Warangal
-
పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్ఆర్ఆర్తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం.. కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ను కట్ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే అతడు కిరాణా యజమానిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు. వెంటనే ఆ బ్యాచ్కి సంబంధించిన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్లోని షాపుల్లో ఆ బ్యాచ్కి చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించొద్దని షాపు నిర్వాహకులను ఆదేశించారు. వరంగల్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ మౌనిక కరీమాబాద్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, ఆ బ్యాచ్కు సంబంధించిన పెరుగు అమ్మకాలు నిలిపివేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో.. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్హాల్లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నితిన్ నబీన్ పర్యటనను విజయవంతం చేయాలి గీసుకొండ: జిల్లాలో పర్యటించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 29న రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రభారి కొండపెల్లి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడి పర్యటన.. పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడి పర్యటన జిల్లాకు మైలురాయిగా నిలువనుందని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర, జిల్లా నాయకులు జలగం రంజిత్రావు, రత్నం సతీష్షా, గురుమూర్తి శివకుమార్, ఎడ్ల అశోక్రెడ్డి, బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, గోగుల రాణాప్రతాప్ రెడ్డి, జిల్లా పదాధికారులు, మోర్చా, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: అన్న పానీయాలు, పారిశుద్ధ్యంపై రాజీ లేదని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. ఆదివారం వరంగల్ కాశిబుగ్గ సెంటర్లో రోడ్డుపై, అపరిశుభ్ర వాతావరణంలో టీ సెంటర్ ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే దుకాణాన్ని అనువైన ప్రదేశానికి తరలించాలని సూచించారు. ఈసందర్భంగా జీడబ్ల్యూఎంసీ మెడికల్ అధికారిని ఆదేశించి, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత దుకాణదారునిపై రూ.వెయ్యి జరిమానా విధించారు. డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ తదితరులు ఉన్నారు. హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సమావేశం, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేడు (సోమవారం) డీసీసీ భవన్లో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హాజరుకానున్నట్లు తెలిపారు. -
‘హైడ్రా’ను తెచ్చేందుకు సిద్ధమా?
● పశ్చిమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా వంటి సంస్థను వరంగల్కు తీసుకొచ్చేందుకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నగరంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను నిర్వీర్యం చేసిందని, కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. సీఎంగా నగరానికి వచ్చిన కేసీఆర్ అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని, ముంపు బాధితులకు రూ.10వేలు ఇస్తానని కేటీఆర్ జాడలేకుండా పోయాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించామని వెల్లడించారు. కేటీఆర్ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వరంగల్కు వస్తున్నాడని, హామీలను విస్మరించినందుకు కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బట్టలు ఊడదీసి ఉరికియ్యాలని అన్నారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కంటున్నాడు, కనీసం కార్పొరేటర్గా కూడా గెలవడని ఎద్దేవా చేశారు. ఇటీవల హనుమకొండ వచ్చిన హరీశ్రావు.. గంజాయి స్మగ్లర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. మామునూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ చేసిన ఏకై క జిల్లా వరంగల్ అన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎండీ అజీజ్ఖాన్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ముగ్గురి మృతితో విషాదం
పర్వతగిరి : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. పర్వతగిరికి చెందిన బుద్దె చరణ్, సోమారం గ్రామానికి చెందిన అహ్మద్, వడ్లకొండకు చెందిన ఎల్లాగౌడ్ మృతి చెందారు. కాగా, చరణ్ పెద్దనాన్న కుమారస్వామి కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చరణ్ తల్లి మమత, తండ్రి విజేందర్ సైతం ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ప్రాణాలతో బయటపడగా, విజేందర్ ఇటీవల ఓ విషయంలో పురుగుల మందు తాగి మృతిచెందాడు. మైనర్కి వాహనం.. మండల కేంద్రానికి చెందిన బుద్దె చరణ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకునే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, మైనర్ చరణ్ బైక్ నడుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని పట్టుకోవాల్సిన పోలీసులు పనిఒత్తిడి వల్ల నిఘా పెంచడం, కేసులు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనర్లను గుర్తించి పట్టుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. -
పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!
నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులుపక్క ఫొటోలో కనిపిస్తున్నది హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు ఇది. లబ్ధిదారు అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. ఇల్లు పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఫైనల్ బిల్లు (రూ.1.50 లక్షలు) ఇంకా ఖాతాలో పడలేదు. బిల్లు ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఇది ఈ ఒక్క లబ్ధిదారుడి పరిస్థితే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని అనేక మంది లబ్ధిదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ -
ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలి
వరంగల్ చౌరస్తా : ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. వరంగల్ ఐడీఓసీ నుంచి కాశిబుగ్గ సర్కిల్ వరకు ఆదివారం 2కే రన్, మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షత వహించగా హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు జెండా ఊపి 2కే రన్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాలనను నిర్ణయించే గొప్ప అవకాశమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎస్ఐఆర్కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, స్వీప్ నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
యోగా సాధనతో ఏకాగ్రత పెంపు
ఖిలా వరంగల్: ప్రపంచానికి తమ దేశం అందించిన అమూల్యమైన జీవన విధానమే యోగా అని, వేగవంతమైన జీవన విధానంలో యోగా సాధనతో ఆరోగ్యం, శారీరక, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణం ప్రాంగణంలో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై 500 మంది విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఆర్వో విజయలక్ష్మి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పుష్పలత, డీపీఆర్వో ప్రేమలత, జిల్లా నోడల్ అధికారి మైదం రాజు, డిప్యూటీ నోడల్ అధికారి లత, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ మంజుల, జిల్లా కన్వీనర్ డాక్టర్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. – మరిన్ని ఫొటోలు 9లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలి
వరంగల్ చౌరస్తా : ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. వరంగల్ ఐడీఓసీ నుంచి కాశిబుగ్గ సర్కిల్ వరకు ఆదివారం 2కే రన్, మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షత వహించగా హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు జెండా ఊపి 2కే రన్న్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాలనను నిర్ణయించే గొప్ప అవకాశమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎస్ఐఆర్కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, స్వీప్ నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
నీట్ ప్రశాంతం
ఆర్ట్స్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద సీపీ సన్ప్రీత్సింగ్హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయ్సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల వద్ద విద్యార్థినితో మాట్లాడుతున్న పోలీసులుహనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం వద్ద ఇయర్ రింగ్ తీస్తున్న విద్యార్థిని, 4 రోజుల క్రితం యాక్సిడెంట్లో గాయపడ్డ కవితను పరీక్ష హాల్లోకి తీసుకొస్తున్న పోలీస్ సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రంలోకి పంపిస్తున్న పోలీసు సిబ్బందిహనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నీట్ పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని నీట్ పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ రవి, వరంగల్ అదనపు కలెక్టర్ గణేశ్, నీట్ సిటీ నోడల్ అధికారి ఆర్.భిక్షపతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. వరంగల్లోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.● పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు ● ఆలస్యంగా వచ్చిన ఇద్దరికి అనుమతి నిరాకరణ ● సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహణ ● హనుమకొండ, వరంగల్లో 4,195 మంది హాజరు89.71 శాతం మంది అభ్యర్థులు హాజరుకేయూ క్యాంపస్/వరంగల్ క్రైం/కాశిబుగ్గ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట (ట్రైసిటీ)లో ఏర్పాటు చేసిన 13 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా గంటపాటు సమయం ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. నీట్కు 13 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,676 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,195 మంది 89.71 హాజరైనట్లు నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ భిక్షపతి తెలిపారు. -
జాడలేని బిల్లు!
పూర్తయిన ఇల్లు.. నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులుసాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుదశ చెల్లింపు (రూపాయల్లో) పునాది పూర్తి 1,00,000 లెంటెల్ స్థాయి 1,50,000 స్లాబ్ పూర్తి 1,50,000 ఇల్లు పూర్తి 1,00,000 మొత్తం 5,00,000జిల్లా నియోజకవర్గాలు మంజూరు పూర్తి హనుమకొండ 2 8,000 2,400 వరంగల్ 3 9,000 1,760 జనగామ 2 5,600 1,860 మహబూబాబాద్ 2 10,148 2,750 ములుగు 1 5,100 1,165 జేఎస్ భూపాలపల్లి 1 4,152 565 11 42,000 10,500 -
జయశంకర్ది అలుపెరుగని పోరాటం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరగని పోరాటం చేశారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనియాడారు. పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని కార్యనిర్వాహకుడు కురిమిళ్ల సుదర్శనచారి ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలంగాణ పౌరులకు జరిగిన అవమానాన్ని భరించలేక తెలంగాణ సాకారం కోసం శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. సోనియాగాంధీతో సైతం చర్చించి సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన మహనీయుడు జయశంకర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు బీరం భరత్రెడ్డి, శ్రీరామోజు రోజారాణి, విజయ్కుమార్, వేముల సాంబయ్యగౌడ్, బీరం రవీందర్రెడ్డి, బత్తిని రాజేందర్, కె.బ్రహ్మచారి, కుదురుపాక జగదీశ్వర్చారి, మొగులోజు కోటిలింగాచారి, కొనుగోటి రవీంద్రచారి, కృష్ణుడు, రమేష్, వాసు, సుధాకర్, రమణాచారి, వీరాచారి, లక్ష్మిపతి పాల్గొన్నారు. -
రాష్ట్ర సాధనకు జయశంకర్ అలుపెరుగని కృషి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరుగని కృషి చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతివనంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, జయశంకర్ కుటుంబ సభ్యులు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూరపాటి వెంకటనారాయణ, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
నీట్ ప్రశాంతం
వరంగల్ సీకేఎం కళాశాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులుఆర్ట్స్ కళాశాల వద్ద బందోబస్తును పర్యవేక్షిస్తున్న సీపీ సన్ప్రీత్ సింగ్చెవి రింగ్ తీస్తున్న విద్యార్థిని, 4 రోజుల క్రితం యాక్సిడెంట్లో గాయపడ్డ స్టేషన్ ఘన్పూర్ మండల్ ఉప్పుగల్ గ్రామానికి చెందిన కవితను పరీక్ష హాల్లోకి తీసుకొస్తున్న పోలీస్ సిబ్బంది హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రంలోకి పంపిస్తున్న పోలీసు సిబ్బందిసీకేఎం కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్ సత్యశారదకేయూ క్యాంపస్/వరంగల్ క్రైం/కాశిబుగ్గ: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట (ట్రైసిటీ)లో ఏర్పాటు చేసిన 13 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా గంటపాటు సమయం ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. నీట్కు 13 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,676 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,195 మంది 89.71 హాజరైనట్లు నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ భిక్షపతి తెలిపారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నీట్ పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ రవి, వరంగల్ అదనపు కలెక్టర్ గణేశ్, నీట్ సిటీ నోడల్ అధికారి ఆర్.భిక్షపతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సీకేఎం కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.89.71 శాతం మంది అభ్యర్థులు హాజరు -
బియ్యం నాణ్యత పరిశీలన
న్యూశాయంపేట/ఖిలా వరంగల్: సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు హాస్టళ్లు, పాఠశాలలలు, రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) ఇర్ఫాన్, టాస్క్ఫోర్స్ ఎస్ఐ జంగయ్య, వరంగల్ జిల్లా సివిల్ సప్లయీస్ టెక్నికల్ అసిస్టెంట్లు వినాయక్, రాజయ్య, డీటీసీఎస్ కిరణ్తో కూడిన బృందం శనివార ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ ఈఎస్ఐ బాలికల హాస్టల్, తెలంగాణ మైనార్టీస్ హాస్టల్, జూనియర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా హస్టళ్లల్లో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రిన్సిపాళ్లు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి బియ్యం నాణ్యత, వినియోగంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, సంబంధిత అధికారులు బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బియ్యం విద్యార్థులకు చేరేలా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన నాన్న స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
వరంగల్
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026విద్యుత్ భద్రతపై రాజీ లేదు విద్యుత్ భద్రతపై రాజీ పడేది లేదని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హెచ్చరించారు. జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేతండ్రి ప్రోత్సాహంతో ఐఆర్ఎస్ అధికారిగాసాక్షి, వరంగల్: పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఆ కలలను నిజం చేసేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తారు. అలాంటి ఓ తండ్రి దూరదృష్టి, మార్గనిర్దేశం, ప్రోత్సాహంతో గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ భారత రెవెన్యూ సేవ (ఐఆర్ఎస్) అధికారిగా ఎదిగారు. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ తండ్రి ప్రభాకర్ ఓ సాధారణ రైతు. పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ తెలుసు. తన కుమారుడు ఉన్నత స్థానంలో ఉండాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసే దిశగా కుమారుడిని తీర్చిదిద్దారు. ‘చిన్నగా ఆలోచించొద్దు... ప్రపంచం చాలా పెద్దది’ అని తండ్రి తరచూ చెప్పేవారని కిరణ్ గుర్తు చేసుకుంటారు. గ్రామీణ వాతావరణంలో పెరిగినా ప్రపంచస్థాయి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రోత్సహించేవారు. ఏ కోర్సు చదవాలి, ఏ పాఠశాలలో చేరితే భవిష్యత్ బాగుంటుంది, ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను తెలుసుకుని తనకు వివరించేవారని పేర్కొన్నారు. చేతిరాత నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు.. పిల్లల అభివృద్ధి కేవలం చదువుతోనే కాదని భావించిన ప్రభాకర్.. కుమారుడి వ్యక్తిత్వ వికాసంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చేతిరాత అందంగా ఉండేందుకు ప్రతిరోజూ రాయించేవారు. పాఠశాల ఉపాధ్యాయులను తరచూ కలిసి చదువు పురోగతి తెలుసుకునేవారు. మంచి స్నేహితులను ఎంచుకోవడం నుంచి సమయపాలన వరకు అనేక విషయాల్లో మార్గనిర్దేశం చేసేవారు. నాన్నే నా తొలి గురువు.. నా జీవితంలో నాన్నే తొలి గురువు. ఆయన కలలు, కష్టం, మార్గనిర్దేశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నేను సాధించిన ప్రతి విజయానికి మూలం ఆయనే. ఎవరితో స్నేహం చేయాలి.. ఎవరితో వద్దనే విషయాలను కూడా నాన్న చెప్పేవారు. క్రమశిక్షణతో ఉండాలని, లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించేవారు. ఆయన చూపిన మార్గంలో నడవడం వల్లే చిన్న గ్రామం నుంచి ఇంతదూరం వచ్చా. విద్య, ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రతిరోజూ నడవడం, డ్రైఫ్రూట్స్, నానబెట్టిన గింజలు తీసుకోవడం వంటి అలవాట్లను చిన్నప్పుడే నేర్పించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించగలమని చెప్పేవారు. మధ్య తరగతి రైతు కుటుంబమైనా తనకు, తన చెల్లికి ఎలాంటి లోటు లేకుండా నాన్న పెంచారు. కుటుంబ పరిస్థితులు పరిమితంగా ఉన్నా పిల్లల చదువుల విషయంలో రాజీ పడలేదు. ఎలా ఉండాలి, ఎలా ఎదగాలో తండ్రి చూపిన మార్గమే నేడు నన్ను ఐఆర్ఎస్ అధికారిగా నిలబెట్టింది. – సయింపు కిరణ్గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదం -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 21 (ఆదివారం)న నీట్ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 4,676 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5–15 గంటల వరకు నీట్ నిర్వహించనున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంటపాటు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. పరీక్ష నిర్వహణ కోసం 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక అబ్జర్వర్, ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 11–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇప్పటికే ఎన్టీఏ నీట్ ప్రశ్నపత్రాలను సురక్షితంగా చేరవేసింది. ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో.. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులను నడపనుంది. వరంగల్ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రథమ చికిత్స సదుపాయం, అవసరమైన వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనున్నారు. నీట్ జిల్లా కో–ఆర్డినేటర్గా కేంద్రీయ విద్యాలయం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భిక్షపతి వ్యవహరిస్తున్నారు. పరీక్ష కేంద్రాలివే.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వరంగల్ నిట్లో రెండు కేంద్రాలు, వరంగల్లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి జూనియర్ కళాశాల, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, వరంగల్లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, ఎల్బీ కళాశాల, ఎల్బీ కాలేజీ ఎడ్యుకేషన్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. సీకేఎం కళాశాల కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ కలెక్టర్ పలు పరీక్ష కేంద్రాల్లో శనివారం మాక్డ్రిల్ నిర్వహించారు. వరంగల్లోని సీకేఎం కళాశాల పరీక్ష కేంద్రాన్ని వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ గణేశ్ సందర్శించారు. ఎలా ఉన్నాయో పరిశీలించారు. నీట్ జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ జూనియర్ కళాశాల, పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను పరిశీలించారు. నేడు నీట్ పరీక్ష.. అధికారుల ఏర్పాట్లు 13 కేంద్రాలు.. 4,676 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్ల మూసివేత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు వరంగల్ క్రైం: నీట్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులను అదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శనివారం పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రతి కేంద్రంలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించాలని, పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ఎలక్టాన్రిక్ పరికరాలను అనుమతించవద్దని, పరీక్ష కేంద్రం వద్ద సీఆర్పీ ఎఫ్ సిబ్బంది సైతం విధులు నిర్వర్తిస్తారని, స్థానిక పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. పరీక్ష పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పాటు పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను సేఫ్ హౌస్లకు తరలించే సమయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు పరీక్ష జరిగే ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, ఎలాంటి పుకార్లు ప్రచారం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే కథనాలపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. -
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
● అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న 4309 గుడిసెవాసుల వివరాలను సోమవారం నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల వివరాలను నమోదు చేయాలన్నారు. సేకరించిన జాబితాను గ్రామైక్య సంఘాలకు అందజేసీ, వారు పరిశీలించి తీర్మానం చేసిన అనంతరం ఎంపీడీఓలకు పంపించాలని సూచించారు. తొలి దశలో మంజూరైయిన 5,373 ఇళ్ల నిర్మాణాలను ఆగస్టు 15వరకు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంత, ఆరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై సమీక్ష ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ అమలు పురోగతి పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, కార్యక్రమాల అమలు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సమన్వయంతో పనిచేసి కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయలని కలెక్టర్ ఆదేశించారు. డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి కేటాయించాలివర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం భూ కేటాయింపులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులు, రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మె రుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతుందని తెలిపారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్, విజయ్సాగర్, అధికారులు పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం వరంగల్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ శిల్పాల ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
లోక్ అదాలత్కు అపూర్వ స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, యం.రామకృష్ణ సునీత హాజరై జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేయగా.. వరంగల్–8, నర్సంపేట–2 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఇందులో సివిల్ కేసులు–33, క్రిమినల్ కేసులు 4,456, బ్యాంక్ పీఎల్సీ కేసులు–34, బీఎస్ఎన్ఎల్ కేసులు–19, ఎలక్ట్రిసిటీ పియల్సీ కేసులు–65, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు–68,373, సైబర్క్రైమ్–15 పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ న్యాయమూర్తులు నారాయణబాబు, పద్మజ, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, న్యాయమూర్తులు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ, బార్కౌన్సిల్ మెంబర్ సహోదర్రెడ్డి, ఇతర న్యాయవాదులు, బెంచ్ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, కక్షిదారులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత పాఠశాలలో వైదిక స్మార్త ఆగమం, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అసిస్టెంట్ కమిషనర్, శ్రీభద్రకాళి దేవాలయం ఈఓ రామల సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద పాఠశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు మాతృభాషలో చదవడం, రాయగలిగిన వారు, 8 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, తదితర అర్హతలున్న రామల సునీత తెలిపారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలోని వేదపాఠశాల కార్యాలయంలో 2026 జూన్ 21 నుంచి దరఖాస్తు ఫారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను 2026 జూన్ 26 వరకు వేదపాఠశాల కార్యాలయంలో అందించాలని సూచించారు. కాశిబుగ్గ: ఈ నెల 21న ప్రపంచ యోగా దినో త్సవం సందర్భంగా వరంగల్ కాశిబుగ్గ వివేకానంద కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ట్ కుసుమ లింగమూర్తి కందిపప్పు, పల్లి గింజలపై యోగాసనాల చిత్రాలు వేశారు. తనదైన శైలిలో యోగాసనాలు చేస్తున్నట్లు చిత్రాలను మలిచారు. ఇప్పటివరకు ఆయన చాలాసార్లు వివిధ ఆకృతులతో శనగపప్పు, బియ్యపు గింజలు, ద్రాక్ష పళ్లపై కూడా అద్భుతమైన కళాఖండాలు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 28న కల్నల్ సంతోశ్బాబు మెమోరియల్ ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి శనివారం కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ వికాస్ హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన అండర్–10, 12, 14 విభాగాల నుంచి ఇద్దరు బాలబాలికలను, ఓపెన్ విభాగం నుంచి ఇద్దరిని జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ చెస్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్ల రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 21న హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ పద్మాక్షి గుట్ట రోడ్డులోని ప్రసన్నాంజనేయ దేవాలయం ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే సదస్సుకు యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ డ్రైవర్లు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళితో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 648 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 511 మంది ఉత్తీర్ణత (79శాతం) సాధించారు. నాలుగో సెమిస్టర్లో 71 మందికి గాను 346 మంది ఉత్తీర్ణత (74శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్లో 425 మందికి 397 మంది (93 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. ఈఫలితాల విడుదలలో పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారులు కొలిపాక శ్రీనివాస్, రాజిరెడ్డి, విభాగాల అధిపతులు సురేశ్బాబు, రామకృష్ణారెడ్డి, రేణుక, మాధవి, మధు, కవిత, ప్రవీణ్కుమార్, బాలరాజు, లకన్సింగ్, సునీత, మమత, లక్ష్మీకాంతం, రమారత్నమాల, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ పర్యటన
గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎన్.శ్రుతి శనివారం పర్యటించారు. ఎంపీడీఓ విధులు, బాధ్యతలపై అవగాహన కోసం మండలానికి వచ్చిన ఆమె శాయంపేట హవేలిలోని ప్రాచీన పాంచాలరాయ ఆలయం, కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను సందర్శించారు. వాటి చారిత్రక ప్రాధాన్యం, పూజా కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. విశ్వనాథపురంలో ఏర్పాటు చేసిన బాలల గ్రామ సభలో పాల్గొన్నారు. బాల్యం నుంచే ప్రజాస్వామ్య ప్రక్రియ, విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సర్పంచ్లు కన్నెబోయిన యమున, దారవత్ జ్యోతి, గాలి యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు మురళీకృష్ణ, శ్రీధర్, సునీల్, అర్చకులు రామాచార్యులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్కు అపూర్వ స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత హాజరై జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేయగా.. వరంగల్–8, నర్సంపేట–2 బెంచ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 4,489 పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు–33, క్రిమినల్ కేసులు 4,456, బ్యాంకు పీఎల్సీ కేసులు–34, బీఎస్ఎన్ఎల్ కేసులు–19, ఎలక్ట్రిసిటీ పియల్సీ కేసులు–65, ట్రాఫిక్ ఈ–చలాన్ కేసులు–68,373, సైబర్క్రైమ్–15 పరిష్కరించినట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ న్యాయమూర్తులు నారాయణబాబు, పద్మజ, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, న్యాయమూర్తులు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ, బార్కౌన్సిల్ మెంబర్ ఎం.సహోదర్రెడ్డి, ఇతర న్యాయవాదులు, బెంచ్ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, కక్షిదారులు పాల్గొన్నారు. విత్తన విక్రయ షాపుల్లో తనిఖీలుగీసుకొండ: విశ్వనాథపురం, మచ్చాపూర్, గొర్రెకుంట గ్రామాల్లోని విత్తన విక్రయ షాపులు, గోదాములు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను శనివారం ఏడీఏ కల్పన ఆకస్మిక తనిఖీ చేశారు. ఏఓ హరిప్రసాద్బాబు, ఎస్టీఎల్ఏఓ గోవర్ధన్రెడ్డితో కలిసి ఆమె పలు షాపుల్లో స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోర్స్ సర్టిఫికెట్ ఉన్న విత్తనాలనే విక్రయించాలని, ధరల పట్టికలు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా షాపుల వద్ద ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని, రైతు సంతకం తీసుకోవాలని షాపుల షాపుల నిర్వాహకులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అమ్మినా, నిల్వచేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రాజు మృతిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదుగీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ల్యాదల రాజు(లవ్ రాజు) మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 19న రాజు మృత దేహం లభ్యమైందని, అది ముమ్మాటికీ హత్యే అని మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అతడిది సహజమరణమని తప్పుగా ధ్రువీకరించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెస్పీ జాతీయ నాయకులు మంద కుమార్, మండల నాయకులు ఇనుముల పూర్ణయ్య, సీహెచ్ రవి, మృతుడి భార్య ప్రియాంక, కూతురు శ్రేష్ట తదితరులు కమిషన్కు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతినర్సంపేట రూరల్: బోలెరో వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన నర్సంపేట మండలంలోని ఆకులతండాలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజు (50) ద్విచక్రవాహనంపై నర్సంపేట వైపు వెళ్తున్నాడు. నర్సంపేట మండలంలోని ఆకులతండా వద్ద ఎదురు బొలెరో వాహనం వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మహిళా సంఘాలకు పెద్దపీట
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శ్రీరామోజీ కుమ్మరిగూడెంలో రూ.10 లక్షలతో ఇందిర భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూమి పూజ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కొండా సురేఖ, సీతక్కకు మంత్రి పదవులు ఇచ్చి మహిళల గౌరవాన్ని కాపాడినట్లు తెలిపారు. బీఆర్ఎస్ బతుకమ్మ చీరలు ఇస్తే పంట పొలాల్లో పిట్టలు వాలకుండా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అందించిన చీరలు ఎంతో నాణ్యమైనవని చెప్పారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. రేకుల షెడ్డు నిర్మాణానికి తన వేతనం నుంచి రూ.10 వేలు సర్పంచ్ భూక్యా సుశీలకు అందించారు. స్కూల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బావనికుంట తండాలో విద్యుదాఘాతంతో మృతిచెందిన నూనావత్ గణేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గణేశ్ మృతదేహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పీఎసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్కన్నా, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, నాయకులు పోషాల వెంకన్న, భూక్యా చిన్న శంకర్, ఉప్పునూతుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన
కాశిబుగ్గ: వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రి పనులు సకాలంలో పూర్తయితే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్గా అశోక్ వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్గా జి.అశోక్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ జోనా.. డిప్యూటేషన్పై విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కమిషనర్ అశోక్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయడం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణిని అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టల్లో నమోదు తప్పనిసరి రామన్నపేట: హనుమకొండ జిల్లాలోని క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ తప్పనిసరిగా తెలంగాణ క్యాన్సర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్ఓ ఎస్డీ రాంకుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని రెనోవా బన్ను క్యాన్సర్ హాస్పిటల్, అజర హాస్పిటల్, విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, రాడార్ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ రాంకుమార్ మాట్లాడుతూ ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి నిర్ధారణ, రిపోర్టింగ్లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్వు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో సాంస్కృతిక వైభవాన్ని నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజీ, హరిత కాకతీయ హోటల్ మేనేజర్ అశోక్రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త కుసుమ సూర్యకిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శనివారం) సాయంత్రం 6 నుంచి రాత్రి గంటల వరకు కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే పేరిణి నృత్యం, చిందు యక్షగానం ప్రదర్శించనున్నుట్లు వివరించారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక హన్మకొండ అర్బన్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్న్, ఐదుగురు కమిషన్ సభ్యులు శనివారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. భూవివాదాలు, అట్రాసిటి కేసులు, వివిధ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలుపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. సమావేశానికి జిల్లా అధికారులు పూర్తిస్థాయి నివేదికలు, పూర్తి సమాచారంతో హాజరుకావా లని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. -
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
న్యూశాయంపేట: వానాకాలం సాగులో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చూడడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ, సహకార, రెవెన్యూ, పంచాయతీరాజ్, మార్క్ఫెడ్ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో సాగుకు ఏర్పాట్లు, పంటమార్పిడి విధానాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతను అరికట్టేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, సంబంధిత శాఖల అధికారులు, మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దారులు, ఎరువుల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు. సర్వే పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నక్ష టౌన్ సర్వే, ఎంజాయ్మెంట్ సర్వే, నాన్ కడాస్ట్రల్ సర్వే అమలు, పురోగతిపై హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్కుమార్, సర్వే, సెటిట్మెంట్ అండ్ ల్యాండ్ రికార్ట్స్ కమిషనర్ రాజీవ్ హనుమంతు శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపిక చేసి 70 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే పురోగతి, ఆయా గ్రామాల్లో రీసర్వే చేపట్టేందుకు అవసరమైన గెజిట్ ప్రచురణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను వారు ఆదేశించారు. నక్ష టౌన్ సర్వే అమలులో నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకుని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్ట్స్ ఎం.శ్రీనువాసులు, అధికారులు పాల్గొన్నారు. -
సంఘాల్లోని స్టాక్ కొనుగోలు
కాశిబుగ్గ: చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత ఉత్పత్తుల ఖరీదు చేయాలని, నేతన్నలకు పెరిగిన వేతనాలు కూడా చెల్లించాలంటూ చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెస్కో అధికారులు ఉమ్మడి జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న లక్ష కార్పెట్లు, 38వేల బెడ్షీట్లను ఖరీదు చేశారు. వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేసిన విషయం తెలిసిందే. చేనేత కార్మికుల దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సందర్శించి డిమాండ్లను తెలుసుకుని, వారం రోజుల్లోపు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కొండా సురేఖ హామీ నెరవేరడంతో పలు సంఘాల నాయకులు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కదిలొచ్చిన చేనేత జౌళిశాఖ, టెస్కో అధికారులు సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్షీట్లు ఖరీదు చేయడంతోపాటు మళ్లీ 2 లక్షల చొప్పున కార్పెట్లు, బెడ్షీట్లు కొనుగోలుకు ఇండెంట్ ఇవ్వాలని చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు. అలాగే, పెరిగిన 30 శాతం వేతనాలను మార్చి 31నుంచి అమలు చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక టెస్కో టెక్నికల్ సిబ్బంది శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని చేనేత సంఘాలను సందర్శించి చాలాకాలం నుంచి నిల్వ ఉన్న స్టాక్ను కొనుగోలు చేశారు. దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల విలువ గల లక్ష కార్పెట్లు, రూ.కోటి 30లక్షల విలువ గల 38వేల బెడ్షీట్లను టెస్కో అధికారులు కొనుగోలు చేశారు. మాట నిలబెట్టుకున్న మంత్రి సురేఖ చేనేత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కొండా సురేఖ మాట నిలబెట్టుకున్నారని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అలాగే చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానంనుంచి టెస్కో ద్వారానే కొనుగోళ్లు చేయించాలని కోరారు. లక్ష కార్పెట్లు, 38వేల బెడ్షీట్ల ఖరీదు నెరవేరిన మంత్రి కొండా సురేఖ హామీ చేనేత నాయకులు, కార్మికుల హర్షం -
పాపాలు పోవడానికే కుట్టుమిషన్ల పంపిణీ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నడికూడ: పాపాలు పోవడానికే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి విమర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.60 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి మాట్లాడారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి చేసేవన్ని దరిద్రపు పనులేనని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గుప్తనిధుల కోసం కౌకొండ గుట్టలను కొల్లగొట్టారని, గుట్టలను తవ్విన మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు విక్రయించి అక్రమ లాభాలు పొందారని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ● పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ ఆత్మకూరు: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీరాజ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ సూచించారు. మండలంలోని కొత్తగట్టు గ్రామంలోని కంపోస్టు తయారీ, తడి, పొడి చెత్త సేకరణ, ఉపాధి హామీ పనులు, నర్సరీ నిర్వహణను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు అందించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో జాప్యం తగదని, వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను అధికారులు సూచించిన తేదీల ప్రకారం శుభ్రం చేయాలన్నారు. ప్రజలకు పరిసరాల శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, వారికి గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డీఎల్పీఓ రవిబాబు, ఎంపీఓ యోగిత, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, సర్పంచ్ శ్రీజ, కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీనం.5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడేల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా చేయనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీ రెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. -
స్కూళ్లలో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
సంగెం: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నిరుపేదలకు వచ్చిన ఉద్యోగావకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిమ్మాపూర్ ఎంపీపీఎస్లో 2026 – 27వ సంవత్సరానికి ప్రీప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు ఈనెల 19వ తేదీన తుది గడువుతో అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆయా పోస్టు కోసం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లకొండ మౌనిక దరఖాస్తు చేసుకోవడానికి తాను చదువుకున్న జెడ్పీహెచ్ఎస్కు వెళ్లి తన 7వ తరగతి మార్కుల జాబితా కావాలని కోరింది. పాఠశాలలో 2009 – 10కి సంబంధించిన మార్కుల రికార్డులు లభించలేదు. ఆ ఏడాది 7వ తరగతిలో 33 మంది చదువుకోగా వారికి సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ అన్ని లభించినప్పటికీ మార్కుల రికార్డులు లభించకపోవడంతో రికార్డులు లభించడం లేదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారికంగా రాసిచ్చారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు చేసిన పొరపాటు వల్ల తనకు ఉద్యోగం రాకుండా పోయిందని, న్యాయం చేయాలని బాధితురాలు మౌనిక వేడుకుంటున్నారు. కాగా, బాధితురాలు 10వ తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదివి పాస్ అయింది. నిర్లక్ష్యంగా రికార్డుల నిర్వహణ మండలంలోని సోమ్లాతండాలోని ఎంపీపీఎస్లో 2008 – 09లో పాఠశాలలో చేరిన 14 మంది విద్యార్థులు చేరగా, వారు జన్మించిన సంవత్సరం 2003కాగా వారందరు 2002లోనే పాఠశాలలో జాయిన్ అయినట్లుగా అప్పటి ప్రధానోపాధ్యాయులు నమోదు చేశారు. అడ్మిషన్ రిజిస్టర్లో విద్యార్థుల ఇంటిపేరు లేకుండానే రాసుకున్నారు. అప్పటి విద్యార్థిని పూజ.. స్టడీ సర్టిఫికెట్ కోసం వెళ్లగా ఇటీవల ఈ విషయం వెల్లడైంది. ఇలా నిర్లక్ష్యంగా రికార్డులు నమోదు చేయడం వల్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుటి ప్రధానోపాధ్యాయులు ఉన్నది ఉన్నట్లు సర్టిఫై చేస్తామని, మార్చలేమని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంగెం మండలంలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుల్లో తప్పులు దొర్లడం, రికార్డులు లేకపోవడంతో మిగతా పాఠశాలల్లో రికార్డుల పరిస్థితి ఏంటని పూర్వ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రికార్డుల నిర్వహణను సరిచేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో లేని సమాచారం రికార్డులు లభించకపోవడంతో ప్రీప్రైమరీ ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగి పుట్టిన సంవత్సరం కంటే ముందుగానే పాఠశాలలో చేరినట్లుగా, ఇంటి పేర్లు లేకుండానే రిజిస్టర్లలో నమోదు -
గ్రేటర్ వరంగల్లో విచ్చలవిడిగా వీధికుక్కల సంచారం ● రోజూ ఏదో ఒక చోట దాడి ఘటన
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026తాజాగా శుక్రవారం వరంగల్ 18వ డివిజన్ లేబర్కాలనీ సమీపంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన అజయ్ కూతురు రెండేళ్ల వయస్సున్న పాయల్ ఆడుకుంటుండగా ఓ కుక్క తీవ్రంగా గాయపరిచింది. అనంతరం నోట కరచుకుని బయటికి పరుగెత్తింది. పక్కనే మైదానంలో క్రికెట్ ఆడుతున్న యువకులు కర్రలతో కొట్టడంతో పాపను విడిచిపెట్టింది. అప్పటికే ఓ మహిళను, ఆ తర్వాత అబీబ్ అనే ఐదేళ్ల బాలుడి వీపుపై తీవ్రగా గాయపర్చింది. పాప పాయల్ను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. 2023 మే 19న : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వలస వచ్చిన కుటుంబాలు కాజీపేట రైల్వే కాలనీలో చెట్ల కిందనే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. పక్కనే ఆడుకుంటున్న చోటు అనే ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులు గమనించి అక్కడకు చేరుకునే లోపే బాలుడిని చంపేశాయి. రామన్నపేట: హనుమకొండ జిల్లాలోని క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ తప్పనిసరిగా తెలంగాణ క్యాన్సర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్ఓ ఎస్డీ రాంకుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని రెనోవా బన్ను క్యాన్సర్ హాస్పిటల్, అజర హాస్పిటల్, విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, రాడార్ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ రాంకుమార్ మాట్లాడుతూ ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి నిర్ధారణ, రిపోర్టింగ్లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో సాంస్కృతిక వైభవాన్ని నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజీ, హరిత కాకతీయ హోటల్ మేనేజర్ అశోక్రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త కుసుమ సూర్యకిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శనివారం) సాయంత్రం 6 నుంచి రాత్రి గంటల వరకు కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే పేరిణి నృత్యం, చిందు యక్షగానం ప్రదర్శించనున్నుట్లు వివరించారు. పర్యాటకులు, కళాభిమానులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్ కాజీపేట: పెన్షనర్స్ అసోసియేషన్ భవనాలకు ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి నష్టం చేయడానికి ప్రయత్నించినా తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి ఎదుర్కొంటానని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 62వ డివిజన్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్నగర్ కాలనీవాసులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరునూరైనా సరే పెన్షనర్లను ఎవరూ కదిలించలేరని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్ర, జిల్లా లీగల్ టీంలు ఉచితంగా న్యాయ సాయం చేస్తాయని తెలిపారు. దొంగే దొంగ అన్నట్లు తనపై అసత్య ఆరోపణలు చేసిన నాయకుడు ప్రస్తుతం చేస్తున్న పనిని ప్రజలు గమనించాలని కోరారు. పెన్షనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్నాథ్, ప్రధాన కార్యదర్శి మండలోజు కృష్ణమూర్తి, కె.అయ్యిలయ్య, లింగమూర్తి, సంజీవయ్య, కేవీ రావు, వెంకటనారాయణ, బీఆర్ఎస్ నాయకులు సుంచు కృష్ణ, నార్లగిరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు కమిషన్ సభ్యులు శనివారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. భూవివాదాలు, అట్రాసిటి కేసులు, వివిధ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలుపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. సమావేశానికి జిల్లా అధికారులు పూర్తిస్థాయి నివేదికలు, తగిన సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో వీధికుక్కల బెడద ప్రాణాలు తీసేంతస్థాయికి వెళ్లింది. బల్దియా అధికారులు చేపడుతున్న తూతుమంత్రపు చర్యలతో వీటి బెడద ఏమాత్రం తీరడం లేదు. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలోని సుభాష్నగర్, ఎన్యూఆర్ నగర్, మార్కెట్ ఏరియాతో పాటు నగరంలో సుమారు వంద చోట్ల సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 65 వేలవరకు వీధికుక్కలు ఉన్నట్లు అంచనా. సగటున రోజుకు 20–25 వరకు కుక్కకాట్ల కేసులు వివిధ ఆస్పత్రులకు వస్తున్నట్లు తెలుస్తోంది. చెత్త నిర్వహణ లోపమే కారణమా? నగరంలోని అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కుక్కల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హోటళ్లు, మాంసం దుకాణాల వద్ద పడేసే వ్యర్థాలు వీధి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. దీంతో అవి గుంపులుగా అక్కడే సంచరిస్తున్నాయి. పట్టుకోవడం.. వదిలేయడమే వీరి పనా? రైల్వే స్టేషన్, బస్స్టేషన్, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలు, జన ఆవాసాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్ హోంకు తరలించాలని న్యాయస్థానాలు ఆదేశించినా బల్దియా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవట్లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్రచికిత్సలు నిర్వహించడం, ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం సర్వసాధారణమై పోయింది. కుక్కల పట్టివేత కార్యక్రమం కోసం వినియోగిస్తున్న వాహనాలకు రోజుకు సుమారు రూ.5 వేల వరకు డీజిల్ ఖర్చు చూపుతున్నట్లు కార్పొరేషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెలకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ నగరంలో వీధి కుక్కల సంఖ్య తగ్గకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాధనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడమే తప్ప, వాటి ఫలితాలు ఏమిటో అధికారులు వెల్లడించడంలేదని ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. నగరవాసులు ఏమి కోరుకుంటున్నారంటే.. ● వీధి కుక్కల సంఖ్యపై సమగ్ర సర్వే నిర్వహించాలి. ● స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. ● చెత్త నిర్వహణను కట్టుదిట్టం చేయాలి. ● కుక్కల దాడులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ● రేబిస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇటీవల కొన్ని ఘటనలు.. ● మార్చి నెలలో వరంగల్ శివనగర్లోని నాలుగు జెండాల లేన్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపర్చాయి. ● గత నెలలో వరంగల్ 18వ డివిజన్లోని చెన్నారెడ్డి కాలనీలో ఐదుగురిపై దాడి చేసి గాయపర్చాయి. ● ఈనెల 10న నగరంలోని 36వ డివిజన్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాంపెల్లి వరమ్మ, రేణుకుంట్ల రమేష్, మహ్మద్ తాహి, గౌనియాపై దాడి చేయగా వారికి గాయాలయ్యాయి. వీరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ..వెలుగులోకి వచ్చిన ఇలాంటివి కొన్ని ఘటనలే. రోజూ ఏదో ఒక చోట కుక్కకాట్ల బారిన పడుతున్నారు.గ్రేటర్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ‘సాక్షి’ గతంలో హెచ్చరించినా వరంగల్ మహానగర పాలకసంస్థ నిర్లక్ష్యాన్ని వీడలేదు. పలు డివిజన్లలోని కాలనీల్లో వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, బాలలపై శునకాలు దాడులు చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఘటనలూ ఉన్నాయి. కుక్కల నియంత్రణకు జీడబ్ల్యూఎంసీ అధికారులు తీసుకుంటున్న నామమాత్రపు చర్యలు ఎటూ సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రామన్నపేట: టీజీ ఈఏపీసెట్–2026 (ఎంపీసీ స్ట్రీం) కౌన్సెలింగ్కు విద్యార్థులు సన్నద్ధం కావాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్ హెల్ప్లైన్ సెంటర్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్, కోఆర్డినేటర్ అండ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఎస్.రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్లో భాగంగా ఈనెల 19 నుంచి 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు. 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 25 నుంచి జూలై ఒకటి వరకు వెబ్ఆప్షన్లు, జూలై 4న మాక్ సీట్ల కేటాయింపు, జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్లలో మార్పులు, 10న మొదటి దశ సీట్ల కేటాయింపు, 10 నుంచి 14 వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుందని వారు పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన ధ్రువీకరణపత్రాలతో విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాలని, పూర్తి సమాచారం కోసం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం రూ.17.03 కోట్లు విడుదల.. ‘టీజీ రెడ్కో’ సౌజన్యంతో ఏర్పాట్లు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ భీమదేవరపల్లి: మహిళా సాధికారతకు ముల్క నూరు మహిళా పరస్పర సహాయక సహకార డెయిరీ అందిస్తున్న సేవలు ఆదర్శమని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడు, సహకారరంగ నిపుణుడు డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్ కొనియాడారు. శుక్రవారం ఆయన ముల్కనూరు మహిళా డెయిరీని సందర్శించి పలు కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్రెడ్డితో కలిసి పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలు, మహిళా సభ్యుల భాగస్వామ్యం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ ఆర్థిక నిర్వహణ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డెయిరీ ఎండీ భాస్కర్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో డెయిరీకి సంబంధించిన శిక్షణ, డాక్యుమెంటేషన్, సామర్థ్య వృద్ధి, సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కనీస చర్యలు తీసుకోని బల్దియా యంత్రాంగం తాజాగా రెండేళ్ల పాపను నోటితో కరుచుకుని వెళ్లిన వీధికుక్క తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం మూడేళ్లక్రితం ఓ బాలుడిని చంపిన శునకం -
దారితప్పుతున్న యువత
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి కేసుల వివరాలువిలువ (రూ.కోట్లలో)4862.60 139588646341962023202420252026● గంజాయికి బానిసవుతున్న విద్యార్థులు ● పోలీసుల అదుపులో మైనర్లునమోదైన కేసులు పట్టుబడిన నిందితులు నర్సంపేట: తమ పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలుగంటున్న తల్లిదండ్రుల ఆశలు గంజాయి మాటున ఆవిరైపోతున్నాయి. పాఠశాల స్థాయిలోనే గంజాయికి విద్యార్థులు బానిసవుతున్నారు. ఇటీవల పలువురు మైనర్లు గంజాయితో పోలీసులకు చిక్కడం నర్సంపేటలో కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ సీనియర్ జర్నలిస్టుపై బీరు సీసాతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. పర్యవేక్షణ కరువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతీరోజు ఎక్కడో ఒకచోట గంజాయి సేవించడమో లేదా గంజాయి సరఫరా చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రధానంగా నర్సంపేట, జనగామ, వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, తదితర కళాశాలల్లోని కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరు మైనర్ విద్యార్థులను నర్సంపేట సబ్ డివిజన్ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ కొరవడడంతోనే యువత పెడదారిన పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా కొంతమంది ఎండు గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి నర్సంపేట, వరంగల్ మీదుగా ఇతర ప్రాంతాలకు గుట్టుగా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న రవాణాదారులు ఖానాపురం ప్రాంతంలో రెండుసార్లు పట్టుబడ్డారు. వాహనాల్లో ప్రత్యేక ర్యాకులు ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రహదారిపై మార్గమధ్యంలో ఉన్న కళాశాలల ప్రాంతాల్లో సరఫరాదారులు విక్రయిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యువతను ప్రత్యేక కోడ్ ద్వారా ఆకర్షిస్తున్నట్లు సమాచారం. -
నిధుల్లేక.. నీరసించి!
మూడేళ్లుగా నిలిచిపోయిన ఎన్ఆర్హెచ్ఎం ఫండ్స్దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు పేదలకు ఆరోగ్య భాండాగారాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధులు విడుదల చేస్తుంది. అయితే, మూడేళ్లుగా ఆ నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువు అయ్యాయి. జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 4 కేంద్రాలు 24 గంటలు, 10 కేంద్రాలు 12 గంటలు సేవలందిస్తాయి. వాటికి అనుబంధంగా గ్రామాల్లో 118 ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్లు) ఉన్నాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.1.50 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రానికి ఏటా రూ.10 వేల చొప్పున జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాగా, చివరిసారిగా 2023 మార్చిలో నిధులు విడుదల చేసింది. మూడేళ్లుగా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ అటకెక్కింది. కనీస సౌకర్యాలు లేక పేదల ఆరోగ్య కేంద్రాలు విలవిలలాడుతున్నాయి. ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 14 కార్యక్రమాలు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాతాశిశు మరణాల రేటు తగ్గింపు చర్యలు, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటక జనిత వ్యాధుల నివారణ, సార్వత్రిక వ్యాధి నిరోదక సేవలు, క్షయ, కుష్ఠు వ్యాధి నివారణ చర్యలు, మరణాల తగ్గింపు, అసంక్రమిత వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపడతారు. నిధులు రాకపోవడంతో ఆరోగ్య కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది. కనుమరుగైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ కోసం నిధుల కొరత ఏర్పడింది. ఆపరేషన్ చేయించుకున్న వారికి పురుషులకు రూ.1,100, సీ్త్రలకు రూ.800 చొప్పున ప్రోత్సాహకాలు అందజేయాల్సి ఉంది. నిధులు లేక కుటుంబ నియంత్రణ శిబిరాలే ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జనని సురక్ష, శిశుయోజన కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి మందుల కొనుగోలు కోసం ఒక్కో కేసులో రూ.1600, భోజనానికి రోజుకు రూ.100 చొప్పున మూడు రోజుల పాటు చెల్లించాలనే నిబంధన ఉంది. నిధులు లేని కారణంగా అవి ఇప్పుడు అటకెక్కాయి. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం గ్రామాల్లో ప్రతి ఐదు వేల జనాభాకు ఒకటి చొప్పున ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎన్ఆర్హెచ్ఎం నిధులు రూ.10 వేల చొప్పున అందచేయాల్సి ఉంది. వాటితో సబ్సెంటర్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. మూడు సంవత్సరాలుగా ఉప కేంద్రాలకు సైతం నిధులు రావడం లేదు. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయింది. పీహెచ్సీలు, సబ్సెంటర్లలో కరువైన కనీస వసతులు రోగులకు అందని మెరుగైన వైద్యసేవలు ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర ప్రభావంమూడేళ్లుగా నిధులు నిలిచిపోయాయిజాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద ప్రభుత్వం ప్రతినెలా పీహెచ్సీలకు నిధులు విడుదల చేసేది. 2023లో విడుదల చేసిన అనంతరం మళ్లీ నిధులు రాలేదు. 2024, 2025, 2026 ఆర్థిక సంవత్సరాలకు చెందిన బకాయిలు రావాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కాస్త ఇబ్బందిగా మారింది. చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఆస్పత్రుల వైద్యులు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సమస్యను జిల్లా ఉన్నతాఽధికారులకు నివేదించాం. – ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడాలకు సోలార్ విద్యుత్ అందనుంది. సిద్ధమైన డీపీఆర్లు.. త్వరలో టెండర్లు ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడాల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. విద్యుత్ అందుబాటులోకి వస్తే గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాలతో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. రూ.17.03 కోట్లతో అమలు.. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్లో గిరిజన, గొత్తికోయ గూడాలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీ నంబర్ 5 జారీ చేశారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం... రూ.17.03 కోట్లు విడుదల.. ‘టీజీరెడ్కో’ సౌజన్యంతో ఏర్పాట్లు డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు.. టెండర్ల దశలో ‘సోలార్’ పనులు దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు -
బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలి
ఎల్కతుర్తి: పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్య గ్రామాభివృద్ధిలో కీలకమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జీల్గుల గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. సెగ్రిగేషన్ షెడ్, ఉపాధి హామీ పనులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను శాసీ్త్రయంగా నిర్వహిస్తే కంపోస్ట్ ఎరువు తయారవుతుందని తెలిపారు. ఊర చెరువు మట్టిని వ్యవసాయ భూములకు తరలించడం ద్వార భూసారం పెరిగి రైతులకు లాభం చేరుకూరుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఉపాధి హామీ పనులకు వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. చెరువు కట్ట చుట్టూ విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మమేకమైన కలెక్టర్ సాంఘికశాస్త్రంలోని అంశాలు, భారతదేశ భౌగోళిక స్వరూపం, సరిహద్దుల గురించి వివరించారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్ఎంను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. డీఆర్డీఓ మేన శ్రీను, డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ ప్రసాద్రావు, ఎంపీడీఓ విజయ్కుమార్, ఏపీఏం అనిత, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్.. జీల్గుల గ్రామంలో పర్యటన -
20 స్కూల్ బస్సులపై కేసు నమోదు
ఖిలా వరంగల్: ఫిట్నెస్ లేని, నిబంధనలు పాటించిన ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝలిపిస్తున్నారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 20 స్కూల్ బస్సులను గుర్తించి సీజ్చేసి భారీ జరిమానాలు విధించారు. రానున్న రోజుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఆర్టీఏ నిబంధనల పాటించని బస్సులపై జరిమానాలు విధిస్తామని ఆర్టీఓ రంగారావు హెచ్చరించారు. విద్యార్థుల రవాణా కోసం వినియోగించే వాహనాలు అన్ని నిబంధనలు పాటించాలని, పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉండాలని సూచించారు. వరంగల్ డీటీసీ సురేష్రెడ్డి ఆదేశాల ప్రకారం స్పెషల్ డ్రైవ్లో ఎంవీఐలు వేణుగోపాల్రెడ్డి, శోభన్బాబు, శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ఏఎంవీఐలు ఉదయ్కుమార్, నరేందర్, శంకర్, హారిక, అఫీరొజ్జిద్దీ న్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాకాలలో అభివృద్ధి పనుల ప్రారంభం
● వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి ● శిలాఫలకాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులుఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.82 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. వాటిని సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి శిలాఫలకాలను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాంనాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద, డీఎఫ్ఓ భోగ నిఖిత, సీపీ సన్ప్రీత్ సింగ్, డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేష్ ఆవిష్కరించారు. సఫారీ వాహనాలు, బ్యాటరీ వాహనాలను ప్రారంభించారు. బ్యాటరీ వాహనంలో బటర్ఫ్లై గార్డెన్కు వెళ్లి గార్డెన్లోని మొక్కలను వీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పెడల్ బోట్లను ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మాధవరెడ్డి తొక్కుతూ సందడి చేశారు. అనంతరం పర్యావరణ అధ్యయన కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాంరెడ్డి, సంధ్యారాణి, కిష్టయ్య, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, ఎఫ్ఆర్వో నరేష్ బసవ, తహసీల్దార్ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఐనవోలు మల్లన్న ఆదాయం రూ.53.98 లక్షలు
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజినల్ పరిశీలకురాలు నందనం కవిత పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్ 18 వరకు హుండీ ద్వారా రూ.9,98,694, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.43,99,767 సమకూరింది. మొత్తం రూ.53,98,461 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన మిశ్రమ వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేశామన్నారు. చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, కానిస్టేబుళ్లు కనకస్వామి, పరమేశ్వరి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, కరీంనగర్కు చెందిన వెంకట అన్నమాచార్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
తొలగింపు తప్పనిసరి
వరంగల్ అర్బన్: ఏళ్ల తరబడి పెచ్చులూడుతున్నాయి. అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షపు నీరు స్లాబ్ వెంట జారుతోంది. చాంబర్లలోని రికార్డులు, కంప్యూటర్లు, దస్త్రాలు, ఫర్నిచర్ తడుస్తున్నాయి. వర్షపు నీటితో షార్ట్సర్క్యూట్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా.. ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు బల్దియా అధికారులు, సిబ్బంది. బల్దియా భవనం జీవిత కాలం ముగిసి, ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. నిర్వహణ లోపంతో మరింత శిథిల దశకు చేరింది. విస్తరణ.. 49.16 చదరపు కిలోమీటర్లు ఉన్న పట్టణ పరిధిలో 1994 నాటికి 110 చదరపు కిలోమీటర్లకు చేరింది. గ్రేటర్ వరంగల్తో అది 407.7 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. భవనంలోనే మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్, వింగ్ అధికారులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ వచ్చారు. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుతో సగానికి పైగా 60 శాతం అధికారులు, సిబ్బంది అక్కడే సేవలు అందిస్తున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా బల్దియా భవనం స్లాబ్ పెచ్చులు, గోడలు పెచ్చులు ఉడిపోతున్నాయి. బల్దియా అధి కారులు, ఉద్యోగులు బల్దియా ఇంజనీర్లు పదుల సంఖ్యలో మరమ్మతుల కోసం రూ.కోట్లు వెచ్చించా రు. కానీ, పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదు. ఎట్ట కేలకు ఇన్చార్జ్ కమిషనర్ ఆదేశాలతో శిథి లావస్థకు చేరిన భవనం త్వరలో నేలమట్టం కానుంది. తదుపరి నగరవ్యాప్తంగా ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాలపై కొరడా ఝుళిపించనున్నారు. తాత్కాలికంగా మేయర్ భవనంలోకి.. బలహీనమైన బల్దియా పాత భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యంలో కార్యాలయంలోని ప్రజారోగ్యం, మలేరియా, జనన, మరణ, అడ్మినిస్ట్రేటివ్, ట్రెజరరీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ సెక్షన్, రికార్డు సెక్షన్, రికార్డులు సమీపంలో ఉన్న మేయర్ భవనంలోకి విభాగాలను తాత్కలికంగా తరలిస్తున్నారు. పక్కనే పరిపాలన భవనం రూ.32 కోట్లతో నిర్మాణ దశలో ఉంది. ఈ భవనం పూర్తయితే ఇక్కడి నుంచి అందులోకి తరలించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.బలహీనమైన బల్దియా భవనం తాత్కాలికంగా మేయర్ భవనంలోకి చాంబర్ల తరలింపు బల్దియా భవనం నిజాం కాలంలో హనుమకొండ కాంగ్రెస్ భవనానికి సమీపంలో ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోకి తరలించారు. 1968 డిసెంబర్ 22న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా బల్దియా భవనానికి ఫౌండేషన్ వేశారు. 1970 ఫిబ్రవరి 1న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రావు ప్రారంభించారు. తదుపరి గ్రౌండ్ ఫ్లోర్తోపాటు రెండు అంతస్తులల భవా నాన్ని నిర్మించగా, అప్పటి పురపాలక శాఖ మంత్రి ఉమారెడ్డి ప్రారంభించారు. అప్పటి వరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్గా అవిర్భవించింది. 2015లో వరంగల్ మహా నగర పాలక సంస్థగా అవతరించింది. -
తొలగింపు తప్పనిసరి
వరంగల్ అర్బన్: ఏళ్ల తరబడి పెచ్చులూడుతున్నాయి. అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షపు నీరు స్లాబ్ వెంట జారుతోంది. చాంబర్లలోని రికార్డులు, కంప్యూటర్లు, దస్త్రాలు, ఫర్నిచర్ తడుస్తున్నాయి. వర్షపు నీటితో షార్ట్సర్క్యూట్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా.. ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు బల్దియా అధికారులు, సిబ్బంది. బల్దియా భవనం జీవిత కాలం ముగిసి, ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. నిర్వహణ లోపంతో మరింత శిథిల దశకు చేరింది. 1970లో ఇక్కడి నుంచి సేవలు.. బల్దియా భవనం నిజాం కాలంలో హనుమకొండ కాంగ్రెస్ భవనానికి సమీపంలో ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోకి తరలించారు. 1968 డిసెంబర్ 22న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బల్దియా భవనానికి ఫౌండేషన్ వేశారు. 1970 ఫిబ్రవరి 1న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రావు ప్రారంభించారు. తదుపరి గ్రౌండ్ ఫ్లోర్తోపాటు రెండు అంతస్తులల భవా నాన్ని నిర్మించగా, అప్పటి పురపాలక శాఖ మంత్రి ఉమారెడ్డి ప్రారంభించారు. అప్పటి వరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్గా అవిర్భవించింది. 2015లో వరంగల్ మహా నగర పాలక సంస్థగా అవతరించింది. విస్తరణ.. 49.16 చదరపు కిలోమీటర్లు ఉన్న పట్టణ పరిధిలో 1994 నాటికి 110 చదరపు కిలోమీటర్లకు చేరింది. గ్రేటర్ వరంగల్తో అది 407.7 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. భవనంలోనే మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్, వింగ్ అధికారులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ వచ్చారు. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుతో సగానికి పైగా 60 శాతం అధికారులు, సిబ్బంది అక్కడే సేవలు అందిస్తున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా బల్దియా భవనం స్లాబ్ పెచ్చులు, గోడలు పెచ్చులు ఉడిపోతున్నాయి. బల్దియా అధి కారులు, ఉద్యోగులు బల్దియా ఇంజనీర్లు పదుల సంఖ్యలో మరమ్మతుల కోసం రూ.కోట్లు వెచ్చించా రు. కానీ, పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదు. ఎట్ట కేలకు ఇన్చార్జ్ కమిషనర్ ఆదేశాలతో శిథిలావస్థకు చేరిన భవనం త్వరలో నేలమట్టం కానుంది. తదుపరి నగరవ్యాప్తంగా ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాలపై కొరడా ఝుళిపించనున్నారు. తాత్కాలికంగా మేయర్ భవనంలోకి.. బలహీనమైన బల్దియా పాత భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యంలో కార్యాలయంలోని ప్రజారోగ్యం, మలేరియా, జనన, మరణ, అడ్మినిస్ట్రేటివ్, ట్రెజరరీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ సెక్షన్, రికార్డు సెక్షన్, రికార్డులు సమీపంలో ఉన్న మేయర్ భవనంోకి విభాగాలను తాత్కలికంగా తరలిస్తున్నారు. పక్కనే పరిపాలన భవనం రూ.32 కోట్లతో నిర్మాణ దశలో ఉంది. ఈ భవనం పూర్తయితే ఇక్కడి నుంచి అందులోకి తరలించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.బలహీనమైన బల్దియా భవనం తాత్కాలికంగా మేయర్ భవనంలోకి చాంబర్ల తరలింపు -
యువత అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం కృషి
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్ హన్మకొండ: యువత అభ్యున్నతికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్ అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో నమో జెన్ జీ కాన్క్లేవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, యూపీఐ, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పించాయని వివరించారు. విద్యార్థుల సమస్యలపై త్వరలోనే బీజేవైఎం ఉద్యమాలు చేపడుతుందన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ యువతకు అవకాశాలు కల్పిస్తూ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, అభినవ్ భాస్కర్, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీశ్వర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, నాయకులు సండ్ర మధు, రాంబాబు, నిఖిల్ చోప్రా, నిఖిల్ రావు, వెంకట్ పాల్గొన్నారు. -
వరంగల్ ఆర్వోలో ప్రొహిబిషన్ అధికారులు
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్వోలో ట్రైనీ(ప్రొహిబిషన్) సబ్ రిజిస్ట్రార్లు దస్తావేజుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యాలయంలో నలుగురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. సాధారణంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ప్రతిరోజూ 108 స్లాట్స్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండు నెలల క్రితం ఇద్దరు ఏసీబీకి చిక్కడంతో ప్రస్తుతం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా సైదులు కొనసాగుతున్నారు. ఇటీవల గ్రూప్–2లో ఎంపికైన ఇద్దరు అధికారులు పీఎస్ఆర్(ప్రొహిబిషన్ సబ్ రిజిస్ట్రార్)లుగా , గ్రూప్–1 ద్వారా ఎంపికై న మరో అధికారి ప్రొహిబిషన్ రిజిస్ట్రార్(పీడీఆర్)గా పనిచేస్తున్నారు. రెండెన్నర నెలలపాటు విధులు.. రెండున్నర నెలలకు వరంగల్ ఆర్వోలో ఇద్దరు పీఎస్ఆర్లుగా, ఒకరు పీడీఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రొహిబిషన్ సబ్ రిజిస్ట్రార్లు మధు, జితేందర్, ప్రొహిబిషన్ జిల్లా రిజిస్ట్రార్ దీపక్ గురువారం సాక్షితో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రొహిబిషన్ పీరియడ్ వరంగల్ ఆర్వోలో నిర్వహించడం విధుల పట్ల అవగాహన వస్తోందని తెలిపారు. ప్రతీ దస్తావేజును పరిశీలించడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేర్చుకోవడమే కాగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం మార్టిగేజ్, సేల్ డీడ్లు వస్తున్నాయని తెలిపారు. స్లాట్ బుకింగ్ సమయానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి దస్తావేజుదారులకు పత్రాలను అందిస్తున్నామని చెప్పారు. పోస్టింగ్ పొందిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న అంశాలు తమకు ఎంతో తోడ్పడుతాయని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
శాయంపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మైలారం సర్పంచ్ నూనె దివ్యతిరుపతి పేర్కొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం తన కుమారుడిని చేర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. జయశంకర్ బడిబాటలో భాగంగా ఇటీవల ఎంపీడీఓ ఫణిచంద్ర, సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేస్తానని, పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మనోజ్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మైలారం సర్పంచ్ నూనె దివ్యతిరుపతి ప్రభుత్వ బడిలో తన కుమారుడిని చేర్పించిన సర్పంచ్ -
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు
ఖిలా వరంగల్: వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఆరు విత్తన షాపుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, సెల్స్ రిజిస్టర్, బిల్లు బుక్కును పరిశీలించారు. రైతులకు జారీ చేసిన బిల్లులపై ఆరా తీశారు. షాపులోని నిల్వలకు స్టాక్ రిజిస్టర్లో నమోదైన నిల్వలను పోల్చిచూశారు. తనిఖీల్లో జి.కల్పన ఏడీఏ టెక్నికల్, జి.నర్సింగం ఏడీఏ వర్ధన్నపేట, గోవర్ధన్ రెడ్డి ఏఓ ఎస్టీఎల్, పి.రమేష్ ఎస్సై మిల్స్కాలనీ, స్థానిక వ్యవసాయాధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
‘నీట్’కు ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: నీట్–2026ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ ఈనెల 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో మొత్తం 4,196 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, అనంతరం గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, ముఖ్యంగా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ పరీక్ష కేంద్రానికి కూడా రవాణా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. నీట్ జిల్లా సమన్వయ అధికారి భిక్షపతి, ఏసీపీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలను తాకట్టు పెట్టి అప్పు
ఆత్మకూరు: యువకుడిపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. ఆత్మకూరు పోలీస్స్టేషన్లో గురువారం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. హనుమకొండలోని శంకరనగర్ కాలనీకి చెందిన సంగాని సూర్యకిరణ్వర్మ, ఆకారపు ప్రవీణ్కుమార్ వాహనాలను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నారు. డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ వాహనాలను తిరిగి తెచ్చుకునే వారు. ఈక్రమంలో మండల కేంద్రానికి చెందిన గౌని శ్రీకాంత్ అనే యువకుడి వద్ద వాహనాన్ని తాకట్టుపెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. తర్వాత మరో అద్దె వాహనాన్ని ఐద అనిల్కుమార్ వద్ద తీసుకొని తాకట్టుపెట్టి డబ్బు తీసుకున్నారు. తర్వాత శ్రీకాంత్కు ఐద అనిల్కుమార్ ఫోన్చేసి ఈనెల 10న డబ్బుతో వస్తున్నామని చెప్పాడు. అనిల్కుమార్, రాయరాకుల కల్యాణ్, కిన్నెర బన్నీ, రామారపు శివసాయి, పోలెపాక రాహుల్, పోతరాజు గౌతమ్కుమార్, తాళ్ల నిహాల్ మూడు కార్లలో వచ్చి గూడెప్పాడ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద శ్రీకాంత్తో మాట్లాడారు. డబ్బులు ఇస్తేనే వాహనం ఇస్తానని శ్రీకాంత్ చెప్పాడు. ఈవిషయాన్ని వారు సంగాని సూర్యకిరణ్, ఆకారపు ప్రవీణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాంత్ను బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి దాడిచేసి బెదిరించాలని వారు ఆదేశించారు. దీంతో మండల కేంద్రంలోని ఓ బేకరి వద్ద ఆగి డబ్బులు ఇస్తామని శ్రీకాంత్ను పిలిపించారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శ్రీకాంత్ను నిందితులు కారులోకి లాగి దాడి చేశారు. అక్కడి నుంచి కోమటిపల్లి టోల్గేట్ సమీపంలో కొండవద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చివరకు కేయూసీ పోలీస్స్టేషన్ వద్ద వదిలివెళ్లారు. దీంతో బాధితుడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. నిందితుల్లో పోతరాజు గౌతంకుమార్, తాళ్ల నిహాల్ పరారీ లో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, 2 ఐ ఫోన్లు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సతీశ్బాబు పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ సంతోష్, ఎస్ఐ తిరుపతి సిబ్బంది ఉన్నారు. డబ్బు అడిగినందుకు యువకుడిపై దాడి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ సతీశ్బాబు -
పీసీబీ ల్యాబ్ ప్రారంభం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ‘కుడా’ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ జోనల్ ల్యాబ్ సముదాయ భవనాన్ని గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల నుంచి సేకరించిన వివిధ నమూనాలను విశ్లేషించడానికి ఈ జోనల్ ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత తెలిపారు. ప్రారంభోత్సవంలో మండలి సిబ్బంది పాల్గొన్నారు. జూపార్కులో అభివృద్ధి పనులు.. న్యూశాయంపేట: హనుమకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో సీసీ రోడ్డు పనులు, పక్షుల ఎన్క్లోజర్స్ను గురువారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జూ పార్కులో మొక్కలను నాటారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, డీఎఫ్ఓ జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్యాంసుందర్, నాగేశ్వర్రావు, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్లు శివకుమార్, జయసుధ, శ్వేత, సుగుణ, శారద, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో కలిసి గురువారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 1,030 మంది విద్యార్థులు హాజరుకాగా 573 మంది విద్యార్థులు (55.63 శాతం)ఉత్తీర్ణులయ్యారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 663 మంది హాజరుకాగా 398 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి, ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారా యణ, ఏవీఎస్ ప్రసాద్, అనిల్కుమార్, కళా శాల వైస్ ప్రిన్సిపాల్ రహమాన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, వివిధ విభాగాల అధిపతులు రుక్కిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీధర్కుమార్లోథ్, భిక్షపతి, హరికుమార్, స్వామి, ప్రసాద్, చందూలాల్, జయప్రకాశ్, బి.ప్రసాద్, పుల్లా రమేశ్, విజయ్కుమార్, నాగయ్య, సతీశ్, లక్ష్మారెడ్డి, సుధీర్, ప్రసాద్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 23 మంది ఎస్సైలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.మౌనిక సుబేదారి మహిళా పోలీస్స్టేషన్ నుంచి కాజీపేట పీఎస్, ఎస్.కిరణ్మయి సీసీఆర్బీ నుంచి హనుమకొండ భరోసా కేంద్రం, సీహెచ్ లలిత సీపీటీసీ నుంచి జనగామ భరోసా కేంద్రం, తౌటం శ్రావణి పీసీఆర్ నుంచి కేయూసీ, డి.నిహారిక పీసీఆర్ నుంచి మిల్స్కాలనీ, వి.భవాని వీఆర్ నుంచి ఇంతేజార్గంజ్ పీఎస్, తుమ్మ శ్రావణి వీఆర్ నుంచి మిల్స్కాలనీ పీఎస్కు బదిలీ అయ్యారు. ఎన్.సాయిదివ్య వీఆర్ నుంచి హనుకొండ పీఎస్, కె.లక్ష్మీ వీఆర్ నుంచి సుబేదారి పీఎస్, బి.హరికృష్ణ సీపీటీసీ నుంచి సుబేదారి, సీహెచ్ రఘుపతి వీఆర్ నుంచి పరకాల పీఎస్, వి.గోవర్ధన్ వీఆర్ నుంచి ఏనుమాముల పీఎస్, ఎస్.రాజన్బాబు వీఆర్ నుంచి నర్సంపేట పీఎస్, బి.రవీందర్ వీఆర్ నుంచి గీసుకొండ పీఎస్, ఎల్.కొంరెల్లి హనుమకొండ ట్రాఫిక్ నుంచి సీసీఆర్బీకి బదిలీ అయ్యారు. ఎన్.రవికిరణ్ ఇంతేజార్గంజ్ పీఎస్ నుంచి సీీఎస్బీ, ఎస్.వెంకన్న సుబేదారి నుంచి సీఎస్బీ, షేక్ జాన్పాషా ధర్మసాగర్ నుంచి సీఎస్బీ, వి.నవీన్కుమార్ కాజీపేట పీఎస్ నుంచి సీఎస్బీ, బి.చందర్ టాస్క్ఫోర్స్ నుంచి సీసీఎస్, ఎం.రమేశ్ పరకాల నుంచి సీసీఆర్బీ, ఎల్.నరేశ్ మిల్స్ కాలనీ నుంచి సీసీఆర్బీ, పి.శ్రీనివాస్ను ఐనవోలు నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సమీక్షకే సమాచారం కరువు
సాక్షి, వరంగల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి సమగ్ర గణాంకాలు లేకుండానే అధికారులు హాజరుకావడం చర్చనీయాంశమైంది. పథకాల వారీగా లబ్ధిదారుల సంఖ్య, పెండింగ్ పనులు, నిధుల వినియోగం, అమలులో జాప్యానికి కారణాలు వంటి కీలక వివరాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు సమాధానాలు చెప్పాల్సిన అధికారులు అసంపూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావడంపై వరంగల్ ఎంపీ కడియం కావ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధంతరంగా ముగిసిన సమావేశం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం జరిగిన దిశా సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వైవీ గణేష్తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. 11.30 గంటలకు మొదలుకావడం, ఆ తర్వాత వ్యవసాయం, వైద్యం, విద్యపై అరకొరగా చర్చ జరగగానే మీటింగ్ ముగిసింది. ఎజెండా ప్రతులు అందలేదని ఎంపీ కడియం కావ్య అనడంతో సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. పూర్తి సమాచారం లేకపోవడంతో.. ● జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్లో భాగంగా 1,58,794 మంది రైతులకు 1,07,605 మందిని మాత్రమే నమోదు చేసినట్లు పేర్కొన్న అధికారులు.. వెనుకబడి పోవడానికి గల కారణాలతో పాటు ఏ మండలంలో ఎంతమేర నమోదైందన్న వివరాలు లేకపోవడంపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర సమాచారంతో అర్హులైన రైతులకు అన్యాయం జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఎజెండా ప్రతిలో పేర్కొన్న జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం పేరును జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్గా మార్చినా కూడా పాత పేరునే వాడడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. ● ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా 10 క్లస్టర్లలో రాయపర్తి, ఖానాపురం, దుగ్గొండి, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో 1,250 మంది రైతులతో 1,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.16.45 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఈ పథకం వల్ల రైతులు పొందిన లాభం, ఏఏ పంటలు వేశారనే వివరాలు పేర్కొనలేదంటూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ఏం చేస్తున్నట్టు..? ● ఖానాపురం పీహెచ్సీ, కాశిబుగ్గ యూపీహెచ్సీ, రంగశాయిపేట యూపీహెచ్సీ, ఎస్ఆర్ఆర్ తోట యూపీహెచ్సీల కొత్త భవనాలకు ఒక్కోదానికి రూ.1.43 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని, కొన్ని పనులు టెండర్ దశలో, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పనుల్లో పురోగతి మందగించడంపై డీఎంహెచ్ఓను ఎంపీ కడియం కావ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మందలించారు. 15వ ఆర్థిక ఫైనాన్స్, ఎన్హెచ్ఎం నిధులు మంజూరైనా కూడా 92 ఎన్హెచ్ఎంలలో 32 పనులు ప్రారంభం కాగా, 17 ప్రోగ్రెస్లో, మరో 43 పనులు ఇంకా ప్రారంభించలేదంటూనే అవి ఎక్కడెక్కడా, ఇప్పటివరకు ఏ పనులు జరిగాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నవి, అసలు పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఆగ్రహించారు. ఒకానొకదశలో వైద్య పురోగతిపై కలెక్టర్ సత్యశారద దృష్టి సారించాలంటూ వారు సూచించారు. ● ఎంజీఎంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండేందుకు వైద్యులు సమయపాలన పాటించాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఉదయం బయోమెట్రిక్ వేస్తున్న వైద్యులు.. సాయంత్రం మాత్రం బయోమెట్రిక్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను పకడ్బందీగా అమలుచేస్తే వైద్యులు సమయపాలనతో, పేదలకు వైద్యం గాడిలో పడుతుందని సూచించారు. ఆ తర్వాత విద్యారంగంపై చర్చ జరిగింది. అయితే, కేంద్ర పథకాల సమాచారం సమగ్రంగా ఉండేలా పూర్తి నివేదికలతో తదుపరి దిశా సమావేశానికి రావాలని అధికారులకు ఎంపీ బలరాంనాయక్ సూచించారు. ‘దిశ’ సమావేశానికి సరైన గణాంకాలతో హాజరుకాని అధికారులు వారి నిర్లక్ష్యంపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం పూర్తిస్థాయి చర్చ జరగకుండానే ముగిసిన మీటింగ్ -
జాడలేని వాన చినుకు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయుగూడెంలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వర్షాలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం
● అదనపు కలెక్టర్ వైవీ గణేష్ వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని అదనపు కలెక్టర్ వైవీ గణేష్ కొనియాడారు. మండలంలోని ల్యాబర్తి జెడ్పీహెచ్ఎస్లో బడిబాట బ్రోచర్లు, స్టూడెంట్ డైరీలను డీఈఓ రంగయ్యనాయుడుతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా, ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ఉపాధ్యాయుడు సోమవరపు యుగేందర్ తన సొంత ఖర్చుతో ఆకర్శనీయమైన బడిబాట బ్రోచర్లను ఆవిష్కరించారని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు, సమయపాలనకు తక్కళ్లపెల్లి బుచ్చిబాబు సమకూర్చిన స్టూడెంట్ డైరీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం, యుగంధర్, బుచ్చిబాబును సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం లింగం శైలజ, ఉపాధ్యాయులు వేణుకుమార్, రఘువీర్, హరిలాల్, నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయిగూడెంలో సాధారణం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలో లోటు, వెంకటాపురం(కె)లో భారీ లోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.34%హనుమకొండభూపాలపల్లిజనగామవరంగల్మహబూబాబాద్ములుగు జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితి (మి.మీ.లలో) (జూన్ 1–18 వరకు) 94.784.379.681.077.170.7 -
వరంగల్
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఎంజీఎం సూపరింటెండెంట్ ఎవరు? ఎంజీఎంలో పది రోజులు దాటినా సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయకపోవడంతో పాలన గాడి తప్పుతోంది.సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు మహబూబాబాద్ములుగుహనుమకొండజనగామభూపాలపల్లివరంగల్భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) -
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విత్తన ఎంపికే కీలకం
ఖిలా వరంగల్: వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలు పాటిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు. ప్రభుత్వ ధ్రువీకరణ పాందిన కంపెనీలు, ఏజెన్సీలు, సంస్థలకు చెందిన విత్తనాలే కొనుగోలు చేయాలని వెల్ల డించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో సాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: నారుమడిలో ఆకుకొనలు ఎర్రబడుతున్నాయి, కందిలో ఏ రకాలు సాగుచేయాలి? (రైతులు కన్నె మహేందర్, నల్లబెల్లి, సీహెచ్.లింగమూర్తి దుగ్గొండి, టి.వెంకన్న, మాన్సింగ్ నెక్కొండ, రామచంద్రరెడ్డి వర్ధన్నపేట, పి.రాజు, కె.శ్రీను నెక్కొండ)జవాబు: నారుమడిలో ఆకుల కొనలు ఎర్రబడడం లక్షణాలు పోషక లోపాల్ని సూచిస్తుంది. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. అలాగే కందిలో ప్రధానంగా డబ్ల్యూఆర్జీఈ–97, 93, 255 డబ్ల్యూఆర్జీ–121, టీడీఆర్జీ–4 రకాల విత్తనాలు సాగు చేసుకోవచ్చు. వరిలో వానాకాలం పంట సాగుకు విశ్వవిద్యాలయ విడుదల చేసిన సన్న రకాలైన కేఎన్ఎం–1638, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్–962, సిద్ధి డబ్ల్యూజీఎల్–44 అనుకూలం.చెరువు కింద దీర్ఘకాలిక వరి రకమైన సిద్ది (డబ్ల్యూజీఎల్–44) బాగుంటుంది..140 నుంచి 145 రోజులు పంటకాలం. ప్రశ్న: రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి? – టి.వీరస్వామి, వెంకటాపూర్, దుగ్గొండి మండలం జవాబు: వ్యవసాయ శాఖ, విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల ద్వారా ప్రసారం చేయబడుతుంది. అలాగే మండల పరిధిలో అవగాహన కార్యక్రమాలు వ్యవసాయాధికారి నిర్వహిస్తారు. ప్రశ్న: పత్తి సాగులో రకాలు.. పసుపు, మునగ సాగు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (రైతులు జి.నరేశ్, నల్లబెల్లి, పి.గణేశ్, దుగ్గొండి)జవాబు: పత్తిలో నాణ్యమైన హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పంట వేసుకునేందుకు భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. పసుపు సాగులో ముఖ్యంగా ఆఖరి దుక్కి దున్నే ముందు మాగిన పశువుల ఎరువు చల్లుకోవాలి. ఆలాగే 200 కిలోల వేప పిండిని ఎకరానికి వేసుకోవాలి. విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, తెగుళ్లను అరికట్టడానికి విత్తనం శుద్ధి చేసుకోవడం ముఖ్యం. విత్తన శుద్ధికి దుంపను మూడు గ్రాముల రీడోమిల ఎంజెడ్ 0–3 మిల్లీ లీటర్ల ఇమిదాక్లో ప్రీడ్ లీటర్ నీటికి కలుపుకోవాలి. మునగలో పీకేఎం–1 రకం జూన్, జూలై మాసంలో నారు విడిగా పెంచుకొని నెల రోజుల మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: వర్షాభావ పరిస్థితిలో ఎలాంటి ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలి?– ఎం. రమేశ్, నెక్కొండ జవాబు: ప్రస్తుతం వాతావరణశాఖ సూచన మేరకు ఎల్నినో ప్రభావంతో వర్షాలు కొంత ఆలస్యమవుతాయి. అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వరి వచ్చే నెల 15 తర్వాత నాటుకోకపోవడం మంచిది. అలాగే ప్రత్నామ్నాయంగా కందులు, పెసర్లు, బొబ్బర్లు, గోరు చిక్కుడు వంటి పంటలు సాగుచేస్తే మంచిది. ప్రశ్న: మొక్కజొన్న సాగులో మెలకువలు సూచించండి?– కె.మోహన్రావు, వెంకటాపూర్, దుగ్గొండి జవాబు: మొక్కజొన్న సాగుకు ముందు దుక్కి సిద్ధం చేసుకుని విత్తనాలు విత్తుకోవాలి. మూడు నుంచి నాలుగు దఫాలుగా కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు అందించాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తెగుళ్లను తట్టకోవడానికి భూమిలో ట్రైకోడెర్మా వీరిడేని వృద్ధి చేసి వర్మి కంపొస్ట్ చల్లుకోవాలి. ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులేవి, ఎల్నినో ప్రభావంలో మిర్చి సాగు చేయచ్చా? –(రైతులు వెంకటేశ్వర్లు పర్వతగిరి, ఎం.రాంబాబు ఖానాపూర్) జవాబు: రైజోబియం 200, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడు విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ విత్తనాలను 24 గంటల లోపు విత్తుకోవాలి. నీటి వసతి కలిగి డ్రిప్ ద్వారా నీరు, ఎరువు ఇచ్చుకోగలిగితే మిర్చి సాగు చేసుకోవచ్చు. అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే దిగుబడి సాక్షి ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల -
అంతర్జాతీయ హ్యాండ్బాల్ పోటీల్లో శ్రీరామ్ సత్తా
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ హ్యాండ్బాల్ టోర్నీలో వరంగల్ యువకుడు కీలక భూమిక పోషించాడు. ఈ టోర్నమెంట్లో భారత్ బంగారు పతకం సాధించింది. భారత జట్టుకు వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన కొడకండ్ల శ్రీరామ్ ప్రాతినిథ్యం వహిస్తూ పీవోట్ ప్లేయర్గా అద్భుత ప్రతిభతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. జిల్లాకు చేరుకున్న శ్రీరామ్, డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, కోచ్ బొడ్డు విష్ణువర్ధన్లతో కలిసి బుధవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్బాజ్పాయ్ యువక్రీడాకారుడు శ్రీరామ్ను అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చి దేశానికి గర్వకారణంగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీరామ్ ఇప్పటి వరకు 20 రాష్ట్ర స్థాయి, 12 జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించినట్లు కోచ్ విష్ణువర్ధన్ తెలిపారు. భారత్కు గోల్డ్ మెడల్ తీసుకురావడంతో శ్రీరామ్ ప్రత్యేక కృషిగా చెప్పుకోవడం కోచ్గా తాను గర్విస్తున్నానని అన్నారు. క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్ చాహత్బాజ్పాయ్ కొత్తవాడలో శ్రీరామ్కు ఘన స్వాగతం -
‘మెగా టెక్స్టైల్’తో వేలాది మందికి ఉపాధి
● మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పరకాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పడిదెల దీప్తి, దుబాసి వెంకస్వామి, బీఆర్ఎస్ నాయకులు కొక్కిరాల రాకేశ్రావు, బొచ్చు బాపురావు తదితరులున్నారు. కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాల పరిశీలన నడికూడ: మండలంలోని రామకృష్ణపూర్, ధర్మారం, పులిగిల్ల గ్రామాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను బుధవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
విత్తన ఎంపిక కీలకం..
ఖిలా వరంగల్: వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలు పాటిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో సాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారి సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: వరి నారుమడిలో ఆకుకొనలు ఎర్రబడుతున్నాయి. ఏ రకం విత్తనాలు సాగుచేసుకోవచ్చు, కందిలో ఏ రకాలు సాగుచేయాలి? – కన్నె మహేందర్, నల్లబెల్లి, సీహెచ్.లింగమూర్తి దుగ్గొండి, టి.వెంకన్న, మాన్సింగ్, పి.రాజు, కె.శ్రీను నెక్కొండ, రామచంద్రారెడ్డి వర్ధన్నపేట.జవాబు: నారుమడిలో ఆకుల కొనలు ఎర్రబడడం వంటి లక్షణాలు పోషక లోపాల్ని సూచిస్తుంది. దీని నివారణకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. అలాగే కందిలో ప్రధానంగా డబ్ల్యూఆర్జీఈ–97, 93, 255 డబ్ల్యూఆర్జీ–121, టీడీఆర్జీ–4 రకాల విత్తనాలు సాగు చేసుకోవచ్చు. వరిలో వానాకాలం పంట సాగుకు విశ్వవిద్యాలయ విడుదల చేసిన సన్న రకాలైన కేఎన్ఎం–1638, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్–962, సిద్ధి డబ్ల్యూజీఎల్–44 అనుకూలం. చెరువు కింద దీర్ఘకాలిక వరి రకమైన సిద్ది (డబ్ల్యూజీఎల్–44) బాగుంటుంది..140 నుంచి 145 రోజులు పంటకాలం. ప్రశ్న: రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి? –టి.వీరస్వామి, వెంకటాపూర్, దుగ్గొండిజ: వ్యవసాయ శాఖ, విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల ద్వారా ప్రసారం చేస్తారు. మండల పరిధిలో అవగాహన కార్యక్రమాలు వ్యవసాయాధికారి నిర్వహిస్తారు. ప్రశ్న: పత్తి సాగులో రకాలు.. పసుపు, మునగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? – జి.నరేశ్, నల్లబెల్లి, పి.గణేశ్, దుగ్గొండిజ: పత్తిలో నాణ్యమైన హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పంట వేసుకునేందుకు భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. పసుపు సాగులో ముఖ్యంగా ఆఖరి దుక్కి దున్నే ముందు మాగిన పశువుల ఎరువు చల్లుకోవాలి. ఆలాగే 200 కిలోల వేప పిండిని ఎకరానికి వేసుకోవాలి. విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, తెగుళ్లను అరికట్టడానికి విత్తనం శుద్ధి చేసుకోవడం ముఖ్యం. విత్తన శుద్ధికి దుంపను మూడు గ్రాముల రీడోమిల ఎంజెడ్ 0–3 మిల్లీ లీటర్ల ఇమిదాక్లో ప్రీడ్ లీటర్ నీటికి కలుపుకోవాలి. ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులేవి, ఎల్నినో ప్రభావంలో మిర్చి సాగు చేయచ్చా? – వెంకటేశ్వర్లు పర్వతగిరి, ఎం.రాంబాబు ఖానాపూర్జ: రైజోబియం 200, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడు విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ విత్తనాలను 24 గంటల లోపు విత్తుకోవాలి. నీటి వసతి కలిగి డ్రిప్ ద్వారా నీరు, ఎరువు ఇచ్చుకోగలిగితే మిర్చి సాగు చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా ఎరువు, నీటిని ఆదా చేసుకోచ్చు. దీంతోపాటు మరికొంత మంది రైతులు వివిధ పంటల సాగులో తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి ‘సాక్షి ఫోన్ఇన్’లో వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల -
పేదల సొంతింటి కల సాకారం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంగెం : కాంగ్రెస్ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని నాట్ విల్లింగ్ ఇచ్చిన వారి స్థానంలో 72 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాతనే రెండో విడతలో ఆయా గ్రామాలకు మంజూరు చేస్తామన్నారు. పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. సంగెం మండలంలో మొదటి విడతలో 650 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారమన్నారు. పార్టీకతీతంగా సంక్షేమ పథకాల అమలుతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కలిగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, హౌసింగ్ ఏఈ సాద్విక, సర్పంచ్ పేర్ల లలిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్, నాయకులు మాధవరెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.బస్సు సర్వీస్ ప్రారంభం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలోనే గ్రామ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు సంగెం మండల పరిధిలోని కాట్రపల్లిలో బుధవారం ఆర్టీసీ బస్సును ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్ నుంచి ఖిలా వరంగల్, స్తంభంపల్లి, వసంతాపూర్, వంచనగిరి, శాయంపేట, టెక్స్టైల్ పార్కు మీదుగా సంగెం, కుంటపల్లి, కాట్రపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఆర్టీసీ బస్సును కాట్రపల్లి నుంచి సంగెం వరకు నడిపారు. మార్గమధ్యలో సంగెం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. -
మత్తు.. జరిమానా మస్తు
‘గ్రేటర్’ పరిధిలో ముమ్మరంగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ రోజూ డ్రంకెన్డ్రైవ్ కేసులు బుక్ అవుతుండగా కోర్టులు జరిమానాలు విధించడంతోపాటు మత్తు మోతాదు పెరిగిన వాహనదారులు జైలుబాట పడుతున్నారు. కేసుల సంఖ్య చూస్తే ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేస్తున్న కట్టడి సత్ఫలితాలనిస్తోంది. ట్రైసీటి పరిధిలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. అదేరీతిలో మత్తులో వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వాహనదారులపై కేసుల నమోదు సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో కేసులు వేలల్లో ఉండగా జరిమానా కోట్లు దాటింది. వాహనదారులు మారితేనే ప్రమాదాలు తగ్గుతాయనే కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారికి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తాగి నడపడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. ఆరు నెలల్లో 12,277 కేసులు.. ట్రైసిటీలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో 12,277 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్స్టేషన్లు, సిగ్నిల్ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఒక్కోసారి వాహనదారులు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ట్రైసిటీలో ఆరు నెలల్లో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వీకెండ్లో తనిఖీలు పెంచుతున్నాం.. వీకెండ్లో మందుబాబుల కోసం తనిఖీలు పెంచుతున్నాం. మత్తులో జరుగుతున్న ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటే పోలీసులపై కొంతమంది మందుబాబులు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదే పదే పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు అనే నిబంధన పెట్టుకుని బయటకు రావాలి. – సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ఆరు నెలల్లో కేసులు 12,277.. జరిమానా రూ.1.39 కోట్లు జైలుశిక్ష పడిన వాహనదారులు 230 మంది మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్న ట్రాఫిక్ పోలీసులు జైలు.. సామాజిక సేవ దొరికిన మందుబాబులకు కోర్టు జరిమానా తోపాటు 230 మందికి జైలుశిక్ష విధించింది. 33 మంది వాహనదారులను సామాజిక సేవ చేయాలని కోరు ఆదేశించింది. రెండు సార్లు పట్టుబడిన వారితోపాటు రీడింగ్ 100 దాటిన 246 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేశారు. వాహనాలను ఇష్టారీతిన నడిపి పట్టుబడిన సుమారు 9,749 మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
మత్తు.. జరిమానా మస్తు
‘గ్రేటర్’ పరిధిలో ముమ్మరంగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ రోజూ డ్రంకెన్డ్రైవ్ కేసులు బుక్ అవుతుండగా కోర్టులు జరిమానాలు విధించడంతోపాటు మత్తు మోతాదు పెరిగిన వాహనదారులు జైలుబాట పడుతున్నారు. కేసుల సంఖ్య చూస్తే ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేస్తున్న కట్టడి సత్ఫలితాలనిస్తోంది. ట్రైసీటి పరిధిలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. అదేరీతిలో మత్తులో వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వాహనదారులపై కేసుల నమోదు సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో కేసులు వేలల్లో ఉండగా జరిమానా కోట్లు దాటింది. వాహనదారులు మారితేనే ప్రమాదాలు తగ్గుతాయనే కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారికి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తాగి నడపడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. ఆరు నెలల్లో 12,277 కేసులు.. ట్రైసిటీలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో 12,277 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్స్టేషన్లు, సిగ్నిల్ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఒక్కోసారి వాహనదారులు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ట్రైసిటీలో ఆరు నెలల్లో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వీకెండ్లో తనిఖీలు పెంచుతున్నాం.. వీకెండ్లో మందుబాబుల కోసం తనిఖీలు పెంచుతున్నాం. మత్తులో జరుగుతున్న ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటే పోలీసులపై కొంతమంది మందుబాబులు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదే పదే పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు అనే నిబంధన పెట్టుకుని బయటకు రావాలి. – సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ఆరు నెలల్లో కేసులు 12,277.. జరిమానా రూ.1.39 కోట్లు జైలుశిక్ష పడిన వాహనదారులు 230 మంది మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్న ట్రాఫిక్ పోలీసులు జైలు.. సామాజిక సేవ దొరికిన మందుబాబులకు కోర్టు జరిమానా తోపాటు 230 మందికి జైలుశిక్ష విధించింది. 33 మంది వాహనదారులను సామాజిక సేవ చేయాలని కోరు ఆదేశించింది. రెండు సార్లు పట్టుబడిన వారితోపాటు రీడింగ్ 100 దాటిన 246 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేశారు. వాహనాలను ఇష్టారీతిన నడిపి పట్టుబడిన సుమారు 9,749 మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఎరువుల సరఫరాకు ప్రణాళికలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వానాకాలం వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూరియా ఎరువుల సరఫరాకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విత్తనాల కొరత తలెత్తకుండా అవసరమైన నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. యూరియా పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన సహకార తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి సంబంధించిన ఏర్పాట్లపై రైతులకు సకాలంలో సలహాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్రావు, డీసీఓ నీరజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేడు దిశ సమావేశం వరంగల్ జిల్లా దిశ(జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ) సమావేశం నేడు(గురువారం) కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి దిశ చైర్మన్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాంనాయక్ హాజరవుతారని వెల్లడించారు. -
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు ములుగుమహబూబాబాద్హనుమకొండభూపాలపల్లిజనగామవరంగల్భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) -
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
వరంగల్ అర్బన్: అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అందరూ సహకరించాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ), జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ.. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఈఆర్ఓ కార్యాలయం, సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు మహ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ సుభాన్, వివిధ పార్టీల నాయకులు రాజేశ్, రఘునారెడ్డి, బాబు, సీతారాం, సయ్యద్ సుల్తాన్ సాధిక్, రజనీకాంత్, సుభాన్, ఫైజుల్దీన్, శ్యామ్ పాల్గొన్నారు. ఈఆర్ఓ, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -
నేడు సీఎం రేవంత్ రెడ్డివర్చువల్గా ప్రారంభం
న్యూశాయంపేట/ఖానాపురం: ఖానాపురం మండల పరిధిలోని పాకాలలో అభివృద్ధి పనులను నేడు సీఎం రేవంత్రెడ్డి (గురువారం) వర్చువల్గా ప్రారంభించనున్నారు. పాకాలలో ఇటీవల సపారీ వాహనాలు, సైకిళ్లు, పెడల్ బోట్స్తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా వర్చువల్గా సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి నిఖిత తెలిపారు. గుడిసెల్లో ఉండేవారికే ప్రాధాన్యందుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివాసం ఉండే పేదవారికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జెడ్పీ సీఈఓ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలతో పాటు స్వయంగా బుడిగ జంగాల కాలనీలో ఆయన బుధవారం పర్యటించారు. కాలనీలో 10 మంది ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ఐదుగురు పరదాలు కట్టుకుని, గుడిసెలు వేసుకుని నివాసం ఉన్నట్లు గుర్తించారు. వారితో స్వయంగా మాట్లాడారు. ఇళ్లు మంజూరు చేస్తాం కట్టుకోవాలని సూచించారు. మరో ఐదుగురు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. స్థానికంగా నివాసం ఉండే అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని ఎంపీడీఓకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే మంజూరు పత్రాలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ లెక్కల అరుంధతి, గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, హౌసింగ్ ఏఈ ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం సంగెం: వానాకాలంలో సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు. -
పిల్లల అభ్యున్నతికి కృషి చేయాలి
వరంగల్ క్రైం: విధి నిర్వహణలో కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. పిల్లల అభ్యున్నతికి కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో అడ్మిషన్ సాధించిన ఇన్స్పెక్టర్ కుమార్తెను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్తె యడ్లపల్లి సాత్విక జేఈఈ మెయిన్స్ పరీక్షలో 99.65 పర్సంటైల్ సాధించగా, ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో రాణించి 8,081 ర్యాంకుతో ముంబై ఐఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు సాధించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సాత్వికను ఘనంగా సత్కరించారు. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలో సీటు సాధించడం గొప్ప విషయమని, ఇదే రీతిలో కష్టపడి చదివి లక్ష్యాలు చేరుకోవాలన్నారు. విద్యారణ్యపురి: భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్ఐఎఫ్ ఇండియా) మైగౌట్తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘తపన వేసవి అన్వేషణ’ జాతీయ పోస్టర్’ పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈపోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముగ్గురికి సైన్స్ కిట్లు అందించనున్నట్లు, 50 మందికి శాస్త్రవేత్తల, విషయ నిపుణులచే ఏర్పాటు చేసిన ఆన్లైన్ కార్యాశాలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులను ప్రోత్సహించాలని డీఈఓ సూచించారు. పూర్తి వివరాలకు హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ సూచించారు. హన్మకొండ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్–26)పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు నేడు (గురువారం) 2 కే రన్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హనుమకొండ అదాలత్ సర్కిల్లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే ఈ రన్ కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కేయూ క్యాంపస్: తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెటర్ ఎంట్రీ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా టీజీఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. బుధవారం హనుమకొండలోని యూనివవర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ టీజీఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లోని కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవే శం పొందననున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను జ్యోతి అందజేశారు. -
గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలకం
జెడ్పీ సీఈఓ శేషాద్రి దామెర: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని జెడ్పీ సీఈఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వార్డు సభ్యుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిఽకి సర్పంచ్లు, వార్డు సభ్యులు సమష్టి సహకారంతో ముందుకు సాగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంపీఓ ఎంవీ.రంగాచారి, దామెర సర్పంచ్ గరిగె కల్పనకృష్ణమూర్తి, ఉపసర్పంచ్ బత్తిని రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నడికూడలో.. నడికూడ: మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో రోజు వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శేషాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండేది వార్డు సభ్యులేనని, ప్రతీ వార్డు సభ్యుడు తమ విధులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మార్గవిరెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
అనుమానితుల సమాచారం ఇవ్వండి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ప్రజల భద్రతే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. తమ పరిసరాల్లో ఎవరైనా గుర్తు తెలియని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్లో సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనుమానితుల గుర్తింపును పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు బృందాలు వరంగల్ రైల్వే స్టేషన్లో, మరో రెండు బృందాలు కాజీపేట రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా సేకరించిన అనుమానితుల వివరాలను రికార్డుల రూపంలో భద్రపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, జీఆర్పీ డీఎస్పీ కృపాకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్, ఎస్ఐ అభినవ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి..రెండో జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. ఈనెల 20న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ సత్యనారాయణ, పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, దామెర ఎస్సై అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి
విద్యారణ్యపురి: ‘వేసవి సెలవుల్లో ఎలా గడిపారు? మీ అనుభవాలు ఏంటి? వేసవి శిబిరాలు వినియోగించుకున్నారా? ఏమైనా ఆటలు ఆడారా? చదువుకున్నారా’ అని హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ పాఠశాల పదో తరగతి విద్యార్థులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రశ్నించారు. మంగళవారం ఆమె స్కూల్ను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో ఇంటారాక్ట్ అయ్యారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అందుతున్న వసతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం అదనపు తరగగతి గది కావాలని, హిందీ సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం ఉందని హెచ్ఎం రామరావు కలెక్టర్ను కోరారు. డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్ హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిలో చిన్నారులు ఏం నేర్చుకుంటున్నారో పరిశీలించారు. మరో ఇద్దరు టీచర్లు అవసరం ఉందని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సంగెం శ్రీనివాస్.. డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ వెంట ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్ ఉన్నారు. 18న 2కే రన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026 (ఎస్ఐఆర్)పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల 18న ఉదయం 7 గంటలకు 2కే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హనుమకొండ అదాలత్ సర్కిల్లోని డీఈఓ కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే ఈ రన్ కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు హనుమకొండ కలెక్టర్ చాహత్ ప్రభుత్వ మర్కజీ టెన్త్ విద్యార్థులతో ఇంటరాక్షన్ -
ప్రభుత్వ సీలింగ్ భూములు బయటకు తీస్తాం
ఐనవోలు: ‘మండలంలోని వెంకటాపురంలో 138 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు అక్రమంగా పట్టా పొందినట్లు సీపీఐ గుర్తించింది. ఎట్టిపరిస్థితుల్లో సీలింగ్ భూమిని వదిలిపెట్టం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ శాసనసభ పక్ష నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం సీపీఐ జిల్లా నాయకత్వంతో కలిసి ఆక్రమణకు గురైందని భావిస్తున్న భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామస్తుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆ వ్యక్తిని ఎలా అనుమతిస్తారు? కూనంనేని సాంబశివరావు సీలింగ్ భూమిని పరిశీలిస్తుండగా.. అక్రమంగా పట్టా పొందాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్ట మనోజ్రెడ్డి అక్కడికి వచ్చారు. ఇది సరైన సమయం కాదని చెప్పి ఆయనను వెనక్కి పంపించారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇక్కడికి ఎలా అనుమతించారని బందోబస్తు కోసం వచ్చిన వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావును కూనంనేని నిలదీశారు. రెవెన్యూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ గుడ్డేటి ఏలియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, తోట భిక్షపతి, మహ్మద్ వలీవుల్లా ఖాద్రి, ఎదునూరి వెంకట్రాజం, కొట్టపాక రవి, మాదాసి యాకుబ్, జూకంటి పద్మ, భూ పోరాట నాయకులు పాము రమ, బండి సరిత, మచ్చ హైమ, గడ్డమీది ప్రశాంతి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం గ్రామ ప్రజలకు సీపీఐ రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుంది.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ పక్ష నాయకుడు కూనంనేని -
నిషేధిత కలుపు మందులు స్వాధీనం
పోలీసుల అదుపులో ఫర్టిలైజర్ యజమాని కమలాపూర్: మండలంలోని అంబాలలోని శ్రీరామ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణంపై మంగళవారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.57,665 విలువైన ప్రభుత్వ నిషేధిత కలుపు సంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలలోని శ్రీరామ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణంలో ప్రభుత్వ నిషేధిత కలుపు సంహారక మందులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయించడానికి నిల్వ ఉంచిన రూ.57,665 విలువైన ప్రభుత్వ నిషేధిత గ్లైఫోసేట్, గ్లైడాన్, పారాక్వాట్ పేర్లతో విక్రయించే కలుపు సంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి కలుపు మందులతో పాటు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యజమాని కుక్కల ప్రభాకర్ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం కమలాపూర్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబూలాల్, ఎస్సై కె.సుధాకర్, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. -
లూప్లైన్ గుబులు!
పోలీస్వర్గాల్లో చర్చనీయాంశంగా డీజీపీ ప్రకటన సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో పోస్టింగ్లు, బదిలీల వ్యవహారంపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతర్గత కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఏళ్ల తరబడి లాఅండ్ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, పోలీస్స్టేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకేచోట పనిచేస్తున్న నల్లగొండ జిల్లాలోని సైదులు అనే ఎస్ఐని ఇటీవల ఇతర విభాగాలకు డిప్యుటేషన్పై పంపగా.. క్యాన్సల్కు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేయడంపై సీరియస్ అయిన డీజీపీ అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. లాఅండ్ ఆర్డరే ముద్దు.. డిప్యుటేషన్లు వద్దు.. సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికై న అధికారి తాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందే ముందు హోంశాఖ పరిధి పోలీస్ అనుబంధ విభాగాల్లో డిప్యుటేషన్పై పనిచేయడం తప్పనిసరి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పదోన్నతి పొందే ముందు కూడా లూప్లైన్ పోస్టింగ్లో పనిచేసి ఉండాలి. ఇలా పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ అధికారి ఈ నిబంధనలు అనుసరించాల్సి ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ/సీసీఆర్బీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్, సీసీఎస్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంది. కానీ, చాలామంది డిప్యుటేషన్లకు దూరంగా శాంతిభద్రతలు, నగర, పట్టణ ఠాణాల పోస్టింగ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 1,700 మంది డిప్యుటేషన్లకు దూరంగా కీలక పోస్టింగ్లలో కొనసాగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కేడర్లలో పని చేసినవారు, చేస్తున్న వారు వంద మందికిపైనే ఉంటారని చెబుతున్నారు. కొనసాగుతున్న వివరాల సేకరణ... డిప్యుటేషన్ల నిబంధన కొందరికే వర్తించగా, మరికొందరు వాటికి దూరంగా కోరుకున్నచోటే పని చేశారన్న చర్చ ఉంది. తాజాగా ఈ నిబంధన అమలుపై దృష్టిసారించిన అధికారులు.. వివిధ కేడర్లకు చెందిన వారి వివరాలు సేకరిస్తుండటం గమనార్హం. వివరాల సేకరణలో భాగంగా ప్రమోషన్కు ముందు లూప్లైన్లో పనిచేశారా? ఎన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు? ఒకే పట్టణం లేదా సబ్డివిజన్లో దీర్ఘకాలంగా ఉన్నారా? బదిలీల సమయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు వినియోగించుకున్నారా? శాఖ నిర్ణయాలను సవాల్ చేసిన సందర్భాలున్నాయా? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నా.. సగం మందికి ఈసారి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతుండగా.. ఇంతకాలం డిప్యుటేషన్లతో కాలం వెళ్లబుచ్చుతున్న మరికొందరిలో ఠాణా పోస్టింగ్లు రావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. డిప్యుటేషన్లకు దూరంగా ఉన్నవారి వివరాల సేకరణ తెరపైకి లాఅండ్ ఆర్డర్ పోస్టింగ్ల గుట్టు కమిషనరేట్లో సగంమంది ఈసారి లూప్లైన్కే.. -
చెత్తతో బయోగ్యాస్
వరంగల్ అర్బన్: చెత్తే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం.. ఇంట్లో ఉంటే దాన్ని బయట పడేసేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు.. ఎందుకూ పనికిరాదనుకున్న చెత్త ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తోంది. మన దేశంలో సగటు మనిషితో రోజుకు 800 గ్రాముల చెత్త తయారవుతోందని నిపుణులు అంచనా. ఆ చెత్త సంపాదన సృష్టించగలదని ఎప్పుడో నిరూపితమైంది. ఇప్పటికే చిన్న ప్రాజెక్టులను రూపకల్పన చేసిన గ్రేటర్ వరంగల్ ఇక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రోజుకు 440 మెట్రిక్ టన్నులు గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లలో రోజుకు 440 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో తడి చెత్త 40 శాతం, పొడి చెత్త 60 శాతం వస్తోంది. పొడి చెత్తలో 20 శాతం మేరకు డ్రై వేస్ట్ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ) ద్వారా సేకరిస్తోంది. 40 శాతం తడి చెత్తలో ఒక శాతం హనుమకొండలోని బాలసముద్రం, బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయో మిథనైజేషన్ విద్యుత్ అథారిటీ ప్లాంట్లకు, మిగిలిన చెత్త రాంపూర్లోని బల్దియా డంపింగ్ యార్డుకు చేరుతోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో ప్లాంట్ నిర్వహణకు గ్రేటర్ వరంగల్ సన్నాహాలు చేస్తోంది. తడి, పొడి చెత్త సేకరణ రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్ కోసం అనేక ప్రయోగాలు చేసినా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. ఇళ్లు, చిన్న, పెద్ద టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో కూరగాయల తరుగు, వండిన ఆహారం, గంజి, మాంసం, చేపలు కడిగిన నీరు, మిగిలిన ఆహార పదార్థాల వంటివి ఏమైనా కంపోస్టు చేసి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 100 మెట్రిక్ టన్నుల చెత్తతో బయోగ్యాస్ తయారీ.. నగర వ్యాప్తంగా సుమారు 176 మెట్రిక్ టన్నుల తడి చెత్త వెలువడుతోంది. అందులో 100 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్ను తయారు చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) కోసం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రాంపూర్ డంపింగ్ యార్డులో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు నాలుగు బడా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెండర్లు నిర్వహించారు. ఈనెల 18న టెండర్లు ఓపెన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.97 కోట్ల వ్యయం అవుతందని ఇంజనీర్లు అంచనా వేసి టెండర్లు పిలిచారు. అందులో రూ.32 కోట్ల నిధులను వెచ్చించనుంది. మిగిలిన డబ్బులను టెండర్ దక్కించుకున్న సంస్థ వెచ్చించనుంది. 100 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బల్దియా శానిటేషన్ విభాగం ధికారులు, సిబ్బంది రోజు వారీగా రాంపూర్ డంపింగ్ యా ర్డుకు తరలించాల్సి ఉంటుంది. ఆ చెత్తతో సదరు సంస్థ 6 మెట్రిక్ టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి (సీఎన్జీ) చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. భారీ ప్రాజెక్టుకు బల్దియా శ్రీకారం రూ.92 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్లాంట్ రాంపూర్ డంపింగ్ యార్డులో 8 ఎకరాల స్థలం -
నాలాల్లో వ్యర్థాలు పూర్తిగా తొలగించాలి
బల్దియా ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్ : నాలాల్లో తొలగించిన వ్యర్థాలను అక్కడే నిల్వ చేయకుండా, ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని బల్దియా ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్.. ఇంజనీర్లను ఆదేశించారు. నాలాల్లో పూడికతీత, నిర్వహణలో నిర్లక్ష్యంపై ఈనెల 11న ‘సాక్షి’లో నాలాతీత.. నిధుల మేత’శీర్షికన ప్రచురితమైన వా ర్తకు స్పందించారు. మంగళవారం ఆమె జవహర్ కాలనీ, ప్రెసిడెంట్ స్కూల్, రాజాజీ నగర్, నయీంనగర్ ప్రాంతాల్లోని నాలాలను తనిఖీ చేశారు. -
నేడు భద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8.36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరుగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ పాల్గొననున్నారు. మంగళవారం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, క్రాంతికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హసన్పర్తి: ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కిన ఐదు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. రవాణాశాఖ అధికారులు మంగళవారం భీమదేవరపల్లి, ధర్మసాగర్, నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేని బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీఓ జనార్దన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ నాగల శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని గౌలిపురా ఆలేనరేంద్ర మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–15 బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈపోటీల్లో అమ్రిన్ గోల్డ్, గౌతమ్ సిల్వర్, జాహెద్, ఆర్యన్రాజ్, హరీశ్ కాంస్య పతకాలు సాధించినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా నిర్వహణ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈమేరకు మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదుగురు బాక్సర్లు, ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ దేవరకొండ ప్రభుదాస్ను ప్రశాంత్, బాక్సింగ్ సంఘం జిల్లా అ ధ్యక్షుడు రవీందర్కుమార్ అభినందించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ సెంటర్లలో మంగళశారం టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో 1,455 మంది అభ్యర్థులకుగాను 1,189 మంది హాజరైనట్లు డీఈఓ ఎల్వీ.గిరిరాజ్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్లో 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించగా.. 1,612 మంది అభ్యర్థులకుగాను 1,277 మంది (79.21 శాతం) హాజరయ్యారు. ఖిలా వరంగల్: ఖిలావరంగల్లోని రాతికోట అగర్త చెరువు వెంట రూ.2కోట్ల వ్యయంతో చేట్టిన మోట పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్లు సందర్శించారు. వర్షాల పడితే పనులకు ఆటంకం ఏర్పడే ఆవకాశం ఉందని, చెరువులోకి నీరు రాకముందే పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఇక్బాల్, ఆధికారులు పాల్గొన్నారు. -
మొక్కవోని లక్ష్యం
వరంగల్బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 20267రెండు సంవత్సరాల్లో నాటిన మొక్కల వివరాలు..5,71,00094.6 %6,14,70093.2 %2025–262024–25రెండేళ్లుగా జిల్లాలో వంద శాతం వనమహోత్సవం 11,85,700 మొక్కలతో వెల్లివిరిసిన పచ్చదనం ఈ సంవత్సరం మరో 5.70 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక -
‘లూప్లైన్’ గుబులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో పోస్టింగ్లు, బదిలీల వ్యవహారంపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతర్గత కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఏళ్ల తరబడి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, పోలీస్స్టేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకేచోట పనిచేస్తున్న నల్లగొండ జిల్లాలోని సైదులు అనే ఎస్ఐని ఇటీవల ఇతర విభాగాలకు డిప్యుటేషన్పై పంపగా.. క్యాన్సల్కు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేయడంపై సీరియస్ అయిన డీజీపీ అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. లా అండ్ ఆర్డరే ముద్దు.. డిప్యుటేషన్లు వద్దు.. సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికై న అధికారి తాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందే ముందు హోంశాఖ పరిధిలోని పోలీస్ అనుబంధ విభాగాల్లో డిప్యుటేషన్పై పనిచేయడం తప్పనిసరి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పదోన్నతి పొందే ముందు కూడా లూప్లైన్ పోస్టింగ్లో పనిచేసి ఉండాలి. ఇలా పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ అధికారి ఈ నిబంధనలు అనుసరించాల్సి ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ/సీసీఆర్బీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్, సీసీఎస్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంది. కానీ చాలామంది డిప్యుటేషన్లకు దూరంగా శాంతిభద్రతలు, నగర, పట్టణ ఠాణాల పోస్టింగ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 1,700 మంది డిప్యుటేషన్లకు దూరంగా కీలక పోస్టింగ్లలో కొనసాగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కేడర్లలో పని చేసినవారు, చేస్తున్న వారు వంద మందికిపైనే ఉంటారని చెబుతున్నారు. కొనసాగుతున్న వివరాల సేకరణ... డిప్యుటేషన్ల నిబంధన కొందరికే వర్తించగా, మరికొందరు వాటికి దూరంగా కోరుకున్నచోటే పని చేశారన్న చర్చ ఉంది. తాజాగా ఈ నిబంధన అమలుపై దృష్టిసారించిన అధికారులు.. వివిధ కేడర్లకు చెందిన వారి వివరాలు సేకరిస్తుండడం గమనార్హం. వివరాల సేకరణలో భాగంగా ప్రమోషన్కు ముందు లూప్లైన్లో పనిచేశారా? ఎన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు? ఒకే పట్టణం లేదా సబ్డివిజన్లో దీర్ఘకాలంగా ఉన్నారా? బదిలీల సమయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు వినియోగించుకున్నారా? శాఖ నిర్ణయాలను సవాల్ చేసిన సందర్భాలున్నాయా? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నా.. సగం మందికి ఈసారి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతుండగా.. ఇంతకాలం డిప్యుటేషన్లతో కాలం వెళ్లబుచ్చుతున్న మరికొందరిలో ఠాణా పోస్టింగ్లు రావొచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పోలీస్వర్గాల్లో చర్చనీయాంశంగా డీజీపీ ప్రకటన డిప్యుటేషన్లకు దూరంగా ఉన్నవారి వివరాల సేకరణ తెరపైకి లాఅండ్ఆర్డర్ పోస్టింగ్ల గుట్టు కమిషనరేట్లో సగం మంది ఈసారి లూప్లైన్కే.. -
కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం
నర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలోని రెండు షాపుల్లో పోలీసులు, టాస్క్ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసినట్లు ఎస్సై గూడ అరుణ్ తెలిపారు. రూ. 42,433 విలువగల కాలం చెల్లిన పురుగు మందులను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మల్లంపల్లి రోడ్డులో కారుకూరి భరత్కు చెందిన ఆగ్రో ఏజెన్సీస్లో రూ.12193, నెక్కొండ రోడ్డులో ఎండీ కరీంకు చెందిన జై కిసాన్ ఫర్టిలైజర్ షాపులో రూ. 30,240 విలువైన కాలం చెల్లిన పురుగు మందులను సీజ్ చేసినట్లు తెలిపారు. యజమానులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
పెండింగ్ పనులు వేగవంతం చేయాలి
నర్సంపేట: పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఈ రాజ్చౌహాన్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట, ఖానాపురం మండలాల్లో మంగళవారం పర్యటించారు. విద్యుత్ శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యుత్ అంతరాయాల పరిస్థితి, వ్యవసాయ వినియోగదారులకు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 11కేవీ ఫీడర్ల డిజిటల్ యాక్షన్ స్టేటస్, ఏజీఎల్ డీటీఆర్ల ఆర్పీడీసీఎల్ ఎంట్రీలు, ఓవర్లోడ్ డీటీఆర్ల పరిస్థితి, ద్వారకపేట సబ్స్టేషన్ పనుల పురోగతి, నర్సంపేట డివిజన్ పరిధిలో 11కేవీ అంతరాయాల వివరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీఈ పి.తిరుపతి, రూరల్ ఏడీఈ రాజేశ్రెడ్డి, టౌన్ ఏడీఈ బి.లక్ష్మణ్, ఏఈ ఎన్.విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సీఈ రాజ్చౌహాన్ -
విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు
న్యూశాయంపేట: వర్షాకాలంలో సహజ విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గత వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గృహాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశాఖకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో అర్హులను నమోదుచేయాలిఅర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్స్తో మూడు నియోజకవర్గాల పరిధిలోని ఏఈఆర్ఓఎస్, ఎఎల్ఎంటీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 20 వరకు బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి జూలై 24 వరకు జరిగే ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి బీఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి డిక్లరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
యూడైస్లో సవరణకు మార్గదర్శకాలు
కాళోజీ సెంటర్: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాల సవరణ ప్రక్రియపై జిల్లా విద్యాశాఖాధికారి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. యూడైస్ ప్లస్(యూడీఈఎస్ఈ +)పోర్టల్లోని ఎస్డీఎంఎస్ మాడ్యూల్ ద్వారా విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ వివరాల సవరణ సేవ ఇకపై కేవలం జిల్లాస్థాయి ఎంఐఎస్ యూజర్కు మాత్రమే అందుబాటులో ఉంటుందని డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాల సవరణకు సంబంధించి ఈ కింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు ● ధ్రువీకృత ప్రత్రాలు : విద్యార్థి వివరాల సవరణకు హెచ్ఎం, మండల విద్యాధికారి సంతకాలతో ధ్రువీకరించిన అడ్మిషన్ రిజిస్టర్ ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. ● హెచ్ఎం వివరణ లేఖ : పోర్టల్లో వివరాలను సమర్పించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో వివరిస్తూ హెచ్ఎంల నుంచి అధికారికి లేఖను జతచేయాలి. ● టైపింగ్ పొరపాట్లపై హామీ : ఒకవేళ టైపింగ్ పొరపాటు కారణంగా మార్పులు చేయాల్సి వస్తే మిగిలిన విద్యార్థుల వివరాలు సరైనవేనని, భవిష్యత్లో ఇలాంటి తప్పులు జరగవని పేర్కొంటూ హెచ్ఎం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ● రిజిస్టర్ ప్రకారమే మార్పులు : విద్యార్థి వివరాల సవరణ కేవలం అడ్మిషన్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు అనుగుణంగా మాత్రమే చేస్తారు. రిజస్టర్లోని వివరాలు, యూడైస్ పోర్టల్లోని వివరాలు భిన్నంగా ఉండడానికి వీలు లేదు. ● ప్రత్యేక ఫైల్ నిర్వహణ: విద్యార్థుల వివరాల సవరణలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను పాఠశాలలో ప్రత్యేక ఫైల్గా భద్రపరచాలి. పేరు పూర్తిగా మారాలంటే ఇవి తప్పనిసరి విద్యార్థి పేరును పూర్తిగా మార్చాలన్నా లేదా ప్రధాన మార్పులు చేయాలన్నా ఈ ఆధారాలు సమర్పించడం తప్పనిసరి అని డీఈఓ పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి అభ్యర్థన పత్రం, ప్రధానోపాద్యాయుల నివేదిక, మండల విద్యాధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణ, అఫిడవిట్, అందుబాటులో ఉంటే జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఆయన తెలిపారు. కీలక మార్గదర్శకాల అమలు తప్పనిసరివిద్యార్థుల జనాభా వివరాల సవరణ సేవను దుర్వినియోగం చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై నిబంధనల ప్రకారం కఠన చర్యలు తీసుకుంటాం. హెచ్ఎంలు అందరూ పూర్తి ఆధారాలతో కూడిన ప్రతిపాదనలు మాత్రమే సమర్పించాలి. కీలక మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి. – బి.రంగయ్యనాయుడు డీఈఓ -
28న పల్స్ పోలియో కార్యక్రమం
కాశిబుగ్గ: జిల్లాలో ఈ నెల 28న పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. వరంగల్ ఐఎంఏ హాల్లో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సబ్యూనిట్ ఆఫీసర్లకు పల్స్పోలియో ప్రోగ్రాం, జాతీయ నులిపురుగుల నిర్మూలనపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0–5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని సూచించారు. 28న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 29, 30 తేదీల్లో గృహ సందర్శన చేపట్టి పోలియో టీకాలు ఇస్తారని పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా జూలై 13న ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు వారికి ఆల్బెండజోల్ మాత్రలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో నోటి ద్వారా ఇవ్వాలని సూచించారు. జూలై 18న మాప్ ఆఫ్ డే నిర్వహిస్తామని వివరించారు. వర్షాకాలం దృష్టా ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, యాంటీవీరం లాంటివి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలే ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వివరించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ఐ.ప్రకాశ్, సయ్యద్ ఇక్తధార్ అహ్మద్, రాజమౌళి, సాజిదా, అరుణ్ జోషి, విజయ్కుమార్, డీఎంఓ రజని పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు -
నేడు హలో వ్యవసాయాధికారి
ఖిలా వరంగల్: జిల్లాలో వానాకాలం సాగు యాజమాన్యం పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ౖరెతులు తమ సమస్యలను జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మలకు తెలపవచ్చు. నేడు (బుధవారం) ఈ కింది సెల్నంబర్కు ఫోన్ చేసి వ్యవసాయాధికారి నుంచి రైతులు సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. బుధవారం సమయం : ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 8977756214 -
మొక్కలను సంరక్షించాలి
గీసుకొండ: వనమహోత్సవంలో భాగంగా నాటడానికి నర్సరీలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని డీఎఫ్ఓ నిఖిత అన్నారు. మచ్చాపూర్ నర్సరీలో మంగళవారం ఆమె మొక్కలను పరిశీలించి ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. ఎండ తీవ్రతకు మొక్కలు ఎండిపోకుండా తగినంత నీరు పోయాలన్నారు. నర్సరీలోని మొక్కల వివరాలను, సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.రాధిక, సెక్షన్ ఆఫీసర్ జగ్గయ్య, బీట్ ఆఫీసర్ సమ్మయ్య, టెక్నికల్ అసిస్టెంట్ సీహెచ్ రాజు, వనసేవక్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. పలువురికి ఎంపీడీఓలుగా పదోన్నతిగీసుకొండ: జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా, మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా పనిచేస్తున్న పలువురికి ఎంపీడీఓలుగా తాత్కాలిక పద్ధతి(అడ్హక్)న పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ డి.దివ్య పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. గీసుకొండ ఎంపీఓగా పనిచేస్తున్న పాక శ్రీనివాస్కు ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ఇదే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే, నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ వి.ప్రవీణ్కుమార్ను ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ములుగు జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఎస్.ఉదయ్భాస్కర్ను నిజామాబాద్ జిల్లాకు ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. సూపరింటెండెంట్ పి.శ్రీదేవిని ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ఖమ్మం బదిలీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామానర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డీఎంఈ, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణికి అందించినట్లు కిషన్ తెలిపారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్ బాధ్య తలను జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ చంద్రశేఖర్కు అప్పగించినట్లు తెలిసింది. పేకాట స్థావరంపై దాడులునర్సంపేట రూరల్ : పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్, నర్సపేంట పోలీసులు దాడులు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఎస్సై గూడ అరుణ్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. 10 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి రూ.6,200 నగదు, 7 మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు వివరించారు. టాస్క్ఫోర్స్ సీఐ బండారి రాజు, పి.దేవేందర్, ఎస్సై భానుప్రకాశ్, నర్సంపేట పోలీసులు పాల్గొన్నారు. -
కెనాల్తో విలువైన భూములు కోల్పోతాం
నర్సంపేట: సమీపంలోనే కెనాల్ ఉండగా మరో కెనాల్ నిర్మిస్తే విలువైన భూములు కోల్పోతామని నల్లబెల్లి మండలం కన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కన్నారావుపేట సర్పంచ్ పలనాటి మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రైతులు నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కన్నారావుపేట గ్రామంలో రంగాయ చెరువు రిజర్వాయర్ నుంచి రైట్ కెనాల్ ద్వారా తమ భూములకు నీరందుతూ చెరువులు, కుంటలు నిండుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ రైతుల భూములను చీల్చుతూ మరో కెనాల్ ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పదేపదే చెప్పడంతో ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోరిక మేరకు గత ప్రభుత్వ హయాంలో కెనాల్ పనులు నిలిపివేశారని, ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం భయభ్రాంతులకు గురిచేస్తోందని వాపోయారు. రైతులను నష్టపరిచే కెనాల్ వద్దని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు నానబోయిన దేవేందర్, అశోద శరత్, కృష్ణారెడ్డి, సంపత్రెడ్డి, రవీందర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, బద్రి, రాజేందర్, యాకూబ్, దేవేందర్రెడ్డి, సహదేవ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మొహర్రానికి ఏర్పాట్లు చేయాలిన్యూశాయంపేట: మొహర్రంను ప్రశాంతంగా నిర్వహించేందకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఊరేగింపునకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ పాల్గొన్నారు. ‘సర్వోదయ’ సేవలు అభినందనీయంగీసుకొండ: మహిళల సంక్షేమం, జీవనోపాధి, వ్యాపారాభివృద్ధి కోసం సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్ అన్నారు. కొనాయమాకులలో సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వోదయ సంస్థ కార్యదర్శి డాక్టర్ పల్లెపాడు దామోదర్ మాట్లాడుతూ తమ సంస్థ 30 ఏళ్ల నుంచి సుమారు 5 వేల మంది మహిళలు, వితంతువులకు వడ్డీలేని రుణాలను అందించిందని వివరించారు. సెర్ప్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ సర్వోదయ సంస్థ మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందించడం గొప్ప విషయం అన్నారు. అనంతరం సర్వోదయ సంస్థ ఆధ్వర్యంలో 30 మంది పేద మహిళలకు రూ.20 వేల చొప్పున రూ.6 లక్షల వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజు, ప్రతినిధులు ఇందిర, రవీందర్, అక్తర్, వనిత, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు మండలాల మహిళలు పాల్గొన్నారు. -
ఎస్సీ బాలికల హాస్టల్ను తనిఖీ చేసిన కలెక్టర్
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, భోజన శాల, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, విద్యార్థినులకు కల్పించిన వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, విద్యార్థినులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని, తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని హాస్టల్ వార్డెన్ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు అల్పాహారం, భోజనం, ఇతర ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థినుల ఆరోగ్యం, విద్యాభాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువులో రాణించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఎస్సీడీఓ భాగ్యలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత, డీటీడీఓ నారాయణ, అధికారులు పాల్గొన్నారు -
నత్తనడకన నర్సింగ్ కళాశాల నిర్మాణం
● శంకుస్థాపన వేసి ఏడు నెలలు గడిచినా బెడ్ లెవల్లోనే పనులు ● త్వరగా పూర్తిచేయాలని కోరుతున్న నర్సింగ్ విద్యార్థులునర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శంకుస్థాపన చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు బెడ్ లేవల్కే పనులు పరిమితం అయ్యాయి. ఇలా అయితే భవనం పూర్తయ్యేది ఎప్పుడు, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేదెప్పుడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతోనే వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 2018 సంవత్సరంలో 250 పడకలతో జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. దాత ప్రముఖ వ్యాపారవేత్త దొడ్డమోహన్రావు ప్రభుత్వానికి 20 ఎకరాల భూమిని కొనుగోలుచేసి అందించారు. అందులో 10 ఎకరాల భూమిని ఆస్పత్రి కేటాయించగా మూడు బ్లాక్లతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. 2022లో నర్సంపేట జిల్లా ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. 2024–25 సంవత్సరంలో నూతనంగా నిర్మించిన భవనంలో రెండు బ్లాక్లను ప్రారంభించి వైద్య కళాశాల, ఆస్పత్రి సేవలను ప్రారంభించారు. అదే సంవత్సరంలో నర్సింగ్ కళాశాల మొదటి బ్యాచ్ను 50 మంది విద్యార్థులతో ప్రారంభించారు. గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో భవనం అద్దెకు తీసుకొని నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెండు బ్యాచ్లు పూర్తయ్యాయి. మరో రెండుమూడు నెలల్లో కొత్త బ్యాచ్ వచ్చే అవకాశం ఉంది. నర్సంపేట వైద్యకళాశాలకు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించగా.. అందులో నుంచి నాలుగున్నర ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది నర్సింగ్ కళాశాలకు కేటాయించారు. గత సంవత్సరం డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఏడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఇప్పటి వరకు కనీసం బెడ్ లేవల్కే పరిమితమయ్యాయి. గంగదేవిపల్లికి టు నర్సంపేటకు నర్సింగ్ విద్యార్థుల అప్ అండ్ డౌన్.. నర్సంపేట వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల, పారా మెడికల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కళాశాలకు భవన సదుపాయం లేకపోవడంతో గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి వద్ద ఉన్న భవనంలోనే నర్సింగ్ తరగతులు, ప్రాక్టికల్స్ మాత్రం నర్సంపేట ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థులు గంగదేవిపల్లి నుంచి నర్సంపేటకు రావాలంటే తిప్పలు తప్పడం లేదు. కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సును ఏర్పాటుచేసి రావాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి త్వరగానే పనులను వేగవంతం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ పనులపై ఏఈ నరేశ్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
వెపన్.. ఫ్యాషన్..!
నక్సల్స్ భయం పోయినా... తుపాకుల హవాఉమ్మడి వరంగల్లో 380 వరకు గన్ లైసెన్స్లు ఉన్నట్లు అంచనా భద్రత ముసుగులో సెటిల్మెంట్లు.. దారి తప్పుతున్న ఆయుధాలు పోలీసుల ఫోకస్... లైసెన్స్దారుల్లో చర్చనీయాంశంసాక్షిప్రతినిధి, వరంగల్ : ..ఇలాంటి ఘటనల్లో కొన్ని కేసులు నమోదు కాకున్నా చాలావరకు ఫిర్యాదులున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల హెచ్చరికలు, కాంట్రాక్టర్లపై దాడులు, వ్యాపారవేత్తలనుంచి లెవీలు, రాజకీయ నాయకుల హత్యలు, భద్రతా సిబ్బందిపై దాడులు తరచూ చోటుచేసుకునేవి. ఆ భయానికి వరంగల్ నగరానికి వచ్చి తలదాచుకున్న వారు చాలామందే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే పెద్దఎత్తున ఆయుధాల లైసెన్సులు జారీ అయ్యాయి. గతంలో ప్రాణ భద్రత కోసం తీసుకున్న ఈ ఆయుధాలు ఇప్పుడు అవసరానికంటే ప్రతిష్టకు, ప్రభావానికి, కొన్నిచోట్ల భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, సెటిల్మెంట్లలో ఒత్తిడి సాధనంగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఆయుధాల లైసెన్సులపై సమగ్ర సమీక్షకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు స్టేటస్ సింబల్గా ‘గన్’.. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. అనేకమంది ఎన్కౌంటర్లలో చనిపోగా చాలావరకు లొంగిపోయారు. మైదాన ప్రాంతాలు, అడవుల్లో పూర్తిగా కదలికలు తగ్గి పోలీస్ ఆధిపత్యం పెరిగింది. తెలంగాణలో పూర్తిగా అంతరించిపోయిందని ప్రభుత్వం, డీజీపీలు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఆయుధాల అవసరం ఎంత మేర ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు గన్ అంటే భద్రత. ఇప్పుడు కొంతమంది వద్ద అది ‘స్టేటస్ సింబల్‘గా మారిందనే విమర్శలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేఅవుట్ నిర్వాహకులు, భూముల కొనుగోలు విక్రయదారులు, సెటిల్మెంట్ ముఠాలకు దగ్గరగా ఉండే వ్యక్తులు కొంతమంది ఆయుధాలను తమ ప్రభావం చూపేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతుండడం చర్చనీయాంశం అవుతోంది. డీజేపీ ఆదేశాలు.. ఆయుధాలపై ఆరా అధికారిక గణాంకాల ప్రకారం ఆయుధాల లైసెన్సులు ఉమ్మడి వరంగల్ నుంచి 380 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయుధాలు దారితప్పుతున్నాయన్న ఫిర్యాదులపై డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. లైసెన్సు పొందిన కారణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా? లైసెన్సుదారులపై క్రిమినల్ కేసులున్నాయా? ఆయుధాల దుర్వినియోగం జరుగుతోందా? రద్దు చేయాల్సిన లైసెన్సులు ఉన్నాయా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా... నక్సల్స్ ప్రభావం తగ్గిన తర్వాత భద్రతా ముప్పు లేని వ్యక్తులు, వ్యాపార రంగం మారిన వారు, జిల్లా విడిచి వెళ్లిన వారి వద్ద ఉన్న లైసెన్సులపై పునఃపరిశీలన చేస్తుండడం లైసెన్స్పొందిన వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఓ వ్యాపారవేత్త ఓ ఫంక్షన్హాల్లో గాలిలోకి కాల్పులు జరిపిన ఘటన అప్పట్లో వివాదాస్పదంగా మారింది. రాజకీయపరమైన చర్చ ముదిరి గాల్లోకి కాల్పులు జరిపే వరకు వెళ్లడాన్ని సీరియస్గా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ రౌడీషీటర్ గతేడాది గ్రేటర్ సిటీ గోపాల్పూర్ ఏరియా, శాయంపేట మండలాల్లో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. భూసెటిల్మెంట్లు, ఓ హత్యకు ప్లాన్ చేశారన్న ఫిర్యాదులపై పోలీసులు అరెస్టు చేసి రెండు కంట్రీ రివాల్వ ర్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నగరంలో ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి భూముల పంచాయితీ సందర్భంగా తనవద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని టేబుల్ పెట్టడం వివాదంగా మారింది. తనను బెదిరించే ప్రయత్నం చేశారన్న ప్రత్యర్థి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల నమోదు, పరిష్కార ప్రక్రియపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, మొత్తం 263 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పరిధి హనుమకొండ, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓలు, సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో.. న్యూశాయంపేట: అర్జీలను పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో మొత్తం 202 దరఖాస్తులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. రెవెన్యూ 64, మున్సిపల్ 48, హౌసింగ్ 22, డీఆర్డీఓ 10, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా, వరంగల్ హెడ్పోస్టాఫీస్ పక్కన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఖాళీ స్థలంలో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం వ్యాపారాలు చేసుకుంటామని వీధి వ్యాపారులు కలెక్టర్కు విన్నవించారు.అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు. -
ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్టామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్ పాల్గొన్నారు. -
పాఠశాలల బలోపేతానికే ప్రీ ప్రైమరీ తరగతులు
ధర్మసాగర్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రీ–ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులు ప్రవేశపెట్టారని డీఈఓ గిరిరాజ్ గౌడ్ అన్నారు. మండలంలోని పెద్ద పెండ్యాల, ఎల్కుర్తి, తాటికాయలలో సోమవారం పాఠశాలలను ఘనంగా పునఃప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు, సర్పంచ్, ప్రజలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ రాంధన్ మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రమించి రికార్డు స్థాయిలో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ తోట నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను సర్పంచ్గా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం భగవాన్ రెడ్డి, సర్పంచ్ లు నరిశెట్టి సుధాకర్, ననుబాల సోమక్క తదితరులు పాల్గొన్నారు. -
రేపు హలో వ్యవసాయాధికారి
ఖిలా వరంగల్: జిల్లాలో వానాకాలం సాగు యాజమాన్యం పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ౖరెతులు తమ సమస్యలను జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మలకు తెలపవచ్చు. రేపు (బుధవారం) ఈ కింది సెల్నంబర్కు ఫోన్ చేసి వ్యవసాయాధికారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. బుధవారం సమయం : ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 8977756214 -
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026
విద్యారణ్యపురి: పునఃప్రారంభం రోజున (సోమవారం) ప్రభుత్వ పాఠశాలల్లో సందడి కరువైంది. అమావాస్య అని కొందరు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. ఉపాధ్యాయుల హాజరు ఫుల్గానే ఉన్నప్పటికీ విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కాగా, హనుమకొండ, కాజీపేట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేశారు. తొలిరోజు పూరి, కుర్మా, కొన్ని చోట్ల ఇడ్లీ, చట్నీ వడ్డించారు. పాలు కూడా అందించారు. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తొలి రోజు కావడంతో బ్రేక్ఫాస్ట్ అందించడంలో సంస్థ నిర్వాహకుల లెక్క తప్పింది. కొన్ని చోట్ల ఒక్కో విద్యార్థికి ఒకటి చొప్పున పూరీ అందించారు. అందని పాఠశాలలు కొన్ని.. హనుమకొండలోని జూలైవాడ బాసిత్నగర్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో సోమవారం బ్రేక్ ఫాస్ట్, పాలు అందలేదని ఎంఈఓ నెహ్రూ తెలిపారు. మంగళవారం నుంచి యథావిఽధిగా అందించాలని సంస్థ నిర్వాహకులకు సూచించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలను, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ మన్మోహన్తో కలిసి పరిశీలించారు. బ్రేక్ఫాస్ట్, పాలు రుచి చూసి బాగున్నాయని తెలిపారు. తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ● -
బడిబాట అటెన్షన్
మరో మూడు రోజుల్లో ముగియనున్న కార్యక్రమం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల చేరికలు ఎక్కువగా ఉండాలని నిర్దేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడిపోతున్నారు. 2025–26వ సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 32,614 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమం ద్వారా 3,513 కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్ విధించినా ఇప్పటివరకు 1,761 మంది విద్యార్థులను మాత్రమే చేర్పించగలిగారు. ఒకటో తరగతి అడ్మిషన్లు 579, రెండు నుంచి ఐదో తరగతి వరకు 337, ఆరు నుంచి పదో తరగతి వరకు 845 అడ్మిషన్లు అయ్యాయి. మే 18న ప్రారంభమైన ఈ బడిబాట కార్యక్రమం ఈ నెల 19తో ముగియనుంది. ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాలంటే 1,754 మంది విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం ఉంది. మరో మూడు రోజులు మాత్రమే సమ యం ఉంది ఇప్పటివరకు 50.07 శాతం మాత్రమే అడ్మిషన్లు కాగా.. మరో 49.93 శాతం అడ్మిషన్లు కావాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయాలి. -
ఆగ్రో సెంటర్పై టాస్క్ఫోర్స్ దాడులు
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని అన్నదాత ఆగ్రో సెంటర్పై సోమవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు కంపెనీలకు చెందిన రూ.6.86,905 విలువైన గడువు ముగిసిన పురుగు మందులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నల్లబెల్లి గ్రామ శివారు రంగాపురానికి చెందిన యజమాని రాపర్తి రాజుపై కేసు నమోదు చేసి స్థానిక ఎస్సై సాయిబాబుకు అప్పగించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్సై బి.ఉప్పలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక సమస్యలు పరిష్కరించరా?
వరంగల్ అర్బన్: ‘కాలనీల్లో సమస్యలతో సతమతమవుతున్నాం. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైప్లైన్లు, ఆక్రమణలు తదితర సమస్యలపై అనేకసార్లు ఫిర్యాదులు చేశాం. స్థానిక సమస్యలను పరిష్కరించరా?’ అని గ్రేటర్ వరంగల్ అధికారులను నగర ప్రజలు నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్కు 41, ఇంజనీరింగ్ సెక్షన్కు 24, రెవెన్యూ విభాగానికి 7, హెల్త్, శానిటేషన్కు 10, తాగునీటి సరఫరా కోసం 3 రాగా, మొత్తం 85 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శంకర్ లింగం, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ రాజేశ్, సెక్రటరీ అనిల్ బాబు, హెచ్ఓ లక్ష్మారెడ్డి, ఈఈ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులను నిలదీసిన నగర ప్రజలు గ్రేటర్ గ్రీవెన్స్కు 85 ఫిర్యాదులు -
ఎస్ఐఆర్ విజయవంతానికి బీఎల్ఓలే కీలకం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతానికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) కీలక పాత్ర పోషించాలని హనుమకొండ కలెక్టర్, ఈఆర్ఓ (వరంగల్ తూర్పు) చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో బూత్ లెవల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు మొహమ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు విజయవంతం చేయాలి పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్, ఆయా కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాం కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్ఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి తదితరులు పాల్గొన్నారు. అవార్డులతో జిల్లాకు గుర్తింపు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన అవార్డుల్లో హనుమకొండ జిల్లా 8 అవార్డులను కై వసం చేసుకున్న సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ.శ్రీనివాస్రావు కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఏసీపీలు, ఆర్డీఓలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, ఏఎస్పీలతో కలిసి కలెక్టర్ కేసుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ కుమార్, ఏసీపీలు ప్రశాంత్రెడ్డి, నరసింహారావు, ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, తహసీల్దార్ సీహెచ్.రాజు, ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ పి.దామోదర్, పురుషోత్తం, నరసింహారావు, ఈవీ శ్రీనివాస్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఒక విద్యార్థి.. ముగ్గురు ఉపాధ్యాయులు
కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముగ్గురు ఉపాధ్యాయులు హాజరు కాగా.. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని శనిగరపు శ్రీఆధ్య మాత్రమే పాఠశాలకు హాజరైంది. ఈ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా.. నలుగురు ఉపాధ్యాయులకుగాను వేసవి సెలవులకు ముందు హెచ్ఎం ఉద్యోగ విరమణ పొందారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. – మరిన్ని ఫొటోలు 8లో.. -
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించండి
న్యూశాయంపేట: గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో మొత్తం 202 దరఖాస్తులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. రెవెన్యూ 64, మున్సిపల్ 48, హౌసింగ్ 22, డీఆర్డీఓ 10, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు.. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్కు వచ్చి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్ సైతం అర్జీలను వరుస క్రమంలో స్వీకరించారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ ముగియాల్సి ఉంది. ప్రజలు ఎక్కువగా తరలిరావడంతో సాయంత్రం వరకు అధికారులు అర్జీలను స్వీకరించారు. దీంతో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా విధులు నిర్వర్తించారు. గంటసేపు భోజన విరామం ఇవ్వండి.. ఉదయం అల్పాహారం తీసుకుని అధికారులు, సు దూర ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు గ్రీవె న్స్కు వచ్చారు. అయితే, మధ్యాహ్నం గంటసేపు విరామం ఇవ్వాలని వారు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. క్యూలో నిల్చోలేక ఫిర్యాదుదారులు, సమయం తెలియకుండా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు విరామం ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశం -
హల్లో.. నన్ను మర్చిపోయారా!
ఆత్మకూరు: హల్లో.. నన్ను మర్చిపోయారా.. నేను ఆత్మకూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని అసంపూర్తి డైనింగ్హాల్ను. గత పాలకులు మూడేళ్ల క్రితం నా నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. నా నీడన కూర్చుని.. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దామనుకున్న విద్యార్థులు.. అసంపూర్తిగా ఉన్న నన్ను చూసి బాధపడుతున్నారు. ఈరోజు పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కోటి ఆశలతో బడికి వస్తున్న పిల్లలకు నేను మళ్లీ నిరాశనే మిగిల్చనున్నా! నా నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించి పిల్లలకు అందుబాటులోకి తెస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా. (అసంపూర్తి డైనింగ్ హాల్ ఆత్మఘోష) -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
వరంగల్ చౌరస్తా: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం (ఎస్జీపీఏటీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామమనోహర్ డిమాండ్ చేశారు. వరంగల్ గిర్మాజీపేటలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఎస్జీపీఏటీ కాశిబుగ్గ యూనిట్ సమావేశం ఎండీ మదార్ సాహెబ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. హెల్త్ కార్డులకు సంబంధించి విధివిధానాలు లేకుండా, వైద్యశాలల ఎంపిక జరుగకుండా, పెన్షనర్లకు సమాచారం లేకుండా ప్రీమియం మినహాయించడం శోఛనీయమన్నారు. నాయకులు సుధీర్బాబు, తుమ్మ వీరయ్య, గునిగంటి సాంబయ్య, నిమ్మకాయల సదానందం, మధుసూదన్ రావు, వీరస్వామి, కుమారస్వామి, భిక్షపతి, ఎన్.సత్యనారాయణ, పెద్దూరి పెద్దన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషెంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది లేక పోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. -
చెత్త చింత తీరినట్టే !
నర్సంపేట: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 15 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త సమస్యకు నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా ఆపై మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న నర్సంపేట మున్సిపాలిటీలో చెత్త సమస్య మాత్రం పీడిస్తూ వచ్చింది. ప్రస్తుతం 30 వార్డులు, 60 వేల జనాభా కలిగిన నర్సంపేట పట్టణం జిల్లా కేంద్రంగా చెప్పుకునేందుకు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇలాంటి మున్సిపాలిటీలో చెప్పుకునేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం అందులోనూ పేరుకుపోయిన చెత్తను తగ్గించే అవకాశం లేకపోవడంతో గుట్టలు గుట్టలుగా ఏర్పడింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రఖ్యాతిగా కాలుష్యరహిత ప్రాంతంగా పేరొందిన పాకాల సరస్సుకు వెళ్లే రహదారిపై చెత్త డంప్ నిల్వ చేస్తుండడంతో ఆవైపుగా వెళ్లే పర్యాటకులకు అసహనం కలిగించింది. ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ద్వారా చెత్త గుట్టలను శుద్ధి చేస్తూ కాలుష్య నివారణకు శ్రీకారం చుట్టారు. నర్సంపేట పట్టణంలో 20 రోజులుగా పేరుకుపోయిన చెత్త గుట్టలను శుద్ధీకరణ చేసేందుకు అన్నపూర్ణ కన్స్ట్రక్షన్ సంస్థ ఉద్యోగులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ముందుకు సాగారు. సంస్థ ఉద్యోగులు జనవరిలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డు వెంట ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. దుర్వాసన రాకుండా పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా అప్పటికప్పుడే రసాయనాలను స్ప్రే చేశారు. దాని తర్వాత బయోమైనింగ్ పనులకు అవసరమైన పరికరాలలో భాగంగా వే బ్రిడ్జి నిర్మించి 63 కేవీ విద్యుత్ నియంత్రణ ప్రోమో యంత్రాన్ని అమర్చి వేర్వేరు హెచ్పీల సామర్థ్యం కలిగిన ఏడు కరెంటు విద్యుత్ మోటార్లను బిగించి 20 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ మరో మూడు పాటు కొనసాగించనున్నారు. రోజుకు 450 టన్నుల చెత్త శుద్ధీకరణ నర్సంపేట పట్టణంలో పేరుకుపోయిన చెత్తను పాకాల రోడ్డులోని అసైన్డ్ భూమిలో పోస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 13 వేల నుంచి 16 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంటుంది. గత నవంబర్లో టెండర్లు పిలువగా నిర్మల్కు చెందిన అన్నపూర్ణ కన్స్ట్రక్షన్ సంస్థ పనులను దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటతో పాటు పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బయోమైనింగ్ పనులు ఆ సంస్థ దక్కించుకుంది. అయినప్పటికీ నర్సంపేటలో మాత్రమే పనులు మొదలయ్యాయి. బయోమైనింగ్ విధానంలో.. నర్సంపేట పట్టణంలో పేరుకుపోయిన చెత్తను పాకాల రోడ్డు వెంట ఉన్న అసైన్డ్ భూమిలో డంప్ చేయగా 15 సంవత్సరాలుగా పేరుకుపోయిన ఈ చెత్త గుట్టలను బయోమైనింగ్ విధానంలో శుద్ధి చేస్తున్నారు. రోజుకు 450 టన్నుల చెత్త శుద్ధీకరణ జరుగుతున్నట్లు ప్రస్తుతం అక్కడ ఇన్చార్జ్గా ఉన్న సూపర్వైజర్ కుమార్ సాక్షికి తెలిపారు. ప్రొక్లైనర్తో ప్రోమో యంత్రంతో చేయగానే అందులో నుంచి మూడు విభాగాలుగా ప్లాస్టిక్ పరికరాలు, చెత్త, మట్టిని కుప్పలుగా పోస్తుందని, టన్ను చెత్త నుంచి 60శాతం బయో సాయిల్స్, 20శాతం ఇన్నర్స్ (5ఎంఎం కంటే ఎక్కువ సైజ్ రాళ్లు, సీసా ముక్కలు), 10 శాతం రిజెక్ట్ మెటీరియల్ (ప్లాస్టిక్), 10 శాతం తరుగు (లెస్) చొప్పున శుద్ధీకరణ అవుతుందన్నారు. మంచి పనులకు శ్రీకారం చుట్టాం గత కొన్ని సంవత్సరాలుగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డును బయో మైనింగ్ ద్వారా శుద్ధీకరణ చేసేందుకు శ్రీకారం చుట్టాం. పర్యావరణ పరంగా పాకాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఆ మార్గం గుండా వెళ్లే పర్యాటకులకు అసౌకర్యాలను తొలగించేందుకు డంప్ యార్డులో బయోమెట్రిక్ సిస్టం ద్వారా శుద్ధీకరణకు శ్రీకారం చుట్టాం. నర్సంపేట నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో కృషి చేస్తున్నాం. – దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే సహకారంతో.. పర్యావరణ పరంగా అన్ని రకాలుగా నర్సంపేట పట్టణాన్ని ముందు ఉంచేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక సదుపాయల కల్ప నకు అనునిత్యం అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తూ కావాల్సిన నిధుల కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారాన్ని తీసుకుంటూ జిల్లాలోనే నర్సంపేట మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. –పెండెం లక్ష్మీరామానంద్, మున్సిపల్ చైర్పర్సన్ ఆధునిక టెక్నాలజీతో వ్యర్థాల నిర్వహణ రోజుకు 450 టన్నుల శుద్ధీకరణ పట్టణంలో సరికొత్త పారిశుద్ధ్య విప్లవం తరుగుతున్న చెత్త గుట్టలు -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: డీఎంహెచ్ఓ
హన్మకొండ చౌరస్తా: మాతా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే తగిన చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్ఓ రాంకుమార్ హెచ్చరించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ వివరించారు. ప్రసవం కోసం వచ్చిన, ప్రసవించిన మహిళలతో ఆయన మాట్లాడారు. వారికి పీహెచ్సీ స్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారుల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? 102 వాహన సౌకర్యాలు వినియోగించుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేడు వరంగల్ కలెక్టరేట్లో..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల వచ్చే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విద్యారణ్యపురి: పీఆర్సీ ఈనెలాఖరులోపు ప్రకటించకపోతే ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్కుమార్ మాట్లాడుతూ ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవీందర్రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పెండెం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, సీఎస్ఆర్ మల్లిక్, బాధ్యులు పి.చంద్రయ్య, జి.భాస్కర్రావు, బ్రహ్మచారి పాల్గొన్నారు. న్యూశాయంపేట: విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలంగాణ రాష్ట్ర హజ్కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. వరంగల్ ఎల్బీనగర్లోని విజ్డమ్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన దువాయే నిషిష్త్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక విద్య అవసరమని పేర్కొన్నారు. సాంకేతిక విద్య మనిషికి జీవనోపాధిని ఇస్తే.. ఆధ్యాత్మిక విద్య మనిషి ఎలా బతకాలో నేర్పుతుందన్నారు. విజ్డమ్ గ్రూఫ్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఖమర్ అలీబేగ్ అధ్యక్షతన జరిగిన సదసస్సులో డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్ధిఖీ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ మసూద్, సోయబ్బాబా, మౌలనా ఫసియొద్దీన్ ఖాస్మీ, సయ్యద్ సుభానుద్దీన్, మిర్జా జాఫర్ అలీబేగ్, మిర్జా అమీర్అలీ బేగ్, మహ్మద్ సిరాజ్ అహ్మద్, మతపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
హన్మకొండ చౌరస్తా: మాతా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే తగిన చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్ఓ రాంకుమార్ హెచ్చరించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ వివరించారు. ప్రసవం కోసం వచ్చిన, ప్రసవించిన మహిళలతో ఆయన మాట్లాడారు. వారికి పీహెచ్సీ స్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు, వైధ్యాదికారుల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, 102 వాహన సౌకర్యాలను వినియోగించుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. -
త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. డిజిటల్ తరగతులు కూడా కొనసాగుతాయి. అన్ని హైస్కూళ్లలోనూ త్వరలోనే ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నాం. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేస్తున్నందున సోమవారం అర్ధగంట ముందుగానే ఉపాధ్యాయురాలు రావాలని సూచించాం. బడిబాట కొనసాగుతోంది. – ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీఈఓ హనుమకొండ జిల్లాలో ఇలా..ప్రాథమిక పాఠశాలలు యూపీఎస్లు హైస్కూళ్లు హెచ్ఎస్ఎస్ జీరో స్కూళ్లు 272 59 1431036విద్యార్థులు 35,567 -
మలివయస్సులో పిల్లల్లా మారారు!
హన్మకొండ చౌరస్తా: ములుగు జిల్లా కేంద్రంలో 1974–76 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం హనుమకొండలో ఒకే వేదికపై కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత ఒకే చోట చేరిన వారంతా ఆనాడు విద్యార్థిగా గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా ఆనందంగా గడిపారు. ఉద్యోగం, కుటుంబం, కష్టసుఖాలను ఒకరికొకరు పాలుపంచుకున్నారు. భవిష్యత్లో ఇలాంటి సమ్మేళనాలను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. మరణించిన తోటి స్నేహితులు, అధ్యాపకులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భిక్షపతి, మోహన్సింగ్, సారంగపాణి, నిర్వాహకులు వై.కృష్ణారెడ్డి, సుధాకర్, మార్త రమేశ్బాబు, అకినెపల్లి ఓంప్రకాశ్, రాజేశ్వర్రావు, రాజమౌళి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సందడి -
నిధుల గోల్మాల్!
హన్మకొండ అర్బన్: హనుమకొండ రెవెన్యూ కాలనీలోని ప్రకాశ్రెడ్డిపేటలో 2003లో స్థాపించిన పునీత మరియ వికాస పొదుపు పరస్పర సహాయక సహకార సంఘంలో నిధులు గోల్మాల్ జరిగిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. సుమారు 600 మంది సభ్యులు ఉన్న ఈ సంఘంలో కోట్ల రూపాయల సభ్యుల నిధుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘంలోని కొంతమంది కమిటీ మాజీ ప్రతినిధులు తమ కుటుంబ సభ్యుల పేర్లపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. హ్యాండ్లోన్ పేరుతో.. ఒకే కుటుంబానికి చెందిన పలువురి పేర్లపై దాదాపు రూ.30 లక్షల వరకు రుణాలు మంజూరైనట్లు, మరికొందరు ప్రతినిధులు హ్యాండ్లోన్ పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సుమారు రూ.2.50 కోట్ల మేర సభ్యుల నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల వివరాలు అధికారిక లెక్కల్లో పూర్తిగా కనిపించడం లేదని, కొన్ని ఆర్థిక లావాదేవీల కోసం వేర్వేరు రికార్డులు నిర్వహించారనే అనుమానాలను సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే పూర్తిస్థాయి ఆర్థిక వివరాలు ఇప్పటివరకు అందించలేదని సభ్యులు చెబుతున్నారు. సభ్యుల్లో సందేహాలు.. ఇటీవల నిర్వహించిన అత్యవసర సమావేశంలో కొన్ని బకాయిలు వసూలు చేసినట్లు సంఘం ప్రతినిధులు ప్రకటించారు. మొత్తం నిధులు తిరిగి సంఘం ఖాతాల్లో జమయ్యాయా లేదా అన్న విషయంపై సభ్యుల్లో సందేహాలు కొనసాగుతున్నాయి. పూర్తి లెక్కలను సభ్యుల ముందుంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంఘంలోని బాధిత సభ్యుల కథనం ప్రకారం..ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తిన వారిపై వ్యక్తిగత విమర్శలు, ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కొందరికి ‘సంఘం నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఆటోడ్రైవర్లు, వాచ్మెన్లు, చిన్న ఉద్యోగులు, కూలీలు వంటి నిరుపేద వర్గాలకు చెందిన సభ్యులు తమ జీవితకాల పొదుపులను సంఘంలో పెట్టుబడిగా పెట్టామని, ఇప్పుడు వాటి భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెబుతున్నారు. సంఘం ప్రారంభమైనప్పటి నుంచి మంచి పేరుతో నడిచిందని, ఇటీవల వెలుగుచూసిన ఆరోపణలతో సభ్యుల్లో అనిశ్చితి నెలకొందని పేర్కొంటున్నారు. గతంలో అవకతవకలు వాస్తవమే: సతీశ్రెడ్డి అధ్యక్షుడు ఈ ఆరోపణలపై సంఘం ప్రస్తుత అధ్యక్షుడు సింగారెడ్డి సతీశ్రెడ్డిని వివరణ కోరగా.. గతంలో కొంత ఆర్థిక అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని, అయితే వాటిలో అధిక భాగం రికవరీ చేసినట్లు తెలిపారు. వ్యవహారాన్ని కోర్టుల వరకు తీసుకెళ్లకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు. తాను ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని, ఇకపై సంఘం కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అన్ని వ్యవహారాలు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయని, గతంలో తలెత్తిన ఆర్థిక సమస్యలను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అయితే, సభ్యులు మాత్రం పూర్తి ఆడిట్ నివేదిక, రుణాల వివరాలు, రికవరీ అయిన నిధుల లెక్కలు బహిర్గ తం చేయాలని పట్టుబడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే యోచన.. ఈవ్యవహారంపై కలెక్టర్, జిల్లా సహకార అధికారి దృష్టికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సభ్యులు తెలిపారు. సంఘం ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరిపి, అవసరమైతే రికార్డులను స్వాధీనం చేసుకుని వాస్తవాలు వెలుగులోకి తేవాలని వారు కోరుతున్నారు. సహకార సంఘంలో రూ.2.50 కోట్ల అవినీతి అక్రమాలు రుణాలు తీసుకున్నారని కమిటీ మాజీ ప్రతినిధులపై ఆరోపణలు లెక్కలు బహిర్గతం చేయాలని సభ్యుల డిమాండ్ కలెక్టర్, డీసీఓ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న బాధితులు -
ట్యాంకర్ నీరే దిక్కు!
చెన్నారావుపేట: మండలపరిధిలోని అక్కల్చెడ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకై మూడు రోజులైంది. స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారులకు సమస్యను వివరించిన పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి కాలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్ బుజ్జి తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా నీరందించడంతో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్న్యూశాయంపేట: కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల వచ్చే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో.. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అరటి తోటల పరిశీలనదుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన గాలివాన బీభత్సానికి అరటి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈ మేరకు దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేశారు. నష్టపోయిన రైతులను అధైర్య పడవద్దని దైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. చేతికి వచ్చే దశలో పంట ప్రకృతి విలయతాండవానికి దెబ్బతినడం బాధాకరమన్నారు. నష్టం వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, సర్పంచ్ కన్నం అలీమా చిరంజీవి, రైతులు లడె యుగందర్, సురేందర్, వంశీ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తా: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం (ఎస్జీపీఏటీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామమనోహర్ డిమాండ్ చేశారు. వరంగల్ గిర్మాజీపేటలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఎస్జీపీఏటీ కాశిబుగ్గ యూనిట్ సమావేశం ఎండీ మదార్ సాహెబ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. హెల్త్ కార్డులకు సంబంధించి విధివిధానాలు లేకుండా, వైద్యశాలల ఎంపిక జరుగకుండా, పెన్షనర్లకు సమాచారం లేకుండా ప్రీమియం మినహాయించడం శోచనీయమన్నారు. పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రస్తుతం రిటైర్ అవుతున్నవారికి రిటైర్మెంట్ రోజే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సుధీర్బాబు, తుమ్మ వీరయ్య, గునిగంటి సాంబయ్య, నిమ్మకాయల సదానందం, మధుసూదన్ రావు, వీరస్వామి, కుమారస్వామి, భిక్షపతి, ఎన్.సత్యనారాయణ, పెద్దూరి పెద్దన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. -
ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ
జిల్లా విద్యాముఖ చిత్రం ఇలా.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నా.. ఆ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పడిపోతోంది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ప్రతీ ఏడాది కొత్త విద్యార్థులను ఆకర్షిస్తూ తమ బడుల్లో చేరేలా సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతున్నాయి. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల వాటా 2023–24లో 35.5 శాతం ఉండగా, 2025–26 నాటికి అది 34.8 శాతానికి పడిపోయింది. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల వాటా 59 శాతం నుంచి 65 శాతానికి చేరువకావడం జిల్లాలో విద్యార్థుల ఎంపికలు ఎలా మారుతున్నాయో చెబుతోంది. అయితే ఈ ప్రైవేట్ పోటీకి ఽధీటుగా ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్య, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల నమోదు పెరగకపోవడం విద్యాశాఖకు సవాల్గా మారింది. జిల్లాలో ఇప్పటికీ 132 జీరో స్కూల్స్ ఉండటం గమనార్హం. ప్రైవేట్దే హవా... జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 538 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలు కేవలం 253 మాత్రమే ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యలో ప్రైవేట్ విద్యాసంస్థలు దాదాపు రెట్టింపు ఆధిక్యాన్ని కొనసాగించడం గమనార్హం. కారణాలివేనా..? ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ పాఠ్యాంశాలపై పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ తరగతులు, ప్రత్యేక కోచింగ్, పోటీ పరీక్షల సన్నద్ధత, రవాణా సౌకర్యాలు వంటి కారణాలతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకుంటున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదల, పట్టణాలకు వలసలు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ నమోదు వంటి అంశాలు ప్రభుత్వ బడులపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 43,70045,884 43,200 1,20,9321,24,0001,29,190 80,800 76,30677,200 2025–262023–242024–25 మొత్తం విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ -
కళావైభవాన్ని చాటుదాం..
ఖిలా వరంగల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య క ళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని వరంగల్ ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఖిలా వరంగల్ మధ్యకోట ఖుష్మహల్ మైదానంలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ సహకారంతో కాకతీయ కళావైభవం, కాకతీ య బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు నమోదు కోసం కళా కారుల జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచేలా శాసీ్త్రయ నృత్యాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కామిశెట్టి రాజు, ఎండీ సిరాజుద్దీన్ రంజిత్కుమార్, ఎస్కే బాబర్, ప్రొఫెసర్ నరసింహమూర్తి, విజయ్బాబు, పగడాల సరళ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఖిలావరంగల్ మధ్యకోటలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాకతీయుల వైభవంపై నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నృత్య కళాకారులు సామూహికంగా చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి కోటలో ఘనంగా కాకతీయుల నృత్య కళావైభవం -
కళావైభవాన్ని చాటుదాం..
● ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ● కోటలో ఘనంగా కాకతీయుల నృత్య కళావైభవంఖిలా వరంగల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని వరంగల్ ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఖిలా వరంగల్ మధ్యకోట ఖుష్మహల్ మైదానంలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ సహకారంతో కాకతీయ కళావైభవం,కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు నమోదు కో సం కళాకారుల జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచేలా శాసీ్త్రయ నృత్యాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కామిశెట్టి రాజు, ఎండీ సిరాజుద్దీన్ రంజిత్కుమార్, ఎస్కే బాబర్, ప్రొఫెసర్ నరసింహమూర్తి, విజయ్బాబు, పగడాల సరళ, రవికుమార్, కృష్ణారావు, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఖిలావరంగల్ మధ్యకోటలో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాకతీయుల వైభవంపై నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నృత్య కళాకారులు సామూహికంగా చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
బడి.. ఆశల ఒడి
జిల్లాలోని స్కూళ్లకు చేరుకున్న పాఠ్యపుస్తకాలుభీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లోని పాఠశాల భవనం, వ ర్లీ రంగులతో ఆకట్టుకుంటున్న న్యూశాయంపేటలోని పోచంపల్లి ప్రాథమిక పాఠశాలవిద్యారణ్యపురి: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లనున్నారు. క్లాత్ రానందున ప్రస్తుతం యూనిఫామ్ అందించే పరిస్థితి లేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, రాగి జావా, మధ్యాహ్న భోజనం అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 2,56,180 పాఠ్యపుస్తకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలోకంటే ఎక్కువ శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అక్కడక్కడ కొన్ని పాఠశాలల్లో గతంలో మన ఊరు–మన బడి కింద మిగిలిన పనులు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలోని పాఠశాలలకు (పార్ట్ 1) 2,56,180 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణం అంసంపూర్తిగా ఉండగా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.8 లక్షల 90 వేలు కేటాయించడంతో ఆ డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి కావొస్తోంది. జిల్లాలో పీఎం శ్రీస్కూళ్లు 19 ఉండగా అందులో 16 స్కూళ్లలో గత విద్యాసంవత్సరంలో వివిధ వసతుల కల్పనకు కార్యక్రమాల అమలుకు ఒక్కో స్కూల్కు లక్షల్లో నిధులు విడుదలయ్యాయి. 38 పాఠశాలల్లో అదనపు టాయిలెట్స్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. మరో 13 చోట్ల మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలో కిచెన్ షెడ్లు కావాలని ఆరు పాఠశాలల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. క్లాత్ రాకపోవడంతో ప్రస్తుతం విద్యార్థులకు అందని యూనిఫామ్ బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం జిల్లాలో 39 ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. 39 మంది ఇన్స్ట్రక్టర్లను, 39 మంది ఆయాలను నియమించనున్నారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్యలో టాప్గా నిలిచింది. ప్రస్తుతం అక్కడ 571 మంది చదువుతున్నారు. వ్యాపార వేత్త భాస్కర్రావు ఆర్థిక సహకారంతో నాణ్యమైన, డిజిటల్ విద్య అందుతోంది. రవాణా సదుపాయం కోసం బస్సులు కూడా ఆయన ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్, మర్కజీ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. అత్యుత్తమ విద్యాబోధన, పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పెరగడమే ఇందుకు కారణం. అదేవిధంగా జిల్లాలోని ఒంటిమామిడిపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూ ల్లోనూ మౌలిక వసతులు, విద్యాబోధన, ఉత్తీర్ణతా శాతం తదితర కారణాలతో అడ్మిషన్లకు డిమాండ్ ఉంది. సాక్షి, వరంగల్/కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత (నేడు) సోమవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టనున్నారు. తొలి రోజే విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. కాగా, తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈనెల 11వ తేదీ నాటికి 1,759 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకోగా బాలికలు 831 మంది, బాలురు 928 మంది విద్యార్థులు ఉన్నారు. 19 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. -
బడికి వేళాయె..
సాక్షి, వరంగల్/కాళోజీ సెంటర్: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో నేటి (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2026–27 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టనుండగా, తొలి రోజే విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 1,017 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని అధిక శాతం పాఠశాలల్లో రాష్ట్ర సిలబస్ ప్రకారం బోధన కొనసాగుతుండగా, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్ కూడా అమలులో ఉంది. విద్యార్థుల చేరికలే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈనెల 11వ తేదీ నాటికి 1,759 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకోగా బాలికలు 831 మంది, బాలురు 928 మంది విద్యార్థులు ఉన్నారు.●ప్రభుత్వ బడులను ఆదరించాలి ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఆధునిక సాంకేతికత ఆధారిత బోధన, మెరుగైన మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలి. – బి.రంగయ్య నాయుడు, డీఈఓనేటి నుంచి జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం తొలిరోజే పుస్తకాలు, యూనిఫాం పంపిణీ 295 పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం19 వేల మందికి అల్పాహారం ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలులో భాగంగా తొలి రోజు జిల్లాలోని ఏడు మండలాలు వరంగల్, ఖిలా వరంగల్, గీసుగొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, వర్ధన్నపేట పరిధిలో 295 పాఠశాలల్లో సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 19 వేల మంది విద్యార్థులకు హరేకృష్ణ ట్రస్ట్ సహకారంతో అల్పాహారం అందించనున్నారు. -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
హన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు. నాయకులు లింగంపల్లి కిషన్రావు, వద్దిరాజు గణేష్, మర్రి యాదవ రెడ్డి, పులి రజనీకాంత్, నయిముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
హన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా 500 మంది కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు. నాయకులు లింగంపల్లి కిషన్రావు, వద్దిరాజు గణేష్, మర్రి యాదవ రెడ్డి, పులి రజనీకాంత్, నయిముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు -
వనమహోత్సవానికి ఏర్పాట్లు
నెక్కొండ: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వానలు ప్రారంభం కావడంతో నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటేందుకు అధికారులు, గ్రామ పంచాయతీల సిబ్బంది ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నర్సరీల పెంపకం ఇలా.. జిల్లాలోని 327 నర్సరీలు ఏర్పాటు చేసి 25.51 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో మొక్కలు నాటి రెండేళ్లపాటు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో నర్సరీలో 5 వేల నుంచి 8 వేల మొక్కల పెంపకం ఈ ఏడాది జనవరి నుంచే ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉన్నా నర్సరీల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మొక్కలను ఎండదెబ్బ నుంచి కాపాడగలిగారు. ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 5 వేల నుంచి 8 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇంటింటికీ పంపిణీ.. జాన్, జూలైలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాల్వల గట్ల వెంట, గుట్టలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఇంటికి 5 నుంచి 6 మొక్కలు పంపిణీ చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు నిర్ణయించారు. ఈసారి నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కల పెంపకానికి అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతీ మొక్కను సంరక్షిస్తాం..వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలోని 327 నర్సరీల్లో 25.5 లక్షల మొక్కలు పెంచుతున్నాం. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. – నాగపద్మజ, డీఆర్డీఓ వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు ప్రణాళికలు 327 నర్సరీల్లో 25.51 లక్షల మొక్కల పెంపకం -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
రేపటినుంచి స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్
విద్యారణ్యపురి: ఈ విద్యాసంవత్సరం (2026–2027)లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికి తొలిదశలో కొన్నింటిలోనే అమలు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి అర్బన్ ప్రాంతాలైన హనుమకొండ జిల్లాలోని రెండు మండలాలు, వరంగల్ పరిధి ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రీ ఓపెనింగ్రోజు (ఈనెల 15) నుంచి అమలుచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక్కడి ఫలితాలను బట్టి దశలవారీగా మిగతా పాఠశాలల్లో అమలు చేస్తారని భావిస్తున్నారు. ప్రార్థన సమయంకంటే ముందుగానే.. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈనెల 15నుంచి ప్రార్థన సమయం కంటే ముందుగానే అంటే ఉదయం 8–30గంటలకే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ప్రభుత్వం అప్పగించిన సొసైటీ సిబ్బంది ఆ సమయం కంటే ముందుగానే పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. అందుకు ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. బ్రేక్ఫాస్ట్ విద్యార్థులకు అందించేలా చూసేందుకు ఒక టీచర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, మధ్యాహ్నభోజన పథకం అమలు ఇన్చార్జ్ రమణకుమార్ ఆయా డీఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు.. పాఠశాలల పునఃప్రారంభం రోజున ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకం అమలు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నవీన్ నికోలస్ ఆదేశించారు. హనుమకొండ, కాజీపేట మండలాల్లోని రెండు స్కూళ్ల చొప్పున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జూమ్ మీటింగ్లో డీఈఓలు ఎల్వీ గిరిరాజ్ గౌడ్, రంగయ్యనాయుడు ఎంఈఓలు నెహ్రూ, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్, పాల్గొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి హనుమకొండ, కాజీపేట మండలాల్లోని 86 పాఠశాలల్లో ఈనెల 15నుంచి అమలుచేయనున్న బ్రేక్ఫాస్ట్ను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరై దీనిని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంతోపాటు ఆలస్య హాజరు సమస్య కూడా తీరుతుంది. – ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీఈఓ, హనుమకొండమొదట అమలుచేసే పాఠశాలలు..జిల్లా పాఠశాలలు విద్యార్థులు హనుమకొండ 86 9,490 వరంగల్ 300 20,995 మొదట అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే.. హనుమకొండ జిల్లాలోని 2, వరంగల్లోని 7 మండలాల్లోనే.. దశలవారీగా మిగతా పాఠశాలల్లో అమలుకు చర్యలు డీఈఓ, ఎంఈఓలు పర్యవేక్షించాలి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు హనుమకొండ జిల్లాలో.. జిల్లాలో 14 మండలాలు ఉండగా, హనుమకొండ మండలంలోని 49 (పీఎస్, యూపీఎస్, హైస్కూల్స్) పాఠశాలల్లో ప్రీప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం 5,648మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అమలుచేయనున్నారు. కాజీపేట మండలంలోని 37 పాఠశాలల్లో 3,842మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మూడు జూనియర్ కళాశాల(హనుమకొండ కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల)ల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రస్తుతం 3,786మంది విద్యార్థులుండగా, అడ్మిషన్ల సంఖ్య పెరిగితే వారికి కూడా బ్రేక్ఫాస్ట్ అందజేస్తారు.వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో 13 మండలాలు ఉండగా మొదటగా ఏడు (వరంగల్, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్, వర్ధన్నపేట, నల్లబెల్లి, దుగ్గొండి) మండలాల్లోని 300 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు. వీటిలో 20,995 మంది విద్యార్థులు ఉన్నారు. రోజువారీ మెనూ ఇలా..సోమవారం: దోశలు (2), చట్నీ సాంబారు మంగళవారం: మిల్లెట్ ఇడ్లి (2), సాంబారు బుధవారం: పూరి (2), మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా గురువారం: బోండా (2), చట్నీ/సాంబారు శుక్రవారం: రెండు ఇడ్లీ, చట్నీ/సాంబారు శనివారం: ఉప్మా, చట్నీ/సాంబారు సోమ, బుధ, శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్ట్,పాలు మంగళ, గురు, శనివారం రాగిజావ -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
మోదీ పాలన స్వర్ణయుగం
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోశ్రెడ్డి నయీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు వేద బ్యాంక్వెట్ హాల్లో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గాంధే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఎదిగే దిశగా పయనిస్తోందని తెలిపారు. మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఓటమి తెలియని నాయకుడని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకుకోకుండా దేశసేవలో నిమగ్నమై ఉన్నారని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, పులి సరోత్తంరెడ్డి, కందగట్ల సత్యనారాయణ, సండ్ర మధు, నర్మెట్ట శ్రీనివాస్, సంపత్రెడ్డి పాల్గొన్నారు. కమలాపూర్: రైతులంతా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర సూచించారు. మండలంలోని మర్రిపల్లిగూడెం, మాదన్నపేట గ్రామాల్లో నమోదు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు విత్తనాలు వేయకుండా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ సాగు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమాల్లో ఏఓ బి.వేణు, ఏఈఓలు జయప్రకాశ్, ప్రతాప్, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
ముందుకు సాగని హెచ్పీవీ వ్యాక్సినేషన్..!
● ఉమ్మడి వరంగల్లో సగటు కవరేజ్ 30 శాతం మాత్రమే సాక్షి, వరంగల్: బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నెల 5వ తేదీ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 31,304 మంది బాలికలను హెడ్కౌంట్ సర్వేలో గుర్తించారు. వీరిలో 9,376 మందికి మాత్రమే హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. దీంతో సగటు కవరేజ్ 30 శాతం వద్దే నిలిచింది. కవరేజ్1,2547528,034 2,9095,517 1,7293,127 1,1215,674 1,6112,2656,687భూపాలపల్లిజనగామములుగువరంగల్మహబూబాబాద్హనుమకొండహెడ్కౌంట్ సర్వే వ్యాక్సిన్ పొందినవారుజిల్లాల వారీగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా...36%29%28%31%33% -
వరంగల్
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026చిట్ఫండ్స్ బాధితుల వెతలు చిట్ఫండ్ కంపెనీల్లో తమ సొమ్మును పొదుపు చేసుకున్న బాధితులకు సకాలంలో ఎఫ్డీలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. హన్మకొండ అర్బన్: భూగర్భ జల శాఖలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఠాకూర్ ధరమ్సింగ్ స్వచ్ఛంద రక్తదానంలో విశేష గుర్తింపు పొందారు. 1988లో మామునూరులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో తొలిసారి రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సార్లు రక్తం ఇచ్చారు. 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా 2024లో జాతీయ అవార్డు, 53వ సారి రక్తదానం చేసిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో ‘హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
గాలివాన బీభత్సం
● లక్ష్మీపురంలో నేలవాలిన అరటితోటలు ● రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాలు దుగ్గొండి: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. దుగ్గొండి, నాచినపల్లి, తొగర్రాయి గ్రామాల్లో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల సర్పంచ్లు డోజర్ల సాయంతో చెట్లు తొలగించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన లడె సాంబయ్య, లడె యుగేంధర్, సురేందర్, మోర్తాల వంశీ సాగుచేసిన 16 ఎకరాల అరటి తోటల్లో గెలలు రాలిపోయాయి. ఒక్కో రైతుకు రూ.3 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. దెబ్బతిన్న అరటి పంటలను నర్సంపేట డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి శనివారం పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పి, నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తొగర్రాయి గ్రామానికి చెందిన బుసాని నరేశ్ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, సామగ్రి ధ్వంసమయ్యాయి. గాలివాన సమయంలో నరేశ్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. రాయపర్తి మండలంలో.. రాయపర్తి: మండలంలోని గ్రామాల్లో శుక్రవారం రాత్రి, శనివారం కురిసిన గాలివానకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు కూలి వాహదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇళ్లు కూలి పోరున బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెట్టెకుంటతండా, కాట్రపల్లి గ్రామాల సర్పంచ్లు ఇస్లావత్ సంతోష్నాయక్, రాపాక పద్మ కోరారు. -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. హన్మకొండ అర్బన్: భూగర్భ జల శాఖలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఠాకూర్ ధరమ్సింగ్ స్వచ్ఛంద రక్తదానంలో విశేష గుర్తింపు పొందారు. 1988లో మామునూరులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో తొలిసారి రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సార్లు రక్తం ఇచ్చారు. 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా 2024లో జాతీయ అవార్డు, 53వ సారి రక్తదానం చేసిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో ‘హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. -
ఘనంగా శివకల్యాణం, శని పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శనివారం త్రయోదశిని పురస్కరించుకుని శివకల్యాణం, శనీశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, మూల గణపతికి ఆరాధన, రుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం శని త్రయోదశిని పురస్కరించుకుని శనీశ్వర ఉత్సవ మూర్తిని నువ్వులనూనెతో సామూహిక తైలాభిషేకం నిర్వహిస్తూ భక్తులకు గ్రహదోష, కాలసర్పదోష నివారణ జరగాలని, భక్తుల గోత్రనామాదులతో నవగ్రహపూజలు, తిలతర్పణాలు, వస్త్రాదానాలు చేశారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో ఈనెల 17న నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని భద్రకాళి ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు, ఈమేరకు జూన్ 15న సోమవారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ 17న బుధవారం ఉదయం 8.36 గంటలకు కర్కాటక లగ్నంలో జరిగే ప్రతిష్ఠాపనోత్సవంలో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీశ్రీవిద్యాశంకర భారతీస్వామి పాల్గొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ధ్వజప్రతిష్ఠ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఖానాపురంలో చోరీ ఖానాపురం: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన తూడి సత్తయ్య ఇంట్లో కుడికాల వెంకటలక్ష్మి అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మి శుక్రవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లింది. అంతకు ముందే సత్తయ్య కుటుంబ సభ్యులు సైతం బంధువుల ఇళ్లకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సత్తయ్య ఇంట్లో చోరీకి యత్నించగా ఎలాంటి నగదు, ఆభరణాలు లభించలేదు. పక్కనే కిరాయికి ఉండే వెంకటలక్ష్మి ఇంట్లో పావుతులం బంగారం, 10 తులాల వెండి, రూ.5వేల నగదు అపహరించుకెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న చలిగంటి కుమారస్వామి ఇంట్లో సైతం చోరీకి యత్నించగా ఎలాంటి సొత్తు లభించకపోడంతో వెనుదిరిగారు. ఎస్సై రామ్మోహన్ వివరాలు సేకరించారు. దుగ్గొండి సీఐ సాయిరమణ, ఫింగర్ప్రింట్స్ విభాగం సీఐ రాజ్కుమార్, కానిస్టేబుళ్లు అనిల్, రమేశ్, సీసీఎస్ ఎస్సై తిరుపతి, హెచ్సీ మున్నా వేలిముద్రలు సేకరించారు. -
రేపటినుంచి స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్
విద్యారణ్యపురి: ఈ విద్యాసంవత్సరం (2026–27)లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికీ తొలిదశలో కొన్నింటిలోనే అమలు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి అర్బన్ ప్రాంతాలైన హనుమకొండ జిల్లాలోని రెండు మండలాలు, వరంగల్ పరిధి ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రీ ఓపెనింగ్రోజు (ఈనెల 15) నుంచి అమలుచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక్కడి ఫలితాలను బట్టి దశలవారీగా మిగతా పాఠశాలల్లో అమలు చేస్తారని భావిస్తున్నారు. ప్రార్థన సమయంకంటే ముందుగానే.. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈనెల 15నుంచి ప్రార్థన సమయం కంటే ముందుగానే అంటే ఉదయం 8:30 గంటలకే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ప్రభుత్వం అప్పగించిన సొసైటీ సిబ్బంది ఆ సమయం కంటే ముందుగానే పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. అందుకు ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ విద్యార్థులకు అందించేలా చూసేందుకు ఒక టీచర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, మధ్యాహ్నభోజనం పథకం అమలు ఇన్చార్జ్ రమణకుమార్ ఆయా డీఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్నుంచి శనివారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఈ బ్రేక్ఫాస్ట్ అమలుపై పలు సూచనలు చేశారు. బ్రేక్ఫాస్ట్ను పాఠశాలల్లోని కుక్కమ్ హెల్పర్లతో వడ్డించాలని సూచించారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు.. పాఠశాలల పునఃప్రారంభం రోజున ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకం అమలు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నవీన్ నికోలస్ ఆదేశించారు. హనుమకొండ, కాజీపేట మండలాల్లోని రెండు స్కూళ్ల చొప్పున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జూమ్ మీటింగ్లో డీఈఓలు ఎల్వీ గిరిరాజ్ గౌడ్, రంగయ్యనాయుడు ఎంఈఓలు నెహ్రూ, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలి.. హనుమకొండ, కాజీపేట మండలాల్లోని 86 పాఠశాలల్లో ఈనెల 15 నుంచి అమలు చేయనున్న బ్రేక్ఫా స్ట్ను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశాం. దీనివల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంతో పాటు ఆలస్య హాజరు సమస్య కూడా తీరుతుంది. – ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీఈఓ, హనుమకొండమొదట అమలుచేసే పాఠశాలలు..జిల్లా పాఠశాలలు విద్యార్థులు హనుమకొండ 86 9,490 వరంగల్ 300 20,995 ఇడ్లీ, చట్నీ బాగుంది..మొదట అర్బన్ పరిధి ప్రభుత్వ పాఠశాలల్లో.. హనుమకొండ జిల్లాలోని 2, వరంగల్లోని 7 మండలాల్లో అమలు దశలవారీగా మిగతా పాఠశాలల్లో అందించేందుకు చర్యలు డీఈఓ, ఎంఈఓలు పర్యవేక్షించాలి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో 13మండలాలు ఉండగా మొదటగా ఏడు (వరంగల్, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్, వర్ధన్నపేట, నల్లబెల్లి, దుగ్గొండి) మండలాల్లోని 300 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు. వీటిలో 20,995 మంది విద్యార్థులు ఉన్నారు. హనుమకొండ జిల్లాలో.. జిల్లాలో 14మండలాలు ఉండగా, హనుమకొండ మండలంలోని 49 (పీఎస్, యూపీఎస్, హైస్కూల్స్) పాఠశాలల్లో ప్రస్తుతం 5,648మందికి బ్రేక్ఫాస్ట్ అమలుచేయనున్నారు. కాజీపేట మండలంలోని 37 పాఠశాలల్లో 3,842 మంది విద్యార్థులున్నారు. పాఠశాల ప్రారంభం తరువాత అడ్మిషన్ల సంఖ్యపెరిగితే వారికి కూడా అందజేస్తారు. అదేవిధంగా జిల్లాలోని మూడు జూనియర్ కళాశాల(హనుమకొండ కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వడ్డెపల్లి పింగిళి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల)ల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రస్తుతం 3,786మంది విద్యార్థులుండగా, అడ్మిషన్ల సంఖ్య పెరిగితే వారికి కూడా అందజేస్తారు.రోజువారీ మెనూ ఇలా..సోమవారం: దోశలు (2), చట్నీ సాంబారు మంగళవారం: మిల్లెట్ ఇడ్లి (2), సాంబారు బుధవారం: పూరి (2), మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా గురువారం: బోండా (2), చట్నీ/సాంబారు శుక్రవారం: రెండు ఇడ్లీ, చట్నీ/సాంబారు శనివారం: ఉప్మా, చట్నీ/సాంబారు సోమ, బుధ, శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్ట్,పాలు మంగళ, గురు, శనివారం రాగిజావ -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
ముందుకు సాగని హెచ్పీవీ వ్యాక్సినేషన్!
ఉమ్మడి వరంగల్లో సగటు కవరేజ్ 30 శాతం మాత్రమేసాక్షి, వరంగల్ : బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నెల 5వ తేదీ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 31,304 మంది బాలికలను హెడ్కౌంట్ సర్వేలో గుర్తించారు. వీరిలో 9,376 మందికి మాత్రమే హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. దీంతో సగటు కవరేజ్ 30 శాతం వద్దే నిలిచింది. అందుకే ఆలస్యం.. ● చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల భవిష్యత్లో ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయి. ● వ్యాక్సిన్ బాలికలకు ఇవ్వాల్సి ఉండడంతో తల్లిదండ్రుల సమ్మతి అవసరం అవుతోంది. అనుమతి పత్రాలు ఆలస్యంగా రావడం వల్ల సెషన్లు పూర్తి స్థాయిలో సాగడం లేదు. ● ములుగు, భూపాలపల్లి జిల్లాలోని అటవీ, గిరిజన మండలాల్లో విద్యార్థులను ఒకేచోట సమీకరించడం కష్టంగా మారుతోంది. రవాణా సమస్యలూ ప్రభావం చూపుతున్నాయి. ● పాఠశాలల కార్యకలాపాలు, సెలవులు, విద్యార్థుల గైర్హాజరుతో టీకా సెషన్లు వాయిదా పడుతున్నాయి. ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలతో పాటు హెచ్పీవీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి రావడంతో ఫీల్డ్ స్థాయిలో వేగం తగ్గుతోంది. ● హనుమకొండ వంటి పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న కుటుంబాల్లో కూడా ‘ఇప్పుడే అవసరం లేదు‘ అనే భావన కనిపించడం కవరేజ్పై ప్రభావం చూపుతోంది. ఇలా చేస్తేనే వేగం పెరుగుతుంది.. ● గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ● మహిళా వైద్యులు, గైనకాలజిస్టులు, ఆశా కార్యకర్తల ద్వారా తల్లిదండ్రులకు వ్యాక్సిన్ భద్రతపై వివరించాలి. ● పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలి. టీకా తీసుకోని బాలికల జాబితా తయారు చేసి ఇంటింటి ప్రచారం చేపట్టాలి. ● గిరిజన, దూర ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు ఏర్పాటు చేయాలి. ● కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు మండలాల వారీగా రోజువారీ సమీక్షలు నిర్వహిస్తే కవరేజ్ పెరిగే అవకాశం ఉంది.జిల్లాల వారీగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా...కవరేజ్1,2547528,034 2,9093,127 1,1215,517 1,7295,674 1,6112,2656,687భూపాలపల్లిజనగామములుగువరంగల్హనుమకొండమహబూబాబాద్హెడ్కౌంట్ సర్వే వ్యాక్సిన్ పొందినవారు29%28%31%33%36% -
బాలికల విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
సంగెం: బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేజీబీవీల ద్వారా గ్రామీణ బాలికలకు నాణ్యమైన విద్య అందిస్తోందని తెలిపారు. సంగెం కేజీబీవీలో జిల్లాలోని 10 కేజీబీవీల సక్సెజ్ మీట్, ఇంటర్మీడియట్ అడ్మిషన్ మేళా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీల్లో విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వైద్యసదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. 10 కేజీబీవీలకు చెందిన 215 మంది విద్యార్థినులు, తల్లిదండ్రులు హాజరుకాగా.. వారిలో 71 మంది విద్యార్థినులు ఇంటర్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్లో జిల్లా మొదటి స్థానం పొందిన సంగెం కేజీబీవీ విద్యార్థిని లావుడ్య దివ్య, పదో తరగతి జిల్లా టాపర్ సలేంద్ర సహర్షిణిని ఘనంగా సన్మానించారు. కేజీబీవీల్లో మౌలిక వసతులకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. జీసీడీఓ ఫ్లోరెన్స్, కేజీబీవీల ప్రత్యేకాధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు -
‘సిరాజ్’ రాక చిన్నబోయారు!
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ కార్యక్రమం స్థానిక క్రికెట్ అభిమానుల్లో నిరాశ మిగిల్చింది. ఇంటర్నేషనల్ బౌలర్, హైదరాబాదీ యువ క్రికెటర్, వరంగల్ వారియర్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ సిరాజుద్దీన్ వస్తున్నాడన్న సమాచారంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన అభిమానులు తీరా ఆయన రాకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు. సుమారు మూడు గంటల నిరీక్షణ తర్వాత ఆన్లైన్ స్క్రీన్లో మహ్మద్ సిరాజ్ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదన్నారు. బీసీసీఐ ఆమోదంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా టీజీ–20 నిర్వహించడం క్రీడాకారులకు చక్కటి అవకాశమని అన్నారు. కాగా, నెట్వర్క్ సమస్యతో కేవలం నాలుగు నిమిషాలపాటు అదీ అస్పష్టంగా మాట్లాడడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. నెల వేతనం అందజేస్తా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ వేదికకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఫ్రాంచైజ్ యాజ మాన్యంతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీ–20 టోర్నమెంట్లో విజేతలుగా నిలిచివస్తే తన నెల జీతం అందిస్తానని ప్రకటించారు. సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శాశ్వత క్రికెట్ కోచింగ్ క్యాంపు ఏర్పాటుకు కలెక్టర్తో మాట్లాడి అనుమతి ఇప్పిస్తానని అన్నారు. ఈ వేదికపై నగర క్రీడా ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఒక రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ వారియర్స్ సహ–యజమానులు వరుణ్ జూపల్లి, ఫణి చిట్నేని, ధీరజ్ ఇందురు, కాంగ్రెస్ యువ నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరగా ఆన్లైన్ స్క్రీన్పై సిరాజ్ పలకరింపు మూడు గంటలు నిరీక్షించిన అభిమానులు నిరుత్సాహంగా ‘మీట్ యువర్ వరంగల్ వారియర్స్’ -
ఖాతాలో డబ్బులు జమచేయాలి..
నాలుగున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ప్రైవేట్కు పోను మిగిలిన 88 క్వింటాళ్ల మొక్కజొన్నలను నెలరోజుల క్రితం రాయపర్తి మండల కేంద్రంలోని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు ఆ డబ్బులు ఎంతో అవసరం. అవి వస్తే పంటల సాగు నాకు సులభం అవుతుంది. లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలి. –రాహుల్ యువరైతు, బంధనపల్లి, రాయపర్తి మండలం -
చెరువు మట్టిలో సమృద్ధిగా పోషకాలు
● నర్సంపేట ఐబీ ఈఈ పి.సుదర్శన్రావు నెక్కొండ: చెరువు మట్టిలో సాగు భూములకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నర్సంపేట ఐబీ ఈఈ పి.సుదర్శన్రావు అన్నారు. సాయిరెడ్డిపల్లి ఊర చెరువులో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పూడికతీత పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సుదర్శన్రావు మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలో దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని రైతుల పంట పొలాలకు తరలించినట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు మరింత సారవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. చెరువు మట్టిలో మొక్కలకు కావాల్సిన నత్రజని, పొటాష్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని, నత్రజని మొక్క పెరుగుదలకు ఉపయోగపడగా.. పొటాష్ తెగుళ్లను తట్టుకునే శక్తినిస్తుందని ఆయన వివరించారు. చెలక భూములకు చెరువు మట్టి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పంట దిగుబడి, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఆయన వెంట డీఈ ఎస్.సంతోష్కుమార్, ఉపాధి హామీ కూలీలు, రైతులు తదితరులు ఉన్నారు. -
బకాయిలు చెల్లించాలి..
ప్రస్తుతం జిల్లాలో వానాకాలం సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాల్సి ఉండటంతో పాటు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చులు భరించాల్సి వస్తోంది. గత పంట విక్రయాల ద్వారా రావాల్సిన డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉంది. వెంటనే బకాయిలు చెల్లిస్తే టెన్షన్ లేకుండా రైతులు సాగు చేసుకునే అవకాశముంది. –సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ -
మత్తుబిళ్ల.. ఒళ్లుగుల్ల!
హనుమకొండ జిల్లా శాయంపేటలో ఫిబ్రవరి 21న రాచర్ల ప్రభాకర్ నిర్వహిస్తున్న క్లినిక్పై దాడి చేసిన డీసీఏ అధికారులు.. 30 రకాల మందులు, ఫిజీషియన్ శాంపిల్స్, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, మత్తు అలవాటు చేసే ట్రామడాల్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ మండలం ఇందిరానగర్లో ‘ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‘ పేరుతో నడుస్తున్న ఓ క్లినిక్పై ఈ నెల 4న హైదరాబాద్ డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి.. 41 రకాల మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వరంగల్ చార్బౌలిలో జిమ్లకు మత్తు ఇంజక్షన్ల సరఫరా చేస్తున్న సెంటర్పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 38 టెర్మిన్ (మెఫెంటర్మైన్ సల్ఫేట్) ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎంఏ సోహైబ్ అనే వ్యక్తి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : డ్రగ్స్పై పోలీసులు, నార్కొటిక్స్ విభాగం ఉక్కుపాదం మోపుతున్న వేళ.. ఇప్పుడు మత్తు కోసం వినియోగించే ఔషధాల అక్రమ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యుల చీటీతో మాత్రమే విక్రయించాల్సిన కొన్ని మందులు విచ్చలవిడిగా అమ్ముడవుతుండగా, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా ముఠాలు పనిచేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారుల దాడుల్లో వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డీసీఏ అధికారులు చేపట్టిన వరుస దాడుల్లో మత్తు కోసం వినియోగించే ఔషధాలు, ఇంజక్షన్లు, నిద్ర మాత్రలు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులు, ఫస్ట్ఎయిడ్ కేంద్రాలు, అనధికార నిల్వ కేంద్రాల గుట్టు రట్టయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వైద్య అర్హతలు లేకుండానే ఫస్ట్ఎయిడ్ కేంద్రాల పేరుతో చికిత్సలు అందిస్తూ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని చోట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు ప్రభావం కలిగించే ఔషధాలను విక్రయిస్తున్నట్లు అధికారులు తేల్చారు. యువతే లక్ష్యం.. నిఘా అవసరం.. కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, వ్యసనాలకు అలవాటు పడిన వారే ప్రధానంగా ఈ ముఠాల లక్ష్యంగా మారుతున్నారు. యువతను వేటాడుతున్న ఔషధ మాఫియా నగరం నుంచి గ్రామీణ క్లినిక్ల దాకా దందా డ్రగ్స్కు బదులు.. డేంజర్ ట్యాబ్లెట్లు అడ్డూఅదుపులేని అక్రమ ఔషధాల వ్యాపారం ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు డీసీఏ దాడులతో బండారం బట్టబయలు -
పెట్టుబడికి పైసల్లేవ్!
● విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు రైతులు అప్పు చేయాల్సిందే.. ● ఇంకా పెండింగ్లోనే ధాన్యం, మొక్కజొన్నల డబ్బులు ● రూ.703 కోట్లకు రూ.461 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం ● మిగిలిన రూ.242 కోట్లు చెల్లించాలని రైతుల విజ్ఞప్తిసాక్షి, వరంగల్: వానాకాలం సాగు పనులు జోరందుకుంటున్న వేళ జిల్లాలో రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. యాసంగి సీజన్లో విక్రయించిన ధాన్యం, మొక్కజొన్న పంటలకు సంబంధించి రైతులకు ఇంకా రూ.242 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్కు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాల్సి ఉండడంతో పాటు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చుల కోసం రైతులు ప్రభుత్వ బకాయిల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.42 కోట్ల ధాన్యం డబ్బులు, రూ.200 కోట్ల మొక్కజొన్నల డబ్బులు తమ ఖాతాల్లోకి వస్తే పెట్టుబడి ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. పంట విక్రయాల డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేట్ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభ దశలోనే బకాయిలు చెల్లిస్తే రైతులు అప్పుల ఊబిలో పడకుండా వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది 2,75,500 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం త్వరగా ధాన్యం, మొక్కజొన్నల డబ్బులు ఖాతాల్లో జమచేయాలని రైతులు కోరుతున్నారు. దశలవారీగా డబ్బులు చెల్లిస్తున్నాం..మొక్కజొన్నలను క్వింటాలుకు మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేశాం. ఇప్పటికే 16 కేంద్రాల నుంచి 1,27,312.7 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మొత్తంగా రూ.305 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా మే 27 నుంచి ఇప్పటివరకు రూ.105 కోట్లు చెల్లించాం. మిగిలినవి దశల వారీగా చెల్లిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగుతాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. – చంద్రశేఖర్గౌడ్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్● -
పొడి దుక్కిలో విత్తనాలు వేయొద్దు..
ప్రశ్న: పత్తి గింజలు ఎండలో పెడితే కరిగిపోయాయి. ఇప్పుడు ఏ పత్తి గింజలు నాటాలి? – మాదాసి వెంకటేశ్, వెంకటాపూర్జవాబు: గింజలు వేడికి కరిగిపోతాయి. మార్కెట్లో ఉన్న అన్ని రకాలు మంచివే. షాపు వారు చెప్పినవే కాకుండా మీకు అనుభవమున్న ప్రకారం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. సమృద్ధిగా వర్షాలు పడ్డాకే వేయాలి వరిలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాల సాగు మేలు పచ్చిరొట్ట ఎరువుకు పెసరు బాగు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారులు విజయ్చంద్ర, ఆదిరెడ్డి, శాస్త్రవేత్త నర్సయ్య హన్మకొండ: సమృద్ధిగా వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని, పొడి దుక్కిలో విత్తితే రైతులు నష్టపోతారని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్ చంద్ర, సహాయ సంచాలకుడు ఆదిరెడ్డి, డాట్ సెంటర్ వ్యవసాయ శాస్త్రవేత్త నర్సయ్య అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో వ్యవసాయాధికారి’ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు ఫోన్ ద్వారా సాగు, విత్తనాలు, ఎరువుల సమస్యలు తెలిపారు. వారికి అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. సాగు ఆలస్యమవుతున్నందున వరిలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు సాగు చేయడం మంచిందని, పచ్చిరొట్ట ఎరువు సాగులో పెసర విత్తి పంట తీసుకోవచ్చని ఇది రైతుకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలు, అధికారుల సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇలా.. ప్రశ్న: నాకు మూడెకరాల భూమి ఉంది. ఏ వంగడాలు ఎంచుకోవాలి. – మేక చిరంజీవి, వెంకటాపూర్, ఐనవోలుజవాబు: మార్కెట్లో లభించే మంచి రకాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధానంగా 8 రకాలకు మాత్రం రేటు పడిపోదు. నూక తక్కువగా వస్తుంది. వరిలో ఆర్ఎన్ఆర్ 15048, కూనారం 1638, జగిత్యాల 2443, వరంగల్ 961, వరంగల్ 915, బీపీటీ, జై శ్రీరాం. హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, వరంగల్ సిద్ది వంటి రకాలున్నాయి. ఈ రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీర్ఘకాలిక రకాలు 150 నుంచి 160 రోజులు, మధ్యకాలిక రకాలు 130–140, స్వల్పకాలిక రకాలు 125 రోజుల్లో వస్తాయి. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్లో విత్తనాలు కొనొద్దు. పత్తి ఇప్పుడే సాగు చేయొద్దు. వేడిలో పెడితే విత్తనాలు పాడవుతాయి, ఎలుకలు వంటి జీవరాశులు తింటాయి. 100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాతే విత్తాలి. ప్రశ్న: పసుపు సాగు చేయాలి. సూచనలివ్వండి. అంతర్ పంటలు వేసుకోవచ్చా? – అనూష, దామెరజవాబు: ప్రస్తుతం విత్తొద్దు. ఎండలు కొడుతుండడంతో భూమి లో వేడి అధికంగా ఉంది. బాగా వర్షాలు కురిసి నేలలో కావాల్సిన తేమ ఉన్నప్పుడే విత్తాలి. భూమిలో పశువుల, మేకల ఎరువు వేసి కలియదున్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపులో అనేక రకాల తెగుళ్లు వస్తాయి. దుంపకుళ్ల తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ట్రైకోవిర్మిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతర పంటగా మొక్కజొన్న, పెసర వంటివి సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: జీలుగ ఎప్పుడు వేసుకోవాలి? – బి.సదయ్య, చెర్లపల్లిజవాబు: వరి నాటుకు వెళ్లే 45 రోజుల ముందు వేసుకోవాలి. జీలుగ పూతకు వచ్చిన తర్వాత సూపర్ ఫాస్పేట్ వేసి పొలంలో కలియదున్నాలి. తర్వాత వరి నాటు వేసుకోవాలి. నారు పోసుకోవడానికి సమయం ఉంది. వెంటనే జీలుగా సాగు చేయండి. ప్రశ్న: మిరప సాగు చేస్తున్నాం. వేరుకుళ్ల తెగుళ్లు బాగున్నాయి.. – నారాయణరావు, నడికూడజవాబు: మిరప సాగు చేసిన భూమిలో రొట్ట మీద బూజు వచ్చినట్లు నేలలోపల బూజు వస్తుంది. ఒకసారి మిరప సాగు చేశామంటే పంట మార్పిడి చేయాలి. మొక్కజొన్న, పెసర వంటి పంటలు వేస్తే నేలలోని విషపూరిత బూజు పోతుంది. ట్రైకోడర్మివిరిడిని ఏదేని ఎరువులు కలుపుకుని, కొంచెం బెల్లం పాకం కలిపి తడి బాగా ఉన్న సమయంలో భూమిలో వేసి కలియదున్నాలి. అప్పుడే భూమిలో వేరుకుళ్లు అవశేషాలు పూర్తిగా నశిస్తాయి. ప్రశ్న: రెండున్నర ఎకరాలు బీర తోట పెట్టా. పూతకు వస్తుంది. ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి? ఏం చేయాలి? – మనోహర్, తిరుమలగిరి, ఆత్మకూరు మండలంజవాబు: ఉద్యాన అధికారిని సంప్రదించండి. వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరిని సంప్రదించండి. జాగ్రత్త కోసం సూడోమనోస్ నం నీటిలో కలిపి పిచికారీ చేస్తే తోటను కాపాడుకోవచ్చు. ప్రశ్న: ఎరువుల ధరలు ఎంతమేర పెరిగాయి? – రాజు, శాలపల్లి, సుధాకర్ పీచర, వేలేరు జవాబు: డీఏపీ, యూరియా ధరలు పెరగలేదు. కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే పెరిగాయి. ఎరువుల బస్తాలపై ఎమ్మార్పీ ముద్రించి ఉంటుంది. ఈ ధరకు కొనుగోలు చేయాలి. డీలర్లకు కూడా ఎమ్మార్పీకే అమ్మాలని ఆదేశాలిచ్చాం. ప్రశ్న: పెసర్లు వేస్తే బాగుంటుందా. జీలుగ వేస్తే బాగుంటుందా? – మేకల కేదారి యాదవ్, సోమిడి జవాబు: పెసరు వేసుకుంటే వానలు పడకముందే పంట సేకరించడం ద్వారా ఆదాయం వస్తుంది. జీలుగ వేస్తే కేవలం పచ్చిరొట్టగానే పని చేస్తుంది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రశ్న: వరిలో 1282 రకం సన్నాలు సాగు చేయవచ్చా. బోనస్ వస్తుందా? – కుమార్, కమలాపూర్జవాబు: వరిలో 1282 బదులు కూనారం 1638 బాగుంటుంది. ఇది మధ్యకాలిక రకం 130 రోజులకు కోతకు వస్తుంది. బోనస్ వస్తుంది. ప్రశ్న: పత్తి గింజలు నాసి రకం వస్తున్నాయి. రైతు ఎలా బాగుపడుతాడు? – రేగుల రవీందర్, అక్కంపేట, ఆత్మకూరుజవాబు: ఎండకు పొడి దుక్కిలో విత్తొద్దు. విత్తనాలపై అనుమానం వస్తే వాపస్ ఇవ్వొచ్చు. కంపెనీని బట్టి విత్తనాలు సన్నగా, దొడ్డుగా ఉంటాయి. వ్యవసాయాధికారులు శాంపిళ్లు తీస్తున్నారు. పరీక్షలో నకిలీవని తేలితే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: పత్తి గింజలు విత్తి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు తడి ఇవ్వొచ్చా? నకిలీవి ఎలా గుర్తుపట్టాలి? – గుండెకారి నాగేశ్వర్రావు, దామెరజవాబు: సాగునీటి వసతి ఉంటే వెంటనే తడి ఇవ్వండి. విత్తనం మొలకెత్తేలా చూడండి. లేకపోతే చీమలు తినడం వట్టిపోవడం జరుగుతుంది. నాలుగైదు రోజుల్లో తేలికపాటి వర్షం పడితే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. పత్తి విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద కొనుగోలు చేస్తే వారు బిల్లు ఇస్తారు. దీనిపై అన్ని వివరాలుంటాయి. తేడా వస్తే కంపెనీ వారిచే మాట్లాడొచ్చు. ప్రశ్న: పెసర్లు ఎలా విత్తాలి? ఏ రకాలు మేలైనవి? – జయపాల్ రెడ్డి, ఆత్మకూరుజవాబు: సాగునీటి వసతి ఉంటే దుక్కి తడిసిన తర్వాతనైనా, వర్షం సమృద్ధిగా కురిసిన తర్వాత విత్తనాలు భూమిలో చల్లి దున్నాలి. పొడి దుక్కిలో వేయొద్దు. ఎంజీజీ 285, ఎంజీజీ 295 రకాలు బాగుంటాయి. ప్రశ్న: పత్తిలో ఏ రకం సాగు చేయాలి? ఇప్పుడు సాగుకు అనుకూలమేనా? – గొట్టె శ్రీనివాస్, కమలాపూర్, సాంబరాజు, ల్యాదెళ్లజవాబు: మార్కెట్లో అనుమతి ఉన్న విత్తనాలు అన్నీ మంచివే. గత అనుభవాన్ని బట్టి విత్తనాన్ని ఎంచుకోవాలి. నూతన రకం వాడితే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. పత్తి సాగుకు వేచి చూడాలి. మూడు వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి. ఆరుద్ర కార్తె మొత్తం విత్తనాలు విత్తుకోవచ్చు. ప్రశ్న: వ్యవసాయాధికారులు గ్రామాల్లో తిరగడం లేదు. ఫీల్డ్ సర్వే చేయకపోవడంతో కొనుగోళ్లు చేయలేదు. – టేకుమట్ల విష్ణు, ధర్మసాగర్జవాబు: వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో తిరగడం లేదనడం అవాస్తవం. ప్రతీ రోజు ఏదో ఒక గ్రామంలో రైతు రిజిస్ట్రీ చేస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఏఈఓలు లేకుండా ఏ పని కాదు. వారు లేనిదే పంట కొనుగోళ్లు జరగవు. మాకు ప్రతీ రోజు రిపోర్టులు వస్తాయి. సేవల్లో లోపం ఉంటే ఫిర్యాదు చేయండి. -
మొక్కలను సిద్ధం చేయాలి
సంగెం: వానాకాలంలో నాటడానికి నర్సరీల్లోని మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. మండలంలోని చింతలపల్లి గ్రామ నర్సరీని గురువారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలంటే నాణ్యమైన మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని, మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సతీశ్, పీల్డ్అసిస్టెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రీప్రైమరీ’లో ఉద్యోగాల భర్తీ
● ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 19 సాయంత్రం 4 గంటల వరకు గడువుకాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 48 పాఠశాలల్లో ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ తరగతులను అధికారులు ప్రారంభించనున్నారు. బోధన చేయడానికి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రంగయ్యనాయుడు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చివరి వరకు తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అర్హతలు.. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ), నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, కనీసం రెండేళ్ల కాలపరిమితి గల ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (డీఈసెడ్) లేదా బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (నర్సరీ) చేసిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. నెల గౌరవ వేతనం రూ.8 వేలుగా నిర్ణయించారు. ఆయా పోస్టులకు ఏడో తరగతి పాసైన మహిళలు అర్హులు. వీరికి నెల గౌరవ వేతనం రూ.6వేలు చెల్లిస్తారు. వయోపరిమితి.. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ పర్సన్లకు 3 సంవత్సరాలు, దివ్యాంగ మహిళలకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆయా గ్రామ పంచాయతీ లేదా మున్సిప ల్ డివిజన్ పరిధిలోనే నివాసం ఉండాలి. స్థానికత, అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసేవిధానం.. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులకు విద్యార్హత పత్రాల (ఇంటర్/ఏడో తరగతి మెమోలు) రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను జతచేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సమర్పించాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. 48 పాఠశాలల్లో నియామకం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎంపిక చేసిన 48 పాఠశాలల జాబితా ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. విద్యాశాఖ అభ్యర్థులను ఎప్పుడైనా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించే సర్వహక్కులు ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ -
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026
జిల్లాల వారీగా విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత ఇలా.. 2,0821,201వరంగల్3,2631,913విద్యారణ్యపురి/కాళోజీసెంటర్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో బాలికలే పైచేయి సా ధించారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో బాలురు 6,160 మందికిగాను 4,157మంది (67.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5,384 మందికిగాను 4,394 మంది ఉత్తీర్ణత (81.61శాతం) సాధించినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. సెకండియర్లో జనరల్ విభాగంలో బాలురు 2,693 మందికిగాను 1,366 మంది ఉత్తీర్ణత (50.72 శాతం), బాలికలు 1,516 మందికిగాను 883మంది ఉత్తీర్ణత (58.25శాతం) సాధించారు. ఒకేషనల్ ఫలితాలు ఇలా.. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్లో మొత్తంగా 467 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో 390 మంది ఉత్తీర్ణత (83.51) సాధించారు. సెకండియర్ ఒకేషనల్ కోర్సుల్లో 266 మందికి గాను 208 మంది ఉత్తీర్ణత (78.20శాతం) సాధించారు. వరంగల్ జిల్లాలో ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 183 మందికిగాను 98 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,2092,249సెకండియర్హనుమకొండ11,5448,551ఫస్టియర్పాసైన విద్యార్థులుహాజరైన విద్యార్థులుహనుమకొండ జిల్లా ఫస్టియర్లో 74.07% సెకండియర్లో 53.43% ఉత్తీర్ణత ఒకేషనల్ ఫలితాల్లోనూ విద్యార్థుల ముందంజ -
గ్రామాభివృద్ధికి ప్రణాళికే తొలిమెట్టు
● జిల్లా పంచాయతీ అధికారి కల్పన రాయపర్తి: గ్రామాల అభివృద్ధికి మంచి ప్రణాళికే తొలిమెట్టు అని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన పేర్కొన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (జీపీడీపీ) తయారీపై మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీపీఓ కల్పన, ప్రోగ్రాం మేనేజర్ జానకీరాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల నిధులు, పథకాలను అనుసంధానం చేసుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. ఎంపీడీఓ కూచన ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, లైన్ డిపార్ట్మెంట్ల మండలస్థాయి అధికారులు, మైలారం, కొత్తూరు సర్పంచ్లు చిర్ర వేణు, కందికట్ల స్వప్న, వివిధ శాఖల అధికారులు ఆశిష్, అనిల్కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోవడానికి కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ సత్యశారద డ్రా పద్ధతిలో ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని 8 స్కూళ్లలో మొత్తం 122 సీట్లు (60 నాన్ రెసిడెన్షియల్, 62 రెసిడెన్షియల్) ఉన్నాయి. ఒకటో తరగతి 60 సీట్లకు 103 దరఖాస్తులు రావడంతో డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. 5వ తరగతిలో 62 సీట్లకు 44 దరఖాస్తులు మాత్రమే రావడంతో అందరిక ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఒకటో నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, ఏఎంఓ సుజన్తేజ, ఎంఈఓలు, కమిటీ సభ్యులు, ఎస్సీ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం జనరల్కు 3,263 మంది విద్యార్థులు హాజరుకాగా 1,913 మంది, ఒకేషనల్లో 329 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 245 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్కు 2,082 మంది హాజరు కాగా 1,201 మంది, ఒకేషనల్ 183 మందికి 98 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్–2 (సీడీఎస్–2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జి మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9059050062 నంబర్లో గాని వరంగల్ జిల్లా అభ్యర్థులు హనుమకొండ సుబేదారి షరీఫన్ మసీద్ ఎదుట ఉన్న కార్యాలయంలో, హనుమకొండ జిల్లా అభ్యర్థులు హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్)గా టి.కిషన్రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న పి.మహేశ్ హైదరాబాద్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కంటి దవాఖానా సూపరిం టెండెంట్గా రవిశేఖర్రావు కాశిబుగ్గ: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్గా డాక్టర్ కె.రవిశేఖర్రావును నియమించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన భరత్కుమార్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయ్యారు. 14న జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. -
కంటి దవాఖాన సూపరిం టెండెంట్గా రవిశేఖర్రావు
కాశిబుగ్గ: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్గా డాక్టర్ కె.రవిశేఖర్రావును నియమించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ భరత్కుమార్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయ్యారు. వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. వివరాలకు మొబైల్ 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. రామన్నపేట: ప్రోగ్రాం అధికారులు తమకు సంబంధించిన ప్రోగ్రాంలను రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ ఎస్డీ రాంకుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో టీబీ, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమం, ఇమ్యునైజేషన్, తదితర కార్యక్రమాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ రాంకుమార్ మాట్లాడుతూ.. లక్ష్య సాధనలో వెనుకబడిన పీహెచ్సీ, యూపీహెచ్సీ, సబ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, అందుకు కారణాలను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, డిప్యూటీ సివిల్ సర్జన్లు డాక్టర్ మహేందర్, డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ రుబీన, ఏఓ కోలా రాజేశ్, డెమో అశోక్ రెడ్డి, విజయలక్ష్మి, డాక్టర్ నవీన్, డీపీఓ రుక్ముదీన్ పాల్గొన్నారు. హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్)గా టి.కిషన్రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న పి.మహేశ్ హైదరాబాద్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. టి.కిషన్ రావును డిపో మేనేజర్లు, కార్యాలయం సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారణ్యపురి: విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ మధుసూదన్రావు అన్నారు. జిల్లాలోని టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు అభ్యర్థులకు 42 రోజులుగా హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో కొనసాగుతున్న శిక్షణ గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఛాత్రోపాధ్యాయులు కళానైపుణ్యాలతోపాటుగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలనా బోధనా పద్ధతులపై పట్టు సాధించాలన్నారు. టీటీసీ కోర్సులో శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు కోర్సు కో–ఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. -
జాయింట్ సర్వేతో సమస్య పరిష్కారం
● ఎస్సారెస్పీ డీఈ వేణుగోపాల్శాయంపేట: మండలంలోని మైలారం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 35లో 25 ఏళ్ల క్రితం రైతులకు సాగునీరందించేందుకు అప్పటి ప్రభుత్వం డీబీఎం–31 ఆర్ ఎస్సారెస్పీ కాలువ నిర్మాణం చేపట్టి ఇందుకోసం 25 గుంటల భూమిని పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. ఆభూమిని కొంత మంది రైతులు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదు రావడంతో గురువారం ఎస్సారెస్పీ డీఈ వేణుగోపాల్, ఏఈ వాసంతి, సివిల్ ఇంజనీర్ అరవింద్ ఎస్సారెస్పీ భూమిని సర్వే చేశారు. కాలువకు సంబంధించిన డ్రాప్ ప్రాంతాన్ని వెలికితీసి హద్దులను గుర్తిస్తూ మార్కింగ్ చేసి గుర్తించిన మార్గం వెంట గతంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువకు లైనింగ్ పనులు చేపట్టారు. ఈసందర్భంగా డ్రాప్ నకు ఎగువ భాగంలో ఉన్న కొంత మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని డీఈ వేణుగోపాల్ తెలిపారు. నక్ష ప్రకారం కాలువ తీసి నీరందించాలి.. మైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో గత 25 ఏళ్ల క్రితం రైతులకు సాగునీరందించేందుకు సర్వే నంబర్ 35లో 20 గుంటల భూమి ఎస్సారెస్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కొంత మంది రైతులు కాలువ మార్గాన్ని పూడ్చేయడంతో కింది భాగంలో ఉన్న భూములకు సాగునీరు చేరడం లేదు. నక్ష ప్రకారం కాలువ తీసి నీరు అందించాలి. – అర్జల సాంబరెడ్డి, రైతు, మైలారం -
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న పరకాల మహిళా డెయిరీని పటిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో పరకాల మహిళా డెయిరీ పనుల పురోగతి, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. పాల సేకరణ, ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి డెయిరీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాల బ్రాండ్ల విక్రయాలు, వినియోగదారుల అభిరుచులు, పోటీ పరిస్థితులు, మార్కెటింగ్ వ్యూహాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్రావు, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత, ఏపీఎం దివాకర్రాయ్, పరకాల మహిళా డెయిరీ జనరల్ మేనేజర్ కృష్ణ, మెప్మా డీఎంసీలు రజిత రాణి, రేణుక, టీఎంసీలు వెంకట్రెడ్డి, రమేశ్, సీఓలు పాల్గొన్నారు. -
ఇంటర్ లింక్తో నిరంతర విద్యుత్
హన్మకొండ: అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సబ్స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు హనుమకొండ సర్కిల్ (జిల్లా)లో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్, వరంగల్ సర్కిల్ (జిల్లా)లో ఐదు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక సబ్స్టేషన్, విద్యుత్ లైన్న్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారించడానికి ఆధునిక ఇంటర్లింక్ లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక విద్యుత్ లైన్లో లోపం ఏర్పడితే ఆ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే, ఇంటర్లింక్ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను మరో 33/11 కేవీ సబ్స్టేషన్తో, ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను సమీపంలోని 132/33 కేవీ సబ్స్టేషన్తో, అలాగే ఒక 33 కేవీ లైన్న్ను మరో 33 కేవీ లైన్తో అనుసంధానించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారు. దీని ఫలితంగా ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తారు. దీంతో విద్యుత్ అంతరాయం గణనీయంగా తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. అన్ని సబ్స్టేషన్లకు లైన్ల విస్తరణ.. అన్ని సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వ్యవస్థను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నాం. లైన్లో లోపం ఏర్పడినప్పుడు లేదా నిర్వహణ పనులు చేపట్టాల్సిన సందర్భంలో ప్రత్యామ్నా య మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తూనే మరమ్మతులు సులభంగా చేపట్టగలుగుతున్నాం. – బి.సామ్యానాయక్, ఎ.ఆనందం, హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు సబ్స్టేషన్ల మధ్య ప్రత్యామ్నాయ లైన్ నిర్మాణం సాంకేతిక కారణాలతో ఏర్పడే అంతరాయానికి చెక్ -
ఇంటర్ లింక్తో నిరంతర విద్యుత్
హన్మకొండ: అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సబ్స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు హనుమకొండ సర్కిల్ (జిల్లా)లో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్, వరంగల్ సర్కిల్ (జిల్లా)లో ఐదు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక సబ్స్టేషన్, విద్యుత్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారించడానికి ఆధునిక ఇంటర్లింక్ లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక విద్యుత్ లైన్లో లోపం ఏర్పడితే ఆ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే, ఇంటర్లింక్ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను మరో 33/11 కేవీ సబ్స్టేషన్తో, ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను సమీపంలోని 132/33 కేవీ సబ్స్టేషన్తో, అలాగే ఒక 33 కేవీ లైన్ను మరో 33 కేవీ లైన్తో అనుసంధానించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారు. దీని ఫలితంగా ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తారు. దీంతో విద్యుత్ అంతరాయం గణనీయంగా తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. సబ్స్టేషన్ల మధ్యప్రత్యామ్నాయ లైన్ నిర్మాణం సాంకేతిక కారణాలతో ఏర్పడే అంతరాయానికి చెక్ -
లాక్ష్ ఫౌండేషన్తో ఆర్ట్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూతో వివిధ కంపెనీలతో నేరుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ తెలిపారు. లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యసన కార్యక్రమాలు కూడా ఉంటాయని వివరించారు. లాక్ష్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్లేస్మెంట్ మేనేజర్ వైద్యం రవికుమార్, సీనియర్ మేనేజర్ సునీల్ నుంచి కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఒప్పంద పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, సాయిచరణ్, గిరిప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో మంగళవారం విద్యార్థులు సందడి చేశారు. జోసా–26 (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, మిగతా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్లో తప్పులు చేయకుండా వివిధ కళాశాలలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిట్లో అత్యుత్తమ విద్యాబోధన, ల్యాబ్స్, సౌకర్యాలు, ప్లేస్మెంట్స్పై విద్యార్థుల సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్ వెంకయ్యచౌదరి, ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం ప్రమాద బీమా చెక్కు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ కానిస్టేబుల్ ఆర్.సతీశ్ గత సంవత్సరం మే 15న స్టేషన్ఘన్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సీపీ చేతుల మీదుగా రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి బెనిఫిట్స్ త్వరగా అందజేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, సూపరింటెండెంట్ సంధ్య, సహాయకురాలు తులసి పాల్గొన్నారు. పరకాల: లైసెన్స్ లేకుండా విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఏఓ విజయ్చంద్ర హెచ్చరించారు. డీలర్లు యూరియాను ప్రభుత్వ యాప్ ద్వారా మాత్రమే విక్రయించాలని, తమ వద్ద ఉన్న స్టాక్ను యాప్లో వెంటనే నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. పరకాల డివిజన్ పరిధిలోని విత్తనాలు, పురుగు మందుల డీలర్లకు వానాకాలం సమాయత్తం కార్యక్రమాన్ని పరకాల రైతు వేదికలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చోట లైసెన్స్ తీసుకొని మరోచోట షాపులు నిర్వహించినా, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విత్తనాల అమ్మకాల్లో లాట్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పరకాల ఏడీఎ ఆదిరెడ్డి, పరకాల డివిజన్లోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు.


