breaking news
Warangal
-
మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం పాలకమండలి నియామకం సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు చినికి చినికి గాలి వానలా మారాయి. నాలుగైదు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కాంగ్రెస్ పార్టీ కేడర్లో హాట్టాపిక్గా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న వ్యాఖ్యలు మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ రాజకీయాలునాలుగు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ దంపతులపై సీఎం రేవంత్రెడ్డికి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా ఇరువర్గాలతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు. దీంతో ఆయన మంత్రి సురేఖ, కొండా మురళీధర్రావుతో పాటు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. సుమారు మూడు పర్యాయాలు మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం వేర్వేరుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ గొడవ సద్దుమణగకపోగా... ఒక దశలో ‘‘వారా.. మేమా’’ తేల్చాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ సంఘం కూడా ఎటూ తేల్చలేకపోగా, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ జోక్యం చేసుకుని మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. అతిథుల మార్పు వెనుక?సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల పేర్లను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్కు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఈసారి స్వల్పంగా మార్పులు చేసింది. గతంలో వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హనుమకొండలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొనేవారు. ప్రజాపాలన వేడుకల సందర్భంగా కొండా సురేఖను వరంగల్కు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని హనుమకొండ జిల్లాలకు మార్చారు. ఈ మార్పు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాలు కారణం కాకపోలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈసారి ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల వీ రయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.వ్యాఖ్యల కలకలంసీఎం, టీపీసీసీల జోక్యం తర్వాత గొడవలు సద్దుమణిగినట్లుగానే కనిపించినా.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మధ్య వ్యాఖ్యలు కలకలంరేపాయి. భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ సందర్భంగా ‘ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని’ మంత్రిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి?’ అని నిలదీశారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికని.. ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో ‘నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఆయనపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?’ అంటూ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేందర్ రెడ్డి.. ‘పూటకో పార్టీ మార్చిన ఘనత మంత్రి సురేఖది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను. 12 ఏళ్లు ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరైనా అదృష్టం ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు. దురదృష్టవంతులు ఓడిపోతారు. మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసుకోవద్దని అధిష్టానం హెచ్చరిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ కేడర్లో జరుగుతోంది. -
రేపటి నుంచి మహిళా ఆరోగ్య కార్యక్రమాలు
గీసుకొండ: జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ.. స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జిల్లా ఇ మ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ ప్రకాశ్ అ న్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పరివార్ అభియాన్లో భాగంగా వైద్య అ ధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ ుతూ మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామన్నారు. విద్యాలయాల్లో రక్తహీనత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రోగ్రాం అధికారులు ఆచార్య, విజయ్కుమార్, అనిల్కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్నర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే యూరియా కొరత ఉందని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక మతోన్మాద పాలకుల పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్లో సోమవారం సింగతి మల్లికార్జున్ అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై గ్రామాల్లో సర్వేలు నిర్వహించి పరిష్కరించే విధంగా పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. డివిజన్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి డివిజన్ కమిటీ సభ్యుడు ముందుకు కదలి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంబ బాబురావు, వంగల రాగసుధ, కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్, గటికె జమున, తడుక కౌసల్య, గీసపాక కొమురయ్య, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, అల్లి సాహెబ్, కర్నె సాంబయ్య, బత్తిని కుమారస్వామి, బడిమె సురేందర్, సీతారాములు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిగీసుకొండ: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని ఓ గార్డెన్లో గీసుకొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల వారికి ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్రెడ్డి సంకల్పమన్నారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, డీసీఓ నీరజ, పశుసంవర్ధకశాఖ జేడీ బాలకృష్ణ, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, కాకతీయ కోఆపరేటివ్ సంస్థ ప్రిన్సిపాల్ యాకోబ్నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రాధిక, సంగెం మండల అధ్యక్షురాలు ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి
హన్మకొండ : మంత్రి కొండా సురేఖ ఇల్లును సోమవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముట్టడించారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు నెలకు రూ.18 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. హనుమకొండ రాంనగర్లోని సీపీఎం కార్యాలయం నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ర్యాలీగా బయల్దేరి మంత్రి ఇంటి వరకు చేరుకున్నారు. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుని బారికేడ్లు అడ్డుగా పెట్టారు. పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో పోలీసులు, సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, అసోసియేషన్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీపీఎం కార్యాలయానికి చేరుకుంటున్న వారిని కూడా మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకుని హనుమకొండ, కేయూసీ, సుబేదారి పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు సుంచు విజేందర్, బొట్ల చక్రపాణి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వీరగోని నిర్మల, శోభారాణి, రాజేశ్వరి, రమాదేవి, కే.జమున, హైమావతి, రజిత, అనిత, ఉమాదేవి, ఎండీ మైముద, అంజుమ్, శారద, వందలాదిమంది అంగన్వాడీలు పాల్గొన్నారు. పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు -
వినతులకు పరిష్కారం చూపాలి
అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు స్వీకరించారు. మొత్తం 178 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. డీఆర్ఓ వై.వి గణేష్, డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ సీఈఓ రవి, డీఈఓ వాసంతి, మెప్మా పీడీ జోనా తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి పోషణ మాసోత్సవం ఈనెల 17వ తేదీ (బుధవారం) నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. పోషణ మాసం కార్యక్రమంలో అమలు చేసే వివరాలను డీడబ్ల్యూఓ జయంతి వివరించారు. కొడుకులు ఆస్తి రాయించుకున్నారు భర్త ద్వారా రావాల్సిన ఆస్తిని కొడుకులు నా పేరు మీదికి మా ర్చుతామని చెప్పి మోసం చేసి వాళ్ల పేరుతో మార్చుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఎవరూ లేరని సర్టిఫికెట్ తీసుకున్నారు. మోసం చేసి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కొడుకులపై చర్యలు తీసుకోవాలి. – జుబేదా బేగం, పరకాల ఇంట్లో నుంచి కొడుకు వెళ్లగొడుతున్నాడు మాది హనుమకొండ హౌసింగ్ బోర్డ్ కాలనీ. నా రెండో కొడుకు, కోడలు అక్రమంగా ఇంట్లోకి వచ్చి నన్నే వేధించి వెళ్లగొడుతున్నారు. నా భర్త 40ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లను పెంచి పెద్ద చేసి ఒక ఇంటివారిని చేసిన. నా కొడుకు, కోడలు బయటికి గెంటేస్తే బతికే పరిస్థితి లేదు. వారిపై చర్యలు తీసుకోని, నా ఇంట్లో నేను ఉండే విధంగా చర్యలు తీసుకోండి. – జేరిపోతుల రామసుందరమ్మ -
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్సింగ్ దామెర: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరిపడా యూరియా ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్సింగ్ అన్నారు. మండలంలోని ఊరుగొండ(పెద్దాపూర్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా రికార్డుల పరిశీలన అనంతరం మాట్లాడుతూ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట మండల వ్యవసాయ శాఖ అధికారులు అల్లె రాకేశ్, కమలాకర్, ఏఈఓలు జగదీశ్, రామకృష్ణ, అరుణ్, సీఈఓ శ్రీనివాస్ ఉన్నారు. రైతులకు ఇబ్బంది కలుగొద్దు శాయంపేట: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో చేపడుతున్న వివిధ పథకాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కమలాకర్, ఏఓ గంగాజమున, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్కతుర్తి : ముల్కనూరు ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థి గొల్లెన శ్రీనిధి కిక్ బాక్సింగ్లో రాష్ట్ర స్థాయిలో రాణించి గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ రెహమాన్ తెలిపారు. సోమవారం తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలను వరంగల్లో నిర్వహించారు. అండర్–15 కేటగిరిలో నిర్వహించిన పోటీలో గోల్డ్ మెడల్ సాధించి, సౌత్ ఇండియా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
ఐసీసీసీ పనితీరుపై అధ్యయనం
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు వందశాతం అమలు చేస్తున్న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని సోమవారం వరంగల్ బల్దియా పాలక వర్గం, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. స్టడీటూర్లో తొలి రోజు ఇండోర్లోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్, డంపింగ్ యార్డు, ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం (ఐసీసీసీ) తీరును పరిశీలించారు. నగరంలోని ఆయా కాలనీల నుంచి ప్రతీ రోజు ఆరు రకాలుగా చెత్తను విభజించి సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 311 యాప్ద్వారా అందుతున్న వివిధ రకాల సేవలను వివరించారు. ఇందులో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ మహేందర్, సీపీ రవీందర్ రాడేకర్, కార్పొరేటర్లు, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ రమేశ్ తదితరులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ బల్దియా పాలకవర్గం, అధికారుల స్టడీ టూర్పై ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాధనంతో చేస్తోంది అధ్యయన యాత్రనా లేక ఆధ్యాత్మిక, విహార యాత్రనా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రావట్లేదని, రెండు నెలల నుంచి తిరుగుతున్నా టెక్నికల్ సమస్య ఉందని చెబుతున్నారని 41వ డివిజన్కు చెందిన అందె ఝాన్సీ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 21న వేయిస్తంభాల ఆలయం వద్ద ఘనంగా బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులను బందోబస్తుకు కేటాయించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. -
అమ్మానాన్న కోసం అన్వేషణ
కన్నవారి కోసం సముద్రాలు దాటి వచ్చింది. వేల కిలోమీటర్లు ప్రయాణించింది. భాష రాకపోయినా.. తెలిసిన వారెవరూ లేకపోయినా.. అమ్మానాన్న జాడ కోసం 16 ఏళ్లుగా అన్వేషిస్తోంది. వారి ఫొటోలు లేకపోయినా, ఆనవాళ్లు తెలియకపోయినా.. వారిని కలుస్తాననే దృఢ నిశ్చయంతో ఉంది. కన్నవారిని కలిసేదాకా నిద్రపోనని చెబుతున్న స్వీడన్కు చెందిన సంధ్యారాణి ఆదివారం వరంగల్ నగరంలో తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించింది.ఖిలా వరంగల్: చిన్నతనంలో ఓ అనాథాశ్రమంలో పెరిగిన కుమార్తె సంధ్యారాణి తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తోంది. కన్నవారిని కలవాలని స్వీడన్ దేశం నుంచి ఆమె ఆదివారం వరంగల్కు వచ్చింది. తల్లిదండ్రుల మూలాలు ఇక్కడే ఉన్నాయని వరంగల్ శివనగర్లోని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్తోపాటు పద్మశాలి సంఘాల ప్రతినిధులను కలిసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా తల్లిదండ్రులు రాజ్కుమార్, అనసూయ. కొందరు నా తల్లి చనిపోయిందని అంటున్నారు. కానీ, ఆమె చనిపోలేదు. నా వయసు రెండేళ్లు ఉన్నప్పుడు బతుకుదెరువు కోసం నాన్న నన్ను తీసుకుని హైదరాబాద్ ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వెళ్లాడు. అక్కడ నిజాం కాలేజీ తోటమాలి రామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. ఈ విషయం తెలిసి రామయ్య తన మరదలు విజయను నాన్నకు ఇచ్చి వివాహం చేశాడు. మూడు నెలలు ఆమెతో కాపురం చేసిన ఆయన ఓ రాత్రి నన్ను విజయ దగ్గరే వదిలేసి పత్తాలేకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం రామయ్య గాలించినా దొరకలేదు. దీంతో విజయ.. మూడేళ్ల వయసున్న నన్ను విజయనగర్ కాలనీలోని ‘సేవా సమాజం.. బాలికా నిలయం’ అనే అనాథాశ్రమంలో వదిలేసింది.ఆశ్రమం నుంచి స్వీడన్కు దత్తత..సంతానం లేని స్వీడన్కు చెందిన లిండ్, గ్రేన్ నన్ను ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్దయ్యా. ఊహ తెలిసినప్పటి నుంచి స్వీడన్ నా దేశం కాదు.. వాళ్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని గ్రహించా. పైచదువుల కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో నా అసలు పేరెంట్స్ గురించి 2009 నుంచి అన్వేషణ ప్రారంభించా. ఇందులో భాగంగా ఆదివారం వరంగల్ శివనగర్కు చేరుకున్నా. పద్మశాలి సంఘం ప్రతినిధి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ను కలిశా. తన తండ్రి రాజ్కుమార్, తల్లిపేరు అనసూయ. ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులను కలుసుకోవాలని ఇండియాకు వచ్చా. మూలాలు వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చా. నా తల్లిదండ్రులు తెలిస్తే 9822 206485 నంబర్కు కాల్చేయండి. తల్లిదండ్రులను ఎలాగైనా కలుస్తాననే నమ్మకం నాలో దృఢంగా ఉంది’ అని సంధ్యారాణి కన్నీటి పర్యంతమైంది. -
యూరియా లారీని అడ్డుకున్న రైతులు
శాయంపేట: యూరియా బస్తాల లారీని రైతులు అడ్డుకున్నారు. ప్రగతిసింగారం గ్రామంలోని ఆగ్రోస్ రైతు కేంద్రానికి ఆదివారం 450 బస్తాల యూరియా లోడ్ లారీ వచ్చింది. 225 యూరియా బస్తాలు వసంతాపూర్, 225 బస్తాలు శాయంపేటకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, వసంతాపూర్ గ్రామ రైతులు తమకు 225 యూరియా బస్తాలు సరిపోవని, 450 బస్తాలు కావాలని పట్టుబట్టారు. లారీని శాయంపేటకు పోనివ్వకుండా రైతులు అడ్డుకున్నారు. యూరియా బస్తాలో గడ్డిని నింపి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో 225 యూరియా బస్తాలు వసంతాపూర్ రైతులకు మాత్రమే పంపిణీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి లారీని శాయంపేటకు తరలించారు. వసంతాపూర్ గ్రామానికి 225 యూరియా బస్తాలు సరిపోదు. 450 బస్తాలు యూరియా ఉంటే సరిపోతుందని లారీని అడ్డుకున్నాం. 450 మంది రైతులు ఉన్నాం. ఒక్కో రైతుకు కనీసం ఒక్క యూరియా బస్తా ఇవ్వాలి. – రవీందర్రెడ్డి, రైతు, వసంతాపూర్ -
కడియం శ్రీహరికి డిపాజిట్ రాదు
వేలేరు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు ఓడిస్తారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని బండతండా, చింతలతండా, కమ్మరిపేట, లోక్యాతండా, సోడాషపల్లి, మల్లికుదుర్లలో ఊరూరికీ బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని విమర్శించారు. కడియం శ్రీహరి వెంట అవకాశవాద కార్యకర్తలే ఉన్నారని, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిర వెంట ఉన్నారన్నారు. కడియం శ్రీహరికి నియోజకవర్గంలోని సాగునీరు, యూరియా సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేవరకు పోరాటం చేస్తానన్నారు. కడియం శ్రీహరి తోత్తులు నా శవయాత్ర చేసినా, ఎం చేసినా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాటం చేస్తానన్నారు. నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు, భూపతిరాజు, సంపత్, గోవింద సురేశ్, మల్కిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, ప్రవీణ్ నాయక్ తదితరులు ఉన్నారు. దేవాదులకు కాంగ్రెస్ రూపాయి ఇవ్వలేదు ప్రాజెక్టు పూర్తి కోసం పోరాటం చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్షిప్
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 20 జిల్లాల నుంచి 350 విద్యార్థినీవిద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిసారి సిటీ లీగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీవైఎస్ఓ సత్యవాణి, సెక్రటరీ కైలాశ్యాదవ్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రతినిధులు శ్రీలక్ష్మి, మహిపాల్, బండారి సంతోశ్, తిరుపతి, మణికంఠ, వెంకటేశ్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
కేయూ క్యాంపస్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ యూజీసీ కో–ఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీలో జనవిజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఐదో వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సహజ వనరుల శాసీ్త్రయ వినియోగంతోనే సమగ్రాభివృద్ధి జరుగనుందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలోనైనా నీటికొరతను అధిగమించేందుకు ఇంకుడుగుంతలు, చెక్డ్యాంల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థను ఏర్పరిస్తే భూగర్భజలాల స్థాయిని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఆచార్యులు అందె సత్యం మాట్లాడుతూ.. పారిశ్రామిక విప్లవం ద్వారానే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ డీఎఫ్ఓ కాజీపేట పురుషోత్తం, వక్తలు మర్రి యాదవరెడ్డి, డాక్టర్ సుదర్శన్రెడ్డి, కృష్ణానంద్, లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంగా చేపట్టిన కార్యకలాపాల నివేదికను జనవిజ్ఞాన వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఆర్థిక నివేదికను బాధ్యులు పరికిపండ్ల వేణు ప్రవేశపెట్టారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు శ్రీనాఽథ్, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ రాములు, ఉమామహేశ్వర్రావు, శ్రవణ్కుమార్, ధర్మప్రకాశ్, ప్రభాకర్చారి, శ్రీనివాస్, సుమలత, వందన అశోక్ ఉన్నారు. కేయూ యూజీసీ కో–ఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి -
ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుపాక ఎల్లయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఏనుట్ల రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘం ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాల్లో, ఉదయం 9 గంటలకు మండల కేంద్రాల్లో సంఘం పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమకొండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు పురస్కారాలు అందించి సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్కుమార్, ఆయా సంఘాల నాయకులు వనపాకల రాజయ్య, సత్తూరి చంద్రమౌళి, కామెర లక్ష్మణ్, కలకోట్ల ప్రతాప్, మేకల ప్రవీణ్, వల్లందాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి విద్యారణ్యపురి: విద్యారంగం, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన టీచర్ల పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టుల్లో అర్హులైన ఉపాధ్యాయులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, టీచర్ల శిక్షణ కార్యక్రమాలు వేసవి సెలవుల్లోనే ఇవ్వాలని, విద్యేతర ఆన్లైన్ కార్యక్రమాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్లుగా, ఎంఈఓలుగా, డిప్యూటీ డీఈఓ లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. సమావేశంలో డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీని వాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, డాక్టర్ కిషన్, ఎ.మల్లయ్య, డి.రమేశ్, టీచర్లు పాల్గొన్నారు. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
కొలువుదీరిన జీపీఓలు
● జిల్లాలో 174 క్లస్టర్లు, 191 మంది ఎంపిక ● ఇకపై గ్రామాల్లో మెరుగైన సేవలునర్సంపేట: గ్రామపంచాయతీల్లో గతంలో మాది రిగా మెరుగైన సేవలు అందించేందుకు జీపీఓల నియామకం పూర్తయింది. జిల్లాలోని 14 మండలా ల్లో 174 క్లస్టర్లలో 191 మంది జీపీఓ (గ్రామ పాలన అధికారి)లను అటాచ్ చేశారు. పూర్వ వీఆర్ఓ, వీఆ ర్ఏలను తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం విదితమే. ఈ మేరకు ఆసక్తి ఉన్న గత వీఆర్ఓ లు, వీఆర్ఏలకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి జీపీఓలను కేటాయించారు. ఇక మీదట గ్రామాల్లో మెరుగైన రెవెన్యూ సేవలు అందనున్నాయి. జిల్లాలో 14 మండలాలు.. జిల్లాలో 14 మండలాలు, 174 క్లస్టర్లు ఉన్నాయి. 19 1 మంది జీపీఓలను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించారు. ఈ మేరకు ఈనెల 5న హైదరాబా ద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. ఎంపికై న జీపీఓలకు క్లస్టర్లను కేటా యిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో జీపీఓలు కొలువుదీరుతున్నారు. తీరనున్న సమస్యలు గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసి న నాటి నుంచి సమస్యలు పేరుకుపోయాయి. వి ద్యార్థులకు కులం, ఆదాయంతో పాటు ఇతర సర్టిఫి కెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సమస్యలు తప్పలేదు. ప్రతీ చిన్న పనికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. సకాలంలో పనులు కాకపోవడంతో పడరాని పాట్లు పడ్డారు. ప్రస్తుతం జీపీఓల కేటాయింపుతో సమస్యలు తీరనున్నాయి భూ భారతి చట్టంలో వేగం.. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. ధరణిని రద్దు చేస్తూ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు భూ సమస్యలపై గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు ప్రధాన భూమి పోషించనున్నారు. సర్వేయర్లతో పాటు రెవెన్యూ అధికారులకు వీరు సహకరిస్తారు. రెండు విడతల్లో పరీక్షలు.. జీపీఓ పోస్టుకు గతంలో వీఆర్ఓగా పని చేసిన వారికి అవకాశం కల్పించింది. వీఆర్ఓలు డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి 191 మందిని జీపీఓలుగా ఎంపిక చేశారు. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
సామాజిక చైతన్యం కలిగి ఉండాలి
● ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణినర్సంపేట: విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్ల పల్లి స్వరూపారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని విజ్డమ్ పాఠశాలలో లీడ్ లైబ్రరీ, పాకాల కవులు సంయుక్తంగా నిర్వహించిన అల్లిక పుస్తక పరిచయ సభ ప్రముఖ కవి కాసుల రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ సాహిత్యం ప్రజలకు వైపు ఉండాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే సామాజిక చైతన్యం కలిగి ఉండాలన్నారు. చైతన్యవంతమైన సమాజాన్ని రూపుదిద్దడంలో ప్రతి వ్యక్తి తనవంతు భాగస్వామ్యం కలిగి ఉండాలన్నారు. పుస్తక పరిచయ సభను నర్సంపేటలో నిర్వహించినందుకు లీడ్ లైబ్రరీ, పాకాల కవులకు ధన్యవాదాలు తెలిపారు. విజ్డమ్ హైస్కూల్ డైరెక్టర్ సయ్యద్ జావేద్ మాట్లాడుతూ సమాజంలో కవుల పాత్ర ప్రశ్నించే తత్వాన్ని తెలియజేశారు. తంగిరాల సోని మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు బండారి రాజ్కుమార్, డాక్టర్ తండా హరీష్గౌడ్, కుంజ కల్యాణి, పుచ్చ కుమారస్వామి, శిల్ప జగదీష్, ప్రేమ్కుమార్, ఉపాధ్యాయులు నరసింహ, రాములు, సుభాని, రాపాక శ్రీనివాస్, విద్యార్థులు, సాహితీ మిత్రులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం మరుపురాని ఘట్టం
● ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ దుగ్గొండి: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరుపురాని ఘట్టమని ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ పంక్షన్ హాల్లో పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సా యుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొదట తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివా ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరులు అమరులయ్యారన్నారు. సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలననుండి విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు, వంగాల రాగసుధ, కన్నం వెంకన్న, సింగతి మల్లి కార్జున్, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి, గాజుల వెంకటయ్య, డివిజన్ కమిటీ సభ్యులు గటి కె జమున, తడుక కౌసల్య, గీసపాక కొంరయ్య, బుడిమె సురేందర్, బత్తిని కుమారస్వామి, అనుముల రమేష్, సీతారాములు పాల్గొన్నారు. -
విధులకు హాజరు కాకపోతే చర్యలు
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ● వర్ధన్నపేట సీహెచ్సీ ఆకస్మిక తనిఖీవర్ధన్నపేట: వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాక పోతే కఠిన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఆస్పత్రి అంతా కలియ తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అవసరముంటే లిఖిత పూర్వకంగా తనదృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డ్యూటీ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు కోనారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ చానల్ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ లేదా?
వరంగల్ చౌరస్తా: శ్రీరాష్ట్ర మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ నాకు లేదా? అధిష్టానం సూచించిన వారికే కేటాయించాశ్రీ అని దేవాదాయ ధర్మదాయ, పర్యవరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. శనివారం వరంగల్ ఓ సిటీలో విలేకరులతో మంత్రి సురేఖ మాట్లాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచాడని, ఆయనపై తాను కామెంట్ చేయాలనుకోవట్లేని పేర్కొన్నారు. తనపై నాయిని చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. రూ.3కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన తూర్పు నియోజక వర్గంలో మూడు డివిజన్లలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కాశిబుగ్గలో రూ1.50 కోట్లతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులు, 26వ డివిజన్ గిర్మాజీపేటలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, 21వ డివిజన్ ఎల్ బీ నగర్లో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులు ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు స్వీకరించారు. ఈఅభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాయిని అదృష్టం కొద్ది గెలిచాడు మంత్రి కొండా సురేఖ -
అథ్లెటిక్స్ మీట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దాం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలపై వివిధ క్రీడా సంఘాలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొననున్నట్లు క్రీడా సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పోటీల వివరాల్ని సీఎం రేవంత్రెడ్డికి వివరించేందుకు ఈనెల 15 లేదా 16 తేదీల్లో స్వయంగా కలవనున్నట్లు తెలిపారు. డీవైఎస్ఓకు ఎమ్మెల్యే అభినందనలు ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అభినందించారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి శనివారం డీవైఎస్ఓ అశోక్కుమార్ను శాలువాతో సత్కరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన అశోక్కుమార్ క్రీడాకారులకు ఆదర్శమన్నారు. అంతకుముందు క్రీడా సంఘాలు, డీఎస్ఏ కోచ్ల ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అశోక్కుమార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్ఖాన్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు వరదరాజేశ్వర్రావు, బాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులున్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
వెంటాడుతున్న వీధికుక్కలు
ఖిలా వరంగల్: వరంగల్ 39వ డివిజన్ విద్యానగర్ కాలనీలో వీధి కుక్కలు పెట్రేగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే కొందరు పిల్లలు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. వరంగల్ ఫోర్ట్ రోడ్డుకు ఇరువైపులా చికెన్, మటన్ విక్రయ షాపులు ఉన్నాయి. రహదారులపై మాంసం వ్యర్థాలు, చెత్త వేస్తుండడంతో వీధి శునకాలు ఎక్కువగా వాటి కోసం గుంపులుగా తిరుగుతున్నాయి. వీధి కుక్కలను సంరక్షణ కేంద్రానికి తరలించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 మేయర్ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, బయో, విండో కంపోస్ట్ల యూనిట్ల ఏర్పాటు, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూ ఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు.కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి -
జాతీయ లోక్ అదాలత్ల తీర్పు అంతిమం
పరకాల: జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారించుకోవడం వల్ల అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.సాయిశరత్ స్పష్టం చేశారు. జాతీయ లోక్ అదాలత్ తీర్పును అంతిమంగా భావించాలని సూచించారు. శనివారం పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈలోక్ అదాలత్లో పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, అదనపు న్యాయమూర్తి శ్రీవల్లి శైలజ, రెండవ తరగతి మెజిస్ట్రేట్ కొప్పుల ఈశ్వర్ 3 సివిల్ కేసులు, 1,119 క్రిమినల్ కేసులు, 6 బ్యాంకు కేసులు మొత్తం 1,128 కేసుల్ని పరిష్కరించారు. ఈసందర్భంగా పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించడం వల్ల ఫిర్యాదుదారులతో పాటు ప్రతివాదులకు సమాన న్యాయం లభిస్తుందన్నారు. జాతీయ లోక్ అదాలత్లతో పాటు చట్టాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరమని సూచించారు. కక్షిదారులు క్షణికావేశంలో చేసిన నేరాలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, రవికుమార్, పరకాల డివిజనల్లోని పోలీసులు పాల్గొన్నారు. పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ లోక్ అదాలత్లో 1,128 కేసులు పరిష్కారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు -
పక్కాగా పంటల లెక్క
హన్మకొండ: వానా కాలం పంటల సాగు లెక్కలు కచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను చేపట్టింది. వ్వవసాయ విస్తరణాధికారులు మొబైల్ ఫోన్లోని ప్రత్యేక యాప్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు. సాగు చేసిన పంటల ఫొటోలు కూడా యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసే వారు. అయితే, కచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జిల్లాలో 14 మండలాల్లోని 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)లు సర్వేలో మునిగిపోయారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. పురుష ఏఈఓలు 2 వేల ఎకరాల్లో, మహిళా ఏఈఓలు 1800 ఎకరాల్లో డిజి టల్ క్రాప్ సర్వే చేస్తారు. ఈ మేరకు సర్వే నంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటా యించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్ పూర్తి చేయడానికి వీలుగా ఈ యాప్ ఆఫ్లైన్ ఫీచర్తో రూపొందించారు. వరి సాగు ఏ పద్దతిలో చేశారో కూడా నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. అదే విధంగా విత్తనోత్పత్తి పంటల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. వరి పంట సాగును సన్న, ముతక రకాల వారీగా నమోదు చేయాలని సూచించారు. పంట విత్తిన వివరాలు నమోదు ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడం ద్వారా పంట కొనుగోలు/సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంటుంది. ఉద్యాన సాగులో అంతర్ పంటలను కూడా సర్వేలో నమోదు చేస్తారు. రైతుపేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ల్యాండ్ మార్క్, క్షేత్రంపేరు, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పంట బుకింగ్ 90 శాతం బుకింగ్ చేయగానే రైతు మొబైల్కు ఆరు సందేశాలు వెళ్తాయి. పంటల సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అక్టోబర్ 25 వరకు పూర్తిచేయాలి.. జిల్లాలో అక్టోబర్ 25 వరకు పంటల బుకింగ్ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజికల్ క్రాప్ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఇదేనెల 3న అభ్యర్థనలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. నవంబర్ 5న తుది డిజిటల్ క్రాప్ సర్వేను ప్రదర్శిస్తారు. రైతులు స్వచ్చందంగా పంట లు నమోదు చేయించుకోవా లి. అక్టోబర్ 25లోపు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయికి చేరుకుని డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. రైతులు సర్వే నంబర్, పంటల వారీగా వివరాలు నమోదు చేయించుకోవాలి. – రవీందర్సింగ్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో 125 గ్రామాలు, 55 క్లస్టర్లు 2,21,163 ఎకరాల్లో పంటల సాగురైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆన్లైన్లో ఉన్న సాగు విస్తీర్ణం మేరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల విక్రయ చెల్లింపులు ఆలస్యమవుతాయి. ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది. -
నగదు ఎలా రికవరీ చేస్తారు?
శాయంపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం అవినీతి ఆరోపణలు, ఇన్ బ్యాలెన్స్ తగ్గింపులో విఫలమవడం వల్ల పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్లు డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. పాలకవర్గాన్ని రద్దు చేసినప్పటికీ అక్రమాలకు పాల్పడిన రూ.15లక్షలు ఎలా రికవరీ చేస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. శాయంపేట పీఏసీఎస్లో రూ.15 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారని, రూ.10.54 కోట్లు ఇన్ బ్యాలెన్స్గా ఉండడంతో జూలై నెల 3న డీసీఓ సంజీవరెడ్డి పీఏసీఎస్ పాలకవర్గానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేశారు. రికవరీ మరింత జాప్యం జరిగే పరిస్థితి కనబడుతోంది. రికవరీ ఎలా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
యూరియా కోసం బారులుదీరిన రైతులు
ఖానాపురం : మండల కేంద్రంలో రైతులు యూ రియా కోసం బారులుదీరారు. గ్రోమోర్కు 266 బస్తాలు వస్తున్నాయని తెలియడంతో రైతులు రైతువేదిక వద్ద భారీగా బారులుదీరారు. ఖానాపురంతో పాటు కొత్తూరు, రంగాపురం, మనుబోతులగడ్డ, అశోక్నగర్ గ్రామాలకు చెందిన రైతులు క్యూలో నిల్చున్నారు. ఏఈఓ ఆశాదీప్ ఆధ్వర్యంలో క్యూలో ఉన్న వారికి టోకెన్లు పంపిణీ చేశారు. బస్తాలు ఎన్ని వస్తున్నాయో వాటికి అనుగుణంగానే టోకెన్లు ఇచ్చారు. మిగతా వారు వెనుదిరిగిపోయారు. రైతువేదిక వద్ద బారులుదీరిన రైతులు -
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 మేయర్ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మా స్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థా ల నుంచి 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు. కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి -
స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి విద్యార్థుల ప్రతిభ
రాయపర్తి: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మి శనివారం తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12న వరంగల్ జిల్లా కేంద్రంలో బిర్లా ఓపెన్మైండ్స్ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ట్రాయల్థన్ పోటీల్లో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎల్.చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండీ అబ్దుల్థాహెర్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ అంబర్పేటలోని అంతర్జాతీయ స్విమ్మింగ్పూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ సమ్మయ్య, విద్యార్థులు చరణ్, ఎండీ అబుల్థాహెర్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించినట్లు ఆమె తెలిపారు. -
మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట: హైదరాబాద్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట బస్టాండ్లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. నెక్కొండ బస్టాండ్ ఆవరణలో సీసీ ప్లాట్ఫారం నిర్మించాలని కోరినట్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్రావు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సింగ్లాల్ ఉన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీఖానాపురం: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలోని బుధరావుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామానికి చెందిన సుధగాని సాంబయ్య ఈనెల 7న తన కుమారుడు రాజేశ్కు జ్వరం రావడంతో హైదరాబాద్కు తీసుకెళ్లాడు. ఇంటిముందు గేటుతోపాటు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకోగా తాళం తొలగించి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా నాలుగు గ్రాముల బంగారు రింగు, తులం వెండి రింగు, 14 తులాల మూడు వెండి బ్రాస్లెట్స్, 10 తులాల పట్టీలు, రూ.10వేల నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కూస్ల్టీం సభ్యులు వేలిముద్రలు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ బదిలీవర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్బాబు బదిలీ అయ్యారు. పదోన్నతి రావడంతో ఇక్కడి నుంచి హైదరాబాద్కు స్థానచలనం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల వరంగల్ మహానగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సమ్మయ్యను వర్ధన్నపేట ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్గా నియమించినట్లు సమాచారం. దాతలు ముందుకు రావాలి నర్సంపేట : యాత్రాదానం మహోన్నత కార్యక్రమంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని నర్సంపేట డిపో మేనేజ ర్ ప్రసూనలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ యాత్రాదానం కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, విహార యాత్రలకు వెళ్లే అవకాశం పొందుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలు ఈ యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించిందన్నారు. బస్సుల బుకింగ్ కోసం నర్సంపేట డిపో 9959226052, 9866314253 నంబర్లలో సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు. -
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
● నల్లబెల్లిలో రైతుల రాస్తారోకో నల్లబెల్లి: నకిలీ గడ్డిమందు విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో వారు ఆందోళన చేసి మాట్లాడారు. మండల కేంద్రంలోని ఖాజామైనొద్దీన్ షాపులో విన్ సూపర్ పురుగుల మందును నందిగామకు చెందిన రైతు ఇస్లావత్ రాజ్కుమార్ రూ.1,700కు కొనుగోలు చేసి పిచికారీ చేయగా మూడెకరాల్లోని వరిపంట ఎండిపోయిందని తెలిపారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడని వారు పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులు బొట్ల నరేశ్, భట్టు సాంబయ్య రాస్తారోకోలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న షాపు యజమానికి హైమద్ పాషా బాధిత రైతుకు పరిహారం అందిస్తానని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. నకిలీ గడ్డిమందు అంటగట్టిన షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, షాపును సీజ్ చేయాలని వ్యవసాయాధికారులు కోరారు. నందిగామ, నల్లబెల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఫోర్టిఫైడ్తో ఆరోగ్యం
ఖిలా వరంగల్: రేషన్ బియ్యాన్ని నల్ల బజారులో విక్రయిస్తున్నారా.. అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్లే. కిలోకు రూ.10 లేదా రూ.15 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రేషన్ సన్న బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పౌరసరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్ రైస్ను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జిల్లాలోని 509 షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో పాతకార్డులు 2,66,429 కాగా.. నూతనంగా జారీచేసిన 16,251 కార్డులతో 282,680 కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు 53,82,518 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో ప్రతి నెలా 5 నుంచి 10 శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఫోర్టిఫైడ్ రైస్పై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అపోహలు వద్దు.. చిన్నారులు, యువకులు, గర్భిణుల్లో 35 నుంచి 50 శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది. ఎలాంటి అపోహలు లేకుండా ఫోర్టిఫైడ్ రైస్ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా 13 మిల్లీగ్రాముల నుంచి 15.19 మిల్లీగ్రాములు ఉన్నట్లు నివేదిక తేల్చింది. పోషకాలు ఎంత మేర కలుపుతారంటే.. ఒక బ్యాగుకు 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్ (ఫెర్రిక్ ఫైరోపాస్ఫేట్) కలుపుతారు. దీనికి బదులు సోడియం ఐరన్ 14 నుంచి 25.25 మిల్లీగ్రాములు కలుపుతారు. ఒక బ్యాగుకు 75 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 కోసం హైడ్రాకై ్స కో బలమైన పోషకాలు, జింక్ , విటమిన్ ఏ, థయమిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, పోషకాలు కలుపుతారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్త హీనత సమస్య ఉండదు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే బియ్యాన్ని హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో వినియోగిస్తున్నారు. బియ్యాన్ని వినియోగించాలి రేషన్ దుకాణాల్లో పంపిణీ జరుగుతున్న ఫోర్టిఫైడ్ కెర్నెల్స్ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారంగా తీసుకోవాలి. దుకాణాల్లో తీసుకున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయించకుండా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు. రక్తహీనతను అధిగమించవచ్చు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రేషన్ బియ్యాన్ని వినియోగించాలి. – డాక్టర్ నరేశ్కుమార్, వైద్యమండలి ఉమ్మడి జిల్లా సభ్యుడు -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
● జాతీయ లోక్ అదాలత్ ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్వరంగల్ లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు కృషిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిష్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులోని 10 కోర్టుల భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ బిల్డింగ్ ముందు మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలు అనే బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్లు వీబీ నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు, కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్పాండే, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు, వివిధ బ్యాంకుల అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మొదటి గేట్ నుంచి పరిపాలనాభవనం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనాభవనం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు, కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్అదాలత్ను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధి నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. కేయూ క్యాంపస్: ఐఐటీ జామ్–2026 ప్రవేశ పరీక్షకు గణిత శాస్త్రంలో ఉచిత శిక్షణ (ఆన్లైన్) అందించనున్నట్లు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత శాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారని ఆయా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఐఐటీ ఆచార్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణకు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వబోతున్నట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులు 97012 75354లో సంప్రదించాలని సూచించారు. హసన్పర్తి: అపరిశుభ్రతతోనే వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. 55వ డివిజన్ సదానంద కాలనీలో డెంగీ నియంత్రణ చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదైన బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. స్థానికంగా చేపడుతున్న ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, స్థానిక వైద్యాఽధికారి భార్గవ్, మానస, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, సబ్ యూనిట్ అధికారి ఖాదర్ అబ్బాస్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, కమలాకర్, సంతోశ్, ఏఎన్ఎంలు స్వరూప, రాణి, ప్రశాంత, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కాజీపేట: యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేశ్ అన్నారు. కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి పర్యవరణ పరిరక్షణ ఉద్యమకారుడు కె.ప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, రిటైర్డ్ అటవీశాఖ అధికారి పురుషోత్తం, హెచ్ఎం ఎం.ఫ్రాన్సిస్, ఉద్యనవన శాఖ అధికారి రమేశ్, ఎంఈఓ మనోజ్కుమార్, సుంకరి జ్వాలా ప్రశాంత్, శ్రీను, అశ్విని, నాగరాజు, వెంకటరమణ, నర్సయ్య పాల్గొన్నారు. -
న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు న్యూశాయంపేట: తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ (టీజీఈ జాక్) ప్రభుత్వానికి సమర్పించిన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ టీజీఓ భవన్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా జగన్మోహన్రావు పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై మాట్లాడిన మాటలు ఉద్యోగ లోకాన్ని బాధించినా టీజీఓ, టీఎన్జీఓతో పాటు వివిధ సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవుల్లో బి.రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీప్రియను తీసుకున్నారు. సమావేశంలో టీజీఓ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, కోశాధికారి రాజేశ్కుమార్, శ్రీనివాస్, యాకయ్య, రాజు, రాజేశ్, సదానందం, మైదం రాజు, సతీశ్కుమార్ రవీందర్రెడ్డి, సుధీర్కుమార్, హేమలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్
డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కళాఉత్సవ్ దోహదం చేస్తుందని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ను హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఈకళా ఉత్సవ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా స్థాయిలో 12 అంశాల్లో కళాఉత్సవ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 93 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు, వారిని రాష్ట్రస్థాయి కళాఉత్సవ్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం, వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
వరిలో ఉల్లికోడు.. యాజమాన్య పద్ధతులు
హన్మకొండ: వరిపంటలో ఉల్లికో డు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్స్ ఉమారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త ఎల్.కృష్ణ సూచించారు. వానా కాలంలో రాష్ట్రంలో దాదాపుగా 65.5 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉల్లికోడు ఆశించిదని వారు వివరించారు. ఉల్లికోడు లక్షణాలు.. ఉల్లికోడు తల్లి పురుగు ఆకు కొనల దగ్గర, మొవ్వు మట్టల మీద గుడ్లను విడివిడిగా, గుంపులుగా పెడుతుంది. వీటి నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి అంకురం వద్ద చేరి నష్టం కలిగిస్తాయి. అందువల్ల అంకురం లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చని పొడవాటి గొట్టంగా మార్పు చెంది బయటికి వస్తుంది. వీటినే రాగి గొట్టాలు లేదా ఉల్లి గొట్టాలుగా పి లుస్తారు. ఈ పురుగు ఆశించిన పి లక నుంచి ఎలాంటి కంకులు ఏ ర్పడవు. ఆశించిన దుబ్బులో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. యాజమాన్య పద్ధతులు.. ● సిఫారసు చేసిన సమయం లోపల నాట్లు పూర్తిచేయాలి. ● డబ్ల్యూజీఎల్–119 లాంటి తట్టుకునే రకాలు సాగుచేయాలి. ● పొలంలో, గట్లపై కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. ● లీటరు నీటికి పిఫ్రోనిల్ 5ఎస్సీ 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● ముఖ్యంగా ఆగస్టు చివరి వారం తర్వాత నాట్లు వేసిన రైతులు తప్పనిసరిగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 సీజీ గుళికలు చల్లాలి. తద్వారా ఉల్లికోడు బారినుంచి పంటను కాపాడుకోవచ్చు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్ హన్మకొండ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరవరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో హనుమకొండ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరువరంగం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీలో 200 సంఘాలుండగా.. కేవలం 15 సంఘాలకు మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్లో స్థానం కల్పించి మిగతా వాటిని విస్మరించడం.. విభజించి పాలించడం అన్నట్లుగా ఉందన్నారు. సర్వీస్ సంఘాలతో పాటు విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించాల్సి ఉండగా విస్మరించడం విచారకరమన్నారు. అనంతరం హనుమకొండ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సాంబయ్య వ్యవహరించగా.. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా ఖాజామోహినుద్దీన్ వ్యవహరించారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని వారు వివరించారు. అధ్యక్షుడిగా ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సదానందచారి, కార్యదర్శిగా కె.సంజీవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా పి.శ్రీరాములు, వి.సుజాత తదితరులున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి..
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఖానాపురం: రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన రైతు తేజావత్ శ్రీనుకు చెందిన మొక్కజొన్నకు యూరియా లభించకపోవడంతో గొర్రెలు మేయడంతో శుక్రవారం సుదర్శన్రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. డీఏఓ అనురాధతో మాట్లాడి ఏఓ శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పశువులతో పంటలను మేపొద్దని, అధికారులు వచ్చి చూసే వరకు ఆగాలని సూచించారు. యూరియా కొరతకు కారణమైన ఏఓ శ్రీనివాస్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, తప్పుడు నివేదికలు ఇస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనర్సయ్య, బంధారపు శ్రీనివాస్గౌడ్, ఆబోతు అశోక్, వెంకన్న, బాలకిషన్, గొంది నాగేశ్వర్రావు, మౌలానా, మురళి, తోట రవి, తదితరులు పాల్గొన్నారు. -
శంకర్దాదా ఎంబీబీఎస్లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ’సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు..● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● గతేడాది అక్టోబర్లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాయింట్ తనిఖీలతో ఫలితాలు నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో
ముక్కిన బియ్యాన్ని గుర్తించిన కలెక్టర్ న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మండల్ లెవల్ స్టాక్(బియ్యం) పాయింట్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితర అధికారులు పాల్గొన్నారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలిగీసుకొండ: రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీఎఫ్ఓ అనుచ్ అగర్వాల్ అన్నారు. మండలంలోని మచ్చాపూర్ నుంచి దుగ్గొండి మండలం లక్ష్మీపురం వరకు ఆర్అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటాలని చెప్పారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సృజనకుమారి, సెక్షన్ ఆఫీసర్ జగ్గయ్యనాయక్, బీట్ ఆఫీసర్ సమయనాయక్, వన సేవకులు రాజు, శ్రీకాంత్, యాకయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ సమీక్ష న్యూశాయంపేట: మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపెల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ సత్యపాల్రెడ్డి, ఖిలావరంగల్ తహాశీల్దార్ శ్రీకాంత్, ఏఓ విశ్వప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. లోక్అదాలత్ను వినియోగించుకోవాలి వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లను వినియోగించుకోవాలని వరగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్అదాలత్ను పురస్కరించుకొని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధిలోని నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు లోక్అదాలత్లకు హాజరై రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్ తెలంగాణ సంప్రదాయ పండుగల్లో ఒకటైన బొడ్డెమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు, చిన్నారులంతా కలిసి పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మ గద్దెను రూపొందించారు. పూలు, ఒడి బియ్యంతోపాటు నైవేద్యం తయారు చేసి ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా.. కోలు బిడ్డాలెందరూ..’ అంటూ పాటలు పాడుతూ.. ఆడారు. చిన్నారులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. బొడ్డెమ్మ అనంతరం పెద్దల అమావాస్యతో బతుకమ్మ పండుగ మొదలుకానుంది. – సాక్షి నెట్వర్క్ -
రైతులను గోస పెడుతున్న రేవంత్రెడ్డి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ● యూరియా కోసం రాయపర్తిలో ధర్నా ● అరెస్టు చేసిన పోలీసులురాయపర్తి: బూటకపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడంతోనే యూరి యా కొరత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా కొరతను నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీ ఎం రేవంత్రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎ క్కడా యూరియా కొరత రానివ్వలేదన్నారు. ఇప్పు డు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు ధర్నా చేస్తామనడంతో వెంటనే కాల్వల్లో నీళ్లను విడిచినట్లు తెలిపారు. ఎస్సైలు ముత్యం రాజేందర్, రాజు ఆధ్వర్యంలో దయాకర్రావును అరెస్ట్ చేసి జీపులో తరలిస్తుండగా వందల సంఖ్యలో చేరుకున్న రైతులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికి పోలీసులు దయాకర్రావును పోలీస్స్టేషన్వైపు తరలించారు. అనంతరం యూరియా కష్టాలు తీర్చాలని కార్యకర్తలు, రైతులు తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూ నావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, ఐత రాంచందర్, రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, చిన్నాల రాజబాబు, బండి రాజబాబు, బొమ్మెర వీరస్వామి పాల్గొన్నారు. -
బాలవికాస సేవలు విస్తరించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సంగెం: పరకాల నియోజకవర్గంలో బాలవికాస సంస్థ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను విస్తరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపురం, కృష్ణానగర్ గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను చైతన్యవంతులను చేయడం, వారి ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడే విషయంలో బాలవికాస ముందు నిలుస్తోందని అన్నారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ మధు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. పత్రికా స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని జిల్లా వేర్హౌజ్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించి, జిల్లా వేర్ హౌజ్కు తరలించారు. ఈ తనిఖీలో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్ పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరుమచ్చుకు కొన్ని ఘటనలు.. వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని టీజీఓ భవన్లో గురువారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీఓ, టీఎన్జీఓ, ఇతర సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలు కొంత బాధించాయని గుర్తు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం విధి విధానాల్ని రూపొందించాలని, రెండేళ్లుగా పెండింగ్లో బిల్లుల చెల్లింపులకు గ్రీన్చానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ పక్షాన ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాసకుమార్, కార్యదర్శి ప్రవీణ్కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, కేంద్ర సంఘం కార్యదర్శులు కిరణ్కుమార్, కోలా రాజేశ్కుమార్, ఆస్నాల శ్రీనివాస్, కోశాధికారి రాజేశ్కుమార్, ఉపాధ్యక్షులు అన్వర్ హుస్సేన్, మాధవి, భాగ్యలక్ష్మి, కృష్ణ్ణవేణి, మాధవరెడ్డి, రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మత్తు కట్టడికి పటిష్ట చర్యలు రేపుహన్మకొండ అర్బన్: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన నినాదాల పట్టికను డీఆర్ఓ, డీసీపీ ఆవిష్కరించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్రెడ్డి, సతీశ్బాబు, టీజీఏఎన్బీ డీఎస్పీ రమేశ్కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్, డీడబ్ల్యూఓ జయంతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ అనితారెడ్డి, డాక్టర్ ప్రహసిత్, డాక్టర్ ఆచార్య రవికుమార్ పాల్గొన్నారు.సెమినార్ వరంగల్ లీగల్: ‘యాంటీ కరప్షన్ చట్టాలు–ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్’పై నగరంలోని డీసీసీబీ భవన్లో శనివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్కు ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్, గౌరవ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్ జోనల్ ఆయమ్ ప్రముఖ్ కరూర్ మోహన్, ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలికేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు. -
మోస్తరు నుంచి భారీ వర్షం
హన్మకొండ: జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ మహానగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 9 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాల మేరకు హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన హనుమకొండ బస్స్టేషన్ ప్రాంగణం -
రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ అందజేత
న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గురువారం కలెక్టర్ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసిన కలిసిన నవీన్.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బి.సత్యనారాయణ, డాక్టర్ కందాల సత్యనారాయణ, రుద్రాణి, డాక్టర్.వి.పూర్ణచందర్ పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన జీపీఓలున్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్(జీపీఓ)లు గురువారం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సిలింగ్లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్, విజయజ్యోతి, జ్యోతి, రమేష్, శ్రావణ్, క్రాంతి, విశ్వేశ్వర్, సుభాష్ తదితరులు ఉన్నారు.గూడ్స్ షెడ్కు చేరిన యూరియాఖిలా వరంగల్: వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్కు గురువారం 2644.155 మెట్రిక్ టన్నుల సీఎఫ్ఎల్ యూరియా వచ్చింది. సీఎఫ్ఎల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి యూరియాను పరి శీలించారు. కలెక్టర్ సత్యశారద, వ్యవసాయ అ ధికారి అనురాధ ఆదేశాల ప్రకారం గూడ్స్ షెడ్ కు చేరిన యూరియాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్క్ఫెడ్కు 60 శాతం, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు 40శాతం కేటాయించారు. డిమాండ్ ఉన్న జిల్లాలు, మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాలకు వేగంగా పంపించేందుకు చర్యలు చేపట్టామని మండల ఏఓ రవీందర్రెడ్డి తెలిపారు.ఎంపీఓకు డీఎల్పీఓగా పదోన్నతిసంగెం: సంగెం ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న కొమురయ్య డీఎల్పీఓగా పదోన్నతి పొందారు. గురువారం నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్లో భాగంగా కొమురయ్యకు పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్కు పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతిపై బదిలీ అయిన కొమురయ్యకు మండల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.రేపు సెమినార్వరంగల్ లీగల్: ‘యాంటీ కరప్షన్ చట్టాలు–ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్’పై నగరంలోని డీసీసీబీ భవన్లో శనివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్, గౌర వ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబి నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్ జోనల్ ఆయ మ్ ప్రముఖ్ కరూర్ మోహన్, ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.మోస్తరు నుంచి భారీ వర్షంహన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరంలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, వరంగల్ పైడిపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 96 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
ఎఫ్పీఓలుగా పీఏసీఎస్లు
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (రైతు ఉత్పాదక సంస్థ)లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు ఉత్పత్తులకు లాభదాయక ధరలు అందించి ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడమే వీటి లక్ష్యం. రైతుల ప్రయోజనాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఎఫ్పీఓలు పనిచేస్తాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. మొదటి దశలో ఏడు సంఘాలు రైతు ఉత్పాదక సంస్థ (ఎఫ్డీఓ)లుగా ఎంపికయ్యాయి. మలిదశలో మిగతా సంఘాలు ఎంపిక చేస్తారు. కమలాపూర్, పెంచికలపేట, దామెర, పెద్దాపూర్, శాయంపేట, ధర్మసాగర్, దర్గా కాజీపేట పీఏసీఎస్లు ఎఫ్పీఓలుగా ఎంపికయ్యాయి. ఈ సంఘాలు రూ.2 వేల చొప్పున వాటాధనం తీసుకుని 750 మందిని సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ మొత్తం రూ.15 లక్షలవుతుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీఎస్) ఒక్కో సభ్యుడికి మరో రూ.2 వేల చొప్పున వాటాధనం చెల్లించడం ద్వారా రూ.15 లక్షలు గ్రాంట్గా పీఏసీఎస్లకు అందిస్తుంది. పెంచికలపేట, దర్గాకాజీపేట పీఏసీఎస్ల వాటాధనం రూ.15 లక్షలు రైతుల నుంచి సమకూర్చుకున్నాయి. మిగతా సంఘాలు సగం వరకు వాటాధనం సమకూర్చుని లక్ష్యం వైపు ముందుకు పోతున్నాయి. ఎఫ్పీఓలుగా ఎంపికై న సంఘాలకు కేంద్రం ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు రూ.18 లక్షల సహాయాన్ని అందిస్తుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక సౌకర్యాల కోసం రూ.2 కోట్ల రుణాన్ని నామ మాత్రపు రుణాన్ని అందిస్తుంది. శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సొంత భవనం పూర్తి కావొచ్చింది. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న పీఏసీఎస్లు.. రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం, ప్రాసెసింగ్, బ్రాండింగ్ చేయడం ద్వారా రైతు ఉత్పత్తులకు లాభదాయం ధర సాధించడం, వ్యవస్థాపక సౌకర్యం కల్పించడం ఎఫ్పీఓల విధి. గోడౌన్, డ్రైయాడ్, డ్రైహెడ్స్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎఫ్పీఓలు రైతులు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తాయి. ఆరోగ్య రక్షణ కల్పించి రైతులను ప్రాణదాతలుగా తీర్చిదిద్దుతాయి. ఎఫ్పీఓల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ సేవలు, జన ఔషధి, కర్షక్ వికాస్ సెంటర్ల నిర్వహణ, ఎరువుల విక్రయాలు చేపడతాయి. తద్వారా ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. ఇప్పటి వరకు కేవలం రైతులకు రుణాలివ్వడం, వసూళ్లకు పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. ప్రస్తుతం ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఎఫ్పీఓలుగా పీఏసీఎస్లు బలోపేతం.. ఎఫ్పీఓల ఏర్పాటు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయి. వ్యాపారాల విస్తరణ, రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆదాయం పెంచుకోవడం ద్వారా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయి. ఎఫ్పీఓల ద్వారా రైతులకు, ప్రజలకు సేవలు చేరువవడంతో పాటు సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తాయి. – బి.సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి జిల్లాలో 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎంపిక రైతుల ఆదాయం పెంపే లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వం సాయం -
ఫిర్యాదుల పెట్టె.. ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎం ఆస్పత్రిలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్స్లుఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు వరంగల్ కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యుల్లో, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్ను పది రోజులకోసారి తెరుస్తూ కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. వేటు.. మెమోలు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కిశోర్ను ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్నీ సత్ఫలితాలు ఉంటాయని రోగులు వేడుకుంటున్నారు. నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ విభాగంతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వినతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నాలు -
కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య న్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపా రు. ఇప్పటి వరకు వారికి పట్టాలు ఇవ్వలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు కిరాయి ఇళ్లలో ఉండలేక గుడిసెలు వేసుకుని జీవనం గడుపుతున్నారని తెలిపారు. జిల్లా కమిటీ నాయకులు బాబు, నలిగంటి రత్నమాల మాట్లాడుతూ.. హామీల అమలుకు కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్లో పేదలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం సీపీఎం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు. -
రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఆర్డీఓ రాంరెడ్డి రాయపర్తి: మండలంలో ఏర్పాటుచేసే రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలని డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ఐకేపీ సెర్ప్ కార్యక్రమాలను పరిశీలించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేయబోయే పెట్రోల్బంక్ స్థలం, రూరల్మార్ట్, మొరిపిరాలలో సోలార్ ప్రాజెక్ట్కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలుసూచనలు చేశారు. రెండు గ్రామైఖ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్రాజెక్ట్ ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఉంటుందని మండలంలోని గ్రామాలకు విద్యు త్ అందించనున్నట్లు వివరించారు. మండల సమాఖ్య ద్వారా బ్యాంక్ లింకేజీలు, శ్రీనిధి రుణాలు, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, డీపీఎం దాసు, అనిల్, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, యాదగిరి, సమ్మ య్య, పావని, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, కార్యదర్శి రేష్మ, వీఓఏ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
కష్టం తీరేదెన్నడు..?
ఖానాపురం: రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడంలేదు.. రాత్రి, పగలు తేడా లేకుండా బారులుదీరినా.. బస్తా యూరియా దొరికే పరిస్థితిలేదు. కుటుంబమంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల మంది రైతులు ఉండగా.. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయలతో పాటు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా 3.10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుండగా.. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 1,80,000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర పంటల సాగు చేస్తున్నారు రైతులు. ఈ పంటలకు అక్టోబర్ నాటికి 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. ఇందులో ఆగస్టు వరకు 28,500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 24,509 మె.ట యూరియా మాత్రమే వచ్చింది. దీంతో రైతులు తమపంటను ఎలా కాపాడుకోవాలని ఆందోళనలో ఉన్నారు. రైతులను నానో యూరియా వైపు మళ్లించేందుకు వ్యవసాయ అధికారులు ప్రయత్నించినా రైతులు ఆసక్తి చూపుడంలేదు. ఒక్కో బస్తా పంపిణీ.. వరి సాగు చేస్తున్న రైతులు రెండు నుంచి మూడు దఫాలుగా యూరియాను వినియోగిస్తుంటారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేస్తుండడంతో ఎన్నిరోజులు క్యూలో నిలబడాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళితే యూరియా బస్తాతోపాటు ఇతర మందులను అంటగడుతుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో యూరియా పంపిణీ చేసినా రైతులు అర్ధరాత్రి నుంచే బారులుదీరుతున్నారు. రోడ్డుపైన వంటావార్పు ఖానాపురం, అశోక్నగర్కు యూరియా వస్తుందని రైతులు సొసైటీల వద్ద బుధవారం రాత్రి నుంచి బారులుదీరారు. గురువారం యూరియా రావడంలేదని తెలుసుకోని ఖానాపురం, అశోక్నగర్లో రా స్తారోకోకు దిగారు. అశోక్నగర్లో మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, లింగమూర్తి, సీపీఎం నాయకులు సా యిలు, రాము రైతులతో కలిసి రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. ఎస్సై రఘుపతి యూరియా వస్తుందని హామీ ఇవ్వడంతో విరమించారు. తెల్లవారుజామునుంచే క్యూ.. నల్లబెల్లి: శనిగరం రైతు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి రజిత టోకెన్లు పంపిణీ చేశారు. పొద్దున్నే వచ్చి.. నెక్కొండ: మండలంలోని సూరిపల్లి, బంజరుపల్లి గ్రామాలకు యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం పొద్దున్నే బారులుదీరారు. సూరిపల్లికి 400 బస్తాలు రాగా 700 మంది, బంజరుపల్లికి 100 బస్తాలురాగా.. 250 మంది యూరియా కోసం ఎగబడ్డారు. గందరగోళం మధ్య రైతుకు ఒకటి చొప్పున యూరియా బస్తాలు అందించారు. అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు అరకొర సరఫరాతో ఆందోళనలో రైతులు అక్టోబర్ నాటికి 37 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఆగస్టు వరకు వచ్చింది 24,509 మెట్రిక్ టన్నులు మాత్రమే.. ఏడు బస్తాలే వచ్చాయి వేపచెట్టుతండాలో ఏడు ఎకరాల పోడు భూమి ఉంది. పట్టా లేదు. ఇందులో పత్తి, మొక్కజొన్న వేశాను. ఖానాపురం శివారులో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో వరి సాగు చేశా. ఇప్పటి వరకు కేవలం ఏడు బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. ఎప్పుడు క్యూలో నిల్చున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు క్యూలో నిల్చోని బస్తాలు తీసుకోవాలో తెలియడంలేదు. – గుగులోతు మమత, వేపచెట్టుతండాగతంకంటే ఎక్కువ ఇచ్చాంజిల్లాలో యూరియా ఎప్పటికప్పుడు అందజేస్తున్నం. గతంలో కంటే ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అధికంగా ఇచ్చాం. ప్రస్తుతం ఇండెంట్లు కూడా పెట్టాం. ప్రస్తుతం మన జిల్లాకు యూరియా ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. పత్తి పంటలకు రైతులు పైపాటుగా నానో యూరియాను వాడుకోవాలి. రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. – అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
ఫిర్యాదుల పెట్టె.. ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్సుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యులు, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వేటు.. మెమోలు కలెక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని సూపరింటెండెంట్ కిశోర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని బాక్స్లు ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్ని సత్ఫలితాలు ఉంటాయని రోగులు కోరుకుంటున్నారు. ఎంజీఎంలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్సులు నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలకు కలెక్టర్ వినూత్న ప్రయత్నాలువినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతోపాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్ను పది రోజులకోసారి తెరుస్తూ చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. -
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● జంక్షన్ల సుందరీకరణ పనుల పరిశీలన ఎల్కతుర్తి: పీవీ విజ్ఞాన కేంద్రం పనుల్ని త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమదేవరపల్లి మండలం వంగరలో చేపట్టిన పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఆమె పరిశీలించారు. విజ్ఞాన కేంద్రంలోని ఆడిటోరియం, సైన్స్ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్ ఉండగా.. వాటిని పరిశీలించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ముల్కనూరులోని జాతీయ రహదారి పనులు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్డు డివైడర్ పనుల్ని త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముందుగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్లు రాజేశ్, ప్రసాద్రావు, ఎంపీడీఓలు వీరేశం, విజయ్కుమార్, పర్యాటక శాఖ ఏటీఓ సూర్యకిరణ్, డి.ధన్రాజ్, తదితర శాఖల అధికారులు ఉన్నారు. -
ఆన్లైన్ వేధింపులపై అవగాహన ఉండాలి
సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ హన్మకొండ: సైబర్ నేరాలు, ఆన్లైన్ లైంగిక వేధింపులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో వనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టర్ నిర్మల ఆధ్యక్షతన సైబర్ క్రైం, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా ఉంటారన్నారు. మహిళలను, పిల్లలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ 100, 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ, వనం మహిళా సంఘం రీజియన్ ప్రెసిడెంట్ రుమాల్డిన, ట్రెజరర్ రిజి అబ్రహం, కౌన్సిలర్ అన్నమేరి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, వనం మహిళా సంఘం అధ్యక్షురాలు మేరీ పాల్గొన్నారు. -
కొండపర్తిలో రైతుల ఆగ్రహం
నానో యూరియాతో లింక్ పెట్టొద్దని నిరసన ఐనవోలు: యూరియా పంపిణీకి నానో యూరియాతో లింక్ పెట్టొద్దని మండలంలోని కొండపర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని కొండపర్తిలో దర్గా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొండపర్తి, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో రైతులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులుదీరారు. మూడు గ్రామాల రైతులతో పాటు మరికొంత మంది అక్కడికి చేరుకున్నారు. 20 టన్నుల యూరియా 440 బస్తాలు కేంద్రంలో ఉండగా.. రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇవ్వడం మొదలుపెట్టారు. నిర్వాహకులు ఒక బస్తా యూరియాకు.. రూ.200 విలువైన అర లీటర్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని లింక్ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నానో యూరియా బాటిల్ తీసుకోని వారికి యూరియా ఇవ్వమని చెప్పడంతో రైతులు నానోబాటిళ్లను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీని నిలిపేసి సొసైటీ నిర్వాహకులకు, ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏడీఏ ఆదిరెడ్డి, సీఐ రాజగోపాల్, ఎస్సై పస్తం శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులతో మాట్లాడి చివరికి నానో యూరియా లిక్విడ్ బాటిల్ లేకుండా రైతులకు టోకెన్లు అందించి రాత్రి 8 గంటల వరకు యూరియాను పంపిణీ చేశారు. -
ఎంతకీ ఎదగదు!
సాక్షి ప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వానాకాలంలో పంటలు వేసిన మెజారిటీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో యూరియా అందకపోవడంతో మొక్కజొన్న కంకులు ఎదగడం లేదు. పత్తి చేలల్లో పూత కన్పించడం లేదు. వరి ఎర్రబారిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం తప్పదని, పెట్టుబడి సైతం దక్కకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల ఎదుగుదల సమయంలో యూరియా కొరత దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా పంటల ఎదుగుదల నుంచి దిగుబడి వరకు అన్నింటిపై యూరియా కొరత ప్రభావం ఉంటుందని చెబుతుండటం గమనార్హం. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి వానాకాలం ఆరంభం నుంచే మొదలైన యూరియా కొరత.. ఇప్పుడు ప్రధాన పంటలైన పత్తి, వరి, మొక్కజొన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి నెట్వర్క్’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, మహబూబ్నగర్, అదిలాబాద్ తదితర జిల్లాల్లో రైతులు ఎదుగూ బొదుగు లేని పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఆకుపచ్చగా ఉండాల్సిన పంటలు ఎర్రబారి, పసుపుపచ్చగా కన్పిస్తున్నాయి. యూరియా సరైన సమయంలో అంది ఉంటే.. పంటలు పచ్చగా ఉండి ఏపుగా పెరిగేవని రైతులు అంటున్నారు. కానీ సకాలంలో వేయకపోవడంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయని, వరి పైరులో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదని, పచ్చదనం కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మున్ముందు చీడపీడలు సైతం ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని రైతులతో పాటు అధికారులుచెబుతున్నారు. వరి.. ఎదిగితే ఒట్టు!సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు ఇస్తారిగల్ల ఆశోక్ 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. ఆగస్టు 8న వరి నాట్లు వేయగా అప్పటి నుంచి యూరియా లభించక పోవడంతో చల్లలేదు. దీంతో ఈ సమయానికి ఏపుగా పెరగాల్సిన వరి.. నాట్లు వేసినప్పుడు 8 అంగుళాల ఎత్తు ఉండగా.. నెల రోజుల తర్వాత కూడా అదే విధంగా ఉంది. ఎదుగు లేదు.. బొదుగు లేదు. యూరియా కోసం 10 సార్లు క్యూలో నిల్చున్నా దొరకలేదు. దీంతోరూ. 950 చొప్పున 13 అమ్మోనియా బస్తాలు కొని చల్లినట్టు చెప్పాడు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టానని.. మొత్తం నష్టపోయే పరిస్థితి ఉందని వాపోతున్నాడు. పత్తి చేను దున్నేస్తా.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు ఇడంపాక స్వామికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. పంట ఎదుగుదల సమయంలో సరిపడా యూరియా దొరకడం లేదు. యూరియా కోసం నెక్కొండ.. రెడ్లవాడ పీఏసీఎస్ల వద్ద వెళ్లినా దొరకలేదు. మరో వారం రోజులు చూసి పత్తి చేను దున్ని మొక్కజొన్న సాగు చేస్తానని అంటున్నాడు. ఇప్పటివరకు ఎకరా పత్తికి రూ.20 వేల చొప్పున చేసిన రూ.40 వేలు ఖర్చు వృధా అయినట్టేనని వాపోతున్నాడు. మూడు పంటలకు ఒక్క బస్తా దొరికింది నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఒకఎకరంలో వరి, ఒక ఎకరంలో పత్తి, మరోఎకరంలో మిరప వేశా. వీటికి అవసరమైన యూరియా కోసం 15 రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగా. కేవలం ఒకే ఒక బస్తా యూరియా దొరికింది. దీంతో వరి పంటఎదుగుదల లేక గిడస బారింది. మిరప పంట వేసి 40 రోజులైంది. ఇప్పటికి కనీసం రెండు అడుగుల ఎత్తు ఎదగాలి. కానీ ఒక్క అడుగు కూడా ఎదగలేదు. – పులిచింత మల్లేష్ , రైతు,దేవబండ గ్రామం, అయిజ, జోగుళాంబ గద్వాల పంటలకు అన్నివిధాలా మేలు చేస్తుంది యూరియా అనేది పంటలకు నత్రజనిని అందించే ఎరువు. అన్ని రకాల నేలలకు, వివిధ పంటలకు ఇది అనుకూలంగా ఉంటుంది. త్వరగా నీటిలో కరిగిపోతుంది కాబట్టి మొక్కలకు నత్రజని వేగంగా అందుతుంది. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో పిలకలు ఏర్పడతాయి. మొక్కలు, కాండాలు బలంగా, వేగంగా పెరుగుతాయి. తద్వారా పంటలు దృఢంగా ఉంటాయి. అలాగే మొక్కలు ఆకుపచ్చగా మారేందుకు, వాటి ఎదుగుదలకు యూరియా ఉపకరిస్తుంది. వెన్నులు బాగా రావడానికి సహాయ పడుతుంది. వీటన్నిటి వల్ల అధిక దిగుబడి వస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా యూరియా వినియోగానికి మొగ్గు చూపుతారు. – డాక్టర్ అనిల్కుమార్,భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దిగుబడిపై తీవ్ర ప్రభావం తొలి దశలో యూరియా కొరత వల్ల వరి సాధారణ దిగుబడితో పోల్చితే 25–35 శాతం తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. కాగా ఈ కొరత ఇలాగే కొనసాగితే మరో 10 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ‘వానాకాలంలో సీజన్లో వరికి సాధారణంగా మూడు దఫాల్లో యూరియా చల్లుతాం.. ఇప్పటికి ఒక్కసారే వేశాం. కొద్దిమంది ఇప్పుడిప్పుడే రెండుసార్తు వేస్తున్నారు. కానీ మెజార్టీగా రైతులకు యూరియా పాట్లు తప్పడం లేదు..’ అని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల పేటకు చెందిన రైతు యాళ్ల సుధాకర్రెడ్డి చెప్పారు. వరినాట్లు వేసిన 20–25 రోజుల్లో ఒకసారి, 45 రోజుల్లో రెండోసారి, 65–70 రోజుల్లో మూడోసారి యూరియా చల్లాల్సి ఉండగా.. గత రెండు మాసాలుగా యూరియాకు తీవ్ర కొరత నెలకొందని రైతులు చెబుతున్నారు. -
విషాదం.. స్కూల్లో ఆడుతూ కుప్పకూలిన టెన్త్ విద్యార్థి
సాక్షి, హనుమకొండ జిల్లా: హనుమకొండ నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కిందపడి టెన్త్ విద్యార్థి జయంత్వర్ధన్(15) మృతి చెందాడు. రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం స్పోర్ట్స్ ఆడుతుండగా అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.కొట్టి చంపేశారని అనుమానం ఉందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బారులుదీరారు.. వెనుదిరిగారు..
ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. రోజంతా క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా దొరకని పరిస్థితులను చూశాం.. అయితే రాత్రంతా వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది మండలంలోని బుధరావుపేటలో.. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుధరావుపేట గ్రామానికి యూరియా వస్తుందని గ్రామంలోని రైతులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి 1.30 గంటలకు రైతులు గ్రామ పంచాయతీ వద్దకు పరుగులు పెట్టారు.. ఆ నోటా.. ఈ నోటా.. ఈ విషయం రైతులందరికీ చేరడంతో భారీగా తరలివచ్చారు. ఆధార్, పంట ఆరోగ్య కార్డులను సీరియల్ ప్రకారం పెట్టి.. గ్రామపంచాయతీ వద్ద వేచిఉన్నారు. కానీ తెల్లవా రుజాము 2 అయినా అక్కడకు అధికారులు రాలే దు.. బస్తాలు పంపిణీ చేయలేదు. సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో ప్రభుత్వాన్ని నిందిస్తూ రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. తెల్లవారుజాము నుంచే.. గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద బుధవారం ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఊకల్, మనుగొండ, మచ్చాపూర్ గ్రామాలకు కోటా కింద 444 బస్తాల యూరియా రాగా సుమారు వెయ్యి మంది రైతులు వచ్చారు. బస్తాల కోసం వేచి చూసినా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఏఓ హరిప్రసాద్బాబు, ఏఈఓలు టోకెన్లు పంపిణీ చేయగా గొడవలు జరగకుండా ఎస్సైలు కుమార్, రోహిత్ బందోబస్త్ నిర్వహించారు. యూరియా కోసం రాత్రి రెండుగంటలకు రైతుల క్యూ -
ధరలు తగ్గాయ్..
ఖిలా వరంగల్: రేషన్ దుకాణాల ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం అందించడంతో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు దిగొస్తున్నాయి. దీంతో కార్డులేనివారికి ఊర ట లభిస్తోంది. జూన్లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలల కోటా సన్న బియ్యం పంపిణీ చేయడంతో అందరి ఇళ్లల్లో బియ్యం నిల్వలు పెరిగాయి. దీంతోపాటు సెప్టెంబర్ నెల కోటా సన్నబియ్యం సైతం లబ్ధిదారులు అందరూ తీసుకోవడంతో ఒక్కసారిగా బహిరంగ మార్కెట్లో అమ్మకాలు పడిపోతున్నాయి. కొనేందుకు వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలోనే క్వింటా ధర రకాన్నిబట్టి దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గడం గమనార్హం. అందుబాటు ధరల్లో.. ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడంతో కార్డులులేని పేదలకు మార్కెట్లో సన్నబియ్యం ధరలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 2,66,429 లబ్ధిదారులకు 50,14,531 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన కార్డులకు అనుగుణంగా సెప్టెంబర్ నెలలో జిల్లాకు 53,82,518 టన్నుల బియ్యం రాగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రతిఇంటికీ సన్న బియ్యం చేరుతున్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డులు లేని కుటుంబాలు 1.50లక్షల వరకు ఉన్నట్లు అంచనా.. వీరు మాత్రం మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారుల వద్ద డిమాండ్కు మించి సన్నబియ్యం నిల్వలు ఉండడంతో ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. నాణ్యతపై వ్యాపారుల దృష్టి .. మార్కెట్లో బియ్యం ధరలు తగ్గడంతో వ్యాపారులు నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చౌక బియ్యంలో 20 శాతం వరకు నూకలు, వ్యర్థాలు ఉంటున్నాయి. దీంతో వ్యాపారులు పూర్తిగా నూక, పొట్టు, దుమ్ము లేని బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలను ఆకర్శించేలా బియ్యం నిల్వలు ఉంచుతున్నారు. షాపుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు ధరలు తగ్గించడం వల్ల ఇటీవల కొంత మేరకు వ్యాపారం మెరుగుపడింది. మార్కెట్లో సన్నబియ్యం బస్తాలు 5,800 5,000 5,0004,400 5,200 4,9004,800 4,400రకం5,000 4,900 విజయమసూరిజైశ్రీరాంఆర్ఎన్ఆర్హెచ్ఎంటీ సోనా మసూరి రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం నాణ్యతపై వ్యాపారుల దృష్టి -
బాల్యవివాహాల నిర్మూలనకు కృషి
ఖానాపురం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉమ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం బాలల సంరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మికుల అక్రమ దత్తత, బిక్షాటన నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడంలో కమిటీలు ముందుండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సుజాత, ఏపీఓ సునీత, ఎంఈఓ శ్రీదేవి, హౌసింగ్ ఏఈ నవీన, డాక్టర్ సునీత, ఏపీఎం ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు నర్సంపేట రూరల్ : ఒకరు మృతిచెందిన కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లికి చెందిన కత్తి సారంగం దంపతులు ఈనెల 4న గొడవపడుతుండగా.. సారంగం తల్లి కత్తి సూరమ్మ (65) అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ, పక్కనే ఉన్న సారంగం బామ్మర్ధి బర్ల అశోక్ తన అక్క శ్రీమేథను తిడుతున్నారని సూరమ్మ ఛాతి, క డుపులో కొట్టడంతో పడిపోగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన సూరమ్మ బుధవారం ఉదయం ముఖం కడ్డుకొ ని లేచి నిలబడి కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అ ప్పటికే సూరమ్మ మృతిచెందినట్లు నిర్ధారించా రు. దీంతో శ్రీమేథ, అశోక్ ఇద్దరు కొట్టిన దెబ్బ లతోనే తనతల్లి చనిపోయిందని సూరమ్మ కూ తురు రమ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇంటర్లో అడ్మిషన్లకు మరో అవకాశం విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులుపాటు(11, 12 తేదీల్లో) అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్ మీటింగ్లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన తెలిపా రు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురుల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలిఖానాపురం: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోఆర్డ్డినేటర్(జీఈసీఓ) ఫ్లోరెన్స్ అన్నారు. మండలంలోని అశోక్నగర్లో కేజీబీ వీని బుధవారం డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీటీడీఓ) సౌజన్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికా ర్డులు, స్టోర్రూం, విద్యార్థులకు అందజేసే మెనూ, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధ న అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థినులపై నిర్లక్ష్యం చేస్తే ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. మె నూ ప్రకారం భోజనం పెట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ మేనక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని, సంఘాల్లో రుణా లు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు. డీపీఎం దాసు, సుధాకర్, రాజు, సారయ్య, మమత, స్వప్న, మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
భోజనం రుచికరంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి గీసుకొండ: మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ను బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటలను రుచిచూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత, రుచికరంగా ఉండేలా వంటలను తయారు చేయాలని ఆదేశించారు. వంటగది శుభ్రత పాటించాలన్నారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపాల్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఇబ్బందిలేకుండా నీరందించాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట : కాల్వ పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టి గ్రామస్తులకు, రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా కొనసాగించాలని వర్ధన్నపేట ఎమ్మె ల్యే నాగరాజు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని బండౌతాపురం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన కట్టకాల్వను అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కొనారెడ్డి చెరువును నింపి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని, వర్ధన్నపేట – కొనారెడ్డి చెరువుకి వచ్చే కట్టకాల్వకు శాశ్వత మరమ్మతులు చేపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చెరువులపై కమీషన్లు దండుకుందేతప్పా చెరువులను పునరుద్ధ రించలేదని ఆరోపించారు. కట్టకాల్వ తెగిన ప్రదేశాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపించి బండౌతాపురం గ్రామ రైతులకు సైతం పొలాల వద్దకు వెళ్లేందుకు బ్రిడ్జి మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూరి యా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందని, సీఎం రేవంత్రెడ్డి సరైన సమయంలో స్పందించి యూరియాను రైతులకు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎస్ఈ గౌతమ్రెడ్డి సంగెం: ప్రజలకు నిరంతర విద్యుత్ అందించే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తోందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ వరంగల్ ఎస్ఈ గౌతమ్రెడ్డి అన్నారు. నల్లబెల్లి 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో నూతనంగా 11 కేవీ నార్లవాయి ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరాను ప్రారంభించిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. టెక్నికల్ డీఈ ఆనంద్ మాట్లాడుతూ.. ఫీల్డ్ సిబ్బంది తప్పనిసరిగా ఎర్త్ రీచార్జి రాడ్, సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ ధరించి సేవలు అందించాలన్నారు. సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాపులకనపర్తి ఏడీఈ రవికుమార్, సంగెం సెక్షన్ ఏఈ మధుసూదన్, సబ్ ఇంజనీర్ రాజేశ్కుమార్, ఎల్ఈ చంద్రమౌళి, ఎల్ఐ పాషా, ఎల్ఎం బాబూరావు, ఏఎల్ఎంలు రాజ్కుమార్, కాశీరాం, శ్రీను, కాంట్రాక్టర్ సంపత్రావు, ఆన్మెన్స్ కొంరెల్లి, సుదన్, సుమన్, భాస్కర్, సురేశ్, ఆపరేటర్లు భిక్షపతి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి వరంగల్లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
చెరువులు.. నిండుకుండలు
నర్సంపేట: ధాన్యాగార కేంద్రంగా పేరొందిన వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఈసీజన్లో రుతుపవనాలు ఆలస్యమైనప్పటికీ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలాచెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన చెరువు పాకాలతోపాటు కుంటలు, పెద్ద చెరువులు మత్తళ్లు పోస్తుండగా 294 చెరువులు వంద శాతం నిండాయి. జిల్లాలో 816చెరువులు ఉండగా అన్ని చెరువుల్లో జలకళ నెలకొంది. జిల్లాలో ఈ సీజన్లో 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తుండగా.. ఖరీఫ్ పంటలతోపాటు రబీ సీజల్లో సాగు చేసే పంటలకు సైతం సాగునీరు అందనుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకాల పరవళ్లు జిల్లాలో సాగు నీటిపరంగా పాకాల సరస్సుకు ప్రాధాన్యం ఉంది. మూడు టీఎంసీల కెపాసిటీ కలిగిన పాకాల సరస్సు 30 ఫీట్లకు చేరుకొని 15రోజులుగా మత్తడి పోస్తోంది. జిల్లాలో వరి పంట లక్షా 27వేల 950ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుండగా పాకాల సరస్సు కింద అధికారికంగా 30వేల ఎకరాలతోపాటు అనధికారికంగా మరో 20వేల ఎకరాలు సాగు అవుతోంది.మత్తడి పోస్తున్న పాకాల సరస్సుజిల్లాలో జలకళ సంతరించుకున్న చెరువుల వివరాలు..మండలం చెరువులు 0–25% 25–50 50–75 75–100 మత్తళ్లు గీసుగొండ 76 0 0 0 74 2 సంగెం 73 0 0 23 48 2 పర్వతగిరి 64 0 0 0 38 26 వర్ధన్నపేట 68 0 7 15 26 20 ఖిలా వరంగల్ 48 0 0 0 03 45 రాయపర్తి 96 0 3 42 51 0 దుగ్గొండి 71 0 0 9 52 10 నల్లబెల్లి 82 0 0 0 56 26 నర్సంపేట 70 0 0 0 50 26 ఖానాపురం 23 0 0 0 23 0 నెక్కొండ 80 0 0 11 20 49 చెన్నారావుపేట 45 0 0 0 25 20 వరంగల్ 20 3 0 0 11 6 జలకళ సంతరించుకున్న జలాశయాలు జిల్లాలో 816 చెరువులు రెండు పంటలకు ఢోకా లేదంటున్న అన్నదాతలు -
ఆదర్శం ఐలమ్మ పోరాటం
కాజీపేట అర్బన్: చాకలి ఐలమ్మ పోరాటాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీశ్, సత్యశారద అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా న్యూశాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ మామిండ్ల రాజు, కుల సంఘాల నాయకులు బస్వరాజు కుమార్, చీకటి శారద, ఆనంద్, మధుచందర్, చిట్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: పరిశోధకులు, అధ్యాపకులకు డిజిటల్ శిక్షణ ఎంతో ఉపయోగమని కాకతీయ యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయం మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణి అన్నారు. కేయూ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం డేటాబేస్ ఉపయోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఐఈఈఈ వెబ్సైట్లో ఉన్న దాదాపు ఆరు మిలియన్ల శాసీ్త్రయ పత్రాలు, జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ వంటి విలువైన సమాచారం పరిశోధన అవసరాలకు లభిస్తుందని తెలిపారు. డేటాబేస్ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఆచార్యులు పి.మల్లారెడ్డి, జె.కృష్ణవేణి, కె.భిక్షాలు, ఆర్.భారవిశర్మ, ఎల్పీ రాజ్కుమార్, సుమలత, రాధిక, షాయోదా, ఇజాక్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ బస్సుల కేటాయింపు విధానంలో మార్పు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రచారి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్–1 డిపో వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల కోసం ప్రైవేట్ యజమానులకు ఇస్తున్న సబ్సిడీలు, నిధులు, వయాబిలిటీ గ్యాప్ ఫండ్లను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఆర్టీసీ పరిరక్షణ దినం పాటించాలని పిలుపునిచ్చారు. విద్యారణ్యపురి: జిల్లాస్థాయికి ఎంపికై న పాఠశాలల విద్యార్థులకు ఈనెల 12న కళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో నిర్వహించే కళా ఉత్సవ్కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఓకల్ మ్యూజిక్, సోలో, క్లాసికల్, లైట్ మ్యూజిక్, గ్రూప్ ఇన్స్ట్రుమెంటల్, విండ్ మెలోడీ, క్లాసికల్ డ్యాన్స్, జానపద గిరిజన కాన్టెంపరరీ కొరియోగ్రఫీ, రోల్ప్లే, మిమిక్రీ, మైమ్, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర పోటీల్లో ప్రథమ బహుమతులు పొందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని డీఈఓ పేర్కొన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లకు ఈనెల 11, 12 తేదీల్లో అవకాశం కల్పించినట్లు వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్ మీటింగ్లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు. -
ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తాం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రన్నింగ్ టెస్ట్తో పాటు శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్, విద్యార్హతల ధ్రువ పత్రాలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాళ్సింగ్, సుభాష్, వీవీ నాయుడు, వినోద్కుమార్ శర్మ, మనీశ్కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, డీవైఎస్ఓ అశోక్ కుమార్, ఏసీపీ నరసింహారావు, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్రావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ వేదికవ్వనున్న జేఎన్ఎస్ నవంబర్ 10 నుంచి నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతోసమావేశం -
‘అబాస్’ హాజరు విధానాన్ని రద్దు చేయాలి
ఎంజీఎం: క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బందికి అబాస్ (బయో మెట్రిక్ హాజరు) విధానాన్ని రద్దు చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది జిల్లా జేఏసీ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్కో పీహెచ్సీ పరిధిలో 4 నుంచి 13 ఉపకేంద్రాలు ఉన్నాయని, వాటిలో పీహెచ్సీకి వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకొని ఫీల్డ్కు వెళ్లాలంటే కనీసం 10 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. 24 గంటలు అత్యవసర సేవల్లో ఉండే క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని పీహెచ్సీ కార్యాలయంలోని సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బందితో జతకట్టి చూడొద్దని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరాయంగా సమయపాలన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి సిబ్బందికి అబాస్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నెహ్రూచంద్నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరం మధుసూదన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు తోకల మాధవరెడ్డి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నాయకులు కత్తి రవీందర్, కె.రమేశ్, జ్యోతి, సులోచన, ప్రసన్నకుమారి, శ్రీకాంత్, రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల ధర్నా
పరకాల: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పీఏసీఎస్లు, రైతు వేదికల ఎదుట బారులుదీరుతున్నారు. క్యూలో నిల్చున్న వారందరికీ యూరియా దొరకడం లేదు. రెండు రోజుల క్రితం మాదారం పీఏసీఎస్కు 440 బస్తాల యూరియా వచ్చింది. కొంతమంది రైతులకు పంపిణీ చేసి మిగిలిన వారికి అధికారులు టోకెన్లు ఇచ్చారు. మరుసటి రోజు ఇస్తామని చెప్పడంతో బుధవారం రైతులు పరకాల వ్యవసాయ మార్కెట్కు చేరుకున్నారు. నాగారం, పైడిపల్లి రైతులకు పంపిణీ చేశారు. టోకెన్లు ఇచ్చిన నడికూడ మండల రైతులకు గురువారం యూరియా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి వ్యవసాయ మార్కెట్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. యూరియా కావాలని, ప్రభుత్వం నిరక్ష్యం వీడాలని నినాదాలు చేశారు. గంటపాటు రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాల రాకపోకలు -
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్లో భాగంగా లబ్ధిదారులకు సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నగర మేయర్గుండు సుధారాణి టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ పురోగతిపై టౌన్ప్లానింగ్ అధికారులతో బుధవారం మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 31 వేల దరఖాస్తులు స్వీకరించగా.. అందులో 50 శాతం దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్లాట్ను శుభ్రం చేసుకోవాలని దరఖాస్తుదారుడికి టౌన్ప్లానింగ్ అధికారులు ఫోన్లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, ఏసీపీలు ఖలీల్, శ్రీనివాస్రెడ్డి, టీపీఎస్లు, టీపీ బీఓలు తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కిరాని టెండర్లు
హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల్లో జూన్, జూలై మాసాల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంతవరకూ అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి చేప పిల్లలను అందిస్తే నేటికీ చేప ఎదిగి కనీసం పావుకిలో ఉండేదని, ఇప్పుడు చెరువుల్లో వదిలితే అవి ఎప్పుడు ఎదుగుతాయని మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 813 చెరువులు.. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నాయి. గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మెరిగ జాతి చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. జిల్లాలో పెద్ద చెరువులుగా గుర్తింపు గల ధర్మసాగర్, కమలాపూర్, నాగారం చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేపపిల్లలు, మిగిలిన చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేపసీడ్ వేయాలని అధికారికంగా నిర్ణయించారు. గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు సుమారు రూ.367 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. 175 మత్స్య సొసైటీలు.. 15 వేల మంది సభ్యులు హనుమకొండ జిల్లాలో మొత్తం 175 సొసైటీలు ఉండగా అందులో 46 మహిళా సొసైటీలు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారికంగా చెబుతోంది. సొసైటీల్లో సుమారు 15 వేల మంది సభ్యులుగా ఉన్నారు. సొంతంగా కొనుగోలు చేసి.. మత్స్యశాఖ అధికారులపై నమ్మకం లేని పలు మత్స్య సొసైటీలు ఇప్పటికే వారి పరిధిలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే జిల్లాలోని పలువురు సొసైటీ సభ్యులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో 200 గ్రాముల మేర చేప ఎదిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉచిత చేప పిల్లల్లో నాణ్యత ఎంత? ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో నాణ్యతపై మత్స్యకారులు ఏటా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చేప పిల్లల కనీస సైజు 35 నుంచి 40 ఎంఎం ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ అమలులో ఎక్కడా కనిపించడం లేదని మత్స్యకారులు బహిరంగంగానే వాపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించాం.. జిల్లాలోని 813 చెరువుల్లో 220.55 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించాం. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు, హనుమకొండ జిల్లా నుంచి ఒక్కరు టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. – నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండఉచిత చేప పిల్లల పంపిణీలో అలసత్వం చెరువుల్లో ఇప్పుడు వదిలితే ఎదుగుదల అంతంతే అధికారుల తీరుపై మత్స్యకారుల అసహనం -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
‘ఉద్యాన’ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పండ్లు, కూరగాయల సాగు, వాటి అమ్మకాలు, పట్టుపరిశ్రమ, తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నారన్నారు. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా జిల్లాలోనే పండ్లు, కూరగాయలు సాగయ్యే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత భూమి లీజుకు తీసుకొని పట్టు సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపైనే కాకుండా పండ్లు, కూరగాయల మార్కెటింగ్ చేయడంపై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మహిళా సమాఖ్యలు లాభాల బాటలో సాగాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి అనసూయ, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మూడువేలకు పైగా ఔట్సోర్సింగ్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. చెత్త సేకరణకు బల్దియాకు చెందిన 250 స్వచ్ఛఆటోలు, 152 ఓనర్ కమ్ డ్రైవర్ ఆటోలు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. వాటికి రోజు డీజిల్ కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే 150 ఆటోలు కూడా తిరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకఎక్కడ చూసినా చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణలో చిత్తశుద్ధి కరువు రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం మరమ్మతు కొస్తే వారం, పది రోజుల వరకు చెత్త సేకరించే నాథుడే కనిపించరు. ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ అనారోగ్యానికి గురైతే ప్రత్యామ్నయంగా మరో ఆటో లేదా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వరుసగా పండుగలు, వర్షాలు ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అపరిశుభ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్యం అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు నామమాత్రంగా పనిచేస్తున్నారు. కమిషనర్ రోజు డివిజన్లలో పర్యవేక్షిస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అపరిశుభ్రంగా పలు కాలనీలు.. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ, ఇందిరానగర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ–1,2, నక్కలగుట్ట, కేఎల్రెడ్డి కాలనీ, హౌసింగ్బోర్డు కాలనీ, బాలసముద్రం తదితర ప్రాంతాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. వరంగల్లోని రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం, ఓఎస్ఆర్నగర్, రఘునాథ్ కాలనీ, పాత బీటుబజారు, రైల్వేగేట్, హంటర్ రోడ్డు, సంతోషిమాత కాలనీ, కొత్తవాడ, రంగంపేట, కాశీబుగ్గ, లేబర్కాలనీ, శివనగర్, విద్యానగర్, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేటలో చెత్తసేకరణ చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. విలీన గ్రామాల్లో ఇంటింటా చెత్తసేకరణ నామమాత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు స్పందించి కాలనీల్లో రోజూ చెత్త సేకరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.స్వచ్ఛ ఆటోల కోసం ప్రజల ఎదురుచూపులు మరమ్మతులు, సెలవుల పేరుతో విధులకు డ్రైవర్ల డుమ్మా చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో రాక పది రోజులవుతోంది. ఇళ్లల్లో చెత్త నిల్వ చేయలేకపోతున్నాం. కంపు వాసన భరించ లేకపోతున్నాం. స్వచ్ఛ ఆటో డ్రైవర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీ–1కు చెందిన రజిత ఆవేదన ఇది. ఆదివారం, ఇతర సెలవులు, పండుగలు, స్వచ్ఛ ఆటో రిపేర్ ఉందని, చెత్త సేకరణకు కార్మికుడు తోడు లేడని డ్రైవర్ కారణాలు చెబుతున్నాడు. రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.. ఇలా ఏదో ఒకరి చెత్త బాధలు కావు ఇవి. నగర వ్యాప్తంగా 60 శాతం కాలనీల్లో ఇదే పరిస్థితి దాపురించింది. చెత్త సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు. -
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కవులు, కళాకారులు, పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పొట్లపల్లి శ్రీనివాస్రావు, నాగిళ్ల రామశాస్త్రి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్కుమార్, బన్న అయిలయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధి లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు. రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష రాసిన మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లను భర్తీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి పి.అపర్ణ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12న వరంగల్ జిల్లా పరిధి రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హాజరు కావాలన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎస్సీ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్లో అధికారుల జాప్యం
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎంపికై న గ్రామ పాలనాధికారుల (జీపీఓలు)కు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఒక్క హనుమకొండ జిల్లాలోని అధికారులు నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు ఆప్షన్లు తీసుకున్న అధికారులు అసలు జాబితా, అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సీనియారిటీ జాబితాలో నాన్ లోకల్ లోకల్ క్యాడర్లో వేరే విధంగా చూపెట్టినప్పటికీ.. లోకల్ క్యాడర్లో చూపెట్టిన కొందరు అభ్యర్థుల్లో నాన్లోకల్ వారు ఉన్నారని, వేరే జిల్లాల్లో పరీక్షలు రాసిన వారిని ఇక్కడి జిల్లా అభ్యర్థుల జాబితాలో చూపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ, హనుమకొండ జిల్లాలో మాత్రం అధికారులు ఈ ప్రక్రియ సాగదీయడం అనుమానాలకు తావిస్తోంది.స్థానిక నియోజకవర్గం కాకుండా..ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన 128 మందిని మొదట వారి నుంచి ఆప్షన్స్ స్వీకరించారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో 14 మండలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న మండలాల్లో ఏ గ్రామానికి కేటాయించాలన్నది మాత్రం అధికారుల ఇష్టంగా చూపెట్టారు. మండలం మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో మండలంలో ఉన్న ఖాళీల ఆధారంగా వారికి ఇష్టం ఉన్న గ్రామాలు అధికారులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గం కాకుండా ఇతను నియోజకవర్గానికి కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వారి సొంత నియోజకవర్గానికి కేటాయించాల్సి వస్తే.. ఆ నియోజకవర్గంలో వారి సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అర్బన్ మండలాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతోపాటు ఒక మండలంలో నాలుగు గ్రామాలు ఉంటే.. వాటిలో రెండు గ్రామాలు హెచ్ఆర్ఏ కింద ఉన్నాయి ఇలాంటి మండలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు సైతం ఈ విషయంలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 128 మందిలో కొందరు స్థానికులు కారని, వేరే మండలాల్లో పరీక్షలు రాసి అక్కడ స్థానికత చూపెట్టుకున్నారని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే పూర్తయిందని, జాబితాలో మాత్రం ఇక్కడి వారీగా చూపెడుతుండడంతో తాము సీనియార్టీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు సీనియారిటీ జాబితాలో కూడా పేర్లు, నంబర్లు మూడు రోజుల్లో మూడుసార్లు మారినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.జిల్లాలో 128 మంది..హనుమకొండ జిల్లాకు మొత్తం 128 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, వీరిని జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాలకు కేటాయించాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా కాకుండా జిల్లాలో 123 రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్కు ఒకరు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన 128 మందిలో ఒకరు మెడికల్ గ్రౌండ్లో తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన వారిలో 121 మంది లోకల్ కేటగిరీలో చూపారు. ఆరుగురిని నాన్ లోకల్ కేటగిరీలో అంటే కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చినట్లు చూపెట్టారు. పోస్టులు మొదట లోకల్ వారికి తర్వాత నాన్ లోకల్ వారికి ఇవ్వనున్నారు. అదేవిధంగా రెండోసారి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో మొదట లోకల్ వారికి తర్వాత నాన్లోకల్ వారికి పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసే పరిస్థితి లేనందున కేవలం వారి వివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. -
ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సీఎం రేవంత్రెడ్డి ఆలోచన అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఈసీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పశు పోషణపై ప్రత్యేక దృష్టిసారించాలని, పశువుల కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీను, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మహిళా సమాఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్యూలో పాస్బుక్కులు!
మండలంలోని సిద్ధాపురం సొసైటీకి మంగళవారం రైతులు క్యూకట్టారు. రాత్రి యూరియా లారీ సొసైటీకి చేరుకోవడంతో బుధవారం ఉదయం యూరియా విక్రయిస్తారని భావించిన రైతులు అక్కడకు భారీగా చేరుకుని పట్టాదార్ పాస్పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలైన్లో పెట్టారు. ఇప్పటివరకు చెప్పులు లైన్లో పెట్టిన రైతులు ఈసారి పట్టాదార్ పాస్పుస్తకాలు పెట్టడం గమనార్హం. అయితే కొంతమంది రైతులు అర్ధరాత్రి వరకు అక్కడ నిరీక్షించి ఇంటి దారిపట్టగా, మరికొంత మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కునుకు తీసినట్లు స్థానికులు చెప్పారు. –హసన్పర్తి -
జాతీయ రహదారిపై ధర్నా
నర్సంపేట రూరల్/రాయపర్తి: ఖరీఫ్లో రైతుల పంటలకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని 365 జాతీయ రహదా రిపై మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహారాములు, క్లస్టర్ ఇన్చార్జీ తాళ్లపెల్లి రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ భూక్య వీరన్న, పిట్టల శ్రీనివాస్, బుర్ర ఆనందం, రైతులు పాల్గొన్నారు. అలాగే రాయపర్తి మండల కేంద్రంతో పాటు పెర్కవేడు, తిర్మలాయపల్లి గ్రామాల్లో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. -
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం
ఖిలా వరంగల్: జిల్లాలోని 509 రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణితోపాటు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ‘సాక్షి’లో దొడ్డు బియ్యం ఎలుకల పాలు అనే శీర్షికతో ఈనెల 6న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అంగన్వాడీల్లో ‘పోషణ్ వాటిక’
సాక్షి, వరంగల్: అంగన్వాడీల్లో పోషణ్ వాటిక అమలుకు జిల్లా సంక్షేమ విభాగాధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు పోషకాహారం అందిస్తున్నా... వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలుత జిల్లాలోని 54 కేంద్రాల్లో కూరగాయల తోటలు పెంచేందుకు ఉద్యానశాఖ అధికారుల మార్గదర్శనంలో ముందుకెళ్తుతున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి సంబంధిత సీడీపీఓలతో పాటు ఉద్యానశాఖ అధికారులకు లేఖలు పంపిస్తున్నారు. తొందరగా ఇది అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోకేంద్రానికి మంజూరైన రూ.పది వేలతో మైదానం చదును చేయడంతో పాటు సారవంతమైన మట్టి, ఎరువు కోసం ఖర్చు చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు పండించి అదే కేంద్రాల్లో తయారు చేసే వంటకాల్లో వినియోగిస్తారు. తొలి విడతలో టమాటా, వంకాయ, బెండ, ముల్లంగి, బీరకాయ, గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటి విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేయనుంది. జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆయా కేంద్రాలను సందర్శించి సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించనున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందనుంది. జిల్లాలో 919 అంగన్వాడీలు జిల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో సొంత భవనాలు 165, అద్దె భవనాలు 426, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నవి 328 కేంద్రాలున్నాయి. 0 నుంచి ఆరేళ్ల చిన్నారులు 47,625 మంది ఉంటే, బాలింతలు 3,714 మంది, గర్భిణులు 5,415 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం కూరగాయలు కొనుగోలు చేసి వంట తయారుచేసి అందిస్తున్నారు. నగర పరిధిలో అక్షయపాత్ర వంటి సంస్థలు లబ్ధిదారులకు రాయితీపై భోజన సదపాయం కల్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పెరిగిన సందర్భంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. వీటిని గుర్తించిన ప్రభుత్వం సేంద్రియ పద్ధతి సాగు ద్వారా ఆకుకూరలు వారే పండించుకొని వంటకాల్లో ఉపయోగించడం ద్వారా ఎక్కడా లోటుపాట్లు ఉండవని గుర్తించి ఆ దిశగా తొలుత జిల్లాలోని 54 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,40,000లు మంజూరు చేసింది. దశల వారీగా అమలు చేస్తాం.. అంగన్వాడీల్లో తొలుత రూ.10 వేలతో పోషణ్ వాటికలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రూ.16 వేలతో ఇంకుడుగుంతలు, రూ.39 వేలతో చిన్నారులకు ఆట వస్తువులు, రూ.25 వేలతో ఎల్ఈడీ స్క్రీన్లు, రూ.10 వేలతో తాగునీటి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపించాం. జిల్లాలో తొలుత 54 కేంద్రాల్లో పోషణ్వాటికను అమలు చేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బలోపేతం చేస్తాం. – రాజమణి, జిల్లా సంక్షేమ విభాగాధికారి జిల్లాలోని 54 కేంద్రాల్లో కూరగాయల సాగు ఉద్యానశాఖ అధికారుల సహకారంతో పనులు లబ్ధిదారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు తప్పనున్న కూరగాయల కొనుగోలు బాధ -
నల్లా పన్ను బకాయిలు వసూలు చేయాలి
● అధికారుల సమీక్షలో నగర మేయర్ గుండు సుధారాణివరంగల్ అర్బన్: నల్లా పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలతో నల్లా పన్ను బకాయిల వసూళ్లపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్లా బకాయిల వసూళ్ల లక్ష్యం రూ.45 కోట్లు ఉందని తెలిపారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి వసూలు చేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సుమారు 12 శాతం అధిక లక్ష్యాన్ని సాధించాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 150 మంది జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓ లు షెహజాది బేగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాల అమ్మకాలు నిషేధం.. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధమని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున బల్దియా పరిధిలో రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాలు అమ్మడం నిషేధమని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి ఉర్సు రంగలీల మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుకోవాలని తెలిపారు. -
ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ సందర్శించిన సీపీ
రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
● తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణహన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రోబోటిక్స్ వర్క్షాప్
నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం హైదరాబాద్కు చెందిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ భాగస్వామ్యంతో నేడు (బుధవారం) రోబోటిక్స్ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రోబోటిక్ బ్రోచర్ను వర్క్షాప్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల నుంచి ఎంపిక చేసిన 40 మందికి 21 ప్రాక్టికల్ రోబోటిక్ ప్రయోగాల ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు భవిష్యత్ వర్క్షాప్లకు శిక్షకులుగా, మెంటార్లుగా ఉంటారన్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్సెస్), బీఎస్సీ (లైఫ్ సైసెన్సెస్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎ) నర్సంపేట విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఉచితమన్నారు. కార్యక్రమంలో వర్క్షాప్ కన్వీనర్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు భైరి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కందాల సత్యనారాయణ, ఆర్.రుద్రాణి, డాక్టర్ పూర్ణచందర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఎంఎంకె రహీముద్దీన్, ఎం.సోమయ్య, ఎస్.కమలాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధిలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, అశోక్రెడ్డి, బాబు పాల్గొన్నారు. -
2.14 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
ఐనవోలు : అక్రమంగా తరలిస్తున్న 2.14 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఐనవోలు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎన్. వెంకటేశ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టగా ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 19 ఏఎక్స్ 7887 నంబర్గల హోండా సిటీ కార్ వస్తుంది. తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన కారు నడుపుతున్న వ్యక్తి వెనకకు తిప్పుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. పోలీసులు అనుమానంతో కారును ఆపి తనిఖీలు చేశారు. కారు డిక్కీలో ఉన్న ప్యాకెట్లను వెలుపలికి తీసి చూడగా ఎండు గంజాయిగా నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులు కారు నడుపుతున్న మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా మోతాల మండలం ఏటీకుర్తా గ్రామానికి చెందిన రైతు శివ సింగ్ డొంగర్ సింగ్ గోటిని అదుపులోకి తీసుకున్నారు. 214 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినున్నట్లు ఏసీపీ ఎన్.వెంకటేశ్ తెలిపారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బందితో పాటు పర్వతగిరి ఇన్స్పెక్టర్ రాజగోపాల్కు అభినందనలు తెలియజేశారు. -
అమెరికాలో శిక్షణకు హనుమకొండ ఉపాధ్యాయుడు ఎంపిక
కమలాపూర్: మండలంలోని ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొక్కుల సంపత్కుమార్ ఈ నెల 10 నుంచి అక్టోబర్ 27 వరకు అమెరికాలో జరిగే ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్స్లెన్స్, అచీవ్మెంట్ శిక్షణకు ఎంపికయ్యారు. ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్స్లెన్స్, అచీవ్మెంట్ ప్రోగ్రాంను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఎడ్యుకేషనల్, కల్చరల్ అఫైర్స్ (ఈసీఏ) స్పాన్సర్ చేస్తుండగా ఐరెక్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి యూఎస్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గ్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, భారతదేశం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఆరు వారాల ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణలో పాల్గొంటారు. ఇందులో సాధారణ బోధనపై సెమినార్లు, తరగతి గదిలో సాంకేతికత వినియోగంపై నేర్చుకుంటారు. ఈ శిక్షణ కోర్సులను అమెరికా విశ్వవిద్యాలయం రూపొందించి నిర్వహిస్తుంది. ట్రైనింగ్ జరిగే విశ్వవిద్యాలయానికి సమీపంలోని సెకండరీ పాఠశాలలో అమెరికా భాగస్వామి ఉపాధ్యాయుడితో కలిసి సహ బోధన, ప్రజెంటేషన్లు, పరిశీలనను పూర్తి చేయాల్సి ఉంటుందని సంపత్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ముగిసిన చెస్పోటీలువరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 చదరంగ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ వేడుకలకు కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. బాలుర విభాగంలో శ్రీసాయిప్రీతం కనకాల, సాయిజోషిత్ బొల్లం, మొగిలి అభినవ్రెడ్డి, రిత్విక్ గండు, బాలికల విభాగంలో డి.ఆరుషి, వి.దిలీషా, ఏ.ఆద్య, బి.శ్రీలాస్య విజేతలుగా నిలిచారు. ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు ఉంటే తెలపాలి
కలెక్టర్ స్నేహశబరీష్హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 12మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 9న సవరించి 10వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో 12 మండల పరిషత్, 12 జిల్లా పరిషత్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 3,70,871 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళలు 1,90,201, పురుషులు 1,80,666, ఇతరులు 4 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి శ్రీనివాసరావు, శ్యామ్సుందర్, ప్రభాకర్రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండీ నేహాల్, ఇండ్ల నాగేశ్వర్రావు, ప్రవీణ్కుమార్, జయంత్లాల్, తదితరులు పాల్గొన్నారు. 17నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు.. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఈనెల 17వ తేదీనుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులచే అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థినులకు అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, డీడబ్ల్యూఓ జయంతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ గౌతమ్ చౌహాన్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, విజయకుమార్, మహేందర్, హిమబిందు పాల్గొన్నారు. -
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్కు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సోమవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక జాయింట్ ట్రెజరరీ, ఒక అధికార ప్రతినిధి కలిపి 22 మంది ని ప్రకటించారు. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోడంపై పెద్ద చర్చే జరుగుతోంది. మొండిచెయ్యి ఇదే మొదటి సారి.. ప్రతీసారి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్కు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న ముగ్గురునుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023, జూలై 4న బండి సంజయ్.. ఆ తర్వాత పగ్గాలు చేపట్టి జి.కిషన్ రెడ్డిలు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లానుంచి డాక్టర్ గుండె విజయ రామారావు (ఉపాధ్యక్షుడు), గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఏనుగుల రాకేష్ రెడ్డి (అధికార ప్రతినిధి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు), చందుపట్ల కీర్తిరెడ్డి (అధికార ప్రతినిధి), జాటోత్ హుస్సేన్ నాయక్ (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), కొండేటి శ్రీధర్ (ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు)లకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్కు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా.. ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటి సారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓరుగల్లు నుంచి మహామహులు... బీజేపీ, జనసంఘ్.. పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలం బలగం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు నాయకత్వం చేసిన సందర్భం. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి ఏకంగా పీవీ నర్సింహరావును ఓడించడం.. ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ బ్యానర్ మీదే గెలిచారు. బీజేపీనుంచి ఎమ్మెల్యేలుగా టి.రాజేశ్వర్రావు, జయపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని తదితరులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పార్టీ అధిష్టానం కూడా ప్రతీసారి సంస్థాగత పదవుల విషయంలో వరంగల్కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈసారి కూడా రాంచందర్రావు టీములో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది. రాష్ట్ర కమిటీలో సీనియర్ల ఊసేది..? పూర్వ వరంగల్ జిల్లాలో వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మలలో ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, ఎడ్ల అశోక్రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుజ్జ సత్యనారాయణరావు, గంట రవికుమార్, ముక్కెర తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించగా.. అధిష్టానం సీనియర్లను విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రాష్ట్ర కమిటీలో ఎవరికీ చోటివ్వని హైకమాండ్ సీనియర్లను పట్టించుకోని పార్టీ అధిష్టానం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి ప్రతీసారి కమిటీలో ముగ్గురు నుంచి ఐదుగురు అధిష్టానం తీరుపై ‘కాషాయం’ నేతల కారాలు, మిరియాలు -
యూరియా కోసం రైతుల ఆందోళన
పరకాల: యూరియా కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సోమవారం మాదారం పీఏసీఎస్కు యూరియా వచ్చిందన్న సమాచారంతో పరకాల, నడికూడ మండలాలకు చెందిన 14గ్రామాల నుంచి వందలాది మంది రైతులు తెల్లవారుజాము నుంచే మార్కెట్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతువేదిక వద్ద చంటిపిల్లలతో చేరుకున్న మహిళ రైతులు నానా అవస్థలు పడ్డారు. దిగుమతి అయిన 440బస్తాల యూరియాను అధికారులు పంపిణీ చేయడంతో మిగతా రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి మరో 100మంది రైతులకు టోకెన్లు ఇప్పించారు. వారంతా నడికూడ మండల కేంద్రంలోని ఆగ్రోస్ ద్వారా తీసుకోవాలని సూచించారు. యూరియా కోసం క్యూలో చెప్పులు కమలాపూర్ : మండలంలోని మర్రిపల్లిగూడెం, శనిగరం పీఏసీఎస్తో పాటు ఇఫ్కో కేంద్రానికి సోమవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే బారులుదీరారు. గంటల తరబడి నిల్చోలేక రైతులు తమ చెప్పులు క్యూలో పెట్టారు. అయినా రైతులందరికి యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు. పనులన్నీ వదులుకుని గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. -
కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే..– సాక్షిప్రతినిధి, వరంగల్/స్టేషన్ఘన్పూర్1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగజైన్కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదట ప్రోత్సహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్ జిల్లా కోఆపరేటిట్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం.ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి..ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెబితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయెట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒక ధీరోదత్తుడు.సీరియస్, హాస్యం.. రెండూ ఉంటాయికాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు.కాళోజీ పురస్కారం... మొదటి మహిళగా సంతోషంగా ఉంది..గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది మొదటి మహిళగా నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను..నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోషపడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం.బహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవినెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితి పురస్కారం –2025కు ఎంపికయ్యారు. -
డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు ● విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఖిలా వరంగల్: విద్యార్థులు డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకుని పరిశోధనాత్మక విద్యను అందుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. సోమవారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ అధికారి రమేశ్రెడ్డి హాజరై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, నినాదాల పోటీలు ప్రారంభించారు. ఉపన్యాస పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి ఆకుల సాత్విక ప్రథమ స్థానంలో నిలవగా, పదో తరగతి విద్యార్థి కల్లెపు హరిప్రియ ద్వితీయ స్థానం సాధించింది. విద్యార్థులను డీఈఓ రంగయ్య నాయుడు అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బత్తుల ప్రసాద్, అధికారులున్నారు. -
ఫలితాలు శూన్యం!
ప్రయత్నాలు వినూత్నం.. ● ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద ● ఆతర్వాతే అర్జీల స్వీకరణ ● సత్వరమే పరిష్కరించాలని ఆదేశంన్యూశాయంపేట: ప్రజావాణిలో గత రెండు, మూడు వారాలుగా ఉన్నతాధికారులు వినూత్న ఆలోచనతో ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వారం అధికారులు కలెక్టర్ వెనుకాల కూర్చోగా.. ఎదురుగా ఫిర్యాదు దారులు కూర్చున్నారు. సమస్యల్ని అధికారులకు వివరించారు. ఈవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముందుగా అర్జీదారులందరితో మాట్లాడించారు. సమస్యలను అక్కడున్న సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆలోచనలు బాగున్నప్పటికీ.. కింది స్థాయి అధికారులు ప్రజల వినతులను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆలోచనలు సరే ఆచరణేది? అంటూ అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు.. వినతులు సత్వరమే పరిష్కరించండి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో 136 ఫిర్యాదులు రాగా.. అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధికల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుల్ని సకాలంలో చర్యలను తీసుకోవాలని, చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, ఆర్సీఓ అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నల్లబెల్లి: అధికారి వేధింపులు.. అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు వెరసి ఓ జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ కార్యాలయంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం బజ్జుతండాకు చెందిన కల్పన పదేళ్లుగా వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్గా విధులు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో పలు సర్టిఫికెట్ల జారీ కోసం విచారణ నివేదికను తహసీల్దార్ ముప్పు కృష్ణకు అందించేవారు. ఈక్రమంలో పలువురు దరఖాస్తుదారులు తమకు అనుకూలంగా విచారణ రిపోర్ట్ రాలేదని కక్ష పెంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు. ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు.. మండలంలొని బిల్నాయక్ తండాకు చెందిన అధికార పార్టీ నాయకుడు, కల్పన మేనమామ మాలోత్ చరణ్సింగ్.. ఆమైపె శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ సత్యశారదకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కాపీని కల్పన వాట్సాప్నకు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ పంపించాడు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన చరణ్ సింగ్ గతంలో తనను లైంగికంగా వేధించాడని, అతడికి లొంగకపోవడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని కల్పన పేర్కొంది. గతంలో ఒక తప్పుడు సర్టిఫికెట్ కోసం పురుషోత్తం సురేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే మనిషిని అని బెదిరించారని కల్పన పేర్కొంది. కాగా.. కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కృష్ణ ఆమెతో చర్చించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో మాట్లాడుకుని రాజీ కుదుర్చుకోమని చెప్పినట్లుగా కల్పన పేర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తహసీల్దార్ వెంటనే ఆమెను తన కారులో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వేధించలేదు.. జూనియర్ అసిస్టెంట్ కల్పనను నేను వేధింపులకు గురి చేయలేదు. కల్పనపై పలు ఆరోపణలు చేస్తూ ఇటీవల ఓ వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కల్పనతో మాట్లాడాను. ఏం కాదు ధైర్యంగా డ్యూటీ చేసుకొమ్మని సూచించాను. కార్యాలయానికి వచ్చే వారిపై మర్యాదగా వ్యవహరించాలని సూచించాను. వేధింపులకు పాల్పడలేదు. – ముప్పు కృష్ణ, తహసీల్దార్, నల్లబెల్లి అధికారి వేధింపులు! అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు బలవన్మరణానికి యత్నించిన జూనియర్ అసిస్టెంట్ కల్పన -
పగలనకా.. రాత్రనక
● యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు ● ఉద్రిక్తతల నడుమ టోకెన్ల పంపిణీ ● లైన్లో ఉండగా.. ఓ రైతుకు ఫిట్స్ఖానాపురం: పగలు, రాత్రి తేడా లేదు. ఆకలి దప్పిక అస్సలు ఎరుగరు. ఎక్కడ చూసినా బారులే. ఏ రైతును కదిలించినా యూరియా కష్టాలే. ఒక్క బస్తాకోసం రోజుల తరబడి ఎదురు చూపులు. పంటను కాపాడుకునేందుకు రైతన్నలు తమ ఆరోగ్యాల్ని ఫణంగా పెడుతున్నారు. ఎండా వాన తేడా లేకుండా ఎరువుల కోసం పీఏసీఎస్ల చుట్టూ తిరుగుతున్నారు. తప్పని తిప్పలు ఖానాపురం మండలంలోని రంగాపురం, కొత్తూరు, రాగంపేట, ఖానాపురం, మనుబోతులగడ్డ గ్రామాల్లో యూరియా కష్టాలు రైతులకు తప్పలేదు. ఆయా గ్రామాలకు యూరియా వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు రాత్రి 2 గంటల నుంచే రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్ద బారులుదీరారు. రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మొదట ఖానాపురానికి రాత్రి 1 గంటకు వచ్చి బారులుదీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడంలేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడికి వెళ్లి లైన్లో నిల్చున్నారు. ఈక్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్తో కిందపడిపోయాడు. ఖానాపురం, రాగంపేట, మనుబోతులగడ్డలోనూ అధిక సంఖ్యలో బారులుదీరారు. టోకెన్ల కోసం మహిళల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను లైన్లో నిల్చోబెట్టారు. టోకెన్లు లభించిన రైతులు బస్తాలను ఇంటికి తీసుకెళ్లారు. క్యూలో ఉన్న రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు. -
రేపు తుది ఓటరు జాబితా
న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న(బుధవారం) వెలువరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ఓటరు జాబితాలను ప్రదర్శించినట్లు తెలిపారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబందించి ఏమైనా అభ్యంతారాలుంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసి ఈనెల 10న తుది జాబితా వెలువరిస్తామని వివరించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రామిరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దునెక్కొండ: సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బానోతు జాన్నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అందని ద్రాక్షలా చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీపీఎస్ను రద్దు చేస్తూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, మెరుగైన విద్యాబోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ, కుమారస్వామి, ఉపాధ్యాయులు యాదగిరి, సత్యనారాయణ, కిరణ్, రేణుక, నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.‘పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేస్తాం’సాక్షి, వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయంటూ సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు పెండింగ్లో ఉన్నమాట వాస్తవమేనని, ఈ ఆఫీస్ సాంకేతిక సమస్యల వల్ల ఆవి క్లియర్ కాలేదని వివరణ ఇచ్చారు. త్వరలోనే ఈసమస్యల్ని పరిష్కరించి అన్ని ఫైళ్లు క్లియర్ చేస్తామని వారు తెలిపారు.ఇద్దరిపై అట్రాసిటీ కేసునర్సంపేట రూరల్: దుర్భాషలాడిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మమునూరు స్వామిని అదే గ్రామానికి చెందిన మేక కుమారస్వామి, మేక మురళి భూ సంబంధిత పంచాయితీ కోసమని నర్సంపేటలోని ఆర్డీఓ కార్యాలయానికి పిలిపించారు. అదే విషయమై ఇరువురూ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న మేకల ఇందిర, అనిల్ కలిసి స్వామిని కులం పేరుతో దుర్భాషలాడారు. స్వామి నర్సంపేట పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.లోక్ అదాలత్ను వినియోగించుకోవాలివరంగల్ క్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక జీవిత, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేసి రాజీపడేలా అవగాహన కల్పిస్తారని వివరించారు. -
ఖాళీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీ
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ● బీఆర్ఎస్లో చేరిన ముఖ్య నేతలుపర్వతగిరి: మండలంలో కాంగ్రెస్, బీజేపీ ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కల్లెడ సొసైటీ ఆవరణలో నిర్వహించారు. ఈసందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తేజావత్ వినీత్నాయక్, బీజేపీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాధావత్ మారుతీనాయక్, తేజావత్ అజయ్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి దయాకర్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి బ్రోకర్గా పేరు తెచ్చుకున్నాడన్నారు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైన రేవంత్రెడ్డిని ఇక నుంచి ప్రజలంతా బ్రోకర్ రేవంత్రెడ్డి అని పిలవాలన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఒక రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ఎం.మనోజ్గౌడ్, నూనావత్ పంతులు, మాడుగుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు
భూమిని పహాణీలో పొందుపర్చాలినా తండ్రి ఇచ్చిన భూమి 1.22 గుంటల భూమి నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ శివారులో ఉంది. ఆ భూమిని పహానీలో, పట్టాపాస్ బుక్లో పొందుపర్చి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించా. – వక్కల రాజు, నారక్కపేట, నల్లబెల్లి నివేదిక ప్రకారం పరిహారం అందించాలి వరంగల్ జిల్లా మీదుగా వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఆలైన్మెంట్ మార్చాలని పోరాడాం. పరిష్కారం కాలేదు. సన్న చిన్న కారు రైతుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆ నివేదిక ప్రకారం పంటలు, వాటి వివరాలు, భూమి ధరలు, వాటి ప్రకారం రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నాం. – గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులుఅధికారుల అనాలోచిత చర్యతో సోమవారం ప్రజావాణికి వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కలక్టరేట్ సమావేశ హాల్ వెనుక డోర్ వద్ద దరఖాస్తులు స్వీకరించి వరుస క్రమంలో ఫిర్యాదులను స్కాన్ చేసి ఫిర్యాదుదారులను వరుస క్రమంలో పంపేవారు. కానీ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సమావేశ హాల్లోకి వచ్చే దారిలో ర్యాంపు ఎదురుగానే కంప్యూటర్ పెట్టుకుని సిబ్బంది కూర్చున్నారు. దీంతో ర్యాంపు మీదుగా రాలేక దివ్యాంగులు మెట్లు, ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు పడి కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. -
మంజూరు నుంచి పంపిణీ వరకు అవాంతరాలే..
సాక్షిప్రతినిధి, వరంగల్: .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌళిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. నెరవేరని సొంతింటి కల.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లో 4,100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఏళ్ల కిందటి నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమ ఇంటి కలను సాకారం చేయాలని వారంతా వేడుకుంటున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 -
ఎస్సారెస్పీ భూమి కబ్జా
హసన్పర్తి: సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురైంది. ఓ రియల్టర్ సుమారు పది గుంటల భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక గుంట భూమి విలువ సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. గండ్లసింగారం నుంచి పెగడపల్లి, సీతానాగారంతో పాటు కింద రైతులకు సాగు నీరందించడానికి భూములు సేకరించారు. గుండ్లసింగారం ప్రధాన కాల్వ నుంచి ెపెగడపల్లి వైపునకు సాగునీరందించడం కోసం కాల్వ(డీబీఎం–26) నిర్మించారు. కాల్వకు ఇరువైపులా సుమారు మధ్యలో నుంచి 40 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు స్థలాన్ని ఇన్స్పెక్షన్ పాత్ కోసం వదిలిపెట్టారు. మరి కొంత భూమి కూడా పడవుగానే ఉంది. రియల్టర్ కన్ను గుండ్లసింగారం–ముచ్చర్ల మధ్య ప్రధాన రహదారికి ఆనుకుని పడావుగా ఉన్న కాల్వ భూమిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఇటీవల ఆ భూమిని చదును చేశాడు. అప్పటికే భూమి ఆక్రమణకు గురవుతోందని నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. అధికారుల కన్నసన్నల్లోనే ఈవ్యవహారం సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారుడిపై చర్యలు తీసుకుంటాం. – కిశోర్, ఏఈ రూ.కోటిన్నర విలువైన స్థలానికి ఎసరు? అంతా అధికారుల కన్నుసన్నల్లోనే! -
రెండు పడక గదుల ఇళ్లకు మోక్షం ఎప్పుడు?
ఉమ్మడి వరంగల్కు మంజూరైన ఇళ్లు (రెండు విడతలు) 26,284 నిర్మాణం పూర్తయినవి 10,939 (41.62 శాతం) నిర్మాణానికి చేసిన ఖర్చు (సుమారుగా) రూ.860 కోట్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసినవి 4,874 (44.56 శాతం)వరంగల్ తూర్పు నియోజకవర్గం దూపకుంటలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇళ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది.● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్లో 320 నిర్మించారు. అయితే రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరూపయోగంగానే ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. ‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు -
మంజూరు నుంచి పంపిణీ వరకు అవాంతరాలే..
సాక్షిప్రతినిధి, వరంగల్: .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌళిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. నెరవేరని సొంతింటి కల... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పడకల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలోలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఏళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్ల్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 -
ఏడాదిగా పెండింగ్లోనే..
సాక్షి, వరంగల్: ● ‘ఓ రిటైర్డ్ తహసీల్దార్ తల్లికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.90 వేలు ఖర్చైంది. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వరంగల్ కలెక్టరేట్కు తిరుగుతున్న సమయంలోనూ ఆయన అనారోగ్యం బారిన పడడంతో రూ.50వేల వరకు ఖర్చైంది. తొలుత ఆయా ఆస్పత్రుల్లో అతనే భరించారు. సంబంధిత వైద్య నివేదికలతో మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏడాదిగా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’● ‘ఓ తహసీల్దార్ కుమార్తెకు రోడ్డు ప్రమాదం జరగడంతో సుమారు రూ.మూడు లక్షల వరకు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కింద తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఇంకా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.’...వీరే కాదు ఇలా జిల్లాలో సుమారు 45కుపైగా రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కలెక్టరేట్లో పెండింగ్లో ఉండడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫైళ్లు రూ.50వేల లోపు ఉంటే జిల్లా మెడికల్ బోర్డు, ఆపై రూ.మూడు లక్షల లోపు ఉంటే సంబంధిత విభాగ ఉన్నతాధికారి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు కలెక్టర్ ద్వారా వెళ్లాల్సి ఉండగా దాదాపు ఏడాదిగా జిల్లా కలెక్టరేట్లోనే మూలుగుతుండడంతో వారి వెతలు వర్ణనాతీతంగా మారాయి. చాలా మంది ఉద్యోగులు కలెక్టరేట్కు వచ్చి సంబంధిత అధికారులను కలిసి అడుగుతున్నా, రేపు మాపు అంటూ, కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందంటూ తిప్పి పంపిస్తుండడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ పెండింగ్ ఫైళ్లు కలెక్టరేట్లో ఎక్కడ ఉన్నాయో తెప్పించుకొని కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్లియర్ చేయాలని అభ్యర్థిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా వీటిని క్లియర్ చేస్తే ఆర్థికంగా తమ కుటుంబాలను అదుకున్నవారవుతారని వేడుకుంటున్నారు. 2023 సంవత్సరం నుంచి.. 2023 మార్చి నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను కొద్ది నెలల క్రితం ప్రభుత్వం క్లియర్ చేసేందుకు నిధులిచ్చినా జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి ఉందని వాపోతున్నారు. దేవుడి కరుణించినా, పూజారి వరమివ్వలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను ఫోన్లో సంప్రదిస్తే కలెక్టరేట్లో ఏమీ పెండింగ్లో లేవని, అంతా క్లియర్ అయ్యాయని చెబుతుండడం గమనార్హం. ఇదిలాఉండగా ఈ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోతే కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆందోళన చేస్తామని కలెక్టరేట్లోని సిబ్బందిని శనివారం కలిసి వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అన్నారు. ఈ 45 మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు కలిపి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చన్నారు. కలెక్టరేట్లో మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు రేపు, మాపు అంటూ సిబ్బంది దాటవేస్తుండడంతో ఆందోళన పెండింగ్ ఫైళ్లు లేవంటున్న అధికారులు -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు గ్రీవెన్స్ ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు 6,619 విగ్రహాల నిమజ్జనం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అన్నివర్గాల ప్రజలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యారణ్యపురి: జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు 8వ తరగతి చదవుతున్న విద్యార్థులు అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో కోరారు. జనరల్ విద్యార్థులు ఏడో తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు హెచ్టీటీపీ//బీఎస్ఈ.తెలంగాణ. గౌట్.ఇన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. రాజ్కుమార్కు గురుబ్రహ్మ అవార్డుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ అధిపతి డాక్టర్ సీహెచ్ రాజ్కుమార్కు గురుబ్రహ్మ అవార్డు లభించింది. విశాఖపట్నంలోని సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది. ఈమేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, రి టైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రూథ్మేరీ తదితరులు రాజ్కుమార్కు అవార్డు ప్రదానం చేశారు. ప్ర శంసపత్రం, జ్ఞాపిక అందించి సన్మానించారు. సండే సందడి ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పాకాల సరస్సు మత్తడి పోస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాకాలకు భారీగా తరలివచ్చారు. మత్తడి వద్ద స్నానాలు చేస్తూ పాకాల అందాలను సెల్ఫీ రూపంలో బంధించుకున్నారు. బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. -
కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు
● మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్మసాగర్: స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చే కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. రైతన్న కోసం రాజన్న పాదయాత్రలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్, గుంటూరుపల్లి, ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి, ధర్మపురం, చిల్పూరు మండలంలోని వంగాలపల్లి, నష్కల్, ఉప్పుగల్లు రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం రిజర్వాయర్ సమీపంలో కాంగ్రెస్ పార్టీకి, కడియం శ్రీహరికి పిండాలు పెట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరు చెప్పుకొని తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల రైతులకు సాగునీరు అందించడానికి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల రిజర్వాయర్ నిర్మించిందని తెలిపారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా దాదాపు పది గ్రామాల్లోని రైతుల భూములకు సాగునీరు అందించడానికి కేసీఆర్ నిధులు మంజూరు చేయగా ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయలేదని అన్నారు. ఇప్పటివరకు పనులను చేయకపోవడంతో రైతన్నల పక్షాన కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరికి పిండాలు పెట్టినట్లు తెలిపారు. వచ్చే యాసంగి వరకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వంగాలపల్లి, ధర్మపురం, మల్లక్పల్లి, వెంకటాపూర్ గ్రామాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జ్ కర్ర సోమిరెడ్డి లాల్, మహ్మద్, మునిగాల రాజు, నాయకులు పాల్గొన్నారు. -
నగరాన్ని వణికించిన వాన
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం కురిసిన మోస్తరు వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రెండు గంటలపాటు దంచికొట్టిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్, వికాస్నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్ వద్ద వరదనీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా బస్స్టేషన్ ఆవరణలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ చౌరస్తా, పెట్రోల్ పంపు ప్రాంతాల, గోకుల్నగర్ కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాకపోకలకు అంతరాయం.. ఖిలావరంగల్ రాతికోట చుట్టూ ఉన్న మాల అగర్త చెరువు అలుగు పోయడంతో మైసయ్యనగర్, అక్కడి నుంచి శివనగర్ రహదారుల మీదుగా అండర్ బ్రిడ్జి వరకు వరద చేరింది. గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆర్టీసీ బస్సుల్లోకి నీరు రావడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రయాణికులు 8 ఫీట్ల టేబుల్పై నుంచి నడిచి అండర్ బ్రిడ్జి గద్దె దాటారు. ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, పోలీసు సిబ్బంది నడుములోతులో ఉన్న నీటి నుంచి ఓ తాడు సాయంతో ప్రయాణికులను రోడ్డుకు చేర్చారు. మట్టికోట చుట్టూ ఉన్న అగర్తల చెరువులు పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇక్కడి కాలనీలు చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు అండర్ బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికులు సురక్షితంజిల్లాలో 243 మిల్లీమీటర్ల వర్షం.. జిల్లాలో ఖిలావరంగల్, వరంగల్ నగరంలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఖిలావరంగల్లో 56.3 మిల్లీమీటర్లు, వరంగల్లో 56.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గీసుకొండలో 38.7, సంగెంలో 22.2, దుగ్గొండిలో 18.5, నల్లబెల్లిలో 17.9, నెక్కొండలో 9.7, ఖానాపురంలో 8.5, పర్వతగిరిలో 7.4, చెన్నారావుపేటలో 6.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో 243 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
సండే సందడి
ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పాకాల సరస్సు మత్తడి పోస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాకాలకు భారీగా తరలివచ్చారు. మత్తడి వద్ద స్నానాలు చేస్తూ పాకాల అందాలను సెల్ఫీ రూపంలో బంధించుకున్నారు. బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. – ఖానాపురంమత్తడి వద్ద సందడి చేస్తున్న పర్యాటకులుజలకాలాడుతున్న పర్యాటకులు -
ఆలయాల మూసివేత
హన్మకొండ కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ద్వారబంధనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్భలు వేసి ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్ల వారుజామున ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. అదేవిధంగా భద్రకాళి ఆలయంలో మధ్యాహ్నం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ద్వారబంధనం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఐలోని ఆలయం మూసివేతఐనవోలు: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. -
చట్టబద్ధంగానే లంబాడీల రిజర్వేషన్లు
నర్సంపేట: చట్టబద్దంగానే లంబాడీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని ప్రొఫెసర్ సీతారాంనాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసూనాయక్ అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో లంబాడీల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాలులో ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీ, కోయ, గోండుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని లంబాడీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి ఇరువురిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉదయ్సింగ్, మనోజ్లాల్, సారంగపాణి, చేతిరాం, రాజ్కుమార్, గోల్య, రమేశ్, శంకర్, జగన్నాయక్, వినోద్, ల క్ష్మణ్, కొజ్జనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నగరాన్ని వణికించిన వాన
సాక్షి, వరంగల్/హన్మకొండ/వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం కురిసిన మోస్తరు వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రెండు గంటలపాటు దంచికొట్టిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్, వికాస్నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్ వద్ద వరదనీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా బస్స్టేషన్ ఆవరణలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ చౌరస్తా, పెట్రోల్ పంపు ప్రాంతాల, గోకుల్నగర్ కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాకపోకలకు అంతరాయం.. ఖిలావరంగల్ రాతికోట చుట్టూ ఉన్న మాల అగర్త చెరువు అలుగు పోయడంతో మైసయ్యనగర్, అక్కడి నుంచి శివనగర్ రహదారుల మీదుగా అండర్ బ్రిడ్జి వరకు వరద చేరింది. గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆర్టీసీ బస్సుల్లోకి నీరు రావడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రయాణికులు 8 ఫీట్ల టేబుల్పై నుంచి నడిచి అండర్ బ్రిడ్జి గద్దె దాటారు. ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, పోలీసు సిబ్బంది నడుములోతులో ఉన్న నీటి నుంచి ఓ తాడు సాయంతో ప్రయాణికులను రోడ్డుకు చేర్చారు. మట్టికోట చుట్టూ ఉన్న అగర్తల చెరువులు పూడ్చివేసి అక్ర మ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇక్కడి కాలనీలు చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. అశోకా కాలనీలో కూలిన వృక్షం.. వర్షానికి హనుమకొండలోని అశోకా కాలనీలో వృక్షం కూలిపోయి విద్యుత్ లైన్ తెగిపోయింది. రెండు విద్యుత్ స్తంభాలు విరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డీఆర్ఎస్ సిబ్బంది చేరుకుని వృక్షాన్ని తొలగించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్ లైన్ను పునరుద్ధరించారు. వరంగల్ జిల్లా పైడిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో అత్యధికంగా 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు అండర్ బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికులు సురక్షితం -
ఏడాదిగా పెండింగ్లోనే..
● ‘ఓ రిటైర్డ్ తహసీల్దార్ తల్లికి రూ.90 వేలు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వరంగల్ కలెక్టరేట్కు తిరుగుతున్న సమయంలోనూ ఆయన అనారోగ్యం బారిన పడడంతో రూ.50వేల వరకు ఖర్చైంది. తొలుత ఆయా ఆస్పత్రుల్లో అతనే భరించారు. సంబంధిత వైద్య నివేదికలతో మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏడాదిగా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’● ‘ఓ తహసీల్దార్ కుమార్తెకు రోడ్డు ప్రమాదం జరగడంతో సుమారు రూ.మూడు లక్షల వరకు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కింద తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఇంకా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.’సాక్షి, వరంగల్: ...వీరే కాదు ఇలా జిల్లాలో సుమారు 45కుపైగా రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కలెక్టరేట్లో పెండింగ్లో ఉండడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫైళ్లు రూ.50వేల లోపు ఉంటే జిల్లా మెడికల్ బోర్డు, ఆపై రూ.మూడు లక్షల లోపు ఉంటే సంబంధిత విభాగ ఉన్నతాధికారి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు కలెక్టర్ ద్వారా వెళ్లాల్సి ఉండగా దాదాపు ఏడాదిగా జిల్లా కలెక్టరేట్లోనే మూలుగుతుండడంతో వారి వెతలు వర్ణనాతీతంగా మారాయి. చాలా మంది ఉద్యోగులు కలెక్టరేట్కు వచ్చి సంబంధిత అధికారులను కలిసి అడుగుతున్నా, రేపు మాపు అంటూ, కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందంటూ తిప్పి పంపిస్తుండడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ పెండింగ్ ఫైళ్లు కలెక్టరేట్లో ఎక్కడ ఉన్నాయో తెప్పించుకొని కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్లియర్ చేయాలని అభ్యర్థిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా వీటిని క్లియర్ చేస్తే ఆర్థికంగా తమ కుటుంబాలను అదుకున్నవారవుతారని వేడుకుంటున్నారు.2023 మార్చి నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను కొద్ది నెలల క్రితం ప్రభుత్వం క్లియర్ చేసేందుకు నిధులిచ్చినా జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి ఉందని వాపోతున్నారు. దేవుడి కరుణించినా, పూజారి వరమివ్వలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను ఫోన్లో సంప్రదిస్తే కలెక్టరేట్లో ఏమీ పెండింగ్లో లేవని, అంతా క్లియర్ అయ్యాయని చెబుతుండడం గమనార్హం. ఇదిలాఉండగా ఈ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోతే కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆందోళన చేస్తామని కలెక్టరేట్లోని సిబ్బందిని శనివారం కలిసి వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అన్నారు. ఈ 45 మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు కలిపి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చన్నారు.కలెక్టరేట్లో మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు రేపు, మాపు అంటూ సిబ్బంది దాటవేస్తుండడంతో ఆందోళన పెండింగ్ ఫైళ్లు లేవంటున్న అధికారులు -
వరంగల్లో దంచికొట్టిన వర్షం.. ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు..
సాక్షి, వరంగల్: వరంగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం కాగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, తిరుమల జంక్షన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు మేరకు వరద నీరు నిలిచిపోవడంతో అతి కష్టం మీద ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Warangalrains!!After a heavy rains in warangal city Railway under bridge under water logging situation stay safe 🚨🌧️⚠️ pic.twitter.com/G2yyU4ZWv2— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025భారీ వర్షం కారణంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. #Warangalrains!!Now heavy downpour rains going in warangal tricity places Hnk Kazipet warangal city alert 🌧️🌧️🚨 pic.twitter.com/UBEfX6WgMn— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025Today two RTC Buses were struck up at under bridge Warangal into 5 ft water and about 20 passengers were struck up in the buses. Immediately CI Inthezargunj along with his staff proceeded to the spot and rescued all the passengers in two buses.@cpwarangal @dcpczwrl @Acp_wrlc pic.twitter.com/9VAOBtSs3H— SHO INTHEZARGUNJ (@shointhezargunj) September 7, 2025 -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
వేలేరు: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి అన్నారు. శనివారం వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో ఆమె ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. మహిళలకు 10 రోజలు పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జిల్లా మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడ, మగ సమానమని, ఎవరైనా బ్రూణ హత్యలకు పాల్పడినట్లు తెలిస్తే వైద్యారోగ్య శాఖ వాట్సాప్ నం 63000 30940, 100, 1098, 181టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. మాతా శిశు సంక్షేమ ప్రోగాం అధికారి మంజుల మాట్లాడుతూ.. మండలంలో 1,000 మంది బాలురకు 932 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. మొదట ఒక ఆడపిల్ల ఉన్న కుటుంబంపై రెండో కాన్పులో నిఘా పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైధ్యాధికారి మేఘన, ఆయుష్ డాక్టర్ మమత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ కళ్యాణి, సూపర్వైజర్ ఝాన్సీ, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు,రాజేశ్వర్ రెడ్డి, స్వర్ణలత, లావణ్య, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి -
ముసాయిదా విడుదల
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ పరిఽధిలో పోలింగ్ స్టేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఓటర్ల వివరాల్ని జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ బి.రవి, మండలాల్లో మండల అభివృద్ధి అధికారులు శనివారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 6న జిల్లా పరిషత్ పరిధి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వివరాలు పోలింగ్ స్టేషన్ల వివరాలు ప్రదర్శించాలని షెడ్యూల్లో పేర్కొంది. ఈమేరకు శనివారం వివరాలు జెడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈనెల 8న జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించాలని, వచ్చిన అభ్యంతరాల్ని ఈనెల 9న పరిష్కరించాలని, 10న తుది జాబితా ప్రదర్శించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్లో పేర్కొంది. హనుమకొండ జిల్లా పరిధిలో 12 జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 129 మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లు 3,70,871 ఉండగా పురుషులు 180666, మహిళలు 190201, ఇతరులు నలుగురు ఉన్నారు. ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, శాయంపేటలో ఒకరి చొప్పున ఇతరులున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 9,535 మంది అధికంగా ఉన్నారు. ప్రతీ మండలంలోనూ మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 631 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలను మండలానికి ఒకటి చొప్పున గుర్తించారు. 10న తుది జాబితా ప్రదర్శన జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ -
ఆలస్యం.. జలచరాలకు విషం!
సాక్షి, వరంగల్: నగరంలో నిమజ్జన తంతు ముగిసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతి ప్రతిమలతో చెరువుల్లో వేల టన్నుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా చెరువులు కాలుష్యానికి కేంద్రాలవుతున్నాయి. ఈ ఘనవ్యర్థాలను రోజుల వ్యవధిలో తీయాల్సిన బల్దియా, నీటి పారుదల శాఖ అధికారులు ఆలసత్వం వహిస్తున్నారు. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో ఆయా చెరువులు మరింత కలుషితమవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జలచరాలతో పాటు భూగర్భజల మట్టం హానికారంగా మారనుంది. ఆ నీటిని సాగుకు ఉపయోగిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలకు ఉండే ఇనుము, కలప చిన్న వడ్డేపల్లి చెరువులో కనిపించింది. చెరువుల పరిరక్షణ సొసైటీ సభ్యులు ఇటీవల బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వాటిని తొలగించారు. బతుకమ్మ పండుగ తర్వాత? బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో పూలను వేస్తారు. వాటితో పాటుగానే నిమజ్జన వ్యర్థాలను నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తొలగిస్తారని బల్దియా ఉన్నతాధికారులు చెబుతున్నారు. వినాయకులు నిమజ్జనం చేసిన గంటల వ్యవధిలోనే ఈ వ్యర్థాలను తొలగించడం ద్వారా కొంతమేర జల కాలుష్యానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్లో 22 చెరువుల్లో కలిపి చిన్న, పెద్దవి కలిపి 15,000 విగ్రహలు నిమజ్జనమైనట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు నీటిలో ప్రవేశించడంతో జలాయశంలో ప్రతీ లీటర్ నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం, అదేసమయంలో నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుందన్న ఆందోళన ఉంది. ఇది ప్రతి లీటర్ నీటిలో సున్నాగా నమోదయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే వ్యర్థాలను తొలగించాలి.. చెరువుల్లో చేపలు, పక్షులు, వృక్ష, జంతు, అణుకీట కాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతోంది. భూగర్భజ లాలు హాని కారకాలుగా మారతాయి. ఆయా చెరువుల్లో పట్టిన చేపలను తిన్న వారికి శరీరంలోకి హాని కారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మాన వ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరి యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వీట న్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిమజ్జనం జరిగిన గంటల వ్యవధిలోనే వ్యర్థాలను తొలగించాలి. – పెరుమాండ్ల లక్ష్మణ్, చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు తక్షణమే చర్యలు తీసుకోవాలి.. చెరువుల్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. ఆలస్యమైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలు, రసాయనాలతో పూసిన రంగులు చెరువులో కలిసి చేపలు మృత్యువాత పడతాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోకముందే వినాయక విగ్రహాల వ్యర్థాలను వెంటనే తొలగించాలి. – శీలం సాంబయ్య, అల్లీపురం, వరంగల్ఏటా నిమజ్జనం అనంతరం చెరువుల్లో లభ్యమయ్యే వ్యర్థాలు గ్రేటర్ నగరంలోని చెరువులు : 22 ఘన వ్యర్థాలు : 5 వేల టన్నులు అధిక గాఢత ఉన్న రసాయనాలు : 10 వేల లీటర్లు ఇనుము : 100 టన్నులు కలప : 50 టన్నులు, పీఓపీ 20 టన్నులు గ్రేటర్ వరంగల్లోని 22 చెరువుల్లో వేల టన్నుల వ్యర్థాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం రోజుల వ్యవధిలో తొలగిస్తేనే జలచరాలకు మంచిది బతుకమ్మ పండుగ తర్వాతే తొలగింపు ఉంటుందనడంతో ఆందోళన ప్రజలకు డెంగీ, మలేరియా ప్రబలే అవకాశం త్వరగా వ్యర్థాలు తొలగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు -
యూరియా కోసం బారులు
ఖానాపురం: మండలంలోని అశోక్నగర్లో రైతులు యూరియా కోసం భారీగా బారులు తీరారు. శనివారం ఉదయం 555 బస్తాల యూరియా రాగా.. అశోక్నగర్, చిలుకమ్మతండా, పర్శతండా, అయోధ్యనగర్ తదితర గ్రామాల నుంచి సుమారు 1200 మంది రైతులు వచ్చారు. తోపులాట జరిగి మహిళలు కొట్టుకున్నారు. దీంతో యూరియా పంపిణీని అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చారు. టోకెన్లు ఇవ్వడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేయగా రైతులు, సీపీఎం నాయకులు అశోక్నగర్లో రాస్తారోకో చేశారు. అనంతరం టోకెన్లు ఇచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. టోకెన్ల పంపిణీని ఏడీఏ దామోదర్రెడ్డి పరిశీలించారు. ఎస్సై రఘుపతి, సొసైటీ సీఈఓ ఆంజనేయులు రైతులకు సర్దిచెప్పి యూరియా పంపిణీ సజావుగా సాగించారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను మాత్రమే ఇచ్చారు. యూరియా అందని రైతులు భారీగా వెనుదిరిగిపోయారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.వరంగల్ రీజియన్ పరిధిలో నడిచే ఎలక్ట్రికల్ బస్సులు సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్నాయి. వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం రేవంత్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు.కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్షిప్నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్లాగ్, క్లాసిఫికేషన్కు విద్యార్థులు సహకారం అందిస్తారు. –డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
పల్లెలకు పాలనాధికారులు
నల్లబెల్లి: శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, గ్రామాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలందించేందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (జీపీఓ)ను నియమించింది. జిల్లాలో నియమితులైన 165 మంది ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్లోని మాదాపూర్లో హైటెక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. వీరందరికీ రెండు రోజుల్లో కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానంగా సొంత మండలం, నియోజకవర్గంలో నియమించరాదని నిబంధన విధించింది. గ్రామపాలన అధికారి పోస్టుల భర్తీకి గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి పరీక్షలు నిర్వహించి అర్హులను జీపీఓలుగా ఎంపిక చేసింది. నియామకపత్రాలు అందుకున్న వారిని క్లస్టర్ల వారీగా నియమించనుంది. వీరి నియామకంతో గ్రామాల్లో రెవెన్యూ, భూముల వివాదాలు త్వరగా పరిష్కారంకానున్నాయి. ప్రజలు మండల కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, విద్య తదితర శాఖల మధ్య సహకారం పెరుగుతుంది. జిల్లాలో 174 రెవెన్యూ క్లస్టర్లు.. 191 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జీపీఓల విధులు.. ● గ్రామ పరిపాలన అధికారులు గ్రామ స్థాయిలో రెవెన్యూ, పరిపాలన సేవల సమన్వయకర్తలుగా ఉంటారు. ● ధ్రువపత్రాల జారీకి సంబంధించి విచారణ చేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నీటి వనరులను కాపాడాలి. ● సర్వేయర్లకు సహకరించి, భూవివాదాలను పరిష్కరించాలి. ● విపత్తుల సమయంలో దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడంతోపాటు గ్రామాల్లో అత్యవసర సేవలు అందించాలి. ● ఎన్నికల విధుల్లో సిబ్బందికి సాయం చేయాలి. మండలంలోని అధికారులతో సమ్వయంతో కలిసి పనిచేయాలి. ● ప్రభుత్వం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయి అధికారులు ఏపని అప్పగించినా చేయాలి. 165 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల్లో కౌన్సెలింగ్, మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్ గ్రామాల్లో పరిష్కారం కానున్న రెవెన్యూ, భూ సమస్యలు జిల్లాలో 174 రెవెన్యూ క్లస్టర్లు.. 191 రెవెన్యూ గ్రామాలు -
ఆలస్యం.. జలచరాలకు విషం!
సాక్షి, వరంగల్: నగరంలో నిమజ్జన తంతు ముగిసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతి ప్రతిమలతో చెరువుల్లో వేల టన్నుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా చెరువులు కాలుష్యానికి కేంద్రాలవుతున్నాయి. ఈ ఘనవ్యర్థాలను రోజుల వ్యవధిలో తీయాల్సిన బల్దియా, నీటి పారుదల శాఖ అధికారులు ఆలసత్వం వహిస్తున్నారు. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో ఆయా చెరువులు మరింత కలుషితమవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జలచరాలతో పాటు భూగర్భజల మట్టం హానికరంగా మారనుంది. ఆ నీటిని సాగుకు ఉపయోగిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలకు ఉండే ఇనుము, కలప చిన్న వడ్డేపల్లి చెరువులో కనిపించింది. చెరువుల పరిరక్షణ సొసైటీ సభ్యులు ఇటీవల బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వాటిని తొలగించారు. బతుకమ్మ పండుగ తర్వాత? బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో పూలను వేస్తారు. వాటితో పాటుగానే నిమజ్జన వ్యర్థాలను నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తొలగిస్తారని బల్దియా ఉన్నతాధికారులు చెబుతున్నారు. వినాయకులు నిమజ్జనం చేసిన గంటల వ్యవధిలోనే ఈ వ్యర్థాలను తొలగించడం ద్వారా కొంతమేర జల కాలుష్యానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్లో 22 చెరువుల్లో కలిపి చిన్న, పెద్దవి కలిపి 15,000 విగ్రహలు నిమజ్జనమైనట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు నీటిలో ప్రవేశించడంతో జలాయశంలో ప్రతీ లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం, అదేసమయంలో నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుందన్న ఆందోళన ఉంది. ఇది ప్రతి లీటరు నీటిలో సున్నాగా నమోదయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఏటా నిమజ్జనం అనంతరం చెరువుల్లో లభ్యమయ్యే వ్యర్థాలుగ్రేటర్ నగరంలోని చెరువులు: 22 ఘన వ్యర్థాలు: 5 వేల టన్నులు అధిక గాఢత ఉన్న రసాయనాలు: 10 వేల లీటర్లు ఇనుము: 100 టన్నులు, కలప: 50 టన్నులు, పీఓపీ: 20 టన్నులు గ్రేటర్ వరంగల్లోని 22 చెరువుల్లో వేల టన్నుల వ్యర్థాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం రోజుల వ్యవధిలో తొలగిస్తేనే జలచరాలకు మంచిది బతుకమ్మ తర్వాతే తొలగింపు ఉంటుందనడంతో ఆందోళన ప్రజలకు డెంగీ, మలేరియా ప్రబలే అవకాశం త్వరగా వ్యర్థాలు తొలగించాలంటున్న పర్యావరణ ప్రేమికులువెంటనే వ్యర్థాలు తొలగించాలి.. చెరువుల్లో చేపలు, పక్షులు, వృక్ష, జంతు, అణుకీటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతోంది. భూగర్భజలాలు హాని కారకాలుగా మారతాయి. ఆయా చెరువుల్లో పట్టిన చేపలను తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిమజ్జనం జరిగిన గంటల వ్యవధిలోనే వ్యర్థాలను తొలగించాలి. – పెరుమాండ్ల లక్ష్మణ్, చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడుతక్షణమే చర్యలు తీసుకోవాలిచెరువుల్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. ఆలస్యమైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలు, రసాయనాలతో పూసిన రంగులు చెరువులో కలిసి చేపలు మృత్యువాత పడతాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోకముందే వినాయక విగ్రహాల వ్యర్థాలను వెంటనే తొలగించాలి. – శీలం సాంబయ్య, అల్లీపురం, వరంగల్ -
మరణించినా ‘మోస్ట్వాంటెడ్’లే!
సాక్షిప్రతినిధి, వరంగల్: దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ టాప్ నక్సలైట్ నేతలందరినీ ఎన్కౌంటర్లలో చంపేసినా.. వారి పేర్లు ఇంకా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది మేలో ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. అదే రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్చార్జిగా ఉన్న అగ్రనేత బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ కూడా బలగాల ఎన్కౌంటర్లో చనిపోయారు. వీరి పేర్లు ఇంకా ఎన్ఐఏ వెబ్సైట్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులోనే ఉండటం గమనార్హం. జాబితాలో 317 పేర్లు దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న 317 మంది పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారందరి పేర్లు, ఫొటోలతో కూడిన వివరాలను వెబ్సైట్లో మోస్ట్వాంటెడ్ లిస్టులో చేర్చింది. ఇందులో నంబాల కేశవరావుతోపాటు పలువురి పేర్లు ఉన్నాయి. దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ బీజాపూర్ జిల్లాలో 2024 ఏప్రిల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఆంధ్ర– ఒడిశా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఈ ఏడాది జూన్ 17న ఏపీ– ఒడిశా సరిహద్దులోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనతో పాటు మరో కీలక నేత వెంకటరవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ కూడా మృతి చెందారు.నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హన్మంతు ఏడాది జనవరి 25న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాన్ కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాత మహబూబ్నగర్లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కోడి మంజుల అలియాస్ నిర్మల 2024 నవంబర్లో వరంగల్ పోలీసు కమిషనర్ ఎదుట లొంగిపోయారు.మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఉండి 2021 జూన్ 21న ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో కోవిడ్ వ్యాధితో మరణించారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్ జిల్లాలో మృతి చెందాడు. వీరందరి పేర్లు ఇంకా మోస్ట్వాంటెడ్ లిస్టులో ఉండటం గమనార్హం. అయితే, మావోయిస్టు పారీ్టలో ఇంకా కీలకంగా ఉన్నారని భావిస్తున్న సుమారు 40 మంది ఎన్ఐఏ హిట్లిస్టులో ఉన్నట్లు సమాచారం.వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మడావి హిడ్మా, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ సాధు, మల్లా రాజిరెడ్డి, మోడం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతలు ఉన్నట్లు తెలిసింది. -
ఆస్పత్రి రోడ్డు అధ్వానం
● నర్సంపేటలో రోగుల ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులునర్సంపేట రూరల్: ఆస్పత్రికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. నర్సంపేట పట్టణం సర్వాపురం గ్రామ శివారులోని పది ఎకరాల స్థలంలో ప్రభుత్వం మూడు బ్లాక్లతో పెద్దాస్పత్రి నిర్మించింది. మరో బ్లాక్ నిర్మాణంలో ఉంది. ఆస్పత్రికి అనుసంధానంగా వైద్య కళాశాల, పారామెడికల్, నర్సింగ్ కళాశాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, భవనాల నిర్మాణం పూర్తి కావడంతో ఓపీ (అవుట్ పేషంట్), ఇన్పేషంట్ (ఐపీ) సేవలు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలోని సీ బ్లాక్లో వైద్య కళాశాల, పారామెడికల్ కళాశాల నడిపిస్తున్నారు. నర్సింగ్ కళాశాలకు భవనాలు లేకపోవడంతో గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లిలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. నిత్యం వైద్య సేవల కోసం వందల మంది రోగులు, వారి బంధువులు ఆస్పత్రికి వస్తున్నారు. నర్సంపేట–కొత్తగూడ ప్రధాన రహదారి నుంచి ఆస్పత్రి, కళాశాలకు వెళ్లాలంటే సుమారు 900 మీటర్ల దూరం ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ గుంతల్లో నీరు నిలిచింది, అంతేకాకుండా వరదలా నీరంతా ప్రవహిస్తోంది. దీంతో ఆ రోడ్డు నుంచి ప్రజలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు వాహనదారులైతే ఏకంగా కిందపడిపోయి మళ్లీ అదే ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభం కాకముందే రోడ్డు వేయాలని కలెక్టర్ అప్పుడే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రారంభం చేసి ఏడాది గడిచింది. ఆరు నెలల క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు వచ్చాయని, టెండర్ దశలో ఉందని చెప్పి పనులు ఇప్పటివరకూ ప్రారంభించకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించి పూర్తిచేయాలని రోగులు కోరుతున్నారు. ఆస్పత్రికి వెళ్లాలంటే తిప్పలు.. నర్సంపేట పట్టణ శివారులోని పాకాల రోడ్డు సమీపంలో పది ఎకరాల్లో నూతన ఆస్పత్రి భవనం నిర్మించారు. నర్సంపేట–కొత్తగూడ ప్రధాన రహదారి నుంచి ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. 900 మీటర్ల దూరలో ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షాలు కురిస్తే వరద నీరు రోడ్డుపై నుంచే పారుతోంది. తక్షణమే ఉన్నతాఽధికారులు స్పందించి రోడ్డు నిర్మించి రోగుల కష్టాలు తీర్చాలి. – గంధసిరి రాజేశ్, నర్సంపేట -
దొడ్డు బియ్యం ఎలుకల పాలు!
● ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వ ● లక్కపురుగు పట్టి, ముక్కిపోతున్న రైస్ ● తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు ఖిలా వరంగల్: చౌకధరల దుకాణాల్లో ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ దుకాణాల్లో ఐదు నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు వృథాగా ఉంటున్నాయి. చాలాచోట్ల వీటికి లక్కపురుగు పట్టడంతోపాటు ముక్కిపోతున్నాయి. ఎలుకలు బస్తాలు కొరికి బియ్యం కుప్ప పోస్తున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇలాగే ఉంచితే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతాకార్డు (ఎఫ్ఎస్సీ) ఒక్కో యూనిట్కు ఆరు కిలోలు, అంత్యోదయ ఆహార భద్రతాకార్డు (ఏఎఫ్ఎస్సీ)కు 35 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. కోటా కేటాయింపులో ఆలస్యం కారణంగా ఈ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్డుదారులు రాష్ట్రంలో ఏ దుకాణంలోనైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో కొంతమంది డీలర్లు లబ్ధి పొందుతుంటే, మరికొంతమంది నష్టపోతున్నారు. అద్దె ఇళ్లలో షాపులు.. జిల్లాలో 85 శాతం రేషన్షాపులు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. అవి కూడా చిన్నగా ఉండడం, వాటిలోనే దొడ్డు బియ్యం నిల్వలు ఉంచడంతో డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడంతో 60 రోజులకు పైగా డీలర్లు దుకాణాలు తెరవలేదు. దీంతో నిల్వ ఉన్న బియ్యం ఎలా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. జిల్లాలో సుమారు 32 వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలున్నట్లు తెలుస్తోంది. వీటిని ఎప్పుడు తరలిస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇప్పటికే ఐదు నెలలు గడిచింది. ఎక్కువ సమయం అలాగే ఉంచితే చేతికి వచ్చే పరిస్థితి లేదు. వాటిలో ఇప్పటికే దుమ్ము, పురుగులు కనిపిస్తున్నాయి. దొడ్డు బియ్యం నిల్వలు ఉండడంతో సన్నబియ్యం ఉంచేందుకు స్థలం లేక అదనపు గదులు అద్దెకు తీసుకొని ఆర్థికంగా నష్ట పోతున్నామని డీలర్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా దొడ్డు బియ్యాన్ని ఖాళీ చేయించి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈవిషయమై పౌర సరఫరాల అధికారులను వివరణ కోరగా దొడ్డు బియ్యం వెనక్కి తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
నర్సంపేట: గణపతి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు నర్సంపేట మండలం దామెర చెరువు నిమజ్జన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సత్యశారద, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ప్రధాన చెరువుల వద్ద 6,500 విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.71 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని, జిల్లాస్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు వివరించారు. నర్సంపేటలోని దామెర చెరువులో సుమారు వెయ్యి విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
గురువులు ఆరాధ్య దైవాలు
● దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే మార్గదర్శకులు ● విద్యా ప్రమాణాల పెంపే సీఎం లక్ష్యం ● ఉపాధ్యాయ దినోత్సవంలో మేయర్ గుండు సుధారాణి ● 68 మంది టీచర్లకు పురస్కారాల ప్రదానంఖిలా వరంగల్: గురువులు ఆరాధ్యదైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట ఆకుతోట కన్వెన్షన్హాల్లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్తో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ.21వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ గురువులు నేర్పిన విద్యతోనే ఈస్థాయికి ఎదిగామని అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని, వారి చేతుల్లోనే విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 68 మందికి అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు. ఎంఈఓలు, సమగ్రశిక్షణ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్ గురువుల చేతుల్లోనే..
విద్యారణ్యపురి: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో ఎంపికై న వివిధ కేటగిరీల టీచర్లు 62మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ప్రదానం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బండా ప్రకాశ్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో తనలాంటి వారు నిలబడటానికి తనకు విద్యాబుద్ధులు నేర్పి వారి విజ్ఞానాన్ని పంచిన గురువులే కారణమన్నారు. కలెక్టర్ స్నేహ శబరీస్ మాట్లాడుతూ టీచర్లలో బెస్ట్ అని ఆర్డనరీ అంటూ ఉండరని, తన దృష్టిలో అందరూ ఉత్తమ టీచర్లనేనన్నారు. విద్యతోనే విద్యార్థుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఉత్తములుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. డీఈఓ డి.వాసంతి మాట్లాఉడతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము మార్పుకోవాలన్నారు. న్యాస్ సర్వేలో మూడు తరగతుల్లో జిల్లా అత్యున్నతస్థాయిలో ఉందన్నారు. మర్కజీ పాఠశాల విద్యార్థులు సంస్కృతిక కార్యాక్రమాలు ప్రదర్శించారు. వల్సపైడి వాఖ్యాతగా వ్యవహరించగా, సమావేశంలో మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్ ఏనుగుల మానస, డీఐఈఓ గోపాల్, ఎంఈఓ నెహ్రూనాయక్ . డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ పాల్గొన్నారు. గురువులు ఆరాధ్య దైవాలు : మేయర్ గుండు సుధారాణిఖిలా వరంగల్: గురువులు ఆరాధ్యదైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్టలోని ఓ కన్వెన్షన్హాల్లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్తో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రూ.21వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్యతోనే ఈస్థాయికి ఎదిగామన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని, వారి చేతుల్లోనే విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 68 మందికి అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు. ఎంఈఓలు, సమగ్రశిక్షణ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. హనుమకొండలో తొలి జాబితాను సవరించి రెండో జాబితా సంఘాల ప్రాతినిథ్యంతో మూడో జాబితా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం -
ఘనంగా త్రిశూల స్నానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో పంచలోహ ఉత్తిష్ట గణపతికి త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ మూల మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తిష్ట గణపతిని, గౌరీ గణపతిని పల్లకిలో ప్రతిష్టించి నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వచ్చి ప్రాచీన కోనేరు జలంలో త్రిశూల తీర్థోత్సవం ఉత్తిష్టగణపతికి పంచసూక్తవిధానంతో అవబృధస్నానం జలాధివాసం నిర్వహించారు. గౌరీగణపతిని నిమజ్జనం చేశారు. అనంతరం ఉత్తిష్ట గణపతిని తిరిగి రుద్రేశ్వరుడి సన్ని ధిలో ప్రతిష్టించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రం గణపతి ఉత్సవ విగ్రహాన్ని సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేశారు. -
నేరస్తులకు భయం కలిగించాలి : సీపీ
వరంగల్ క్రైం: ఏదైనా నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ న్యాయస్థానాల్లో జరిగిన ట్రయల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిందితులకు కోర్టులో శిక్షలు పడడంలో కృషి చేసిన జాయింట్ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు అధికారులు, కోర్టు, ప్రాసెస్ విధులు నిర్వహించే పోలీస్ అధికా రులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. పెరిగిన శిక్షల శాతం ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు చేసిన వారికి కోర్టుల్లో పడిన శిక్షల శాతం పెరిగిందన్నారు. ట్రయల్ కేసుల్లో మొత్తం 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 6 హత్య కేసులు, 5 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడగా, ఒక కేసులో పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు తెలిపారు. నాలుగు అత్యాచారం కేసుల్లో రెండు కేసుల్లో జీవితఖైదు, మరో రెండు కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఎస్టీ, ఎస్సీ మానభంగం కేసులో ఏడేళ్లు, చోరీ, ఇతర కేసులకు సంబంధించి ఐదు కేసుల్లో మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, వరంగల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ రాములు, సంగారెడ్డి జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, సీసీ ఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంతోషి, శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, పావని, రాజ మల్లారెడ్డి, దుర్గాబాయి, భరోసా కేంద్రం న్యాయధికారి నీరజ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, ముస్కా శ్రీనివాస్, రవికుమార్, కరుణాకర్, పుల్యాల కిషన్, ఎస్ఐ నర్సింహరావుతో పాటు సీసీఆర్బీ సిబ్బంది, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. -
వ్యాధుల కాలం జాగ్రత్త..
గీసుకొండ: విస్తారంగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పరిసర ప్రాంతాలు, రోడ్లు చిత్తడిగా మారాయి. డ్రెయినేజీలు లేని చోట మురుగునీరు రోడ్లుపైకి చేరుతోంది. పలు ప్రాంతాల్లోని గుంతలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలు, ఈగలకు నిలయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కీటకజనిత వ్యాధులతోపాటు డయేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దోమల ద్వారా మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులు, కలుషిత ఆహారం, తాగునీటితో డయేరియా సోకి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, డయేరియా సోకితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, హెల్త్ సబ్సెంటర్లకు వెళ్లాలని సూచిస్తున్నారు. వరంగల్ నగరంలో సమస్యాత్మక ప్రాంతాలు.. వరంగల్ నగర పరిధిలో డెంగీ సోకే సమస్యాత్మక ప్రాంతాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. దేశాయిపేట అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ (యూపీహెచ్సీ) పరిధిలో సీకేఎం కళాశాల ప్రాంతం, ఎల్బీనగర్, ఎంహెచ్ నగర్, కాశిబుగ్గ యూపీహెచ్సీపరిధిలో సొసైటీ కాలనీ, పద్మనగర్, కీర్తినగర్ యూపీహెచ్సీ పరిధిలో ఎన్టీఆర్నగర్తోపాటు ఎంజీఎం ప్రాంతంలోని రామన్నపేట, కొత్తవాడ, మట్టెవాడ, ఖిలా వరంగల్, రంగశాయిపేట, శంభునిపేట, గణేశ్నగర్ తదితర ప్రాంతాల్లో డెంగీ సోకే అవకాశాలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో.. పర్వతగిరి, నెక్కొండ, అప్పల్రావుపేట, గీసుకొండ గ్రామం, వర్ధన్నపేట, చెన్నారావుపేట, జల్లి, నందిగామ, నర్సంపేట ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. పెరుగుతున్న కేసులు.. ఆగస్టు నెలలో జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలతోపాటు పల్లె, బస్తీ దవాఖానలకు పరీక్షలు చేయించుకోవడానికి 50,271 మంది వెళ్లారని వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో జ్వరపీడితులు, డయేరియా, టైఫాయిడ్, డెంగీ, జలుబు తదితర సమస్యలు ఉన్నవారే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టెలీఫాస్ కీటక నాశిని మందు స్ప్రే.. డెంగీ, మలేరియా సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో దోమల లార్వాలను నిర్మూలించడానికి టెలీఫాస్ అనే కీటక నాశిని మందును స్ప్రే చేస్తున్నట్లు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి మాడిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట సబ్ యూనిటర్ల పరిధిలో దోమల నివారణ కోసం పైరిత్రమ్, ఆల్ఫా సైఫర్ మిత్రేన్ (5 శాతం)తో పాటు టెలిఫాస్ మందులను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ పీహెచ్సీ, సబ్సెంటర్ పరిధిలో మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం ఆర్టీడీ కిట్లు, వ్యాధి నివారణ మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూడాలని వారు సూచిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశాం..వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం జిల్లా, మండల (పీహెచ్సీ), సబ్సెంటర్ల వారీగా రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్శాఖ, పట్టణాల్లో మున్సిపల్ అఽధికారుతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సీజన్లో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట ఉంటూ సమయపాలన పాటించడంతో పాటు సత్వర వైద్య సేవలు అందించడానికి సిద్ధం కావాలి. పాము, తేలు, కుక్కకాటుతోపాటు అవసరమైన అన్ని మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాం. – బి.సాంబశివరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జిల్లాలో మూడు నెలల్లో నమోదైన కేసుల వివరాలు.. పొంచి ఉన్న డెంగీ, మలేరియా, అతిసార ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులునెల డెంగీ డయేరియా మలేరియా టైఫాయిడ్ జ్వరం జలుబు జూన్ 11 67 0 71 105 67 జూలై 14 219 1 85 421 126 ఆగస్టు 55 391 1 94 802 314 80 677 2 250 1,328 507 -
ఈజీఎస్తో రైతులు లబ్ధి పొందాలి
కలెక్టర్ స్నేహ శబరీష్దామెర: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు లబ్ధి పొంది ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని సీతారాంపూర్కు చెందిన రైతు మహమ్మద్ రంజాన్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల సాయంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. కాగా.. సదరు రైతు మర్యాద పూర్వకంగా గురువారం కలెక్టర్ను కలిసి తన చేనులో పండిన డ్రాగన్ ఫ్రూట్లను అందజేశారు. ఈసందర్భంగా పంట సాగులో తీసుకుంటున్న మెళకువలు, మార్కెటింగ్ వంటి వివరాలను రంజాన్ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న పండ్ల తోటల సాగు, నాటు కోళ్ల ఫామ్ల నిర్వహణ, డైయిరీ ఫామ్లతో మండలంలో ఎంతో మంది రైతులు ఆర్థికంగా రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ శారద తదితరులు ఉన్నారు. న్యూశాయంపేట: ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇంజనీరింగ్ బృందం ప్రిలిమినరీ సర్వేలో భాగంగా గురువారం మామునూరు ఎయిర్పోర్ట్ను పరిశీలించింది. అనంతరం బృంద సభ్యులు వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై చర్చించారు. సమావేశంలో ఏఏఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాశ్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్ ఎస్ ఈలు గౌతంరెడ్డి, రాంప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లోకల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కన్సూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం చైర్పర్సన్ ఎన్వీ.వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ కోర్టులను ఈనెల 6 నుంచి 19వ తేదీల్లో ఎన్పీడీసీఎల్ పరిధి వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ సర్కిళ్లలోఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టులను వినియోగించుకోవాలని సూచించారు. లోకల్ కోర్టులు నిర్వహించే ప్రదేశాలివే.. 6వ తేదీ: హనుమకొండ సర్కిల్, భీమదేవరపల్లి, నారాయణగిరి, కొత్తకొండ 12న: వరంగల్ సర్కిల్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ 16న: మహబూబాబాద్ సర్కిల్, డోర్నకల్, కురవి, కొత్తపేట -
పేదలకు మెరుగైన వైద్యసేవలు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు ప్రారంభం నర్సంపేట రూరల్: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. త్వరలోనే మరిన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సీటీ స్కాన్ కోసం ఇకపై వరంగల్కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నానో యూరియాతో అధిక లాభాలు పంటలకు నానో యూరియా పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద అన్నారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీపై గురువారం గురిజాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వివిధ పంటలకు నానో యూరియా వాడితే ఖర్చు, శ్రమ తగ్గుతుందన్నారు. యూరియా కంటే నానో యూరియా మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి
● ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్సంగెం: వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ ఆదేశించారు. ఎల్గూర్రంగంపేట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మండల పరిధిలో 166 వినాయక విగ్రహాల నిమజ్జనానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్న పిల్లలు, ఈతరాని వారు నిమజ్జనం సమయంలో చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలని, ఈత వచ్చిన వారిని మాత్రమే చెరువుల వద్దకు పంపించాలని కమిటీలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి డీజేలు సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. డీజేలు కాకుండా బ్యాండ్మేళాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఊరేగింపు చేసుకోవాలని, నిమజ్జనం రాత్రి 10 గంటల వరకు ముగించాలని కమిటీలను కోరారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సంగెం ఎస్సై నరేశ్, మాజీ సర్పంచ్ జనగాం రమేశ్ పాల్గొన్నారు. కట్టమల్లన్న చెరువు వద్ద ఏర్పాట్ల పరిశీలన.. గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం కట్టమల్లన్న చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఈస్ట్జోన్ డీసీపీ ఐపీఎస్ అంకిత్ కుమార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. వినాయకుడిని శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. చెరువులో వదిలే తెప్ప, క్రేన్, జేసీబీల ఏర్పాటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, పోలీసు, బల్దియా, రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
గీసుకొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ హెచ్చరించారు. కేఎంటీపీలో అక్రమంగా వెలసిన షాపులను గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. గుండుంబా, మాదకద్రవ్యాల అమ్మకం, బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, సంగెం ఎస్సై నరేశ్, సిబ్బంది ఉన్నారు. నేడు ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రదానం విద్యారణ్యపురి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఖిలా వరంగల్ మండలం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. జిల్లాలో 52 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 16 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ తదితరులు పాల్గొంటారని డీఈఓ తెలిపారు. నేడు రేషన్ షాపుల బంద్ ఖిలా వరంగల్: తెలంగాణ రేషన్ డీలర్ల అసోసియేషన్ రేషన్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని 509 రేషన్ షాపులు మూతపడనున్నాయి. ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన 21 నెలలు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా ధారావత్ మోహన్నాయక్ పేర్కొన్నారు. డీలర్ల కుటుంబాలకు హెల్త్కార్డులు మంజూరు చేయాలని, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో పాడైపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని, క్వింటాలుకు రూ.140 నుంచి రూ.300కు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఒక రోజు బంద్తోనైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని మోహన్నాయక్ హెచ్చరించారు. 7న భద్రకాళి దేవాలయం మూసివేత హన్మకొండ కల్చరల్ : భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున భద్రకాళి దేవాలయాన్ని ఆరోజు మధ్యాహ్నం 1 గంటకు పూజల అనంతరం మూసివేయనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణమోక్షానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి సోమవారం ఉదయం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు. హసన్పర్తి: ఎస్సారెస్పీ జలాలు గురువారం సాయంత్రం జిల్లాకు చేరాయి. చివరి (ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు) ఆయకట్టు వరకు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. లోయర్ మానేరు నుంచి 3,000 క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు, వార బందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..
కేయూ క్యాంపస్: తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డుల జాబితాను గురువారం ప్రకటించింది. గురుపూజోత్సవం రోజున (నేడు, శుక్రవారం) వీరికి హైదరాబాద్ మాదాపూర్లోని శిల్ప కళా వేదికలో జరిగే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. ఇందులో కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లారం అరుణ, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రశాంతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు గన్సింగ్ హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్. మల్లయ్య ఎంపికయ్యారు. పరిశోధనల్లో మేటి.. కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్ పరిశోధనల పరంగా 12 పేటెంట్లు కలిగి ఉన్నారు. వీటిలో క్యాన్సర్ బయాలజీపై పరిశోధనలు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్యాన్సర్ థెరఫీ పోస్ట్ డాక్టరల్ ఫెలోగా, స్ట్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్లో పని చేశారు. ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్గా హాస్టళ్ల డైరెక్టర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసాద్ పర్యవేక్షణలో ఏడుగురు పీహెచ్డీ పూర్తి చేశారు. బోధనలో ఘనాపాటి హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లారం అరుణ రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. కెమిస్ట్రీకి సంబంధించిన పది పాఠ్యపుస్తకాలు రచించారు. టీసాట్ నిపుణ విద్య చానల్లో 12 ప్రత్యక్ష ప్రసారాలు అందించారు. ఆమె పర్యవేక్షణలో విద్యార్థులు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లోనూ మొదటి బహుమతి సాధించారు. లేరెవ్వరు సాటి.. ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రశాంతి విద్యార్థులకు సృజనాత్మక డిజిటల్ పద్ధతుల ద్వారా కెమిస్ట్రీ బోధిస్తున్నారు. విద్యార్థులకు ఉపయుక్తమైన మూడు పుస్తకాలు రాశారు. పరిశోధనలపరంగా రెండు పేటెంట్లు కలిగి ఉన్నారు. ఆమెకు సంబంధించిన 22 రీసెర్చ్ పేపర్లు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. సామాజిక సేవ.. ఆయన తోవ.. హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు గన్సింగ్ బోధనతో పాటు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. హరితహారం ఇన్చార్జ్గా సేవలు అందిస్తున్నారు. ‘ప్రాజెక్టు’ల రూపకల్పనలో దిట్ట హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈమేరకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా కూడా అవార్డు ఇప్పటికే అందుకున్నారు. ఐదు పుస్తకాలు రాశారు. జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టులను రూపొందించడంలోనూ దిట్ట. 25 పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమాయ్యయి. అంతరించిపోతున్న కళారూపాలకు జీవం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా గిరిజన విజ్ఞానపీఠంలో వివిద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. పటం కథలు, కథకులు అనే అంశంపై పరిశోధనచేసి గ్రంథాన్ని వెలువరించారు. అంతరించిపోతున్న జానపద గిరిజన కళారూపాలను, కళాకారులను గుర్తించి పలు కళారూపాలను ఆడియో, వీడియో ఫొటో మాధ్యమాల్లో డాక్యుమెంటేషన్ చేశారు. జానపద గిరిజన విజ్ఞాన బహుముఖ అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి 20కి పైగా పుస్తకాలు రాశారు. వివిధ జర్నల్స్లో, పుస్తకాల్లో 70 వరకు వ్యాసాలు రాశారు. జాతీయ స్థాయి సదస్సుల్లో 50 వరకు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఎన్.ప్రసాద్ మల్లారం అరుణ ప్రశాంతి మాలోతు గన్సింగ్, ఎన్.మల్లయ్య, గడ్డం వెంకన్న నేడు హైదరాబాద్లో సీఎం చేతులమీదుగా అవార్డులు వృత్తిలో వారి సేవలు గుర్తించి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం -
నిమజ్జనం.. సర్వం సిద్ధం
వరంగల్ అర్బన్: విశేష పూజలందుకున్న బొజ్జగణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సర్వం సన్నద్ధమైంది. వరంగల్ మహా నగర వ్యాప్తంగా గణనాథులను వాహనాలపై కొలువుదీర్చి శోభాయాత్రతో ఆయా ప్రాంతాల్లోని 19 చెరువుల వద్ద శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగ సముద్రం, గొర్రెకుంట కట్ట మల్లన్న, గుండు చెరువు అగర్తలా, మామునూరు బెస్తం చెరువుల్లో నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు, గోపాలపురం, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్ల సింగారం, రాంపేట, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేయర్, కలెక్టర్లు, పోలీస్, నగర కమిషనర్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లు దిశానిర్దేశం చేశారు. ఆయా కేంద్రాల్లో నిమజ్జనం కోసం బల్దియా రూ.1.50 కోట్లతో నిధుల్ని వెచ్చించింది. ఇక వివిధ శాఖల అధికారులు తమ పరిధి సౌకర్యాలు కల్పించారు. ఏర్పాట్లు ఇలా.. ● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 32 క్రేన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగ సముద్రం 3, బెస్తం చెరువు, ఖిలా వరంగల్ అగర్తలా ఒకటి చొప్పన ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 3, బంధం చెరువుల వద్ద 3, హసన్పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు. ● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్ వర్క్లు, రోడ్ల విస్తరణ ఇరువైపులకు రూ.35లక్షలు ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద జిగేల్మనేలా లైటింగ్ ఏర్పాటుకు రూ.14 లక్షలు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించారు. ఐదు చోట్ల సీసీ కెమెరాలు: బల్దియా ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఐదు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరంగల్లోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు రంగసముద్రం, హనుమకొండ బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేశారు. ● అదేవిధంగా అన్ని నిమజ్జన ప్రాంతాల్లో ఎన్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ ఎం వినియోగించారో పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రధాన చెరువుల వద్ద బల్దియా జనరేటర్లను అందుబాటులో ఉంచుతారు. ● ఆర్అండ్బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ● మత్స్య శాఖ 1,200 మంది గజ ఈతగాళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్ల ద్వారా సేవలు అందించనున్నారు. ● రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ● మెడికల్ అండ్ హెల్త్ శాఖ ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 108 వాహనాలను ఆయా సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము వరకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సేవలు అందించనున్నారు. ఆర్అండ్బీ: అన్ని చోట్ల బారికేడ్లు ● మెడికల్ అండ్ హెల్త్: ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. ● పోలీస్ శాఖ: బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రా ఫిక్ నియంత్రణను పకడ్బందీగా నిర్వహించనున్నారు.నేడు బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు ప్రమాదాలకు తావులేకుండా అన్ని శాఖలు అప్రమత్తం నగరంలోని 19 కేంద్రాల్లో రూ.1.50 కోట్ల నిధులతో ఏర్పాట్లు 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు పర్యవేక్షించిన మేయర్, కలెక్టర్లు, కమిషనర్, అధికారులువరంగల్ అర్బన్/ఖిలావరంగల్ : గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి, ఉర్సు రంగసముద్రం, పడమరకోట మాల అగర్త, బెస్తం చెరువు, కట్టమల్లన్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మేయర్, పోలీస్ కమిషనర్ సన్ ప్రీతీ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించింది. హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువులను కలెక్టర్ స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల వద్ద ఏర్పాట్ల కోసం రూ.1.50 కోట్లు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి మూడు జోన్లలో నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 2,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రత్యేకించి ట్రై సిటీ పరిధిలో 1,600 మందికిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. శోభాయాత్రతోపాటు నిమజ్జనం సజావుగా కొనసాగేందుకు అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లతో పాటు ముఖ్యమైన మార్గాల్లో సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉయోగించాలని, డీజేలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. కోట చెరువులో నిమజ్జనం నిషేధం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో ఈ ఏడాది కూడా గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించారు. ఈ చెరువుకు బదులుగా సమీపంలో గల దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో ఏర్పాట్లు చేశారు. -
యూరియా కోసం వెతలు
● ధర్మరావుపేటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతులుఖానాపురం: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మరావుపేట, మంగళవారిపేట గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. మంగళవారిపేటలో 444, ధర్మరావుపేటలో 444 బస్తాల యూరియాను గురువారం రైతులకు పంపిణీ చేశారు. మంగళవారిపేటలో క్యూలో ఉన్న వారికి బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహించారు. గోదాం లోపలకు వెళ్లి వ్యవసాయ విస్తరణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వద్ద ఉన్న డబ్బులను లాగేయడంతో కిందపడిపోయాయి. దీంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది డబ్బులను తీసి బ్యాగులో పెట్టారు. గోదాంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకునే క్రమంలో అప్రమత్తమైన ఎస్సై రఘుపతి రైతులను బయటకు పంపించారు. షటర్ మూసివేసి క్యూలో ఉన్న వారికి బస్తాలను అందించేలా చర్యలు చేపట్టారు. ధర్మరావుపేటలో క్యూలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మహిళా రైతులు కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. గాయపడిన రైతులు గుగులోత్ వినోద, ఊడుగుల సునీత, దేవక్కతోపాటు మరికొంత మందిని కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలించారు. రైతులకు అండగా నిలిచిన ఎస్సై రఘుపతి యూరియా కోసం మంగళవారిపేటకు చెందిన రైతులు దుప్పట్లతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఛాగర్ల రఘుపతి రైతుల వద్దకు వెళ్లారు. రాత్రి సమయంలో రైతులు ఇబ్బందిపడొద్దని ఆలోచించారు. రాత్రి 12 గంటల కు రైతుల ఆధార్కార్డులు తీసుకున్నారు. సీరియల్ ప్రకారం తీసుకుని రైతులను ఇంటికి పంపారు. గురువారం ఉదయం కార్డుల ప్రకారం రైతులకు యూరియా పంపిణీ చేయించారు. దీంతో రైతులు ఎస్సైకి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన గ్రామాల రైతులు కూడా ఎస్సై వద్దకు వచ్చి ఇదే పద్ధతి అమలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.