూర్తి, పులి శిరీష తెలిపారు. సంగెం జెడ్పీహెచ్ఎస్లో శనివారం నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి పోటీలకు బి.విష్ణువర్ధణ్, పి.భరత్ (జెడ్పీహెచ్ఎస్), వి.జానేశ్వరి (కేజీబీవీ సంగెం) ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభంగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంట ప్రధాన రోడ్డు ఎస్సీ కాలనీ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ వారికి సమాచారం అందించగా వారు వచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, గొర్రెకుంట – పోతరాజుపల్లి రహదారి విస్తరణ సందర్భంగా గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా అలాగే వదిలేయడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గ్రీవెన్స్లో అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యకు పరిష్కారం లభించడం లేదని గొర్రెకుంట వాసులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
నాణ్యమైన మామిడిని పండించాలి
వర్ధన్నపేట: రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, నీటి యాజమాన్యం పాటించి నాణ్యత కలిగిన మామిడి పంటను పండించి, మార్కెట్లో అధిక ధరలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్)లో భాగంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలిపారు. ఎకరానికి రూ.9 వేల రాయితీ అందిస్తోందని గుర్తుచేశారు. ఫ్రూట్ కవర్లు వాడటం వలన మామిడి నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్.రాకేష్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు, ఆయిల్పామ్ తోటలు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన రాయితీల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్, ఉద్యాన, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజర్షి, మురళి, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, ఆయిల్పామ్ క్షేత్రస్థాయి అధికారులు ప్రణయ్, కల్యాణ్, రైతులు సురేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాసరావు -
రేపు ప్రకృతి విపత్తులపై మాక్డ్రిల్
న్యూశాయంపేట: ప్రకృత్తి విపత్తులపై వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సోమవారం మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. మాక్డ్రిల్ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే ఈ మాక్డ్రిల్ ఉద్దేశమని వివరించారు. మాక్డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కలెక్టర్ సత్యశారద సలహాలు ఇచ్చి, పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జనవరిలో జరగనున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమాలపై హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తితో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోడ్లపై రుంబుల్ స్ట్రిప్ట్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలిప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. క్రిస్మస్ సంబరాల ఏర్పాట్లపై అధికారులు, పాస్టర్లతో కలెక్టరేట్లో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ మూడు నియోజకవర్గాల వారీగా వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట తహసీల్దార్లకు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బాలల హక్కులకు భంగం కలిగించొద్దు
● జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి కాళోజీ సెంటర్: బాలల హక్కులకు భంగం కలిగించొద్దని, వారి హక్కులు, భవిష్యత్కు విఘాతం కలగకుండా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి అన్నారు. బాలల హక్కులపై వరంగల్లోని మట్వాడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి చదువులో రాణించాలన్నారు. అనంతరం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, పోషకాహారోత్సవంలో జడ్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు భిక్షపతి, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు
న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరం కేవలం ఒక కార్యక్రమం కాదని, తమ ఇంట్లో ఉన్న వృద్ధులకు తామిచ్చే భరోసా అని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన న్యాయ సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మద్దతుతో 212 జీపీల్లో విజయం
వరంగల్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీలకు గాను 212 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ను శనివారం కలిసి నివేదికలు అందజేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నా విషయాలను వారితో చర్చించారు. ఎన్ఆర్ఈజీఎస్లో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టినట్లు అయూబ్ తెలిపారు. -
ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఆయిల్పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రతి క్లస్టర్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి.. రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. మండల క్లస్టర్స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, ఆయిల్పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు. పోలీసుల వేధింపులుడివిజన్లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్లో పెట్టించి కొట్టించిన ఘటనలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసిన ట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు -
హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావును హైదరాబాద్ సీబీఐ కోర్ట్ చీఫ్జడ్జీగా బదిలీ చేస్తూ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్చార్జ్గా ఉంటారు. సోమవారం వరకు రిలీవ్ కావాలని, ఈ నెల 29 వరకు బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మామునూరు: వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్కు చెందిన స్పెషల్ కానిస్టేబుళ్లు శుక్రవారం నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు. ఈమేరకు ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన స్పెషల్ కానిస్టేబుళ్లను రిలీవ్ చేస్తూ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి సిబ్బందిని అభినందించారు. తెలంగాణలో విధులు నిర్వర్తించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మంచి చేయాలని సూచించారు. విధుల్లో పేరు ప్రతిష్టతలు పెంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని జేఎన్ఎస్లో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.సారంగపాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపిౖకైన క్రీడాకారులు జనవరి 2, 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న 11వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లతో పాటు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 22న ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సారంగపాణి 93901 04499, సాంబమూర్తి 99120 22188, రజనీకాంత్ 70133 03330 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హన్మకొండ అర్బన్: ఈనెల 23న (మంగళవారం) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రెడ్ క్రాస్ భవన్లో జిల్లా పాలకవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన బుక్లెట్ను కలెక్టర్కు అందజేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయగా.. డీఎంహెచ్ఓ అప్పయ్య లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు, టీబీ నివారణాధికారి హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కేజీబీవీల్లో, మోడల్ స్కూళ్లలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు (పీటీఎం) సమావేశాలు ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే సమావేశంలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు(పోషకాహారం) చేసుకుని తీసుకురావాలని తల్లిదండ్రులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. పోషకాహారోత్సవాన్ని పాఠశాలల్లో వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించినట్లు హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి శుక్రవారం తెలిపారు. -
సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిధులు లేక నిలిచిన డార్మెటరీ పనులు మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) గతంలోనే ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు చేసి నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపేశారు. అర్ధంతరంగా నిలిచిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనకే పరిమితమైంది. నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాల్సి ఉంది. భక్తుల డిమాండ్లు ● ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● భక్తుల సంఖ్యకు సరిపోయేలా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాల్ నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి. ● ఆర్కియాలజీ శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. – ఆలయానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునికీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, అలాగే ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా.. సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందులు పడిన కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లైటింగ్ టవర్స్, భద్రతాపరంగా మరో 50 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ ఘటనలకు సంబంధించిన వాహనాలను ఉంచడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే మరో చోటుకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు. ఈసారి కలెక్టరేట్లో సమావేశం ప్రతీ ఏడాది జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశం మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించేవారు. కానీ, ఈసారి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తేనే అధికారులకు క్షేత్రస్థాయిలో సమస్యలపై, చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన ఉంటుందని.. అప్పటికప్పుడు మెరుగైన వసతుల కల్పనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్న కలెక్టర్ అభివృద్ధిపై దృష్టిసారించాలంటున్న భక్తులు -
అంగన్వాడీ సెంటర్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీఆర్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏఎస్పీ శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని అంగన్వాడీ టీచర్కు సూచించారు. మంత్రి వెంట తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు. రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్కు చెందిన అంబులెన్స్ డ్రైవర్కు బ్రీత్ ఆనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్న్స్ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
చలితో విలవిల
సాక్షి, వరంగల్/హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవుతున్నది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ఆటోమేటిక్ వెథర్ స్టేషన్లో నమోదైన వివరాల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 సెల్సీయస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 32 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదైంది. అయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 డిగ్రీలుండగా అత్యధిక ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.8 సెల్సియస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 30.6 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉన్ని దుస్తులకు డిమాండ్.. చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి.. తెల్లవారుజామునుంచే పొగమంచు కురుస్తుండడంతో నిత్యావసర సరుకులైన కూరగాయలు, ఇతర సామగ్రి తీసుకెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ సమయాల్లోనే ఎదురుగా ఉండే వాహనం, ఎదురుగా వచ్చే వాహనం పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశముందని, గతేడాది డిసెంబర్లోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహనాల పార్కింగ్ లైట్లు వేసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీలు సెల్సియస్లలో)ప్రాంతం అత్యల్పం అత్యధికంఎల్కతుర్తి 10.3 29.6 మరిపల్లి గూడెం 11.2 30.3 ఆత్మకూరు 10.8 28.9 నాగారం 11.3 29.9 పెద్ద పెండ్యాల 11.0 32.8 శాయంపేట 11.6 28.9 వేలేరు 11.3 29.6 నడికూడ 12.1 29.6 ధర్మసాగర్ 10.8 31.3 మడికొండ 11.1 30.6 పులుకుర్తి 12.2 30.8 కాజీపేట 11.1 32.3 చింతగట్టు 11.8 32.6 కొండపర్తి 11.1 30.2 భీమదేవరపల్లి 12.8 31.1 పరకాల 13.1 29.5 దామెర 11.5 30.1 ఐనవోలు 12.4 32.4 హనుమకొండ 12.7 30.8 కమలాపూర్ 13.5 32.1 రోజురోజుకూ ఉష్ణోగ్రతల తగ్గుముఖంతో వణుకుతున్న ప్రజలు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీలు నేడు చలి తీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు -
శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి
విద్యారణ్యపురి: భారతదేశం శాస్త్రసాంకేతక రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తే విశ్వగురువుగా కీర్తించే అవకాశం ఉంటుందని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యానగర్లోని సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని నూతన ఆలోచనలు సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు వేదికలవుతాయన్నారు. తాను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి వచ్చే ఏడాది సైన్స్ ఫెయిర్ నాటికి జిల్లా సైన్స్కేంద్రం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడమే ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ఫెయిర్ అంటే ఒక మోడల్ను.. ఒక ఎగ్జిబిట్ను ప్రదర్శించడం కాదని పరస్పర విజ్ఞానాన్ని షేర్ చేసుకోవడమేనని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. విద్యార్థులు భవిష్యత్లో పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సైన్స్ ఫెయిర్లు దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్లో విద్యార్థులు ప్రదర్శనలను తిలకించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ మేన శ్రీను, స్థానిక కార్పొటర్ నల్లా స్వరూపరాణి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా బాధ్యుడు మాదాల సతీశ్కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, హసన్పర్తి ఎంఈఓ ఎ.శ్రీనివాస్, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్రెడ్డి, డాక్టర్ మన్మోహన్, బి.మహేశ్, సునీత, ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డి వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మక ప్రతిభ -
సోలార్ ప్లాంటుకు స్థల పరిశీలన
గీసుకొండ: కొనాయమాకుల–వంచనగిరి మధ్యలో ఉన్న 16 ఎకరాల ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వ భూమిలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంటు ప్రతిపాదనను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. కాకతీయ కాల్వ వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూమిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంటును సెర్ప్ మహిళా సంఘాల వారు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అధికారులతో కలిసి కేటాయించిన భూమి హద్దులను పరిశీలించారు. ఎన్పీడీసీఎల్ డీఈ దానయ్య, ఏడీ రవి, ఏఈ సంపత్కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టీజీ రెడ్కో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఇంజనీర్ నవీన్కుమార్, డైనేరా కంపెనీ సైట్ ఇంజనీర్ ముస్తఫా, ఐబీ ఏఈ సాయిరాజు, డీపీఎం దాసు, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర సతీశ్ స్థల పరిశీలన చేసి సోలార్ ప్లాంటు ఏర్పాటుపై చర్చించారు. సర్వేయర్ భాస్కర్ ప్లాంటు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం హద్దులను అధికారులకు చూపించారు. -
అప్రమత్తంగా ఉండాలి..
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి● -
ఎమ్మెల్యే నాగరాజుకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు. పోలీసుల వేధింపులు..డివిజన్లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్లో పెట్టించి కొట్టించిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసినట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో మిగిలిన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు -
కుష్ఠుపై సమరం
ఈనెల 31 వరకు ఇంటింటి సర్వే గీసుకొండ: జిల్లాలో కుష్ఠు నిర్ధారణ కోసం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు. ప్రారంభఽ దశలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పీహెచ్సీల నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యాధికి సంబంధించిన ప్రచార కరపత్రాలు, బ్యానర్లను గ్రామాలు, ఆరోగ్య కేంద్రాల వద్ద కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇవీ వ్యాధి లక్షణాలు.. శరీరంలో తెల్లని, ఎర్రని రాగి రంగు మచ్చలు ఉండి స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండడం, ముఖంపై నూనె పోసినట్లు మెరుస్తూ ఉండడం, దద్దులు రావడం, అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు రావడం, కనురెప్పలు సరిగా మూసుకోకపోవడం లాంటివి కుష్ఠు లక్షణాలు. ఇంటింటి సర్వేలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కుష్ఠు వ్యాధితో వచ్చే అంగవైకల్యానికి చేతివేళ్లు వంకర పోవడం, ఫుట్ డ్రాప్ సమస్య ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్సతో సరిచేస్తారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఎండీటీ చికిత్స అందిస్తారు. వ్యాధి ఏ దశలో ఉన్నా సాధారణమని ప్రజలు గమనించాలని, హైరానా పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను కలవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకేదిలా.. లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్ఠు సోకుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈవ్యాధి ముఖ్యంగా చర్మం, నరాలకు సోకుతుంది. ఇది ఒక రకమైన అంటువ్యాధి కారకం. రెండు రకాలుగా చికిత్స.. కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ(పీబీ)గా గుర్తిస్తారు. ఇలాంటి వారికి 6 నెలల వరకు చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలపాటు చికిత్స అందిస్తారు. కనీసం 15 నెలల్లో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠును పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖరీదు చేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 6–12 నెలల వరకు చికిత్స తీసుకుంటే వ్యాఽధి పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి అంగవైకల్యం కలుగకుండా చూడవచ్చని వారు సూచిస్తున్నారు.జిల్లాలో ప్రస్తుతం 27 మంది కుష్ఠు వ్యాఽధిగ్రస్తులు ఉన్నారని జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వైద్య బృందాలు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తాయన్నారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 545 టీంలను ఏర్పాటు చేశామని, 1,090 మంది టీం మెంబర్లు, 208 మంది సర్వేయర్లు ఉంటారన్నారు. మండలాల వారీగా లెప్రసీ నోడల్ పర్సన్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. 545 టీంలను ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో ప్రస్తుతం 27 మంది వ్యాధిగ్రస్తులు బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం -
నేడు జాతరలపై సమావేశం
హన్మకొండ అర్బన్: సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఐనవోలు, కొత్తకొండ జాతరలపై శనివారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐనవోలు జాతర, సాయంత్రం 4 గంటలకు కొత్తకొండ జాతర నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమీక్ష కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారు. కాగా, గతంలో ఈ విధమైన సమావేశాలు స్థానికంగా ఆలయాల్లోనే నిర్వహించినప్పటికీ ప్రస్తుతం కలెక్టర్ రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇతర సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి ఉన్నందున వేదికను కలెక్టరేట్కు మార్చినట్లు సమాచారం.రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలువర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన మంద కొమ్మాలు, రాము తండ్రి కొడుకులు. పాలకుర్తి మండలం రంగరాయిగూడెంలో తమ బంధువుల ఇంట్లో శుభ కార్యానికి వారు బైక్పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేటలోని వరంగల్–జఫర్గఢ్ ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతి వేగంతో వస్తున్న బొలేరో వాహనం బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. శివరామపురంలో చోరీరాయపర్తి: మండలంలోని శివరామపురంలో దొంగలు హల్చల్ చేశారు. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావు రాజిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 18న వేములవాడకు వెళ్లాడు. దుండగులు గురువారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.6.10 లక్షల నగదుతోపాటు తులం బంగారం చోరీ చేసినట్లు తెలిపారు. ఇటీవల ప్లాట్ విక్రయిస్తే వచ్చిన డబ్బులను ఇంట్లో దాచిపెట్టినట్లు బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్.. అంబులెన్స్ డ్రైవర్పై కేసు రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్కు చెందిన అంబులెన్స్ డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్స్ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
వరంగల్
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కోరారు. కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ కేయూ క్రీడామైదానంలో ప్రారంభించారు.సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. 11.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 9.8 డిగ్రీల సెల్సియస్ మధ్య శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో 8.4 డిగ్రీలు, 9.2 డిగ్రీలు, 8 డిగ్రీలు, 6.8 డిగ్రీలు, 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం నమోదవుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, రాత్రి వేళ అవసరముంటేనే బయటకు రావాలని సూచించింది. ఉన్ని దుస్తులకు డిమాండ్..చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలి
ఖిలా వరంగల్: ఆయిల్పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్పామ్ విస్తరణ పథకాన్ని జిల్లాలో అమలు చేయాలని, కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. రైతులను గుర్తించి అయిల్పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలపై అవగాహన కల్పించి సాగుకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించి అయిల్పామ్ సాగు లాభాలను రైతులకు వివరించి, సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. ఎరువులు తీసుకునేటప్పుడు ఆధార్కార్డు తప్పనిసరిగా చూపించాలని, కౌలు రైతులు భూయజమాని పట్టాదారు పాస్బుక్ (పీపీబీ) నంబర్ నమోదు చేయాలని చెప్పారు. యజమాని మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకున్న తర్వాత తమ ఆధార్ నంబర్, పేరు, తండ్రి పేరు నమోదు చేయాలని, తమ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని వెరిఫై చేసిన అనంతరం యూరియా బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మండల క్లస్టర్స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, ఆయిల్పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలివరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అఽధికారులనుఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేందుకు చేపట్టాల్సి న తక్షణ చర్యలపై అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్లోని టీజీ ఐసీసీసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్డీఎంఏ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మాక్ ఎక్సర్సైజ్ ఆవశ్యకత గురించి వివరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై అప్రమత్తతను పెంపొందించేందుకు మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో విజయలక్ష్మి, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఎస్డీఆర్ఎఫ్, పశుసంవర్థక, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్్ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్ అనుబంధం) టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈది వెంకట రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశికుమార్ తెలిపారు. హనుమకొండలో గురువారం జరిగిన యూనియన్ ఎన్పీడీసీఎల్ కార్యవర్గ సమావేశంలో వెంకటరమణను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను ఎన్నుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు ఆర్.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులకు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీబీ నిర్మలా గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ప్రముఖ న్యాయవాది రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఎలుకల సంచారం ఘటనను మానవహక్కుల సంఘం (హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. పిల్లల వార్డులో తల్లులతోపాటు శిశువులు సైతం గాయాలపాలైన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, పరిశుభ్రత గురించి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎలుకలు ఆస్పత్రి వార్డులోనే కాకుండా కారిడార్లు, శిశువుల ఊయల దగ్గర కూడా తిరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో ఎలుకలు తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కిస్ట్రినా జడ్చోంగ్త్ను ఆయన కోరారు. -
ప్రయోగాలకే పరిమితం!
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్లు మారిన ప్రతీసారి వారు అమలు పారిశుద్ధ్య నిర్వహణ విధానాలూ మారుతున్నాయి. ఒక కమిషనర్ రూపకల్పన చేసిన విధానాలను మరో కమిషనర్ లెక్క చేయడం లేదనే ఆరోపణ లున్నాయి. వీరి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా అమల్లో ఉన్న నిబంధనలకు పదును పెట్టి మరిన్ని ఫలితాలు సాధించాలి. కానీ, రూ.కోట్లు వెచ్చించి చేసిన ప్రయోగాలు విఫలమవుతున్నాయి. 2012 నుంచి అదే వరుస.. సుప్రీం కోర్టు 2001లో చెత్త ప్రక్షాళన నిబంధనావళి (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) మార్గదర్శకాలను జారీ చేసింది. 2012 అక్టోబర్ 10–17 తేదీల్లో అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ క్లిన్ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెత్త రెడ్యూస్, రీయూజ్, రీ సైక్లింగ్ చేపట్టారు. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ చేపట్టారు. డస్ట్బిన్ లెస్ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలను జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టగలిగారు. బాలసముద్రంలో బయోగ్యాస్ గ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు నెలకొల్పారు. విద్యుత్తోపాటు సేంద్రియ ఎరువు ఉత్పత్తికి అంకురార్పణ చేశారు. ఈనేపథ్యంలో నగరానికి పెద్ద ఎత్తున అవార్డులు, ప్రశంసపత్రాలు లభించాయి. దేశ వ్యాప్తంగా నగరాల దృష్టి వరంగల్పై పడింది. ‘క్లీన్ సిటీ.. అగ్లీ సిటీగా మారింది’ 2013 తర్వాత అది కాస్తా తిరోగమన దిశగా పయనించింది. కమిషనర్గా జి.సువర్ణ పండాదాస్ వచ్చారు. నగరంలో క్లిన్సిటీ వాస్తవ పరిస్థితులను పరిశీలించి క్లిన్సిటీ అగ్లీసిటీగా మారిందన్నారు. విజయవాడలో రూపొందించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రూపొందించాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త కాకుండా అంతా సేకరించాలని ఆదేశాలిచ్చారు. నగర వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని, డస్ట్బిన్ డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో క్లిన్సిటీ నిర్ణయాలు నిరూపయోగమయ్యాయి. మారుతున్న కమిషనర్లు, ప్రణాళికలు తొలుత తోపుడు బండ్లు, రిక్షాలు, ఇప్పుడు స్వచ్ఛ ఆటోలు ఇలా.. కమిషనర్లు మారినప్పుడల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పొడి చెత్త సేకరణ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. డీఆర్సీసీ సెంటర్లు మాత్రం విజయవంతంగా నడుస్తున్నాయి. రోడ్ల వెంట డస్ట్ బిన్లకు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారు. ఇవి మచ్చుకు కూడా కనిపించట్లేదు. వరంగల్ గోపాలస్వామి దేవాలయం బస్ స్టాప్, హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కరీంనగర్ రోడ్డులోని పోలీస్ కమిషనరేట్ ప్రహరీ పక్కన రూ. 17లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన భూగర్భ డస్ట్ బిన్లు కాలగర్బంలో కలిపోయాయి. వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లోని బల్దియా షెట్టర్లలో ఆర్గానిక్ కంపోస్ట్ ఎరువు పరికరాలు రూ.11 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఇవీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఫలితాలు నామమాత్రం విధానాల మార్పుతో ప్రజాధనం దుర్వినియోగం గ్రేటర్ కమిషనర్లది ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు -
రైతులకు యూరియా కష్టాలు
ఐనవోలు: మండలంలోని రైతులకు యాసంగిలో యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయి. గురువారం కక్కిరాలపల్లి గ్రామంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కు 200 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు తెల్లవా రక ముందే సెంటర్కు చేరుకుని క్యూలో నిల్చున్నారు. గ్రామ పంచాయతీ వద్ద చిట్టీలు ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో సుమారు 300 మంది రైతులు పరుగెత్తుకుంటూ వెళ్లి క్యూలో నిల్చున్నారు. నిర్వాహకులు ఒక్కరికి ఒక బస్తా యూరియా టోకెన్ రాసిచ్చారు. అందరికీ చిట్టీలు అందకపోవడంతో సుమారు వంద మంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. 60 టన్నులకు డబ్బులు కడితే 10 టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, రెండు రోజుల్లో మరో లోడ్ యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి యూరియా పంపిణీని ప్రారంభించి పూర్తి చేశారు. యూరియాతోపాటు ఇతర మందులు బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా రూ.280కి రావాల్సి ఉండగా.. రూ.410 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సైన్స్ ఫెయిర్కు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో శుక్ర, శనివారాల్లో విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వికసిత్భారత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా శాస్త్రసాంకేతికత, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయి. ఏడు ఉప అంశాలతో ఎగ్జిబిట్లు జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో ఉప అంశాల ఎగ్జిబిట్లు ఉంటాయి. సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికత, గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ అనే ఏడు ఇతివృత్తాల అంశాలతో విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. 300 మంది విద్యార్థులు తమ గైడ్టీచర్లతో హాజరుకానున్నారు. ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. ఒక్కో విద్యార్థి కేంద్ర ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా రూ.10 వేల చొప్పున అవార్డు పొందారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ ఎగ్జిబిట్లు, గైడ్ టీచర్లతో సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్కు చేరుకున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనకు సంబంధిత ఉపాధ్యాయ కమిటీల వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలరకు 170 మంది సైన్స్ ఫెయిర్కు, 70 మంది ఇన్స్పైర్ ఎగ్జిబిట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎగ్జిబిట్ల కోసం గదులను కేటాయించారు. మిగిలిన విద్యార్థులు కూడా శుక్రవారం ఉదయం వరకు చేరుకుంటారు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు : డీఈఓ జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంఽధించిన వివరాలను వెల్ల డించారు. సైన్స్ఫెయిర్లో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈనెల శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యావైజ్ఞానిక ప్రదర్శనల ప్రారంభోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు హాజరవుతారని వివరించారు. 20న సాయంత్రం ముగింపు కార్యక్రమంలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థుల ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి కూడా ఎంపిక చేస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపితే జాతీయ స్థాయి ప్రదర్శనలకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపా రు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు 15 కమిటీలు ఏర్పా టు చేశామని, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓలు నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎసదానందం, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్ అఽఽధినేత నారాయణరెడ్డి, వడుప్సా అధ్యక్షుడు సతీష్కుమార్, బాధ్యులు ముక్తీశ్వశ్వర్రావు ,శ్రీకాంత్రెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.నరేందర్నాయక్ పాల్గొన్నారు. నేడు, రేపు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్న విద్యార్థులు హనుమకొండ సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో ఏర్పాట్లు -
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు నాగయ్య ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనంను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ ప్రతిభ, ఆర్ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, సురేశ్, దామోదర్యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్ఫత్, ఎండీ చాంద్పాషా, మహ్మద్ ముగ్ధుం పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ అభివృద్ధి పనులు ప్రారంభం -
నిఘా నీడలో కలెక్టరేట్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో భద్రతా నిఘాను కలెక్టర్ మరింత కట్టుదిట్టం చేశారు. అధికారుల విధి నిర్వహణతోపాటు కలెక్టరేట్కు వచ్చిపోయే వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రాంగణమంతటా సీసీ కెమెరాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గతంలో ప్రధాన ప్రాంతాలు, రోడ్ల వెంట వచ్చేపోయే వారిని గమనించేందుకు సుమారు 30 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా.. తాజా ఏర్పాట్లతో మొత్తం సీసీ కెమెరాల సంఖ్య 78కి పైగా చేరనున్నట్లు సమాచారం. కలెక్టరేట్ చుట్టూ పరిసరాలకే పరిమితం కాకుండా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్ఓ చాంబర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది కార్యాలయాలు వంటి కీలక విభాగాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా కూడా నిఘా వ్యవస్థను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఆదర్శంగా కలెక్టర్ నిర్ణయం నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే విషయంలో కలెక్టర్ తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పైస్థాయి నుంచి క్రమశిక్షణ మొదలవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. ఇక ఆలస్యానికి తావులేదు.. కలెక్టరేట్లోని కొన్ని విభాగాల్లో సిబ్బంది సమయపాలనపై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాత విధులకు హాజరుకావడం, సాయంత్రం త్వరగా కార్యాలయాలు విడిచిపెట్టడం వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పర్యవేక్షించాల్సి న కొంతమంది అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఘాను మరింత కట్టుదిట్టం చేయడంతో ఇటువంటి వ్యవహారాలకు ఇక చెక్ పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు తదితర క్రమశిక్షణ చర్యలతో గాడిన తప్పిన వ్యవస్థను సరిచేస్తున్న కలెక్టర్.. తాజా నిఘా చర్యలతో పనితీరును మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఉద్యోగుల సమయపాలన కూడా గాడిన పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ చాంబర్లలోనూ సీసీ కెమెరాలు అధికారుల విధులు, కార్యాలయానికి వచ్చివెళ్లే వారిపై పర్యవేక్షణ -
‘పంచాయతీ’పై పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 333, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్ 332, బీఆర్ఎస్ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు. వెన్నుపోట్లు, రెబల్స్.. అధిష్టానాలు సీరియస్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధిష్టానం కూడా భవిష్యత్లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి? ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికలో ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోట్లు.. రెబల్స్గా బరిలో నెగ్గిన పలువురు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు -
మరుగుదొడ్లను పట్టించుకోరా?
● నిర్వహణ సక్రమంగా ఉండాలి ● నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రూ.లక్షలు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం.. వృథాగా వదిలేస్తే ఎలా అంటూ నగర మేయర్ గుండు సుధారాణి ప్రజారోగ్య విభాగం అధికారులను మందలించారు. గురువారం వరంగల్ ఫైర్ స్టేషన్ను ఆనుకొని ఉన్న పబ్లిక్ టాయిలెట్ల స్థితిగతులను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం కేటాయించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని పేర్కొన్నారు. అనంతరం పోతననగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు. ఎన్ని కంటైనర్లు పనిచేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. కంటైనర్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరించాలని, ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని, ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు పసునూరి భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు. -
మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దగ్గరుండి చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
బీజేపీ కార్యాలయం ముట్టడి
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం వద్ద గల బీజేపీ జిల్లా కార్యాలయాన్ని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ముట్టడించారు. కేంద్రంలోని మోదీ సర్కారు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీపై అక్రమంగా కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, శ్రీకేడీ మోదీశ్రీ అంటూ నినదించారు. వరంగల్ నగరంతోపాటు గీసుకొండ మండలం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ జెండాలతో తరలివచ్చి ముందుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లేదారిలో ధర్నా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ పాల్గొన్నారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో కారులో అటుగా వెళ్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్రెడ్డి అక్కడ ఆగి తన వాహనాన్ని పార్టీ కార్యాలయం వైపు తిప్పి ధర్నా చేస్తున్న వారి వద్ద హారన్ మోగించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది గమనించిన బీజేపీ కార్యాలయంలోని ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరు పార్టీల వారు తోపులాటకు దిగడంతో గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ సిబ్బందితో వెళ్లి వారిని చెదరగొట్టారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కార్యాలంలోకి వెళ్లిపోగా , కాంగ్రెస్ నాయకులు కొంత సేపు నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్య నాయకులను గీసుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా వారు నినాదాలు చేస్తూ మోదీ సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు మాట్లాడారు. నాయకులు నల్లగొండ రమేశ్, గుండేటి నరేందర్, బస్వరాజు శ్రీమాన్, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీసం సురేందర్రెడ్డి, సిల్వేరు శ్రీనివాస్, దుపాకి సంతోష్, కూసం రమేశ్, కరాటే ప్రభాకర్, మన్నె బాబూరావు, పరమేశ్వర్, గోరంట్ల రాజు, దూలం సంపత్, సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. కార్యాలయ ముట్టడి నీతిమాలిన చర్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించడం, ఆందోళన చేసి దాడులకు పాల్పడటం నీతిమాలిన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మోదీ సర్కారు తీరుపై నిరసన పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలతోపాటు పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రెండు పార్టీల నాయకులతో తీవ్ర ఉద్రిక్తత ఆందోళనకారులను చెదరగొట్టి శాంతింపజేసిన పోలీసులు -
అంతర్మథనం
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎక్కడెక్కడ ఏ పార్టీ స్థానాలు ఎన్నంటే.. పంచాయతీలు 316కాంగ్రెస్ 198 ఇతరులు ½BÆŠ‡-G‹Ü˘ 9916 నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 23 పెద్ద పంచాయతీలుంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 11 స్థానాలను దక్కించుకుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో నాలుగు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ దక్కించుకుంటే, బీఆర్ఎస్ సైతం మూడింటిని సొంతం చేసుకుంది. రాయపర్తి మండలంలో మూడింటిలో కాంగ్రెస్, ఒకచోట బీఆర్ఎస్ రెబల్, మరొక చోట స్వతంత్రులు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం చేసినా పెద్ద పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సంగెం మండలంలోని తొమ్మిది పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ మూ డు, బీజేపీ ఒకటి గెలుచుకుంది. గీసుకొండ మండలంలోని రెండు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం అయినా.. తప్పని తర్జనభర్జన పల్లె పోరులో బీఆర్ఎస్ పట్టుపై హైరానా సవాల్గా మారనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పంచాయతీ ఫలితాలపై ముఖ్యనేతల పోస్టుమార్టంసాక్షి, వరంగల్: జిల్లాలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కొత్త పంచాయితీ తీసుకొచ్చినట్లైంది. 316 పంచాయతీ లకు 198 స్థానాలు దక్కించుకున్నా.. ఏ మాత్రం ప్రభావం లేదని చెప్పిన బీఆర్ఎస్ కూడా 98 స్థానాలు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఎక్కడ లోటుపా ట్లు జరిగాయనే విషయాలపై పోస్టుమార్టం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వార్ వన్సైడ్ ఉండేలా చేసేందుకు ఏం చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని గ్రామాల్లో ఈసారి ఎలా సత్తా చాటాలనే అంశాలపై, పార్టీల గుర్తులపై జరిగే ఈ పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి కూడా ఫలితాలపై అభిప్రాయాలు తీసుకొని పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి మండలాల్లోని 51 స్థానాల్లో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 17, ఒకటి బీజేపీ బలపరిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు గెలిచా రు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినా.. ఇక్కడ బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యనేతలు లేకున్నా కూడా గులాబీ పార్టీ ప్రదర్శన బాగుండడంతో ఎక్కడ లోటుపాట్లు జరిగాయని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. మాజీ ఎమ్మెల్యే అరూరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టించుకునే నాయకుడు లేకున్నా పల్లెపోరులో మెరుగైన ఫలితాలు రావడం కాంగ్రెస్కు షాక్. నర్సంపేట నియోజవకర్గంలోని 172 స్థానాల్లో 105 పంచాయతీల్లో కాంగ్రెస్, 66 స్థానాల్లో బీఆర్ఎస్, ఒక స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా.. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో 63 స్థానాల్లో 33 పంచాయతీలు కాంగ్రెస్, 27 పంచాయతీలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు 72 కాంగ్రెస్, 33 బీఆర్ఎస్, నాలుగు ఇతరులు గెలుచుకున్నారు. మొత్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకున్నా, ఇక్కడ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకోవడంతో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారంతో జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు సొంతం చేసుకుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. జిల్లా మొత్తంగా బీఆర్ఎస్కు 99 స్థానాలొస్తే ఈ నియోజకవర్గంలోనే 60 స్థానాలు ఉండడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల్లో 53 పంచాయతీల్లో 37 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. సంగెం మండలంలో 10 స్థానాలు నెగ్గిన బీఆర్ఎస్, గీసుకొండలో మూడింటికి మాత్రమే పరిమితమైంది. గీసుకొండ మండలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సొంతూరు వంచనగిరి ఉండడంతో ఎప్పటి నుంచో వారి ప్రాబల్యం ఉండడం హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఎమ్మెల్యే రేవూరి కూడా పల్లెల్లో ఎన్నికల ప్రచారం చేయడం, కొన్నిచోట్ల అభ్యర్థులు వర్గాలుగా పోటీచేసినా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 40 పంచాయతీ ల్లో 27 స్థానాల్లో కాంగ్రెస్, తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్, నలుగురు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో బీఆర్ఎస్ ప్రదర్శన లేదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ మండలంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో అధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో జోష్ ఉంది.పెద్ద గ్రామ పంచాయతీల్లో ఇలా.. మూడు విడతల్లో కలిపి జిల్లాలోని పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 46 పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ 26 స్థానాలు గెలిస్తే, బీఆర్ఎస్ 17 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ రెబల్ ఒకటి, బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఒకటి కై వసం చేసుకున్నారు. -
ఇక కొరతలేకుండా యారియా
ఖిలా వరంగల్: రైతులకు అవసరమయ్యే యూరియాను ముందుగా బుక్ చేసి తెచ్చుకునేలా వ్యవసాయ శాఖ కొత్త యాప్ను అందుబాటులోకి తెస్తోంది. వానాకాలంలో యూరియా కోసం రైతులు బారులుదీరి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అవసరం మేరకు యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలు చేశారు. పలువురు డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్టవేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్త బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తికాగా, జిల్లాల వారీగా వ్యవసాయాధికారులతోపాటు డీలర్లు, రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలో పంటల సాగు.. జిల్లాలో యాసంగి సీజన్ మొదలైంది. పంటల సాగు నెమ్మదిగా ముందుకెళ్తోంది. 2025–26 యాసంగి పంట, విత్తనాలు, ఎరువులు లభ్యత, అమ్మకాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట 26,510 ఎకరాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనా, అందుకు అవసరమైన వరి విత్తనాలు 23,040 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల్లో సాగు అంచనా, అందుకు అవసరమైన 8,680 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యాసంగి పంట కాలానికి సంబంధించి అక్టోబర్ 2025 నుంచి నేటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో సరఫరా చేశారు. మార్కెఫెడ్ 4,240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 4,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్లో బుక్ చేసుకొంటే నేరుగా మీకు యూరియా అందుతుంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈనెల 20 నుంచి అమల్లోకి తెస్తుంది. విడతల వారీగా సరఫరా.. రైతులు యాప్ను మొబైల్ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి డైన్లోడ్ చేసుకొని ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదు ఎకరాల్లోపు ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాలున్న రైతులు మూడు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ 48 గంటలు మాత్రమే.. వ్యవసాయ శాఖ యాప్లో బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ లోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్లాట్లోకి వెళ్తుంది. ఈ యాప్లో జిల్లా మొత్తంలో పీఏసీఎస్, ఫర్టిలైజర్స్లో యూరియా ఎక్కడెక్కడ ఎంత అందుబాటులో ఉందనే సమాచారం అధికారులు, రైతులు తెలుసుకోవచ్చు. పాస్ పుస్తకంతో నమోదు యాప్లో పట్టాదారు పాసుపుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఇది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఏ పంట వేశారనే వివరాలతోపాటు పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్, లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం రైతుకు కల్పిస్తారు. ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే యూరియా అందజేత ఈనెల 20 నుంచి జిల్లాలో నూతన విధానం అమలుఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్ గీసుకొండ: రైతులకు సకాలంలో ఎరువులు అందేలా, విక్రయ కేంద్రాల్లో బారుల వద్ద రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించిందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొనాయమాకుల రైతు వేదిక నుంచి ఏఈ ఓలు, ఎరువుల డీలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక నుంచి ఈ ప్రత్యేక యాప్ ద్వారానే ప్రభుత్వం ఎరువులను అందిస్తుందన్నారు. పట్టాదారు పాస్పుస్తకం ఉన్నవారు నేరుగా పట్టా నంబర్తో, లేని వారు ఆధార్కార్డు ద్వారా యాప్లో లాగిన్ అవ్వాలన్నారు. ఎరువుల ను తీసుకునే క్రమంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరి యా, తదితర ఎరువులను విడతల్లో తీసుకోవాలని, ఎన్ని బస్తాలు వస్తాయో స్వయంగా యాప్ లెక్కచెబుతుందన్నారు. ఎకరం వరకు మొత్తం బస్తాలను ఒక వాయిదాలో, 5 ఎకరాల వరకు రెండు వాయిదాల్లో, 5 నుంచి 20 ఎకరాల వరకు మూడు వాయిదాల్లో, 20 ఎకరాల పైన నాలుగు వాయిదాల్లో ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఒక విడత ఎరువులను తీసుకున్న తర్వాత మళ్లీ 15 రోజుల తర్వాతే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో డీలర్ల నుంచి ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఆలస్యం చేస్తే బుకింగ్ రద్దు అవుతుందన్నారు. -
మైసంపల్లి సర్పంచ్గా న్యాయవాది..
● తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు.. కొడుకు సర్పంచ్దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామ సర్పంచ్గా న్యాయవాది వేముల ఇంద్రదేవ్ ఎన్నికయ్యారు. ఇంద్రదేవ్ తండ్రి వేముల సారంగం చాలాఏళ్లుగా గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఇంద్రదేవ్ గత కొంతకాలంగా వరంగల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికలు రావడం, రిజర్వేషన్ అనుకూలించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఇంద్రదేవ్ బరిలోకి దిగి ప్రత్యర్థిపై 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుంచి సర్పంచ్ సీటులో కొడుకు ఇంద్రదేవ్ ఆసీనులు కానుండగా ఆయన తండ్రి సారంగం పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయనున్నారు. అయితే సారంగం మాట్లాడుతూ ప్రజలు అందించిన పదవితో తన కుమారుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తాను మాత్రం గ్రామ ప్రజలకు సేవచేసే కార్మికుడిగానే పనిచేస్తానని చెప్పాడు. ఇంద్రదేవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యారంగంలో విషయంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా పనిచేయడంతో పాటు ప్రజలందరికీ న్యాయ బద్దంగా పాలన అందిస్తానని చెప్పారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యార్థులు, యువత క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలని, సీనియర్ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు అంతరించి పోతున్న ప్రాచీన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఆదేశించారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మిచిన మున్నూరు కాపు సంఘ భవనం (మహిళా కమ్యూనిటీ హాల్)ను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లును నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియాకమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్ స్థానిక కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంత్రి నూతన వస్త్త్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ ప్రతిభ, ఆర్ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, బోగి సురేశ్, దామోదర్యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్పాత్, ఎండి చాంద్పాషా, మహ్మద్ ముగ్ధుం, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు వరంగల్: జిల్లాలో మూడు దశలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకంగా పని చేసిన పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్య శాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా హెల్త్ శాఖ, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ, డీఆర్డీఏ అధికారులతో సహా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా, సమగ్రంగా కవరేజ్ అందించిన ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బాల మాయాదేవి, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు సునయానా చౌహాన్లను పరిశీలకులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామప్పలో సెంట్రల్ రైల్వే కమిషనర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం సెంట్రల్ రైల్వే సీనియర్ కమిషనర్ (ఆర్పీఎఫ్) సీహెచ్ చిత్రేష్ జోషి సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
● సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు. గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. గురువారం వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఖిలా వరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహయ కార్యదర్శి నలిగంటి రత్నమాల ఆధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న రామసందీప్ తదితరులకు నాగయ్య పూలమాలలు వేసి రిలే నిరహర దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. గుడిసె వాసుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య, బెజ్జూల కోటేశ్వర్, ఉసిల్లకుమార్, భవాని, జ్యోతి, కృష్ణ, సంపత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘పోయేకాలం వచ్చింది’.. కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్
స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్పై తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి రాజకీయ నైతికతను పూర్తిగా కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.“రామా.. కృష్ణా అనుకుంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు” అంటూ రాజయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచి, అదే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలో అనేకసార్లు తాను కాంగ్రెస్లో చేరానని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. “నీ నీతిమాలిన మాటలతో సభ్య సమాజమే సిగ్గుపడుతోంది” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల వద్దకే వెళ్లిపోతావా అని ప్రశ్నించారు. ప్రజలకు తన రాజకీయ వైఖరిని ఎలా సమర్థించుకుంటావని నిలదీశారు.అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. “సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి” అంటూ కడియం శ్రీహరికి హితవు పలికారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అడుగుపెడితే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన రాజయ్య, ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు. -
వెబ్కాస్టింగ్తో పోలింగ్ పరిశీలన
న్యూశాయంపేట: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడతలో నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో గుర్తించిన 110 సెన్సిటివ్, 282 క్రిటికల్ కేంద్రాల పోలింగ్, కౌటింగ్ ప్రక్రియను పర్యవేక్షించినట్లు తెలిపారు. అలాగే, నాలుగు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్తా చాటిన నిట్ విద్యార్థులు ● అభినందించిన నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్త్స్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్ధర్, రాజ్శేఖర్సింగ్, దృవ్ కర్నాకర్లు ది సిక్త్స్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 2017లో ప్రారంభమైన హ్యాకథాన్ నేడు భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థకు వేదికగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా 1,500కుపైగా కళాశాలల నుంచి లక్షకుపైగా విద్యార్థులు పాల్గొన్నట్లు, 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్ఫైనల్కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ప్రథమ స్థానంతోపాటు రూ.1.50 లక్షలు నగదు అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు విజయవంతం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని, ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచి కమిషనరేట్ పరిధిలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించామని, గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా రూ. 6.74 లక్షలు, 128 కేసుల్లో రూ.12.42 లక్షల విలువైన మద్యం సీసాలు, 49 కేసుల్లో రూ.1.27 లక్షల విలువైన 343 లీటర్ల గుడుంబా, రూ.1.23 లక్షల విలువైన గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన 156 తుపాకులు స్వాధీనం చేసుకుని గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీపీ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. జనగామ జిల్లాలోని, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎన్నికల తీరుతెన్నులను అధికారులతో కలిసి సమీక్షించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలిచ్చారు. సీపీ వెంట వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలన -
హస్తం హవా
72 స్థానాల్లో కాంగ్రెస్, 33 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయంమూడో విడతఖానాపురం: బుధరావుపేటలో సంబురాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలుసాక్షి, వరంగల్: పంచాయతీ మూడో విడత పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 109 పంచాయతీల్లో 72 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. 33 మంది బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండలంలో 30 పంచాయతీలకు 22 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఏడు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ 6 మేజర్, పెద్ద పంచాయతీల్లో పాగా వేయడం కాస్త ప్రతికూలమనే చర్చ జరుగుతోంది. చెన్నారావుపేట, పాపాయ్యపేట, జల్లీ, లింగగిరి, తిమ్మరాయినిపహాడ్ మేజర్, ఎక్కువ ఓటర్లున్న గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ముఖ్యంగా చెన్నారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నా.. సర్పంచ్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే దొంతి సొంతూరు అమీనాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ధారా రజిత విజయం సాధించడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలవగా, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని పెద్ద పంచాయతీల్లో హస్తం పైచేయి సాధించింది. వరుసగా రెండోసారి విజయం.. నర్సంపేట మండలం భోజ్యానాయక్ తండాలో తాజా మాజీ సర్పంచ్ భూక్యా లలిత మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీచేసి 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈమెకు 355 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా రోజాకు 341 ఓట్లు వచ్చాయి.సింగిల్ డిజిట్ మెజార్టీతో గెలిచిన సర్పంచ్లు.. ● నర్సంపేట మండలం జీజీఆర్పల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన భూస నరసయ్య ఒక్క ఓటుతో గెలిచారు. ఈ గ్రామంలో 453 ఓట్లు ఉండగా 421 మంది ఓటేశారు. వీటిలో భూస నరసయ్యకు 191 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కత్తుల కుమారస్వామి (బీఆర్ఎస్)కి 190 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే, కుమారస్వామి రీకౌంటింగ్కు పట్టుబట్టగా అధికారులు మళ్లీ ఓట్లు లెక్కించగా యథావిధిగానే వచ్చాయి.. ● ఖానాపురం మండలం అయోధ్యనగర్ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ఈ గ్రామంలో 510 ఓట్లు ఉండగా 463 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో కూస విమలకు 226 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి ఎర్ర రజితకు 222 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శ్రీరామోజు ఉమకు 10 ఓట్లు పడ్డాయి. పోలైన ఓట్లలో తిరస్కరించిన ఓట్లు ఐదు ఉండడం గమనార్హం. ● నెక్కొండ మండలం మడిపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అజ్మీరా మంగ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ వెంకట్ ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు. పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ–0 ఇతరులు 1097233 మరిన్ని ఎన్నికల వార్తలు 8లోu మూడో విడత సర్పంచ్లు వీరే 9లోu ఖాతా తెరవని బీజేపీ, ఐదుచోట్ల స్వతంత్రుల జయకేతనంమూడో విడత ఎన్నికల ఫలితాలు ఇలా..మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు చెన్నారావుపేట 30 22 7 0 1 ఖానాపురం 21 12 9 0 0 నర్సంపేట 19 11 6 0 2 నెక్కొండ 39 27 11 0 1 -
పోలింగ్ ప్రశాంతం
మూడో విడత నాలుగు మండలాల్లో 88.21 శాతం నమోదుసాక్షి, వరంగల్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 946 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పొటెత్తారు.1,24,555 మంది ఓటర్లకు 1,09,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసుల భారీ భద్రత నడుమ 1,068 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,309 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఉదయం 7 నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిలుచున్న ఓటర్లకు అవకాశం ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు 22.26 శాతంతో మందకొడిగా ఉన్న 11 గంటల వరకు 58.65 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 77.58 శాతం, ఆ తర్వాత క్యూలైన్లలో నిలుచొని ఓటేసిన వారితో పోలింగ్ 88.21 శాతానికి చేరుకుంది. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, తిమ్మరాయినిపహాడ్, ఖానాపురం మండలంలోని ఖానాపురం, రంగంపేట, నర్సంపేట మండలంలోని లక్నెపల్లి, ఇటుకాలపల్లి, నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, అలంకానిపేట హరిత పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద ఓటర్లు ఫొటోలు దిగి సందడి చేశారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు పోలీసు నిషేధాజ్ఞలు ఉండడంతో అన్ని పార్టీల నేతలు అవతలే ఉండి తమ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. యువత, పురుషులు, మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు రావడంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు పడడం, ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇవీ మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. పురుషులు 88.47 శాతం.. మహిళలు 87.95 శాతం నాలుగు మండలాల్లో 60,987 మంది పురుషులకు 53,959 మంది, 63,561 మంది మహిళలకు 55,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.47 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.95 శాతం ఓటేశారు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. ఇతరుల ఓట్లు ఏడు ఉండగా ముగ్గురు మాత్రమే ఓటేశారు. మూడో దశ రెండో దశ తొలి దశ 88.11%88.21%86.52%మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు.. మండలం ఓటర్లు ఓటేసినవారు పోలింగ్ శాతం చెన్నారావుపేట 31,351 28,163 89.83 ఖానాపురం 27,139 23,815 87.75 నర్సంపేట 22,472 19,740 87.84 నెక్కొండ 43,593 38,152 87.52 మొత్తం 1,24,555 1,09,870 88.21 తొలి, రెండు దశలను మించి పెరిగిన ఓటింగ్ శాతం ఓటు వినియోగంలో మహిళల కన్నా పురుషులే ముందంజుఓటు హక్కు వినియోగించుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతినర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8వ వార్డులో సతీమణి శాలినిరెడ్డి, కుమారుడు అవియుక్త్రెడ్డితో కలిసి ఓటు వేశారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి అమీనాబాద్ గ్రామానికి వచ్చినట్లు అవియుక్త్రెడ్డి తెలిపారు. -
కమిషనరేట్లో ఎన్నికలు విజయవంతం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు మొత్తం 2 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహించారని, ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచి కమిషనరేట్ పరిధిలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించామని, గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా రూ. 6.74 లక్షలు, 128 కేసుల్లో రూ.12.42 లక్షల విలువైన మద్యం సీసాలు, 49 కేసుల్లో రూ.1.27 లక్షల విలువైన 343 లీటర్ల గుడుంబా, రూ.1.23 లక్షల విలువైన గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన 156 తుపాకులు స్వాధీనం చేసుకుని గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 432 కేసుల్లో మొత్తం 2,638 మందిని బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల సందర్శన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీపీ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. జనగామ జిల్లాలోని, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎన్నికల తీరుతెన్నులను అధికారులతో కలిసి సమీక్షించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలన -
హస్తం గెలిచి.. కారు నిలిచి
మూడో దశ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయంసాక్షి, ప్రతినిధి, వరంగల్: జిల్లాలో బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిస్తే.. బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువకాదంటూ గట్టి పోటీనిచ్చింది. ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని 68 పంచాయతీల్లో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. 22 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. బీజేపీ నాలుగు, స్వతంత్రులు ఐదు స్థానాల్లో నెగ్గారు. ఈ ఐదుగురు స్వతంత్రుల్లో శాయంపేట, పత్తిపాక, తెహరపూర్ పంచాయతీల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలోనే ఈ నాలుగు మండలాలు ఉండడంతో ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కాస్త సంతృప్తినిచ్చినా, బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపడం హస్తం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో అప్పటివరకు ఎక్కడ బలహీనంగా ఉన్నామో, అందుకు గల కారణాలు విశ్లేషించుకుని ముందుకెళ్లాలన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పట్టు నిలుపుకున్న డీసీసీ అధ్యక్షుడు ఆత్మకూరు: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి స్వగ్రామం ఆత్మకూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి గెలుపొందారు. మహేశ్వరి గెలుపు కోసం వెంకట్రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. తన మద్దతుదారు గెలవడంతో వెంకట్రామ్రెడ్డి అభినందనలు తెలిపారు. మహేశ్వరి గెలుపు సొంత గ్రామంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తొలి విజయమని ఆయన పేర్కొన్నారు. వసంతాపూర్లో లాఠీచార్జ్ శాయంపేట: మండలంలోని వసంతాపూర్ గ్రామంలో ఉపసర్పంచ్ను ఎన్నుకునే సమయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వసంతాపూర్లో 8 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. ఉపసర్పంచ్ను ఎన్నుకునే క్రమంలో ఇద్దరు అభ్యర్థులకు నలుగురు, నలుగురు చొప్పున ఓట్లు వేశారు. సర్పంచ్.. తన ఇంటి పక్కనే ఉన్న తౌటు శ్రీనును బలపర్చారు. మిగిలిన వార్డు సభ్యులతో సహా 150 మంది గ్రామస్తులు సర్పంచ్ హింగె భాస్కర్ ఇంటి ఎదుట ‘సర్పంచ్ డౌన్ డౌన్’ అంటూ ధర్నా చేశారు. దీంతో ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో చేరుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఇందులో వసంతాపూర్ ఎన్నికల ఇన్చార్జ్ కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్కు స్వల్ప గాయాలయ్యాయి.మూడో విడత ఫలితాలు..హనుమకొండ జిల్లాలో.. మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులుఆత్మకూరు 16 10 4 1 1 నడికూడ 14 08 06 0 0 దామెర 14 04 08 02 0 శాయంపేట 24 15 04 01 04 మొత్తం 68 37 22 4 5 దామెర మండలంలో బీఆర్ఎస్ జోరు, నడికూడలోనూ ప్రభావం శాయంపేట: 24 పంచాయితీల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పెద్దగా ప్రభావం చూపని భారతీయ జనతా పార్టీ -
మండలాల వారీగా పోలింగ్
33,557 28,43684.74 27,485 23,362 85.00నడికూడశాయంపేటఆత్మకూరుదామెర21,883 19,597 89.5528,416 24,844 87.43 -
మూడో విడత ప్రశాంతం
హన్మకొండ అర్బన్: జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 210 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఎన్నికయ్యాయి. ఇక అధికారికంగా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి. మూడో విడతలో 86.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో మొత్తం 1,11,341 మంది ఓటర్లు ఉండగా.. 96,239 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది పంచాయతీలు ఏకగ్రీవం జిల్లాలో మొత్తం 210 గ్రామ పంచాయతీలు, 1986 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తం 10 గ్రామ పంచాయతీలు పూర్తి పాలకవర్గంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 200 గ్రామ పంచాయతీలకు అధికారులు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. మొదటి విడతలో 69 జీపీలు, రెండో విడతలో 73 జీపీలు, మూడో విడతలో 68 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలు వెల్లడించారు. పోలింగ్, ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ గెలిచిన అభ్యర్థుల ఆనందోత్సాహాలను గ్రామాల్లో అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు. ప్రశాంతం.. జిల్లాలో మూడు విడతల ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొదటి నుంచి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై పక్కా ప్రణాళికతో పనిచేసింది. కలెక్టర్, ఆర్డీఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. నిత్యం పోలింగ్ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలను తనిఖీ చేయడం, అధికారులు సూచనలు చేయడం, పోలింగ్ రోజు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించడం వంటివి చేస్తూ యంత్రాంగంలో ఉత్సాహం నింపారు. మొత్తంగా టీం వర్క్గా పనిచేసి సక్సస్ అయ్యారని చెప్పొచ్చు. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం జిల్లాలో 86.44 శాతం పోలింగ్ సంబురాల్లో మునిగిన విజేతలు -
కల్పలత సూపర్ బజార్పై సమగ్ర దర్యాప్తు
హన్మకొండ: కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్ (కల్పలత సూపర్ బజార్)పై సమగ్ర దర్యాప్తునకు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఆదేశాలు జారీ జేశారు. ఈమేరకు ఆర్సీ నంబర్ 2518/2025–బి, తేదీ 17–12–2025తో ప్రొసీడింగ్ జారీ చేశారు. కల్పలత కో–ఆపరేటివ్ స్టోర్స్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరుపగా ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టం సెక్షన్ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తుకు జిల్లా సహకార అధికారి ఆదేశాలు జారీ చేశారు. పరకాల సర్కిల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్.శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. హన్మకొండ అర్బన్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న (శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి యం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేటలోని హెచ్ఆర్హెచ్, వరంగల్లోని కార్స్ ఫిన్టెక్, వెస్ట్ సైడ్, విజయ ఫర్టిలైజర్స్, హైదరాబాద్లోని నికోమాక్, హెట్రో ప్రొడక్షన్, గ్రోవెల్ ఫీడ్స్ కంపెనీల్లో టెలీకాలర్స్, రిటైల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్, ప్రొడక్షన్, మార్కెటింగ్ శాఖలోని 70 ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కాజీపేట అర్బన్: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25 పోటీల్లో నిట్ వరంగల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి సత్తాచాటారు. నిట్ వరంగల్ క్యాంపస్లోని డైరెక్టర్ కార్యాలయంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హ్యాకథాన్–25లో ప్రథమ స్థానంలో నిలిచిన ది సిక్స్త్ సెన్స్ టీంను అభినందించి మాట్లాడారు. జైపూర్లోని మణిపాల్ యూనివర్సిటీలో ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–25లో నిట్ వరంగల్కు చెందిన బీటెక్ విద్యార్థులు వత్సల్ సైనీ, కలాష్ జైన్, ముదిత్ శర్మ, రోమ సునీల్ధర్, రాజ్శేఖర్సింగ్, దృవ్ కర్నాకర్లు ది సిక్స్త్ సెన్స్ టీంగా పాల్గొన్నారు. 36 గంటల పాటు కోడింగ్ మారథాన్ పోటీల్లో నిట్ విద్యార్థులు గ్రాండ్ఫైనల్కు చేరుకుని ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. -
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
శాయంపేట: శాయంపేట, దామెర మండల కేంద్రాల్లో నిర్వహించిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మండల కేంద్రంలో పోలింగ్ సరళిని, ఓటింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. మండలంలో రెండు వేలకుపైగా ఓటర్లున్న గ్రామ పంచాయతీలు నాలుగు టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభమయ్యే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీఓ మేన శ్రీను, పరకాల ఆర్డీఓ నారాయణ, మండల ప్రత్యేక అధికారి జయంతి, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీశాయంపేట: మండలంలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను బుధవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయన వెంట ఏసీపీలు సతీశ్బాబు, సత్యనారాయణ, సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్, సిబ్బంది ఉన్నారు. -
నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి
సంగెం: నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయించాలని, లేదంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఓ నర్సింగం హెచ్చరించారు. మంగళవారం సంగెం మండలంలో పలు గ్రామాల్లోని విత్తన దుకాణాల్లో లైసెన్సులు, సోర్స్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్కులు పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలరు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వ్యాపారం చేయాలన్నారు. డీలర్లు కొనుగోలు చేసినవాటికి బిల్లులు కలిగి ఉండాలని, అమ్మిన వాటికి రైతులకు బిల్లులు ఇవ్వాలన్నారు. రైతులకు విస్తీర్ణం బట్టి విత్తనాలు ఇవ్వాలని అదనపు విత్తనాలు ఇవ్వద్దన్నారు. గడువు తీరిన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు షాపులో నిల్వ ఉంచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ కార్యాలయ అధికారులు దయాకర్, రంజిత్, సాగరిక, మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవిఖానాపురం: ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారదతో కలిసి పరిశీలించా రు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ఎన్నికలు విజయవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
తుది విడతకు సిద్ధం
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మంత్రి కొండా సురేఖను కలిసిన సర్పంచ్లు గీసుకొండ: మండలంలో సర్పంచ్లుగా గెలుపొందిన పలువురు రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని తన నివాసంలో రాంపురం, మనుగొండ, సూర్యతండా సర్పంచ్లు రడం భరత్, పేర్ల శ్రవణ్, బానోతు రాఘవేంద్రతోపాటు గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిషోర్రెడ్డి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లను మంత్రి శాలువాలతో సన్మానించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం గ్రామంలో భగీరథ నీటి కోసం గ్రామస్తులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. దళితుల అభ్యున్నతే లక్ష్యం వర్ధన్నపేట: పేదల అభ్యున్నతే లక్ష్యంగా మాస్ సంస్థ పనిచేస్తుందని వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్కుమార్, సంస్థ ప్రతినిధి డాక్టర్ సీనపల్లి విజయ్ కుమార్లు అన్నారు. మండలంలోని అంబేడ్కర్ నగర్ గ్రామానికి చెందిన బంక సుమాంజలి పాలిటెక్నిక్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువులో ప్రతిభ ఉన్నా.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబం కావడంతో మహా ఆదిసేవ సంస్థ సభ్యులు డాక్టర్ విక్రమ్కుమార్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం సంస్థ నుంచి రూ.20 వేలు విద్యార్థినికి అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ శివశంకర్, గాయాల సుమన్, తుమ్మల శ్రీధర్, చిలు ముల రవి, సూరాప్ నిరంజన్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలినర్సంపేట: పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు అన్నారు. ఈ మేరకు పట్టణంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, మండల అధ్యక్షుడు తనుగుల అంబేడ్కర్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ పార్లమెంటు సభ్యుడు అజ్మీర సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీను, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచందర్రెడ్డి, తడుక వినయ్, ఓరుగంటి మాధురిరాజు, నాయకులు కూనమల్ల పృద్వీరాజ్, మల్లయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. వలంటీర్లు అవగాహన కల్పించాలి వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం శానిటేషన్ తనిఖీలో భాగంగా వరంగల్లోని 25, 26వ డివిజన్లలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. ఆమె వెంట ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీ ఖలీల్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, ఏఈ హబీబ్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ అలీ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, వరంగల్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సంపేట డివిజన్లోని ఖానాపురం, చె న్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో మొత్తం 102 పంచాయతీలు, 890 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ, నెక్కొండలో మహేశ్వరీ గార్డెన్, ఖానాపురంలో జెడ్పీహెచ్ఎస్, చెన్నారావుపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. నేడు ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 102 పంచాయతీలకు 312 మంది, 890 వార్డుల కోసం 1,974 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు, దాడులు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడ గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రలోభాల ఎర ఆయా అభ్యర్థులు ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఓటర్లకు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. మంగళవారం రాత్రి నుంచి ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లతో పాటు చికెన్, మటన్ పంపిణీ చేస్తుండటంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. వలస ఓటర్లకు ఫోన్కాల్ చేసి రవాణా ఖర్చులు ఇస్తామని, గ్రామానికి వచ్చి ఓటు వేసి వెళ్లాలంటూ అభ్యర్థిస్తున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు రూ.6,50, 000ల నగదు, రూ.8,42,584 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నువ్వా..నేనా.. జిల్లాలో మొదటి, రెండో విడత ఎన్నికలు ఆసక్తి రేపగా మూడో విడతలో జరిగే మండలాల్లో పోటాపోటీగా ఉంది. తొలి దశ ఎన్నికల్లో 56 స్థానాలు కాంగ్రెస్ మద్ధతుదారులు, 26 స్థానాలు బీఆర్ఎస్ మద్ధతుదారులు, రెండో విడతలో 70 మంది కాంగ్రెస్ మద్ధతుదారులు, 40 స్థానాలు బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే న ర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపో టీ వాతావరణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అ మీనాబాద్ పంచాయతీ ఫలితం కూడా జనాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాబల్యం చూపాలంటే ఈ మండలాల్లో పంచాయతీల్లో మెరుగైన ఫలితాలు తీసుకురావా ల్సి ఉండగా, అంతేస్థాయిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపేందుకు ముఖ్యమైన గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం చేసి పైచేయి సాధించాలనుకుంటున్నారు. దీంతో మూడో ఎన్నికల ఫలితాలు జిల్లా అంతటా ఆసక్తిని రేపుతున్నాయి.మూడో దశ ఓటర్ల వివరాలు.. నిట్లో వర్క్షాప్ ప్రారంభం కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు మూడో విడత జీపీ ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ సత్యశారద 102 సర్పంచ్, 890 వార్డు స్థానాలకు ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు అమీనాబాద్ ఫలితంపై ఉత్కంఠగ్రేటర్లో చలిపంజాకు నిరాశ్రయుల విలవిల నైట్ షెల్టర్లపై అంతులేని నిర్లక్ష్యం దూర ప్రాంతాల్లో ఉండడంతో నిరుపయోగం మండలం పురుషులు మహిళలు ఇతరులు ఖానాపురం 13,571 14,403 4 చెన్నారావుపేట 15,747 16,124 1 నర్సంపేట 11,043 11,429 0 నెక్కొండ 22,698 23,734 2 మొత్తం 63,059 65,690 7 -
ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రాలు
నర్సంపేట: జిల్లాలో మూడో విడతలో జరగనున్న ఎన్నికలకు పలు పోలింగ్ కేంద్రాలను గ్రీన్ పోలింగ్ కేంద్రాలు గా సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆకుపచ్చని తోరణాలు, మామిడాకులు, రంగురంగుల ముగ్గులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సెల్ఫీపాయింట్ ఏర్పాటు చేశారు. నర్సంపేట మండలం లక్నెపల్లి, ఇటుకాలపల్లి, ఖానాపు రం మండలం ఖానాపురం, రాగంపేట, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, తిమ్మరాయినిపహాడ్, నెక్కొండలోని రెడ్లవాడ, అలంకానిపేట పోలింగ్ కేంద్రాలను హరిత కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. -
‘చలి’ంచరా?
వరంగల్ అర్బన్/కాజీపేట: విధి వక్రించి వీధిలో కాలం వెళ్లదీస్తున్నవారు కొందరు. యాచక వృత్తిలో జీవితాన్ని మోస్తున్నవారు ఇంకొందరు. దిక్కుమొక్కులేక ఫుట్పాత్లపై నిద్రించేవారు మరికొందరు. వీరంతా చలి విసురుతున్న పంజాకు విలవిల్లాడుతున్నారు. వీరికి ఆశ్రయం కల్పించాల్సిన బల్దియా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రంగా హోం లెస్ సెంటర్లు ఎక్కడో దూర ప్రాంతంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆరోపణలున్నాయి. కాగా, గ్రేటర్ మహా నగరంలో ఇలాంటి వారు వరంగల్లో 92 మంది, హనుమకొండ, కాజీపేటలో 38 మంది జీవిస్తున్నట్లు బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. హోంలెస్.. యూస్లెస్! నగరంలో యాచకులు 586 మంది ఉన్నట్లు అధికా రుల అంచనా. వీరికి భీమారంలోని పలివేల్పులలో 50 మంది చొప్పున ఆశ్రయం కల్పించి స్మైల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యం, ఉపాధిపై అవగా హన కల్పిస్తున్నారు. అదేవిధంగా వరంగల్, కాజీపే ట, హనుమకొండలో 130 మంది నిరాశ్రయులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి బల్దియా ఆధ్వర్యంలో పలివేల్పుల, వరంగల్ నగరంలోని ప్ర తాప్నగర్లో హోం లెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం రాత్రి పూట నిద్రించేలా, కాలకృత్యాలు తీర్చుకునేలా బల్దియా ఏర్పాట్లు చేసింది. 2 సెంటర్లు నామమాత్రమే మహా నగర పాలక సంస్థలోని పలివేల్పుల, వరంగల్ రైల్వే స్టేషన్, నెహ్రూ పార్కుకు ఎస్ఎన్ఎం క్లబ్ పక్కన హోంలెస్ సెంటర్లు నిర్మించారు. రెండేళ్లలోనే క్లబ్ పక్కన ఉన్న సెంటర్ను కూల్చేసి, గాంధీనగర్లోని అంబేడ్కర్ సెంటర్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు నైట్ షెల్టర్లు అందుబాటులో లేకపోవడం, సౌకర్యాలు నామామత్రమే కావడంతో నిరాశ్రయులు అక్కడికి వెళ్లేందుకు వ్యయప్రయాసాలతో కూడి ఉండడంతో ఆసక్తి చూపడం లేదు. ఈ సెంటర్ల నిర్వహణను ఆరేళ్ల కిందట ఎన్జీఓలకు అప్పగించారు. వరంగల్లోని సెంటర్ డాన్ బాస్కో, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి పలివేల్పుల సెంటర్ను లార్డ్ ఎన్జీఓలు ఐదేళ్ల పాటు ఈ సంస్థలకు నామమత్రపు సొమ్ముతో నిర్వహణ బాధ్యలు చేపట్టారు. ఏడాది క్రితం వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీరే ఈ సెంటర్లను నిర్వహించాలి. కానీ వీరు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొద్ది నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యాచక వృత్తిని నిర్మూలన కోసం ప్రత్యేక ఎన్జీఓలను నియమించింది. అందులో భాగంగా ప్రస్తుతం స్మైల్ ఎన్జీఓ యాచకుల జీవితాలు మార్చడానికి కృషి చేస్తోంది. యాచకులను గుర్తించి కేంద్రానికి తరలించి ముడు నెలల పాటు విద్య, వైద్యం, జీవనోపాధిపై కౌన్సెలింగ్ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోంది. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సమీపంలో, హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలో ఫుట్పాత్లపై పదుల సంఖ్యలో నిరాశ్రయులు, యాచకులు చలిలో విలవిల్లాడుతున్నారు. కనీసం కప్పుకోవడానికి సైతం చద్దర్లు లేక అలమటిస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. పోలీసులు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో తమ ను నిద్రపోనివ్వడం లేదని, పోకిరీలు తమను ఆటపట్టిస్తున్నారని..బల్దియా అధికారులు స్పందించి తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. కాగా, హోంలెస్ సెంటర్ల నిర్వహణపై మెప్మా టీఎంసీ రమేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయా కేంద్రాల్లో నిరాశ్రయులు రాత్రివేళల్లో ఉంటున్నారని, తెల్లవారుజామున వెళ్లిపోతున్నారని తెలిపారు. ‘నిరాశ్రయులకు జీవించే హక్కు ఉంది. వారికి అన్నపానీయాలతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలి’ అని 2010లో సుప్రీం కోర్టు ఆదేశించింది. బల్దియాలు బాధ్యత తీసుకుని నిరాశ్రయులకు నీరు, ఆహారం, మరుగుదొడ్డి, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలని సూచించింది. గ్రేటర్ వరంగల్ మహానగరంలో బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతీ ఏటా నిరాశ్రయులపై సర్వే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వందలాది మంది రోడ్ల వెంట, ఫుట్పాత్లపై నిద్రిస్తూ కనిపిస్తూనే ఉన్నారు. వారిపాలిట చలి యమపాశంలా మారింది. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఫుట్పాత్లపై కాలం వెళ్లదీస్తున్న వారంతా చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద ● డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలననర్సంపేట/నెక్కొండ: జిల్లాలో మూడో విడత ఎన్ని కలు పాదర్శకంగా, పటిష్టంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. చెన్నారావుపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ, నెక్కొండలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఏమైన సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితా, ముద్రలు, ఫారాలు తదితర ఎన్నికల సామగ్రి సమయానికి, పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. ఎ న్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు బాధ్యతతో పని చేసి ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసేలా సమన్వయంతో పనిచేయాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, సుమా, మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాలను అభివృద్ధి చేయాలి : ఎర్రబెల్లి
హన్మకొండ: నూతన సర్పంచ్లు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని స్వగృహంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్పర్తి మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్రావు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచ్లు ధైర్యంగా ఉండండి.. మీ వెనుక పార్టీ, కేసీఆర్, తాను ఉన్నాను.. ప్రజల పక్షాన కొట్లాడి నిధులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు. -
వైభవంగా మల్లన్న దృష్టి కుంభం
ఐనవోలు: జాతరకు ముందు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున దృష్టి కుంభం వైభవంగా జరిగింది. గర్భాలయంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15 వరకు సుధావళి వర్ణలేపనం పనులు పూర్తిచేశారు. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టి కుంభం ప్రక్రియను అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆర్జిత సేవలు, దైవదర్శనాలను పునరుద్ధరించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుఃసంక్రమణ పూజలు చేశారు. దృష్టి కుంభం ఇలా.. గర్భగుడికి ఎదుట ఉన్న మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నరాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి, కూష్మాండ బలి నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడు మ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నరాశి, అద్దం, మేకలపై పడేలా కుంభ హారతి ఇచ్చారు. ముగిసిన ప్రధాన ఘట్టం.. దృష్టి కుంభం నిర్వహిస్తే భక్తుల దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని తెలిపారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి అర్చకులు నందనం భాను ప్రసాద్, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్, నరేష్ శర్మ, మడికొండ దేవేందర్, పోషయ్య, ధర్మకర్తలు గడ్డం రేణుక శ్రీనివాస్, మహేందర్, కీమా, ఆనందం పాల్గొన్నారు. జాతరకు ముందు నిర్వహించిన తొలి ఘట్టం పూర్తి ఆలయంలో ఆర్జిత సేవలు, దర్శనాలు ప్రారంభం -
గ్రామాలను అభివృద్ధి చేయాలి
హన్మకొండ: నూతన సర్పంచ్లు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని స్వగృహంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్పర్తి మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్లను ఎర్రబెల్లి దయాకర్రావు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచ్లు ధైర్యంగా ఉండండి.. మీ వెనుక పార్టీ, కేసీఆర్, తాను ఉన్నాను.. ప్రజల పక్షాన కొట్లాడి నిధులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు. -
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం శానిటేషన్ తనిఖీలో భాగంగా వరంగల్లోని 25, 26వ డివిజన్లలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. వలంటీర్లు తడి, పొడి చెత్తను వేరుగా అందించడంపై అవగాహన కల్పిస్తున్నారా? వారికి కేటాయించిన ఇళ్లను సందర్శిస్తున్నారా? వంటి విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రెండు కాలనీల్లో పర్యటించి స్వచ్ఛ ఆటోల పనితీరును, 26వ డివిజన్ లక్ష్మీపురంలోని కమేలాను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న పనులు పరిశీలించారు. -
దివ్య ప్రార్థనకు అనువైన మాసం
హన్మకొండ కల్చరల్: ధనుర్మాసం దివ్య ప్రార్థనకు అనువైన మాసమని, ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేది ధనుర్మాస వ్రతమని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నందిహిల్స్లోని శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ధనుర్మాసవ్రత మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం దేవాలయ అర్చకుడు మరుగంటి రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు, తిరుప్పావై పాశుర విన్నపం, తీర్థగోష్టి నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సురేష్కుమార్, లక్ష్మారెడ్డి, సంస్కృత పండితుడు సముద్రాల శఠగోపాచార్య, మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ధనుర్మాస పూజలు ప్రారంభం నగరంలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం ధనుర్మాస పూజలు ప్రారంభమయ్యాయి. వరంగల్ బట్టలబజార్లోని శ్రీబాలావేంకటేశ్వరస్వామి దేవాలయం, గోపాలస్వామిగుడి, గోపాల్పూర్ సదాశివ కాలనీలోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి తదియారాధన నిర్వహించారు. హనుమకొండలోని అదాలత్ వెనుకగల శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, మచిలీబజార్లోని దొప్ప నర్సింహస్వామి, రెవెన్యూకాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి, హనుమకొండ రెడ్డి కాలనీలోని అభయాంజనేయస్వామి, ఎకై ్సజ్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి, కాజీపేట సిద్ధార్థనగర్ ప్రసన్నాంజనేయస్వామి తదితర దేవాలయాల్లో పాశురాలు చదువుతూ దీపాలు వెలిగించారు. తిరువారాధనం ఆరగింపు చేశారు. సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు నిర్వహించారు. -
వీకర్స్ కాలనీకి రోడ్డు వేయండి
వరంగల్: వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం ఎదుట ఉన్న వీకర్స్ కాలనీకి వెంటనే సీసీ రోడ్డు వేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను ఆదేశించినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రి క్యాంపు ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్లో కాలనీ వాసులు కలసి వినతి పత్రం అందించారు. తమ కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును స్థానిక కార్పొరేటర్ 2010లో సొసైటీ సభ్యులతో కుమ్మకై ్క పాట్లుగా చేసి అమ్ముకున్నారని మంత్రికి వివరించారు. ఆ రహదారిని మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్కు ఫోన్ చేసి రహదారిపై విచారణ జరిపించి అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలనీవాసుల కోసం రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. జంక్షన్ను అభివృద్ధి చేయాలి.. కాశిబుగ్గ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఈ రహదారిని అంబేడ్కర్ మార్గ్గా వాడుకలోకి తీసుకురావాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపకుడు జన్ను భాస్కర్, సలహాదారులు ఖల్నాయక్, ప్రధాన కార్యదర్శి వస్కుల విజయ్ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్కు మంత్రి సురేఖ ఆదేశాలు గ్రీవెన్స్కు ఫిర్యాదుల వెల్లువ -
కల్పలత కో–ఆపరేటివ్ సొసైటీలో కుంభకోణం
రామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రిజిస్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం, అందులో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉండడంపై ధ్వజమెత్తారు. ఈసందర్భంగా ఆయన కార్యాలయంలోని రిజిస్టర్, జమ, ఖర్చులు, తదితర రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ దృష్టికి.. గత పాలకుల సమయంలో సభ్యత్వ నమోదులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే నాయిని గుర్తించారు. సభ్యత్వ నమోదుకు చెల్లించిన రుసుము మొత్తాన్ని పక్కదారి పట్టించి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని తెలుసుకున్నారు. పాలకమండలి సభ్యులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించిన డీజిల్, పెట్రోల్ గడిచిన 3 ఏళ్లుగా చెల్లించలేదని, కో–ఆపరేటివ్ ఆధీనంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లో 10 మంది సిబ్బంది పేరుతో నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, వారి వివరాలు రిజిస్టర్లో ఉన్నప్పటికీ వారి సంతకాలు లేవని తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్కు ఫోన్ చేసి కార్యాలయంలో రిజిస్టర్లను వెంటనే జప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో.. రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్పలత సూపర్ బజార్లో జరుగుతున్న అవకతవకలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగిన కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేని బస్సుల పేరిట బిల్లులు, లేని ఉద్యోగులను సృష్టించి జీతాలు వసూలు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారించిన అధికారులు -
రేపటి నుంచి లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్
ఎంజీఎం: జిల్లాలో లెప్రసీ కేసులు గుర్తించడానికి, ప్రజలకు లెప్రసీపై అవగాహన కల్పించడానికి రేపటి (గురువారం) నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. క్యాంపెయిన్లో భాగంగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉదయం 10 గంటల్లోపు ప్రతీ ఇంటికి తిరిగి వ్యాధిపై అవగాహన కలిగించడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు సర్వేకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. పీహెచ్సీల వారీగా హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టీబీ, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమం కార్యక్రమాలను సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారులు మహేందర్, హిమబిందు, ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి ,హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్, డీపీఎంఓలు సతీశ్రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం గంగేశ్వర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాఘవన్, డీన్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వరంగల్ అర్బన్: విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో కలిసి 15, 16, 17 డివిజన్న్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఎమ్మెలే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం కావాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు జంక్షన్ల విస్తరణకు చొరవ తీసుకోవాలన్నారు. డివిజన్లలోని రామకృష్ణాపురం, ఏకశిల జంక్షన్లను అభివృద్ధి చేయాలని, గొర్రెకుంటలో అంబేడ్కర్ జంక్షన్కు చెందిన ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంతోష్బాబు, మాధవీలత, డీఈ సతీశ్, టీఎంసీ రమేశ్ పాల్గొన్నారు. సిబ్బందికి ఆర్టీసీ సేవలు ములుగు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది సౌకర్యార్థం ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10, 12 గంటలకు, ఒంటి గంటకు సైతం అదనంగా మూడు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు, ఎన్నికల సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. -
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ దామెర: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్లో మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీని సీపీ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పరకాల ఏసీపీ సతీశ్బాబు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ మేన శ్రీను అన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 132 వార్డులకు 132 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దామెర, ఊరుగొండ క్లస్టర్లుగా విభజించి ఎన్నిలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రవిబాబు, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంపీఓ రంగాచారి ఉన్నారు. శాయంపేటలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన.. శాయంపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సీపీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. అదనపు డీసీపీ బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్బాబు, సత్యనారాయణ, సీఐ రంజిత్రావు, ఎస్సై జక్కుల పరమేశ్ ఉన్నారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో జరగనున్న మూడో విడత ఎన్నికలకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 68 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, 634 వార్డులకు 71 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 230 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,424 మంది బరిలో ఉన్నారు. 666 పోలింగ్ కేంద్రాలు, 897 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 626 మంది పీఓలు, 897 మంది ఓపీఓలు మొత్తం 1,523 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అవసరమైన సామగ్రితోపాటు సిబ్బంది మంగళవారమే సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,11,822 ఓటర్లు.. మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరు మొత్తంగా 1,11,822 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ శాతం పెంపునకు చర్యలు.. మొదటి, రెండు విడతల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి దానిని అధిగమించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటింగ్పై అవగాహన వంటి కార్యక్రమాలతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికి చీటీలు ఇచ్చి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. భోజన విరామం ఆ తర్వాత బ్యాలెట్లు కట్టలు కట్టి, లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలు వరుసగా వెల్లడిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నేడు మూడో విడత ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో పోలింగ్ 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎలక్షన్స్ 1,523 మంది సిబ్బంది కేటాయింపు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ, జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ -
వరంగల్: పొలిటికల్ చిచ్చు రాజేసిన చలిమంట!
వరంగల్: చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాటామాట పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై వాగ్వాదం తీవ్రమై, చివరకు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు.ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
గుర్రం తన్నడంతో 12 ఏళ్ల బాలుడి మృతి
వరంగల్: సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్ర్డన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు.గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్ర్డన్ పార్క్కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. -
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఆశించిన పలువురు.. చివరికి వరకు ఫలితం కనిపించకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. రెబల్స్ ధాటికి పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టగా.. పలుచోట్ల రెబల్స్ విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్లో ఆదివారం జరిగిన రెండో విడతలో 563 పంచాయతీల్లో 41 మంది రెబల్స్గా గెలిస్తే.. హనుమకొండ జిల్లాలో ఆరు ఏకగ్రీవంకాగా, 67 స్థానాలకు ఏడు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో గెలిచిన వారిని ఇప్పుడు సొంతగూటికి రమ్మని నేతలు ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేలేరు, హసన్పర్తిలో షాక్... అభ్యర్థుల ఎంపికలో ఏమరుపాటు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలేలా చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ముగ్గురు స్వంతంత్రులు గెలుపొందగా, ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ విజయఢంకా మోగించారు. సుమారు 4,800 ఓటర్లున్న వేలేరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి భారీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మూడు ముక్కలాట ఆడారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా విజయపురి మల్లికార్జున్ గెలుపు కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. మరో అభ్యర్థి సద్దాం హుస్సేన్ కోసం రాష్ట్ర సహకార అయిల్ సీడ్స్, గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న బిల్ల యాదగిరి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంచలనగా మారింది. ● హసన్పర్తి మండలంలోని నాలుగు చోట్ల రెబల్స్ గెలిచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు. ● హసన్పర్తి మండలం మల్లారెడ్డి పల్లెలో మేడిపల్లి సునితకు అధికార పార్టీ మద్దతు తెలపగా రెబల్ అభ్యర్థి గాజుల కృష్ణవేణి గెలుపొందారు. ● హరిశ్చంద్రనాయక్ తండాలో భూక్యా రాజు రెబల్ అభ్యర్థి నునావత్ దేవందర్ చేతిలో ఓడిపోగా, బైరాన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కల్లెబోయిన కుమారస్వామి రెబల్ అభ్యర్థి కల్లెబోయిన సురేందర్ చేతిలో ఓటమి చెందారు. ● సూదనపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు తిక్క మాధవి రెబల్ అభ్యర్థి ఆకారపు లచ్చమ్మ చేతిలో రెండోట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ● ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కందుకూరు సుధాకర్ రెబల్ అభ్యర్థి కందుకూరి జయందర్ చేతిలో ఓడిపోయారు. ● ఐనవోలు మండలం ఒంటిమామిడి, లింగమోరి గూడెంలలో ఇదే జరిగింది. ఇప్పుడు రెబల్స్ అందరినీ పార్టీలో చేరాలని నేతలు ఆహ్వానిస్తుండగా.. పార్టీ పరంగా మద్దతు తెలిపి బరిలోకి దింపిన నాయకులు రెబల్స్ను అదుపు చేయకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కారు’ మరింత కలబడితే.. ఇంకా ‘చేయి’జారేవి... పొరుగు జిల్లా జనగామ ఫలితాల ప్రభావం హనుమకొండ జిల్లాలోనూ పడినట్లు ఫలితాలను బట్టి అవగతమవుతోంది. మిగతా మండలాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తే మరిన్ని స్థానాలు దక్కేవన్న చర్చ జరుగుతోంది. రెండో విడతలో మొత్తంగా 73 గ్రామ పంచాయతీల్లో 39 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, రెండు బీజేపీ మద్దతుదారులు, 10 చోట్ల రెబల్స్, ఇండిపెండెట్లు గెలిచారు. వేలేరు మండలంలో 12 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మండలంలో ఒక రెబల్ మినహాయిస్తే ఐదు కాంగ్రెస్కు, ఆరు బీఆర్ఎస్కు సూచిస్తున్నాయి. అదే విధంగా పరకాలలో 10 సర్పంచ్లకు ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, నాలుగు బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఐనవోలులో 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ గట్టి కృషి జరిగినా ఫలితాలు ‘కారు’ పెరిగేవంటున్నారు. ధర్మసాగర్లో 19 పంచాయతీలకు 13 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ రెబల్ గెలుపొందగా.. ఇక్కడ మూడు చోట్ల సమీప మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి చెందారన్న చర్చ జరుగుతోంది. గెలిచిన తిరుగుబాటు సర్పంచ్లను తిరిగి ఆహ్వానిస్తున్న అధికార పార్టీ ‘రెండో’ పోరులో పలుచోట్ల సత్తా చాటిన అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన వారికి తప్పని బెడద చివరి వరకు మద్దతు ఆశించి.. రెబల్స్గా బరిలోకి దిగిన ఆశావహులు వేలేరులో ‘కడియం’, ‘జంగా’లకు షాక్... -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మూడో విడత జీపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో అధికారులు నిర్వహించారు. ఈప్రక్రియను సాధారణ పరిశీలకులు, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల వారీగా ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మూడో విడతలో 68 గ్రామ పంచాయతీల సర్పంచ్, 634 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 626 ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామపంచాయతీల్లో 163 (బీఎన్ఎస్) చట్టం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని, అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. బయటినుంచి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండరాదని, ప్రజలు గుంపులుగా చేరకూడదని సూచించారు. ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలంతా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని కలెక్టర్ కోరారు. -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి..
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈమేరకు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించిన ఏఈలను అభినందించారు. సమావేశంలో హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు ఐరెడ్డి విజేందర్రెడ్డి, జి.సాంబరెడ్డి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవీ పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్కుమార్రెడ్డి, మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వారం రోజులుగా ట్రై సిటీ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 437 కేసులు నమోదైనట్లు వరంగల్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.1,58,200 జరిమానా విధించడంతో పాటు 24 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ట్రాఫిక్ పరిధిలో నమోదైన 158 కేసుల్లో 14 మంది జైలు శిక్ష విధించగా, రూ.72,900 జరిమానా, కాజీపేట పరిధిలో 142 కేసుల్లో 9 మందికి జైలు శిక్ష, మిగతా కేసుల్లో రూ.79,500 జరిమానా, హనుమకొండ ట్రాఫిక్ పరిధిలో 137 కేసులకు రూ.5,800 జరిమానాతో పాటు ఒక్కరి జైలు శిక్ష విధించినట్లు సీపీ వెల్లడించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీకు, మీ కుటుంబానికి క్షేమకరం సీపీ సూచించారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఈ నెల 17న కమిషనరేట్ పరిధి వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో జరిగే మూడో విడత ఎన్నికల్లో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్, ఎస్ఆర్పీసీ 163 ( 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈనిషేధాజ్ఞలు 17 తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
ఇక్కడ బురద
అక్కడ వరద నర్సంపేట పట్టణంలో ఒకటో వార్డులో మిషన్ భగీరథ పైపులకు పలు చోట్ల లీకేజీ ఏర్పడడంతో తాగునీరు వృథా అవుతోంది. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పలు చోట్ల మరమ్మతులు చేసి మరి కొన్నిచోట్ల వదిలేయడంతో అందరికి సరిపడా నీరు అందడం లేదు. వారం రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల తెలిపారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి లీకేజీలకు మరమ్మతులు చేయాలని ఆమె కోరారు. – నర్సంపేటవర్ధన్నపేట పట్టణ పరిధిలోని గుబ్బెటి తండా 5వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది. ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ లీకేజీలు ఏర్పడ్డాయి. దాంతో నీటి కొరతతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నీరు పారుతుండడంతో వాహనాదారులు, బాటసారులు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. – వర్ధన్నపేట -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈల సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈమేరకు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు ఐరెడ్డి విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదనర్సంపేట రూరల్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, జోనల్ అధికారులు, ఆర్వోలు, మండల అధికారులతో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీబీసీడీఓ పుష్పలత, డీఎస్సీడీఓ భాగ్యలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి ఖానాపురం: స్థానిక సంస్థల ఎన్నికల విధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే విధంగా చూసుకోవాలని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్కుమార్ ఉన్నారు. -
ముగిసిన ప్రచారం
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025‘ముఖ గుర్తింపు’తో సమయపాలనశత్రువులు.. మిత్రులుగా కలిసిపోటీ చేసినా.. గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో ఆసక్తికరమైన పోరు సాగింది. కొమ్మాల గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా కడారి మమత బరిలో నిలిచారు. ఆమెకు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు మద్దతు పలకడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈమెకు పోటీగా కొండా వర్గం వారు.. కన్నెబోయిన యమునను బరిలో నిలిపారు. ఈ క్రమంలో యమునకు 1,014 ఓట్లు రాగా, మమతకు 556 ఓట్లు వచ్చాయి. యమున 458 ఓట్ల మెజార్టీ సాధించింది. మండలంలో సర్పంచ్కు ఇదే అతిపెద్ద మెజార్టీగా అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లకు దక్కిన అవకాశం గీసుకొండ: మండలంలోని ప్రధాన పార్టీకి అతడే పెద్ద లీడర్. గతంలో రిజర్వేషన్ల కారణంగా ఆయనకు అవకాశం దక్కకపోవడంతో తన భార్యను పోటీలో నిలిపారు. ఆమె ఓ సారి జెడ్పీటీసీగా, పలుమార్లు ఎంపీపీగా పదవులను నిర్వర్తించారు. 30 ఏళ్లనుంచి పదవులకు పోటీ చేయడానికి వీరగోని రాజ్కుమార్కు రిజర్వేషన్లు అనుకూలించలేదు. దాంతో చాలాకాలంగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. తాజాగా గీసుకొండ సర్పంచ్ పదవి జనరల్కు కేటాయించడంతో ఆయన తప్పనిసరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోరులో తన ప్రత్యర్థిపై 406 ఓట్ల మెజార్టీతో రాజ్కుమార్ గెలుపొందారు. డబ్బులు పంచిన వ్యక్తిపై కేసు సంగెం: ఓటర్లకు డబ్బులు పంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కుంటపల్లిలో ఐదో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెంతల సంపత్ ఆదివారం తెల్లవారు జామున కానిస్టేబుళ్లు సాయికుమార్, శ్రవణ్కుమార్కు అనుమానాస్పదంగా కన్పించాడు. ఈ క్రమంలో ఆయనను విచారించగా తన వద్ద ఉన్న రూ.60 వేలను ఓటర్లకు పంచడానికి తిరుగుతున్నానని చెప్పి పోలీసులకు నగదు ఇచ్చి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో సంపత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. బస్సు డ్రైవర్పై దాడి కేసులో ఐదుగురిపై.. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. వేలేరు మండలానికి చెందిన డ్రైవర్ బొమ్మగాని వెంకటేశ్వర్లు.. ఆర్టీసీ హనుమకొండ డిపో నుంచి బస్సు తీసుకుని సంగెం మండలం షాపూర్కు వెళ్తున్న క్రమంలో గవిచర్ల గుండబ్రహ్మయ్య దేవాలయ సమీపంలో ఐదుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై అడ్డదిడ్డంగా వెళ్తూ బస్సుకు దారి ఇవ్వలేదు. ఈ క్రమంలో కండక్టర్ భూక్య శంకర్ వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన ఆ యువకులు.. బైక్లు ఆపి డ్రైవర్పై దాడిచేశారు. బస్సులోని ప్రయాణికులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుంటుండగా, సంగెం మండల కేంద్రానికి చెందిన మెట్టుపల్లి సూర్యుడు, మెట్టుపల్లి సిద్దు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 317గ్రామ పంచాయతీల మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న మొదటి దశ, 14న రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగా, 17వ తేదీన మూడో దశ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మూడో దశ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం పోలింగ్ ఉన్నందున ఓటర్లను తమవైపు మలుచుకునేందుకు తాయిలాలు అందిస్తున్నట్లు తెలిసింది. ఈ విడత పూర్తిగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో జరుగుతున్నందున అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు సవాల్గా తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ గుర్తు లేకుండా జరుగుతున్నందున కొంతమంది ఆయా పార్టీల్లో రెబల్స్గా పోటీ చేయడం నాయకులకు తలనొప్పిగా మారింది. ఇలా పోటీ చేసిన గ్రామాల్లో గెలిచే అభ్యర్థులు.. రెబల్స్ వల్ల ఓటమి పాలైన ఘటనలు మొదటి, రెండో దశ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. రెబల్స్ను ఉపసంహరణ చేయించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆయా పార్టీల ముఖ్య నాయకులు తలమునకలయ్యారు. చెన్నారావుపేట మండలంలో.. మండలంలో 30 సర్పంచ్ స్థానాలకు ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 29 స్థానాలకు 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 258 వార్డు సభ్యుల స్థానాలకు 35 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగతా 223 స్థానాల కోసం 564 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖానాపురం మండలంలో.. ఖానాపురం మండలంలో 21 సర్పంచ్ స్థానాలకు ఒకరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 20 స్థానాలకు 62 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, 184 వార్డు సభ్యుల స్థానాల్లో 14 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 170 స్థానాలకు 396 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నర్సంపేట మండలంలో.. నర్సంపేట మండలంలో 19 సర్పంచ్ స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. 164 వార్డు సభ్యుల స్థానాలకు ఆరుగురు ఏకగ్రీవం కాగా, మిగిలిన 158 స్థానాలకు 379 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నెక్కొండ మండలంలో.. నెక్కొండ మండలంలో 39 సర్పంచ్ స్థానాలకు ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 34 స్థానాలకు 96 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 340 వార్డు సభ్యుల స్థానాల్లో 82 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 258 స్థానాలకు 556 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.● కనీస వసతులు కల్పించాలని విన్నపాలు ● బల్దియా గ్రీవెన్స్కు 117 దరఖాస్తులు ● స్వీకరించిన కమిషనర్ చాహత్ నాలుగు మండలాల్లో రేపు పోలింగ్ మొత్తం 109 సర్పంచ్, 946 వార్డు స్థానాలు ఏడుగురు సర్పంచ్లు.. 137వార్డులు ఏకగ్రీవం 102 సర్పంచ్ స్థానాలకు బరిలో 307 మంది అభ్యర్థులు 809 వార్డులకు 1,895మంది మూడో దశ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంకేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ, తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్, కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. త్వరలో జిల్లాలో నిర్వహించనున్న జేఈఈ (మెయిన్న్స్)–2026 పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జనవరి 21 నుంచి 30 వరకు (మొదటి సెషన్), ఏప్రిల్ 2 నుంచి 9 వరకు (రెండో సెషన్) జరిగే జేఈఈ (మెయిన్)– 2026 పరీక్షల కోసం జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించాలన్నారు. కమిటీ సభ్యులు డీసీపీ రవి, ఏసీపీ నర్సింహారావులు ఎన్టీఏ ద్వారా నామినేట్ చేయబడిన జిల్లా నోడల్ అధికారి, జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీమతి, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్ సమన్వయంతో జిల్లాకు సంబంధించి ఎన్టీఏ అందించిన జాబితా ప్రకారం పరీక్ష కేంద్రాలను సందర్శించి సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్బ్యాక్ ఫారమ్ సమర్పించాలన్నారు. -
యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని, గుర్తించిన బిచ్చగాళ్లను స్మైల్ కేంద్రంలో చేర్పించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ భీమారంలో జీడబ్ల్యూఎంసీ, హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్రంలో యాచకులకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులను సర్వే చేసి, కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోంలో ఆశ్రయం కల్పించి, తదుపరి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం ద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవితం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ పాల్గొన్నారు. గడువులోపు పనులు పూర్తి చేయాలి:బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్వీపింగ్ మిషన్ల పనితీరు బాగాలేదని, ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంజినీర్లను కోరారు. -
రెబల్స్.. పార్టీలోకి రండి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఆశించిన పలువురు.. చివరికి వరకు ఫలితం కనిపించకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. రెబల్స్ ధాటికి పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టగా.. పలుచోట్ల రెబల్స్ విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్లో ఆదివారం జరిగిన రెండో విడతలో 563 పంచాయతీల్లో 41 మంది రెబల్స్గా గెలిస్తే.. హనుమకొండ జిల్లాలో ఆరు ఏకగ్రీవంకాగా, 67 స్థానాలకు ఏడు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో గెలిచిన వారిని ఇప్పుడు సొంతగూటికి రమ్మని నేతలు ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేలేరు, హసన్పర్తిలలో షాక్... అభ్యర్థుల ఎంపికలో ఏమరుపాటు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలేలా చేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ముగ్గురు స్వంతంత్రులు గెలుపొందగా, ఏడుగురు కాంగ్రెస్ రెబల్స్ విజయఢంకా మోగించారు. సుమారు 4,800 ఓటర్లున్న వేలేరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి భారీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మూడు ముక్కలాట ఆడారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా విజయపురి మల్లికార్జున్ గెలుపు కోసం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. మరో అభ్యర్థి సద్దాం హుస్సేన్ కోసం రాష్ట్ర సహకార అయిల్ సీడ్స్, గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న బిల్ల యాదగిరి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం సంచలనగా మారింది. ● హసన్పర్తి మండలంలోని నాలుగు చోట్ల రెబల్స్ గెలిచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు. ● హసన్పర్తి మండలం మల్లారెడ్డి పల్లెలో మేడిపల్లి సునితకు అధికార పార్టీ మద్దతు తెలపగా రెబల్ అభ్యర్థి గాజుల కృష్ణవేణి గెలుపొందారు. ● హరిశ్చంద్రనాయక్ తండాలో భూక్యా రాజు రెబల్ అభ్యర్థి నునావత్ దేవందర్ చేతిలో ఓడిపోగా, బైరాన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కల్లెబోయిన కుమారస్వామి రెబల్ అభ్యర్థి కల్లెబోయిన సురేందర్ చేతిలో ఓటమి చెందారు. ● సూదనపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు తిక్క మాధవి రెబల్ అభ్యర్థి ఆకారపు లచ్చమ్మ చేతిలో రెండోట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ● ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కందుకూరు సుధాకర్ రెబల్ అభ్యర్థి కందుకూరి జయందర్ చేతిలో ఓడిపోయారు. ● ఐనవోలు మండలం ఒంటిమామిడి, లింగమోరి గూడెంలలో ఇదే జరిగింది. ఇప్పుడు రెబల్స్ అందరినీ పార్టీలో చేరాలని నేతలు ఆహ్వానిస్తుండగా.. పార్టీ పరంగా మద్దతు తెలిపి బరిలోకి దింపిన నాయకులు రెబల్స్ను అదుపు చేయకపోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కారు’ మరింత కలబడితే.. ఇంకా ‘చేయి’జారేవి.. పొరుగు జిల్లా జనగామ ఫలితాల ప్రభావం హనుమకొండ జిల్లాలోనూ పడినట్లు ఫలితాలను బట్టి అవగతమవుతోంది. మిగతా మండలాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తే మరిన్ని స్థానాలు దక్కేవన్న చర్చ జరుగుతోంది. రెండో విడతలో మొత్తంగా 73 గ్రామ పంచాయతీల్లో 39 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, రెండు బీజేపీ మద్దతుదారులు, 10 చోట్ల రెబల్స్, ఇండిపెండెట్లు గెలిచారు. వేలేరు మండలంలో 12 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మండలంలో ఒక రెబల్ మినహాయిస్తే ఐదు కాంగ్రెస్కు, ఆరు బీఆర్ఎస్కు సూచిస్తున్నాయి. అదే విధంగా పరకాలలో 10 సర్పంచ్లకు ఆరు కాంగ్రెస్ గెలుచుకోగా, నాలుగు బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఐనవోలులో 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ గట్టి కృషి జరిగినా ఫలితాలు ‘కారు’ పెరిగేవంటున్నారు. ధర్మసాగర్లో 19 పంచాయతీలకు 13 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ రెబల్ గెలుపొందగా.. ఇక్కడ మూడు చోట్ల సమీప మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి చెందారన్న చర్చ జరుగుతోంది. గెలిచిన తిరుగుబాటు సర్పంచ్లను తిరిగి ఆహ్వానిస్తున్న అధికార పార్టీ ‘రెండో’ పోరులో పలుచోట్ల సత్తా చాటిన అభ్యర్థులు కాంగ్రెస్ బలపర్చిన వారికి తప్పని బెడద చివరి వరకు మద్దతు ఆశించి.. రెబల్స్గా బరిలోకి దిగిన ఆశావహులు వేలేరులో ‘కడియం’, ‘జంగా’లకు షాక్... -
యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలి..
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని, గుర్తించిన యాచకులను స్మైల్ కేంద్రంలో చేర్పించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ భీమారంలో జీడబ్ల్యూఎంసీ, హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్రంలో యాచకులకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో బిచ్చగాళ్లు, బాల కార్మికులు, వృద్ధులను సర్వే చేసి, కనీసం మూడు నెలల పాటు స్మైల్ హోంలో ఆశ్రయం కల్పించి, తదుపరి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ రాజేశ్, మెప్మా టీఎంసీ రమేశ్, వెంకట్ పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలి:బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా డెడ్లైన్ ఉందని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ పనులపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్వీపింగ్ మిషన్ల పనితీరు బాగాలేదని, ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంజినీర్లను కోరారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోశ్బాబు, మాధవిలత, ఏఈలు నరేశ్ పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనధికారిక భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తుదారులతో కార్యాలయ ఆవరణంతా కిటకిటలాడింది. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 117 ఫిర్యాదులు అందగా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 63 వచ్చాయి. నగరంలో ఎంత పెద్ద మొత్తంలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ ఫిర్యాదుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 41, పన్నుల విభాగానికి 4, ప్రజారోగ్య సెక్ష న్కు 3, నీటి సరఫరాకు 5, ఉద్యాన వన విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● వరంగల్ దేశాయిపేట చార్లెస్ కాలనీ రోడ్డు–1లో డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్గనైజర్స్ కోరారు. ● వరంగల్ 25వ డివిజన్ ఎల్లంబజార్ రిషి స్కూల్ లైన్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● మట్టెవాడ 13–3–52 వద్ద తాగునీటి పైపులైన్ నెల రోజులుగా లీకేజీగా మారి నీరు వృథాగా పోతోందని, రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 19వ డివిజన్ గాంధీనగర్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని రామా యాదగరి విజ్ఞప్తి చేశారు. ● 2028లో లక్ష్మీటౌన్ షిప్ నుంచి ఆరేపల్లి వరకు రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేపట్టారని, కానీ కొన్నేళ్లకు రోడ్డు దెబ్బతిందని మరమ్మతులు చేపట్టాలని ఇట్యాల సురేశ్కుమార్ కోరారు. ● వరంగల్ చింతల్లో నల్లాలు, డ్రెయినేజీలు లేవని, రోడ్లు నిర్మించాలని మహ్మద్ అంకూస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ● వరంగల్ 28వ డివిజన్ విశ్వకర్మ వీధి, చకిలం ఉపేందర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని కార్పొరేటర్ గందె కల్పన దరఖాస్తు అందించారు. ● 23వ డివిజన్ కొత్తవాడ 11–25–763 నల్లా కనెక్షన్ తొలగించాలని కొమిటి శ్రీనివాస్ కోరారు. ● 62వ డివిజన్ విష్ణుపురి రెహ్మత్ నగర్ మరుగుదొడ్ల నుంచి మల వ్యర్థాలను నేరుగా డ్రెయినేజీలకు పంపిస్తుండడంతో దుర్వాసన వస్తోందని మాట్ల రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ● హంటర్ రోడ్డులోని వేదవతి నిలయం అపార్ట్మెంట్కు సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ ఆర్టీసీ కాలనీలో రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రాంచందర్ పేర్కొన్నారు. -
ముగిసిన ప్రచారం..
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. జిల్లాలో రెండు విడతల్లో 11 పంచాయతీలు ఏకగ్రీవం, 131 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో మొత్తం 68 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, 67 పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి, మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడినా... మరికొన్ని చోట్ల అనైతిక పొత్తులతో ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుని ‘హస్తం’హవాను చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా, బీజేపీ, రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. కాగా మూడో విడత ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ముగిసిన ప్రచారం.. జోరుగా పంపకాలు... ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్కు ఒక్కరోజు గడువే ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్ జరగనుంది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బులతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తుండగా, ఆన్రిజర్వుడు, మేజర్ పంచాయతీల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గ్రామాలలో పోలింగ్కు ముందురోజు ఇంటికి కిలో చికెన్, మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు వైరల్ అవుతోంది. 67 పంచాయతీలు.. 563 వార్డులు... మూడో దశలో మొత్తం 68 పంచాయతీలు, 634 వార్డులకు గాను ఒక గ్రామ పంచాయతీ, 71 వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 230 మంది, వార్డుల్లో 1424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం మొత్తం 626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో జరిగే ఈ పోలింగ్లో మొత్తం 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. బుధవారం మూడో విడత ఎన్నికలతో పంచాయతీ ఘట్టం ముగియనుంది. రేపు తుది విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో 67 జీపీలు, 563 వార్డులకు ఎన్నికలు అంతుబట్టని ఓటరు నాడి పల్లెల్లో పంపకాల జోరు.. ప్రలోభాల హోరు -
తుది దశకు రెడీ
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, ఇందులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 102 సర్పంచ్ స్థానాల కోసం 307 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 946 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 137 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 809 స్థానాల కోసం 1,895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో గ్రామ స్థాయి రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. మూడో విడత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది. -
ఎంజీఎంలో సిబ్బంది కొరత వాస్తవమే
ఎంజీఎం: ‘ఎంజీఎంలో పరికరాలు, సిబ్బంది కొరతను గుర్తించాం. ఔషధాల బడ్జెట్ విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) నరేంద్రకుమార్ అన్నారు. ఎంజీఎం రోగిని ఎలుకలు కొరిన ఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంఎంసీ, ఐఎంసీ, ఎస్ఎన్సీయూ విభాగాలు పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాజవాలిటీ రోగుల రద్దీకి సరిపడేలా లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాల్లో పరికరాలు, సిబ్బంది కొరత ఉందని, రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఔషధాల బడ్జెట్ ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ అడ్మిట్ అయిన రోగులను ఎందుకు రెఫరల్ చేస్తున్నారనే విషయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎంజీఎం పరిపాలనాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆర్ఎంఓలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడనున్నామన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి సూపర్స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న సేవలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు తెలిపారు. వైద్యుల హాజరు శాతం మెరుగపర్చేలా చర్యలు చేపడతామని, ఆర్ఎంఓల నియామకం చేపడతామన్నారు. ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంఈ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.● ఆర్ఎంఓల నియామకం చేపడతాం ● రెఫరల్ వైద్య సేవలపై ఆడిట్ చేపడతాం.. ● వైద్య విద్య సంచాలకుడు నరేంద్రకుమార్ -
నాగారంలో గులాబీ రెపరెపలు
● 599 ఓట్లతో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి విజయం ● 12 వార్డుల్లో 10 వార్డులు బీఆర్ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు పరకాల: నాగారం గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. రెండు పార్టీల మండల అధ్యక్షులది ఇదే గ్రామం. వారిద్దరూ గతంలో సర్పంచ్ స్థానానికి పోటీపడ్డారు. ఈసారి బీసీ (మహిళ)కు రావడంతో వారి అనుచరులను బరిలో నిలిపారు. దీంతో ఈ గ్రామ ఫలితాలపై మండలవాసులు ఆసక్తి చూపించారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన ఏరుకొండ రమాదేవి, కాంగ్రెస్ అభ్యర్థిపై 599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా, గ్రామంలో మొత్తం 12వార్డులు ఉండగా, 10 వార్డులను బీఆర్ఎస్, రెండు వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. గ్రామంలో భారీ ఆధిక్యత రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంనుంచి లెక్కింపు ప్రక్రియ జరిగే వరకు సమస్యాత్మకమైన గ్రామం నాగారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12 వార్డుల్లో వరుసగా బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకోగానే ఆయా వార్డు అభ్యర్థుల బంధువులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు ఏదో మాయ చేశారని ఆరోపిస్తూ కౌంటింగ్ హాల్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు కుట్ర చేశారంటూ గొడవ చేశారు. పోలీసులు వారందరిని బస్టాండ్ వైపు వెళ్లగొట్టారు. ఈ ఘటనకు ముందు పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గొడపడ్డారు. ఎన్నికల తర్వాత ఎవరి సంగతేంటో తేల్చుకుందామని మాటల యుద్ధానికి దిగగా సీఐ క్రాంతికుమార్ జోక్యం చేసుకొని బయటకు పంపించారు. గ్రామంలో పరిస్థితిపై అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో రాత్రి వరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. -
పోటెత్తిన ఓటర్లు..
సాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 1,008 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1,36,191 మంది ఓటర్లకు 1,20,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వలస ఓటర్లు పల్లెలకు భారీగా తరలివచ్చారు. తొలి విడత నమోదైన 86.52 శాతం కంటే ఈసారి 88.11 శాతం నమోదైంది. పోలీసుల భారీ భద్రత నడుమ 1,181 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2,568 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఉదయం ఏడు నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు అవకాశం ఇవ్వడంతో మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు 18.82 శాతంతో మందకొడిగా ఉన్న 11 గంటల వరకు 59.31 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 77.66 శాతం, ఆ తర్వాత క్యూలైన్లలో నిలుచొని ఓటేసిన వారితో పోలింగ్ శాతం 88.11 శాతానికి చేరుకుంది. గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటేసిన తర్వాత ఓటర్లు తమ వేలి సిరా చుక్క చూపిస్తూ హరిత పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు అవతలే ఉండి తమ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. యువత, పురుషులు, మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు రావడంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. అయితే, కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు ఎదురవడం మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. మహిళా ఓటర్లు ఎక్కువ.. ఓటు హక్కు వినియోగించుకుంది ఎక్కువ పురుషులే.. ఈ నాలుగు మండలాల్లో 66,427 మంది పురుషులుంటే 58,688 మంది, 69,722 మంది మహిళలుంటే 61,311 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.30 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.94 శాతం ఓటేశారు. అంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు. రెండు ఓట్లు ఉన్న ఇతరులు కూడా ఓటేశారు. దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ తొలి విడత 86.52, రెండో విడత 88.11 శాతం నమోదు ఓటు హక్కు వినియోగంలో మహిళల కంటే పురుషులే అధికం -
హస్తం జోష్.. కారు జోరు
సాక్షి, వరంగల్: జిల్లాలో ఆదివారం జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ విజయం సాధించారు. దుగ్గొండి, గీసుకొండ, సంగెం, నల్లబెల్లి మండలాల్లోని 116 పంచాయతీల్లో 70 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. తామేం తక్కువకాదన్నట్లు బీఆర్ఎస్ కూడా 40 స్థానాలు గెలుచుకొని పోటీలో నిలిచింది. బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. సీపీఐఎంఎల్ పార్టీ ఒకచోట గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు విజయబావుటా ఎగురవేశారు. తొలివిడత ఎన్నికలు జరిగిన వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 91 పంచాయతీల్లో 56 స్థానాలను కాంగ్రెస్, 26 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో కాంగ్రెస్ 33 స్థానాల్లో నెగ్గితే.. బీఆర్ఎస్ 27 స్థానాలను గెలిచి అధికార పార్టీకి సవాల్ విసిరింది. అలాగే, గీసుకొండలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్లుగా చెప్పుకుంటున్న 16 స్థానాల్లో కొండా వర్గం ఏడుగురు ఉండగా, ఎమ్మెల్యే రేవూరి వర్గం 9 మంది ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నర్సంపేట వచ్చి నియోజకవర్గంపై అభివృద్ధి వరాలు కురిపించినా ఇక్కడి పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించినట్టు లేదు. మూడోదశ ఎన్నికలు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, ఎస్టీ రిజర్వ్ అయిన వంజారపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్కు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ ఒక్కటి మినహాయిస్తే 116 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు అనుకూలం.. మంత్రికి ప్రతికూలం.. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకారెడ్డి సొంతూరు దుగ్గొండి మండలం కేశవపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బదరగాని రమ 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 238 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి వైనాల వనమ్మకు 179 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే రేవూరి ఆదివారం ఉదయం వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ● నల్లబెల్లి మండలం గోవిందాపూర్లో నిలిచిన మంత్రి సీతక్క బావ బిడ్డ వాసం తిరుపతమ్మ (కాంగ్రెస్ అభ్యర్థి)కు భారీ ఓటమి ఎదురైంది. మంత్రి సీతక్క స్వయంగా వచ్చి గెలిపించాలని ఓటర్లను కోరినా ఆమె 225 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి పాడ్య రజితకు 490 ఓట్లు రాగా, తిరుపతమ్మకు 265 ఓట్లు వచ్చాయి. అలాగే, ఇక్కడి 8వ వార్డుల్లో 7 బీఆర్ఎస్ గెలుచుకుంది. 8వ వార్డులో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాల్త్య సారయ్యకు, బీఆర్ఎస్ రెబల్ భూక్యా దేవ్సింగ్కు 37 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేయడంతో భూక్యాదేవ్ సింగ్ను విజయం వరించింది.మండలాల వారీగా గెలిచిన సర్పంచ్ల వివరాలు.. మరిన్ని ఎన్నికల వార్తలు – 8లోu రెండో విడత సర్పంచ్లు వీరే.. – 9లోu సంగెం మండలం ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన కొంగర మల్లమ్మ ఒక ఓటు తేడాతో గెలిచారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్లి వెంకటేశ్వర్లు నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే, చంద్రయ్యపల్లిలో 8 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి తాళ్ల మయూరి గెలిచారు. నల్లబెల్లి మండలం ముచ్చింపులలో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తార్ శేఖర్ 6 ఓట్ల తేడాతో గెలిచారు. అర్షనపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధ సంతోష్ మూడు ఓట్ల తేడాతో గెలిచారు. గీసుకొండ మండలం శాయంపేట హవేలిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గాలి యాకయ్య సమీప ప్రత్యర్థి నాగార్జునపై 6 ఓట్ల తేడాతో అనూహ్యంగా గెలిచారు. సపవాట్ దేవ్సింగ్ గత ఎన్నికల్లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో తన భార్య కవితను సర్పంచ్ బరిలో నిలపగా గెలుపొందింది. మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు దుగ్గొండి 34 21 11 0 2 గీసుకొండ 21 16 3 0 2 నల్లబెల్లి 29 12 16 1 0 సంగెం 32 21 10 1 0 మొత్తం 116 70 40 2 4 -
వెబ్కాస్టింగ్లో పోలింగ్ సరళి పరిశీలన
న్యూశాయంపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపును కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించినట్లు తెలిపారు. నాలుగు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను(మైక్రో అబ్జర్వర్లు) నియమించి, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ సీఈఓ వసుమతి, డీపీఓ కల్పన, జిల్లా నోడల్ అధికారులు ఉన్నారు. -
రెండు ఓట్లతో లచ్చమ్మ గెలుపు
హసన్పర్తి: హసన్పర్తి మండలం సూదన్పల్లిలో ఫ్యామిలీ పోరు జోరుగా సాగింది. గ్రామానికి చెందిన ఆకారపు లచ్చమ్మ (కాంగ్రెస్ రెబల్), ఆమె కూతురు శైలజ(కాంగ్రెస్ రెబల్) పోటీలో ఉన్నారు. వీరితో పాటు శైలజ బావ కోడలైన తిక్క మాధవి (కాంగ్రెస్), మాధవి అత్త అయిన జయమ్మ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఫ్యామిలీ పోరులో తిక్క మాధవికి 292 ఓట్లు రాగా, అకారపు లచ్చమ్మకు 294 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో మనవరాలిపై అమ్మమ్మ (లచ్చమ్మ) సర్పంచ్గా ఎన్నికై ంది. కాగా, జయమ్మకు ఏడు, శైలజకు 74 ఓట్లు వచ్చాయి. మాజీ సర్పంచ్ భర్తపై మాజీ ఉప సర్పంచ్ గెలుపు మడిపల్లిలో మాజీ సర్పంచ్ చిర్ర సుమలత భర్త చిర్ర విజయ్కుమార్పై మాజీ ఉప సర్పంచ్ బుర్ర రంజిత్కుమార్ 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లెక్కింపు సందర్భంగా విజయ్కుమార్కు 910కు పోలవ్వగా, రంజిత్కుమార్కు 930 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు రంజిత్కు నమోదైంది. -
87.25శాతం
జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మొత్తం 87.25% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో భాగంగా ధర్మసాగర్ హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 1,25,735 ఓటర్లు ఉండగా.. 1,09,703 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 87.25గా పోలింగ్ శాతం నమోదైంది. ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు.. రెండో విడత పోలింగ్కు జిల్లాలోని ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద బారులుదీరారు. ఓటు వేసేందుకు ఓపికతో క్యూ లైన్లో నిలబడ్డారు. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం భోజన విరామం తర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మళ్లీ మహిళలు తక్కువే.. రెండో విడత పోలింగ్లో కూడా మహిళల పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. ఓటర్లపరంగా పురుషులకన్నా సుమారు 3వేలకు పైగా.. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే పోలింగ్ శాతం చూస్తే మాత్రం పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు శాతం తక్కువగా పోలింగ్కు హాజరయ్యారు. 3.3 శాతం అధికం తొలి విడత జిల్లాలో 83.95 పోలింగ్ శాతం నమోదవ్వగా రెండో విడతలో 87.25 శాతంగా పోలింగ్ నమోదైంది. దీంతో మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు మూడు శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పర్యవేక్షించిన కలెక్టర్ హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. హసన్పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలను స్వయంగా సందర్శించి పోలింగ్ సరళి గురించి అధికారులకు సూచనలిచ్చారు. మొదటి విడత కన్నా 3.3 శాతం అధికం పోలింగ్ ప్రారంభానికి ముందే బారులుదీరిన ఓటర్లు -
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ‘పై చేయి’..
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కు వినియోగించుకుని చైతన్యం కనబర్చారు. జిల్లా పరిధి ఐదు మండలా ల్లోని 73 జీపీలకు ఆరు ఏకగ్రీవం కాగా.. అందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే. ఆదివారం పోలింగ్ జరిగిన 67 గ్రామ పంచాయతీల్లో 33 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 22 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందగా, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నలుగురు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కలుపుకుని మొత్తం 10 మంది స్వతంత్రులు సర్పంచ్లుగా గెలుపొందారు. మండలాల వారీగా ఫలితాలు ఇలా... వేలేరులో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 12 స్థానాలకు ఆరు చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలవగా, రెండు ఏకగ్రీవం కలుపుకుని 5 పంచాయతీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఒకచోట స్వతంత్రులు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. హసన్పర్తి మండలంలో 15 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కలిపి ఆరు కాంగ్రెస్, రెండు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా నాలుగింట్లో కాంగ్రెస్ రెబల్స్, రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఐనవోలు 17 పంచాయతీలకు 9 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్, ఒకటి బీజేపీ మద్దతుదారులు గెలుచుకోగా, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. పరకాలలో పదింటికి ఆరు కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ధర్మసాగర్లో 19 జీపీలకు రెండు ఏకగ్రీవం కలిపి 13 చోట్ల కాంగ్రెస్, ఐదుచోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. కాగా రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు అనూహ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ పలు గ్రామాల్లో ప్రభావం చూపింది. హసన్పర్తిలో అధికార పార్టీని దెబ్బతీసిన రెబల్స్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచిన ‘కారు’ సంబురాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో బీఆర్ఎస్, బీజేపీలుమరిన్ని ఎన్నికల వార్తలు – 8లోu రెండో విడత సర్పంచ్లు వీరే.. – 9లోu -
సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా
నిట్ వరంగల్ క్యాంపస్లో ఉత్తరం ప్రయాణాన్ని వ్యక్తపరుస్తూ జర్నీ ఆఫ్ లెటర్ పేరిట సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా జెన్ జెడ్ పోస్టాఫీస్ నిలుస్తోంది. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందిస్తూనే ప్రత్యేకను చాటుకునేందుకు నేటి తరం పోస్టల్ సేవల్ని అందుకునేందుకు చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా, ఉచిత వైఫై సౌకర్యం, లైబ్రరీని తలపించేందుకు ముగ్గురు సిట్టింగ్ చేసేలా కాఫీ టేబుల్ మాదిరిగా టేబుల్ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు పేపర్లు, రెండు ఇంగ్లిష్ మ్యాగజైన్లు, ఒక హిందీ మ్యాగజైన్ అందుబాటులో ఉంచారు. ఈ పోస్టాఫీస్ మీటింగ్ స్పాట్ను తలపిస్తోంది. -
క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు ఏసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో శనివారం ఏసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి స్సైన్స్ ఫేర్, విద్యాసంవత్సరానికి మంజూరైన ఇన్స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్పై ర్కు సంబంధించి మంజూరైన ప్రతీ విద్యార్థి ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఈవైజానిక ప్రదర్శనల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రకటించిన ఏడు ఇతివృత్తాల్లో ఏవైనా రెండింటికి సంబంధించిన జూనియర్ విభాగం నుంచి ఇద్దరు, సీనియర్ విభాగం నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులతో 4 ప్రదర్శనలకు అవకాశం ఉంది. కాగా, 15న సన్నాహక సమావేశాన్ని అదే స్కూల్లో నిర్వహించబోతున్నట్లు డీఈఓ తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలని సూచించారు. వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్లూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) మూడవ సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాల్గవ పేపర్, 12న ఐదవ పేపర్, 16న ఆరవ పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్సంగెం/గీసుకొండ: ఎన్నికల నిర్వహణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. సంగెం, గీసుకొండ మండల కేంద్రాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సీపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు సూచనలు చేసి మాట్లాడారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరిన దగ్గర నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి తిరిగి మండల కేంద్రాలకు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పక్షపాతం చూపకుండా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సమస్యాత్మ ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై వంశీకృష్ణ, గీసుకొండ ఎస్సై కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్
నిట్ వరంగల్ విద్యార్థులు పోస్టల్ ప్రాడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్ చేస్తే ప్రోత్సాహం కల్పిస్తాం. విద్యార్థులు పోస్టల్ సేవల్ని వినియోగించుకునేందుకు జెన్ జెడ్ పోస్టోఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, సిబ్బందికి ఆధునిక టెక్నాలజీతో సేవలందిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్కు పోస్టల్ ప్రమాద బీమాపై అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఆసక్తి కనబర్చాం. – వి.హనుమంతు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, హనుమకొండ -
నాడు తండ్రి.. నేడు కొడుకు
● ఇద్దరిని బలితీసుకుంది రోడ్డు ప్రమాదమే.. ● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లి..స్టేషన్ఘన్పూర్/ఐనవోలు : పదేళ్ల క్రితం తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోగా, శనివారం కుమారుడిని సైతం అదే రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఆ ఇంట్లో తీరని విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో జాతీయ రహదారిపై శనివారం రాత్రి బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఐనవోలు మండలం రాంనగర్కు చెందిన బుర్ర సమ్మయ్య, సునీత దంపతుల కుమారుడు బుర్ర కల్యాణ్కుమార్ (27), బుర్ర ఉప్పలయ్య, రమ దంపతుల కుమారుడు నవీన్ (27) దుర్మరణం చెందారు. కాగా, నవీన్ తండ్రి ఉప్పలయ్య పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచి తల్లి కుటుంబ బాధ్యతలు మీదేసుకుని కుమారుడు నవీన్కు మంచి చదువులు చెప్పించింది. రోడ్డు ప్రమాదం నాడు తండ్రిని, నేడు కుమారుడిని బలితీసుకుందని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కష్టపడి చదివి.. మంచి ఉద్యోగాలు.. బుర్ర కల్యాణ్కుమార్, నవీన్లు పాలోళ్లు. వరుసకు అన్మదమ్ములు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. కల్యాణ్కుమార్కు ఓ సోదరి, నవీన్కు సోదరి ఉన్నారు. ఇద్దరు కష్టపడి చదువుకున్నారు. నవీన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, కల్యాణ్కుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో వార్డెన్గా పనిచేస్తున్నాడు. మంచి జీతంతో సంతోషంగా ఉండేవారు. సెలవుల్లో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేవారు. ఓటు వేద్దామని.. ఐనవోలు మండలం రాంనగర్ గ్రామ పంచాయతీకి రెండో విడతలో ఆదివారం పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఇద్దరి సమీప బంధువులైన బుర్ర మంజుల, బుర్ర సంతోషలక్ష్మి స్థానికంగా వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఓటుహక్కును వినియోగించుకుందామని ఉత్సాహంగా పల్సర్బైక్పై వస్తున్నారు. పరిమితికి మించి వేగం వల్ల బైక్ అదుపుతప్పడం.. ప్రాణాలు అనంతవాయివుల్లో కలిసిపోయాయి. బుర్ర రమ, ఉప్పలయ్యలకు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె కాగా సమ్మయ్య, సునీత దంపతులకు సైతం ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇద్దరి కుటుంబాల్లో ఉన్న ఒక్కగానొక్క మగ సంతానం అకాలమృతి చెందటంతో ఆయా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాంఐనవోలులో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ సన్ప్రీత్ సింగ్ సాక్షిప్రతినిధి, వరంగల్: ....ఇలా ఉమ్మడి వరంగల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. శ్రీమీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాంఅంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడత లో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతర్లు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఇదే సమయంలో మొదటి విడతలో తలెత్తిన లోపాలను గుర్తించిన ఆ మూడు పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి శనివారం రాత్రే అధికారులు, సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కళ్లుగప్పి విచ్చల విడిగా పోల్ చిట్టీలతో పాటు డబ్బుల్ని పంపిణీ చేసేలా ఏర్పాటు చేసుకున్న కొందరు నాయకులు చాలా గ్రామాల్లో రెండో విడత కోసం శనివారం రాత్రంతా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దన్నారు. కాగా ఆదివారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని బ్రాందీషాపులు, బార్లను అబ్కారీశాఖ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐనవోలు: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శనివారం పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కొండపర్తి, వెంకటాపురం, నందనం, పున్నేలు గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఏసీపీ వెంకటేశ్, సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్, ఎంపీఓ రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతకు నేడు పోలింగ్.. 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీ ‘రెండో’ పోరులో గెలిచేదెవరో? పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు పరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. -
సంగ్రామం
నేడే రెండో దశసాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి వేళయ్యింది. ఈ మేరకు దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 1,008 పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. దుగ్గొండి మండలంలో 282, గీసుకొండ మండలంలో 188, నల్లబెల్లి మండలంలో 252, సంగెం మండలంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 1,39,100 మంది ఓట్లు ఉంటే 85 శాతంపైనే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద శనివారం గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసక్తి రేపుతున్న ఆ గ్రామాలు..● మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వగ్రామం గీసుకొండ మండలం వంచనగిరిలో పంచాయతీ పోరు ఆసక్తి రేపుతోంది. కొండా వర్గం నుంచి కొమ్ముల కమల, పరకాల ఎమ్మెల్యే రేవూరి వర్గం నుంచి కొమ్ముల రాజమణి సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ 3,015 ఓట్లు ఉన్నాయి. అలాగే, గీసుకొండ మేజర్ గ్రామ పంచాయతీ బరిలో ఉన్న వీరగోని రాజ్కుమార్, కొమురారెడ్డి ఎవరు గెలుస్తారోనన్న హైటెన్షన్ నెలకొంది. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సొంతూరు దుగ్గొండి మండలంలోని కేశవపురంలో 495 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బదరగాని రమ, బీఆర్ఎస్ నుంచి వైనాల లక్ష్మి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సొంతూరు నల్లబెల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 3,772 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ మహిళ రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ బలపరిచిన పరికి సుజాత, బీఆర్ఎస్ బలపరిచిన నాగిని జ్యోతి తలపడుతున్నారు. ● ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క బావ బిడ్డ వాసం తిరుపతమ్మ పోటీచేస్తున్న నల్లబెల్లి మండలం గోవిందాపురంలో 986 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి పాడ్య రజిత పోటీ చేస్తున్నారు. సీతక్క పర్యటించి తిరుపతమ్మను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. వంజరపల్లిలో విచిత్ర పరిస్థితి..సంగెం మండలం పెద్ద తండా, గాంధీనగర్ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వంజారపల్లి ఎస్టీ రిజర్వ్ అయ్యింది. ఆ జనాభా లేకపోవడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. మూడు వార్డులు కూడా ఎస్టీ రిజర్వ్ కావడంతో వాటికి ఎన్నికలు లేవు. ఆశాలపల్లిలో ఎస్సీలు లేక రెండు వార్డులకు నామినేషన్లు పడలేదు. అంతటా ఎన్నికల కోలాహలం ఉంటే వంజరపల్లిలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి లేకపోవడంతో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రలోభాల పర్వం..ఎన్నికల్లో ఎలాగైనా గలవాలని అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇన్నాళ్లు ఓటర్లను ఇంటిఇంటికి వెళ్లి కలిసిన కొందరు నోట్లు, మద్యం సరఫరా చేశారు. చికెన్, మటన్ కూడా అరకిలో, కిలో లెక్కన కొన్నిచోట్ల పంపిణీ చేశారు. కొందరైతే ఆయా కుల సంఘాలకు భూమి, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామంటూ హామీనిచ్చారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అభయమిచ్చారు. వలస ఓటర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ పంచాయతీ ఎన్నికల్లో రూ.5,90,000 నగదు, రూ.7,13,905 విలువచేసే మద్యాన్ని ప్రత్యేక నిఘా బృందాలు పట్టుకున్నాయిమండలం పురుషులు మహిళలు ఇతరులుదుగ్గొండి 18,183 18,884 0 గీసుకొండ 13,979 14,928 1 నల్లబెల్లి 15,509 16,155 0 సంగెం 20,213 21,247 1 మొత్తం 67,884 71,214 2గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత (గ్రీన్ మోడల్) పోలింగ్ కేంద్రాలను అధికారులు శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దారు. -
వెబ్కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలన
న్యూశాయంపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో చేశారు. వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న సాంకేతిక ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర సమాచారశాఖ. ఈనెల 10వ తేదీన తెలంగాణలోనే తొలి జెన్ జెడ్ పోస్టాఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో అట్టహాసంగా ప్రారంభించింది. తరాల వారధిగా నిలుస్తూ.. రూపాంతరం చెందుతూ వస్తున్న పోస్టల
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంప్స్తో ప్రీ మాటిక్ స్టాంప్స్ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణంనిట్ వరంగల్ క్యాంపస్లో ఉత్తరం ప్రయాణాన్ని వ్యక్తపరుస్తూ జర్నీ ఆఫ్ లెటర్ పేరిట సాఫ్ట్వేర్ హబ్ను తలపించేలా జెన్ జెడ్ పోస్టాఫీస్ నిలుస్తోంది. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందిస్తూనే ప్రత్యేకను చాటుకునేందుకు నేటి తరం పోస్టల్ సేవల్ని అందుకునేందుకు చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా, ఉచిత వైఫై సౌకర్యం, లైబ్రరీని తలపించేందుకు ముగ్గురు సిట్టింగ్ చేసేలా కాఫీ టేబుల్ మాదిరిగా టేబుల్ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు పేపర్లు, రెండు ఇంగ్లిష్ మ్యాగజైన్లు, ఒక హిందీ మ్యాగజైన్ అందుబాటులో ఉంచారు. ఈ పోస్టాఫీస్ మీటింగ్ స్పాట్ను తలపిస్తోంది.● ఇటీవల ప్రారంభమైన ఆధునిక తపాలా సేవలు ● పురాతన పోస్టల్ స్టాంపులతో కాకతీయ కళాతోరణం ● గోడల చుట్టూ వివిధ స్టాంపుల నమూనాలతో ముస్తాబు ● సాఫ్ట్వేర్ హబ్ టచ్, ఫ్రీ వైఫై, రౌండ్ టేబుల్ సిట్టింగ్ ●1982 నుంచి 2012వ సంవత్సరం వరకు (జెన్ జెడ్ తరం) జన్మించిన వారి అభిరుచికి అనుగుణంగా పోస్టల్ శాఖ జెన్ జెడ్ సేవలు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు ఫ్రీ వైఫై, మ్యాగజైన్లు చదువుకునే వసతి, పోస్టల్ సేవలపై అవగాహనకు కాఫీ రౌండ్ టేబుల్ సౌకర్యం, తాగునీటి వసతి, స్పీడ్ పోస్ట్పై 10 శాతం డిస్కౌంట్ అవకాశాన్ని నిట్ విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ సేవలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్, స్పీడ్ పోస్ట్ సేవలు, ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ చెల్లింపులు ఇలా.. అన్ని సేవలు ఒకే చోట లభించనున్నాయి. అనూహ్య స్పందన.. నిట్ వరంగల్ క్యాంపస్లో ఈనెల 10వ తేదీన నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, పోస్ట్మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ సుమిత అయోధ్య జ్యోతి ప్రజ్వలన చేసి జెన్ జెడ్ పోస్టాపీస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోస్టాఫీస్లో అందిస్తున్న సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో శనివారం వరకు (మూడు రోజుల వ్యవధిలో) 107 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు, 101 పీపీఎఫ్ అకౌంట్స్, 168 పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు (రూ.12 లక్షల ప్రీమియం). రూ.555తో ఏడాదికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని 46 మంది చేసుకున్నారు. -
నిట్ వరంగల్ క్యాంపస్లో తొలి జెన్ జెడ్ పోస్టాఫీస్
ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర సమాచారశాఖ. ఈనెల 10వ తేదీన తెలంగాణలోనే తొలి జెన్ జెడ్ పోస్టాఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో అట్టహాసంగా ప్రారంభించింది. తరాల వారధిగా నిలుస్తూ.. రూపాంతరం చెందుతూ వస్తున్న పోస్టల్ శాఖ జెన్జెడ్గా విద్యార్థులకు మరింత చేరువవుతోంది. ఈ జెన్ జెడ్ పోస్టాఫీస్ అందించే సేవలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – కాజీపేట అర్బన్ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంప్స్తో ప్రీ మాటిక్ స్టాంప్స్ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ఆకర్షణగా నిలుస్తోంది. స్టాంప్స్తో కాకతీయ కళాతోరణం● ఇటీవల ప్రారంభమైన ఆధునిక తపాలా సేవలు ● పురాతన పోస్టల్ స్టాంపులతో కాకతీయ కళాతోరణం ● గోడల చుట్టూ వివిధ స్టాంపుల నమూనాలతో ముస్తాబు ● సాఫ్ట్వేర్ హబ్ టచ్, ఫ్రీ వైఫై, రౌండ్ టేబుల్ సిట్టింగ్ 1982 నుంచి 2012వ సంవత్సరం వరకు (జెన్ జెడ్ తరం) జన్మించిన వారి అభిరుచికి అనుగుణంగా పోస్టల్ శాఖ జెన్ జెడ్ సేవలు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు ఫ్రీ వైఫై, మ్యాగజైన్లు చదువుకునే వసతి, పోస్టల్ సేవలపై అవగాహనకు కాఫీ రౌండ్ టేబుల్ సౌకర్యం, తాగునీటి వసతి, స్పీడ్ పోస్ట్పై 10 శాతం డిస్కౌంట్ అవకాశాన్ని నిట్ విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ సేవలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్, స్పీడ్ పోస్ట్ సేవలు, ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ చెల్లింపులు ఇలా ఒకే చోట లభించనున్నాయి. అనూహ్య స్పందన.. నిట్ వరంగల్ క్యాంపస్లో ఈనెల 10వ తేదీన డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, పోస్ట్మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ సుమిత అయోధ్య జ్యోతి ప్రజ్వలన చేసి జెన్ జెడ్ పోస్టాపీస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోస్టాఫీస్లో అందిస్తున్న సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. శనివారం వరకు 107 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు, 101 పీపీఎఫ్ అకౌంట్స్, 168 పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు (రూ.12 లక్షల ప్రీమియం). రూ.555తో ఏడాదికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని 46 మంది చేసుకున్నారు. క్యూ ఆర్తో పేమెంట్ విధానం బాగుందిఇదివరకు స్పీడ్ పోస్ట్, స్టాంప్స్ కోసం పోస్టాఫీస్కు వెళ్తే నగదు చెల్లించాల్సి వచ్చేది. దీంతో సరిపడా చిల్లర లేక ఇబ్బంది పడే వాళ్లం. మా కోసమే మా కాలేజీలో ఏర్పాటు చేసిన జెన్ జెడ్ పోస్టాఫీస్లో నగదు చెల్లింపుతో పాటు ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు అందుబాటులో ఉండడంతో పేమెంట్ ఈజీగా మారింది. టైం దొరికినప్పుడల్లా పోస్టాఫీస్కు వెళ్లాలనిపిస్తోంది. – నవ్య, ఎమ్మెస్సీ విద్యార్థిని -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు.. కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 16న ఆరో పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీస్తు దీవెనలు ఉండాలి కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కెథిడ్రల్ చర్చిలో శనివారం యేసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హుండీలో నగదు అపహరణ ఖానాపురం: ఆలయంలో నగదు అపహరించుకెళ్లిన సంఘటన శనివారం జరిగింది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయంలో హుండీ ఉంది. అటువైపు వెళ్లిన గ్రామస్తులు సుబ్బారావు, మాధవరావుకు హుండీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతకగా యాగశాల వద్ద హుండీ పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. అందులో ఉన్న సుమారు రూ.2వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. రామాలయ చైర్మన్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గీత కార్మికుడికి తీవ్ర గాయాలు వర్ధన్నపేట: తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడడంతో గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఇల్లందలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తిని రాజు శనివారం ఉదయం తాటి వనంలో కల్లు గీయడానికి వెళ్లాడు. తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో అతడి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి గీతకార్మికులు రాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108లో తరలించారు. ఆస్పత్రిలో రాజు చికిత్స పొందుతున్నాడు. -
పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్
నిట్ వరంగల్ విద్యార్థులు పోస్టల్ ప్రొడక్ట్స్, స్టాంప్స్పై ఇంటర్న్షిప్ చేస్తే ప్రోత్సాహం కల్పిస్తాం. విద్యార్థులు పోస్టల్ సేవల్ని వినియోగించుకునేందుకు జెన్ జెడ్ పోస్టోఫీస్ను నిట్ వరంగల్ క్యాంపస్లో ఏర్పాటు చేశాం. విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, సిబ్బందికి ఆధునిక టెక్నాలజీతో సేవలందిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్కు పోస్టల్ ప్రమాద బీమాపై అవగాహన కల్పించి ప్రీమియం చెల్లించేలా ఆసక్తి కనబర్చాం. – వి.హనుమంతు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, హనుమకొండ కార్పొరేట్ ఆఫీస్ను తలపిస్తోంది..మా క్యాంపస్లో ఏర్పాటు చేసిన మా జనరేషన్కు తగ్గట్టు జెన్ జెడ్ పోస్టాఫీస్ కార్పొరేటర్ స్థాయి ఆఫీస్ను తలపిస్తోంది. ఫ్రీ వైఫై సేవలు ఆస్వాదిస్తున్నాం. కాఫీ లాంజ్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లోని మా ఫ్రెండ్స్ నిట్లోని జెన్జెడ్ పోస్టాఫీస్ను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. – చిన్న వెంకటరమణ, ఈసీఈ బీటెక్ ఫైనలియర్● -
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఎంట్రెన్స్ ● మొత్తం 5,648 మందికి 4,383 మంది హాజరుఖిలా వరంగల్: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతగా ముగిసింది. 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 5,648 మంది విద్యార్థులకు 4,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 89 శాతం విద్యార్థులు హాజరుకాగా 1,265 మంది గైర్హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పర్యవేక్షకురాలు, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణిమ తెలిపారు. 80 సీట్లకు 4,383 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. పోలీసు బలగాలు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. విద్యార్థులను గంటముందే పరీక్ష హాళ్లలోకి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజాస్వామ్యంపై అవగాహన అవసరం
సంగెం: విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యంపై అవహన పెంచుకోవడం అభినందనీయమని జీసీడీఓ ఫ్లోరెన్స్ అన్నారు. శుక్రవారం గవిచర్ల మోడల్ స్కూల్లో జిల్లాలోని 16 పీఎంశ్రీ స్కూళ్ల మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అనంతరం జిల్లాస్థాయి క్విజ్, స్పెల్ బీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ప్రతిభ చాటారు. క్విజ్లో టీజీఆర్ఎస్ నెక్కొండ గర్ల్స్ జేసీ (ప్రథమ), మాక్ పార్లమెంట్లో జడ్పీహెచ్ఎస్ నర్సంపేట, స్పెల్బీలో టీజీఎంఎస్ గవిచర్ల బి.తరుణిమ, టీజీఎస్డబ్ల్యూ గర్ల్స్ జేసీ బి.సహస్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, ప్రిన్సిపాల్ ఎస్పీ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సేవల వినియోగంపై చైతన్యపర్చాలి
ఎంజీఎం: ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. శుక్రవారం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో న్యాయవాది కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని వైద్య పరంగా ప్రజలు ఖర్చు తగ్గించుకునేలా అవగాహన కలిగించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పారా లీగల్ వలంటీర్లు కూడా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ సేవలు, ఉచితంగా అందించే డయాగ్నస్టిక్ సేవలు, మందులు, వైద్య సలహాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా హనుమకొండ డీఎల్ఎస్ఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈకార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు ఈ.బాబు, మరియా థామస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద దుగ్గొండి: రెండో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఓటరు జాబితాలు, ఇతర స్టేషనరీ ప్యాకింగ్ విధానాన్ని పరిశీలించారు. మండల పరిధిలోని గ్రామాలు, వార్డులు, సిబ్బంది కేటాయింపు, రూట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఓటు వేసే ప్రదేశంలో వెలుతురు బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటింగ్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. దేశాయిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను తహసీల్దార్ రాజేశ్వర్రావుకు అప్పగించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీసుకొండలో ఏర్పాట్ల పరిశీలన గీసుకొండ: గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి, మండలాల్లో ఈ నెల 14న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద గీసుకొండ మండలంలోని పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, హరిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అధికారుల రాకపోకలు సజావుగా సాగడానికి అవసరమైన క్యూలైన్లు, సహాయక కేంద్రాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, విద్యుత్, ఇంటర్నెట్, భద్రత తదితర విషయాలపై అప్రమత్తంగా ఉండాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న రెండు హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వరంగల్ ఆర్టీఓ సుమ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలిన్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప నను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు
హన్మకొండ అర్బన్: జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఈనెల 14న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసేందుకు ఆయా మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, వేలేరు, పరకాల మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, ఫర్నిచర్, తాగునీరు, భోజన వసతి, తదితర ఏర్పాట్లు కల్పించారు. శనివారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
విద్యారణ్యపురి: ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఇండియా 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టెయినబుల్ రిపబ్లిక్’ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సుల్లో చర్చల ద్వారా పలు అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. ఈసదస్సులో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్, ఆల్ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ మెంబర్ ప్రిసిడియం డి రమేష్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్ది ఫెస్టిసైడ్ ఆక్షన్ నెట్వర్క్స్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సామ్యూల్ ప్రవీణ్కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేషన్, ప్రఖ్యాత ట్రాన్స్జెండర్ రచన మందరబోయిన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు, ఎం.అరుణ, సుజాత, మధు, కె.శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పద్మ, సారంగపాణి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 46 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముగిసిన జాతీయ సదస్సు -
ము
వరంగల్శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జాతర పనులు పూర్తి చేయాలి మేడారం మహా జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితిసాక్షి, వరంగల్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఊహించని ఫలితాలు వచ్చాయి. పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల వివిధ పార్టీల అధ్యక్షుల సొంత గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఇల్లంద సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ రెబల్స్ కాంగ్రెస్ అభ్యర్థులపైనా విజయఢంకా మోగించారు. ఫలితాలను విశ్లేషించుకుంటున్న ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ముఖ్యులు రెండు, మూడు దశల ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆలోచన చేస్తున్నారు. రాయపర్తి మండలంలోని 40 పంచాయతీలకు కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు నలుగురు, వర్ధన్నపేట మండలంలోని 18 పంచాయతీలకు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ ఐదు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు, పర్వతగిరి మండలంలో 33 పంచాయతీల్లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు రెండు గెలిచారు. స్వతంత్రుల్లో నలుగురు కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ రెబల్స్ హవా..● రాయపర్తి మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గారె సహేంద్ర భిక్షపతి 1,051 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 2065 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కుంట వినోదకు 1,005 ఓట్లు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి చందు లక్ష్మికి 756 ఓట్లు వచ్చాయి. ● బురహాన్పల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సూదిల ఉమ 155 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 560 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ బలపర్చిన కూస కవితకు 405 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ బలపర్చిన జంగిలి మాధవికి 300 ఓట్లు వచ్చాయి. గతంలో సూదిల ఉమ భర్త దేవేందర్ ఇదే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. పదవీ కాలం ముగిసిన తర్వాత భూతగాదాల కేసులో ఆయన హత్యకు గురయ్యారు. ● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పీఏ బిర్రు రాజు భార్య మౌనిక కాంగ్రెస్ మద్దతుతో వర్ధన్నపేట మండలం నల్లబెల్లి సర్పంచ్గా బరిలోకి దిగారు. రెబల్ అభ్యర్థి జక్కి అనిత 851 ఓట్లతో గెలిచారు. మౌనికకు 761 ఓట్లు వచ్చాయి. ● వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఏడుదొడ్ల అహల్యదేవికి 318 ఓట్లు వచ్చాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కర్క నరసింహారెడ్డికి 279 ఓట్లు వచ్చాయి. అమ్మమ్మపై మనవరాలి గెలుపు.. ● వర్ధన్నపేట మండలం కట్య్రాల (ఎస్టీ మహిళ)లో బీజేపీ బలపర్చిన రాయపురం రమ్య 9 ఓట్లతో గెలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన సుల్తాన్ పోషమ్మకు ఈమె మనవరాలు (బిడ్డ బిడ్డ) కావడం గమనార్హం. రమ్యకు 720 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన సుల్తాన్ దుర్గమ్మకు 721 ఓట్లు వచ్చాయి. రమ్య అమ్మమ్మకు 359 ఓట్లు వచ్చాయి. ● చెన్నారంలో కాంగ్రెస్ బలపర్చిన చిందం లలిత సర్పంచ్గా గెలిచారు. ఆమె భర్త వార్డు మెంబర్గా గెలిచి ఉపసర్పంచ్ అవుదామని అనుకుంటే వార్డు మెంబర్గా ఓడిపోయాడు. ● పర్వతగిరి మండలం మూడెత్తుల తండా సర్పంచ్గా మూడు లకుపతి 21 ఓట్లతో గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన భార్య జ్యోతి సర్పంచ్గా గెలిచి సేవలందించారు. ‘టాస్’తో వరించిన అదృష్టం..వర్ధన్నపేట మండలం అంబేడ్కర్నగర్ ఒకటో వార్డులో కాంగ్రెస్ బలపర్చిన గోపల రూపకు 31, బొక్కల రజనికి 31 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేయగా రూప గెలిచింది. కొత్తపల్లిలో తొమ్మిదో వార్డు కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అనుముల సులోచన, నాగలక్ష్మికి చెరో 73 ఓట్లు వచ్చాయి. ఎన్నికల సిబ్బంది టాస్ వేసి సులోచన గెలిచినట్లు ప్రకటించారు. సొంత గ్రామాల్లో నాయకులకు ప్రతికూల ఫలితాలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులపైనే గెలిచిన రెబల్స్ కట్య్రాలలో అమ్మమ్మపై పోటీచేసి విజయం సాధించిన మనవరాలు టాస్తో ఇద్దరు వార్డు మెంబర్ల గెలుపు‘పట్టు’ నిలుపుకోలే.. బీఆర్ఎస్ పర్వతగిరి మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్రావు సొంతూరు కల్లెడలో కాంగ్రెస్ బలపర్చిన తక్కెళ్లపల్లి శ్రీనివాస్ గెలిచారు. బీఆర్ఎస్ బలపర్చిన చిన్నపాక శ్రీనివాస్పై 150 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి సొంతూరు దౌలత్నగర్లో కాంగ్రెస్ బలపర్చిన స్వరూప గెలిచారు. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు, సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎద్దు సత్యనారాయణకు పరాభవం తప్పలేదు. ఇల్లందలో బీఆర్ఎస్ బలపర్చిన బేతి సాంబయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. -
‘కోచ్’.. చకచకా...
శరవేగంగా కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200 మల్టిపుల్ కోచ్ల సామర్థ్యం గల యూనిట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అత్యాధునిక టెక్నాలజీ సిస్టంతో రాత్రి, పగలు నిర్మిస్తున్నాయి. 160 ఎకరాల్లో రూ.586 కోట్లతో 2023లో ప్రారంభించిన ఆర్ఎంయూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ కోచ్ల తయారీ, వందేభారత్ కోచ్లను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్ట్ను తనిఖీ చేసి పనులు పరిశీలించారు. త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికాలను ఆదేశించారు. ఆర్ఎంయూ ప్రధాన షెడ్లలో యంత్రాల ఫిట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ట్రాక్ పనులు, ఆర్యూబీ నిర్మాణం ఆర్ఎంయూలో తయారైన ఇంజన్లు బయటకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యపురం గ్రామ ప్రజల కోసం, రైల్వే గేట్లో నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఆర్యుబీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. భూములిచ్చాం.. ఉద్యోగాలివ్వాలి: నిర్వాసితులు ‘జీవనోపాధికి ఆధారమైన భూములను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చాం. ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, రైల్వే అధికారులు, జిల్లా అధికారులను కలిసి కోరాం. ఇప్పటికై నా మా గోడును ఆలకించి ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి’ అని 114 మంది అయోధ్యపురం భూనిర్వాసితుల కుటుంబాలు కోరుతున్నాయి. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాన షెడ్లలో కొనసాగుతున్న యంత్రాల ఫిట్టింగ్ షెడ్డునుంచి బయటకు కనెక్టివిటీ ట్రాక్ సిద్ధం రాకపోకలకు ఆర్యూబీ నిర్మాణం వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు ఆర్ఎంయూ ప్రాజెక్ట్లో నిర్మించేవి ఇవే..మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంప్హౌజ్, టాయిలెట్ బ్లాక్, ప్యాకెజ్ సబ్స్టేషన్, శౌవర్ టెస్ట్, రోడ్ వే బ్రిడ్జి, పంప్ హౌజ్, జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్టు, ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, 2,000 కేఎల్ కెపాసిటీ పాండ్, స్కార్ప్ బిన్స్, టర్న్బ్రిడ్జి, బౌండ్రివాల్, బాలెస్ట్ట్రాక్, రోడ్, పాత్వే, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. -
ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి నుంచి అధ్యక్ష మెడల్ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, శేషుమాధవ్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్చందర్రెడ్డి, బందెల మోహన్రావు హాజరయ్యారు. -
సకాలంలో పరిహారం అందించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలో అత్యాచార కేసుల్లో బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవ్వాలని, అందులో చర్చించే అంశాలను ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అత్యాచార ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్ కుమార్, ఈఓ సింధురాణి, డీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్సై శ్రీలత, పీఎంహెచ్ఎన్ డాక్టర్ రూబీన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, టీజీఎంఎస్ఐడీసీ, ఏండీ ఫణింద్రరెడ్డి ఐఏఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పార్నంది నరసింహమూర్తి వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు దేవాలయ ప్రాంగణంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంప శ్రవణ్కుమార్, సభ్యులు వరుణ్కుమార్, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం 11వ సబ్ జూనియర్స్ అండర్–14 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలు ప్రారంభించారు. ఉజ్వల భవిష్యత్కు క్రీడలు దోహదపడతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ గోకారపు శ్యామ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కోశాధికారులు రాజ్కుమార్, మహ్మద్ జాహూర్, పీఈటీ, పీడీలు నర్సయ్య, శ్రీధర్, శ్రీనివాస్, నిర్మల, సీనియర్ క్రీడాకారులు సీతారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.వరంగల్ క్రైం: ఈనెల 21వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీమార్గం ద్వారా వారి కేసులు పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోక్ అదాలత్కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. ఎవరైనా కేసుల్లో రాజీ కావాలనుకున్నవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్న్స్పెక్టర్లు రమేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
కోట అభివృద్ధికి అడుగులు
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ పాల్గొన్నారు. -
కాజీపేట టు పెంబర్తి..
బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్కు ఆదేశాలువిద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’ కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’ విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ములుగు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. ససేమిరా అంటున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్, అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తి లోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు. వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీకాజీపేటలోని ‘లా’కోర్సులో కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాల భవనం ఇదేఇక్కడి నుంచి తరలించొద్దు..కాజీపేటలో కొనసాగుతున్న బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. పెంబర్తికి తరలించొద్దు. నా కూతురు కూడా డిగ్రీ చదువుతోంది. విద్యకు దూరమయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. ములుగు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజీని ములుగు జిల్లాలోనైనా ఏర్పాటు చేయాలి. – కె.రాజు, ఓ విద్యార్థిని తండ్రి, ములుగు జిల్లా దేవగిరి పట్నం -
జేఈఈ క్యాంపు ప్రారంభం
కమలాపూర్: మండలంలోని గూడూరు శివారు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కళాశాలలో) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ (ఐఓఈ)లో భాగంగా.. జేఈఈ క్యాంపును డీఈఓ గిరిరాజ్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈక్యాంపులో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో ఉన్న 25 మంది విద్యార్థినులను స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఎంపిక చేశారు. కేజీబీవీ కమలాపూర్లో ఈ క్యాంపు మే వరకు కొనసాగుతుందని డీఈఓ తెలిపారు. ఈ క్యాంపులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జీఈసీఓ సునీత, ఎంఈఓ శ్రీధర్, డీఎస్ఓ శ్రీనివాస్స్వామి, ఎస్ఓ అర్చన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వార్డు సభ్యులుగా దంపతుల గెలుపు
పర్వతగిరి: మండలంలోని కొంకపాక గ్రామపంచాయతీలో దంపతులు వార్డు సభ్యులుగా గెలుపొందారు. గ్రామానికి చెందిన బొక్కల బాబు ఒకటో వార్డు సభ్యుడిగా, రెండో వార్డు సభ్యురాలిగా ఆయన భార్య బొక్కల హిమబిందు గెలుపొందారు. బొక్కల బాబుకు 107 ఓట్లు, ప్రత్యర్థి మాదాసి దేవరాజుకు 49 ఓట్లు వచ్చాయి. చెల్లనివి ఆరు ఓట్లు, నోటాకు ఒక ఓటు పోలైంది. రెండో వార్డులో హిమబిందుకు 109 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి మాదాసి సరితకు 52 ఓట్లు వచ్చాయి. చెల్ల నివి నాలుగు, నోటాకు రెండు ఓట్లు పోలయ్యాయి. బొక్కల బాబు, హిమబిందు కూడా దంపతులు కావడం విశేషం. -
మొదటి విడత విజేతలు వీరే..
వర్ధన్నపేట/పర్వతగిరి/రాయపర్తి: జిల్లాలో మొదటి విడత వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి వరకు అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన సర్పంచ్లను ప్రకటించారు. నీ కాళ్లు మొక్కుతా.. ఒక్క ఓటుదుగ్గొండి: మండలంలోని రేకంపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలు కొలుగూరి సుజాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి నామినేషన్ వేసింది. అయితే, ప్రచారం చివరి రోజు శుక్రవారం గ్రామంలోని పలువురి ఇళ్లకు తన కుమారుడు సుమంత్తో కలిసి వెళ్లింది. ఒక్క ఓటు వేసి సర్పంచ్గా గెలిపించండి ప్లీజ్ అంటూ ఓటర్ల కాళ్లు మొక్కారు.‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’ ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత సభలు, సమావేశాలు, మైక్లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తలరాతలు మార్చిన ఒక్క ఓటుకమలాపూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ‘ఒక్క ఓటు’ విలువ ఏంటో పోటీపడ్డ అభ్యర్థులతో పాటు గ్రామస్తులకు తెలియజేసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లిలో గువ్వాడి లక్ష్మికి 368 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి అర్వపెల్లి మంజులకు 367 ఓట్లు వచ్చాయి. శనిగరంలో కొత్తపల్లి రాజుకు 1,153 ఓట్లు రాగా ఆయన ప్యత్యర్థి మాదాసి సంపత్కు 1,152 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గ్రామాల్లో గువ్వాడి లక్ష్మి, కొత్తపెల్లి రాజు ఒకే ఒక్క ఓటుతో గెలుపొంది సర్పంచులుగా అందలం ఎక్కగా, ఒక్క ఓటు తేడాతో ఓడిన ప్రత్యర్థుల ఆశలు గల్లంతయ్యాయి. -
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్ఎస్
కాంగ్రెస్ కండువాలు కప్పుతున్న నాయకులువెంకటాపురం(ఎం): మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీ ఆర్ఎస్కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కండువాలు మార్చిన నాయకులు -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కొత్తపల్లి లెక్కింపు కేంద్రం వద్ద లొల్లి
మరిన్ని ఎన్నికల వార్తలువర్ధన్నపేట: కొత్తపల్లి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఇద్దరు వార్డు సభ్యుల మధ్య వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లగా.. కొత్తపల్లి 10వ వార్డు బరిలో కాంగ్రెస్ బలపరిచిన అనుగుల సులోచన, బీఆర్ఎస్ బలపరిచిన బీసుపాక నాగమ్మకు నిలిచారు. పోలైన ఓట్లు లెక్కించగా నాగమ్మకు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. ఇరువురి అనుమతితో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించగా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థుల అనుమతి మేరకు టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనుగుల సులోచనకు గెలిచింది. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కోపంతో బయటకు వెళ్లగా కార్యకర్తలు పెద్దఎత్తున గొడవకు దిగారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎక్కడి వారిని అక్కడికి పంపించారు. తిరిగి అధికారులు సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 8 బెంచ్లు.. లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు -
హస్తం మద్దతుదారుల హవా
సాక్షి, వరంగల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగిన వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో హస్తం హవా సాగింది. 91 పంచాయతీల్లో 56 మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా 26 సర్పంచ్ స్థానాలకు దక్కించుకున్నారు. బీజేపీ మద్దతుదారు ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాలు గెలిచారు. అయితే ఇంకా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవాల్సి ఉన్నా రెబల్స్ దెబ్బతో కొన్ని సర్పంచ్ స్థానాలు చేజారాయని ముఖ్యనేతలు అంటున్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులు కూడా గెలిచి తమ సత్తా చాటారు. 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.. తొలి విడత ఎన్నికలు జరిగిన పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా, మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీకి దిగారు. అయితే, గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది నుంచి 11 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. మండలాల వారీగా ఫలితాల వివరాలు.. కాంగ్రెస్ బలపరిచిన వారు మెజార్టీ సర్పంచ్ స్థానాలు కై వసం డబుల్ డిజిట్ దక్కించుకొని పోటీలో నిలిచిన బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కొన్నిచోట్ల స్వతంత్రుల గెలుపుమండలం గ్రామ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు పంచాయతీలురాయపర్తి 40 27 9 0 4 వర్ధన్నపేట 18 10 5 1 2 పర్వతగిరి 33 19 12 0 2 -
పర్వతగిరిలో మాజీ మంత్రి దయాకర్రావుకు ఎదురుదెబ్బ
పర్వతగిరి: స్వగ్రామం పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎదురుదెబ్బ తగిలింది. పర్వతగిరిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చీదురు శంకర్.. బీఆర్ఎస్ బలపర్చిన మాడుగుల రాజుపై ఘన విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గంతోపాటు వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో దయాకర్రావు స్థానికులకు అందుబాటులో ఉన్నా పర్వతగిరిలో అభ్యర్థిని గెలిపించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ గెలుపు గ్రామస్తులకు అంకితమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు ఆనందం పేర్కొన్నారు. -
వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్గా సుధీర్కుమార్
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్గా ఇమ్మడి సుఽధీర్కుమార్ గురువారం తిరిగి పూర్తి బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఆయన మూడు నెలల క్రితం హైదరాబాద్లోని హెచ్ఎండీఎకు వెళ్లారు. సుధీర్కుమార్ స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సమ్మయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, తిరిగి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్కుమార్కు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నేటితో ముగియనున్న రెండో విడత ప్రచారం సాక్షి, వరంగల్: రెండో విడతలో ఎన్నికలు జరిగే దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో పంచాయతీ అభ్యర్థుల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇంటింటికెళ్లి ఓట్లను అభ్యర్థించిన అభ్యర్థులు పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లకు ఫోన్కాల్స్ సైతం చేస్తున్నారు. వ్యూహలు రచిస్తూ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో రెండో విడత ప్రచారం ముగియనుంది. ఈ నెల 14న ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లోని 111 స్థానాలకు 360 మంది సర్పంచ్ అభ్యర్థులు, 906 వార్డులకు 2,142 మంది బరిలో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక ఓటర్లకు తాయిలాలు ఇచ్చి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థులున్నారు. అలాగే, ఈనెల 17న చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని వేగిరం చేశారు. 102 స్థానాలకు 307 మంది సర్పంచ్ అభ్యర్థులు, 809 వార్డులకు 1895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు ఖానాపురం: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, జిల్లా అధికారి కిష్టయ్య అన్నారు. రాగంపేట, కొత్తూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంటాలు ఇష్టారీతిన పెడుతూ నిర్వాహకులు మోసం చేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రాల నిర్వాహకులు 41 కిలోలే పెట్టాలని, అధికంగా పెడితే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18,800 మంది రైతుల నుంచి 80,614.620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 12,547 మంది రైతుల ఖాతాల్లో రూ.127.32 కోట్లు జమచేసినట్లు వివరించారు. సొసైటీ సిబ్బంది మేరుగు రాజు, వినయ్, రైతులు పాల్గొన్నారు. జంటసాళ్ల విధానంతో అధిక దిగుబడిఖానాపురం: మొక్కజొన్న సాగులో జంటసాళ్ల విధానం పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. రంగాపురం గ్రామంలో మొక్కజొన్న పంటను గురువారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు డీఏఓ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 53 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోందని తెలిపారు. సెప్టెంబర్లో 3,176, నవంబర్లో 2,769, డిసెంబర్లో ఇప్పటి వరకు 2,889 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించినట్లు తెలిపారు. పంటల సాగులో ఎక్కుగా ఫర్టిలైజర్స్ వాడితే రైతులు అనారోగ్యం పాలవుతారన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఫర్టిలైజర్ అధికంగా వాడి కాన్సర్తో రైతులు మృతిచెందినట్లు బీమా చెక్కుల పంపిణీ సమయంలో తెలిసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ బోగ శ్రీనివాస్, ఏఈఓ చందన, రైతులు పాల్గొన్నారు. -
వైద్యులకు రక్షణ కల్పించాలి
నర్సంపేట రూరల్: రాత్రి వేళ విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి.బాలాజీ అన్నారు. ఈ మేరకు గురువారం నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం రాత్రి 10.30 గంటలకు పర్శనాయక్తండాకు చెందిన మహిళ కాలు నరాలకు సంబంధించిన వ్యాధితో వచ్చిందని తెలిపారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయ్పాల్ ఆమెను పరిశీలించి అడ్మిట్ చేసుకుని ప్రాథమిక వైద్యం అందించారని పేర్కొన్నారు. టెక్నీషియన్లు రాత్రివేళ అందుబాటులో లేకపోవడంతో సీటి స్కాన్ చేసేందుకు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేసినట్లు వివరించారు. ఆమె వెంట వచ్చిన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యూటీ డాక్టర్ను దుర్భాషలాడి, ఆస్పత్రి ప్రధాన ద్వారం అద్దాలను పగులగొట్టి దాడికి యత్నించారన్నారు. దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. దాడికి యత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రొఫెసర్లు డాక్టర్ పరశురాం, డాక్టర్ గిరిధర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బాలరాజు, ఆర్ఎంఓ నవీన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మండలాల వారీగా పోలింగ్ శాతం
రాయపర్తి87.34%పర్వతగిరి86.59%వర్ధన్నపేట85.65%కమలాపూర్72.75%ఎల్కతుర్తి86.17%భీమదేవరపల్లి82.61%హన్మకొండ అర్బన్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం వార్డు సభ్యులు, సర్పంచ్ బ్యాలెట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఈక్రమంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు చేపట్టిన చైతన్య కార్యక్రమాలు ఫలితాలిచ్చాయని చెప్పవచ్చు. జిల్లాలో మూడు మండలాల్లో ఓటర్లు 1,28,651 ● వీరిలో పురుషులు 62,653 ● మహిళలు 65,997 ● జిల్లాలో మొత్తం పురుషులు 84.63% ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 83.30% మాత్రమే వినియోగించుకున్నారు. ● థర్డ్ జెండర్ కేటగిరీలో ఒకే ఓటు ఉండగా.. ఆ ఓటు వినియోగించుకోవడంతో ఆ కేటగిరీలో వందశాతం పోలింగ్ అయినట్లు నమోదైంది. ● మూడు మండలాల్లో ఎల్కతుర్తి మండలంలో అత్యధికంగా 86.55% పోలింగ్ నమోదైంది. భీమదేవరపల్లిలో తక్కువగా 82.61%, ● జిల్లాలో మొత్తం 1,08,003 ఓట్లు పోలయ్యాయి. ● వీరిలో పురుషులు 53,026, మహిళలు 54,976 ౖవైద్య సేవలు తనిఖీ చేసిన డీఎంహెచ్ఓమండలవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. కానిపర్తి, శంభునిపల్లిలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలను డీఎంహెచ్ఓ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నాగరాజు, డాక్టర్ అరుణ్, హెచ్ఈఓ రవీందర్, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్, 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలుతొలి విడతఓటింగ్ జరిగిందిలా..హనుమకొండ జిల్లా.. మండలం ఓటర్లు ఓటేసినవారు భీమదేవరపల్లి 40,897 33,783 ఎల్కతుర్తి 31,915 27,621 కమలాపూర్ 55,839 46,599 మరిన్ని ఎన్నికల వార్తలు : 10, 11లో.. -
రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ఆయా మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల ఎంపీడీఓలు, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల బ్యాలెట్ పేపర్లను సరిగ్గా ఉన్నాయా లేదా? అని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల (డీఆర్సీ)లో గ్రామపంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్సీలలో పోలింగ్ సిబ్బందికి సరిపోయేలా టేబుల్స్, కుర్చీలు, టెంట్లు వేయించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్సీతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలకు పలు సూచనలిచ్చారు. సమావేశంలో ఎంపీడీఓలు అనిల్ కుమార్, సుమనవాణి, నర్మద, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్న్స్, బ్యాంకు, చిట్ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 8, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్లు లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు -
డీఈఓగా గిరిరాజ్గౌడ్ బాధ్యతల స్వీకరణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ ) డీఈఓగా ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు బి.మహేశ్, బద్దం సుదర్శన్రెడ్డి, బండారు మన్మోహన్, సునీత, రఘుచందర్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ మధుసూదన్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా గిరిరాజ్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని, కలిసికట్టుగా పని చేద్దామని ఉద్యోగులకు సూచించారు. డీఈఓకు సన్మానం గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ నెహ్రూనాయక్, ట్రెజరర్ సంధ్యారాణి, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి ఇతర బాధ్యులు డీఈఓను కలిసి సన్మానించి పూలమొక్క అందించారు. హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పాటు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు పాల్గొన్నారు. ఎంజీఎం: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హనుమకొండలోని మైత్రి శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లో గురువారం డ్రగ్ అధికారులు దాడి చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.5.82 లక్షల విలువైన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అఽధికారులు తెలిపారు. డ్రగ్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి ఉంచిన ఈ నిల్వలను డీసీఏ అధికారులు గుర్తించారు. ఈప్రాంగణంలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగించే స్టెరాయిడ్లు, హర్మోన్ల కోసం ఉపయోగించే ఔషధాలు, మొత్తం 35 రకాల మందులను గుర్తించినట్లు తెలిపారు. ఈదాడిలో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్ను పరిశీలించిన సమయంలో టెండర్ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. రూ.5 లక్షలిస్తే వారిపేరుపై గోల్డ్ మెడల్ ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం -
‘నమస్తే’ను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: డీ స్లడ్జింగ్ ఆపరేటర్లు,సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు ‘నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైడ్జ్ శానిటేషన్ ఏకో సిస్టిమ్)ను సద్వియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘నమస్తే’ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి ఈకార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సెప్టిక్ ట్యాంకుల డీ–స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ఏర్పాటు వేగం చేయండిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం హనుమకొండలోని మున్సిపల్ అతిథి గృహంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్యూఏ) ప్రతినిధులు, పి.డబ్ల్యూసి నిపుణులు, అధికారులతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్యూఐ కన్సల్టెంట్ రాహుల్, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల అవగాహన సదస్సు -
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వారీగా త్వరగా పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
విద్యారణ్యపురి: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం హనుమకొండలోని సామజగన్మోహన్ స్మారక భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ, ఎన్సీటీఈ చైర్మన్, కేంద్రంలోని విద్యాశాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ టీపీయూఎస్ అధ్యక్షుడు బత్తిని వెంకటరమణగౌడ్, టీపీయూఎస్ రాష్ట్ర నాయకులు చిదురాల సుధాకర్, పిన్నింటి బాలాజీరావు, దాస్యం రామానుజస్వామి, ఆముదాల దాత మహర్షి, రెండు జిల్లాల్లోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు టీపీయూఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అఽధికారిగా అయిల్నేని నరేందర్రావు, కె.వెంకటకృష్ణ పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పుల సతీశ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.శేఖర్ ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్గిరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిచే ఎన్నికల అధికారులు ప్రమాణం స్వీకారం చేయించారు. టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ -
యాక్షన్ ప్లాన్ రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకు 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకు 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు 4,550, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు 1,500 ఎకరాలకే ఈసారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్లో యాసంగి పంటలకు సాగు నీరు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు -
మరో మెగా రైల్వే ప్రాజెక్ట్
● ఒక రైలు ఇంజన్ సుమారు రూ.3 కోట్లు విలువ ఉంటుంది. దాని జీవిత కాలం సుమారు 16ఏళ్లు, ఆరు నెలలకోసారి ఇంజన్ పీఓహెచ్కు వెళ్తుంది. ● ఒక వ్యాగన్ సుమారు రూ.60 లక్షలు, జీవిత కాలం 35ఏళ్లు, వ్యాగన్ల రకాల దృష్ట్యా 4 లేదా 6 ఏళ్లకు ఒకసారి పీఓహెచ్కు వెళ్తుంది. ● ఆర్వోహెచ్ అంటే–రొటీన్ ఓవర్హాలింగ్. వ్యా గన్ 18 నెలలకోసారి ఆర్వోహెచ్కు వెళ్తుంది. ● పీఓహెచ్ అంటే.. పీరియాడికల్ ఓవర్హాలింగ్. ● సిక్లైన్ అంటే వ్యాగన్ల రిపేర్ ● యార్డు ఎగ్జామినేషనల్ లైన్ అంటే–గూడ్స్ వ్యాగన్ల ఫార్మేషన్ చెకింగ్ పాయింట్. ● రామగుండం, బెల్లంపల్లి, సనత్నగర్లో ఆర్వోహెచ్ డిపోలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో వ్యాగన్ల రిపేర్ కోసం రాయన్పాడ్ వర్క్షాప్, తిరుపతి సీఆర్ఎస్ వర్క్షాప్, కర్ణాటక యద్గిరి వర్క్షాప్లు అందుబాటులో ఉన్నాయి. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ సమీపంలో నష్కల్–ఘన్పూర్ మధ్య రైల్వేశాఖ రూ.908 కోట్లతో 300 ఎకరాల్లో మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ (మెగా ఫ్రైట్ పీఓహెచ్ వ్యాగన్ వర్క్షాప్, డిపో) నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేటకు మూడేళ్ల క్రితం రైల్వే వ్యాగన్ పీఓహెచ్ షెడ్ మంజూరైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ఇప్పటికే కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం స్పీడ్గా జరుగుతుండగా, 2026 మార్చి లేదా ఏప్రిల్లో ప్రా రంభించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. రైల్వే దినాదినాభివృద్ధిలో భాగంగా రైళ్ల రద్దీ, గూడ్స్ వ్యా గన్లు, ప్యాసింజర్స్ ట్రాఫిక్ను అధిగమించేందుకు, రవాణా, పాలనా సౌలభ్యం, ఎకానమీ, టైంను దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకేచోట ఉండేలా భావించిన రైల్వేశాఖ మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ డిపో ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాగన్ ఆర్వోహెచ్, వ్యాగన్ పీఓ హెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకే చోట ఉండేలా ఈ మెగా ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్ను భవిష్యత్లో అక్కడికే తరలించి అన్ని ఒకేచోట ఉండేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్ను మరింత అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఈ మెగా పీఓహెచ్ షెడ్ నిర్మాణం ఉండనుంది. ఆ రెండు చోట్ల అనుకున్నా.. ఒక దశలో మహబూబాబాద్, డోర్నకల్–కొత్తగూడెం మధ్య పోచారంలో ఈ మెగా రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. రైల్వేశాఖ మాత్రం అన్నింటికీ అనువుగా ఉండేలా, ట్రాక్ కనెక్ట్టివిటీ, అధికారుల పర్యవేక్షణ, రోడ్డు రవాణా, ఆపరేటింగ్ మూవ్మెంట్ను దృష్టిలో ఉంచుకుని 90 శాతం వరకు నష్కల్–ఘన్పూర్ మధ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి పాదనలు, సర్వేచేసిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు అన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపి టెండర్ ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. కాగా, రైల్వే బోర్డునుంచి ఆమోదం ఆలస్యమైతే ప్రాజెక్ట్కు మంజూరైన రూ.908 కోట్లు వృథా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాజీపేట–ఘన్పూర్ మధ్య నిర్మాణానికి రైల్వేశాఖ శ్రీకారం ఆర్వోహెచ్, పీఓహెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకేచోట రైల్వే మెగా వ్యాగన్ వర్క్షాప్ డిపోనకు డిజైన్ రూ.908 కోట్లు.. 300 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు భూమి సర్వే చేసిన అధికారులు.. మహబూబాబాద్, డోర్నకల్లో సెక్షన్లోనూ డిమాండ్ చివరికి నష్కల్–ఘన్పూర్ మధ్య ఫైనల్ -
ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) విద్యాశాఖ అధికారిగా ఎల్వి.గిరిరాజ్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిరాజ్గౌడ్ సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖ డీఈఓ నియామకంలో జాప్యం చేస్తోందని కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ అండ్ డీఆర్ఓ (ఎఫ్ఏసీ) వైవీ.గణేశ్కు ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం అందింది. సామాజిక మాధ్యమాల్లోనూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంజీఎం: జిల్లాలోని వైద్యాధికారులు ప్రతీ వారం అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, నగరంలోని యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ముక్త్ భారత్ అభియాన్, మాతా శిశు సంక్షేమం, ఎన్సీడీ, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఏఎన్ఎంల వారీగా సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీజీటీబీఎస్ఓలో మేనేజర్గా పని చేస్తున్న జె.పద్మావతిని సూపరింటెండెంట్ (టెంపరరీ)గా అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ బుధవారం వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీఎస్ ప్రసాద్రావు ఆరునెలలపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించేందుకు టెంపరరీగా పద్మావతికి బాధ్యతలు అప్పగించారు. శ్రీవాణి డీఈఓ ఆఫీస్కు.. హనుమకొండలోని ప్రభుత్వ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీవాణిని టెంపరరీగా హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విధులను నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెను సీనియర్ అసిస్టెంట్ విధు ల నుంచి రిలీవ్ చేయాలని సంబంధిత ప్రభు త్వ హైస్కూల్ హెడ్మాస్టర్ను ఆదేశించారు. వరంగల్ లీగల్: మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కోర్టులో మానవ హక్కులపై అవగాహన సదస్సును న్యాయమూర్తి బి.అపర్ణదేవి ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైసరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ మనిషికి హక్కులు, స్వేచ్ఛ, న్యాయం చేరేలా కృషి చేయాలని కోరారు. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షకులేనని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయాకర్, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైజరీ సత్య, కొంగర అనిల్కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేడు తొలి సంగ్రామం
హన్మకొండ అర్బన్: జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో మొత్తం 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 గ్రామపంచాయతీల్లో నేడు (గురువారం) పోలింగ్ జరగనుంది. మొత్తం 658 వార్డుస్థానాల్లో 150 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన 505 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 1.30 లక్షల ఓటర్లు తొలి విడత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,30,734 ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 63,681 మంది కాగా, మహిళలు 67,052 మంది. ఒకరు ఇతరుల కేటగిరీకి చెందిన ఓటరు ఉన్నారు. పటిష్ట ఏర్పాట్లు ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,931 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 789 మంది పోలింగ్ ఆఫీసర్లు కాగా, 1,142 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు, ఎన్నికల పర్యవేక్షణ కోసం 65 మంది స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి వంటి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు హక్కును మధ్యాహ్నం ఒంటి గంటవరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అనంతరం భోజన విరామం గంట.. తర్వాత బ్యాలెట్స్ లెక్కిస్తారు. బందోబస్తుకు సంబంధించి బలగాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహన కల్పించామని, ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో..సాక్షి, వరంగల్: జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 80 సర్పంచ్ స్థానాలు, 585 వార్డులకు మొదటి విడత పోలింగ్ జరగనుంది.జిల్లలోని మూడు మండలాల్లో ఎన్నికలు 1.30 లక్షల ఓటర్లు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


