breaking news
Warangal
-
వచ్చేనెల 15నుంచి ఎండీఆర్ అమలు
సాక్షి, వరంగల్: చేతిలో నగదు లేకపోయినా మొబైల్లో యూపీఐ ఉంటే చాలు.. ఇంటి విద్యుత్ బిల్లు నుంచి పిల్లల స్కూల్ ఫీజు వరకు, పెట్రోల్ బంక్ నుంచి రైల్వే టికెట్ వరకు చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. ఇప్పుడు రూ.2 వేలకు పైబడిన కొన్ని కేటగిరీల యూపీఐ లావాదేవీలకు వ్యాపారులపై రూ.5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమల్లోకి రానుండడంతో జిల్లాలో దీని ప్రభావం ఎంత ఉంటుందన్న చర్చ వాణిజ్య వర్గాల్లో మొదలైంది. కేంద్ర ఆర్థికశాఖ నిబంధనల ప్రకారం రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం వంటి ఎంపిక చేసిన కేటగిరీల్లో రూ.2 వేలకు పైబడిన యూపీఐ లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. విద్యుత్, నీరు, పైప్డ్ గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. రూ.2 వేలలోపు లావాదేవీలకు ఎండీఆర్ ఉండదు. సాధారణ పర్సన్ టూ మర్చంట్ (పీ2ఎం) లావాదేవీల్లో రూ.2 వేలకు పైబడిన వాటికి 0.4 శాతం ఎండీఆర్, రూ.75 వేలకుపైగా లావాదేవీలకు రూ.300 గరిష్ఠ పరిమితి ఉంటుంది. అయితే, చిన్న వ్యాపారులు యూపీఐ క్యూఆర్ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరిస్తే పీ2ఎం కేటగిరీలో జీరో ఎండీఆర్ కొనసాగుతుంది. వరుసగా మూడు నెలలు నెలకు రూ.1 లక్షకు మించి స్వీకరిస్తే సాధారణ పీ2ఎం కేటగిరీలోకి మారే అవకాశం ఉండడం వల్ల అదనపు భారం పడే అవకాశముంది. వచ్చే నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానుండడంతో సరికొత్త చర్చ మొదలైంది. ఏడాదికి రూ.కోటిపైనే భారం! జిల్లాలో వినియోగదారుల సంఖ్య, సేవల వినియోగం, పట్టణ, గ్రామీణ విస్తీర్ణాన్ని బట్టి స్థూలంగా లెక్కిస్తే విద్యుత్, నీరు, గ్యాస్, స్కూల్, కళాశాల ఫీజులు, టెలికాం, రైల్వే, పెట్రోల్, డీజిల్, బీమా తదితర విభాగాల్లో నెలకు సుమారు 2.5 నుంచి 3.5 లక్షల యూపీఐ లావాదేవీలు జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటిలో రూ.2 వేలకు పైబడినవి సుమారు 1.5 నుంచి 2.5 లక్షలు ఉంటాయనుకుంటే ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున సగటు ఎండీఆర్ నెలకు రూ.7.5 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఉండొచ్చు. అంటే, ఏడాదికి సుమారు రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఎండీఆర్ విలువ ఉండే అవకాశం ఉందన్న చర్చ వరంగల్ మార్కెట్ వర్గాల్లో జరుగుతోంది. భవిష్యత్లో కస్టమర్ జేబుకు చిల్లు? నేరుగా వినియోగదారుడి ఖాతా నుంచి రూ.5 కట్ కాదు. ఎండీఆర్ను వ్యాపారి భరిస్తారు. యూపీఐ చెల్లింపుదారులపై ఎలాంటి ట్రాన్జాక్షన్ చార్జీ ఉండదని కేంద్రం స్పష్టం చేసినా భవిష్యత్లో వినియోగదారుల జేబులకే చిల్లు పడొచ్చన్న ఆందోళన ఉంది. సంస్థలు దీన్ని నేరుగా కస్టమర్ నుంచి వసూలు చేయలేకపోయినా, భవిష్యత్లో ఇతర ధరలు, సేవా చార్జీల్లో మార్పులు చేయడం ద్వారా ఎండీఆర్ భారం తగ్గించుకునేలా చేసుకుంటుందన్న టాక్ ఉంది. అలాగే, విద్యుత్ బిల్లు, ఓటీటీ, ఇతర పునరావృత చెల్లింపులు యూపీఐ ఆటోపే ద్వారా చేస్తే నిర్దేశిత ఎండీఆర్ ఉండదు. దీంతో నెలనెలా చెల్లించే బిల్లుల్లో ఆటోపే వినియోగం పెరిగే అవకాశం ఉంది. అయితే, సమయానికి డబ్బులు అందుబాటులో ఉండకపోతే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశముంది.సుమారుగా దేనికి ఎంత అంటే.. విద్యుత్, నీరు, గ్యాస్కు సంబంధించి నెలవారీ యూపీఐ లావాదేవీలు 80,000 బిల్లుల వరకు జరిగితే, వాటిలో రూ.రెండు వేలకు పైబడినవి 20,000 బిల్లులకు ఎండీఆర్ నెలకు రూ.లక్ష అవుతుందని అంచనా. స్కూల్, కళాశాల ఫీజులు 50,000 యూపీఐ నెలవారీ లావాదేవీలు అయితే 30,000 బిల్లుల వరకు రెండువేలకు పైబడినవి వాటికి రూ.1.50 లక్షలు ఎండీఆర్ కానుంది. పెట్రోల్, డీజిల్ 80,000 లావాదేవీలుంటే రూ.రెండు వేలపైనా ఉన్న 40,000 బిల్లులకు రూ.రెండు లక్షల ఎండీఆర్ అవుతుంది. టెలికాం 60,000 బిల్లుల్లో 15,000 యూపీఐ లావాదేవీలకు రూ.75 వేల ఎండీఆర్ భారం పడనుంది. రైల్వే టికెట్లకు సంబంధించి 50,000 యూపీఐ లావాదేవీలు జరిగితే రూ.రెండు వేలపైన ఉన్న 30,000 బిల్లులకు రూ.1.50 లక్షలు ఎండీఆర్ రానుంది. బీమా ప్రీమియం 30,000 యూపీఐ లావాదేవీలు జరిగితే 20,000 బిల్లులు రూ.రెండు వేలపైనా వాటికి రూ.లక్ష ఎండీఆర్ భారం పడనుంది. మొత్తంగా 3.50 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు జరిగితే అందులో రూ.రెండు వేలపైగా ఉన్న 1.55 లక్షల ట్రాన్జాక్షన్లకు రూ.7.75 లక్షల ఎండీఆర్ అంచనా పడుతుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.93 లక్షల ఎండీఆర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో రూ.కోటి నుంచి రూ.కోటి 50 లక్షల వరకు ఎండీఆర్ వసూలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఎండీఆర్ తప్పేట్టు లేదు కేంద్రం నిబంధనలతో జిల్లాలో రూ.కోటిపైనే భారం వివిధ బిల్లులు, వ్యాపార రూపేణా వేలాది యూపీఐ ట్రాన్జాక్షన్లు విద్యుత్, నీరు, ఇంధనం, ఫీజులు, రైల్వే, బీమాపై కూడా ప్రభావం భవిష్యత్లో వినియోగదారులపై ధరాభారం పడొచ్చనే ఆందోళన -
తిరుగుబాటు జ్వాల
ఖిలా వరంగల్: చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఓరుగల్లు కోట.. ఒకప్పుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి వేదికగా మారింది. భూస్వామ్య దోపిడీ, అధిక పన్నులు, వెట్టిచాకిరీ, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కాకతీయుల కళా సామ్రాజ్యం కూడా ప్రతిఘటనకు కేంద్రంగా నిలిచింది. 1944లోనే పోరాట బీజాలు 1944లో వరంగల్ కోటలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షిక సమావేశంలో మతతత్వ శక్తుల దాడిని ప్రతిఘటించే క్రమంలో బత్తిని మొగిలయ్య గౌడ్ గాయపడినా తన పోరాట పటిమను ఆపలేదు. ఈ ఘటన ఆయన పోరాట జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. అనంతరం ఆర్యసమాజ్, కాంగ్రెస్ కార్యకలాపాల్లో భాగస్వాములై నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కోటపై జెండా ఎగరేయడంతో.. 1946, ఆగస్టు 11న నిజాం పాలనలో జాతీయ జెండాను ఎగురవేయడంపై ఆంక్షలు ఉన్న సమయంలో చారిత్రక ఓరుగల్లు కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఉద్యమకారుల ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ జెండా ఆవిష్కరణలో బత్తిని మొగిలయ్య గౌడ్ కీలక పాత్రను చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. జెండా ఆవిష్కరణను అడ్డుకునేందుకు రజాకార్లు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజాకార్ల దాడిని ఎదుర్కొంటూ బత్తిని మొగిలియ్య గౌడ్ వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. ఈ ఘటన ఓరుగల్లు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని మరింత రగిలింపజేసింది. కాగా, స్థానిక చరిత్ర వృత్తాంతాల్లో టి.హయగ్రీవాచారి, తదితర కాంగ్రెస్ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి త్యాగాలను గుర్తుంచుకోవాలి నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి మన ప్రాంత రైతాంగ పోరాటయోధులు ఎన్నో కష్టాలు పడ్డారు. 1944 నుంచి 1946 వరకు కాల్చివేతలు, దాడులు, హింసను లెక్కచేయకుండా హక్కుల కోసం పోరాడారు. ఓరుగల్లు కోటపై జాతీయ జెండా ఎగురవేయడం వంటి ఘటనలు అప్పటి ప్రజల ధైర్యానికి నిదర్శనం. ఆ త్యాగాలను నేటి తరానికి చెప్పుకోవడం మన బాధ్యత. స్వేచ్ఛ విలువ, పోరాటయోధుల త్యాగాలను యువత గుర్తుంచుకోవాలి. – గంటా నరేందర్రెడ్డి, విద్యావేత్త, మామునూరు గత చరిత్రను తెలుసుకోవాలిస్వాతంత్య్రం, ప్రజల హక్కుల కోసం గత తరాల వారు చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలి. భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన రైతాంగ యోధుల త్యాగాలు పుస్తకాల్లోనే కాకుండా మన చారిత్రక ప్రదేశాల్లోనూ కనిపిస్తాయి. ఖిలా వరంగల్ చరిత్రను కూడా యువతకు వివరించాలి. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సమానత్వ, ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత మనపై ఉంది. – మేరుగు సన్నిహిత్, విద్యార్థి, వరంగల్ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన ఓరుగల్లు రజాకార్ల దమనకాండకు ఎదురొడ్డిన బత్తిని మొగిలయ్య -
చంద్రగిరి గుట్టల పైనుంచే గురి!
పరకాల: పరకాల సమీపంలోని చంద్రగిరి గుట్టలు తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరంగా మారాయి. జాతీయ జెండాతో ఊరేగింపు చేసినందుకు 1947 సెప్టెంబర్ 17న పరకాల చాపలబండ వద్ద రజకార్ల ఊచకోతకు 13 మంది అమరులయ్యారు. రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టి కాల్చిచంపారు. దీంతో పరకాల ప్రాంతంలో రజకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటం ఉధృతమైంది. ఇందులో భాగంగా రజకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ.. మరోవైపు నిజాంపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. నాడు తెలంగాణ సాయుధపోరాట యోధులు మందు గుండు సామగ్రి, తుపాకులు శత్రువులకు దొరకకుండా ఉండేందుకు గుట్టలపై దాచుకునేవారు. మహారాష్ట్రలోని చాందా (ముంబై) ప్రాంతంలో పరకాల ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయుధపోరాట వీరులు బ్యాచ్ల వారీగా శిక్షణ పొందారు. సాయుధపోరాట యోధుడు కేవీ నర్సింగరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిని రహస్యంగా చంద్రగిరి గుట్టలకు చేర్చేవారు. అక్కడి నుంచి సాయుధపోరాట యోధులు నిజాం పోలీసులకు చుక్కలు చూపించేవారు. ఎత్తయిన గుట్టల పైనుంచి శత్రువుల రాకను గమనించేవారు. దీంతో చంద్రగిరి గుట్టలు పోరాటాలకు అడ్డాగా పేరుగాంచాయి. హైదరాబాద్ స్టేట్లో కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తాలుకా కాంగ్రెస్ సేవా సమితి బాధ్యులు అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాటి సమావేశాలకు లేఖల ద్వారానే సమాచారం అందజేసేవారు. పరకాల పోరుగడ్డ బిడ్డలుగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అందుకే నాటి తెలంగాణ సాయుధపోరాట యోధుల స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశాం. దేశశ భవిష్యత్ కోసం అన్యాయంపై ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలనే ఆలోచన పెరిగింది. – ఏకు శంకర్, పరకాల తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరం రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఉద్యమకారులు చాందాలో శిక్షణ పొంది నిజాం సైన్యానికి చుక్కలు -
గ్రేటర్ వరంగల్లో నెలకు యూపీఐపై కొత్త ‘చార్జీ’మోత
రూ.2వేల వరకు ఉన్న పీ2ఎం యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్ ఉండదు. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలకు మొత్తంతో సంబంధం లేకుండా ఈ ఎండీఆర్ వర్తించదు. క్యూఆర్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపు ఉంది. కాగా సాధారణ వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఉండగా.. కొన్ని సేవలకు ప్రత్యేకంగా రూ.5ల ఫ్లాట్ ఎండీఆర్ విధానం ఉంటుంది. ఇందులో ప్రధానంగా.. విద్యుత్తు బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్, టెలికాం చెల్లింపులు, రైల్వే టికెట్లు, ఇంధనం, బీమా ప్రీమియంలు, కొన్ని ప్రభుత్వ/అవసర సేవలు ఉన్నాయి. రూ.2వేలు దాటిన అర్హత కలిగిన చెల్లింపులపై ఈ విభాగాల్లో ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. కాగా వినియోగదారుడి యూపీఐ ఖాతా నుంచి నేరుగా ఎండీఆర్ కట్ చేయకూడదు. బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఎండీఆర్ భారాన్ని వినియోగదారుడిపై మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇది కచ్చితంగా అమలయ్యేలా చూడాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గణాంకాల ప్రకారం హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీల్లో నెలకు సుమారు రూ.కోటి నుంచి 1.2 కోట్ల వరకు యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. వీటి మొత్తం విలువ రూ.1,400–రూ.1,700 కోట్ల పరిధిలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో వ్యక్తి నుంచి వ్యక్తికి (పర్సన్ టు పర్సన్ (పీ2పీ))జరిగే చెల్లింపులు కూడా ఉంటాయి. కొత్త ఎండీఆర్ ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) చెల్లింపులకే వర్తిస్తుంది. పీ2పీ లావాదేవీలు మొత్తంగా ఈ ఎండీఆర్ నుంచి మినహాయింపులోనే ఉంటాయి. సాక్షిప్రతినిధి, వరంగల్ : నెలాఖరులో జీతం వచ్చేలోపే ఇంటి బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. ఇంటి అద్దె.. కరెంట్ బిల్లు.. నీటి బిల్లు.. గ్యాస్.. పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు.. పాలు.. కిరాణా సరుకులు.. పెట్రోల్.. మొబైల్, ఇంటర్నెట్.. బీమా ప్రీమియం.. ఇలా ఒక్కో ఖర్చు కలుస్తూ మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని పెంచుతోంది. ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపులపై కేంద్రప్రభుత్వం కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధానం తెరపైకి వచ్చింది. ఇది మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. వచ్చే నెల 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధానం అమల్లోకి రానుంది. రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం వంటి ప్రత్యేక విభాగాల్లో రూ.2వేలకు మించిన లావాదేవీలకు ఒక్కో చెల్లింపుపై రూ.5ల ఫ్లాట్ ఎండీఆర్ విధిస్తారు. విద్యుత్, మున్సిపల్ నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ వంటి యుటిలిటీ చెల్లింపులకూ రూ.2,000 దాటితే రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. అన్ని రూ.2 వేల చెల్లింపులకూ 0.4 శాతం కాదు.. రూ.2 వేలకుపైబడి వ్యాపార చెల్లింపులపై 0.4శాతం ఎండీఆర్ వచ్చే నెల 15 నుంచి అమలుపై చర్చ రూ.5చార్జీ.. ఇంటి బడ్జెట్కు కొత్త లెక్క విద్యుత్, నీళ్లు, గ్యాస్, ఫీజులు, పెట్రోల్, బీమా, రైలు టికెట్లు -
నేడు ప్రజాపాలన దినోత్సవం
హనుమకొండలో మంత్రి పొంగులేటి, వరంగల్లో గద్వాల విజయలక్ష్మి ఉదయం 10 గంటలకు జెండావిష్కరణ సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. హనుమకొండలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్లో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ములుగులో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రామచందర్నాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరిగే వరంగల్ ఓ సీటీ ఐడీఓసీ గ్రౌండ్ను బుధవారం సాయంత్రం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీకాంత్ పరిశీలించారు. హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మూడో రోజు బుధవారం మూల మహాగణపతిని త్రిముఖ గణపతిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్ అధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమాదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సగర సంఘం రాష్ట్ర నాయకులు కంజుల మహేశ్ సౌజన్యంతో యాగశాలలో గణపతి నవగ్రహ రుద్రహవనం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదాల వితరణ చేశారు. నృత్య గురువు పరమేశ్వర్ బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య తెలిపారు. జాబితాను జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ నెల 17న అప్లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు తమ వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల్లోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి స్పష్టం చేశారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
న్యూశాయంపేట: ఖరీఫ్ సీజన్ 2026 – 27కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిశోర్కుమార్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగిందని ఆమెకు అధికారులు వివరించారు. ఇందులో 90,523 ఎకరాల్లో ఏడు రకాల సన్నధాన్యం, 8,016 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేసినట్లు తెలిపారు. వాటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోళ్లకు జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు (పీపీసీ) ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, సివిల్ సప్లై డీఎం సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, డీసీఓ నీరజ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. ‘ఉల్లాస్’ను విజయవంతంగా నిర్వహించాలి ఉల్లాస్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 20న నిర్వహించనున్న పరీక్షలకు ఉల్లాస్ పోర్టల్లో నమోదైన ప్రతీ మహిళ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయిలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లపై ఉందని గుర్తుచేశారు. అలాగే, ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారదరీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారందుగ్గొండి: ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంతో వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని మందపల్లిలో భూముల సర్వేపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1930లో నిజాంరాజుల కాలంలో భూములు సర్వే చేసి సెత్వార్ సిద్ధంచేసి సర్వే నంబర్లు కేటాయించారని చెప్పారు. అప్పటినుంచి నేటి వరకు భూ సమస్యలు పరిష్కారంకాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రీసర్వే పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఉప గ్రహాల పర్యవేక్షణలో అక్షాంశ, రేఖాంక్షాలకు అనుసంధానించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం మ్యాపులో రైతుకు చెందిన సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఏ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. సర్వే పారదర్శకంగా సాగాలంటే రైతుల సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, సర్వే ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ సమ్మక్క, సర్వేయర్ గీత, సర్పంచ్ మారేడుగొండ శ్రీమాలతి, జీపీఓ అనిల్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర ఆస్పత్రి ఆవరణ, పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ సత్యశారద అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలు, ఆవరణ శుభ్రం చేసి తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో వివిధ రకాల రికార్డులు, ల్యాబరేటరీ, ఫార్మసీ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రాజారెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, వైద్యాధికారి రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘రవాణా భత్యం’ విడుదల
పాఠశాల లేని నివాస ప్రాంతంలోని విద్యార్థులకు రవాణా భత్యం నిధులను సమగ్రశిక్ష మంజూరు చేసింది. జిల్లాల వారీగా సమగ్ర చిత్రం ఇలా..1 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్నారు. అసంఘటిత సంస్థలు15,369ములుగు జనగామ వరంగల్ భూపాలపల్లి మహబూబాబాద్ హనుమకొండ84,06713,971కార్మికులు38,26042,84128,72740,67835,90216,71646,40135,59480,25356,7291,26,908హనుమకొండ85,144 -
వరంగల్
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026●● హనుమకొండలో అత్యధికంగా 1.27 లక్షల మంది.. ● మహబూబాబాద్లో 80,253.. భూపాలపల్లిలో మహిళా కార్మికుల వాటా అధికం ● తయారీ, వ్యాపారం, సేవారంగ సంస్థలు పరిగణనలోకి.. ● ఆరు జిల్లాల్లో 2.56 లక్షల అసంఘటిత సంస్థలు వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంఘటిత రంగం పెరిగిపోయింది. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఆరు జిల్లాల పరిధిలో కలిపి సుమారు 3.48 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) చేపట్టిన వార్షిక సర్వే అస్యూజ్–2025లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సర్వే నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో జిల్లాల వారీగా అసంఘటిత సంస్థలు, కార్మికుల వివరాలు పొందుపర్చారు. ఈ నివేదికలోని జిల్లాల అంచనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి రూపొందించినట్లు పేర్కొంది. అసంఘటిత సంస్థల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహబూబాబాద్ నిలిచింది. మొత్తం ఆరు జిల్లాల్లో కలిపి 2.56 లక్షల అసంఘటిత సంస్థలు ఉన్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్లో అసంఘటిత కార్మికులు -
చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు
పరకాల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని అమరధామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవీరులను సీపీఐ నాయకులు బుధవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో వీరోచిత పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలోని నాలుగు వేల గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి తెలపడం చారిత్రక అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు అదరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, పరకాల మండల కార్యదర్శి దుప్పటి సాంబయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల చక్రపాణి, మంద శ్రీకాంత్, బొచ్చు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
●● హనుమకొండలో అత్యధికంగా 1.27 లక్షల మంది.. ● మహబూబాబాద్లో 80,253.. భూపాలపల్లిలో మహిళా కార్మికుల వాటా అధికం ● తయారీ, వ్యాపారం, సేవారంగ సంస్థలు పరిగణనలోకి.. ● ఆరు జిల్లాల్లో 2.56 లక్షల అసంఘటిత సంస్థలు వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంఘటిత రంగం పెరిగిపోయింది. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఆరు జిల్లాల పరిధిలో కలిపి సుమారు 3.48 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) చేపట్టిన వార్షిక సర్వే అస్యూజ్–2025లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సర్వే నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో జిల్లాల వారీగా అసంఘటిత సంస్థలు, కార్మికుల వివరాలు పొందుపర్చారు. ఈ నివేదికలోని జిల్లాల అంచనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి రూపొందించినట్లు పేర్కొంది. అసంఘటిత సంస్థల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహబూబాబాద్ నిలిచింది. మొత్తం ఆరు జిల్లాల్లో కలిపి 2.56 లక్షల అసంఘటిత సంస్థలు ఉన్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్లో అసంఘటిత కార్మికులు -
‘రవాణా భత్యం’ విడుదల
పాఠశాల లేని నివాస ప్రాంతంలోని విద్యార్థులకు రవాణా భత్యం నిధులను సమగ్రశిక్ష మంజూరు చేసింది. జిల్లాల వారీగా సమగ్ర చిత్రం ఇలా..1 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్నారు. అసంఘటిత సంస్థలు15,369ములుగు జనగామ వరంగల్ భూపాలపల్లి మహబూబాబాద్ హనుమకొండ84,06713,971కార్మికులు38,26042,84128,72740,67835,90216,71646,40135,59480,25356,7291,26,908హనుమకొండ85,144 -
అలవాటు చేసి ముంచే ప్రయత్నం...
యూపీఐ పేమెంట్స్ ఉచితం అంటూ లేనిపోని అలవాట్లను చేసి ఆరేళ్ల తర్వాత నట్టేట ముంచే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేయడం అత్యంత బాధాకరం. ట్రావెల్స్ రంగంలో అన్ని పేమెంట్స్ ఆన్లైన్లోనే చేయడం అలవాటుగా మారింది. డబ్బులు చెల్లిస్తే పన్నులు కట్టాలి అనే విధానం ఇబ్బందికరంగానే మారుతుంది. –కాటపురం రాజు, ట్రావెల్ ఏజెంట్, కాజీపేటమా మార్జిన్పై ప్రభావం పడుతుంది యూపీఐ ద్వారా చెల్లింపులు పెరిగాయి. కస్టమర్కు, మాకు సౌకర్యంవంతంగా మారింది. ఇప్పుడు వ్యాపారిపై ఎండీఆర్ వస్తే మా మార్జిన్పై ప్రభావం ఉంటుంది. కస్టమర్పై అదనపు చార్జీ వేయకూడదని నిబంధన ఉంటే ఆ వ్యయాన్ని మేమే భరించాల్సి ఉంటుంది. ఇది మాకు నష్టమే. టి.సంజీవ్, కిరాణా వ్యాపారి, నయీంనగర్ ఉచిత పేమెంట్లను కొనసాగించాలి... ఉచిత యూపీఐ పేమెంట్లను కొనసాగించాలి. చిరు వ్యాపారులనుంచి మొదలుకుని అన్ని రకాల జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులు ఎక్కువగా యూపీఐ పేమెంట్స్లోనే జరుగుతున్నాయి. నేడు యూపీఐ చెల్లింపులకు పన్ను కట్టాలన్న విధానంపై మరోమారు ఆలోచన చేయాలి. – మేకల కేదారి యాదవ్, జీవిత బీమా ఏజెంట్, సోమిడి -
రైస్ మిల్లర్ల సమ్మెబాట
ఖిలా వరంగల్: ధాన్యం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11 నుంచి పూర్తిస్థాయిలో నిరవధికంగా రైస్ మిల్లులను బంద్ చేసి సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లాలోని 102 రైస్ మిల్లులు మూతపడ్డాయి. సమస్యలు పరిష్కరించే వరకు మిల్లులు తెరిచేది లేదని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 149 రైస్ మిల్లులుండగా 47 మిల్లులు వివిధ కారణాలతో మూతపడగా.. 102 మిల్లులు నడుస్తున్నాయి. అవి కూడా నిరవధికంగా మూతపడ్డాయి. సమస్యలు ఇలా.. ● ధాన్యం కేటాయించిన 15 రోజుల్లోనే ప్రభుత్వం బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. మిల్లర్లతో ప్రభుత్వం చేసే ఒప్పందంలో ఈ అంశం స్పష్టంగా ఉంటుంది. కానీ, ఎక్కడా 15 రోజుల్లో తీసుకున్న ఘటనల్లేవు. సాధారణ పరిస్థితుల్లో ఏడాది వరకు ప్రభుత్వం సమయం తీసుకుంటోంది. దీంతో ధాన్యంలో తరుగు పెరుగుతోంది. ● ప్రస్తుతం క్వింటా ధాన్యానికి 65.5 కిలోల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాలి. అయితే, సన్నధాన్యం 63 కిలోలకు మించి రావడంలేదు. ఈ పరిమాణాన్ని 62 కిలోలకు తగ్గించాలని మిల్లర్లు కోరుతున్నారు. ● కేంద్రం ఇచ్చే తరుగును రాష్ట్ర ప్రభుత్వం మిల్ల ర్లకు ఇవ్వకపోవడం, గడిచిన 8 సీజన్లకు సంబంధించి మిల్లింగ్ చార్జీలు చెల్లించకపోవడం వంటి సమస్యలున్నాయి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నిరవధిక బంద్తో జిల్లాలో మూతపడిన 102 మిల్లులునిబంధనలు సడలించాలి సీఎంఆర్ ఒప్పదం ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలి. రన్నింగ్ మిల్ల ర్లపై వేసిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలి. క్వింటా ధాన్యానికి మిల్లింగ్ చార్జీ రా బియ్యానికి రూ.150, బాయిల్డ్ బియ్యానికి రూ.200లకు పెంచాలి.మిల్లింగ్ క్రమంలో 100 శాతానికి డ్యామేజ్, నూకలు, పరం సుమారు 15 నుంచి 20శాతం వరకు వచ్చే తరుగును పరిగణలోకి తీసుకోవాలి. – గోనెల రవీందర్, జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● డీసీహెచ్ఎస్ డాక్టర్ వంశీకృష్ణ కమలాపూర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. ఇన్ పేషంట్లతో పాటు ఔట్ పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది స్పందన, ఆస్పత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగానికి సంబంధించిన సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు తమ ప్రవర్తన మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తానని, అప్పటికి మంచి ఫలితాలు, మెరుగైన సేవలు కనిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చందునాయక్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన వేడుకల అతిథిగా గద్వాల విజయలక్ష్మి
న్యూశాయంపేట: జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో జిల్లాలో జరిగే వేడుకల్లో విజయలక్ష్మి పాల్గొననున్నారు. వేడుకల ఏర్పాట్ల పరిశీలన ఖిలా వరంగల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓసిటీ ఐడీఓసీ మైదానంలో గురువారం ఉదయం జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్డీఓ సుమ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్తో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు 9.35 గంటలకు పడమర కోట అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. నాణ్యమైన వైద్యసేవలందించాలిదుగ్గొండి: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ రాజారెడ్డి సూచించారు. మండలంలోని కేశవాపురం పీహెచ్సీని బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం, లక్ష్మీపురం సబ్సెంటర్లో ఇమ్యూనైజేషన్ సెషన్ను ప్రారంభించి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన టీకాలను ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజయ్కుమార్, సూపర్వైజర్ గొ డిశాల భాస్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలినెక్కొండ: గర్భిణుల ఆరోగ్య విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిద అన్నారు. ఈ మేరకు మండలంలోని నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, రిపోర్టులను పరిశీలించారు. గ్రామాల్లో గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణులను గుర్తించడంలో నిర్లక్ష్యం తగదని, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన మందులు, ఐరన్ ఫోలిక్ యాపిడ్ సప్లిమెంట్ల గురించి పలు సూచనలు చేశారు. అలాగే ప్రసవం, ప్రసవం అనంతరం సేవలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు, శిశువుల రక్షణ, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి సిబ్బందికి సాజిద వివరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు రహేలా తన్వీర్, అఖిల్, సరోజ, డెమో వెంకటేశ్వర్లు, డీపీహెచ్ఎన్ మనోజ్, పీహెచ్ఎన్ అన్నామేరీ, హెచ్ఎస్ వరమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ విద్య కీలకం
విద్యారణ్యపురి: విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమని ఇంటర్ విద్య ఇన్చార్జ్ ఆర్జేడీ ఎ.గోపాల్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు బ్యాగులు, షూ, బెల్టులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. త్వరలోనే విద్యార్థులకు యూనిఫామ్ కూడా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు, అధ్యాపకులు యాకూబ్, భిక్షపతి, ఎస్.రాజ్కుమార్, ప్రసాద్, రాములు, ప్రవీణ్, రమేశ్, రేవతి, శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్–కాజీపేట మధ్య హనుమకొండ జిల్లా బస్స్టేషన్, బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం మీదుగా లోకల్ బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ తెలిపారు. రూట్ నంబర్ 1బీ పేరుతో వరంగల్–కాజీపేట, కాజీపేట–వరంగల్ మధ్య ప్రతిరోజు 46 ట్రిప్పులు తిప్పుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ నుంచి హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్టాండ్, కాళోజీ కళాక్షేత్రం, అదాలత్ మీదుగా కాజీపేటకు, అదేవిధంగా కాజీపేట నుంచి అదాలత్, బాలసముద్రం, కాళోజీ కళాక్షేత్రం, అశోకా జంక్షన్, హనుమకొండ చౌరస్తా మీదుగా వరంగల్కు ఈ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మరిన్ని ట్రిప్పులు పెంచుతామని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ స్సైన్స్ కళాశాల ఫిజిక్స్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్కు ఎయిర్ ఫిల్ట్రేషన్ పరికరం డిజైన్పై పేటెంట్ లభించింది. మలేషియాలోని యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కోలబరేషన్లో సంయుక్తంగా పేటెంట్ను లభించినట్లు జితేందర్ తెలిపారు. భారత ప్రభుత్వ పేటెంట్లు డిజైన్లు, ట్రేడ్ మార్కుల కంట్రోల్ జనరల్ కార్యాలయం నుంచి సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, అధ్యాపకులు తదితరులు జితేందర్ను అభినందించారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం బీఫార్మసీ, జీవవైవిధ్య ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో మంగళవారం ప్రారంభమైంది. సర్టిఫికెట్ల పరిశీలన ధ్రువపత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి అభ్యర్థులకు అందజేశారు. హన్మకొండ అర్బన్: కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ఖరీఫ్ ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు పకడ్బందీగా తరలించేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు, ధాన్యం తరలింపు కాంట్రాక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్, జిల్లా సహకార అధికారి మోహన్, పౌరసరఫరాల శాఖ డీటీలు భద్రునాయక్, నాగేంద్ర ప్రసాద్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయండి
కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ నయీంనగర్: కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. వరంగల్ బస్స్టేషన్, ఇన్నర్, ఔటర్ రింగ్రోడ్డు, వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనులు, ఉనికిచర్ల, హనుమకొండ చౌరస్తా రీడెవలప్మెంట్ పనులు పూర్తిచేయాలని సూచించారు. కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు. రుద్రేశ్వరాలయంలో హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, వేముగంటి దత్తుశర్మ సోమవారం ఉదయం 6 గంటల నుంచి పూజలు నిర్వహించారు. వేముల సత్యమూర్తి ఆధ్వర్యంలో నిత్యాన్నప్రసాదాల వితరణ ప్రారంభించారు. -
రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా..
● క్లస్టర్–1లో ఐదు పోలీస్ కమిషనరేట్లు ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంటే, వరంగల్ కమిషనరేట్ రెండో స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–3లో 11 పోలీసు యూనిట్లుండగా మహబూబాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–4లో 10 పోలీసు యూనిట్లుండగా జయశంకర్ భూపాలపల్లి 9, ములుగు 10వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన పోలీస్ యూనిట్ల మధ్య పనితీరు సూచీల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.సాక్షి, వరంగల్ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయడం.. ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్ వైజ్ యూనిట్స్ పర్ఫార్మెన్స్ స్కోర్కార్డు’ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని నాలుగు పోలీస్ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జ్షీట్ల నమోదులో మహబూబాబాద్ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది. -
పశువుల వివరాలు నమోదు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో పశువుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్, 19 పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై మంగళవారం వేర్వేరు సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పశువుల నమోదు, టీకాల కార్యక్రమం, రైతుల ఆధార్ అనుసంధానం, పశువైద్యశాలల మ్యాపింగ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న వివరాల నమోదును వేగవంతం చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమీక్షల్లో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రాధాకిషన్న్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర, విజయ డెయిరీ డీడీ ధనరాజ్, గ్రేటర్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, పశువైద్యాధికారి గోపాల్రావుతోపాటు విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుమాదేవి, లింగ సమానత్వ కోఆర్డినేటర్ సునీత, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అధికారుల సమీక్షల్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
● మల్లక్పేటలో ఘటన పరకాల : విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలోని మాదారం శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పరకాల మండలం మల్లక్పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి(50) పట్టణానికి చెందిన పిట్ట సమ్మయ్య వ్యవసాయ కూలీ(పాలేరు)గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజామున చేను వద్దకు వెళ్లిన కుమారస్వామి.. మోటారుకు విద్యుత్ వైరు సరిచేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనాథలైన అన్నాచెల్లి: కుమారస్వామి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి రజిత మృతిచెందగా మంగళవారం తండ్రి మృతిచెందాడు. దీంతో కూతురు అకిల, కుమారుడు హరీశ్ అనాథలయ్యారని, వీరిని యజమానితోపాటు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.కుమారుడు హరీశ్, కూతురు అఖిల -
పాడి రైతుల కోసమే డెయిరీ
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిదామెర: పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో డెయిరీ స్థలాన్ని మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. మండల కేంద్రంలోని పెద్దగుట్ట పరిసర ప్రాంతంలో డెయిరీ పనులు ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంలో భాగంగా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన డెయిరీ సొసైటీలో 10 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. ఆయన వెంట డీఈ యుగేంధర్, ఏఈ బాబురావు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, సదిరం పోశాలు, ప్రకాశ్ రెడ్డి, అనిల్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సొసైటీ చైర్మన్ కచ్చకాయల అరుణ, ల్యాదెళ్ల సర్పంచ్ బొంకూరి రవియాదవ్ తదితరులు ఉన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు అర్థం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
విమోచన దినోత్సవాన్ని ప్రకటించాలి
పరకాల: తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిజాం వారసత్వానికి తాకట్టు పెట్టకూడదని కోరారు. పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో రాజీపడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో నోరుమెదపని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఇప్పుడు వైద్య కళాశాల కోరుతూ పరకాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలలో వైద్య కళాశాల ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, బీజేపీ జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, కౌన్సిలర్లు కుక్కల విజయ్కుమార్, బెజ్జంకి పూర్ణాచారి, నాయకులు పాలకుర్తి తిరుపతి, బాసాని సోమరాజ్, ఆకుల శ్రీధర్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి -
‘సెప్టెంబర్ 17’ను అధికారికంగా నిర్వహించాలి
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ నర్సంపేట: సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో మరుపురా ని, మరుగున పరచలేని చారిత్రక ఘట్టమని, నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లోకి వచ్చిన రోజును తెలంగాణ దినోత్సవంగా గౌరవించడం ప్రతీ తెలంగాణ బిడ్డ బాధ్యతన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చారిత్రక దినోత్సవం అసలు స్ఫూర్తిని మరుగున పర్చడం ప్రజాపాలన కాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరా టం రెండూ ఒకటే కావని, వాటి లక్ష్యాలు, రాజకీ య నేపధ్యం, కాలపరిమితి, అంతిమ లక్ష్యాలు వేరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజారాణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీ నివాస్, నాయకులు రాంచందర్రెడ్డి, ఆంజనేయులు, రాజుయాదవ్, శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో పారదర్శకత తప్పనిసరి
గీసుకొండ: గ్రామ పంచాయతీల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మంగళవారం మండలంలోని దస్రుతండా, సూర్యతండా గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయాల్లోని రిజిస్టర్లు, రోజువారీ కార్యకలాపాల నమోదును పరిశీలించారు. పంచాయతీల్లో డిజిటలైజేషన్నకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత యాప్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందరర్భంగా డీపీఓ కల్పన మాట్లాడుతూ వినాయక చవితి నేపథ్యంలో మండపాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న రహదారులు, డ్రెయినేజీ, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. విధుల్లో అలసత్వం, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ తనిఖీల్లో ఎంపీఓ తిరుణహరి శేషాంజన్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు వినోద్, వీరేష్ పాల్గొన్నారు. డీపీఓ కల్పన -
వరంగల్
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026విద్యార్థులూ.. తస్మాత్ జాగ్రత్త కేయూలోని డిగ్రీ, పీజీ నాన్ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించి మాల్ ప్రాక్టీస్ నిబంధనలు అధికారులు కఠినతరం చేశారు. వాతావరణం జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. జైన్ మందిరం వేద గణపతి యూత్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి గణపతిరామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద వారాహి అవతారంలో విఘ్నేశ్వరుడు వరంగల్ ఎల్లంబజార్లో అతిపెద్ద వినాయకుడు వరంగల్చౌరస్తా సిద్ధేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5వేల చీరలతో తయారు చేసిన గణేషుడుజై జై గణేశా..–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
లింక్ దందా!
నల్లబెల్లి: మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. యూరియా పంపిణీలో మెరుగైన సేవలు అందించేందుకు ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎఫ్ఎఫ్ ఎస్ (ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఒక యూరి యా బస్తా కోసం అవసరం లేని పురుగు మందులు కొనాల్సిన దుస్థితి నెలకొంది. యూరియా కావాలంటే గంట మందు, గడ్డి మందు, పురుగు మందు, నానో యూరియా, కలుపు మందులు తమవద్దే తీసుకోవాల్సిందేనని లింక్ పెడుతున్నారు. దీంతో రైతులు అవసరం లేకపోయినా వాటిని కొనుగోలు చేస్తుండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ దందా బహిరంగంగానే కొనసాగుతున్నా.. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఎరువుల డీలర్లు, సహకార సంఘాలు లింక్ దందాతో రైతులను మోసం చేస్తున్నా.. వ్యవసాయాధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాల్సిన వ్యవసాయ శాఖ నామమాత్రపు తనిఖీలతో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పురుగు మందులు కొనుగోలు చేస్తేనే యూరియా! అవసరం లేకున్నా రైతులకు అంటగడుతున్న ఫర్టిలైజర్స్ యజమానులు ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాతలు జిల్లాలో సుమారు 1,000 షాపులుచర్యలు తీసుకుంటాం.. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు మాత్రమే ఇవ్వాలి. వ్యాపారులు రైతులతో బలవంతంగా వేరే మందులు కొనిపించడం సరికాదు. రైతులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీనుకొని లైసెన్సులను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటాం. – బన్న రజిత, ఏఓ, నల్లబెల్లి -
రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా..
● క్లస్టర్–1లో ఐదు పోలీస్ కమిషనరేట్లు ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంటే, వరంగల్ కమిషనరేట్ రెండో స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–3లో 11 పోలీసు యూనిట్లుండగా మహబూబాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–4లో 10 పోలీసు యూనిట్లుండగా జయశంకర్ భూపాలపల్లి 9, ములుగు 10వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన పోలీస్ యూనిట్ల మధ్య పనితీరు సూచీల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.సాక్షి, వరంగల్ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయడం.. ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్ వైజ్ యూనిట్స్ పర్ఫార్మెన్స్ స్కోర్కార్డు’ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని నాలుగు పోలీస్ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జ్షీట్ల నమోదులో మహబూబాబాద్ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది. -
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
ఖిలా వరంగల్: భూముల రీసర్వే మరింత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం ఖిలావరంగల్ మండలం వసంతాపూర్లో జరుగుతున్న భూ రీసర్వేను అదనపు కలెక్టర్ కె.కిశోర్కుమార్, ఆర్డీఓ సుమ, ఏడీ సర్వే అధికారి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం భూముల సరిహద్దులు, సర్వే వివరాల నమోదు తదితర అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, ఖిలా వరంగల్ మండలాల తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం న్యూశాయంపేట: దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి ఈ నెల 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశనం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్కుమార్, వై.వి.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. అలాగే గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న కార్మికులకు, నర్సంపేట మెడికల్ కళాశాల నర్సింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
‘చచ్చిపో..’ అన్న భర్త.. నిజంగానే చచ్చిపోయిన భార్య!
వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు. ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం -
వైఎస్సార్ మరణించాక ఇక్కడి గుంటనక్కలు మోసం చేశాయి: కొండా సురేఖ
వరంగల్: కార్యకర్తలు పది రోజుల నుంచి ఎంతో బాధపడుతున్నారని మాజీమంత్రి కొండా సురేఖ చెప్పారు. సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడున్న నాయకులు పొద్దున ఒక పార్టీలో మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారని అన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని తెలిపారు.కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ మరణించాక ఇక్కడున్న గుంట నక్కలు మోసం చేశాయి. కేసీఆర్ సూచనతో వరంగల్ తూర్పులో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించాను. చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడు. చిన్న తప్పు కానీ, చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహించాను. పదవి అనేది అలంకారం మాత్రమే. పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదు. నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినందుకు నేను బాధపడటం లేదు.మేము ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు... కాంగ్రెస్ పార్టీలో పుట్టాము కాంగ్రెస్ పార్టీలో పెరిగాము. అనివార్య కారణాలవల్ల బీఆర్ఎస్ పార్టీలోకి పోయాము.. కానీ, ఎవ్వరూ ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టలేదు. స్థానిక డివిజన్లో కనీసం కార్పొరేటర్ను గెలిపించుకునే స్థాయి కూడా సారయ్యకు లేదు. ఇకనుంచి ఎవరైనా మా మీద మాట్లాడాలనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నవీన్ రాజ్ భుజాలపై నుంచి 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుందాం. మాకు పైనుండి ఫోన్లు వస్తున్నాయి.. ఎటూ వెళ్లదు అని. మేము పార్టీ మారేది లేదు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తూర్పులో నాకు మళ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది’’ అని చెప్పారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాభై ఏళ్లకు పైగా గణనాథుడి ఉత్సవాలు
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ● అంబరాన్నంటేలా వేడుకలు ● సాంస్కృతిక కార్యక్రమాలు● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..హన్మకొండ: హనుమకొండ అంబేడ్కర్ కూడలి (డిపో క్రాస్)లో ఏర్పాటు చేస్తున్న శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈసారి స్వర్ణోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1976లో ఏబీవీపీ నాయకుడు సామా జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు మొదలయ్యాయి. 12 మంది అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాల్లో నిత్యం హోమం నిర్వహంచడం ఇక్కడి ప్రత్యేకత. కాగా, ఉత్సవాలు ప్రారంభించిన ఏడాది రూ.1200కే నాలుగు అడుగుల విగ్రహం లభించేదని, ఇప్పుడు రూ.65 నుంచి రూ.75 వేలు వెచ్చించాల్సి వస్తోందని నిర్వాహకులు తెలిపారు. 10 ఏళ్లుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లు పి.అశోక్రావు, మార్తినేని ధర్మారావు, చాడా రఘునాథరెడ్డి, గుర్నాథ్ రెడ్డి, భాస్కర్రెడ్డి, పరమేశ్వర్, 30 మంది సభ్యులు చెబుతున్నారు. ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి -
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అనుసరించాలి
హన్మకొండ/హన్మకొండ అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ. అప్పయ్య అన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, జిల్లా మేనేజర్ విక్రమ్, మున్సిపల్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఆయన శనివారం హనుమకొండలోని రోహిణి, ఏకశిల హాస్పిటల్ను తనిఖీ చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ల వివరాలు, సేవలకు తీసుకునే ఫీజుల వివరాలతో కూడిన ధరల పట్టిక, వివిధ ప్రభుత్వ అనుమతుల పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి వివిధ రిపోర్టులను సకాలంలో అందజేయాలన్నారు. ఫీజుల పట్టిక తగినం సైజులో ప్రదర్శించకపోవడంతో పాటు గుర్తించిన ఇతర లోపాలకు సంబంధించి రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తామని డాక్టర్ అప్పయ్య తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కన్సల్టేషన్ ఫీజులు, వైద్య సేవలకు తీసుకోవాల్సిన ధరల పట్టిక, డాక్టర్ల వివరాలను పేషెంట్లు, వారి సహాయకులు పరిశీలించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.అప్పయ్య రోహిణి, ఏకశిల ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడి -
ఎస్ఐఆర్ను పారదర్శకంగా పూర్తి చేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ: పారదర్శకంగా, వేగంగా ఎస్ఐఆర్ను పూర్తిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుధానగర్ బాలుర హాస్టల్లోని పోలింగ్ కేంద్రాల్లో సర్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. వరంగల్ పశ్చిమ ఈఆర్ఓ, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, హనుమకొండ ఏఈఆర్ఓ, తహసీల్దార్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమం పరిశీలన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని (స్పెషల్ క్యాంపెయిన్)ను అదనపు కలెక్టర్ ఎన్.రవి శనివారం పరిశీలించారు. వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 182, 184 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్ఓ సూపర్వైజర్ కరుణాసాగర్, బీఎల్ఓలు జ్యోతి, శ్రీలత పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: టీఎన్జీఓస్ యూనియన్ ఇంటర్ ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఫోరం హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి పనికల రాజేశ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా జి.నవీన్కుమార్, కార్యదర్శిగా జి.విజేందర్, ఉపాధ్యక్షులుగా ఎల్.సునీత, ఎ.రంజిత్రెడ్డి, వసీ మునీసా, కోశాధికారిగా శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా వి.సంతోశ్కుమార్, బి.శ్వేత, సాయి వినీత్, ప్రచార బాధ్యుడిగా జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.భరత్, హెచ్.సత్యం, కార్యవర్గ సభ్యులుగా బి.రేణుక, సాత్విక, పి.పద్మను ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్, రాజేశ్ ఖన్నా, రామాంజనేయులు, ప్రణయ్, ఎం.శివ, బి.రవిశంకర్, ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
చెరువుకెళ్లి మట్టిని తెచ్చేవాళ్లు. భక్తితో ప్రతిమలు తయారు చేసేవాళ్లు. నిష్టగా ఉపవాసం ఉండేవాళ్లు. భజనలు, కీర్తనలతో మండపాల వద్ద గడిపేవారు. ఉప్పు ఒకరు, పప్పు ఒకరు తోచిందల్లా తీసుకొచ్చి అన్నదానం చేసేవారు. తోపుడు బండ్లపై సమీప చెరువులకు నిమజ్జనానికి తీసుకెళ్లేవారు. నిమజ్జన శోభాయాత్రలో నూనె పీపాలను కొట్టి శబ్దం చేసేవారు. ఆ మధుర జ్ఞాపకాలు రూపాంతరం చెందినా అంతే ఉత్సాహంగా నేటి తరం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఐదు దశాబ్దాలు దాటిన ఆ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. – సాక్షి నెట్వర్క్నర్సంపేటలో మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ఫీట్ల మట్టి విగ్రహం -
కొండా దంపతుల ఢిల్లీ బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలక బాధ్యత అప్పగిస్తారా? సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పర్యటన వెనుక మతలబు ఏంటో.. కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా చర్చ రాంనగర్లో నేడు కార్యకర్తలతో కీలక భేటీ.. తర్వాత హస్తినకు పయనం శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ‘కొండా’ దంపతులు కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
లోక్ అదాలత్కు విశేష స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, యం.రామకృష్ణ సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు స్పందన లభించింది. వరంగల్ జిల్లాలో 9 బెంచ్ల ద్వారా 520 కేసులు, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్ల ద్వారా 734 కేసులకు పరిష్కారం లభించింది. వరంగల్ జిల్లాలో పరిష్కరించిన కేసుల్లో 64 సివిల్, 53 ఎంవీఓపీ, 11 ఇతర సివిల్, 456 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంవీఓపీ కేసుల్లో మొత్తం రూ.6,72,17,640 పరిహారం చెల్లింపునకు పరిష్కారం చూపారు. 26 బ్యాంకు పీఎల్సీ, 6 బీఎస్ఎన్ఎల్ పీఎల్సీ, 63,002 ట్రాఫిక్ఈ–చాలన్ కేసులు, 19 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. హనుమకొండ జిల్లాలో 56 సివిల్, 47 ఎంవీఓపీ, 678 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఎంవీఓపీ కేసుల్లో రూ.61,25,961 పరిహారానికి పరిష్కారం లభించింది. 41 బ్యాంకు పీఎల్సీ, 17 విద్యుత్ పీఎల్సీ, 36,622 ట్రాఫిక్ ఈ–చాలన్, 18 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. సీపీ శ్వేత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి రామలింగం, న్యాయమూర్తులు, జిల్లాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సీహెచ్.ఉపేందర్, సీహెచ్.రామకృష్ణ, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ పాల్గొన్నారు. -
కనకాభిషేకానికి 52 ఏళ్లు
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లో గణపతికి శాస్త్రోక్తంగా నిర్వహించే కనకాభిషేకం 52 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు 1973 నుంచి ఇక్కడ మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. రూ.11తో మొదలైన కనకాభిషేకం.. నేడు కోట్ల రూపాయల నగదు కట్టల అలంకరతో గణనాథుడు పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది విఘ్నేశ్వరుడిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ విఘ్నేశ్వరుడికి కనక వర్షం కురిపిస్తున్నారు. కనకాభిషేకం ఘట్టం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడం విశేషం -
67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో..
హన్మకొండ కల్చరల్: ఒకప్పుడు పబ్లిక్గార్డెన్ వద్ద నిర్వహించిన గణేశ్ ఉత్సవాన్ని 1933లో హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయంలోకి మార్చారు. 67 సంవత్సరాల క్రితం వేయిస్తంభాల దేవాలయానికి మార్చగా.. అప్పటి నుంచి నూతన గజానన మండలి అధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయకులను ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేయిస్తంభాల ఆలయంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలిరావడం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా వేయిస్తంభాల దేవాలయం వినాయక నిమజ్జనోత్సవ రథాన్ని దర్శించుకోవడానికి ప్రజలు మంగళ హారతులతో ఎదురుచూస్తారు. -
సర్ నోటీస్ వస్తే భయపడొద్దు
సాక్షి, వరంగల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ తదితర అంశాలపై ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి. దీంతో పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులందుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హియరింగ్లో ఎదురవుతున్న సమస్యలు, సమర్పించాల్సిన ఆధారాల గురించి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రశ్న: నోటీస్ అంటే ఓటు తొలగించినట్టేనా?కలెక్టర్: నోటీస్ రావడం అంటే ఓటు తొలగించినట్లు కాదు. ఓటరు వివరాల్లో ఏదైనా అనుమానం, అసమతుల్యత లేదా గత సర్ వివరాలతో సరిపోలకపోవడం గుర్తించినప్పుడు నోటీసు ఇస్తారు. ప్రశ్న: ఒకే కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలున్నా అనుమానాస్పదంగా పరిగణిస్తారా?కలెక్టర్: అది ఆటోమేటిక్గా తప్పు అని అర్థం కాదు. వ్యవస్థలో ఒకే వ్యక్తిని తండ్రిగా ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు మ్యాప్ చేసిన సందర్భాల్లో డేటా సరైందో కాదో నిర్ధారించడానికి పరిశీలిస్తారు. ప్రశ్న: హియరింగ్కు వెళ్లకపోతే ఏం చేయాలి?కలెక్టర్: నోటీసును నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ణయించిన తేదీ, ప్రదేశానికి హాజరు కావాలి. అనివార్య పరిస్థితి ఉంటే సంబంధిత బీఎల్ఓ/ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. జిల్లాలో మొత్తం 1,94,395 నోటీసులు జనరేట్ కాగా 1,27,365 డెలివరీ అయ్యాయి. 67,030 నోటీసులు డెలివరీ పెండింగ్లో ఉన్నాయి. 12,502 హియరింగ్లు నిర్వహించగా, 96,969 హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయ్యాయి. చాలా మంది వీకెండ్లలో వస్తామని సమాచారం ఇవ్వడంతో ఏఈఆర్ఓల సంఖ్యను పెంచి క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. మొత్తం పెండింగ్ కేసులు 4,828 ఉండగా వీటిని శనివారం కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని బృందం క్లియర్ చేసింది.ఆధారాలతో హియరింగ్కు రండి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ట్రిపుల్ఈ బీఓఎస్గా రాము
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సుమలత నుంచి రాము బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం డాక్టర్ మన్మోహన్ ఎర్త్ యూనివర్సిటీలో (మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో) విధులు నిర్వర్తిస్తున్నారు. హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ ఎ.ఆనందం తెలిపారు. శనివారం వరంగల్లోని ఆజంజాహి మిల్స్ సబ్స్టేషన్లో రెండు 33 కేవీ బ్రేకర్లను ఆయన చార్జ్ చేశారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఈ బ్రేకర్ల ద్వారా 12.5 ఎంవీఏ, 8 ఎంవీఏ పవర్ ట్రాన్న్స్ఫార్మర్లను సురక్షితంగా, సమర్థవంతంగా నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ మల్లికార్జున్, ఏడీఈ కిశోర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు. ఈనెల 14న సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (07035) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేటకు 14–23 గంటలకు చేరుకొని వెళ్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07036) వెళ్లే ఎక్స్ప్రెస్గా కాజీపేటకు 20–33 గంటలకు చేరుకొని వెళ్తుంది. ఏసీ కార్ అండ్ అన్ రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రెండు రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగామ, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసీఫాబాద్లో హాల్టింగ్ కల్పించారు. హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ పూనమ్ చంద్రకళ దొర సూచనల మేరకు హనుమకొండ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవి కోసం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జత చేసిన పీడీఎఫ్ ఫాంను డౌన్న్లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి ఈనెల 16లోపు హనుమకొండ డీసీసీ ఆఫీస్లో అందజేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పరకాల: జిల్లాల పునర్విభజనతో పరకాల పట్టణం వ్యాపారపరంగా తీవ్రంగా నష్టపోతోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి శాసనమండలిలో ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ ఒకప్పుడు వ్యాపారపరంగా ముందంజలో ఉన్న పరకాల కొత్త జిల్లాల ఏర్పాటుతో నేడు దివాళా తీసిందని పేర్కొన్నారు. నాగ్పూర్ –విజయవాడ గ్రీన్ ఫీల్డ్హైవే నిర్మాణంలో భాగంగా పరకాలలోని మల్లక్పేట శివారులో ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
కొండా దంపతుల ఢిల్లీ బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలక బాధ్యత అప్పగిస్తారా? సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పా ర్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలో పేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలు స్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతాని కి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల స మావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యట న పై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పర్యటన వెనుక మతలబు ఏంటో.. కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా చర్చ రాంనగర్లో నేడు కార్యకర్తలతో కీలక భేటీ.. తర్వాత హస్తినకు పయనం కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
ఎస్ఐఆర్ నోటీస్ డిస్ట్రిబ్యూషన్ విధానం పరిశీలన
ఖిలా వరంగల్: వరంగల్లోని ఆటోనగర్, శివనగర్, మామునూరులోని పోలీంగ్ స్టేషన్లలో సర్ ప్రక్రియ స్పెషల్ క్యాంపెయిన్ కేంద్రాలను ఆర్డీఓ సుమతో కలిసి కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఓటర్ల వివరాలు, స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తుల ప్రక్రియపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఎస్ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి వచ్చే ప్రతీ అభ్యంతరం, దరఖాస్తును నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, డీఏఓ ఫణికుమార్ పాల్గొన్నారు. సర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి నల్లబెల్లి: సర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. నల్లబెల్లి, మేడపల్లి, నారక్కపేట గ్రామాలను శనివారం ఆమె సందర్శించి సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరిలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీస్ అందించి పారదర్శకంగా విచారణ కొనసాగేందుకు బీఎల్ఓలు, సూపర్వైజర్లు పాటించాల్సిన జాగ్రత్తలను విరించారు. ప్రతీ కేసుకు సంబంధించిన ధ్రువపత్రాలు క్షుణంగా పరిశీలించాలని తహసీల్దార్ ముప్పు కృష్ణకు సూచించారు. కలెక్టర్ సత్యశారద -
లోక్ అదాలత్కు విశేష స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధి జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, యం.రామకృష్ణ సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొత్తం 21 బెంచ్లు ఏర్పాటు చేసి 1,254 పెండింగ్ కేసులు పరిష్కరించారు. వరంగల్ జిల్లాలో 9 బెంచ్ల ద్వారా 520 కేసులు, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్ల ద్వారా 734 కేసులకు పరిష్కారం లభించింది. వరంగల్ జిల్లాలో పరిష్కరించిన కేసుల్లో 64 సివిల్, 53 ఎంవీఓపీ, 11 ఇతర సివిల్, 456 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంవీఓపీ కేసుల్లో మొత్తం రూ.6,72,17,640 పరిహారం చెల్లింపునకు పరిష్కారం చూపారు. అదేవిధంగా 26 బ్యాంకు పీఎల్సీ, 6 బీఎస్ఎన్ఎల్ పీఎల్సీ, 63,002 ట్రాఫిక్ఈ–చాలన్ కేసులు, 19 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. హనుమకొండ జిల్లాలో 56 సివిల్, 47 ఎంవీఓపీ, 678 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఎంవీఓపీ కేసుల్లో రూ.61,25,961 పరిహారానికి పరిష్కారం లభించింది. 41 బ్యాంకు పీఎల్సీ, 17 విద్యుత్ పీఎల్సీ, 36,622 ట్రాఫిక్ ఈ–చాలన్, 18 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో సీపీ శ్వేత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి రామలింగం, న్యాయమూర్తులు, జిల్లాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సీహెచ్.ఉపేందర్, సీహెచ్.రామకృష్ణ, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చకిలం ఉపేందర్, చొల్లేటి రామకృష్ణ, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. -
సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి
ఖిలా వరంగల్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పంట సర్వేను సమన్వయంతో, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులకు సూ చించారు. ఖిలా వరంగల్ స్తంభంపల్లిలో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను డీఏఓ విజయభాస్కర్, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్లతో కలి సి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత, భూముల హద్దులు, వివరాల నమోదు తదిత ర అంశాలపై ఆరాతీశారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి వర్ధన్నపేట: రైతుల పంట వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా సర్వేయర్లు సర్వే చేపట్టాల ని డీఏఓ విజయభాస్కర్ అధికారులకు సూచించారు. వర్ధన్నపేటతోపాటు నల్లబెల్లి, ఇల్లందలో కొనసాగుతున్న పంటల డిజిటల్ సర్వేను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.. మండలంలో 12 గ్రామాలకు 8 గ్రామాల్లో డిజి టల్ సర్వే మ్యాప్లు సక్రమంగా ఉండటంతో పంట నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. లోపాలున్న గ్రామాల మ్యాప్లు పరిశీలించి వివరాలను వ్యవసాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నాణ్యత లేని ఆయిల్పామ్ మొక్కలతో మోసపోవద్దు నల్లబెల్లి: ఆయిల్పామ్ సాగు చేపడుతున్న రైతులు మొక్కల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని ఆయిల్ ఇండస్ట్రీస్ మేనేజర్ రామ్చరణ్ సూచించారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనధికార నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి రైతులు నష్టపోవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ద్వారా ఫ్యాక్టరీ జోన్ కేటాయించిన తమ సంస్థ ద్వారా నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలను పొందాలని కోరారు. అనధికార వనరుల నుంచి కొనుగోలు చేసిన మొక్కల వల్ల భవిష్యత్లో దిగుబడి తగ్గినా, ఇతర నష్టాలు సంభవించినా తమ సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేశారు. వరుణుడి జోరు..● రాయపర్తిలో 95.8, వర్ధన్నపేటలో 82 మిల్లీ మీటర్ల వర్షం సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపాడు. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం నివేదిక ప్రకారం శనివారం రాత్రి 9 గంటల వరకు వరంగల్ జిల్లా రాయపర్తిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. వర్ధన్నపేటలో 82 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 78.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పర్వతగిరి మండలం కల్లెడలో 73.8, నెక్కొండ మండలం కేంద్రంలో 47.5, రెడ్లవాడలో 73.5, చెన్నారావుపేటలో 62.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవపూర్లో 53.3, ములుగు జిల్లా మంగపేటలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా కొడకండ్లలో 51.8, దేవరుప్పులలో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జిల్లాల సగటు పెరుగుదల జిల్లాల సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వరంగల్లో 33.3 మిల్లీమీటర్లతో అత్యధికంగా నమోదైంది. ములుగు 27.4, మహబూబాబాద్ 24.8, జయశంకర్ భూపాలపల్లి 16.7, జనగామ 12.8, హనుమకొండ 8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్నటితో పోలిస్తే వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వర్షపాతం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం నిన్నటి 18.2 మిల్లీమీటర్లతో పోలిస్తే శనివారం సగటు వర్షపాతం 16.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాభై ఏళ్లకు పైగా గణనాథుడి ఉత్సవాలు
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ● అంబరాన్నంటేలా వేడుకలు ● సాంస్కృతిక కార్యక్రమాలు● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులుసాక్షి, మహబూబాబాద్: డోర్నకల్లోని అంబేడ్కర్ నగర్లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్నగర్కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా, స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం నిమజ్జనం సమయంలో తోపుడు బండి, డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళం వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి -
సర్ నోటీసు వస్తే భయపడొద్దు
సాక్షి, వరంగల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ తదితర అంశాలపై ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి. దీంతో పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులందుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హియరింగ్లో ఎదురవుతున్న సమస్యలు, సమర్పించాల్సిన ఆధారాల గురించి కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రశ్న: నోటీసు అంటే ఓటు తొలగించినట్టేనా?కలెక్టర్: నోటీసు రావడం అంటే ఓటు తొలగించినట్లు కాదు. వివరాల్లో ఏదైనా అనుమానం, అసమతుల్యత లేదా గత సర్ వివరాలతో సరిపోలకపోవడం గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తి నుంచి వి వరణ, ఆధారాలు తీసుకోవడానికి నోటీసు ఇస్తారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్న: ఎలాంటి కారణాలతో నోటీసులు వస్తున్నాయి? కలెక్టర్: తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడం, 50 సంవత్సరాలకు పైగా ఉండడం, ఓటరు–తాతయ్య/అమ్మమ్మ మధ్య వయస్సు వ్యత్యాసం 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రశ్న: ఒకే కుటుంబంలో ఆరుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా అనుమానాస్పదంగా పరిగణిస్తారా? కలెక్టర్: అది ఆటోమేటిక్గా తప్పు అని అర్థం కాదు. వ్యవస్థలో ఒకే వ్యక్తిని తండ్రిగా ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు మ్యాప్ చేసిన సందర్భాల్లో డేటా సరైందో కాదో నిర్ధారించడానికి పరిశీలిస్తారు. ప్రశ్న: నోటీసు అందుకున్న వారు హియరింగ్కు ఏ పత్రాలు తీసుకురావాలి?కలెక్టర్: అందరూ ఒకే రకమైన పత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, కుటుంబ సంబంధాలను నిర్ధారించే పత్రాలు ముఖ్యం. జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, విద్యార్హత ధ్రువపత్రం, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ గుర్తింపు పత్రం, శాశ్వత నివాస ధ్రువపత్రం, కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రాలు ఉంటే తీసుకురావాలి. ప్రశ్న: పుట్టిన సంవత్సరాన్ని బట్టి పత్రాల విషయంలో తేడా ఉంటుందా? కలెక్టర్: ఉంటుంది. 1987 జూలై 1కు ముందు భారతదేశంలో జన్మించిన వారు తమ పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని నిర్ధారించే పత్రాన్ని సమర్పించాలి. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారికి తమ పత్రాలతోపాటు తండ్రి లేదా తల్లి వివరాలను నిర్ధారించే పత్రాలు అవసరం కావొచ్చు. 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన వారికి స్వీయ పత్రాలతో పాటు తండ్రి, తల్లి వివరాల ఆధారాలు కూడా సమర్పించాలి.. ప్రశ్న: ిహయరింగ్కు వెళ్లకపోతే ఏం చేయాలి?కలెక్టర్: నోటీసును నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ణయించిన తేదీ, ప్రదేశాన్ని గమనించి హాజరు కావడానికి ప్రయత్నించాలి. ఏదైనా అనివార్య పరిస్థితి ఉంటే సంబంధిత బీఎల్ఓ/ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. తమ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, గత జాబితాలోని సమాచారం సరిగ్గా ఉందో ముందుగానే పరిశీలించుకోవాలి. ప్రశ్న: ఓటర్లకు మీ సూచన ఏమిటి?కలెక్టర్: ‘నోటీసు వచ్చింది.. ఓటు పోయింది’ అని భావించవద్దు. నోటీసు ఉద్దేశం వివరాలను ధ్రువీకరించడమే. నోటీసులోని కారణాన్ని తెలుసుకుని, అ ందుబాటులో ఉన్న సరైన పత్రాలతో హియరింగ్కు హాజరుకావాలి. అర్హత ఉన్న ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండేలా, అనర్హుల నమోదు లేకుండా ఎస్ ఐఆర్ను పారదర్శకంగా పూర్తి చేయడమే లక్ష్యం.జిల్లాలో మొత్తం 1,94,395 నోటీసులు జనరేట్ కాగా 1,27,365 డెలివరీ అయ్యాయి. 67,030 నోటీసులు డెలివరీ పెండింగ్లో ఉన్నాయి. 12,502 హియరింగ్లు నిర్వహించగా, 96,969 హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయ్యాయి. చాలా మంది వీకెండ్లలో వస్తామని సమాచారం ఇవ్వడంతో ఏఈఆర్ఓల సంఖ్యను పెంచి క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. మొత్తం పెండింగ్ కేసులు 4,828 ఉండగా వీటిని శనివారం కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని బృందం క్లియర్ చేసింది. ఆధారాలతో హియరింగ్కు రండి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
తోపుడు బండి.. ఆయిల్ డబ్బాల శబ్దాలు
నర్సంపేట: నర్సంపేటలోని హైస్కూల్ సమీపంలో 20 మంది యువకుల కమిటీతో ఏర్పడ్డ ప్రగతి నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ 50 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. 1977లో ఏర్పడినప్పటి నుంచి కాలనీలోని సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదట్లో తోపుడు బండిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోగా, ఆ తర్వాత ఎడ్లబండిపై నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం హైస్కూల్ సమీపంలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 50 ఏళ్లక్రితం గణేశ్ ఉత్సవాలు ప్రారంభించాం. మొదట్లో నిమజ్జనం చేసేందుకు తోపుడు బండి పై వినాయకుడిని తీసుకెళ్లేవాళ్లం. నిమజ్జన శోభాయాత్రలో ఆయిల్ డబ్బాను కొట్టుకుంటూ శబ్దాలు చేస్తూ వెళ్లేవాళ్లం. అప్పటి ఆనందమే వేరు. ప్రస్తుతం డీజే పెట్టాల్సి వస్తోంది. – గీత గోవిందం సురేశ్, ఉత్సవ కమిటీ బాధ్యుడు -
67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో..
హన్మకొండ కల్చరల్: ఒకప్పుడు పబ్లిక్గార్డెన్ వద్ద నిర్వహించిన గణేశ్ ఉత్సవాన్ని 1933లో హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయంలోకి మార్చారు. 67 సంవత్సరాల క్రితం వేయిస్తంభాల దేవాలయానికి మార్చగా.. అప్పటి నుంచి నూతన గజానన మండలి అధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయకులను ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేయిస్తంభాల ఆలయంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలిరావడం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా వేయిస్తంభాల దేవాలయం వినాయక నిమజ్జనోత్సవ రథాన్ని దర్శించుకోవడానికి ప్రజలు మంగళ హారతులతో ఎదురుచూస్తారు. -
చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో అదృశ్యమైన మహిళ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిన మహిళను తన స్వగ్రామానికి రప్పించి నిందితుడు హత్య చేశాడు. ఈ మేరకు హసన్పర్తి పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ వెల్లడించారు. ఆయన కథన ప్రకారం హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన తౌటం స్వప్న (40).. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గత మే 31న తన కూతురు కనిపించడం లేదని తండ్రి ఆమంచ రాజేందర్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి విచారణ చేపట్టి కేసును ఛేదించారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారి జిల్లా గుడుదూరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ వొద్దిరాజుల బసవరాజ్ అనే యువకుడితో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని స్పప్న బెదిరింపులకు పాల్పడింది. అలా అయితే తన పరువు పోతుందని స్వప్న ఇష్టానుసారం పెళ్లికి బసవరాజ్ అయిష్టంగా అంగీకరించాడు. ఆమెను ఇక్కడి నుంచి బళ్లారికి రప్పించాడు. అనంతరం స్థానిక గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోకి స్వప్నను తీసుకెళ్లి హత్య చేశాడు. హత్యను దాచిపెట్టేందుకు మరుసటి రోజు మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసి, రక్తపు మరకలు ఉన్న బట్టలను తగులబెట్టాడు. స్వప్న మొబైల్ను చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అంబాల–కమలాపూర్ ప్రధాన రోడ్డులో తాజాగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులను చూసి బసవరాజ్ పరారయ్యే క్రమంలో అదుపులోకి తీసుకుని విచారించారు. స్పప్నను తనే హత్యచేశానని అంగీకరించగా బసవరాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సైలు సుజిత్, రవి, దేవేందర్, ఏఓ సల్మాన్ పాషా, సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. ఇదీ చదవండి: కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక -
పెట్రోల్తో ఒంటికి నిప్పు.. ఠాణాలోకి పరుగు!
ఖిలా వరంగల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెట్టాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్ లక్ష్మీనగర్కు చెందిన కట్ల హరీశ్, అదే ప్రాంతానికి చెందిన వైష్ణవిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త హరీశ్ మద్యం సేవించి తరుచూ గొడవ పడేవాడని, తనపై, తన తల్లిపై దాడి చేశాడని, ఆ క్రమంలో తన తల్లి చేయి విరిగిందని గతంలో వైష్ణవి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసింది. ఈ క్రమంలో హరీశ్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అతడిలో మార్పువస్తుందని భావించి వైష్ణవి భర్తతో కలిసి వెళ్లింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తరహాలో ప్రవర్తించడంతో విసుగు చెందిన వైష్ణవి ఇక భర్తతో తాను కలిసి జీవించడం సాధ్యం కాదంటూ కరీమాబాద్లోని పుట్టింటికి వెళ్లడమే కాకుండా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈనెల 7వ తేదీన వాయిదా ప్రకారం కోర్టుకు వైష్ణవి హాజరై పుట్టింటికి చేరుకుంది. ఈ సమయంలో హరీశ్ ఆమెను వెంబడించి ఇంటికి వెళ్లి విడాకులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇంట్లో తల్లి లేకపోవడంతో ఏమీ అనకుండా వైష్ణవి ఉండిపోయింది. గురువారం మళ్లీ హరీశ్ వచ్చి అదే పద్ధతిలో ప్రవర్తించడమే కాకుండా వైష్ణవి, ఆమె తల్లిని కొట్టాడు. ఈ విషయమై అదేరోజు మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో వైష్ణవి మళ్లీ ఫిర్యాదు చేసింది. భర్తతో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. దీంతో శుక్రవారం ఉదయమే పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు హరీశ్కు సమాచారం అందించారు. మధ్యాహ్నం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు రాగానే హరీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకొచ్చాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో రైటర్ ప్రవీణ్, కానిస్టేబుల్ ముగ్ధుమ్ చేతులు కాలిపోయాయి. ముప్పై శాతానికిపైగా కాలిన హరీశ్తోపాటు గాయపడిన పోలీసు సిబ్బందిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, తన భార్య మంచిదేనని, అత్త వేధింపులతోనే వైష్ణవి తన నుంచి దూరమవుతుందని, కుమారుడిని కూడా దూరం చేశారని... ఈ నిర్ణయం తీసుకున్నానని ఎంజీఎంలో జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. -
నోటీసులు వస్తే ఆందోళన వద్దు
హన్మకొండ అర్బన్: ‘సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోటీసుల్లో పేర్కొన్న ఆధా రాలు సమర్పిస్తే సరిపోతుంది’ అని అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అదనపు కలెక్టర్ ఎన్.రవి కలెక్టరేట్ నుంచి ఫోన్ఇన్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్తో కలిసి ప్రజల సందేహాలు నివృత్తి చేశారు. ప్రశ్న: ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులలో పేరు తప్పుగా ఉంది.. ఏం చేయాలి?–నవీన్, పరకాల/స్వామి, రత్నగిరి, భీమదేవరపల్లి అదనపు కలెక్టర్: స్పెల్లింగ్ తప్పు పెద్ద సమస్యమీ కాదు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్లో అలాంటి లోపం ఉంటే ఆటోమేటిక్గా నోటీస్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో పేరులో స్పెల్లింగ్ సరిగ్గా ఉన్న ఏదైనా ఒక పత్రాన్ని తీసుకెళ్లి బూత్ స్థాయి అధికారికి సమర్పించాలి. మీరు వెళ్లలేకపోతే బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా పత్రాలు అందించవచ్చు. ప్రశ్న: 25 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నాం. 2002 నాటి వివరాలు అడుగుతున్నారు.. ఏం చేయాలి?– అమ్మ అశోక్, పెద్దకోడెపాక, శాయంపేట అదనపు కలెక్టర్: నోటీసులు అందుకున్న వారు 1987 తర్వాత పుట్టినవారైతే వారి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. నోటీసులో కోరిన ఆధారాలను బూత్ స్థాయి అధికారికి అందజేయాలి. ప్రశ్న: మా ఓట్లు తొలగించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేవు. మేం ఇచ్చిన వివరాలను బూత్ స్థాయి అధికారి నమోదు చేయలేదని తెలిసింది. ఇప్పుడేం చేయాలి?– ఎ.రవి, హనుమకొండ అదనపు కలెక్టర్: వివరాలు నమోదు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు పరిశీలిస్తారు. అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. సంబంధిత సహాయ ఎన్నికల నమోదు అధికారికి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. ఓటరు జాబితాలో పేర్లు లేని వారి వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ప్రశ్న: మా ఇంట్లో నలుగురికి నోటీసులు ఇచ్చారు. పాత వివరాలు అడుగుతున్నారు. ఏం ఇవ్వాలి? – డోలిపురి రామచంద్రన్, పరకాల అదనపు కలెక్టర్: పెద్దలకు బ్యాంక్ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ తదితర ఎన్నికల సంఘం సూచించిన ఆధారాల్లో ఏదైనా సమర్పించాలి. యువతకు సంబంధించిన నోటీసులు ఉంటే జన న ధ్రువపత్రాలు, పదో తరగతి మెమోతో పాటు తల్లిదండ్రుల ఓటరు వివరాలను అందజేయాలి. ప్రశ్న: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటే ఓటు హక్కు వచ్చినట్టేనా?– శివప్రసాద్, ఆత్మకూరు అదనపు కలెక్టర్: ముసాయిదా జాబితాలో పేరు ఉన్నప్పటికీ నోటీసులు వచ్చిన వారు అందులో కోరిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న వివరాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే రెండో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడున్నా ఓటర్ పోర్టల్లో వివరాలు పరిశీలించుకోవచ్చు అదనపు కలెక్టర్ ఎన్.రవి ‘సర్’ ప్రక్రియపై ‘సాక్షి’ ఫోన్ ఇన్ ఓటర్ల నుంచి విశేష స్పందనప్రశ్న: నేను 1962లో పుట్టాను. నాకు ఓటు హక్కు ఉంది. అయినా నోటీసు ఎందుకు ఇచ్చారు? నా ఓటు ఉంటుందా.. తీసేస్తారా?– వెంకటేశ్వర్లు, నేరెళ్ల, కమలాపూర్ అదనపు కలెక్టర్: నోటీసు ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగిస్తారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర వివరాల్లో లోపాలు ఉన్నా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నోటీసులో కోరిన సరైన పత్రాలను బూత్ స్థాయి అధికారికి అందించాలి. వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రశ్న: మాది దామెర గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. ఊరిలోనే ఓటు కావాలి. ముసాయిదా జాబితాను ఎలా చూసుకోవాలి? నోటీసులు ఎవరికి ఇస్తారు?– రాజు, దామెర అదనపు కలెక్టర్: మీరు ఎక్కడున్నా ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్లో మీ వివరాలను పరిశీలించుకోవచ్చు. అందులో పేరు ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ పేరు ఉన్నప్పటికీ నోటీసు వచ్చినట్లు తెలిస్తే సంబంధిత బూత్ స్థాయి అధికారికి నోటీసులో అడిగిన వివరాలను అందజేయాలి.ప్రశ్న: నోటీసుకు ఇచ్చిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందారో లేదో ఎలా తెలుస్తుంది? – తారాబాయి, చైతన్యపురి కాలనీ, హనుమకొండఅదనపు కలెక్టర్: నోటీసు వచ్చిన అనంతరం తగిన ఆధారాలను అధికారికి సమర్పిస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందించినా, సమాచారం మిస్మ్యాచ్ అయినా రెండో నోటీస్ అందిస్తారు. -
వ్యవసాయ భూమి పేరుతో ప్లాట్లు చేసే ప్రాజెక్టులపై దృష్టి
2025 మార్చి వరకు రెరా రిజిస్టర్ ప్రాజెక్టులు (పాత జిల్లాల గణాంకాల ప్రకారం)42714292612మహబూబాబాద్ వరంగల్ రూరల్వరంగల్ అర్బన్భూపాలపల్లిజనగామప్రాజెక్టులు జిల్లా -
రెరా.. వెంచర్లపై ఆరా!
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి, వరంగల్: ‘వ్యవసాయ భూమి’.. ‘ఫామ్ ల్యాండ్’.. ‘ఆర్గానిక్ ఫామ్’.. ‘వీకెండ్ ఫామ్’.. పేర్లు వేరైనా వ్యాపారం మాత్రం ఒక్కటే. ఎకరాల కొద్ది వ్యవసాయ భూమిని సేకరించి రోడ్లు వేయడం, చిన్నచిన్న భాగాలుగా విభజించడం, భవిష్యత్ విలువ పెరుగుతుందని వినియోగదారులకు ప్లాట్లను విక్రయించడం.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యవహారంలో తెలంగాణ రెరా, అనంతరం అప్పీళ్ల స్థాయిలో వెలువడిన తీర్పు నేపథ్యంలో ‘వ్యవసాయ భూమి కాబట్టి రెరా వర్తించదు’ అనే వాదనపై కొత్త చర్చ మొదలైంది. సేకరించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్కెట్ చేస్తే కేవలం భూమి రికార్డులో ‘వ్యవసాయ’ంగా ఉండడం ఒక్కటే రెరా నుంచి తప్పించుకునే ఆధారం కాదన్న దిశలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టులో ఎనిమిదేళ్ల తర్వాత బైబ్యాక్ కింద రెట్టింపు మొత్తంతో పాటు 100 నెలల పాటు ఏటా రూ.1.92 లక్షలు లీజు ఇస్తామని, 2023 నుంచి లీజు మొత్తం చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి రెరాలో ఫిర్యాదు చేయగా ఈ ఆదేశాలు రావడం గమనార్హం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూముల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించి, వాటిని రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలనడంతో ఉమ్మడి వరంగల్లోని వ్యవసాయ భూముల పేరుతో వెంచర్లు చేస్తున్న వారిలో వణుకు మొదలైంది. వందలాది ఎకరాల్లో.. రూ.కోట్లలో ఈ ఈ వ్యాపారం జరుగుతుందనే చెప్పాలి. కొనుగోలుదారుడికి లాభమేంటంటే? రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉంటే కొనుగోలుదారుడికి ఆమోదిత లే ఔట్, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి దశ, బుకింగ్ స్థితి, అనుమతులు తదితర వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలాగే, ప్రాజెక్జు రిజిస్ట్రేషన్కు ముందు మార్కెటింగ్, బుకింగ్, విక్రయాలపై కూడా రెరా చట్టం నియంత్రణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టును ప్రచారం చేస్తే ప్రమోటర్పై చర్యలు, జరిమానా విధిస్తారు. టీజీ రెరా ప్రకారం ఉల్లంఘనకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇటీవల రాష్ట్రంలో వ్యవసాయ భూమిని ‘ఫార్మ్ ప్లాట్లు’గా విభజించి, లేఅవుట్ అనుమతి, భూమి మార్పిడి, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయించిన వ్యవహారంలో టీజీ రెరా చర్యలు తీసుకుని జరిమానా విధించింది. చట్టబద్ధమైన వెంచర్లకు డిమాండ్.. ఇప్పటి వరకు ‘వ్యవసాయ భూమి’ పేరుతో తక్కువ ధరకు భూమి తీసుకుని, రోడ్లు, విద్యుత్, గేటెడ్ కమ్యూనిటీ, రిసార్టు, పార్కు, భవిష్యత్ విలువ వంటి అంశాలతో ప్రచారం చేసే మోడల్కు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇకపై ప్రాజెక్టు స్థాయి అభివృద్ధి ఉన్న చోట నియంత్రణ సంస్థల దృష్టి పెరగడంతో డెవలపర్లకు పత్రాలు, అనుమతులు, ప్రాజెక్టు వివరాలను స్పష్టంగా ఉంచాల్సిన అవసరముంది. దీంతో నిజంగా వ్యవసాయం కోసం భూమి కొనేవారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్లాట్ కొనేవారు అనే తేడా కనిపించనుంది. అనుమతులు లేకుండా కేవలం భవిష్యత్ విలువ పేరుతో విక్రయించే ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గి, చట్టబద్ధంగా అభివృద్ధి చేసిన వెంచర్లకు ప్రాధాన్యం పెరగవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని అంశాలను పరిశీలించాలి ‘ప్లాట్ ఎక్కడ ఉంది?’ అన్నదానికంటే ‘ఆ ప్లాట్ ఏ అనుమతుల పరిధిలో ఉంది?’ అనేదే కొనుగోలుదారులు చూసుకోవాలి. రెరా నంబర్, ఆమోదిత లేఔట్, భూమి హక్కులు, భూమి వినియోగం, నిషేధిత జాబితా, ఎన్కంబరెన్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టేందుకు ముందుకెళ్లడం ఉత్తమం. – అజిత్రెడ్డి, కుడా పీఓ రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చర్యలతో ఒక్కసారిగా చర్చ ఫలితంగా ఉమ్మడి వరంగల్లో రియల్ ఎస్టేట్పై ప్రభావం తాజా చర్యలతో కొనుగోలుదారులకు మరింత రక్షణఆరు జిల్లాల్లో భూములకు డిమాండ్ వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పట్టణాల చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరుగుతోంది. రైతుల నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసే సంస్కృతి పెరుగుతోంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ‘వెంచర్’, ‘ఫామ్ ప్లాట్’, ‘గేటెడ్ ఫామ్’ వంటి పేర్లతో మార్కెటింగ్ చేసే ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. -
ట్రాఫిక్ పీఎస్ను తనిఖీ చేసిన సీపీ
కాశిబుగ్గ: వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ ట్రాపిక్ పోలీస్ స్టేసన్ను పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది కిట్, ఆర్టికల్స్ను పరిశీలించారు. శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు పరిశీలించారు. వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు డీసీపీ ప్రభాకర్రావు, ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. -
నిమజ్జనానికి నీటి కొరత
● ట్రైసిటీలోని కొన్ని చెరువుల్లో ఆశాజనకం, మరికొన్ని వెలవెల ● ఏర్పాట్లను పరిశీలిస్తున్న జీడబ్ల్యూఎంసీ అధికారులువరంగల్ అర్బన్: నగరంలో ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్లో ఇంత వరకు భారీ వర్షం కరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడమెలా? అని మహా నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారిస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న తర్వాత గణేశ్ నిమజ్జనం జరుగనుంది. ఈసారి నిమజ్జనం చేసేందుకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు సరిపడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భారీ వర్షాలు కురిసిస్తే నిమజ్జనానికి నీటి కొరత తప్పుతుంది. సాధ్యమైనంత వరకు పెద్ద విగ్రహాలను చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నీటి నిల్వలపై అధికారుల సమాలోచనలు హనుమకొండ, వరంగల్ కాజీపేట, చిన్న, పెద్ద చెరువుల్లో గతేడాది మొత్తం 7,500 వరకు ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఈఏడాది 8 వేలకుగా ప్రతిష్టించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 90 శాతానికి పైగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ వినాయక ప్రతిమలు ఉన్నట్లు సమాచారం. ఆయా చెరువులు కొన్నింటిలో ఇప్పటికే గుర్రపు డెక్క, నాచు ఇతర వ్యర్థాలను శుభ్రం చేశారు. సిద్ధేశ్వర గుండం, బంధం చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఇరిగేషన్ ఇంజనీర్లకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ● వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువులో గతేడాది 3,230 ప్రతిమలు నిమజ్జనం చేశారు. ఈఏడాది 4,300కు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. చెరువులో నీటి నిల్వలు బాగానే ఉన్నాయి. నగరవ్యాప్తంగా భారీ విగ్రహాలను ఇక్కడికే తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● అండర్ రైల్వే గేట్ ఉర్సు రంగసముద్రంలో చెరువులో గతేడాది 700 విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది 750 వరకు వస్తాయని అంచనా. హనుమకొండ హంటర్ రోడ్డు ప్రాంతాల్లోని ప్రతిమలను ఉర్సు చెరువుకు మళ్లించనున్నారు. ● కట్టమల్లన్న చెరువులో గతేడాది వినాయక విగ్రహాలు 146 నిమజ్జనం కాగా, ఈ ఏడాది 170 వరకు వస్తాయని భవిస్తున్నారు. ఇక్కడ తెప్పలను ఎక్కువగా ఉపయోగించనున్నారు. ● హనుమకొండ సిద్ధేశ్వర గుండంలో గతేడాది 450 విగ్రహాలను నిమజ్జనం చేయగా, ఈ ఏడాది 500 ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. పూడికతీత త్వరలో ప్రారంభం కానుంది. ● కాజీపేట బంధం చెరువులో గతేడాది 480 ప్రతిమలను నిమజ్జనం చేయగా, ఈ ఏడాది 540 వరకు వస్తాయని భావిస్తున్నారు. మత్తడి లెవల్ కొంత తక్కువ వాటర్ ఉంది. ఈ చెరువులో అధిక తెప్పలు ఏర్పాటు చేయనున్నారు. ● హసన్పర్తి పెద్ద చెరువులో సుమారు 250 వరకు విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ● వరంగల్ ములుగు రోడ్డులోని కోట చెరువులో మూడేళ్లుగా గణేశ్ ప్రతిమల నిమజ్జనాలకు బ్రేక్ పడింది. చెరువు కలుషితం కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.హనుమకొండ సిద్ధేశ్వరాలయ ఆవరణలోని కోనేరులో తక్కువగా ఉన్న నీరునీరు లేక వెలవెలబోతున్న కాజీపేట బంధం చెరువుభారీ వర్షం కురిస్తేనే గ్రేటర్ చెరువులకు జలకళ2003 సంవత్సరంలో చెరువుల్లో నీరు లేక వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు. గణేశ్నిమజ్జనం చేశారు. 2014లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో భారీ వినాయక ప్రతిమలను పెద్ద చెరువుల్లోకి తరలించి, చిన్న విగ్రహాలను నగరంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
● సమ్మె ప్రభావంతో జనం అవస్థలు హన్మకొండ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్ పిలుపు మేరకు శుక్రవారం గ్రేటర్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలో పాల్గొన్నారు. వరంగల్ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారుల సంఘం డీజీఎస్ వై.ప్రవీణ్కుమార్, అవార్డు స్టాఫ్ డీజీఎస్ సీహెచ్.సంతోశ్కుమార్, ఓబీసీ డీజీఎస్ రజనీకాంత్, సేవా డీజీఎస్ రమణతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మె ఎఫెక్ట్ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బ్యాంకు శాఖల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, ఇతర లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఏటీఎంలు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర నగదు అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు శని, ఆది, సోమవారం వరుసగా సెలవులు రావడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రజలు మరికొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. -
ఉద్యాన పంటలతో అధిక ఆదాయం
● కలెక్టర్ సత్యశారద గీసుకొండ: ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. ‘మామిడి, మిరప, ఇతర కూరగాయ పంటల్లో వినూత్న వ్యవసాయ పద్ధతులు’ అనే అంశంపై రైతులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో మామిడి, మిరప, పసుపు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తక్కువ నీటితో ఆధునిక సాగు పద్ధతులను పాటించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రాంతానికి అనుగుణంగా వివిధ పంటలను సాగు చేయాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులతో నీటిని పొదుపు చేయాలని కోరారు. మల్చింగ్ ద్వారా నేలలో తేమను కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం లోపం వంటి వాతావరణ పరిస్థితులను దష్టిలో పెట్టుకుని సాగు, నీటి పారుదల ప్రణాళికలను మార్చుకోవాలన్నారు. పంటల్లో పురుగు, తెగుళ్లను ముందుగానే గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న ఎంఐడీహెచ్, మైక్రో ఇరిగేషన్, ఆర్కేవైవీ, ఎన్ఎంఈఓ –ఓపీ తదితర పథకాల రాయితీలను రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కొత్త పండ్ల తోటలు, కూరగాయల నారు, పర్మనెంట్ పందిళ్లు, మల్చింగ్ తదితరాలకు అందుబాటులో ఉన్న సహాయాన్ని అధికారులు వివరించారు. సదస్సులో ఐసీఏఆర్ – ఐఐహెచ్ఆర్ బెంగళూరుకు చెందిన డాక్టర్ పొన్నం నరేష్ కూరగాయల ఆధునిక సాగు పద్ధతులపై, డాక్టర్ చేతన్ కుమార్ నేల ఆరోగ్యం, నేల నిర్వహణపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ మామిడి, మిరప తదితర పంటల్లో మొక్కల ఆరోగ్యం, తెగుళ్ల నివారణపై వివరించారు. డాక్టర్ రాజీవ్ కుమార్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి తదితరులు రైతులకు సూచనలు అందించారు. సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ‘అర్క తేజస్వి’ విత్తనాలు తదితరాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ఆర్డీఓ, సర్పంచ్లు, సుమారు 400 మంది రైతులు పాల్గొన్నారు. భూముల రీ సర్వే పకడ్భందీగా నిర్వహించాలి పర్వతగిరి: భూముల రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండలంలోని జమాల్పురం వ్యవసాయ భూముల్లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రీ సర్వే నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం మాత్రమే వివరాలను నమోదు చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత భూ హద్దులు, రికార్డులకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఆర్డీఓ సుమ, డీఆర్డీఓ పీడీ నాగపద్మజ, సర్వే ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటస్వామి పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు న్యూశాయంపేట: జిల్లాలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు కిషోర్కుమార్, వై.వీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, వరంగల్ ఆర్డీఓ సుమ, హౌసింగ్ డీఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో అంగన్వాడీ సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందేలా నిరంత రం పర్యవేక్షించాలన్నారు. ఈనెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే పోషణ మాసం–2026 పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ రాజమణి పాల్గొన్నారు. -
నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలి
నర్సంపేట: వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్ అందించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఈ ఎంఆర్టీ అన్నపూర్ణ అన్నారు. నర్సంపేట టోని 132కేవీ సబ్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరపరా స్థితిగతులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ, వినియోగదారులకు నాణ్యమై న, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలను శుక్రవారం పరిశీలించారు. సబ్ స్టేషన్లోని విద్యుత్ పరికరాల పనితీరు, లోడ్ పరిస్థితి, ఫీడర్ల ద్వారా కొనసాగుతున్న సరఫరా స్థితిగతులను పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా పరికరాల పరితీరును నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సబ్ స్టేషన్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. డీఈ తిరుపతి, ఏడీఈ పాల్గొన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండాలి వర్ధన్నపేట: విద్యుత్ సిబ్బంది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని విద్యుత్ సీఈ(ఆపరేషన్స్) గౌతంరెడ్డి అన్నారు. శుక్రవారం వర్ధన్నపేటలోని సబ్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. విద్యుత్ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. విద్యుత్ సమస్యలు ఏర్పడినపుడు వినియోగదారులకు అందుబాటులో ఉండి సమస్యలను తీర్చాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు, విద్యుత్ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు ఏడీఈ నటరాజ్, ఏఈ తరుణ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. సబ్ స్టేషన్ తనిఖీ పర్వతగిరి: మండ కేంద్రంలోని 33/11కేవీ సబ్ స్టేషన్ను శుక్రవారం సూపరింటెండెంట్ ఇంజనీర్(ఆపరేషన్) వరంగల్ ఆనందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెక్నికల్ సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆనందం సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ తిరుపతి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. -
శ్రీరాజరాజేశ్వరీదేవికి తామరపూలతో అర్చన
హన్మకొండ కల్చరల్: ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారికి శుక్రవారం విశేషపూజలు నిర్వహించా రు. ఆలయ అర్చకులు యెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అర్చన జరిపారు. అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన 1,008 తామరపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్: ‘రెండు వారాలకు మించి దగ్గు, ఛాతిలో నొప్పి, దగ్గినప్పుడు తెమడ పడడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రతి ఒక్కరూ తెమడ పరీక్షతో పాటు ఎక్స్రే పరీక్ష చేయించుకోవాలి’ అని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఎక్స్రే స్క్రీనింగ్ శిబిరాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి ప్రదీప్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రామ్భార్గవ్, డాక్టర్ సురేశ్, సీహెచ్ఓ మాధవరెడ్డి, డీపీఎంఓ దేవ్సింగ్, ఆప్తాల్మిక్ అధికారి ప్రతాప్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ కార్యాలయ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్కు తొలిసారిగా డిప్యూటీ డైరెక్టర్గా ప్రొఫెసర్ పి.రతీశ్కుమార్ను నియమిస్తూ శుక్రవారం నిట్ వరంగల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 31 నిట్లలో తొలి నిట్ వరంగల్గా నిలవగా.. ఇప్పుడు తొలి డిప్యూటీ డైరెక్టర్ను నియమించుకున్న తొలి నిట్ వరంగల్గా నిలిచింది. నిట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా, డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రతీశ్కుమార్ను డిప్యూటీ డైరెక్టర్గా నియమించడంతో నిట్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. హన్మకొండ: యూనిక్ పోల్ నంబరింగ్తో విద్యుత్ లోపాలు, సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ బి.సామ్యా నాయక్ తెలిపారు. అత్యుత్తమ సేవలు అందించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అందుకు అనుగుణంగా మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెట్ మ్యాపింగ్, ట్రాకింగ్లో భాగంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్లను కేటాయించి పెయింటింగ్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 33 కేవీ పోల్ నంబరింగ్ 11,923 విద్యుత్ స్తంభాలకు, 11 కేవీ పోల్ నంబరింగ్ 80,461 విద్యుత్ స్తంభాలకు పూర్తి చేసినట్లు వివరించారు. ముగిసిన ఐఎఫ్ఏటీ ఇండియా ప్రదర్శనలువరంగల్ అర్బన్: ముంబైలో మూడు రోజులపాటు జరిగిన ఐఎఫ్ఏటీ ఇండియా–2026 ప్రదర్శనలు శుక్రవారం ముగిశాయి. ఈ సదస్సుకు బల్దియా కమిషనర్ టి.వెంకన్న హాజరయ్యారు. మంచినీటి సరఫరా, ఘనవ్యర్థాలు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, ఆధునిక పరిజ్ఞానం కోసం ప్రదర్శనలు ఎంతగానో దోహద పడుతాయని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్ నిర్వహణ రంగాల్లో అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలను ఆయన పరిశీలించారు. సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ ఫల్గుణ్కుమార్, పలు కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. -
అండర్పాస్ నిర్మాణానికి సూరారం స్టేజీ పరిశీలన
ఎల్కతుర్తి: అండర్పాస్ నిర్మాణానికి మండలంలోని సూరారం వద్దగల ఎన్హెచ్–563ను శుక్రవారం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) కృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఎస్సై నరసింహారావు పరిశీలించారు. సూరారం జంక్షన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అండర్పాస్ నిర్మించాలంటూ స్థానికులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అండర్పాస్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక నివేదికను, రోడ్డు మళ్లింపు ప్రణాళికను త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. అండర్పాస్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ఇటు వాహనాదారులు, అటు స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సర్వీస్ రోడ్ల అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్గాలపై సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: గణపతి విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట బంధం చెరువు, హనుమకొండ సిద్ధేశ్వర గుండం, వరంగల్ చిన్న వడ్డేపల్లి, ఉర్సు చెరువుల వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, సంజయ్ కుమార్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, డీఎంహెచ్ఓలు అప్పయ్య, రాజారెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్యానాయక్, సాగునీటి పారుదల శాఖ అధికారులు కిరణ్కుమార్, మధుసూదన్రెడ్డి, జీడబ్ల్యూఎంసీ ఎంహెచ్ఓ రాజేశ్, ఆర్అండ్బీ ఈఈ దేవికాచౌహాన్, మైనింగ్ ఏడీ రామాచారి, కాజీపేట తహసీల్దార్ రాజు, ఏసీపీలు ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ, కాజీపేట పోలీస్ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్ పాల్గొన్నారు. -
‘సర్వే’యర్లకు కష్టాలు
● ఎకరానికి రూ.60 మాత్రమే చెల్లింపు ● సమస్యల పరిష్కరించాలని డిమాండ్ ● ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ.. రీ–సర్వే సనుల నిలిపివేతనల్లబెల్లి: భూభారతి రీ–సర్వేలో కీలక పాత్ర పోషించాల్సిన లైసెన్స్డ్ సర్వేయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలలు శిక్షణ తీసుకొని, కఠినమైన పోటీ పరీక్షల్లో ఉతీర్ణలై లైసెన్సులు పొందినప్పటికీ తమకు సరైన ఉపాధి, గౌరవ వేతనం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, క్షేత్ర స్థాయిలో అమలవుతున్న చెల్లింపులకు పొంతన లేదని మండిపడుతున్నారు. ఆరు నెలల శిక్షణ.. కఠిన పరీక్షలు ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి వ్యవస్థను తీసుకొచ్చి భూముల సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు రీ–సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసేందుకు గత ఏడాది మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో సుమారు 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల నుంచి రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేసి.. నాలుగు నెలలపాటు అధికారిక శిక్షణ ఇచ్చారు. అనంతరం మరో రెండు నెలలపాటు ఫీల్డ్ ట్రైనింగ్ నిర్వహించడంతో ఆరు నెలల శిక్షణ పూర్తి చేశారు. థియరీ, ప్రాక్టికల్, వైవాతో పాటు అప్రెంటిస్షిప్, మిషన్లతో కొలతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, 60 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి లైసెన్సులు మంజూరు చేశారు. విధుల్లో చేరాలని తీవ్ర ఒత్తిడి గతేడాది డిసెంబర్ నాటికే శిక్షణ పరీక్షల ప్రక్రియ పూర్తియినట్లు సర్వేయర్లు తెలిపారు. డిసెంబర్లో జిల్లాలో 200 మందిని సర్వేయర్లను కేటాయించారు. అయితే అప్పటి నుంచి చాలాకాలంపాటు పనులు కల్పించకపోవడంతో ఆదాయం లేకుండాపోయిందని వాపోయారు. మరో వైపు మండలాల్లో విధుల్లో చేరకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు ఒత్తిడి తెచ్చారని, కానీ విధులు, ఉపాధి విధానం, చెల్లింపులపై ఎలాంటి స్పష్టత లేదని ఆరోపించారు. ప్రస్తుతం మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి 33 మంది సర్వేయర్లకు విధులు అప్పగించారు. రెండు రోజులుగా రీ–సర్వే బంద్ సమస్యల పరిష్కారిషారం కోసం కలెక్టర్, రెవెన్యూ అధికారులను కలిసి వినతులు సమర్పించడంతోపాటు ధర్నాలు, ఆందోళన చేపట్టారు. అంతే కాకుండా గతంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించారు. అయినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ గత రెండు రోజులుగా రీ–సర్వే పనులను పూర్తిగా నిలిని బంద్ ప్రకటించినట్లు వెల్లడించారు. సర్వే భవన్కు వెళ్లి సమస్యలను వివరించేందుకు ప్రయత్నిస్తే అధికారులు కనీసం మాట్లాడేందుకు కూడా ముందుకు రావడంలేదని వాపోయారు. చర్చలకు అనుమతించకుండా గేటు వద్దే అడ్డుకున్నారని, సమస్యలపై ప్రశ్నించిన వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెట్టిచాకిరీ చేస్తున్నాంమా పని వెట్టి చాకిరీగా మారుతోంది. డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివి, నెలల తరబడి శిక్షణ పొంది లైసెన్స్లు సాధించాం. ఉపాధి లభిస్తుందని ఆశించాం. కానీ, ఎకరాకు రూ.60 తో రీ సర్వే చేయడం సాధ్యం కాదు. ఇది మాకు గిట్టుబాటు కావడంలేదు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని రీ సర్వేకు సముచితమైన చార్జీలు చెల్లించాలి. విధులు, చెల్లింపులపై స్పష్టమైన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించాలి. – విష్ణు, లైసెన్స్డ్ సర్వేయర్రూ.500 హామీ.. ఆచరణలో రూ.60 ప్రభుత్వం లైసెన్స్లు ఇచ్చే సమయంలో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సమయంలో జరిగే భూముల కొలతలకు ఎకరాకు రూ.500 చొప్పున చెల్లిస్తామని చెప్పినట్లు పేర్కొంటున్నారు. ఇందులో 10 శాతం ప్రభుత్వం తీసుకుని, మిగిలిన 90 శాతం సర్వేయర్లకు అందుతుందని తెలిపారు. అయితే నెలల తరబడి పనులు లేకుండా ఉంచిన అనంతరం ఆగస్టులో ఎకరాకు కేవలం రూ.20 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టగా ఆ మోత్తాన్ని రూ.60 కి పెంచినప్పటికీ గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. రైతుల మధ్య భూ వివాదాలు, గట్ల సరిహద్దులు లేకపోవడం, పొలాల్లో చెట్లు వంటి అడ్డంకుల కారణంగా ఒక రోజులో ఇద్దరు సర్వేయర్లు కలిసి 10 నుంచి 15 ఎకరాల కొలత చేపట్టడం సాధ్యం కావడం లేదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు సర్వేయర్లు పని చేసినా.. ఎకరాకు రూ.60 చొప్పున మొత్తం రూ.300 లోపే వస్తుందని పేర్కొన్నారు. ఇందులో వాహనాల పెట్రోల్, భోజనం, ఇతర రోజువారీ ఖర్చులు తీసేయగా.. ఏమీ మిగలడంలేదని వాపోయారు. -
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంకు వినతి
హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం హైదరాబాద్లో కలిశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, సెక్రటరీ జనరల్ బక్క దానయ్య, నాయకులు వారికి వినతిపత్రం అందించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు పి.రామస్వామి, దయానంద్, జిల్లా శంకర్, చాట్ల సుధాకర్, వెంకటేశ్వరరావు, సంతోశ్, కృష్ణ, రవి, ఉప్పలయ్య, భాస్కర్ పాల్గొన్నారు. -
‘రెరా’.. వెంచర్లపై ఆరా!
సాక్షి, వరంగల్: ‘వ్యవసాయ భూమి’.. ‘ఫామ్ ల్యాండ్’.. ‘ఆర్గానిక్ ఫామ్’.. ‘వీకెండ్ ఫామ్’.. పేర్లు వేరైనా వ్యాపారం మాత్రం ఒక్కటే. ఎకరాల కొద్ది వ్యవసాయ భూమిని సేకరించి రోడ్లు వేయడం, చిన్నచిన్న భాగాలుగా విభజించడం, భవిష్యత్ విలువ పెరుగుతుందని వినియోగదారులకు ప్లాట్లను విక్రయించడం.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలి ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యవహారంలో తెలంగాణ రెరా, అనంతరం అప్పీళ్ల స్థాయిలో వెలువడిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూముల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించి, వాటిని రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలనడంతో ఉమ్మడి వరంగల్లోని వ్యవసాయ భూముల పేరుతో వెంచర్లు చేస్తున్న వా రిలో వణుకు మొదలైంది. వందలాది ఎకరాల్లో.. రూ.కోట్లలో ఈవ్యాపారం జరుగుతుందనే చెప్పాలి. ఆరు జిల్లాల్లో భూములకు డిమాండ్ వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పట్టణాల చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరుగుతోంది. రైతుల నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసే సంస్కృతి పెరుగుతోంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ‘వెంచర్’, ‘ఫామ్ ప్లాట్’, ‘గేటెడ్ ఫామ్’ వంటి పేర్లతో మార్కెటింగ్ చేసే ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. కొనుగోలుదారుడికి లాభమేంటంటే? రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉంటే కొనుగోలుదారుడికి ఆమోదిత లేఔట్, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి దశ, బుకింగ్ స్థితి, అనుమతులు తదితర వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలాగే, ప్రాజెక్జు రిజిస్ట్రేషన్కు ముందు మార్కెటింగ్, బుకింగ్, విక్రయాలపై కూడా రెరా చట్టం నియంత్రణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టును ప్రచారం చేస్తే ప్రమోటర్పై చర్యలు, జరిమానా విధిస్తారు. చట్టబద్ధమైన వెంచర్లకు డిమాండ్.. ఇకపై వ్యవసాయం కోసం భూమి కొనేవారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్లాట్ కొనేవారు అనే తేడా కనిపించనుంది. అనుమతులు లేకుండా కేవలం భవిష్యత్ విలువ పేరుతో విక్రయించే ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గి, చట్టబద్ధంగా అభివృద్ధి చేసిన వెంచర్లకు ప్రాధాన్యం పెరగవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని అంశాలు పరిశీలించాలి,, కొనుగోలుదారులకు ‘ప్లాట్ ఎక్కడ ఉంది?’ అన్నదానికంటే ‘ఆ ప్లాట్ ఏ అనుమతుల పరిధిలో ఉంది?’ అన్నదే కీలకం. రెరా నంబర్, ఆమోదిత లేఔట్, భూమి హక్కులు, భూమి వినియోగం, నిషేధిత జాబితా, ఎన్కంబరెన్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టడం సురక్షితం – అజిత్రెడ్డి, కుడా పీఓ వ్యవసాయ భూమి పేరుతో ప్లాట్లు చేసే ప్రాజెక్టులపై దృష్టి రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చర్యలతో ఒక్కసారిగా చర్చ ఫలితంగా ఉమ్మడి వరంగల్లో రియల్ ఎస్టేట్పై ప్రభావంజిల్లా ప్రాజెక్టులువరంగల్ అర్బన్ 427 వరంగల్ రూరల్ 14 జనగామ 26 భూపాలపల్లి 12 మహబూబాబాద్ 29 -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
హన్మకొండ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్ పిలుపు మేరకు శుక్రవారం గ్రేటర్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలో పాల్గొన్నారు. వరంగల్ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారుల సంఘం డీజీఎస్ వై.ప్రవీణ్కుమార్, అవార్డు స్టాఫ్ డీజీఎస్ సీహెచ్.సంతోశ్కుమార్, ఓబీసీ డీజీఎస్ రజనీకాంత్, సేవా డీజీఎస్ రమణతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మె ఎఫెక్ట్ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బ్యాంకు శాఖల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, ఇతర లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఏటీఎంలు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర నగదు అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు శని, ఆది, సోమవారం వరుసగా సెలవులు రావడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రజలు మరికొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. -
టీజీ ఎన్పీడీసీఎల్లో 6,974 మెగావాట్ల గరిష్ట డిమాండ్
హన్మకొండ: విద్యుత్కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వర్షాకాలంలో వేసవిని మించిపోతోంది. ఎల్నినో ప్రభావంతో వాతావరణలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వర్షాలు కురువకపోవడంతో వాతావరణం చల్లబడలేదు. ఎండలు మండుతుండడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఉక్కపోతనుంచి ఉపశమనం కోసం విద్యుత్ ఉపకరణాలు వినియోగం కొనసాగుతోంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్ సైతం పెరిగింది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా ప్రతీరోజు పెరుగుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వానాకాలంలో ఈ నెల 9న వేసవినిమించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అంతకుముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్ అత్యధికం. దీన్ని బ్రేక్ చేస్తూ ఈ నెల 9న రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్నుఽ అధిగమించి ఇప్పుడు ఆల్టైం రికార్డు నమోదైంది. అదే విధంగా ఈ నెల 4న అత్యధికంగా 88.958 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 5వ తేదీన 83.292 మిలియన్ యూనిట్లు, 6న 84.792, 7న 84.441, 8న 88.708, 9న 88.548 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వినియోగించారు. గతేడాది వానాకాలంలో సెప్టెంబర్ 8న అత్యధికంగా 80.707 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించగా, ప్రస్తుత వానాకాలంలో ఈ నెల 4న అత్యధికంగా 88.958 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ముఖం చాటేసిన వర్షాలు ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. మోటార్లు వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. వరి పంటతో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో అన్ని పంటలు కలిపి ఈ వానాకాలంలో 64,26,574 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది యాసంగిలో 68,12,574 ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయ అవసరాలతో పాటు గృహ, వాణిజ్య, ఇతర విభాగాల్లోను వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. ఎల్నినో ప్రభావం, వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయంతోపాటు, ఇతర అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట డిమాండ్ నమోదైంది. వినియోగదారుల డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తాం. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. డిమాండ్ ఎంత పెరిగినా ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. – కర్నాటి వరుణ్ రెడ్డి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ రాష్ట్రంలో 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్ 4న విద్యుత్ వినియోగం 88.958 మిలియన్ యూనిట్లు -
నేడు ఫోన్ ఇన్
ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసులు, వివరణలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ నేడు (శుక్రవారం) జిల్లా డిప్యూటీ ఎన్నికల అధి కారి, అదనపు కలెక్టర్ ఎన్.రవితో ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలన్న దానిపై నేరుగా జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్.రవి, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా అదనపు కలెక్టర్ సమయం : నేడు (శుక్రవారం) ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబరు : 73373 24236 -
పట్టు సాగుతో లాభాలు
● ముల్కనూరు సొసైటీలో సదస్సు ● రైతులకు శాసీ్త్రయ పద్ధతులపై అవగాహనభీమదేవరపల్లి: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో పట్టు సాగు చేపడితే అధిక లాభాలు గడించవచ్చని వ్యవసాయ, పట్టుపరిశ్రమ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. ‘మేరా రేషం – మేరా అభిమాన్ 2.0’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టు మండలి, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ముల్కనూరు కో–ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఆవరణలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మైసూరు సీఎస్బీ–సీఎస్ఆర్టీఐ శాస్త్రవేత్త డాక్టర్ వజ్రమ్మ, హనుమకొండ జిల్లా సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ అనసూయ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రస్తుత వర్షాభావ, ఎల్నినో పరిస్థితుల్లో మల్బరీని శాసీ్త్రయంగా ఎలా సాగు చేయాలి? పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులకు సమగ్రంగా వివరించారు. మల్బరీ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రైతులను సన్మానించారు. సుమారు 100 మంది రైతులు, మహిళలు పాల్గొన్న ఈసదస్సులో ములుగు ఆర్ఎస్ఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుపంరెడ్డి, హనుమకొండ డీహెచ్ఎస్ఓ కమలాకర్రెడ్డి, ఆయిల్ఫెడ్ ప్రతినిధి శంకర్, మండల వ్యవసాయ అధికారి పద్మ, ఎంఆర్ఎంఏ జిల్లా నోడల్ అధికారి సంజీవరెడ్డి, వరంగల్ ఏడీ తిరుపతిరెడ్డి, సెరికల్చర్ అధికారి మల్లయ్య పాల్గొన్నారు. -
నిధులు ఖరారు..టెండర్లు తకరారు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు నగరానికి దశాబ్దాలుగా ఉన్న భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) కల సాకారమయ్యే సమయం ఎప్పుడొస్తుందా? అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంతో ఇక పనులు ప్రారంభమవుతాయని ఆశించిన ప్రజలకు మాత్రం ఇంకా నిరీక్షణే మిగిలింది. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా నిధులు.. డీపీఆర్.. అనుమతులు.. ఆర్థిక వనరుల సమీకరణ.. అన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదులుతున్నా.. టెండర్ల ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల వినతి మేరకు సీఎం రేవంత్రెడ్డి 2024 జూన్ 29న నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ సమీక్షలో నగరానికి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. ఆతర్వాత అదే ఏడాది నవంబర్లో డీపీఆర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ పరిధిలో సమగ్ర యూజీడీ వ్యవస్థ కోసం రూ.4,170 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఆరు నెలలైనా కదలని టెండర్ల ప్రక్రియ.. ప్రాజెక్టు రూపకల్పన, డీపీఆర్, భవిష్యత్ జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూజీడీ ప్రాజెక్టు పరిమాణం మరింత పెరిగింది. 2026 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257.20 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఇది కేవలం పాత డ్రెయినేజీ పైపులు మార్చే పనికాదు. భవిష్యత్ వరంగల్ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో మురుగునీటి సేకరణ, పైప్లైన్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్న భారీ ప్రాజెక్టు. 2026, మార్చి 10న వరంగల్ నగరాభివృద్ధిపై హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి, అప్పటి మంత్రి కొండా సురేఖలు ఎమ్మెల్యేలు, అధికారులతో యూజీడీపై చర్చించారు. రూ.5,257 కోట్లతో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఏఫ్రిల్లో చేపట్టాలని ఆదేశించారు. భూసేకరణకు ఉత్తర్వులు.. యూజీడీ కోసం ఇంకా టెండర్లు పిలవనప్పటికీ భూసేకరణకు విదివిధానాలను ఖరారు చేస్తూ ఆగస్టు 28న, బుధవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. భూసేకరణ, పునరావాస చట్టం – 2013 కింద సాధారణంగా చేపట్టాల్సిన సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఐఏ)) ప్రక్రియ నుంచి ఈ ప్రాజెక్టుకు ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇచ్చింది. బొల్లికుంట, ఉర్సు, ఖిలా వరంగల్, దేశాయిపేట, పైడిపల్లి, హసన్పర్తి, కాజీపేట ప్రాంతాల్లో భూసేకరణ చేయాలని కూడా సూచించింది. టెండర్ల విషయమై జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఒకరు మాట్లాడుతూ డీపీసీ ఆమోదం తర్వాత టెండర్ల ప్రక్రియ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్కు అప్పగించినట్లు చెప్పారు. ప్రజారోగ్యశాఖ అధికారులు మాత్రం టెండర్ల నిర్వహణకు కసరత్తు జరుగుతుందని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నిధుల మోడల్ ఇదీ..రూ.5,257.20 కోట్ల ప్రాజెక్టులో నిధుల సమీకరణ కూడా ప్రత్యేక విధానంలో జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోపాటు జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ నుంచి రుణం తీసుకునే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్ర పట్టణాభిృద్ధి శాఖ పరిధిలోని అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద వరంగల్ యూజీడీకి రూ.4,674.60 కోట్లకు ఆమోదం లభించినట్లు జూన్ 2026 నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రం చెరో 25 శాతం వాటాగా రూ.1,168.65 కోట్ల చొప్పున, మిగిలిన రూ.2,337.30 కోట్లను కేఎఫ్డబ్ల్యూ రుణంగా సమకూర్చే విధానం ప్రతిపాదించారు. మొత్తం 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్జోన్లుగా పనులు విభజించి టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గ్రేటర్ వరంగల్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ మురుగునీ టి పారుదలకు ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్థపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు, వర్షపు నీరు కలవడం.. రోడ్లపైకి నీరు చేరడం.. దోమల బెడద సాధారణమైంది. జీడబ్ల్యూఎంసీలో యూజీడీ పనులకు ఎదురుచూపులు నిధులు ప్రకటించినా టెండర్ల దశ దాటని కసరత్తు సీఎం రేవంత్రెడ్డి ప్రకటనకు రెండేళ్లు.. మంత్రి హామీకి ఏడాది రూ.4,170 కోట్ల నుంచి రూ.5,257.20 కోట్లకు ప్రాజెక్టు వ్యయం వర్షాలు పడితే తప్పని మురుగు ముంపు -
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి
ఐనవోలు: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత సంబంధ విషయాల్లో నైపుణ్యాలు పెంపొందించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ఒంటిమామిడిపల్లి, పున్నేలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమ అమలులో భాగంగా ఆయా పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఎంపీపీఎస్ పున్నేలు పాఠశాలలో ఇటీవల మంజూరైన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. పున్నేలు పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన జడ మానస, పత్రి రాజేందర్, ఇరుముండ్ల హర్షవర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ కిషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ ఆఫీసర్ మన్మోహన్, ఎంఈఓ పులి ఆనందం, సర్పంచ్ షేక్ ఉస్మాన్ అలీ, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు బాల్నె శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలిశెట్టి కమలాకర్, రాము, నిహారిక, కిరణ్, వేణుమాధవ్, రజిత, కాంప్లెక్స్ హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, వసంతకుమార్, సదానందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్: వినాయక చవితి, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సంబంధిత అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. నిమజ్జనానికి అనువైన చెరువులు, నీటి వనరులను ముందుగానే గుర్తించి అవసరమైన చోట నిమజ్జన పాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, మండపాల వద్ద విద్యుత్ వైరింగ్ను ముందుగానే తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమజ్జన సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావు, జీడబ్ల్యూఎంసీ, పట్టణ ప్రణాళిక, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ట్రాఫిక్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ: హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని శక్తి సదన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రయం పొందుతున్న బాలికలు, మహిళలతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శక్తి సదన్లో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ వంటి వృత్తి విద్యా కోర్సుల వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యాఽభ్యాసం పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఈఓ ఆశాదేవి, శక్తిసదన్ సూపరింటెండెంట్ శైలజ పాల్గొన్నారు. కాజీపేట బస్స్టేషన్ ప్రతిపాదిత స్థల పరిశీలన.. కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లోని శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. కాజీపేట ప్రధాన రహాదారి పక్కన ఉన్న హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగే బస్టాండ్ను ఆమె పరిశీలించారు. -
ఏఎస్ఓ విధుల నుంచి రాజేశ్వర్ రిలీవ్
విద్యారణ్యపురి: హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఐదేళ్లకుపైగా రీ డిప్లాయిమెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా (ఏఎస్ఓ) విధులు నిర్వర్తిస్తున్న మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పీవీ.రాజేశ్వర్ను ఈనెల 8న ఏఎస్ఓ విధుల నుంచి రిలీవ్ చేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం తెలిపారు. ఐదేళ్లకుపైగా.. ఏఎస్ఓగా సర్వీస్ పూర్తి కావడంతో రాజేశ్వర్కు గతంలోనే కేటాయించిన జనగామ జిల్లా డీఈఓ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు రాజేశ్వర్ జనగామ డీఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు సమాచారం. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికే.. డీఈఓ కార్యాలయంలో కీలక అసిస్టెంట్ స్టాటిస్టిక్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించేందుకు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా ఉండి కంప్యూటర్కు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం కలిగిన వారినే డిప్యుటేషన్పై తీసుకుంటామని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం తెలిపారు. అర్హులు హనుమకొండ కలెక్టర్ అనుమతితో డిప్యూటేషన్పై తీసుకుంటామని తెలిపారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని ఇండియా స్పార్క్ సంస్థ ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసి గురువారం సత్కరించింది. 2023వ సంవత్సరం నుంచి నిట్ వరంగల్ డైరెక్టర్గా, 30 ఏళ్ల నుంచి విద్యా పరిశోధన రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న నిట్ డైరెక్టర్ను ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సీఈఓ రూపా తంతి తెలిపారు. వరంగల్ అర్బన్: ‘పుర సేవ పక్కదోవ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని బల్దియా కమిషనర్ వెంకన్న సీరియస్గా తీసుకున్నారు. సిటిజన్ చార్టర్ ప్రకారం గడువులోగా పరిష్కారానికి నోచుకోని ఫైళ్లపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ ఎస్ఈ, టౌన్ స్లానింగ్ సీపీని ఆదేశించారు. పౌర సేవలపై నిర్లక్ష్యం వహిస్తే శా ఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా విభాగాల అధికారులు సిబ్బందికి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించాల్సిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ రాంనగర్లోని అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. జేఏసీ నాయకత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కుదుర్చుకున్న ఒప్పందంపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు రాంనగర్లోని జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిండి కుమారస్వామి, కోశాధికారి పుల్లూరు విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు నారాయణరావు, కార్యవర్గ సభ్యులు ఎన్.సమ్మయ్య, ఎం.వెంకట్రెడ్డి, కె.జగదీశ్వర్రెడ్డి, శ్రీరాములు, ఎ.సారయ్య, పెద్ది ఆంజనేయులు, తాటికొండ సుధాకర్, గట్టు ఉప్పలయ్య పాల్గొన్నారు. -
ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం
కాజీపేట అర్బన్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటితరానికి ఆదర్శమని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం న్యూశాయంపేట జంక్షన్లోని ఐలమ్మ విగ్రహానికి వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. ఐలమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఎన్.రవి, వైవీ గణేశ్, ఎల్.కిషోర్కుమార్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, లక్ష్మణ్, మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి -
సేవలకు సెలవు!
నర్సంపేట మున్సిపాలిటీలో నిలిచిన సర్టిఫికెట్ల జారీనర్సంపేట: మున్సిపల్ కమిషనర్కు సంబంధించిన డిజిటల్ కీ నిలిచిపోవడంతో పట్టణ ప్రజలకు అందాల్సిన సేవలు నిలిచిపోయాయి. దీంతో ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవలు నిలిచిపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్ డిప్యుటేషన్ గడువు ముగియడంతో 25 రోజులుగా డిజిటల్ కీ నిలిచిపోయింది. దీంతో ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సేవలకు సంబంధించి పనులు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వివిధ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన 175 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి కమిషనర్గా కొనసాగుతున్న కాటం భాస్కర్ డిప్యుటేషన్ కాలం ముగిసి నాలుగు నెలలు అవుతుంది. ఆయన కొనసాగింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. 2025 మే 8న పెద్దపల్లి జిల్లాలో మండల పంచాయతీ అధికారిగా పని చేసిన భాస్కర్ను నర్సంపేట కమిషనర్గా డిప్యుటేషన్పై నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఓ గ్రూప్–2 అధికారిని నియమించినప్పటికీ కమిషనర్గా జాయిన్ కాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇతర శాఖ అధికారులు, డిప్యుటేషన్పై ఉన్న కమిషనర్లను ప్రభుత్వం వెనక్కి పంపించింది. దీంతో పాటు రెగ్యులర్ కమిషనర్ను నియమించినప్పటికీ నర్సంపేటలో మాత్రం ఎంపీఓను డిప్యుటేషన్పై నర్సంపే ట మున్సిపల్ కమిషనర్గా కొనసాగిస్తూ వచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద పెండింగ్ మున్సిపల్ కమిషనర్గా డిప్యుటేషన్పై వచ్చిన భాస్కర్ గడువు మే నెలలోనే ముగిసింది. అప్పటినుంచి డిప్యుటేషన్ కొనసాగింపుపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫైల్ హైదరాబాద్లోని ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉండటంతో డిజిటల్ కీని తొలగించారు. తదుపరి కొనసాగింపు అనుమతులు వస్తేనే డిజిటల్ కీని మరో ఏడాదిపాటు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 25 రోజులు గడిచిపోవడంతో ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్, తదితర సేవలు జరగకపోవడంతో పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.నర్సంపేట మున్సిపల్ కమిషనర్గా డిప్యుటేషన్ కొనసాగింపుపై ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చే అవకాశంపై సందిగ్ధత నెలకొంది. 25 రోజులుగా కమిషనర్కు సంబంధించి డిజిటల్ కీ నిలిపేయడంతో ఉత్తర్వుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ జాప్యం జరుగుతోంది. తాజాగా మంగళవారం ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వుల కోసం కమిషనర్ హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత రాలేదు.ఉత్తర్వులు వచ్చేనా... మున్సిపల్ కమిషనర్ కొనసాగింపుపై సందిగ్ధం పెండింగ్లో 175 దరఖాస్తులు ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
● డీపీఓ లక్ష్మీ రమాకాంత్ ఆత్మకూరు: వీబీజీ రాంజీ పథకంలోని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ అన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా కాంపౌండ్, మ్యాజిక్ సోక్పిట్లపై ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడారు. గ్రామపంచాయతీల వారీగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో విధిగా రెండు ఫాంపాండ్లను నిర్మించాలని సూచించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, డీఎల్పీఓ రవిబాబు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సుబేదారిలోని రెడ్క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ ఎన్.రవి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాసరావు, బి. ప్రవీణ్కుమార్, శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు. బాధితుల పునరావాసానికి ప్రాధాన్యంమహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు బాధితులకు సత్వరన్యాయం, పరిహారం అందించడం, వారి పునరావాసానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఆమె మాట్లాడారు. డీడబ్ల్యూఓ ఎం.విశ్వజ, జిల్లా వైద్యాధికారి, అదనపు డీఆర్డీఓ, భరోసా సీఐ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మోడల్ సోలార్ గ్రామాల్లో సేవలు వేగవంతం ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపికై న ఆత్మకూరు, కేశవాపురంలో ప్రతి ఇంటికి సోలార్ ప్యానళ్లతో పాటు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్యనాయక్, రెడ్కో జిల్లా మేనేజర్ రాజేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. నిరంతర వైద్య సేవలందించాలి హసన్పర్తి: ప్రజలకు నిరంతరం వైద్యసేవలంఇంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హసన్పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం పెంబర్తి శివారు దత్తాత్రేయ కాలనీలో వాటర్ ట్యాంక్ పనులను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ కిరణ్కుమార్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ కృతిక, సూపర్వైజర్ లచ్చులు, కందుకూరి సంతోష్, కంటి వైద్య నిపుణులు ప్రసాద్, పెంబర్తి సర్పంచ్ కుమారస్వామి, ఆర్ఐ ఫాజిల్, ఈఈ గాయత్రి, రామాంజనేయులు, ఎంపీడీఓ సుమనవాణి ఉన్నారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేసేందుకు ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం గడువు
కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వరంగల్లో నిర్మిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో రూ.1,371 కోట్ల వ్యయంతో 2018 పడకల సామర్థ్యంతో పనులు కొనసాగుతున్నాయి. సుమారు 19.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 ఎకరాల 39 గుంటల వరకు క్యాంపస్ను తీర్చిదిద్దుతున్నారు. 35 ఆపరేషన్ థియేటర్లతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కోసం 186 వరకు నివాస క్వార్టర్లు నిర్మాణం చేయనున్నారు. అలాగే, అటెండెంట్ల కోసం కూడా 250 వరకు ధర్మశాల గదులు, 350 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం నిర్మాణం కోసం పనులు చేపడుతున్నారు. ప్రారంభ ప్రణాళికలో భాగంగా 34 వైద్య విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకురావడానికి డిజైన్ పూర్తి చేశారు. ఆస్పత్రి బయట కలరింగ్తో పాటు అత్యవసర విభాగం బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ విభాగాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎంఈ ఆధ్వర్యంలో 50 శాతం పనులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సి ఉంది. అక్టోబర్లో ఆస్పత్రి పనులు పూర్తిచేయాలని ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అలాగే, నవంబర్లో ఆస్పత్రి వైద్యసేవల తీరును పరీక్షించడానికి ట్రయల్ రన్ నిర్వహించాలని, డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డితో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎం ఆధ్వర్యంలో 50 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా నీటి వసతి, ఆక్సిజన్ ప్లాంటు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాన్సర్, ఎక్స్రేకు సంబంధించిన పరికరాలు అమర్చాలి ఉంది. ఈ క్రమంలో తాము చేపడుతున్న పనులను వేగిరం చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తరచూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ, ఎంజీఎం, కేఎంసీ అధికారులతో పాటు సంబంఽధిత శాఖల అధికారులతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకుంటున్నారు. పనుల వేగవంతానికి కమిటీ ఏర్పాటు.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రారంభించిన సనత్నగర్ హాస్పిటల్ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగిరం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డీఎంఈ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని రూపకల్పన చేసినట్లు సమాచారం. ఇందులో డీఎంఈతో పాటు రాష్ట్రస్థాయిలోని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ఆర్అండ్బీ అధికారులు, టీఎస్ఎంఎస్ఐఐసీ అధికారులు, ఎంజీఎం సూపరింటెండెంట్ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. వీరు సనత్నగర్ హాస్పిటల్ నిర్మాణం తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆధునికీకరించి, పనులు వేగవంతం చేయాల్సి ఉంది. ఆస్పత్రి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యే దిశగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా, ఈ కమిటీ ఆస్పత్రిని ఈ నెలలో సందర్శించే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కొనసాగుతున్న పనులు నవంబర్లో ట్రయల్ రన్.. డిసెంబర్లో ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు -
‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి
హన్మకొండ అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10న ఉద్యోగ జేఏసీ చేపట్టిన ‘చలో హైదరాబాద్–మహా ధర్నా’ను విజయవంతం చేయాలని టీజీఓ హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీలు పిలుపునిచ్చాయి. హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ డీఏలను విడుదల చేసి, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఓటర్ల జాబితా ప్రదర్శన, సెప్టెంబర్ 15న చేర్పులు, సవరణలకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9 చివరి గడువు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులు తెలంగాణ ఐసెట్ లోగాని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఉండాలన్నారు. పీజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూఆన్లైన్.ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. విద్యారణ్యపురి: ఇన్సర్వీస్ టీచర్ల టెట్ హనుమకొండలోని నాలుగు కేంద్రాల్లో మంగళవారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో 2,137 మందికి 1,961 హాజరయ్యారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు నిర్వహించారు. ఈనెల 10న ఒక కేంద్రంలో జరిగే పరీక్షతో టెట్ ముగియనుందని డీఈఓ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇన్సర్వీస్ టీచర్లు టెట్ రాస్తున్నారని తెలిపారు. వడ్డేపల్లి ప్రాంతంలోని అయాన్ డిజిట్ జోన్ సెంటర్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ నిబంధనలు పాటించాల్సిందే.. సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తర్వాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. ● ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
అధికారుల సమీక్షలో అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్..రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌరసరఫరాలు, డీఆర్డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు–కొలతల శాఖల అధికారులు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ కొలిచే పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీఆర్డీఓ శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, తూనికలు–కొలతల శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
ధిక్కార స్వరం ‘కాళోజీ’బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ నిబంధనలు పాటించాల్సిందే.. సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తర్వాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. ● ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులుతన భావాలకే కాదు శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా. ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతి -
అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి
కాళోజీ సెంటర్: అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదని, మన జీవితాన్ని మనమే నిర్ణయించుకునే శక్తిని, సమాజంలో గౌరవంగా జీవించే అవకాశాన్ని అందించే గొప్ప సాధనమని జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఓదెల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత లేని జీవితం చీకటితో సమానమైతే, అక్షరాస్యత ఉన్న జీవితం వెలుగుతో సమానమన్నారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా అక్షరాస్యత, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్రెడ్డి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం, టాస్–ఉల్లాస్ జిల్లా ఇన్చార్జ్ సీహెచ్.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు పిన్నింటి బాలాజీరావును మంగళవారం డీఈఓ రంగయ్యనాయుడు, అధికారులు, సిబ్బంది అభినందించా రు. భవిష్యత్తులోనూ విద్యారంగానికి మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డీఈఓ బి.రంగయ్యనాయుడు సూచించారు. సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్–2026లో భాగంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు మంగళవారం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 బృందాలు పాల్గొని వైవిధ్యభరితమైన నాటకాలను ప్రదర్శించాయి. ముగింపు కార్యక్రమంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి పి.సురేష్ బాబు, రెహమాన్, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు -
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
● డీఈఓ గిరిరాజ్ గౌడ్ ఆత్మకూరు: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్, గొల్లవాడ ప్రాథమిక పాఠశాల, తిరుమలగిరిలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు విద్యార్థుల విద్యాప్రగతి, బోధనా విధానం అమలు వివరాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాజరు రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. అలాగే, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం డీఈఓ గిరిరాజ్గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పాఠశాల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం నిర్మలకుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పెండెం రాజు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలను పరిరక్షించాలి
● ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ దామెర: శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శంక్వర్ ఆదేశించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్స్టేషన్ పరిసర ప్రాంతాలు, పలు రికార్డులు పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణపై ఎస్హెచ్ఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పరకాల ఏసీపీ సతీశ్బాబు, పరకాల రూరల్ సీఐ వై.సుధాకర్రెడ్డి, ఎస్సై ఇమ్మడి వీరభద్రరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
డెడ్లైన్ అక్టోబర్
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేసేందుకు ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం గడువుకాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వరంగల్లో నిర్మిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో రూ.1,371 కోట్ల వ్యయంతో 2018 పడకల సామర్థ్యంతో పనులు కొనసాగుతున్నాయి. సుమారు 19.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 ఎకరాల 39 గుంటల వరకు క్యాంపస్ను తీర్చిదిద్దుతున్నారు. 35 ఆపరేషన్ థియేటర్లతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కోసం 186 వరకు నివాస క్వార్టర్లు నిర్మాణం చేయనున్నారు. అలాగే, అటెండెంట్ల కోసం కూడా 250 వరకు ధర్మశాల గదులు, 350 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం నిర్మాణం కోసం పనులు చేపడుతున్నారు. ప్రారంభ ప్రణాళికలో భాగంగా 34 వైద్య విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకురావడానికి డిజైన్ పూర్తి చేశారు. ఆస్పత్రి బయట కలరింగ్తో పాటు అత్యవసర విభాగం బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ విభాగాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎంఈ ఆధ్వర్యంలో 50 శాతం పనులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సి ఉంది. అక్టోబర్లో ఆస్పత్రి పనులు పూర్తిచేయాలని ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అలాగే, నవంబర్లో ఆస్పత్రి వైద్యసేవల తీరును పరీక్షించడానికి ట్రయల్ రన్ నిర్వహించాలని, డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డితో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎం ఆధ్వర్యంలో 50 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా నీటి వసతి, ఆక్సిజన్ ప్లాంటు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాన్సర్, ఎక్స్రేకు సంబంధించిన పరికరాలు అమర్చాలి ఉంది. ఈ క్రమంలో తాము చేపడుతున్న పనులను వేగిరం చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తరచూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ, ఎంజీఎం, కేఎంసీ అధికారులతో పాటు సంబంఽధిత శాఖల అధికారులతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకుంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కొనసాగుతున్న పనులు నవంబర్లో ట్రయల్ రన్.. డిసెంబర్లో ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు -
జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు..
హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04 కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్ఎస్కు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేరు, పెనుగొండ జెడ్పీహెచ్ఎస్లున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు -
మన అంగన్వాడీ, మన బాధ్యత
నాణ్యమైన యూనిఫాం తయారు చేయాలిగీసుకొండ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పొదుపు సంఘాల మహిళలు యూనిఫాంలు డబుల్ స్టిచ్తో నాణ్యతగా ఉండాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. మంగళవారం బొడ్డుచింతలపెల్లి పాఠశాలలో స్కూల్ యూనిఫాం తయారీని పరిశీలించారు. సకాలంలో దుస్తులను అందించే విధంగా పనుల్లో వేగం పెంచాలన్నారు. ఏఈఎం ఈశ్వర్, సీసీ సురేశ్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, ఏపీఓ చంద్రకాంత్, టీఏ సింగ్, వీవోఏలు సునీత, ప్రకాశ్, ఎఫ్ఏ లత, సుమలత, సోని, వసంత, సరిత, స్రవంతి, సుజిత పాల్గొన్నారు. రేపటితో ముగియనున్న గడువుఖిలా వరంగల్: సన్న రకాల వరి సాగు చేసిన రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు రేపటితో (గురువారం) గడువు ముగియనుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు సన్న రకాల వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందించనుంది. ఈ మేరకు రైతులు సన్న రకాల సాగు వివరాలతో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కు అందించాలన్నారు. ఏఈఓలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. మూడు జిల్లాల మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మత్స్యకారులు, మత్స్య రైతులు హాజరయ్యారు. తొలిరోజు బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఆతర్వాత పలు అంశాలపై పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్తో పాటు శాస్త్రవేత్తలు రవీందర్, దివ్య సూచనలు చేశారు. కాళోజీ సెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘పోషణ మాసం 2026’ కార్యక్రమం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. నెలరోజుల పాటు ‘మన అంగనన్వాడీ – మన బాధ్యత’ అనే నినాదంతో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బా లింతలు, చిన్నారుల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని అరికట్టడం, ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం పోషణ మాసం ప్రధాన లక్ష్యం. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, పురపాలక, పాఠశాల విద్య, సెర్ఫ్, మెప్మా, క్రీడలు– యువజన సర్వీసుల శాఖలతో పాటు వివిధ భాగస్వామ్య సంస్థల సమన్వయంతో నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి తెలిపారు. నెలరోజుల పాటు విస్తృత కార్యక్రమాలు పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వారణాసి నుంచి నిర్వహించే కేంద్రస్థాయి కార్యక్రమం వెబ్కాస్ట్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో వీక్షించనున్నారు. అలాగే నెలరోజుల పాటు పోషణ మేళాలు, వంటకాల ప్రదర్శనలు, గృహ సందర్శనలు, సంరక్షకుల భాగస్వామ్యంతో పోషణ సమావేశాలు నిర్వహించనున్నారు. అంగన్వాడీ నిర్వహణ కమిటీల (ఏఎంసీ) బలోపేతం, పోషణ చాంపియన్ల సత్కారం, ఈసీసీఈ దినోత్సవం, ప్రధాన మంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆహార వైవిధ్యం, ప్రోటీన్ యుక్త పోషణ అంగన్వాడీ కేంద్రాల్లో తాజా, వేడి భోజనం సామాజిక భాగస్వామ్యం ప్రారంభ బాల్య వ్యవస్థ సంరక్షణ, విద్య, వికాసం ప్రీఎంఎంవీవై సురక్షిత మాతృత్వంప్రధాన థీమ్లు ఇవేనేటి నుంచి పోషణ మాసం నెలరోజుల పాటు విస్తృత కార్యక్రమాలు జిల్లా సంక్షేమాధికారి రాజమణి జిల్ల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలువిజయవంతం చేయాలినెల రోజుల పాటు నిర్వహించే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలి. తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు తమవంతు సహకారం అందించాలి. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలి. – రాజమణి, జిల్లా సంక్షేమాధికారి -
డిజిటల్ క్రాప్ సర్వేతో పారదర్శకత
సంగెం: డిజిటల్ క్రాప్ సర్వేతో రైతులు సాగు చేస్తున్న పంటల సాగు విస్తీర్ణం, పంటల రకాలను పారదర్శకంగా నమోదు అవుతాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్లో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియో ట్యాగింగ్తో రైతులు ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో ఖచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేసి వ్యవసాయంపై అవగాహనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సర్వే వలంటీర్లుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి బస్వపత్రి జగదీశ్వర్, ఉద్యానవన శాఖ అధికారి మానస, ఏఈఓ కార్తీక్, రాజేందర్, సర్వేయర్ రాజేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్రావు -
జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు..
హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04 కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్ఎస్కు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేరు, పెనుగొండ జెడ్పీహెచ్ఎస్లున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు -
యూత్ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (టీపీవైసీ)లో సంస్థాగత మార్పులు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు కొత్త ఇన్చార్జులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ జిల్లాకు ముచల సాయి మనోజ్కుమార్ యాదవ్ను సెక్రటరీ ఇన్చార్జ్గా, హనుమకొండ జిల్లాకు పాడాల రాహుల్ను జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ గా నియమించారు. ఈ రెండు జిల్లాల వ్యవహారాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ రూపవత్ పర్యవేక్షించనున్నారు. జనగామ జిల్లాకు జనరల్ సెక్రటరీగా చంద్రిక దుబ్బక, మహబూబాబాద్ జిల్లాకు జనరల్ సెక్రటరీగా అలువాల కార్తీక్, సెక్రటరీగా అశ్విన్ ఏకేలను నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిపాల్ ఒరుగంటి, ములుగు జిల్లాకు బండిగ రాకేష్కు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సమన్వయం.. కొత్తగా నియమితులైన ఇన్చార్జులు తమ పరిధిలోని జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు నియామక ఉత్తర్వులో సూచించారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో యూత్ కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కొత్త బాధ్యులు దృష్టి సారించనున్నారు. ఉమ్మడి వరంగల్లో ఏడుగురు రాష్ట్ర నేతలకు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి -
ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శం
● కుడా చైర్పర్సన్ గుండు సుధారాణికాజీపేట అర్బన్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటితరానికి ఆదర్శమని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి తెలిపారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం న్యూశాయంపేట జంక్షన్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధి కారత, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ఎన్.రవి, వైవీ గణేష్, ఎల్.కిశోర్కుమార్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, లక్ష్మ ణ్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఈవీ బస్డిపో!
వరంగల్మామునూరుకువిద్యుత్ ఆల్టైం రికార్డు వర్షాకాలంలోనూ ఎండలు మండుతుండడంతో రోజురోజుకూ విద్యుత్కు డిమాండ్ పెరుగుతోంది. శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● చార్జింగ్ పాయింట్లు, మౌలిక వసతులు, వందల మందికి ఉపాధి ● కలెక్టర్ సత్యశారద త్వరగా నిర్ణయం తీసుకుంటేనే మేలుసాక్షి, వరంగల్: వరంగల్ సమీపంలోని మామునూరులో ఎలక్ట్రిక్ బస్ డిపో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పశుసంవర్థక శాఖకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని డిపో కోసం వినియోగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. భూముల బదలాయింపుపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిర్ణయం తీసుకుంటే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవ చూపెడితే ఈ ప్రాజెక్టు త్వరితగతిన పట్టాలెక్కనుంది. డిపో, విద్యుత్ మౌలిక వసతులకు నిధులు.. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్ 28న పీఎం ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్ఎం) పథకాన్ని ప్రారంభించింది. దేశంలో 38,000కుపైగా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఈ పథకం కోసం రూ.3,435.33 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బస్సులను నడిపే ఆపరేటర్లు, తయారీదారులకు ప్రజారవాణా సంస్థల నుంచి రావాల్సిన చెల్లింపులకు భద్రత కల్పించడంతో పాటు డిపో, విద్యుత్ మౌలిక వసతులకు సంబంధించి ఈ పథకం నుంచి ప్రత్యేక నిధులు చెల్లించనున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో ఆపరేటర్లు నిర్వహిస్తారు. రవాణా సంస్థ నెలవారీగా వారికి చెల్లించాలి. ఒకవేళ ప్రజారవాణా సంస్థ నుంచి చెల్లింపులు ఆలస్యమైతే, పీఎస్ఎం ఫండ్ ద్వారా తాత్కాలికంగా చెల్లిస్తారు. ఇందుకోసం కన్వర్జెన్సీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) అమలు సంస్థగా వ్యవహరిస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని సంబంధిత రాష్ట్రం లేదా రవాణా సంస్థ నుంచి తిరిగి రాబడతారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ రవాణా సంస్థలతో ఈ–బస్ సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు, బస్సుల తయారీ సంస్థలకు చెల్లింపులపై నమ్మకం పెరుగుతుంది. ఒక్కో బస్సుకు పీఎస్ఎం కింద 12 సంవత్సరాల వరకు చెల్లింపు భద్రత కల్పించే నిబంధన ఉంది. పెరగనున్న ఉపాధి అవకాశాలు.. డిపో ఏర్పాటుతో డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, చార్జింగ్ స్టేషన్న్ల నిర్వహణ, భద్రత, పారిశుద్ధ్యం, పరిపాలన, నిర్వహణ తదితర విభాగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మామునూరుకు రవాణా సౌకర్యం, వరంగల్కు పర్యావరణహిత ప్రజా రవాణా, యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. విమానాశ్రయం, శివారు ప్రాంతాలకు లాభం మామునూరు డిపోకు మరో ప్రత్యేకత విమానాశ్రయం, నగరానికి సమీపంలో ఉండడం కలిసిరానుంది. భవిష్యత్లో విమానాశ్రయం నుంచి వరంగల్ నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ–బస్ సర్వీసులు నడిపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మామునూరు, వర్ధన్నపేట పరిసరాలు, నగర శివారు ప్రాంతాల ప్రజలకు వరంగల్ నగరానికి చేరుకునే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పీఎం ఈ–బస్ సేవా పథకం కింద వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్కు 50 బస్సులు అర్హత కల్పించారు. 2025లో కేంద్రం ఇచ్చిన సమాచారంలో వరంగల్ ఈ పథకంలో పాల్గొనలేదని పేర్కొంది. తాజా కేంద్ర వివరాల్లో కూడా వరంగల్కు 100 బస్సుల కేటాయింపు ఉండడంతో మామునూరులో ప్రతిపాదిస్తున్న డిపోకు ప్రాధాన్యం పెరుగుతోంది. అవసరమైన భూమి, విద్యుత్ కనెక్షన్, చార్జింగ్ వ్యవస్థ, పార్కింగ్, వర్క్షాపు, సిబ్బంది, సౌకర్యాలు సిద్ధమైతే ఈ–బస్సుల నిర్వహణకు అనువైన కేంద్రంగా మామునూరు మారే అవకాశం ఉంది. -
పాఠశాలల్లో ‘స్వచ్ఛత పఖ్వాడా’
● ఈనెల 15 వరకు పలు కార్యక్రమాలు కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఈనెల 1 నుంచి 15 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాలోని 13 మండలాలలో పరిధిలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు 532 ఉన్నాయి. వీటిలో 32,542 మంది విద్యార్థులు చదువుతున్నారు. కార్యాచరణ ఇలా.. ● అవగాహన, పారిశుద్ధ్య పనులు ఈ నెల 1 నుంచి 4 వరకు నిర్వహించారు. తొలిరోజు స్వచ్ఛత ప్రతిజ్ఞతో డ్రైవ్ ప్రారంభమైంది. నీటి సంరక్షణపై ‘గ్రీన్ స్కూల్ డ్రైవ్’, ఎస్ఎంసీ/పీటీఏం సమావేశాల ద్వారా తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాలలను శుభ్రం చేశారు. ● బాహ్య ప్రచారం, హ్యాండ్ వాష్ కార్యక్రమాలు ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై చైతన్యం కల్పించారు. కమ్యూనిటీ అవుట్రీచ్, సబ్బుతో చేతులు కడుక్కోవడం, దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్ల వసతి పునరుద్ధరించారు. ● పోటీలు, ప్రదర్శనలను ఈనెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, మోడల్ మేకింగ్ వంటి స్వచ్ఛతా పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు రీసైకిల్ చేసిన వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ● కార్యాచరణ, బహుమతుల ప్రదానం కార్యక్రమాలు ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. బాలసభలు, స్కూల్ క్యాబినెట్ సమావేశాల ద్వారా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. చివరి రోజున ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేసి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జియోట్యాగింగ్ ఫొటోలు తప్పనిసరి పాఠశాలల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని జియోట్యాగింగ్ ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. రోజువారీ ఫొటోలను సంబంధిత మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు పంపించాలి. అత్యుత్తమ ఫొటోలను పాఠశాల పేరుతో 80081 08365 నంబర్కు వాట్సాప్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజు చేసే కార్యక్రమం కాదు. అది ప్రతీ ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలి. అందరి భాగస్వామ్యంతో జిల్లాను స్వచ్ఛ, హరిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ -
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి
న్యూశాయంపేట: పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను పర్తిప్రతిష్ఠించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు, హానికరమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో నీరు కలుషితం అవుతుందని తెలిపారు. మట్టి విగ్రహాలను వినియోగిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, డీడబ్ల్యూఓ రాజమణి, అధికారులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభ్యాసానికి మధ్యలో దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించాలని సూచించారు. అడ్మిషన్లకు ఈనెల 15 వరకు గడువుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ రమేష్రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, ఉల్లాస్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. హియరింగ్ ప్రక్రియ పరిశీలన.. వరంగల్ చౌరస్తా: ఎస్ఐఆర్లో భాగంగా వరంగల్ ఏనుమాముల పరిధిలోని బాలాజీనగర్లో నిర్వహించిన హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యంతరాలు, దావాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం, సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నిధుల మోడల్ ఇదీ..
రూ.5,257.20 కోట్ల ప్రాజెక్టులో నిధుల సమీకరణ కూడా ప్రత్యేక విధానంలో జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోపాటు జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూ నుంచి రుణం తీసుకునే ప్రతిపాదన ముందుకు వచ్చింది. కేంద్ర పట్టణాభిృద్ధి శాఖ పరిధిలోని అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద వరంగల్ యూజీడీకి రూ.4,674.60 కోట్లకు ఆమోదం లభించినట్లు జూన్ 2026 నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రం చెరో 25 శాతం వాటాగా రూ.1,168.65 కోట్ల చొప్పున, మిగిలిన రూ.2,337.30 కోట్లను కేఎఫ్డబ్ల్యూ రుణంగా సమకూర్చే విధానం ప్రతిపాదించారు. మొత్తం 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్జోన్లుగా పనులను విభజించి టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గ్రేటర్ వరంగల్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ మురుగునీటి పారుదలకు ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్థపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు, వర్షపు నీరు కలవడం.. రోడ్లపైకి నీరు చేరడం.. కాలనీల్లో దుర్వాసన, దోమల బెడద పెరగడం సాధారణమైంది. -
నత్తనడకన ఇన్స్పైర్..
విద్యారణ్యపురి : అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, యూపీఎస్లు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి వారిని భావి శాఽస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ‘ఇన్స్పైర్ మనాక్’ అవార్డులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థులనుంచి నామినేషన్లు ఆహ్వానించే ప్రక్రియ ఈ ఏడాది జూలై 15 నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 15వరకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల లక్ష్యం చేరుకోలేదు. ఐదు జిల్లాల్లో నామినేషన్ల సమర్పణ నత్తనడకనే కొనసాగుతోంది. అర్హులు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇన్స్పైర్ మనాక్ పురస్కారాలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. ఒక్కో పాఠశాలనుంచి ఐదు ప్రాజెక్టుల వరకు పంపొచ్చు. అందుకు ఉపాధ్యాయులు నామినేషన్లను సంబంధిత వెబ్సైట్లో హెచ్టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్లో సమర్పించాల్సింటుంది (నమోదు చేయాల్సింటుంది) ఎంపికై తే రూ.10వేల చొప్పున అందజేత నామినేషన్ ఇన్స్పైర్కు ఎంపికై తే దానిని పంపిన విద్యార్థికి రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లాస్థాయిలో ఆతర్వాత ఎంపికై న వారికి రాష్ట్రస్థాయిలో, అందులో ఎంపికై తే జాతీయస్థాయి వరకూ విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. అలాంటి ఇన్స్పైర్కు విద్యార్థులను ప్రోత్సహించి నామినేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్సైన్స్ అధికారులు కూడా తమ జిల్లాలో ఇన్స్పైర్పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అయినా నామినేషన్ల నమోదు ప్రక్రియ ఇంకా నత్తనడకనే సాగుతోంది. టాప్ మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్స్పైర్ మనాక్ పురస్కారాలకు విద్యార్థులనుంచి నామినేషన్లను నమోదు చేసుకున్న సంఖ్యను ఈనెల 8వ తేదీవరకు పరిశీలిస్తే ఆరు జిల్లాలు కూడా టార్గెట్ను చేరుకోలేదు. కానీ మహబూబాబాద్ జిల్లా మాత్రం 1,044 నామినేషన్తో రాష్ట్రంలోనే టాప్గానే నిలిచింది. ఈ జిల్లాకు టార్గెట్ మాత్రం 1,165 చేయాల్సింది. మిగతా ఐదు జిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి మాత్రం లక్ష్యానికి బహుదూరంగానే ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లాల ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తూ నామినేషన్ల నమోదుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా సైన్స్ అధికారులు కోరుతున్నారు. గత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాకు 433 అవార్డులుగత విద్యాసంవత్సరంలో 2025–2026లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 433 ఇన్స్పైర్ అవార్డులు లభించాయి. ఆయా విద్యార్థులకు రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఆయా విద్యార్ధులకు ఈఏడాది నవంబర్–డిసెంబర్లో ప్రతీజిల్లాలోనూ జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 2026–2027లో ఎన్ని లభిస్తాయో వేచి చూడాల్సిందే. టార్గెట్కు దూరంగా ప్రాజెక్టుల నామినేషన్లు ప్రస్తుతం ఒక్క మహబూబాబాద్ జిల్లానే టాప్ మిగతా ఐదు జిల్లాలు లక్ష్యం చేరేనా ? ఈ నెల 15వ తేదీ వరకే గడువు జిల్లాల వారీగా స్కూళ్లు ఇన్స్పైర్ నామినేషన్ల టార్గెట్, ఇప్పటివరకు వచ్చినవి ఇలా.. జిల్లా స్కూళ్లు టార్గెట్ వచ్చినవి హనుమకొండ 395 1,975 223 వరంగల్ 344 1,720 212 జనగామ 195 975 187 ములుగు 112 560 48 జేఎస్ భూపాలపల్లి 131 655 83 మహబూబాబాద్ 233 1,165 1,044 -
ప్రజాకవి కాళోజీకి ఘననివాళి
న్యూశాయంపేట: ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం తన రచనల ద్వారా పోరాటంం సాగించిన గొప్ప కవి కాళోజీ అని కొనియాడారు. తన రచనల ద్వారా మహనీయుడిగా కాళోజీ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలుగు కవిత్వం ఉన్నంత వరకు కాళోజీ ప్రజల గుండెల్లో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీపీఆర్ఓ ప్రేమలత, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. గొప్ప దార్శనికుడు కాళోజీ కాళోజీ సెంటర్ : కాళోజీ గొప్ప దార్శనికుడని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం ఇంటర్ విద్య కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ.. కాళోజీ బహుభాషావేత్త అని చిన్నతనం నుంచే తెలుగు చదివినప్పటికీ, మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో కవితలు రాసారన్నారు. కాళోజీ నారాయణరావు రచనలు సమాజా నికి ప్రేరణ అన్నారు. పుట్టుక నీది చావునీది బతుకంతా దేశానిది అనే మాట ఆయన దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు భుజేందర్ రెడ్డి, సాజిత్, జనార్ధన్, కొమురారెడ్డి, కార్యాలయ సిబ్బంది శేఖర్, సందీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, సొసైటీ అధ్యక్షురాలు సత్యశారద అన్నారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల పర్యవేక్షకుడిగా అదనపు కలెక్టర్ వై.వీ.గణేశ్ను, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి నీరజను నియమించినట్లు తెలిపారు. ఈసందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. జాబితాను కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, చేర్పులు, సవరణలకు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోరారు. ఈనెల 14 వరకు జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పర్యాటకాభివృద్ధికి మూడేళ్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం పర్యాటక అభివృద్ధి, జ్ఞాన భారతం మిషన్పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ పాలక మండలి సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్, డీసీఓ నీరజ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భార్గవ్, ఉపాధి కల్పనాధికారి సాత్విక, ఏడీ ఆర్కియాలజీ గంగా పాల్గొన్నారు. -
అర్హులకు సకాలంలో రుణాలందించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ విష్ణుప్రియ, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ మేన శ్రీను, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్, ఆర్బీఐ రీజినల్ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యశ్వంత్సాయి, యూబీఐ రీజినల్ హెడ్ కమలాకర్, ఆర్సెటీ డైరెక్టర్ రవి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోషకాహార లోప నివారణకు కృషి పోషకాహార లోపం, రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న పోషణ మాసం ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విశ్వజ, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఈఓ గిరిరాజ్గౌడ్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, డీవైఎస్ఓ ప్రశాంత్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులున్నారు. -
కాళోజీ స్ఫూర్తితో ప్రశ్నించాలి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో అన్యాయాన్ని ప్రశ్నించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు, కవులు, రచయితలు కళాకారులు, ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ కాళోజీ కవిత్వం, రచనలు ప్రజలు తమపై జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రశ్నించే ధైర్యాన్ని కల్పించాయన్నారు. నేటితరం కాళోజీ రచనలను చదివి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాళోజీ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం అందించే స్మారక పురస్కారం ఆయన సాహిత్య, సామాజిక సేవలకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. సభా గౌరవాన్ని మంటగలపొద్దు శాసనసభలో స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అనుచిత, అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనని ఎంపీ కావ్య అన్నారు. స్పీకర్ ఏ కులం, ఏ మతానికి చెందిన వ్యక్తి అన్నది కాకుండా.. ఆ కుర్చీని, రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. మహిళా పోలీసుల సమక్షంలో కేటీఆర్, హరీశ్రావు చొక్కాలు విప్పడం, ఆందోళన సమయంలో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ ఘటనపై తాను జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీజీపీ, పోలీస్ కమిషనర్, తెలంగాణ శాసనసభ సెక్రటేరియట్, సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఘటనను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కాళోజీ విగ్రహానికి నివాళి -
180 పెండింగ్ దరఖాస్తులు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్కు సంబంధించిన డిజిటల్ కీ నిలిచిపోవడంతో 25 రోజులుగా ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్ తదితర సేవలకు సంబంధించి 180వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాలిటీలో సిటిజన్ చార్టు ఉన్నప్పటికీ పనులు జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ హైదరాబాద్లోని సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి డిజిటల్ కీ విడుదల చేయాలని మంగళవారం అధికారులకు వినతిపత్రం అందించారు. సిటిజన్ చార్ట్ ప్రకారం సర్టిఫికెట్ల జారీ వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పలు రకాల సర్టిఫికెట్లు నిబంధనలకు అనుగుణంగా జారీ చేస్తున్నారు. అయితే కార్యాలయంలో సిటిజన్ చార్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు చివర వరకు బర్త్ సర్టిఫికెట్లకు 176 దరఖాస్తులు రాగా 162 జారీ చేశారు. 14 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లకు 37 దరఖాస్తుల్లో 35 జారీ చేశారు. జారీ కానివి పరిశీలనలో ఉన్నాయి. నిర్ణీత తేదీలోగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సిటిజన్ చార్ట్ లేకపోవడంతో పట్టణ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదే విధంగా భవన నిర్మాణ అనుమతులకు 6 దరఖాస్తులు రాగా.. 4 అనుమతులిచ్చారు. ట్రేడ్ లైసెన్సులు మొత్తం 352 ఉన్నాయి. ఇందులో 62 గత ఏప్రిల్ నుంచి దరఖాస్తులు రాగా ఇందులో ప్రస్తుతం 8 పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నవాటిలో పెట్రోల్ బంక్, రెస్టారెంట్లు, టీ స్టాల్, డీసీ తండాలో చిన్న కిరాణ షాపులవి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ పరిధిలోని డీసీ తండా శివారు మొత్తం 7 తండాల్లో భవన నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే తండా వాసులు భవన నిర్మాణాలు చేసుకుంటున్నారని అధికారులు చెపుతున్నారు. తమకు మున్సిపాలిటీతో సంబంధం లేదని గ్రామ పంచాయతీ అనే డిమాండ్ ఉండడంతో అధికారులు సైతం తండా వాసులపై ఒత్తిడి తేలేకపోతున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో నిలిచిన సేవలు సిటిజన్ చార్ట్ ఉన్నా.. జరగని పనులు -
న్యాయం చేయాలని ఫిర్యాదు
సంగెం: అధికారుల తప్పిదం తనకు శాపంగా మారిందని, తన పేరుపై వచ్చిన ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇతరులకు ఇప్పించారని ఓ బాధితురాలు.. ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోత్ హుస్సేన్ నాయక్కు బుధవారం ఫిర్యాదు చేసింది. బానోతు భద్రు భార్య విజయ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిక్కోజినాయక్ తండాకు చెందిన బానోత్ విజయ భర్త భద్రు, బానోత్ విజయ భర్త ఈర్యా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే విజయ, ఈర్యా దంపతులకు ఇళ్లు మంజూరైందని చెప్పి భద్రు భార్య విజయ అకౌంట్లో జమ అయిన ఇంటి బిల్లును సర్పంచ్ లక్ష్మణ్, ఇందిరమ్మ కమిటీ బాధ్యులు వారికి ఇప్పించారు. తనకు మంజూరైన బిల్లు ఇతరులకు ఇవ్వడం వల్ల భవిష్యత్లో ప్రభుత్వం నుంచి మళ్లీ ఇళ్లు మంజూరు కాదని తెలుసుకున్న భద్రు భార్య విజయ ఎంపీడీఓ, కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరింది. ఈ విషయంపై హుస్సేన్యక్కు కూడా వినతిపత్రం ఇవ్వడంతో విచారణ చేసి విజయకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
మధ్యాహ్నం 12 దాటినా తెరుచుకోని కార్యాలయం
నర్సంపేట: కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడంలేదు. మధ్యాహ్నం 12గంటలైనా కార్యాలయం తెరువని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం నుంచే వివిధ పనుల నిమిత్తం వచ్చిన కార్మికులు గంటల తరబడి నిరీక్షించి నిరాశతో వెను తిరగాల్సిన పరిస్థితి నర్సంపేట కార్మిక శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు తమ లేబర్ కార్డులు, పెన్షన్, ప్రమాదబీమా, ఇతర సంక్షేమ పథకాలపై అవసరంపై పనుల కోసం ప్రతీ రోజు పట్టణంలోని కార్యాలయానికి వస్తుంటారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే కార్యాలయం తెరవాలి. కానీ బుధవారం 11.55నిమిషాల వరకు కూడా అధికారులు, ఇతర సిబ్బంది రాలేదు. దీంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుమతికి రెండు సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. ఆఫీస్ సబార్టినేట్ మధుకు ఫోన్ చేయగా ఆఫీస్ మార్పిడి కోసం కలెక్టర్ ఆఫీస్కు వెళ్లామని, అందుకే ఆలస్యం అయిందని, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెలవులో ఉన్నట్లు సమాధానమిచ్చారు. కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఇబ్బందుల్లో కార్మికులు -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలి
గీసుగొండ : రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమా న్య సంస్థ (ఆత్మ) ద్వారా బుధవారం మండలంలో ని అనంతారం గ్రామంలో రైతుల పూర్వ అనుభవ గుర్తింపు ఆధారిత (ఆర్పీఎల్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ తాటికాయల సతీష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులతో తయారు చేసుకునే జీవామృతం, ఘనజీవామృతం, వివిధ కషాయాలను వినియోగించడం ద్వారా సాగు ఖ ర్చులను తగ్గించుకోవచ్చన్నారు. దీంతో నేల సారా న్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేలలో జీవ వైవిధ్యం పెంపొందడంతోపాటు భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా నాణ్యమై న, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందవచ్చన్నారు. పత్తిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మ (ఆర్పీఎల్) రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం కోసం ఎంపిక చేసిన 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను వర్ధన్నపేట సహాయ వ్యవసాయ సంచాలకుడు నర్సింగం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఇఫ్కో ఏరియా మేనేజర్ విశాల్ నానో యూరియా, డీఏపీ వినియోగంపై వివరించగా, ఎఫ్పీసీఎల్ ప్రతినిధి ప్రజ్వల్, మే నేజర్ అయేషా ప్రకృతి వ్యవసాయంలో జీవ ఎరువుల వినియోగం, మార్కెట్లో అందుబాటులో ఉ న్న వివిధ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గీసుగొండ మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు అఖిల, స్మిత, కావ్య, భరత్, ఎఫ్పీసీఎ ల్ మేనేజర్ అయేషా, నూజివీడు కంపెనీ ప్రతినిధి వెంకట్, ఉపసర్పంచ్, రైతులు మల్లయ్య, నర్సింహా రావు, వెంకటేశ్వర్లు, సుదర్శన్ పాల్గొన్నారు. డీఏఓ విజయభాస్కర్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
గీసుకొండ : యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ సూచించారు. బుధవారం మండలంలోని మొగిలిచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘మాదకద్రవ్యాల అవగాహన–ఆరోగ్యం, అనారోగ్యం’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. గంజాయి లేని సమాజం కోసం న్యాయ సేవాధికార సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సంబంధాల్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. ఎవరైనా డ్రగ్స్ లేదా ఇతర మాదక పదార్థాలను అందించినప్పుడు ‘నో–గో–టెల్’ సూత్రాన్ని పాటించాలని సూచించారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఒత్తిడి, ఆసక్తి కోసం మాదకద్రవ్యాలను ప్రయోగించడం వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో చర్చించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు, సంబంధిత అధికారులకు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్లైన్ 15100కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి పూజ -
పోచమ్మ బోనాలు ఇక్కడ ప్రత్యేకం
● నేడు న్యూశాయంపేట ఊరంతా వేడుకకాజీపేట అర్బన్: న్యూశాయంపేటలో శ్రావణమాసం ఆఖరి గురువారం రోజున పోచమ్మతల్లి బోనాలను నిర్వహించుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 10న శ్రావణమాసం చివరి గురువారం కావడంతో పోచమ్మతల్లి బోనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఊరంతా బోనాల పండుగ గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్లోని న్యూశాయంపేటలో కులమతాలకు అతీతంగా జాతరను తలపిస్తూ పోచమ్మతల్లి బోనాలను గురువారం నిర్వహించుకుంటారు. కుమ్మరులే పూజారులు న్యూశాయంపేటలో నిర్వహించే పోచమ్మతల్లి బోనాలకు అనాదిగా కుమ్మరులు (శాలివాహనులు) పూజారులుగా, పోచమ్మతల్లికి యాదవుల మేకపోతుల బండి రథంగా కొనసాగుతూ వస్తోంది. ప్రధాన రహదారి నుంచి దేవాలయం వరకు మేకల బండిలో పోచమ్మతల్లి ప్రతిమను ఉంచి డప్పుచప్పుళ్లు శివసత్తులు, పోతరాజుల విన్యాసాలతో మధ్య ఊరేగిస్తారు. భక్తులు నృత్యాలు చేస్తూ పోచమ్మకు బోనాలు సమర్పిస్తారు. -
ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను బుధవారం మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని గిర్నిబావి పరి సర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గిర్నిబావిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి దామోదర రాజనరసింహకు మాధవరెడ్డి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రజ లకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడం, అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల ఆరోగ్య సంక్షేమ మే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారు. ఎన్ఎస్యూఐ ఆరు జిల్లాల అధ్యక్షుల నియామకం సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ బలోపేతంపై అధి ష్టానం దృషిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. స్వచ్ఛ వరంగల్కు ఆధునిక సాంకేతికత వరంగల్ అర్బన్: ముంబైలోని ‘బాంబే ఎగ్జిబిషన్ సెంటర్’లో జరుగుతున్న 13వ ఐఎఫ్ఏటీ ఇండియా–26 సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న బుధవారం పాల్గొన్నారు. తెలంగాణ మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంలో పాల్గొన్న కమిషనర్ పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈ–వేస్ట్ త దితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, వినూ త్న విధానాలు పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వా రా పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, పర్యావరణహిత వరంగల్ నిర్మాణానికి మరింత ఊతమివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సూచనలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు నగర పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. నేటినుంచి మిల్లింగ్ ప్రక్రియ నిలుపుదల వరంగల్ చౌరస్తా/ఖిలావరంగల్ : రైస్మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, రెండు జిల్లాల అదనపు కలెక్టర్లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనెల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా గురువారంనుంచి రైస్ మిల్లులు మిల్లింగ్ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతీ సీజన్ మొదలయ్యే ముందే ధాన్యాన్ని దించుకోవాలని విన్నవించుతున్నామని స్పష్టం చేశారు. కానీ బియ్యం ప్రొక్రూమెంట్ చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని, అందుకు రైస్ మిల్ల ర్లు ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారని చెప్పా రు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మిల్లింగ్ సమయంలో డ్యా మేజ్, నూకలు తదితర కారణాలతో ఏర్పడే షార్ట్ఫాల్పై మిల్లర్లపై చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలు సమర్పించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, గౌరవ సలహాదారు తోట సంపత్కుమార్, దేవుని అంజయ్య, గుజ్జ ప్రభాకర్రావు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. -
జీఎం రాంరెడ్డికి జాతీయ అవార్డు
భీమదేవరపల్లి : ముల్కనూరు కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి సీడ్స్మెన్ వార్షిక అవార్డ్స్–2026 పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం సీడ్స్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విత్తన రంగంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, సహకార వ్యవస్థ ద్వారా కర్షకుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం, సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఎస్కేఎల్టీజీహెచ్యూ వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి, టీఎస్ఎస్ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్, సీడ్స్మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎన్వీ.రామకృష్ణ, కార్యదర్శి రఘువాసు ఈ పురస్కారాన్ని బుధవారం అందించారు. -
విద్యార్థులకు విలువలు బోధించాలి
● డీఈఓ గిరిరాజ్ గౌడ్ శాయంపేట: ఉపాధ్యాయులు విద్యతో పాటు మానవతా, నైతిక విలువలు కూడా బోధించాలని హనుమకొండ డీఈఓ గిరిరాజ్ గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం పత్తిపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను, మండల కేంద్రంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలలోని రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందుండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, ప్లానింగ్ అధికారి మహేశ్, ఎంఈఓ గడ్డం భిక్షపతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాధవి, శ్రీనివాస్, శ్రీలత, అశోక్, సీఆర్పీలు అశోక్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు అంజనీదేవి, శ్రీనివాస్, రఘు, రమ, విజయ, విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. -
స్వచ్ఛ వరంగల్కు ఆధునిక సాంకేతికత
ఐఎఫ్ఏటీ సదస్సులో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: ముంబైలోని ‘బాంబే ఎగ్జిబిషన్ సెంటర్’లో జరుగుతున్న 13వ ఐఎఫ్ఏటీ ఇండియా–26 సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న బుధవారం పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంలో పాల్గొన్న కమిషనర్ పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈ–వేస్ట్ తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, వినూత్న విధానాలు పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వారా పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, పర్యావరణహిత వరంగల్ నిర్మాణానికి మరింత ఊతమివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సూచనలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు నగర పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. -
అగ్నికి ఆహుతైన సేవాజీవితం
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ నక్కలగుట్ట లోని అమరవీరుల స్తూపం జంక్షన్లోని లింగాల కే దారి హోటల్ ఉమ్మడి జిల్లావాసులకు సుపరిచితం. ఆ హోటల్ యజమాని లింగాల కేదారి దంపతులు సేవాభావం, పేదోడి ఆకలి తీర్చే వ్యక్తులుగా గుర్తింపు. అగ్నిప్రమాదం ఆ దంపతుల్లో ఒకరిని బలితీసుకుంటే మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బుధవారం రాత్రి సుమారు 7.45 గంటల ప్రాంతంలో లింగాల కేదారి హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో లింగాల కేదారి(60) అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలత 90 శాతానికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఆస్పత్రికి చేరుకుని ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. లాభార్జనకంటే మానవీయతకే పెద్దపీట తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న లింగాల కేదారి హోటల్ యజమాని కేదారి నాడు ఎంతోమంది ఉద్యమకారులకు ఉచితంగా అన్నం పెట్టారు. ఇద్దరు వ్యక్తులు వృథా చేసే భోజనం మరొకరి అకలి తీరుస్తుందని, విలువైన సూక్తులను హోటల్లో రాయించి అందరికీ అన్నం విలువ తెలియజేశాడు. చైనీస్ గారె సృష్టకర్తగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ప్రతీనెల కొన్ని రోజులపాటు అందరికీ ఉచితంగా టిఫిన్లు పెట్టి తన సేవాభావం చాటుకుంటున్నారు. కేదారి చేస్తున్న సేవా కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం కేదారితో మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు, ఓరుగల్లు ప్రజలు లింగాల కేదారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాభార్జన కంటే మానవీయతకే పెద్దపీట వేస్తూ హోటల్ను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. హోటల్లో అగ్నిప్రమాదం.. లింగాల కేదారి మృతి ప్రాణపాయస్థితిలో ఆయన భార్య పుష్పలత లాభార్జన కంటే మానవీయతకే పెద్దపీట వేసిన కేదారి తెలంగాణ ఉద్యమం సమయంలో ఉచితంగా భోజనం -
వరంగల్
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నత్తనడకన ‘ఇన్స్పైర్’ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్స్పైర్ మనాక్ పురస్కారాలకు విద్యార్థుల నుంచి నామినేషన్ల నమోదు లక్ష్యం చేరుకోలేదు.నీరులేక వెలవెలబోతున్న వర్ధన్నపేట మండలంలోని కడారి చెరువు వినాయక ఉత్సవాలపై ఎల్నినో ప్రభావంసాక్షి, వరంగల్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకుంటున్న వేళ నిమజ్జనంపై భక్తుల్లో ఆందోళన మొదలైంది. గణనా థుడి విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువుల్లో నీరు లేకపోవడం భక్తులకు సమస్యగా మారనుంది. ఎల్నినో ప్రభావంతో వరంగల్ నగరంతోపా టు జిల్లాలోని పలు చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే వర్షాభావ ప్రభావం సాగుపై కనిపిస్తుండగా.. ఇప్పుడు వినాయక నిమజ్జనాలపైనా పడే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు ప్రణాళిక ఏదీ..? ఉత్సవాలకు నెల ముందే నిమజ్జన ప్రాంతాలను గుర్తించి అవసరమైన నీరు, కృత్రిమ కొలనులు, క్రేన్లు, బ్యారికేడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని చెరువుల్లో నీటి పరిస్థితి, ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం స్థాని క సంస్థల అవసరానికి అనుగుణంగా తాత్కాలిక కృత్రిమ నిమజ్జన కొలనులు లేదా ట్యాంకులు ఏర్పా టు చేయాలి. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పా ట్లు, వ్యర్థాల సేకరణ, నిమజ్జనం అనంతరం శుభ్రతకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మట్టి విగ్రహాలపై అవగాహన కరువు నీటి కొరత నేపథ్యంలో అధికారులు మట్టి వినా యక విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కానీ, ఆ దిశగా ప్రయత్నించినట్లు లేదు. మట్టి విగ్రహాలను ఇంటి వద్దనే నీటి తొట్టె, బకెట్ లేదా ఇతర పాత్రలో నిమజ్జనం చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిహిస్తే పెద్ద చెరువుల్లో నిమజ్జనాలపై ఒత్తిడి తగ్గుతుందని పర్యావరణవేత్తల అభిప్రాయం. దీనికితోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జన కొలనులు ఏర్పాటు చేయడంలేదనే విమర్శలున్నాయి. జిల్లాలో నీటి పరిస్థితి.. ● నర్సంపేట మండలంలో 69 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో 20 శాతం మేర నీటిమట్టం ఉంది. విగ్రహాలను ఎక్కువగా నర్సంపేట పట్టణంలోని దామర చెరువుకే తరలిస్తారు. కానీ ప్రస్తుతం విగ్రహలు మునిగేంత నీరు లేదు. ● ఖానాపురం మండలంలో 23 చెరువులుండగా.. అశోక్ నగర్లోని దూసముద్రం చెరువు మాత్రమే పెద్దది. ఇందులో విగ్రహాలు మునిగేంత నీరులేదు. నెక్కొండ మండలంలో 19 పెద్ద చెరువులు 25 చిన్న చెరువులు, 37 కుంటలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం చెరువల్లో వినాయక నిమజ్జనానికి సరిపడా నీరు లేదు. ● చెన్నారావుపేటతోపాటు ఈర్యాతండా, ఖాదర్పేట, గొల్లపల్లి, మాధవనగర్, అక్కల్చెడ, సూర్యాపేట తండా తదితర గ్రామాలకు చెందిన విగ్రహాలు ఏటా నిమజ్జనం చేసే చెన్నారావుపేటలోని కోపాకుల చెరువులో నీరు అడగంటింది. ● దుగ్గొండి మండలంలోని 34 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 14 పెద్ద చెరువులున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల నేటికీ ఏ ఒక్క చెరువులోనూ నీరు నిండుగా లేదు. నల్లబెల్లి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ● వర్ధన్నపేట మండలంలోని కడారి గూడెం, కట్రాల, రామవరం గ్రామాల్లోని చెరువులో కుంటలు పూర్తిగా ఎండియాయి. పర్వతగిరి, రాయపర్తి మండలంలోనూ చాలా వరకు చెరువుల్లో నీరు లేదు. సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట చెరువు 50శాతం, గవిచర్ల ఊర చెరువు, చింతలపల్లి తాళ్లచెరువు కొండ సముద్రం, నల్లబెల్లి, కుంటపల్లి, తీగరాజుపల్లి, రామచంద్రాపురం ఊర చెరువుల్లో 30 శాతం, తీగరాజుపల్లి మధ్యల కుంట 40 శాతం నీరు ఉండగా, మిగిలిన చెరువులో కుంటల్లో 10 శాతానికి తక్కువగా నీరు ఉంది. ప్రధాన చెరువులు, కుంటల్లో నీరు అంతంతే.. వరంగల్ నగరంలోనూ పొంచి ఉన్న నీటి కొరత ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల ఉదాసీనతఉర్సు రంగలీలా మైదానం, ఖిలావరంగల్ ఆగర్త, గుండు చెరువు, మధ్యకోట, బెస్తం చెరువు, ఆటోనగర్ కోట, చిన్న వడ్డెపల్లి, కట్టమల్లన్న తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు సరిపడా లేకపోవడంతో ఈసారి భారీ విగ్రహాలు మునిగే పరి స్థితి లేదు. కట్ట మల్లన్న చెరువులో ప్రతీ ఏడాది వందల విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈసారి నీరు తక్కువగా ఉండడంతో పెద్ద మొత్తంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదు. గీసుకొండ, ఏలుకుర్తి, మనుగొండ, ఊకల్ మచ్చాపూర్, విశ్వనాథపురం గ్రామాల్లోని చెరువుల్లో వినాయక నిమజ్జనాలకు సరిపడా నీరు లేదు. గ్రౌండ్ రిపోర్ట్ -
రెడ్క్రాస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, సొసైటీ అధ్యక్షురాలు సత్యశారద అన్నారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల పర్యవేక్షకుడిగా అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్ను, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి నీరజను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. జాబితాను కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, చేర్పులు, సవరణలకు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోరారు. ఈ నెల 14 వరకు జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. 15న ఓటర్ల జాబితాలో చేర్పులు, సవరణలకు అభ్యర్థనలు స్వీకరిస్తారు. 16న జాబితా పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర శాఖకు అప్పీలు కోసం సమర్పిస్తారు. 19న తుది ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పర్యాటకాభివృద్ధికి మూడేళ్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం పర్యాటక అభివృద్ధి, జ్ఞాన భారతం మిషన్పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించాలని తెలిపారు. జిల్లా పర్యాటక గుర్తింపు బ్రాండింగ్పై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ పాలక మండలి సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్, డీసీఓ నీరజ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భార్గవ్, ఉపాధి కల్పనాధికారి సాత్విక, ఏడీ ఆర్కియాలజీ గంగా పాల్గొన్నారు. కలెక్టర్, సొసైటీ అధ్యక్షురాలు సత్యశారద -
సీఎంను కలిసిన ఎమ్మెల్సీ సారయ్య
కాశిబుగ్గ: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హైదరాబాద్లో బుధవారం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసి జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు సమాచారం. అలాగే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం. వరంగల్ స్పోర్ట్స్: నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 41 మందికి బుధవారం సెట్విన్ అధికారులు పరీక్ష నిర్వహించారు. దీనికి హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ అఖిల్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. సెట్విన్ సంస్థ ప్రతినిధులు, పర్యవేక్షకులు బేగం, సుష్మ పర్యవేక్షించారు. ఈసందర్భంగా డీవైఎస్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. కొత్తగా మొదలవుతున్న బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీ కోర్సులో శిక్షణకు అడ్మిషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 79955 03018 నంబర్లో సంప్రదింవచ్చని సూచించారు. కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ నిర్మాణ పనులను బుధవారం సికింద్రాబాద్ రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేశర్వాణి తనిఖీ చేశారు. కాజీపేట అమృత్ భారత్ పనులు, స్టేషన్ ఎదుట ఉన్న సర్క్యులేటింగ్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేసి అభివృద్ధి పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానిక అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలిచ్చారు. ఈతనిఖీలో కాజీపేట ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, స్థానిక రైల్వే సూపర్వైజర్లు, వర్క్ సూపర్వైజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ తాత్కాలిక బస్టాప్ ఏర్పాటు కాజీపేట రైల్వేస్టేషన్లో అమృత్భారత్ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్టేషన్ ముందున్న ఆర్టీసీ లోకల్ బస్టాప్ను రైల్వే అధికారులు కాజీపేట రైల్వే స్టేడియానికి బుధవారం తరలించారు. పనులు పూర్తయ్యేవరకు ఇక్కడి నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని హనుమకొండ లోకల్ బస్ ఆర్టీసీ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లల (విద్యార్థులు)కు ఈనెల 11న ప్రత్యేక వైద్య/సహాయక పరికరాల గుర్తింపు కోసం శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్గౌడ్, కమ్యూనిటీ మొబి లైజింగ్ కో–ఆర్డినేటర్ సుమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరాన్ని హసన్పర్తిలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకుకు అవసరమైన సహాయ పరికరాలు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర కృత్రిమ పరికరాలు అందించేందుకు క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎంలు, ఐఈఆర్పీలు ఆయా పిల్లలను గుర్తించి క్యాంపులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) పనులకు కసరత్తులు వేగవంతమయ్యాయి. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు కోసం అవసరమైన మేరకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు జీఓ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం 8 ప్రాంతాలను ఎంపిక చేశారు. సీవరేజ్ పంపింగ్ సిస్టమ్ (ఎస్పీఎస్), సెప్టిక్ ట్యాంక్స్, వెట్ వాల్స్, నిర్మాణానికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఏఐ) ద్వారా తీసుకోవాలని సూచనలు చేసింది. -
హనుమకొండ కేదారి హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..
తెలంగాణ: వరంగల్ హన్మకొండ జిల్లాలోని అదాలత్ జంక్షన్లో లింగాల కేదారి హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ యజమాని కేదారి దంపతులు గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఉన్న వారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు.ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.అయితే, మంటల కారణంగా గాయపడిన కేదారి దంపతులను చికిత్స కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.హోటల్లో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.ఇవీ చదవండి: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్.. -
కాంగ్రెస్ నాయకుల నిరసన
కాశిబుగ్గ: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనంతరం మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై బీఆర్ఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్పీకర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొరివి పరమేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో శనివారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పూజల్లో ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమారాణి దంపతులు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్, శ్రవణ్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
ఖానాపురం: యూరియా కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సోమవారం ఖానాపురం రైతువేదిక వద్దకు పలు గ్రామాలకు చెందిన భూముల పట్టాలు లేని రైతులు గంగయ్య, విష్ణు, ఈర్య, సాయిలు, సరోజన, సాంబలక్ష్మి, సమ్మక్క, భద్రమ్మ, యాకాంబ్రం, ఉపేంద్ర, ఐలయ్య, దసృ, రాజమ్మ, కొంరుమల్లు చేరుకోని వ్యవసాయ అధికారులను నిలదీశారు. యాప్లో పట్టాలు లేని రైతులకు రావడంలేదని, ఇందులో తాము చేసేదేమీలేదని వ్యవసాయ అధికారి శ్రీనివాస్, విస్తరణ అధికారి ఆశాదీప్లు తెలిపారు. దీంతో ఏఈఓతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిబంధనలు ఇంకా రాలేదని చేతులెత్తి మొక్కుతూ ఏఈఓ ఆశాదీప్ రైతులకు చెప్పినా వినకుండా వాగ్వాదం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతీ రైతుకు యూ రియా అందించాలని రైతులు కోరుతున్నారు. -
పకడ్బందీగా విచారణ చేపట్టాలి
● వీసీలో ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి న్యూశాయంపేట: ఎస్ఐఆర్లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీ డియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీ క్షించారు. విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవరించాలన్నారు. నిర్ణీత గడువులోగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో మూడు నియోజక వర్గాల్లో మొ త్తంగా 1,94,395 మందికి నోటీసులు జనరేట్ కాగా ఇందులో 96,911 మందికి నోటీసులు అందించామని, 5,001 మంది హియరి ంగ్కు హాజరైనట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు కిశోర్కుమార్, వైవీ.గణేశ్, ఆర్డీఓ లు సుమ, ఉమారాణి తదతరులు పాల్గొన్నారు. రేపు మహిళలకు జాబ్మేళా కాళోజీ సెంటర్/కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 9న (బుధవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన అగ్రిటెక్ సంస్థలో టెలీ కాలర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 21 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎంపికై న వారు వరంగల్లోని ఏనుమాముల మార్కెట్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 9న ఉదయం 11 గంటలకు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. జాతీయస్థాయి కరాటేలో విద్యార్థుల ప్రతిభనర్సంపేట:జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నర్సంపేట పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి వెండి పతకాలు సాధించారు. ఈ మేరకు ఫణకుశి షాతోఖాన్ కరాటే డూ అ సోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ షిహన్ భవానిచంద్ సోమవారం మాట్లాడుతూ కర్నూలు పట్టణ ంలోని పుష్పరాజ్ కన్వెన్షన్ హాల్లో జీకేఎంఏ కరాటే సంస్థ ఆధ్వర్యంలో సెన్సాయ్ జగదీష్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ రెఫరీ నిర్వహించిన జా తీయ స్థాయి కరాటే పోటీల్లో పట్టణానికి చెందిన జూనియర్ బాలిక విభాగంలో పి.అంజన, 17 సంవత్సరాల విభాగంలో ఉప్పు హనీ వెండి పతకాలు సాధించినట్లు తెలిపారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమా రు 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నా రు. టోర్నీని నిష్పక్షపాతంగా రెఫరీ విధులు నిర్వహించిన భవానీ చంద్ను కూడా ట్రోఫీ అందజేసి అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి ● సమావేశంలో కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై వినాయక చవితి, ప్రతిమల నిమజ్జన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల తరలింపులో ఇబ్బందులు కల్గకుండా రోడ్లపై గుంతలు పూడ్చాలని, ప్యాచ్వర్క్లు పూర్తి చేయాలన్నారు. మండపాల వద్ద ప్రత్యేక డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఆర్ఎఫ్, రెస్క్యూ, మత్స్య శాఖ సిబ్బంది బోట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్కుమార్, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశ్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నిధులు
విద్యారణ్యపురి: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటుచేసి విద్యనందించనుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కొంతకాలం క్రితమే అనుమతినిచ్చింది. తొలుతగా కొన్నింటికి పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 పబ్లిక్స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి. ఇవి సెమీరెసిడెన్షియల్ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించనున్నారు. జిల్లా వారీగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు పాఠశాల ఎంపిక.. నిధుల కేటాయింపు.. ● హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 9.90కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి హసన్పర్తిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్కు రూ 6.80కోట్లు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లా శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్కు రూ 8.30కోట్లు, నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ హైస్కూల్కు రూ.9.99కోట్లు. ● జనగామ జిల్లా నర్మెట మోడల్ స్కూల్కు రూ 10.70కోట్లు. ● మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ హైస్కూల్కు రూ.7.50కోట్లు, డోర్నకల్ నియోజకవర్గ పరిధి నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్కు రూ 11.20కోట్లు. ● ములుగు జిల్లా బండారుపల్లిలోని టీజీఎంఎస్కు రూ.9.20కోట్లు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె జెడ్పీహెచ్ఎస్కు రూ.11.50కోట్లు మంజూరుచేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఎంపిక ప్రతిపాదిత ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లలోనే ఏర్పాటు ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్గా విద్యతోపాటు క్రీడలు వసతులు, మెరుగైన విద్య రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఒక మోడల్గా నిర్మించారు. సీఎం రేవంత్రెడ్డి ఆ స్కూల్ను ప్రారంభించి ఆయన ఆదేశం మేరకు ఆ తరువాత వివిధ జిల్లాలనుంచి ప్రతిపాదనలు తీసుకుని పరిపాలనపరమైన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్నత స్కూళ్ల భవనాలు, తరగతి గదులు ఉంచి అదనంగా గదులు సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్, క్రీడామైదానం, లైబ్రరీ, మోడల్ కిచెన్, డైనింగ్హాల్, డ్యాన్స్ హాల్ నిర్మిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న హైస్కూళ్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. -
శాఖల వారీగా దరఖాస్తులు
న్యూశాయంపేట: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా వాణికి వినతులు తగ్గుతున్నాయి. ప్రజలు రాకపోవడంతో అర్జీల విభా గం వెలవెలబోయింది. గతంలో ప్రజావాణికి 200పైగా దరఖాస్తుదా రులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడేది. కానీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి తక్కువ సంఖ్య లో బాధితులు రావడంతో ప్రజావాణి సమావేశపు హాల్ ఖాళీగా దర్శనమిచ్చింది. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ డివి జన్ స్థాయి, మండలస్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో కలెక్టరేట్కు ఫిర్యాదులు అందించేందుకు రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. పైగా ప్రస్తుత వ్యవసాయ పనులతో హా జరుశాతం తగ్గొచ్చంటున్నారు. హాజరైన కొద్దిమంది బాధితుల నుంచి జిల్లా అధికారులు వినతులు స్వీకరించి వారి బాధలు విన్నా రు. వీటిలో ఎక్కువ శాతం రెవె న్యూ, భూ సమస్యలు, హౌసింగ్ సంబంధించిన దరఖాస్తు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కా న్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావా ణికి 160 దరఖాస్తులు అందాయని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధి కారులకు ఎండార్స్ చేశారు. అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీసీఈఓ వసంత, డీఆర్డీఓ నాగపద్మజా, డీఎంహెచ్ఓ రాజారెడ్డి అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి ప్రతీవారం తక్కువగా నమోదవుతున్న ఫిర్యాదులు సమస్యలు పరిష్కరించకపోవడమే కారణమా? గ్రీవెన్స్లో 160 దరఖాస్తులురెవెన్యూ 54డీడబ్ల్యూఎంసీ 40హౌసింగ్ 12డీఆర్డీఓ 11ఇతర శాఖలకు చెందినవి 43మొత్తం 160బాగోగులు చూడటం లేదు.. నా కుమారుడు బాగోగులు చూడకుండా ఒంటరిగా వదిలేశాడు. భార్య చనిపోయింది. జీవనభృతి కోసం డబ్బులు ఇప్పించాలని పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాను. నా రెండు ఎకరాల భూమిని పట్టా చేసి ఇప్పించండి.బి.హార్యానాయక్, గోరుగుట్టతండావైద్యుల నిర్లక్ష్యంలో ఆపరేషన్ ఫెయిల్ అయింది పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఇటీవల ఎంజీఎంలో చేరాను. చిన్న గడ్డ ఉందని వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయి ఆపరేషన్ చేసిన ప్రదేశం నుంచి చీము కారుతుండటంతో అందులో పనిచేసే మరో వైద్యుడు తన సొంత ఆస్పత్రికి రీఫర్ చేశాడు. అక్కడ కూడా ఆపరేషన్ చేయకుండా వదిలేశాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాను. విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించండి. ఎల్.రాజేశ్వర్రావు, గోవిందాపూర్ -
సమయపాలన ఏది?
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి సమయపాలన లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఆస్పత్రికి వస్తూపోతుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో ఏకై క మెడికల్ కళాశాల ఆస్పత్రి నర్సంపేట ప్రాంతానికి కేటాయించారు. ఆ కళాశాలలోని ఆస్పత్రిలో ఓపీ సేవలు సకాలంలో నిర్వహించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడం, సమయం కాకముందే వెళ్లిపోవడంతో రోగుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఓపీలో వైద్యులు సుమారు మూడు గంటలకు కూడా సేవలందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పది గంటలైనా.. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఉదయం పది గంటలైనా ఓపెన్ చేయడం లేదు. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా వచ్చి క్యూలైన్లో నిలబడే పరిస్థితి ఉంది. వైద్యసిబ్బంది 9.30 గంటలకు వస్తే వైద్యులు ఏకంగా ఉదయం 10 నుంచి 11గంటల మధ్యలో వస్తున్నారు. ప్రతీ రోజు 2గంటల వరకు ఓపీ నడవాల్సి ఉండగా ఓపీ సేవలు కేవలం గంటకే మూసివేస్తున్నారు. ఇక ఫార్మసీలో రోగులకు సరైన మందులు ఉండటం లేదని పలువులు వాపోతున్నారు. వైద్యులు రాసిన మందులకు సగం వరకే ఇస్తుండటంతో మరో సగం మందులకు ప్రైవేట్ మెడికల్షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. డీఎంఈ పరిధిలోని ఓపీ వేళలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బోధన ఆస్పత్రుల్లో ఒకే రోజు పరీక్షలు, వైద్యం పూర్తయ్యేలా ఓపీ వేళలను పొడిగించారు. ఓపీ రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటల నుంచే రోగులకు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలు ఎవరూ పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి.చర్యలు తప్పవునర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలి. –దామోదరాబాయి, నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యం పట్టించుకోని అధికారులు -
వినాయకుల నిమజ్జనానికి చెరువుల పరిశీలన
నర్సంపేట: నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దామెర చెరువు, మాధన్నపేట చెరువులను మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ సోమవారం మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్గుప్తా, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు ఆశించన స్థాయిలో కురవకపోవడంతో గణనాథుల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామస్తులు, అధికారుల సహకారంతో నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మాధన్నపేట చెరువులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణానికి, కాలుష్యానికి హాని కలగకుండా మున్సిపల్ పరిధిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవాల కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు కొత్తకొండ మేఘనశ్యాంరాజ్, ముత్తినేని వెంకన్న, బీరం భరత్రెడ్డి, ఏపూరి శ్రీనివాస్రెడ్డి, ఎలకంటి విజయ్కుమార్, సలావుద్దీన్ అయూబ్ఖాన్, పొ న్నాల మనీషాప్రకాష్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, యూత్ అధ్యక్షుడు తు మ్మలపల్లి సందీప్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, కాట ప్రభాకర్, కిరణ్యాదవ్, నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
న్యూశాయంపేట/వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆరోపించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధి కారంలోకి వచ్చి వెయ్యి రోజులైన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ -
పట్టణాల్లోనే అక్షరాస్యత అధికం
హనుమకొండదే పైచేయి.. ఆరు జిల్లాల్లో హనుమకొండ అక్షరాస్యతలో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత గణనీయంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఎక్కువగా గిరిజన మారుమూల ప్రాంతాలు ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువుపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తి సాగు, మిర్చి కోతలు, ఇతర కూలీ పనుల కోసం కుటుంబాలు పిల్లలను కూడా వెంటబెట్టుకుని వలసలు వెళ్లడం మరో కారణంగా తెలుస్తోంది. కాగా, 2011 గణాంకాల ఆధారంగా ఉన్న ఈ వ్యత్యాసాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే జిల్లాల విద్యాభివృద్ధి మెరుగై ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల అక్షరాస్యతలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సోషియో ఎకనామిక్ ఔట్లుక్ – 2026లో హనుమకొండ జిల్లా 74.13 శాతం అక్షరాస్యతతో అగ్రస్థానంలో ఉండగా.. మహబూబాబాద్ 57.13 శాతంతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాల్లో వరంగల్ 64.55, ములుగు 62.26, జనగామ 61.60, జయశంకర్ భూపాలపల్లి 58.97 శాతం అక్షరాస్యతను నమోదు చేశాయి. నేడు (మంగళవారం) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత వివరాలతో కథనం. మహిళల్లో వెనుకబాటు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో శనివారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పూజల్లో ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమారాణి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు ప్రణవ్, శ్రవణ్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు. సోమవారం ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ ఉత్తర్వుల కాపీని కనకయ్యకు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ భిక్షపతి, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఫిరోజ్పాషా, అధ్యాపకులు కనకయ్యను అభినందించారు. హసన్పర్తి: నేత్రదానంతో ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని హసన్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో సోమవారం నేత్ర దాన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఇమ్యూనేజషన్ అధికారి డాక్టర్ కృపారావు, అప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, డీపీఎంఓ దేవ్సింగ్, వైద్యులు భార్గవ్, మునీబ్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు తదితరులు ఉన్నారు. హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ముగ్గురు డీఈలకు యాజమాన్యం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్హక్ పద్ధతిలో వీరికి సూపరింటెండ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. హనుమకొండ సర్కిల్లోని ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ ఎ.విజేందర్రెడ్డికి కరీంనగర్ ఆపరేషన్ ఇన్చార్జ్ సూపరింటెండ్గా నియమించారు. భూపాలపల్లి సర్కిల్లో ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ ఎన్.సదానందానికి భూపాలపల్లి ఇన్చార్జ్ సూపరింటెండ్ ఇంజనీర్గా నియమించారు. నిజామాబాద్ సర్కిల్లోని ఆపరేషన్ డీఈగా ఎం.శ్రీనివాస్కు రాజన్న సిరిసిల్ల ఇన్చార్జ్ ఎస్ఈగా నియమించారు. -
ప్రజావాణి వినరూ!
ఆత్మకూరు: ఈఫొటోలోని మహిళ పేరు తనుగుల రాధిక. గ్రామం ఆత్మకూరు, ఈమెకు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉత్తర్వులు గృహలక్ష్మిలో గృహనిర్మాణం చేసుకోవడానికి వచ్చాయి. దీంతో గృహ నిర్మాణాన్ని ప్రారంభించి బెడ్, పిల్లర్ వరకు నిర్మాణం చేపట్టింది. బిల్లులు రాకపోవడంతో అప్పులయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే మంజూరు చేసిన ఇంటికి ప్రభుత్వం బిల్లులు ఆపడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లు ఇప్పించాలని సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి.. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమస్యలకు పరిష్కారం చూపాలని అర్జీదారుల మొర -
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి..
● జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కృష్టారావు కమలాపూర్: విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్టారావు సూచించారు. కమలాపూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో స్థానిక పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి తది తర అంశాలపై సోమవారం అవగాహన కల్పించా రు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను ప రిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారి నాగరాజు, డా క్టర్ అరుణ్కుమార్, హెచ్ఈఓ రవీందర్ ఉన్నారు. -
పోలీసులు సంయమనం పాటించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతకాజీపేట అర్బన్ : జనసమూహాల్లో పోలీసుల తీరును ప్రజలు గమనిస్తారని, అందుకే సంయమనం పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో భద్రాధ్రి జోనల్ పరిధిలోని పోలీస్ శిక్షణార్థులకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల తరగతులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా పండుగలు, జాతరలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ట్రైనీలకు తరగతిలో బోధనతోపాటు ప్రాక్టికల్గా అధికారులు వివరించాలన్నారు. అడిషనల్ డీసీపీలు ప్రభాకర్రావు, శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రమణబాబు,ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు సూర్యప్రసాద్, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు హాజరయ్యారు. -
మట్టి గణపతుల్ని పూజిద్దాం
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీపీసీబీ నోడల్ అధికారి బి.జీమూత వాహన, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. 75 శాతం నోటీసులు జారీ ఎస్ఐఆర్లో భాగంలో జిల్లాలో అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు ఇప్పటివరకు సుమారు 75 శాతం నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు, పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. వేగంగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, అంగన్న్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వైద్యారోగ్య సేవల్లో జిల్లా ముందుండాలివైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలులో జిల్లాను ముందంజలో నిలపాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ కేసులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఓ డాక్టర్ కృష్ణారావు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
హసన్పర్తి: వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సూచించారు. గోపాలపురంలో అరిస్సా గ్రోత్ ఫామ్స్ మిల్లెట్ పన్నీర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసిసెంగ్ యూనిట్ను ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. న్యూట్రిహబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రిన్యూర్షిప్లో భాగంగా ఈ పరిశ్రను నెలకొల్పారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఐఐఎంఆర్ వంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాగా, ఇది దేశంలోనే తొలి మిల్లెట్ పన్నీర్ యూనిట్ అని నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఐఐఎంఆర్ న్యూట్రిహబ్కు చెందిన డాక్టర్ స్టాన్లే, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్కుమార్, న్యూట్రిహబ్ బృంద ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గోపాలపురంలో మిల్లెట్ పన్నీరు తయారీ పరిశ్రమ ప్రారంభం -
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం
నర్సంపేట: ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని, అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవ ప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని 20వ డివిజన్కు చెందిన కొండోజు గీతాచరణ్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనఖిలా వరంగల్: తైమాసిక తనిఖీలో భాగంగా ఆదివారం వరంగల్ ఎనుమాముల మార్కెట్యార్డులోని ఈవీఎం గోదామును కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో అమలులో ఉన్న భద్రతా చర్యలు, నిర్వహణ ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిబంధనలను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో డీఆర్వో విజయలక్ష్మీ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజల ఇబ్బందులు వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీల అమలులో విఫలమైందన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, తమ పాలనలో ప్రజల బాధలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్ సిలువేరు కుమారస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిన్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణి ఉ దయం 10గంటలకు ప్రారంభమవుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
నెక్కొండ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మండలకేంద్రంలోని టీజీ గురుకుల పాఠశాల /కళాశాల (పీఎంశ్రీ)ను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గదులు, భోజన, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల, జూనియర్ కళాశాల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను విడివిడిగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా టీచర్ స్వర్ణలత, పీఈటీ కమలకుమారి విధులకు ఆలస్యంగా హాజరుకావడం, వంటశాల అపరిశుభ్రంగా ఉండటంతో వార్డెన్ ప్రతిభకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పాఠశాల/కళాశాల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ యాసం లావణ్యను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రిన్సిపాల్ మమత స్థానికంగా ఉండాలన్నారు. అధ్యాపకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపాలని ఎస్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డీటీడీఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, డీఎస్డీఓ హమీద్, తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి ‘సర్’ కార్యక్రమాన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని లక్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఓటర్లకు అందిస్తున్న సేవలు, దరఖాస్తులు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద టీచర్, పీఈటీ, వార్డెన్కు షోకాజ్ నోటీసులు -
జనగణనలో బీసీల లెక్కలు చేపట్టాలి
కేయూ క్యాంపస్: కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి లెక్కలు చేపట్టాలని బీసీ కుల గణన సాధన సమితి కన్వీనర్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమనోహర్ డిమాండ్ చేశారు. ఆదివారం కేయూలోని దూరవిద్యాకేంద్రంలో ‘జనగణనలో ఓబీసీల కాలమ్ ఏర్పాటు’ అంశంపై బీసీ సంఘాలతో, ముఖ్యులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులగణన సాధన సమితి కన్వీ నర్ మురళిమనోహర్ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోయే జనగణనలో బీసీల జనగణన చేపట్టకపో తే భవిష్యత్లో బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విపరీతంగా నష్టపోతారన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్, విద్యాసంస్థల్లో సీట్లు, రాజకీయ ప్రాతినిథ్యం దక్కాలంటే కచ్చితమైన లెక్కలు ఉండాలన్నారు. అదే డిమాండ్తో ఈనెల 11న హనుమకొండలోని ఏకశిల పార్కువద్ద ప్రత్యేకంగా నిరసన దీక్షలను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈదీక్షలకు బీసీలంతా తరలిరావా లని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంఘాల బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు, వేణుగోపాల్గౌడ్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. 11న ఏకశిల పార్కు వద్ద నిరసన బీసీ కులగణన సాధన సమితి కన్వీనర్ మురళీమనోహర్ -
ఘనంగా ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని పింజర్ల వీధిలోని శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్రా భాషా నిలయంలో ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, జాతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పూర్వ రాష్ట్ర కార్యదర్శి సౌమిత్రి లక్ష్మణాచార్య అధ్యక్షత వహించారు. ప్రముఖ విద్యావేత్త దహగం సాంబమూర్తి ముఖ్య అతిథిగా హాజరై భగవద్గీతపై ప్రసంగించారు. విశ్రాంత ఉద్యోగులచే రచించబడిన ‘శ్రీ రామాయణం’ ‘భగవద్గీత’ విశిష్ట గ్రంథాల పరిచయ కార్యక్రమం ఈ సంగోష్టిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవద్గీత గ్రంథ పరిచయకర్త పుల్లారెడ్డి గ్రంథంలోని విశేషాలను, ఆధ్యాత్మిక విశిష్టతను శ్రోతలకు వివరించారు. మోహన మురళి సంస్కృతంలో రచించిన భగవద్గీత పై సంస్కృత భారతి అధ్యక్షుడు ప్యాట శ్రీనివాస్ ప్రసంగించారు. -
ఘోష్.. భేష్
హన్మకొండ కల్చరల్: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ‘ప్రణవ నాదం’ పేరుతో నిర్వహించిన సామూహిక ఘోష్ (వివిధ రకాల వాయిద్యాల) ప్రదర్శన ఆకట్టుకుంది. 90 మంది సేవికలు ఆనక్ (డ్రమ్), వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాయిద్యాలతో భారతీయ సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిరసంతో పాటు దేశభక్తి, జాతీయ భావనను చాటి చెప్పింది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ ప్రొద్దుటూరి రూప తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రాచీనయుద్ధ విద్యలు, వాద్యకళలు భారతీయ సంస్కృతిలో భాగమని, వాటిని భావితరాలకు అందించడమే తయ ధ్యేయమని పేర్కొన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిరోజు అందించే శిక్షణకు ఘోష్ ప్రదర్శన నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువత, బాలికల్లో ధైర్యం, సన్మార్గం పెంపొందిస్తాయని తెలిపారు. ప్రదర్శన అనంతరం సేవికలు భారతమాతకు ప్రణామం చేస్తూ ప్రార్థన చేశారు. ధర్మరక్షణ, సమాజసేవ రెండు కళ్లుగా రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తుందని రూప తెలిపారు. వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఎస్. మాలతి, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అసిస్టెంట్ లెక్చరల్ హరివిజయశ్రీ, వైద్యురాలు మంతెన శిరీష, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సంచాలిక డాక్టర్ మాగంటి అరుణ, శ్రీపాద రాధ, సముద్రాల కవిత, అర్చన, వాంకుడోత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఘోష్ను ప్రదర్శిస్తున్న సేవికలు ఆకట్టుకున్న ప్రణవనాదం శ్రీభద్రకాళి దేవాలయంలో 90 మంది సేవికల ప్రదర్శన క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మికతల కలబోతగా కార్యక్రమం -
ఘనంగా ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని పింజర్ల వీధిలోని శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్రా భాషా నిలయంలో ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, జాతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పూర్వ రాష్ట్ర కార్యదర్శి సౌమిత్రి లక్ష్మ ణాచార్య అధ్యక్షత వహించారు. ప్రముఖ విద్యావేత్త దహగం సాంబమూర్తి ముఖ్య అతిథిగా హాజరై భగవద్గీతపై ప్రసంగించారు. విశ్రాంత ఉద్యోగులచే రచించబడిన ‘శ్రీ రామాయణం‘ ‘భగవద్గీత’ విశిష్ట గ్రంథాల పరిచయ కార్యక్రమం ఈ సంగోష్టిలో ప్ర ధాన ఆకర్షణగా నిలిచింది. భగవద్గీత గ్రంథ పరిచయకర్త పుల్లారెడ్డి గ్రంథంలోని విశేషాలను, ఆధ్యాత్మిక విశిష్టతను శ్రోతలకు వివరించారు. మోహన మురళి సంస్కృతంలో రచించిన భగవద్గీత పై సంస్కృత భారతి అధ్యక్షులు ప్యాట శ్రీనివాస్ ప్రసంగించారు. తాడిచర్ల రవి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రామానుజం, సుధాకర్, కవులు, రచయితలు, తదితరులు పాల్గొన్నారు. -
పని ఒకరిది.. పైకం మరొకరికి!
పారిశుద్ధ్య పనుల్లో ఒకరికి బదులు మరొకరు విధులు26వ డివిజన్లో ఓ కార్మికురాలిని కేవలం మ్యాన్యువల్ హాజరుతోనే కొనసాగిస్తున్నారు. ఇలా బల్దియాలో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు సుమారు 130 మంది వరకు.. బినామీ, సిబ్బందికి కనిపించి ఇంటి ముఖం పడుతూ నెలనెలా వేతనం తీసుకుంటున్నారు. 13వ డివిజన్కు చెందిన ఓ రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడు నర్సంపేట నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. శానిటరీ ఇన్స్పెక్టర్ను, జవాన్ను మేనేజ్ చేసుకుంటున్నాడు. పోచమ్మ మైదాన్కు చెందిన 24వ డివిజన్కు చెందిన ఓ మధ్య వయస్సు కార్మికుడు ఉదయం, మధ్యాహ్నం వేళ వచ్చి ఫేస్ ఐడీ ఇచ్చి వెళ్తుంటాడు. నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ● రూ.10 వేలు చెల్లిస్తే రెగ్యులర్ కార్మికులకు నెలంతా అటెండెన్స్ ● గ్రేటర్ పారిశుద్ధ్య విభాగంలో అవినీతి! ● చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులువరంగల్ అర్బన్: మహా నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. బల్దియాలో 168 మంది శాశ్వత ప్రతిపాదికన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులున్నారు. 2,873 మంది ఔట్సోర్సింగ్ కార్మికులున్నారు. కార్మికులు తమ స్థానాల్లో మరొకరిని పెట్టుకోవడం, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు సలామ్ కొడుతూ మేనేజ్ చేసుకుంటూ పూర్తిస్థాయి వేతనం పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేయాలి. వీరు రోడ్లు ఊడ్చడం, కాల్వలు తీయడం, ఇంటింటా చెత్త సేకరించడం చేయాలి. ఇందుకుగాను పర్మనెంట్ కార్మికులకు నెల వేతనం రూ.50 వేల నుంచి రూ. 80వేల వరకు బల్దియా వేతనం పొందుతున్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులు రూ.16 వేల వేతనం తీసుకుంటున్నారు. రెగ్యులర్ కార్మికులకు హాజరు పుస్తకాలతో మ్యాన్యువల్గా హాజరు వేస్తుండగా, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఫేస్ అథెంటిక్ ద్వారా వేతనాలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. విధులు నిర్వర్తించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.కార్మికులు విధులు నిర్వర్తించకుండా జవాన్లకు రూ.2 వేలు, శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.10 వేల వరకు నెలవారీగా మామూళ్లు అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోకపోవడం, అసలు ఎవరు పనిచేస్తున్నారనే విషయంపై అవగాహన కూడా లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వారి హాజరును సైతం సరిగ్గా తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. గతంలో ఇదే విషయం వెలుగులోకి రావడంతో ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ అటెండెన్స్, మాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరైతే విధులకు వస్తారో వారి ముఖ చిత్రం ద్వారా హాజరు పడుతోంది. విధులు నిర్వర్తించాల్సిన కార్మికులు కాకుండా వేరే వారు వస్తే గుర్తిస్తాం. విధులకు డుమ్మా కొడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. – రాజేశ్, బల్దియా ఎంహెచ్ఓ -
కమ్ముకున్న మేఘాలు
సన్నూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంపై కమ్ముకున్న మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్న నీలి మేఘాలు.. మేఘాల చాటున దాక్కున్న సూర్యుడు.. ఆ మేఘాలను తాకుతూ దివ్యంగా వెలిగిపోతున్న ఆలయ గోపురం. ఈ సుందర దృశ్యం రాయపర్తి మండలంలోని సన్నూరులోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వర్షం వచ్చే ముందు చల్లని గాలి, గోపురం మీద నుంచి వచ్చే గంటల శబ్ధం, రోడ్డుపై వెళ్తున్న వాహనాల లైట్లు.. అన్నీ కలిపి ఆ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు, గ్రామస్తులు ప్రత్యేక అనుభూతి పొందారు. ఈ అందమైన దృశ్యం ఆదివారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – రాయపర్తి -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ హెచ్ఓల కొరత.. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్ హెచ్ఓలు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. 30 ఏళ్లుగా పదోన్నతులు కరువు.. ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు. జిల్లాల వారీగా ఉద్యాన పంటల వివరాలు.. జిల్లా ఆయిల్పామ్ పండ్ల కూరగాయలు ఇతర తోటలు పంటలువరంగల్ 6,750 6,958 806 3,955 హనుమకొండ 4,175 7,108 383 2,111 భూపాలపల్లి 4,576 1,148 98 995 ములుగు 3,562 647 207 530 జనగామ 7,824 9,581 81 178 మహబూబాబాద్ 9,149 14,803 482 3,054సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చే వారు కరువు హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు 3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్ఓలు మాత్రమే -
జిల్లా సాగైన పంటల వివరాలు (ఎకరాల్లో)
ఖిలా వరంగల్: ఎరువుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాంకేతికను అందిపుచ్చుకుంది. ఎరువుల నిల్వలు, విక్రయాలు, రైతుల పంపిణీ వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ను అమలులోకి తీసుకొచ్చింది. పంటలకు అవసరమయ్యే కాంప్లెక్స్ ఎరువులు, యూరియాను ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను యాప్ ద్వారానే అధికారులు నిర్వహించనున్నారు. దీంతో డీలర్ల వద్ద ఎరువుల నిల్వలు, రైతులకు జరిగిన పంపిణీపై అధికారులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందనుంది. నిర్ణీత ధరకే అమ్మేలా.. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, రైతులకు నిర్ణీత ధరకే అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు యూరియా విక్రయాలకు మాత్రమే అమలులో ఉన్న యాప్ విధానాన్ని ఇకపై అన్ని రకాల ఎరువులకు విస్తరించనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్ అమల్లోకి రానుంది. యాప్ ద్వారా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ తదితర ఎరువుల విక్రయాలు చేపట్టనున్నారు. దీంతో స్టాక్ దాచిపెట్టి అధిక ధరకు విక్రయించడం, రైతులను తప్పుదోవ పట్టించడం వంటి అక్రమాలకు చెక్ పడనుంది. ఏ షాపులో ఎంత నిల్వ ఉంది? యాప్లో ఎరువులు బుకింగ్ చేసుకున్న తర్వాత రైతులు ఆయా షాపుల వద్ద ఎక్కువ సేపు నిలబడాల్సిన అవసరం లేదు. ముందుగానే బుకింగ్ చేసుకుంటారు కాబట్టి రైతు సమయం లభ్యతను బట్టి యూరియా తీసుకోవచ్చు. పారదర్శకంగా, వేగంగా ఎరువుల పంపిణీ జరగనుంది. పైగా ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉందనే విషయాన్ని రైతులే యాప్ ద్వారా తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్, బుకింగ్ ఐడీ.. రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్, బుకింగ్ ఐడీ జనరేట్ అవుతుంది. ఎంపిక చేసుకున్న దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్ చూపింపి ఎరువులు పొందవచ్చు. అయితే స్వయంగా తీసుకుంటారా? లేదా కౌలు రైతు తీసుకుంటారా అనేది బుకింగ్ సమయంలో ఎవరైతే ఎరువులు తీసుకుంటారో వారి ఆధార్, సెల్ నంబర్ నమోదు చేస్తే ఆ పేరుతోనే క్యూఆర్కోడ్ జనరేట్ అవుతుంది. ఇందులో ఏమైన సందేహాలు ఉంటే స్థానిక ఏఓలు, ఏఈఓలను సంప్రదించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి పేర్కొన్నారు. జిల్లాలో పారదర్శకంగా పంపిణీకి ఏర్పాట్లు ఎరువుల నిల్వలపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం సాంకేతికతను అందిపుచ్చుకున్న వ్యవసాయ శాఖఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే..కొత్త విధానంలో రైతులు ఫార్మర్ రిజిస్టర్ నంబర్ లేదా ఆధార్ నంబర్తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయి ఎరువులు కొనుగోలు చేయాలి. రిజిస్ట్రర్ చేసుకున్న రైతుల భూ వివరాలు యాప్లో కనిపిస్తాయి. ఇంకా నమోదు చేసుకొని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సహకరించనున్నారు. యాప్ ద్వారా విక్రయాలు జరిగితే ఏ రైతు ఏ ఎరువు ఎంత కొనుగోలు చేశారన్న సమాచారం నమోదవుతుంది. డీలర్లు స్టాక్ లేదని సాకులు చేప్పే అవకాశం ఉండదు. బ్యాగుపై ప్రింట్ చేసిన ఎంఆర్పీ ధర (ముద్రిత) కంటే ఎక్కువకు విక్రయించడం, సాధారణ కంపెనీ ఎరువులు బ్రాండెడ్ పేరుతో విక్రయించడం వంటివి అరికట్టేందుకు ఈ విధానం దోహదపడుతోంది. ఒక్కో ఎకరానికి ఎంత ఎరువు వాడుతున్నారనే పర్యవేక్షణకు కూడా అవకాశం ఉంటుంది.పత్తి 1,20,044 వరి 69,272 మొక్కజొన్న 18,609 వేరుశనగ 833 సోయా 358 ఇతర పంటలు 15,609 రైతులు 1,54,674 ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 2,25,082లక్షలుపారదర్శకత కోసమే.. ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత తీసుకురావడం ఎఫ్ఎఫ్ఎస్ ప్రధాన ఉద్ధేశం. డీలర్ల వద్ద ఉన్న నిల్వల నుంచి రైతులకు పంపిణీ చేసే వరకు ప్రతీ దశను యాప్ ద్వారా పర్యవేక్షిస్తాం. రైతుల వివరాలు యాప్లో నమోదు చేసి ఎరువులు అందిస్తాం. అక్రమ నిల్వలు, పక్కదారి పట్టించడం, అధిక ధరలకు విక్రయించడం తదితర వాటికి అడ్డుకట్ట వేస్తాం. రైతులకు అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ఇందిరా డెయిరీ: రేవూరి
దామెర : పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ఇందిర మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఇందిర మహిళా డెయిరీ స్థలాన్ని ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెయిరీ కోసం కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా దామెర–ల్యాదెళ్ల ప్రధాన రహదారి నుంచి డెయిరీ ఏర్పాటు చేయనున్న స్థలం వరకు రోడ్డు నిర్మాణం చేయాలని, స్థలాన్ని చదునుచేసే పనులు వేగవంతం చేయాలని కోరారు. సొసైటీ మహిళల భాగస్వామ్యంతో డెయిరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆయన వెంట పీఆర్ డీఈ యుగేంధర్, ఏఈ బాబురావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, సదిరం పోశయ్య, శ్రీధర్రెడ్డి, అనిల్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, జక్కుల రవి, జంధ్యాల శ్రవణ్రెడ్డి, సర్పంచ్లు పంచగిరి రాజు, బొంకూరి రవియాదవ్, సొసైటీ చైర్పర్సన్ కచ్చకాయల అరుణ, ఇందిర, భిక్షపతి తదితరులు ఉన్నారు.వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. సద్వినియోగం చేసుకోవాలి.. హన్మకొండ అర్బన్: సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంతో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండలో శ్రీవీరభద్రస్వామిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కార్యనిర్వహణ అధికారి (ఈఓ) పి.కిషన్రావు, ప్రధాన అర్చకులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ ఎన్.రమణ పదవి కాలం ఆగస్టు 31న ముగిసింది. వారం రోజులు కావొస్తున్నా ప్రిన్సిపాల్గా కొనసాగింపునకు ఆయనకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రిన్సిపాల్గా రమణను కొనసాగిస్తారా లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ప్రిన్సిపాల్గా నియమించాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ప్రధానంగా కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సీహెచ్ రాధిక, కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎం.సదానందం, కిశోర్ కూడా ప్రిన్సిపాల్గా నియమించాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేయూ కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రమ కూడా తనను ప్రిన్సిపాల్గా నియమించాలని యూనివర్సిటీ అధికా రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్గా రమణను కొనసాగించాలా లేదా మరో ప్రొఫెసర్కు అవకాశం కల్పించాలా అనే సందిగ్ధంలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రొఫెసర్ రమణ మాత్రం ఇంజనీరింగ్ కళాశాలలో తన విధులు నిర్వర్తిస్తూనే తనను ప్రిన్సి పాల్గా కొనసాగించాలని కోరుతున్నారని సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్ ఎవరనేది ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చేవారు కరువు● హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు ● 3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ● ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్ఓలు మాత్రమే30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు. హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చి ంది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ హెచ్ఓల కొరత.. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారి పైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్ హెచ్ఓలు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. -
‘కుడా’ చైర్పర్సన్గా బాధ్యతల స్వీకరణ
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నయీంనగర్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా గుండు సుధారాణి శనివారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరుల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తానన్నారు. కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు. సీఎం రేవంత్రెడ్డి బీసీల పక్షపాతి: గుండు సుధారాణి -
పడిపోయినా.. ప్రాణంతోనే ఉన్నా!
నర్సంపేట: నేను చావలేదు... పడిపోయినా అంతే.. బతకాలని తపిస్తున్న.. ప్రకృతి ప్రేమికులారా నన్ను లేపి మరోచోటికి తరలించి పూర్తిస్థాయిలో సంరక్షించండి.. ఇది నర్సంపేట పట్టణ శివారులో నేలకొరిగిన ఓ మర్రి వృక్షం మౌన వేదన. ఏడాది క్రితం వీచిన భారీ గాలులకు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిన ఆ మహా వృక్షం అందరూ చనిపోయిందనుకున్నారు. కొమ్మలు విరిగి నేలను తాకుతూ వేర్లు తెగిపోయి కనిపించేలా పడి ఉంది. కానీ, ఆ ప్రకృతి ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోదు కదా. పడిపోయినా ప్రాణంతోనే ఆ చెట్టు తిరిగి చిగురించింది. వందేళ్ల వయస్సు.. ఈ మర్రి చెట్టు వయస్సు సుమారు వంద ఏళ్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గాలివానకు కూలిపోయాక చెట్టును తొలగించాలని కొందరు భావించారు. భారీగా ఉండడంతో సాధ్య పడలేదు. దీంతో లేత ఆకులతో చిగురిస్తూ తనను కాపాడమని వేడుకున్నట్లు ఉంది. బతకాలని తపిస్తూ.. ఇది కేవలం చెట్టు కాదు.. ఒక జీవ వైవిధ్య కేంద్రం. ఇలా నేలకొరిగిన చెట్టు చిగురించడమంటే బతకాలని ఎంతగా తపిస్తుందో అర్థమవుతోంది. అధికారులు జేసీబీతో తొలగించకుండా నిపుణుల సాయంతో మరో చోటికి తరలించి సంరక్షించాలని పర్యావరణవేత్తలు వేడుకుంటున్నారు. నన్ను నిలబెడితే మీకు నీడనిస్తా ఓ మర్రి వృక్షం మౌన వేదన -
– ములుగు
యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడ కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే ‘సాక్షి’ సండే స్పెషల్.. శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయ కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
– ములుగు
యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడి కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే ‘సాక్షి’ సండే స్పెషల్.. శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయుల కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
కౌన్సిల్కు కాంగ్రెస్ కౌన్సిలర్ల డుమ్మా
పరకాల: మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు కూడా కాలేదు.. అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. శనివారం పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు డమ్మా కొట్టడమే ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అభివృద్ధి పనుల విషయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్కు.. అధికార పార్టీలోని కొందరు కౌన్సిలర్లకు కొంతకాలంగా అభివృద్ధి పనుల విషయంలో వివాదం చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. పరకాలలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం.. కేటాయింపుల విషయంలో చైర్మన్ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ స్వయంగా కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి మొర పెట్టుకున్నట్లు సమాచారం. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చైర్మన్తో మాట్లాడతానన్న ఎమ్మెల్యే హామీతో సయోధ్యకు వచ్చినట్లు తెలిసింది. కానీ, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్కు గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరైనప్పటికీ.. అలిగిన కౌన్సిలర్లు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కౌన్సిలర్లలో వాటాల గొడవలు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాటాల గొడవలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పరకాలకు వచ్చినా పరకాల పట్టణాభివృద్ధికి పైసా నిధులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని, సీఎం రాక సందర్భంగా పరకాల మున్సిపాలిటీ తరఫున రూ.30 లక్షలు ఖర్చుపెట్టినట్లు చూపించారన్నారు. కానీ, పరకాలకు సీఎం వచ్చి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం.. పరకాల అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. పరకాలలో నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పరకాలలో ఇచ్చి జంక్షన్గా మార్చాలని, పరకాల మార్కెట్ను ఏ–1గా అభివృద్ధి చేయాలని, ఎడ్యుకేషన్ హాబ్గా మార్చాలంటే నర్సంపేట తరహాలో పరకాలకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని సూచనలు చేసినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కాగా, పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండే మున్సిపాలిటీ కౌన్సిల్కు అధికార పార్టీ కౌన్సిలర్లే గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో వినాయక చవితి ఏర్పాట్లు, శానిటేషన్ నిర్వహణ, కొత్త సీసీ రోడ్లు, రెవెన్యూ కలెక్షన్స్, నూతన డ్రెయినేజీల నిర్మాణం, పట్టణంలోని అమరధామంలో అమరవీరుల విగ్రహాలకు మరమ్మతులు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అంశంపై చర్చ జరిగింది. మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పవన్, వైస్ చైర్పర్సన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్మన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్ల నుంచి వ్యతిరేకత అభివృద్ధి పనుల విషయంలో వివాదమే కారణం! ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా కుదరని సయోధ్య -
ప్రజలకు సురక్షిత తాగునీరందించాలి
శాయంపేట: మండలంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సురక్షిత నీరందేలా చర్యలు తీసుకోవాలని హమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని జోగంపల్లిలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్ను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది? పంపుల పనితీరు క్లోరినేషన్, ఇన్ట్రా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, పంపింగ్ తీరును అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితమవుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన కలెక్టర్ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి వస్తున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వ్యర్థ జలాలు పంట పొలాలకు వెళ్లకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆమె వెంట మిషన్ భగీరథ ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రి, వాటర్ గ్రిడ్ ఈఈ సురేందర్, సాగు నీటిపారుదల శాఖ ఈఈ సునీత, ఇతర అధికారులు ఉన్నారు. ● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● జోగంపల్లి మిషన్ భగీరథ ప్లాంట్ పరిశీలన -
మెడిసిన్లో అక్షరకు సీటు
దుగ్గొండి: మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన దానం రఘు–శ్రీలత దంపతుల కూతురు అక్షర మెడిసిన్లో సీటు సాధించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 488 మార్కులు పొంది యాదాద్రి భవనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది. ఈమేరకు అక్షరను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు శనివారం అభినందించారు. ఇద్దరికి చూపును ప్రసాదించిన సిరివెన్నెలనల్లబెల్లి: మండల కేంద్రంలో ఓ బాలిక విద్యుదాఘాతంతో శుక్రవారం మృతి చెందింది. ఆమె కళ్లను దానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించారు కుటుంబ సభ్యులు. అవయవ దానంపై తరచుగా పలువురికి అవగాహన కల్పించే కుమార్తె నేత్రాలను దానం చేసిందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు వారు నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు ప్రతినిధులతోపాటు స్థానికులు అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానంకాళోజీ సెంటర్: జిల్లాలో జీఈసీఓ పోస్టు భర్తీ కోసం అర్హులైన మహిళా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మహిళా స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మహిళా స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 8వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పట్టా మార్పిడికి అంగీకరించని తల్లి● కొడుకు భూమి విక్రయిస్తే సంతకాలకు ససేమిరా ● అక్క, బావ అడ్డుకుంటున్నారని బాధితుడి ఆవేదన ● కిడ్నీలు పాడైనా న్యాయం కోసం సోదరి ఇంటి ఎదుట ఆందోళన ఖానాపురం: వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదంలో అక్క ఇంటి ఎదుట తమ్ముడు చావుబతుకుల మధ్య ఆందోళనకు దిగిన సంఘటన అశోక్నగర్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. అశోక్నగర్ గ్రామానికి చెందిన ఇరుకు సరోజన–వెంకటయ్య దంపతులకు కుమారుడు వీరారావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్ల వివాహాలు చేయగా 3.10 ఎకరాల భూమి తల్లి పేరిట ఉంది. వీరారావుకు వారసత్వంగా 2.34 ఎకరాల వ్యవసాయ భూమిని తల్లి సరోజన గత ఏప్రిల్లో రాసి ఇచ్చినప్పటికీ తల్లి పేరు మీదనే పట్టా ఉంది. ఈ క్రమంలో వీరారావుకు కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడై పోవడంతో డయాలసిస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన భూమిని నెల రోజుల క్రితం విక్రయించాడు. ఈ క్రమంలో విక్రయించిన స్థలానికి సంబంధిత పత్రాలపై, తహసీల్దార్ కార్యాలయంలో వేలి ముద్రలు వేయాల్సి ఉంది. పట్టా మార్పిడి కోసం తల్లి సంతకాలు చేయడానికి అంగీకరించడం లేదు. కాగా, విక్రయపత్రాలపై తల్లితో సంతకాలు అక్క, బావ పెట్టనీయడం లేదని అశోక్నగర్లోని అక్క ఇంటి ఎదుట మంచంపై చావు బతుకుల మధ్య వీరారావు, అతడి భార్య శనివారం న్యాయం కోసం పోరాటానికి దిగారు. అశోక్నగర్కు వచ్చిన ఎస్సై రామ్మోహన్ విషయం తెలుసుకుని సీఐ శంకర్రావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి వీరారావును వరంగల్ ఆస్పత్రికి తరలించారు. తల్లితో పాటు అక్కను పోలీస్ స్టేషన్కు పిలిపించి పట్టా చేయాలని సూచించారు. మిగిలిన 36 గుంటలను తన ఇష్టానుసారంగా విక్రయానికి అనుమతిస్తే సంతకం చేస్తానని తల్లి పోలీసులకు తెలిపింది. గడువులోగా రీసర్వే పూర్తిచేయాలిసంగెం: నిబంధనలకు అనుగుణంగా రీ సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సర్వే, లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. సంగెం మండలంలోని ముమ్మడివరం, గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలిలో రీసర్వే పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రీసర్వేను తప్పులు దొర్లకుండా నిర్వహించాలని సూచించారు. రీ సర్వే పనుల పురోగతి, సర్వే నిర్వహణ తీరును పరిశీలించి సంబంధిత సర్వేయర్లకు పలు సూచనలు చేశారు.


