breaking news
Warangal
-
విధులను సామాజిక బాధ్యతగా భావిస్తా
వరంగల్ లీగల్: మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగడంలో సమాజం, కుటుంబ ప్రభావం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చేందుకు గౌరవప్రదమైన ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ శనివారం ‘సాక్షితో’ మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. తల్లిదండ్రులు, భర్త ప్రేరణతోనే ఈ స్థాయికి.. జీవిత భాగస్వామి సహకారం.. మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. నేను ఈస్థాయికి రావడానికి ప్రేరణగా నిలిచిన నాన్న శ్రీనివాసాచారి, అమ్మ కస్తూరిబాయి, భర్త డాక్టర్ వినోద్కుమార్కు రుణపడి ఉంటా. పెరిగిన శాస్త్రసాంకేతికతతోపాటు మహిళలపై జరుగుతున్న హింస అనేక రూపాలుగా మారింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ లేని కారణంగా ఉమ్మ డి కుటుంబ వ్యవస్థ విధ్వంసమైంది. పరుగెడుతు న్న జీవన ప్రయాణంలో తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతోంది. న్యాయమూర్తిగా మహిళలు రాణించడం ఆనందంగా ఉంది.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అట్టడుగు స్థాయిన ఉన్న ప్రజలు, ప్రధానంగా మహిళలకు అందించడంలో న్యాయమూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాను. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్గా బాధిత యువతులకు పరిహారం ఇప్పించడం, వృద్ధులు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్కు ఆర్థిక చేయూతనందించడం మరిచిపోలేను. న్యాయమూర్తులుగా మహిళలు అధిక సంఖ్యలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. న్యాయమూర్తిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే తద్వారా గౌరవిస్తారు. 2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యా.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన అనంతరం తండ్రి ఆకాంక్ష మేరకు నెల్లూరులోని వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) పూర్తిచేశా. 1994 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశా. పంచాయతీరాజ్ శాఖ తరఫున గవర్నమెంట్ న్యాయవాదిగా, పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగాను. అనంతరం 2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికై ప్రస్తుతం వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్నా. నాన్న శ్రీనివాసాచారి ఆకాంక్ష.. అమ్మ కస్తూరిబాయి అండదండలు.. భర్త వినోద్కుమార్ సహకారం మరువలేనిది.. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ -
విధులను సామాజిక బాధ్యతగా భావిస్తా
వరంగల్ లీగల్: మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగడంలో సమాజం, కుటుంబ ప్రభావం ఉంటుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చేందుకు గౌరవప్రదమైన ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ శనివారం ‘సాక్షితో’ మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. తల్లిదండ్రులు, భర్త ప్రేరణతోనే ఈ స్థాయికి.. జీవిత భాగస్వామి సహకారం.. మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. నేను ఈస్థాయికి రావడానికి ప్రేరణగా నిలిచిన నాన్న శ్రీనివాసాచారి, అమ్మ కస్తూరిబాయి, భర్త డాక్టర్ వినోద్కుమార్కు రుణపడి ఉంటా. పెరిగిన శాస్త్రసాంకేతికతతోపాటు మహిళలపై జరుగుతున్న హింస అనేక రూపాలుగా మారింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ లేని కారణంగా ఉమ్మ డి కుటుంబ వ్యవస్థ విధ్వంసమైంది. పరుగెడుతు న్న జీవన ప్రయాణంలో తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతోంది. న్యాయమూర్తిగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అట్టడుగు స్థాయిన ఉన్న ప్రజలు, ప్రధానంగా మహిళలకు అందించడంలో న్యాయమూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాను. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్గా బాధిత యువతులకు పరిహారం ఇప్పించడం, వృద్ధులు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్కు ఆర్థిక చేయూతనందించడం మరిచిపోలేను. న్యాయమూర్తులుగా మహిళలు అధిక సంఖ్యలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. న్యాయమూర్తిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే తద్వారా గౌరవిస్తారు. 2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యా.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన అనంతరం తండ్రి ఆకాంక్ష మేరకు నెల్లూరులోని వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) పూర్తిచేశా. 1994 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశా. పంచాయతీరాజ్ శాఖ తరఫున గవర్నమెంట్ న్యాయవాదిగా, పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగాను. అనంతరం 2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికై ప్రస్తుతం వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్నా. నాన్న శ్రీనివాసాచారి ఆకాంక్ష.. అమ్మ కస్తూరిబాయి అండదండలు.. భర్త వినోద్కుమార్ సహకారం మరువలేనిది.. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీసీ) సమాజం8సీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం సీ) స్నేహితుల సూచన88డీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● మంత్రి కొండా సురేఖఖిలా వరంగల్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్హాల్లో శనివారం మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి మహిళలను సన్మానించారు. డిప్యూటీ కమిషనర్ ప్రపన్నరాణి, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్కుమార్, పోశాల పద్మ, గుండు చందన, ముష్కమల్ల అరుణ, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, నాయకులు మీసాల ప్రకాశ్, గోపాల నవీన్రాజు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శివనగర్లోని స్టేషన్రోడ్డుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్టేషన్రోడ్డుకు ఇరువైపులా మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి చెత్త తొలగించారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారి రతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారితో పాటు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని గుట్ట పైన ఆలయం నుంచి కిందకు తోడ్కొని వచ్చారు. పూజల అనంతరం విద్యుత్ దీపాలు, రంగుల కాగితాలతో సుందరంగా అలంకరించిన రథంలో దేవతామూర్తులను కుర్చుండబెట్టారు. ‘కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా’ అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ రథాన్ని గుట్టచుట్టూ తిప్పారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి పాల్గొన్నారు. -
అప్రమత్తతే ఆయుధం..
● పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ● సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ● పెరిగిన ఈవ్టీజింగ్ కేసులు.. ● నిందితులుగా స్నేహితులు, కుటుంబీకులు ● ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల ● రెండు నెలలు.. 80 వేధింపుల కేసులుమేయర్ అక్కడినుంచి నేరుగా రామన్నపేటలోని అంతర్గత కాలనీకి వెళ్లారు. అక్కడ ఎదురు చూస్తున్న కాలనీవాసులతో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని కొన్నింటిని నివృత్తి చేశారు. మరికొన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ : నల్లా నీళ్లు ఎలా వస్తున్నాయి. ఎలా ఉంటున్నాయి? సునీత గృహిణి: దినం విడిచి దినం వదులుతున్నారు. నీళ్లు పచ్చరంగులో వస్తున్నాయి. స్పందించిన మేయర్ ఇంజనీర్లను పంపించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మేయర్ : ఇంటింటా చెత్త సేకరిస్తున్నారా? రోజు పొద్దుగల్లా ఇంటికి స్వచ్ఛ ఆటోవస్తోంది, తడి, పొడిచెత్తను వేరు చేసి అందజేస్తున్నాం. మేయర్ : ఇంకేమైనా సమస్యలున్నాయా? వీధిలైట్లు వెలుగుతున్నాయి. కాల్వలు దెబ్బతిన్నాయి. కొత్తగా వేస్తే బాగుంటుంది. మేయర్ బదులిస్తూ మంజూరయ్యాయని, పనులు మొదలు పెడుతారని తెలిపారు. మేయర్ : ఏం పనిచేస్తారు? మౌనిక: నేను మహిళా సంఘం సభ్యురాలిని, గత మూడు నెలలుగా ఇంటింటా తడి, పొడిచెత్త వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. చాలామేరకు మార్పు వస్తోంది. సబ్బుల వ్యాపారంలో సమష్టిగా రాణింపు.. రూ.కోట్ల టర్నోవర్ ఓవెన్ బ్యాగ్ తయారీ వ్యాపారంలో రాణింపు ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్ -
ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలిని కలిసిన స్వర్ణ
వరంగల్: అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆల్కా లాంబాను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ శనివారం న్యూఢిల్లీలోని కార్యాలయంలో కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా లాంబా.. తెలంగాణలో మహిళా విభాగాన్ని పటిష్టం చేయాలని సూచించినట్లు స్వర్ణ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్జోన్ పరిధిలోని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరస్వామి దేవాలయంలో పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ పవన్కుమార్, ప్రధానార్చకుడు కృష్ణమూర్తికి అర్చక సంక్షేమ నిధినుంచి రూ.8లక్షలు మంజూరయ్యాయి. ఆ మంజూరు పత్రాలను శనివారం హనుమకొండలోని రాంనగర్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సునీత పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ ఐదవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం హనుమకొండలోని వివిద ఫార్మసీ కళాశాలల కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన 17 మంది విద్యార్థులను మాల్ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. నగరంలోని శివాని ఫార్మసీ కళాశాల కేంద్రంలో నలుగురు, వాగ్దేవిలో నలుగురు, సహస్ర కేంద్రంలో 9మందిని బుక్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా వరంగల్ ఎల్బీ కాలేజీ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు. -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీ8సీ) సమాజంసీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం 88సీ) స్నేహితుల సూచనడీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
అప్రమత్తతే ఆయుధం..
● పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ● సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ● పెరిగిన ఈవ్టీజింగ్ కేసులు.. ● నిందితులుగా స్నేహితులు, కుటుంబీకులు ● ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల ● రెండు నెలలు.. 80 వేధింపుల కేసులుమేయర్ అక్కడినుంచి నేరుగా రామన్నపేటలోని అంతర్గత కాలనీకి వెళ్లారు. అక్కడ ఎదురు చూస్తున్న కాలనీవాసులతో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని కొన్నింటిని నివృత్తి చేశారు. మరికొన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ : నల్లా నీళ్లు ఎలా వస్తున్నాయి. ఎలా ఉంటున్నాయి? సునీత గృహిణి: దినం విడిచి దినం వదులుతున్నారు. నీళ్లు పచ్చరంగులో వస్తున్నాయి. స్పందించిన మేయర్ ఇంజనీర్లను పంపించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మేయర్ : ఇంటింటా చెత్త సేకరిస్తున్నారా? రోజు పొద్దుగల్లా ఇంటికి స్వచ్ఛ ఆటోవస్తోంది, తడి, పొడిచెత్తను వేరు చేసి అందజేస్తున్నాం. మేయర్ : ఇంకేమైనా సమస్యలున్నాయా? వీధిలైట్లు వెలుగుతున్నాయి. కాల్వలు దెబ్బతిన్నాయి. కొత్తగా వేస్తే బాగుంటుంది. మేయర్ బదులిస్తూ మంజూరయ్యాయని, పనులు మొదలు పెడుతారని తెలిపారు. మేయర్ : ఏం పనిచేస్తారు? మౌనిక: నేను మహిళా సంఘం సభ్యురాలిని. మూడు నెలలుగా ఇంటింటా తడి, పొడిచెత్త వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. చాలామేరకు మార్పు వస్తోంది. సబ్బుల వ్యాపారంలో సమష్టిగా రాణింపు.. రూ.కోట్ల టర్నోవర్ ఓవెన్ బ్యాగ్ తయారీ వ్యాపారంలో రాణింపు ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్ -
ఆ దంపతుల నిరీక్షణ
పిల్లల దత్తత కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపులుసాక్షి, వరంగల్: పిల్లల దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా వరంగల్ జిల్లా బాలరక్షా భవన్లోని ముగ్గురు సిబ్బందిదేనని తేలడంతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న దంపతులకు పిల్లల అప్పగింత లైన్క్లియర్ అయినట్లేనా.. లేక కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) నిబంధనలు ఏమైనా అడ్డంకిగా మారుతాయా అన్న చర్చ జరుగుతోంది. అయితే, దత్తతకు సంబంధించిన కేసులో జరిగిన పరిణామాలను వివరిస్తూ కారాకు సమగ్ర నివేదిక పంపడం ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. తొలుత వీరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, ఆ తర్వాత విచారణ క్రమంలో వెలుగుచూసిన వాస్తవాలతో అయినా జిల్లా సంక్షేమ విభాగం ఆధ్వర్యంలోని బాలరక్షా భవన్ దత్తత విభాగాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతర విభాగం ఉద్యోగికి బాధ్యతలు గతేడాది జిల్లా బాలరక్షా భవన్లో సిబ్బందిని పూర్తిస్థాయిలో రెన్యూవల్ చేయకపోవడం, దత్తత అంశంపై పూర్తిస్థాయిలో పట్టున్న అధికారులు లేకపోవడం, ఆ బాధ్యతలను ఇతర విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి అప్పగించగా.. సదరు ఉద్యోగి చూసీచూడనట్టు వ్యవహరించడంతో పిల్లలు కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బాలసముద్రంలోని బాలరక్షా భవన్కు దంపతులు వచ్చి పిల్లలు ఎప్పుడూ వస్తారని వాకబు చేస్తుండగా, త్వరలోనే మీ సమస్య తీరుతుందంటూ అధికారులు చెప్పి పంపిస్తున్నారు. అయితే, ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సర్టిఫికెట్ల కేసులో బాధితులుగా ఉన్న దత్తత కోరే దంపతుల్లో ఇద్దరి దరఖాస్తులు రిజెక్ట్ కాగా, ఒకరిది అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని, మరో ఇద్దరిది రీవ్యాలిడేషన్.. ప్యాప్స్ వద్ద పెండింగ్లో ఉందని, మరొకరు సీనియారిటీ లిస్ట్లో ఉన్నారు. ఈ విషయాలపై సదరు అధికారులకు అవగాహన లేకపోవడమే పిల్లలను దత్తత కోరే దంపతులకు శాపంగా మారింది. ఇప్పటికే గత మూడు నుంచి ఐదేళ్లుగా పిల్లల కోసం వేచి చూస్తూ సీనియార్టీ లిస్టులో ఉన్న వారికి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇంత జరిగినా రీవ్యాలిడేషన్లో నిర్లక్ష్యమే.. బాలల న్యాయ చట్టం –2015 ప్రకారం కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కారా ద్వారా బాలలను దత్తత తీసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.నిక్.ఇన్ అందుబాటులోకి వచ్చింది. దంపతుల వయస్సును బట్టి అర్హత గల శిశువులను దత్తత ఇస్తారు. శిశువుల దత్తత కోసం దంపతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి గృహ సందర్శన (హోం స్టడీ) చేసి నివేదికను సిద్ధం తయారు చేసి కారా వెబ్సైట్లో అధికారులు నిక్షిప్తం చేస్తారు. ఆ నివేదికకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఆలోపు శిశువును దత్తత తీసుకోకుంటే మళ్లీ మూడేళ్ల అనంతరం వారికిచ్చే లాగిన్ ఐడీ ద్వారా గృహ సందర్శన నివేదికను రెన్యూవల్ చేయాలి. ఒకవేళ ఎవరైనా దంపతుల వ్యాలిడేషన్ అయిపోయినా కూడా వారికి సమాచారం ఇచ్చి ఫాలోఅప్ చేయాలి. 60 రోజుల్లో నివేదికను తయారుచేసి వెబ్సైటలో అప్లోడ్ చేయాలి. కానీ, అందుకు భిన్నంగా జిల్లా బాలల సంరక్షణ దత్తత సెక్షన్ అధికారి.. రీవ్యాలిడేషన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. వాటితో పాటు రిజెక్ట్ అయిన ఇద్దరిది, అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని మరొకరు సీనియర్ లిస్ట్లోకి రావాలంటే కారాకు సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాలి. దీన్ని ఫాలోఅప్ చేయాల్సిన అధికారులు అంటిముట్టనట్టు వ్యవహరించడంతో ఇంకా ఆలస్యం అవుతోంది. వరంగల్ జిల్లా బాలరక్షా భవన్లో దుస్థితి ఇప్పటికే రెండు దరఖాస్తులు రిజెక్ట్, మరో అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని స్టేటస్ దత్తత రీవ్యాలిడేషన్కు మరో రెండు దరఖాస్తులు నకిలీ సర్టిఫికెట్ల కేసును ‘కారా’కు నివేదిస్తేనే తిరస్కరించినవి మళ్లీ సీనియార్టీలోకి.. ఖానాపూర్ మండలం అశోక్నగర్కు చెందిన సల్లూరి నర్సయ్య, ఆయన భార్య పైరి రుక్మ.. 2022 మార్చి మూడో తేదీన శిశువు దత్తత కోసం జిల్లా బాలరక్షా భవన్ అధికారులను సంప్రదించి కారాలో దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత 2025 ఏప్రిల్ 19వ తేదీన అప్లికేషన్ క్యాన్సల్ రెక్విస్ట్ అని కారా వెబ్సైట్లో దర్శనమిచ్చింది. నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన చెంచు మహిపాల్, సంధ్యారాణి దంపతులు.. 2022 సెప్టెంబర్ 13వ తేదీన కారా వెబ్సైట్లో పిల్లల కోసం దరఖాస్తు చేశారు. దాదాపు మూడేళ్లకుపైగా వారికి సీనియారిటీ ఉన్నా వారి దరఖాస్తు ఇటీవల రిజెక్ట్ కావడం గమనార్హం. నర్సంపేటలోని శాంతినగర్ వాసి, ఒంటరి మహిళ అయిన నిమ్మనబోయిన అరుణ 2019 మార్చి ఆరో తేదీన దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు కూడా రిజెక్ట్ అయింది. నెక్కొండ మండలం గొల్లపల్లికి చెందిన ముక్కల లస్మయ్య, చిన్న కేతమ్మ.. శిశువు దత్తత కోసం 2022 అక్టోబర్ 15వ తేదీన జిల్లా దత్తత అధికారిని సంప్రదించారు. అధికారి సూచనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే మూడేళ్లకు కాలపరిమితి ముగియడంతో రీవ్యాలిడేషన్ చేయాలని, పెండింగ్లో ఉన్నట్టుగా దరఖాస్తు స్టేటస్ కనిపిస్తోంది. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన గుండు సుధాకర్, సుమతి దంపతులు 2021 డిసెంబర్ 15న దరఖాస్తు చేసుకున్నారు. వారి కాలపరిమితి ముగియడంతో ఇంకా రీవ్యాలిడేషన్ ప్యాప్స్ స్థాయిలోనే పెండింగ్లో ఉన్నట్టుగా ఆన్లైన్లో కనబడుతోంది. -
సర్పంచ్లతో మంత్రి సురేఖ మాటామంతి
గీసుకొండ: రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో మండలానికి చెందిన పలువురు సర్పంచ్లు భేటీ అయ్యారు. మండలంలోని ఓ గార్డెన్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆమెను పలువురు సర్పంచ్లు శుక్రవారం కలిసి తమ పరిస్థితులను వివరించారు. రాంపురం సర్పంచ్, కొండా వర్గం నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో సర్పంచ్లు, మహిళా సర్పంచ్ల భర్తలు కొమ్ముల కమల భిక్షపతి, బానోతు రాఘవేంద్ర, కన్నెబోయిన యమున, కేలోతు అమృత భిక్షపతి, పేర్ల శ్రవణ్.. మంత్రికి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. గ్రామాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు రడం భరత్ తెలిపారు. 103 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు కాళోజీ సెంటర్: శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్స్లో మొత్తం 3,647 మంది విద్యార్థులకు 3,579 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 765 మందికి 730 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వివరించారు. హనుమకొండ జిల్లాలో 307మంది.. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయ్యారు. జిల్లాలో మొత్తం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,163 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 307 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. కమలాపూర్ మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు ఆయన తెలిపారు. ఈ ఆచార్యుడు ఆదర్శం ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. వేయిస్తంభాల గుడిలో సంకటహరచతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం దేవాలయంలోని ఉత్తిష్టగణపతికి అభిషేకాలు నిర్వహించారు. ‘గోల్’ సాధించారు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన జిల్లా అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులతో కల సాకారం చేసుకున్న యువకులు -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
● వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి ● బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ● ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ● ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ● ప్రజాపాలన–పల్లె ప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ.. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● మార్కెట్ చైర్మన్లు శ్రీనివాస్, హరీశ్రెడ్డి ● నర్సంపేట నియోజకవర్గానికి రూ.95 లక్షల యంత్ర పరికరాలునెక్కొండ: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, రావుల హరీశ్రెడ్డి అన్నారు. నెక్కొండ రైతు వేదిక ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో ‘వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ’ (ఆత్మ)లో భాగంగా రైతులకు యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలు, 11 చాళ్ల నాగళ్లు వంటి 86 వివిధ వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు వివరించారు. 86 మంది రైతులకు రూ.16.50 లక్షల విలువైన యంత్ర పరికరాలను అందించినట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో రూ.95 లక్షల విలువైన యంత్ర పరికరాల మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృషి చేశారని కొనియాడారు. ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ సబ్సిడీ ద్వారా పొందిన యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, నెక్కొండ మేజర్ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, వివిధ మండలాల ఏఓలు, ఈఓలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
ఏఐతో ఆర్థిక వ్యవస్థలో మార్పు
హసన్పర్తి: కృత్రిమ మేధస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చేస్తోందని ఎస్ఆర్ వర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ అస్ట్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘స్ట్రాటజీ అనలిటిక్స్ టెక్నాలజీ అండ్ కల్చర్’ (ఎస్ఏటీటీ) అంశంపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కోడింగ్ చేయడంతో అనేక పనులను ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. మానవ సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ అవగాహన వంటి అంశాలు సంస్థల అభివృద్ధికి కీలకమన్నారు. ఆరిఫ్టి టెక్నాలజీ సీహెచ్ఆర్ఓ రాంచందర్ మాట్లాడుతూ సంస్థలు పోటీల్లో నిలవాలంటే వ్యూహం, అనలిటిక్స్, టెక్నాలజీ, సంస్థ సంస్కృతి, సమన్వయం కావాలన్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగం పరిపాలనా పనులకు మాత్రమే పరిమితం కాకుండా సంస్థ మార్పులకు దారితీసే వ్యూహాత్మక విభాగంగా మారుతోందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగం డీన్ డాక్టర్ గురునాథం, డాక్టర్ ఎం.రాజ్యలక్ష్మి, డాక్టర్ అర్చనారెడ్డి, రమేశ్బాబు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పూల్ను పునఃప్రారంభించండి
వరంగల్ స్పోర్ట్స్: ఈత సాధన చేసే విద్యార్థులు, యువతకు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి, వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీన పునఃప్రారంబించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చాహత్ వెంట డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, డీఎస్ఏ కోచ్లు రాయబారపు నవీన్, శ్రీమన్నారాయణ, రాజారపు రమేశ్, టీజీఐఐసీ అధికారులు ఉన్నారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్ స్విమ్మింగ్పూల్ అభివృద్ధి పనుల పరిశీలన -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి.. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనా యక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
టోల్గేట్ కోసం 3డీ మ్యాపింగ్
కొత్తగట్టు సింగారంలో అడ్డుకున్న రైతులు శాయంపేట: కొత్తగట్టు సింగారం గ్రామ శివారులో టోల్గేట్ నిర్మాణ పనులకు శుక్రవారం పరకాల ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, నేషనల్ హైవే అథారిటీ డీఈలు.. శాయంపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, దామెర ఎస్సై అశోక్ బందోబస్తు మధ్య 3డీ మ్యాపింగ్ చేశారు. దీంతో బాధిత రైతులు అడ్డుకున్నారు. ఇది కేవలం 3డీ మ్యాపింగ్ మాత్రమేనని, ప్రభుత్వానికి పంపించాల్సిన సిఫార్సులు అని, ఫైనల్ కాదని రైతుల ఆమోదం తెలిపిన తర్వాతే భూములను తీసుకుంటామని అధికారులు తెలపడంతో రైతులు సర్వేకు సహకరించారు. ఈ సందర్భంగా నాయకులు పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి, మారెపల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరుగకుండా ప్రభుత్వ భూమి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడ టోల్గేట్ నిర్మాణం చేపడితే రైతులు నష్టపోరని, 100 మీటర్లలోనే నిర్మాణం చేపడితే రైతులు కూడా సహకరిస్తారని తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి పేద రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాడ రాఘవరెడ్డి, నోముల సుదర్శన్, రాధిక, రజిత, మహేందర్, సాగర్, రాణి, మమత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఐనవోలు: రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా.. ఆరోగ్య శాఖ సూచనల మేరకు స్పెషలిస్టులతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను స్పెషలిస్ట్ వైద్యులకు తెలిపి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఐనవోలు పీహెచ్సీ పరిధిలో ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ–1164, షుగర్–264, క్యాన్సర్–23 మంది వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ఆరుగురు ఎంజీఎం ఆస్పత్రి స్పెషలిస్టు వైద్యులతో శిబిరం ప్రారంభించామన్నారు. ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల రక్త పరీక్షలు చేసి హెల్త్కార్డులు ఇవ్వడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ వైద్యులు, సరిత, నవీన్, మెడికల్ ఆఫీసర్ శ్యాం ప్రసాద్, ఎంపీడీఓ నర్మద, సర్పంచ్ గడ్డం రఘువంశీ, ఉప సర్పంచ్ భాస్కర్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
కోర్టులో మహిళా దినోత్సవం
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ, హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని, హక్కుల సాధించుకోవాలి తప్ప అడుక్కోవద్దని సూచించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలకుపైగా వృత్తిలో కొనసాగుతున్న పలువురు మహిళా న్యాయవాదులను శాలువాలతో సత్కరించారు. ఏసీబీ కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, మహిళా కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శం.. ఈ ఆచార్యుడు
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఎంజీఎం: మహిళలు సవాళ్లను అధిగమించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని సీనియర్ డాక్టర్లు కూరపాటి రాధిక, రమేశ్ పిలుపునిచ్చారు. వరంగల్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు సంకల్పం, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తాటి సునీత, ఫ్యాకల్టీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వైద్య నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో ఈనెల 6వ తేదీ నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే శిబిరాల్లో ఎంజీఎం ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి నుంచి సీ్త్ర వైద్యులు, పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలందిస్తారని పేర్కొన్నారు. మరింత ఉన్నతమైన సేవల కోసం రెఫర్ చేసిన వారిని ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఫాలోఅప్ సేవలు అందిస్తారని చెప్పారు. 14 ఏళ్ల బాలికలకు ఈనెల 8 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
కేయూలో అధ్యాపకులేరి?
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో ఏళ్ల తరబడి అధ్యాపకుల కొరత తీరట్లేదు. రోజురోజుకూ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సమస్య తీవ్రమవుతోంది. యూనివర్సిటీలో 13 ఏళ్లుగా రెగ్యులర్, టీచింగ్ పోస్టుల నియామకాలు జరగలేదు. ఫలితంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. ఒక్కసారి అధ్యాపకుల గణాంకాలను పరిశీలిస్తే మంజూరైన పోస్టుల్లో కేవలం 18.82 శాతం మందితోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నియామకాల జాప్యం.. విఫలమవుతున్న ప్రయత్నాలు కాకతీయ యూనివర్సిటీలో మంజూరైన మొత్తం రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు 409 కాగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కలిపి 77 మందే పనిచేస్తున్నారు. 2013 నుంచి నేటివరకు ఒక్క రెగ్యులర్ నియామకం జరగలేదు. పదేళ్లుగా ఉద్యోగ విరమణలు పెరుగుతున్నా, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయి. 2017లో ఒకసారి అప్పటి పాలకవర్గం హయాంలో 136 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందే ప్రయత్నం జరిగినప్పటికీ, ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. 47 రకాల కోర్సులు, రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, కామర్స్, ఫార్మసీ, లా వంటి కీలక విభాగాలు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ప్రభుత్వ ఉదాసీ నతతో నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగడమే కాకుండా, వర్సిటీ పరిశోధనా రంగం కుంటుపడుతోంది. రెగ్యులర్ సిబ్బంది తగినంత లేకఅధి కంగా అకడమిక్ కన్సల్టెంట్లు (కాంట్రాక్టు అధ్యాపకులు), పార్ట్టైం టీచర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా భర్తీ చేస్తారా? యూనివర్సిటీలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2,994 మంజూరైన పోస్టులు ఉండగా, ప్రస్తుతం 763 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో 1,174 మంది కాంట్రాక్టు పద్ధతిలో, 544 మంది పార్ట్టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా, సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నియామకాల కోసం ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెబుతుండగా.. ఇందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో 250 పోస్టులు, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులను భర్తీ చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. వీటితోపాటు పాలమూరు, శాతవాహన వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్ని పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. దీంతో ఈసారైనా కేయూలో ఉన్న ఖాళీలు భర్తీ అవుతాయా? అనే చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో పోస్టులు ఖాళీ.. 2017 నుంచి ఇదే పరిస్థితిప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత తీరేదెప్పుడు పది విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి అకడమిక్ కన్సల్టెంట్లపైనే ఆధారం.. పరిశోధనలపై తీవ్ర ప్రభావం తాజాగా 13 వర్సిటీలకు 500 పోస్టుల ప్రకటన ఈసారైనా ఖాళీలు భర్తీ అయ్యేనా? -
కాంట్రిబ్యూషన్ ఒక శాతానికి పరిమితం చేయాలి
● ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీతారాంహన్మకొండ: ఈహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ ఒక శాతానికే పరిమితం చేయాలని, ఒక శాతానికి మించితే ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటాలు చేస్తామని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం అన్నారు. గురువారం హనుమకొండ స్నేహనగర్లో అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూపురాణి సీతారాం మాట్లాడుతూ.. తమ అసోసియేషన్ మొదటి నుంచి కాంట్రిబ్యూషన్ను వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజల, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పెన్షనర్లు, ఉద్యోగులు ప్రజలలో భాగమని, ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకం ద్వారా పెన్షనర్లకు, ఉద్యోగులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న, అసోసియేషన్ నాయకులు జె.ప్రభాకర్రెడ్డి, బేతి శంకర్ లింగం, ఆర్తి సంపత్ కుమార్, పరికిపండ్ల వేణు, దేవులపల్లి ఎర్రగట్టు స్వామి, కుడికాల సదానందం, పోశాల కుమారస్వామి, కాంతాల లక్ష్మారెడ్డి, మెంచు వెంకన్న, గజవెల్లి పద్మకుమారి, కాట్రపెల్లి వేణుగోపాల్, కన్నోజు దేవేంద్రాచారి, కందికొండ సదానందం, ఆకుతోట మహేందర్, రహమాన్, దాసరి సుమతి, కొత్త కనకయ్య, కానుగంటి సుభాశ్ పాల్గొన్నారు. -
న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈసందర్భంగా సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, ఆయా గ్రామాల్లో ప్రజల జీవన శైలి, పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్లు, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్నవి, నిందితుల అరెస్ట్ కు సంబంధించి రికార్డులను సీపీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని, ముఖ్యంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని సీపీ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డితో పాటు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు మహబూబాబాద్లో ఉమ్మడి జిల్లా సమావేశం
● ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై సమీక్ష సాక్షి, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం మహబూబాబాద్లో ఉమ్మడి జిల్లా అధికారుల సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు, ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వందరోజుల ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాన్ని కింది స్థాయి అధికారులకు చేరవేయడం, ఇందులోని ముఖ్యాంశాలను నేడు జరిగే సమావేశంలో వివరించనున్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీ హసన్పర్తి: హసన్పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, భీమారంలోని శ్రీసాయి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ కిరణ్కుమార్, తదితరులున్నారు. ఇంటర్లో 441 మంది గైర్హాజరు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 52 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 18,198 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. 17,757 మంది (98శాతం) విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. నేడు బహిరంగ విచారణహన్మకొండ: విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బహిరంగ విచారణకు ఏర్పాట్లు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్లో ఈ విచారణ చేపట్టనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సీహెచ్.శ్రీనివాస్రావు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని కోరారు. పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులుసాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలాగోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొచ్చని భావించి ఆ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువకు కొంటున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పె ట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లే దు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అ ప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక రైతుల ఆందోళనఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 జిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500 -
‘ప్రజాపాలన’పై నివేదిక సిద్ధం చేయండి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై స్పష్టమైన సమాచారం సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై 99 రోజుల ప్రగతిని సమగ్రంగా నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నక్కలపల్లిలో పర్యటన ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం రన్వే విస్తరణలో భాగంగా నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ఇక్బాల్, సర్వే అధికారులతో కలిసి కలెక్టర్ సత్యశారద గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను కలెక్టర్ పరిశీలించారు. -
అసౌకర్యాల గురుకులం
● పాములు, కుక్కల బెడద ● ఇప్పటికే ముగ్గురు విద్యార్థులపై ఎలుకల దాడి ● భయాందోళనలో విద్యార్థినులుహసన్పర్తి: హసన్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ బాలిక గురుకుల విద్యాలయం అసౌకర్యాల మధ్య కొనసాగుతోంది. 45 ఏళ్ల క్రితం గురుకుల పాఠశాల భవనాలు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త గదులు నిర్మించాలని పేరెంట్స్ నుంచి డిమాండ్ వ్యక్తమైంది. జిల్లా ఉన్నతాఽధికారులు, ప్రజాప్రతినిధులు సైతం గురుకులాన్ని సందర్శించిననప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాలు కురిస్తే.. పాఠశాల గదులు శిథిలావస్థకు చేరి పైపెచ్చులు ఊ డుతున్నాయి. భారీవర్షాలు కురిస్తే చాలు పాఠశాల కు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అధికారులు సందర్శించి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిటీకీలకు మెష్ డో ర్లు లేక దోమల బెడద తీవ్రతరమైంది. కొన్ని కిటికీలకు తలుపులే లేవని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలోకి వెళ్లడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదని, పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉంటోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. భయం.. భయంగా గురుకులంలో విషసర్పాలు పాఠశాల ఆవరణలో సంచరిస్తుండడంతో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పాముల పట్టే వ్యక్తి వచ్చి పామును తీసుకెళ్లినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మరో వైపు గురుకుల ఆవరణలో కుక్కల బెడద కూడా అధికమైంది. చర్మ వ్యాధులతో బాధపడుతున్న కుక్కలు పాఠశాలల ఆవరణలో సంచరిస్తున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు. కాగా, బుధవారం రాత్రి ఎలుకలు దాడి చేసి గాయపరచడంపై విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. -
అన్ని రంగాల్లో మహిళల ప్రతిభ
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● మహిళా గెజిటెడ్ అధికారులకు క్రీడా, సాంస్కృతిక పోటీలుహన్మకొండ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని, వారి ప్రతిభను ప్రోత్సహించే వేదికలుగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని టీజీఓ భవనన్లో మహిళా గెజిటెడ్ అధికారులకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో మహిళా అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఆకవరం శ్రీనివాస్కుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, కార్యదర్శి పీఎస్ ఫణికుమార్, సంజీవరెడ్డి, రాజేశ్కుమార్, మాధవరెడ్డి,. మహిళా వి భాగం ప్రతినిధులు మాధవి, భాగ్యలక్ష్మి, కృష్ణవేణి, శ్రీప్రియ, పవిత్ర, మాలతి, హేమలత పాల్గొన్నారు. -
సాగులో డ్రోన్లు వినియోగించుకోవాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● ఐనవోలు ఆలయ సందర్శన, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల తనిఖీఐనవోలు: ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు ఉపయుక్తమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నాబార్డు పథకం ద్వారా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధీనంలో నందనం ఎఫ్ఎస్సీఎస్ సొసైటీకి డ్రోన్ మంజూరు కాగా, ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం సొసైటీకి అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట, నెల్లికుదురు పీఏసీఎస్లకు అందించే మూడు డ్రోన్లకు సంబంధించిన వివరాలు వ్యోమిక్ డ్రోన్స్ సంస్ధ ప్రతినిధులు హనుమ, జగదీశ్ కలెక్టర్ తెలియజేశారు. అనంతరం పైలెట్ సూచనలతో కొద్దిసేపు డ్రోన్ను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి స్వయంగా పరీక్షించారు. వ్యవసాయ శాఖ సబ్సిడీపై మంజూరైన బేలర్, రోటావేటర్, కల్టివేటర్లను రైతులకు అందించారు. అనంతరం నందనం సొసైటీ ద్వారా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్ను సందర్శించి నిర్వహణ బాగుందని ఇలాగే కొనసాగించాలన్నారు. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మద్దతు ధర లభించడం లేదని పలువురు రైతులు మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సర్వేనంబర్ 29 ప్రభుత్వ భూమి, 518, 519 సర్వేనంబర్లలో నిరుపయోగంగా ఉన్న భూమిలో రియల్ఎస్టేట్ దందా జరుగుతుందని అక్రమ నిర్మాణాలు తొలగించాలని పలువురు గ్రామస్తులు, రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఐనవోలు ఆలయంలో కోతుల బెడద అధికంగా ఉందని కోతులను అడవులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రఘువంశీ నేతృత్వంలో పలువురు గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నాబార్ట్ జిల్లా అభివృద్ధి అధికారులు చంద్రశేఖర్, చైతన్య హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీఓలు సంజీవరెడ్డి, నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, సహకార శాఖ ఏరియా అధికారి జగన్మోహన్రావు, ఏఓ సునీల్కుమార్, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ కుమారస్వామి, సర్పంచ్లు రఘువంశీ, స్రవంతి, సొసైటీ సీఈఓ సంపత్లు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయ ప్రాంగణంలో ‘కుడా’ నిధులతో చేపట్టిన డార్మెటరీ హాల్ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆలయ సూపరింటెండెంట్ కిరణ్కుమార్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయాల తనిఖీ తహసీల్, మండల పరిషత్ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రికార్డు గదిని పరిశీలించి భూ భారతి దరఖాస్తులు, సాదాబైనామ వివరాలను తహసీల్థార్ విక్రమ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న వెంచర్పై ఫిర్యాదులు రాగా, సర్వేయర్ సూరజ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును ఎంపీడీఓ నర్మదను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని తాత్కాలికంగా అదనపు గదులు కావాలని కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. -
రైతులను ఆదుకోవాలి..
టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి దళారులు ఇబ్బంది పెడుతున్నారు..మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
ఎస్సీ బాలుర హాస్టల్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి 10.30 గంటలకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. బియ్యం, కూరగాయలు, బియ్యం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. హాస్టల్లో సౌకర్యాలు, మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ సమయానికి, సరైన ప్రమాణాలతో అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రత్యేక ట్యూటర్ను నియమించి అదనపు పాఠాలు బోధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తనిఖీల్లో జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమాధికారి పుష్పలత, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు విద్యార్థుల డీబార్
ఖానాపురం: ఇంటర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ రవికుమార్ బుధవారం తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. 148 మందికి 145 విద్యార్థులు హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సదానందం, ప్రకాశ్రాజ్ సెంటర్లో తనిఖీ చేసి ముగ్గురు విద్యార్థుల వద్ద చిట్టీలు ఉన్నట్లు గుర్తించారు. చిట్టీలను బయటకు తీసి మాల్ప్రాక్టీస్ చేస్తున్నట్లు రాసి సెంటర్ అధికారులకు అప్పగించినట్లు రవికుమార్ తెలిపారు. ఇద్దరు విద్యార్థులు మోడల్ స్కూల్, ఒకరు స్థానిక కళాశాలకు చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థుల మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి జవాబుపత్రాలను ఇంటర్ ప్రత్యేక బోర్డుకు పంపనున్నట్లు తెలిసింది. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం నుంచి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నట్లు బుధవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,149 మంది విద్యార్థులకు 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల ప్రిన్సిపాల్గా జ్యోతి పదవీకాలాన్ని మరో సంవత్సరం కొనసాగిస్తూ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్గా జ్యోతి పదవీకాలం రెండేళ్లు పూర్తయ్యింది. సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న జ్యోతిని మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ యూనివర్సిటీలో జ్యోతికి అందజేశారు. -
వరంగల్
ఆరోగ్యంతోనే మహిళా సాధికారత ఆరోగ్యంతోనే మహిళా సాధికారత మొదలవుతుందని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ అన్నారు. వాతావరణం జిల్లాలో ఉదయం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 20267 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ఈనెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న నిర్వహించనున్న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా ప్రతీ విద్యుత్ ఉద్యోగి, సిబ్బంది కృషి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు.జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కు కార్యాచరణ
న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన 10 ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిశీలన అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆద్వర్యంలో అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు, ఏప్రిల్ 20 నుంచి 25 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరుపై సమీక్షించి, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్పై అవగాహన సదస్సులు, మే 4 నుంచి 9 వరకు రైతు సదస్సులు, మే 11 నుంచి 16 వరకు పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతపై కార్యక్రమాలు, మే 18 నుంచి 23 వరకు యువత–క్రీడాంశాలు, మే 25 నుంచి 30 వరకు మహిళా సాధికారత, రుణాల సద్వినియోగంపై కార్యక్రమాలు, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణం అంశంపై కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను రోజువారి ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. ప్రతిస్థాయిలో నోడల్ అధికారులను నియమించి రోజువారి పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బయోడేటా..
పేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: రత్నమ్మ, కృష్ణారెడ్డి భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు -
కాశిబుగ్గలో రంగుమారిన నీరు
కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ అస్తవ్యస్తంగా మారి తాగునీరు శుభ్రంగా లేకపోవడంతో తాగాలంటే భయమవుతోందని చెబుతున్నారు. అసలే వేసవికాలం.. ఇలాంటి నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడితే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రంగునీళ్లు సరఫరా జరిగిన సమయంలో మేయర్, అధికారులు సంబంధిత ఫిల్టర్ బెడ్ను సందర్శించి పరిశీలించారు. తర్వాత శుభ్రమైన నీటిని అందించారు. ప్రస్తుతం వారు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. కొండా సుస్మిత సంచలన ప్రకటన
సాక్షి, వరంగల్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు సుష్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు వచ్చారు. జాతర వేదికగా కొండా సుస్మితా మాట్లాడుతూ..‘నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైంది. నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. మీరంతా బాధల్లో ఉన్నారని నాకు అర్థం అవుతోంది. పరకాలలో ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా.. లేకపోతే మరోలా ఉండేది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల పాటు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చందమామ పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
దశాబ్దకాలం లేట్!
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడోలైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్కు మోక్షం కలగడం లేదు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. పదేళ్లయినా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది. గూడ్స్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు 44.624 కిలోమీటర్లు అసంపూర్తిగా పనులు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
నిట్తో ఎన్ఐజీస్టీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో ఎన్ఐజీఐఎస్టీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్ఐజీఎస్టీ డైరెక్టర్, సీనియర్ అధికారి బీసీ ఫరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహాసంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రా రంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
మది నిండుగా..
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026రంగుల పండుగ..సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ నిట్ వరంగల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జూనియర్స్, సీనియర్స్ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా పరిధిలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, యువతీయువకులు పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా రంగుల వేడుకల్లో మునిగితేలారు. రంగులు పూసుకుని నృత్యాలు చేశారు. నగరంలో పలుచోట్ల హోలీ ఈవెంట్లు నిర్వహించారు. డీజే పాటలతో హోరెత్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ను అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. – సాక్షి నెట్వర్క్ -
నరహరి.. లొంగిపోయి ఇంటికిరా..
కాజీపేట: కాజీపేట మండలం సోమిడి గ్రామ వాస్తవ్యుడు, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగిపోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగుతున్న ఆయన రాక కోసం నలుగురు అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్ట్ రీజినల్ బ్యూరో వింగ్లో (టెక్నికల్) బాధ్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలో కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుండడంతో అనేక మంది కీలక నాయకులు లొంగిపోతున్నారు. మరికొంత మందిని పారా మిలటరీ బలగాలు ఎన్కౌంటర్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరిపై నేడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి క్షేమంగా ఇంటికి రావాలని నలుగురు తోబుట్టువులు, స్నేహితులు వేడుకుంటున్నారు. డిగ్రీ చదువుతూ.. ఉద్యమం వైపు అడుగులు సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి 1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టాడు. 1981లో అడవిలోకి వెళ్లిన నరహరి.. తల్లిదండ్రులతో పాటు ఎవరూ చనిపోయిన ఇంటి ముఖం చూడలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి సోమిడికి చేరుకోవాలని నలుగురు సోదరులు కోరుతున్నారు. వేడుకుంటున్న సోదరులు, కుటుంబ సభ్యులు 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సోమిడి వాసి జార్ఖండ్ టెక్నికల్ వింగ్లో బాధ్యతలు -
రైల్వేశాఖలో సీబీఐ కేసు కలకలం!
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదు అవినీతి రైల్వే ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్డివిజన్ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారు, రైల్వే ను మోసం చేస్తూ కంభకోణాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పుడు కాజీపేట రైల్వేట్రాక్ నిర్వహణ విధుల్లో అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు, సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు కావడం, గతంలో కాజీపేట రైల్వేలో నమోదైన రెండు సీబీఐ కేసులు దక్షిణ మధ్య రైల్వేలో సంచలనం రేపుతున్నాయి. ఐదుగురు ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థపై నమోదు ట్రాక్ నిర్వహణలో అక్రమాలే కారణం సోషల్ మీడియాలో వైరల్ -
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డివిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రిస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం –2026 పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులతో చర్చించి విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను తరగతిగదికి దూరం చేసే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు అంజనీదేవి, సారంగపాణి, అల్లం మల్లయ్య, కిషన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంజీవరెడ్డి, సుభాషిణి, హర్షవర్ధన్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులను కాపాడుకోవాలి
హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య న్యూశాయంపేట: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి హంటర్రోడ్డులోని కాకతీయ జూ పార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణులతోపాటు ఔషధ, సుగంధ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, వెటర్నరీ డాక్టర్ కార్తికేయ, సెక్షన్ ఆఫీసర్లు సూరిదాస్ సింగ్, శివకుమార్, బీట్ ఆఫీసర్లు శారద, సురేశ్, శ్వేత, జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు. -
కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం
డాక్టర్ శ్రమలత ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
యంత్ర పరికరాలు అందేనా?
● చాలీచాలని పరికరాలతో ఇబ్బందులు ● జిల్లా మంత్రులు స్పందించాలని రైతుల వేడుకోలుదుగ్గొండి: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతుంది. కూలీల కొరత, పెరిగిన వేతనాలు, అధికమైన పెట్టుబడి వ్యయం, అందని గిట్టుబాటు ధర, రోజురోజుకూ తగ్గుతున్న దిగుబడులు వెరసి అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి కూలీల కొరత నుంచి విముక్తి కలిగించడానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తీసుకువచ్చింది. 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తుంది. రైతులు వేల సంఖ్యలో ఉండి సబ్సిడీ యంత్రాలను పదుల సంఖ్యలో కేటాయించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,56,926 మంది రైతులు ఉండగా 2,30,277 ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. ఈఏడాది ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడానికి శ్రీకారం చుట్టింది. రూ.2కోట్లు విడుదల.. ప్రభుత్వం ఈ ఏడాది సబ్సిడీ పరికరాలు అందించేందుకు రూ.2 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో సబ్సిడీపై 2,548 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసింది. అయితే లక్షల్లో ఉన్న రైతులకు వందల్లో పరికరాలు మంజూరు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలానికి 2 వేల పరికరాల చొప్పున 25 వేల పరికరాలు మంజూరు చేస్తే ఉపయోగకరంగా ఉండేదని అన్నదాతలు అంటున్నారు. ఒక్క దుగ్గొండి మండలంలో 10,465 మంది రైతులు ఉండగా 23,641 ఎకరాల సాగు భూమి ఉంది. మండలానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 129 బ్యాటరీ పంపులు, 27 పవర్ స్ప్రేయర్లు, 7 రోటోవీటర్లు, సీడ్డ్రిల్ మిషన్ 1, బ్రష్కట్టర్లు 2, పవర్ టిల్లర్ 1, గడ్డికట్టలు యంత్రం 1 ఇలా మొత్తం 168 పరికరాలు మాత్రమే మంజూరు చేశారు. కనీసం 2వేల పరికరాలైన ఇస్తే సౌకర్యంగా ఉండేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయించి రైతులకు అవసరమైన పనిముట్లను అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రైతులు: 1,56,926 సాగు విస్తీర్ణం: 2,30,277 ఎకరాలు ఇప్పటివరకు అందిన పరికరాలు: 2,548 సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించాలి గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. మునుపటిలా కష్టం చేయాలంటే ఈ తరానికి శక్తి సరిపోవడం లేదు. యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తేనే వ్యవసాయం మనుగడ సాగిస్తుంది. రైతులకు అవసరం ఉన్న పవర్వీడర్లు, పవర్ టిల్లర్లు, డ్రోన్లు, మినీట్రాక్టర్లు, ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలతో పాటు రైతుకు అవసరమయ్యే ప్రతీ పనిముట్టును 50 శాతం సబ్సిడీతో ఎలాంటి షరతులు లేకుండా అందించాలి. –లడె మోహన్రావు, రైతు సంఘం జిల్లా నాయకుడు విడతల వారీగా అందిస్తాంజిల్లావ్యాప్తంగా రైతులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందిన నిధులతో వచ్చే పరికరాలను మండలాల వారీగా కేటాయించాం. జిల్లాకు 50వేల పరికరాలు అవసరమని నివేదికలు ఇచ్చాం. నిధులు మంజూరు అయితే విడదల వారీగా అవసరం ఉన్న రైతులకు అందిస్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి -
దశాబ్దకాలం లేట్!
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ప్రయాణించాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. కాగా, సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను ఇప్పటికై నా వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్కు మోక్షం కలగడం లేదు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. పదేళ్లయినా ఉమ్మడి వరంగల్ నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది, గూడ్స్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు 44.624 కిలోమీటర్లు అసంపూర్తిగా పనులు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఆర కట్ల సాయి భక్తులకు స్వాగతం పలుకుతూ ఏ ర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియన వ్యక్తులు సోమవారం రాత్రి చించివేసి తొలగించినట్లు స్థాని కులు తెలిపారు. మచ్చాపూర్ నుంచి కొమ్మాల ఆల య ముఖ ద్వారం వరకు సాయి తన అభిమాన నా యకులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో స్థానిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటోలు లేకపోవడంతో ఆయన అభిమానులు దీన్ని తప్పుపట్టి, చించివేసినట్లు సమాచారం. ఈ విషయమై సాయి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుండగా చించి వేసిన సదరు నాయకులు ఆయనకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దొంతి మాధవరెడ్డిల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీ వారే చించివేయడం చర్చనీయాంశంగా మారింది. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ఖానాపురం: అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎఫ్ఆర్ఓ పుప్పాల రవికిరణ్ అన్నారు. ఈ మేరకు మండలంలోని పాకాల అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వణ్యప్రాణుల దినోత్సవ వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతోనే జంతు సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. జంతువులను వేటాడటం చట్టరిత్యా నేరమన్నారు. జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారులు ధర్మ, సిబ్బంది విజయ్, ప్రకాశ్, శ్రీకాంత్, మహేష్, రవి, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో కలెక్టర్
న్యూశాయంపేట: ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతీ నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 99 రోజుల ప్రోగ్రాంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగసామ్యం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.నాగేంద్రస్వామికి వసంతోత్సవ శోభ గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలి నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అపురూపమైన, అరుదైన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని గర్భాలయంలోని స్వామి వారిని నవ (తొమ్మిది) వర్ణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. హోలీ అంటే దేవతల పండుగ అని, ఆ తర్వాతే మానవులు జరుపుకుంటారని ప్రధాన అర్చకులు సుముద్రాల సుదర్శనాచార్యులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించారు. అర్చకులు శ్రీహర్ష, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంగమేశ్వర దేవాలయం ద్వారబంధనం సంగెం: మండల కేంద్రంలోని ప్రసిద్ధ గంగాభవాని సంగమేశ్వరాలయాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేసినట్లు ఆలయ అర్చకుడు అప్పె నాగార్జున శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం ప్రాతఃకాల నిత్య అభిషేకం, అరిత పూజలను నిర్వహించి గ్రహణం కారణంగా ఉదయం 9 గంటలకు మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం అనుమతి ఉంటుందన్నారు. రైల్వే శాఖలో సీబీఐ కేసు కలకలం కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసు అధికారులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదైన విషయం అవినీతి రైల్వే ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్డివిజన్ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. -
హైర్ బస్ డ్రైవర్ల నూతన వేతన ఒప్పందం
నర్సంపేట: ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల జీతభత్యాల విషయంలో యజమానులు, డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు నూతన వేతన ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ హైర్ బస్ వరంగల్ జిల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిశెట్టి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పట్టణంలో కార్మికులు, యజమానులకు మధ్య మంగళవారం చర్చలు జరిగి నూతన ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ పల్లెవెలుగు డ్రైవర్కు 15 రోజులకు రూ.18,500, ఎక్స్ప్రెస్ డ్రైవర్కు 15 రోజులకు రూ.20,500, టెంపరరీ డ్రైవర్కు పల్లె వెలుగు బస్సుకు ఒక రోజుకు రూ.1,250, ఎక్స్ప్రెస్ టెంపరరీ డ్రైవర్కు ఒక్క రోజుకు రూ.1,400, దసరా పండుగా సందర్భంగా ఒక సంవత్సరం సీనియారిటీ ఉన్న ప్రతీ డ్రైవర్కు బోనస్గా రూ.2 వేలు, క్లీనర్కు 30 రోజులకు వేతనం రూ.4,500 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లక్కం ప్రభాకర్, దినేష్, రవీందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, నల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘కోఆప్షన్’పై నాయకుల గురి
నర్సంపేట: మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసి జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేటలో కొత్త పాలకవర్గం కొలువు దీరింది. కోఆప్షన్ పదవుల కోసం రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. నర్సంపేటలో 15మంది, వర్ధన్నపేటలో 8మంది ఆశవహులు ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్.నాగరాజు మన్ననల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేసిన సీనియర్ నాయకులకు పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది. గతనెల 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం 16న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. త్వరలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరుగనుండడంతో పార్టీ కోసం కష్టపడిన వారు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రయత్నాలు ముమ్మరం జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తై కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. నర్సంపేటలో 30వార్డులు ఉండగా 21వార్డులు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 22మందికి చేరింది. బీజేపీకి ఒకటి, సీపీఎం ఒకటి, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లుగా గెలుపొందారు. 12వార్డులు ఉన్న వర్ధన్నపేటలో ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున కోఆప్షన్ సభ్యులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో కసరత్తు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం 45నుంచి 60రోజుల్లో నామినేటెడ్ కింది కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కోఆప్షన్ సభ్యుల ఎంపిక సమయం సమీపిస్తుండడంతో అధికార పార్టీలో ఉన్న మాజీ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవులు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆశావహుల ఎదురుచూపులు నర్సంపేటలో 15మంది, వర్ధన్నపేటలో 8మంది ప్రయత్నాలు ఎమ్మెల్యేల మన్ననలు పొందేందుకు లాబీయింగ్ఎంపిక ఇలా.. ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఆశావహులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్.నాగరాజు ప్రతిపాదించిన వ్యక్తులకే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంటుంది. ప్రతీ మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులు ఉండనుండగా రెండు మైనార్టీలకు, రెండు జనరల్కు కేటాయిస్తారు. వాటిలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు ఒక్కటి చొప్పున ఇవ్వనుండగా, జనరల్ కేటగిరీలో కో ఆప్షన్ పదవులు పొందాలంటే గతంలో ఐదేళ్లపాటు ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉండాలి. మాజీ కౌన్సిలర్లు లేదా ఇతర పదవుల్లో పనిచేసిన వారినే నామినేటెడ్ పదవుల కింద కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. -
ఇంటి నుంచి వెళ్లగొట్టారు
30 ఏళ్ల క్రితం సీపీఎం ఆధ్వర్యంలో ఉచితంగా కేటాయించిన స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నా కొడుకు, కోడలు ఆ ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టడంతో సమీపంలోని కమ్యూనిటీ హాల్లో జీవనముంటున్నా. పింఛను కూడా రాకుండా చేశారు. పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. – మహ్మద్ అంకూస్, సుందరయ్య నగర్, వరంగల్ దొంగ కాగితాలు సృష్టించారునేను చింతనెక్కొండ శివారులో 1.39గుంటల భూమిని కొనుగోలు చేశాను. నా భూమి నుంచే నేషనల్ హైవే వెళ్తోంది. ఈ క్రమంలో నా భూమి సర్వే నంబర్లతో దొంగ కాగితాలు సృష్టించి మా దగ్గరి బంధువులు నష్టపరిహారం పొందారు. నకిలీ పత్రాల ద్వారా పరిహారం తీసుకొన్న వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. – బి.సమ్మయ్య, చింతనెక్కొండ -
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్/కాజీపేట రూరల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 48, 49వ డివిజన్ల పరిధిలో రూ.9.37 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో నిట్ నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్అండ్బీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈరహదారికి సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షలతో అంతర్గత రోడ్లు, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా, కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సర్తాజ్బేగం, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్రెడ్డి, మట్టాడ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 02హెచ్ఎంకెడి180: -
రూపుదిద్దుకుంటున్న ‘కొండా’ ప్రభబండి
దుగ్గొండి: కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతర రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారింది. జాతర జరిగేది గీసుగొండ మండలం కొమ్మాలలో అయినా బండ్లు తిరిగే రోజు మాత్రం నర్సంపేట నియోజకవర్గానిదే పైచేయిగా వస్తోంది. దశాబ్దాల కాలం నుంచి దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా బండ్లు తరలివెళ్తుంటాయి. ఇక్కడ ఒకరికంటే ఒకరు ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన బండ్లను తయారు చేసి జాతరకు తరలించి పైచేయి సాధిస్తుంటారు. ఇదేక్రమంలో ఈసారి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఆధ్వర్యంలో ఆధునికతతో భారీ ప్రభబండి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఫీట్ల భారీ ప్రభను అధునాతన హంగులతో గిర్నిబావిలోని ఓ వెల్డింగ్ షాపులో అల్లం బాలకిశోర్ రెడ్డి, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజుకుమార్ దగ్గరుండి తయారు చేయిస్తున్నారు. ప్రభను పైకి కిందికి లేపడానికి హైడ్రాలిక్ జాకీలు కూడా ఏర్పాటు చేశారు. ఇలా రూపుదిద్దుకుంటున్న ప్రభను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
రాహుల్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు అయూబ్
వరంగల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వికారాబాద్లోని హరిత వ్యాలీలో నిర్వహించారు. ఈశిక్షణ ముగింపు కార్యక్రమానికి వచ్చిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీని డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ కుటుంబ సమేతంగా కలిశారు. విధుల్లో చేరిన అదనపు కలెక్టర్ వైవీ.గణేష్ న్యూశాయంపేట: ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీపై వెళ్లిన వైవీ.గణేష్.. సోమవారం విధుల్లో చేరారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని ఆయనకు కలెక్టర్ సూచించారు. కొమ్మాల ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్గా రవీందర్ రెడ్డి గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవ కమి టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ డైరెక్టర్ ఎం.హన్మంతరావు పేర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్సవ కమిటీ చైర్మన్గా తనను కమిటీ సభ్యులు ఎన్నుకున్నట్లు కొమ్మాలకు చెందిన వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు. కమిటీ సభ్యులుగా అజ్మీరా సమ్మయ్య, కాందా రి సంతోష్, హాలావత్ వీరన్న, మండల రమేష్, బాదావత్ రమేష్, ఊరుగొండ రాజు, లడే రాజేశ్వర్రావు, గోనెల మల్లేష్, మండల నరేష్, మోర్తాల రాజు, డుకిరె వినయ్, మామునూరి వనిత, నాగిరెడ్డి నాగన్న నియమితులయ్యారు. తమ నియామకానికి కృషి చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి చైర్మన్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రవీందర్రెడ్డి గతంలో పలుమార్లు ఉత్సవ కమిటీ చైర్మన్గా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికగీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లి ఉషోదయ హైస్కూల్ (ఉషోదయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్) విద్యార్థి రితిక్చంద్ర.. జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చంద్రగిరి మహేష్ తెలిపారు. ఫిబ్రవరి 27న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు రితిక్చంద్రను ప్రిన్సిపాల్తో పాటు పాఠశాల డైరెక్టర్ గిరగాని రాహుల్ వర్మ, పీఈటీ కుంట విజేందర్యాదవ్ సోమవారం అభినందించారు. ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆహ్వానం హన్మకొండ అర్బన్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. -
స్ట్రీట్ వెండర్ల ఆర్థికాభివృద్ధికి చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) వైవీ.గణే శ్, జిల్లా లీడ్ బ్యాంకు ప్రతినిధి తదితరులున్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు.. రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైట్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38 అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైట్నింగ్ అరెస్టర్ల ఏర్పాటునాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైట్నింగ్ అరెస్టర్లు చేశాం. వినియోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరుపు సమయంలో విద్యుత్ పరికరాలను తాకొద్దు. – వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ -
ఈఎస్ఐ.. ఇక్కట్లు
కాశిబుగ్గ: వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పేరుకు నోడల్ సెంటర్ ఉన్నప్పటికీ సిబ్బంది లేక అరకొర సేవలతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నోడల్ సెంటర్ నుంచి ఈఎస్ఐ పరిధిలో 16 డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేస్తున్నారు. రీజియన్లోని ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిస్పెన్సరీలకు పంపిణీ చేయాలి. సాధారణంగా నోడల్ సెంటర్కు ఒక ఫార్మాసిస్ట్, ఒక క్లర్క్, ఐదుగురు నాల్గవ తరగతి సిబ్బంది, ప్రత్యేకంగా వ్యాన్ సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో సేవలు అందని ద్రాక్షలా మారాయి. రూ.4.8 కోట్లతో మందుల కొనుగోలు.. రెండేళ్ల క్రితం నోడల్ సెంటర్ మంజూరు కావడంతో రూ. 4.8 కోట్లతో టెండర్ ద్వారా ఎంపికై న కాంట్రాక్టర్ మందులను కొనుగోలు చేశారు. కానీ, ఆ బిల్లులు ఇంత వరకు రాకపోకవడం, సదరు కాంట్రాక్టర్ తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ ఒత్తిడి తీసుకోస్తున్నారు. వివిధ రకాల మెడిసిన్కు ఫండ్ రాక తిరిగి ఈ ఏడాది మందులు కొనుగోలు చేయడం అధికారులకు సవాల్గా మారింది. ఆరునెలల నుంచి అందని భోజనం ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఇన్పేషెంట్లకు ఆరునెలల నుంచి భోజనం అందడం లేదని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి డైట్కు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్ల భోజనం పెట్టలేదని సమాచారం. బిల్లులు పేరుతో సదరు కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోవడంతో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసి భోజనం తెచ్చుకోవాల్సి వస్తోంది. అసలే పేద కార్మికులు చికిత్స కోసం వచ్చి అడ్మిట్ అయితే భోజనం కోసం కడుపు మాడ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోతే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం శోఛనీయం. అరకొర సేవలు.. అలమటిస్తున్న రోగులు పేరుకే నోడల్ సెంటర్ పూర్తి స్థాయిలో డిస్పెన్సరీలకు అందని మందులు ఇన్పేషెంట్లకు చేరని భోజనం -
అర్జీలు వెంటనే పరిష్కరించేలా చర్యలు
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. అలాగే, జిల్లాలోని పలువురు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 222 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఈఎల్ఎస్ఆర్ పరిసరాలు శుభ్రంగా ఉండాలి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ఈఎల్ఎస్ఆర్ (ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంక్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు నీటి సరఫరా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు మేయర్ సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధి 11వ డివిజన్లోని ఐ హాస్పిటల్ వాటర్ ట్యాంక్, కేఎంసీ హాస్పిటల్లో ఈఎల్ఎస్ఆర్, 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతంలోని ఈ ఎల్ఎస్ఆర్తో పాటు 28వ డివిజన్లోని గాయత్రి ఆలయం సమీపంలోని ఈఎల్ఎస్ఆర్లకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు, ఏఈలు, డీఈలు, ఈఈలతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలిచ్చారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రాజ్కుమార్, సతీశ్, రాగి శ్రీకాంత్, మొజామిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
సర్వే చేయించి పరిహారం ఇప్పించండి
నా భూమి టెక్స్టైల్ పార్కు నిమిత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే చేసి నా ఖాతాలో డబ్బులు జమచేసింది. అందులో నుంచి నా కూతురు వివాహ నిమిత్తం బ్యాంకు ఖాతాలో సుమారు రూ.3 లక్షలకు పైగా నిల్వ ఉంచాను. అయితే, ఆర్డీఓ ఆదేశాల మేరకు ఆ డబ్బు వాపస్ పోయిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. కూతురు వివాహం కోసం దాచుకున్న ఆ డబ్బులు ఇప్పించండి. నాకు భూమి తక్కువ ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. తిరిగి సర్వే చేయించి నాకు న్యాయం చేయండి. – జె.కొంరయ్య, చింతలపల్లి యాక్ట్ ప్రకారం పరిష్కారం చూపండివృద్ధాప్యంలో తమ సంతానం తమకు సహకరించడం లేదని, మౌలిక సదుసాయాలు కల్పించడం లేదని సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. ఆసరాగా నిలబడడం లేదని గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, డిసెంబర్ 29 ప్రకారం 60రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించాలి. కానీ అధికారులు మాత్రం కాలయాపన చేస్తున్నారు. – ఇనుముల రమేష్, లోక్సత్తా నగర కార్యదర్శి -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కొండపర్తి, ఐనవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లోని ఔట్ పేషెంట్ మందుల పంపిణీ, ఇతర రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మార్చి 31లోగా ఎన్సీడీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. ఐనవోలు పీహెచ్సీలో 24/7 మాతా శిశు సేవలు అందించాలని, ఆస్పత్రులకు వచ్చిన రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, వైద్యాధికారి శ్యాంప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
వయోవృద్ధుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం–2007ను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం కోరింది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను సోమవారం వారు కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన వృద్ధుల డే–కేర్ సెంటర్ను సందర్శించాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, తదూరి లక్ష్మీనారాయణ, మార్క రవీందర్గౌడ్, ఎస్.రమేశ్, శీలం వెంకటేశ్వర్లు, గుంటి సీతారాములు, కొండబత్తిని రాజేందర్, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్ : చంద్రగ్రహణం ఉన్నందున వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణి కోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణలు పూజలు నిర్వహించి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం అనుమతించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ వర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు సోమవారం వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో బి.నిఖిల్గౌడ్, కె.శ్రీశాంత్గౌడ్, ఎం.సంజయ్, పినవదీప్, వి.వంశీకృష్ణ, విన్పాల్, జి.అభిషేక్, జి.చంద్రశేఖర్ ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.రమేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. హన్మకొండ అర్బన్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కాగా, దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. -
నీటి వృథా..
వేలేరు: దేవాదుల పైపులైన్ల లీకేజీలు షరా మాములయ్యాయి. వేలేరు మండల పరిధి మల్లికుదుర్ల శివారులోనుంచి వెళ్తున్న దేవాదుల పైప్లైన్ గేట్వాల్వ్ సోమవారం లీక్ కావడంతో 60 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. కాగా, మల్లికుదుర్ల చుట్టు పక్కల గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ పంట పొలాలకు సాగునీటి కోసం పైప్ లైన్ లీక్ చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఆకాశానికి ఎగసిపడుతున్న దేవాదుల పైప్లైన్ నీరు -
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
న్యూశాయంపేట: ప్రజలు సమర్పించిన వినతులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ హాల్లో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. గ్రీవెన్స్కు మొత్తం 163 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 58 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన దరఖాస్తులను ఆయా తహసీల్దార్లకు పంపించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న గ్రీవెన్స్ దరఖాస్తుల్లో రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, పోలీస్ శాఖలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని అన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ -
ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి
పర్వతగిరి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం సమష్టి బాధ్యతని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్ఎఫ్డబ్ల్యూ) హైదరాబాద్ డాక్టర్ రవీంద్రనాయక్ సూచించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం పర్యవేక్షించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల నుంచి వైద్యాధికారి వరకు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఇన్స్టిట్యూట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను సర్వేల ద్వారా తెలుసుకొని వాటికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. 14నుంచి 15ఏళ్ల వయస్సులోపు ఆడపిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ విజయ్కుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ మౌనిక, పల్లె దవాఖాన వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీంద్రనాయక్ -
వరంగల్
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026సహజ హోలీ.. ఆనందాల కేళి చిన్నాపెద్ద.. కుల, మత భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆనందాల పండుగ. గత మూడు నెలలతో పోలిస్తే కొంచెం తగ్గుముఖం వేసవికాలం సమీపించడంతో ఇంకా కిందికి వరికి ఎక్కువ నీరు అవసరం ఓ కారణం బోర్వెల్స్ ద్వారా విరివిగా వినియోగంతో సమస్య ఇసుక అక్రమ రవాణాతో రీచార్జ్ ప్రక్రియపై ప్రభావం పొదుపుగా నీటిని వాడుకోవాలంటున్న అధికారులు -
నేటి నుంచి కొమ్మాల జాతర
● 257 మంది పోలీసులతో భారీ బందోబస్తు ● 100 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ● ట్రాఫిక్ నియంత్రణకు దారి మళ్లింపు గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర మంగళవారం (హోలీ పండుగ) ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ సోమవారం తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్వర్వుల మేరకు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో జాతరలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్సైలు, 230 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. బందోబస్తును పర్యవేక్షించడానికి ఆలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజకీయ ప్రభ వద్ద గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సీఐ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు వరంగల్ – నర్సంపేట రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు సీఐ విశ్వేశ్వర్ వెల్లడించారు. వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్లే వాహనాలను మచ్చాపూర్, పల్లార్ల గూడ, మొండ్రాయి, కొత్తపల్లి, ఉప్పరపల్లి, కోనాపురం, చెన్నారావుపేట మీదుగా నర్సంపేట వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
స్ట్రీట్ వెండర్ల ఆర్థికాభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. లబ్ధిదారులకు రుణం మంజూరు , తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, నర్సంపేట, వర్ధనపేట మున్సిపల్ కమిషనర్లు, లీడ్ బ్యాంకు అధికారులు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్తో పాటు జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు సేవలను కొనియాడారు. వైద్యసేవలపై నిర్లక్ష్యం తగదు న్యూశాయంపేట: రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. వైద్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏరియా, జీజీహెచ్, నర్సంపేట, సీకేఎం, ఎంజీఎం, రీజినల్ ఆస్పత్రుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. ఆయా ఇన్స్టిట్యూట్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్ స్టేషన్: డీజీపీ
వరంగల్ క్రైం: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల అధికారిక వాహనాల ఇంధన అవసరాల ను ఈ ఫిల్లింగ్ స్టేషన్ తీర్చనున్నట్లు ఆయన తెలి పారు. ఇంధన సరఫరాలో నాణ్యత నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం, అదనపు ఏసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎంటీ ఏసీపీ అంతయ్య, సురేంద్ర ఉన్నారు. పోలీస్ అతిథి గృహం ప్రారంభం కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. హనుమకొండ పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకున్న డీజీపీకి సీపీ సన్ప్రీత్సింగ్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ మాట్లాడారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల సౌకర్యాలను మెరుగుపర్చేలా ఈ అతిథి గృహాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, సురేశ్కుమార్ ఉన్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
నగరంలో కర్రీ పాయింట్లు, రైతుబజార్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మాంసం, చేపలు, కూరగాయల కర్రీలను అమ్ముతున్నారు. చాలా కేంద్రాల్లో మిగిలిన చికెన్, మాంసాన్ని ఫ్రిజ్లలో నిల్వ చేసి మరుసటిరోజు వేడి చేసి విక్రయిస్తున్నారు. గతంలో బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీ చేయగా.. కుళ్లిపోయిన మాంసం, బూజుపట్టిన చేప ముక్కలు లభ్యమయ్యాయి.ప్రజల ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2011 వరకు బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది ఆహార కల్తీ నివారించేందుకు తనిఖీలు చేస్తుండే వారు. ఆ తదుపరి నిబంధనలతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఫుడ్సేఫ్టీ అధికారుల కొరతతో ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక పరిశుభ్రతను తనిఖీ చేయాల్సిన బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆహార కల్తీపై హనుమకొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే అందుబాటులో లేరు. వరంగల్ అర్బన్: కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆహారపదార్థాల నుంచి అలంకరణ వస్తువుల వరకు అన్నీ కల్తీమయమే. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ప్యాపారులు చేస్తున్న ఈ దందా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆహారపదార్థాల్లో కల్తీ నేరుగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని వెంటనే దుష్ప్రభావం చూపిస్తుండగా.. మరికొన్ని దీర్ఘకాలికంగా చేటుచేస్తున్నాయి. ఉరుకులు, పరుగుల జీవనంలో డబ్బులు ముట్టజెప్పి కడుపు నింపుకుంటూ అనేకమంది రోగాలను కొనుక్కుంటున్నారు. వరంగల్ మహానగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెలు విచ్చలవిడిగా వాడుతున్నారు. అపరిశుభ్ర వాతావారణంలో వంటలు తయారు చేస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు సంపాదన యావ తప్ప కనీస నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతపై పట్టింపులేదు. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెలవారీగా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు వస్తే మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు. బిర్యానీ ఘుమఘుమలు.. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్నట్లు భోజన ప్రియలు లోట్టలేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ ఆరాగిస్తున్నారు. బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కస్టర్లమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రంగు, రుచి, వాసన కోసం నిషేధిత పౌడర్లను ఉపయోగిస్తున్నారు. బిర్యానీలో వాడే చికెన్, మటన్ కూడా శుభ్రంగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వాడే నూనెలు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఎముకలు, కళేబారాల నుంచి తీసిన నూనెలు వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రముఖ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. వంట గదుల్లోకి వినియోగదారులు వెళ్లే అవకాశం లేదు. ఆ గదుల్లోకి నోఅడ్మిషన్ అని బోర్డులు పెడుతుండడంతో అవి రహస్య స్థావరాలుగా మారాయి. చాలా హోటళ్లలో గాలి, వెలుతురు కరువైంది. వడ్డించే వాళ్లు కనీసం చేతులకు గ్లౌజులు, నెత్తికి టోపీలు ధరించడం లేదు. ప్రజారోగ్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటళ్లపై దాడులు చేసినప్పుడల్లా ఆశ్చర్యకర విషయాలు ఎన్నో వెల్లడవుతున్నాయి. వీటి వల్ల ప్రజలు ప్రమాదకర వ్యాధులబారిన పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. పాడైపోయిన పదార్థాలతో తయారు చేస్తున్న నిర్వాహకులు వంటల్లో నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెల వాడకం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లలో పారిశుద్ధ్య తనిఖీలు చేస్తున్నాం. అపరిశుభ్రంగా ఉన్న వాటికి నోటీసులు జారీ చేసి, తదుపరి జరిమానా విధించి వసూలు చేస్తున్నాం. ఆహార కల్తీ తనిఖీ మాది కాదు. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
నేడు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
● జిల్లా స్థాయి పోటీలకు 200 మంది డిగ్రీ విద్యార్థులు కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–హనుమకొండ జిల్లా స్థాయి పోటీలను కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈనెల 2న నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, కన్వీనర్లు డి. శైలజ, డాక్టర్ ఎన్.సౌజన్య ఆదివారం తెలిపారు. కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మై భారత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు, భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అంశంపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మై భారత్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 200 మందికి ఈ పోటీల్లో అవకాశం కల్పించనున్నట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు. ఐదుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. -
హాట్ హాట్గా మిర్చి
రకం ధర దేశీ మిర్చి 50,000ఎల్లో మిర్చి 42,000వండర్హాట్ 39,000సింగిల్ పట్టి 35,000 దీపిక 31,000యూఎస్–341 29,0001048 21,000తేజ 20,600సాక్షి, వరంగల్: వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు హాట్ హాట్గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటాలు రూ.50,000 పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు 9 బస్తాల దేశీ మిర్చిని తీసుకురాగా.. అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా రూ.50,000 ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి రాకపోవడంతో మార్కెట్కు మిర్చి రావడం తగ్గింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. డిమాండ్ ఎందుకు ఎక్కువంటే.. ● అకాల వర్షాలు, తామర తెగులుతో దేశీ రకం దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడంతో ధర పలుకుతోంది. ● సింగిల్ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్ ఉంది. ● వండర్హాట్ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో డిమాండ్ ఉంటుంది. తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలు, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఏనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ౖపైపెకి రోజురోజుకూ పెరుగుతున్న దేశీ, వండర్హాట్ ధరలు ఇతర రకాల మిర్చికి సైతం మార్కెట్లో డిమాండ్ దేశీ మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.50,000 జనవరి నుంచి ఇప్పటివరకు 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు -
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ఉదయం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారిని ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. పూజల్లో ధర్మకర్తలు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మూగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాని ఆయన కోరారు. వరంగల్ కలెక్టరేట్లో..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సమస్యల పరి ష్కారం కోసం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించే గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. భీమదేవరపల్లి: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యుల పిల్ల లకు సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి చేతుల మీదుగా ఆదివారం నగదు అందజేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 90 మంది విద్యార్థులకు రూ.14,69,000, మెడిసిన్, డెంటల్, ఫార్మ్డీ విద్యార్థులకు రూ.21 వేల చొప్పున, ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, నర్సింగ్ విద్యార్థులకు రూ.16 వేల చొప్పున అందజేశారు. కాగా, 2008 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 1,458 మంది విద్యార్థులకు రూ1.39 కోట్లకుపైగా ఆర్థికసాయం అందించినట్లు ప్రవీణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంఘం జనరల్ మేనేజర్ రాంరెడ్డి, ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు మూగయ్య, రవీందర్రెడ్డి, రాములు, కనకమ్మ, బుచ్చయ్య, బాషు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు: చంద్రగ్రహణం సందర్భంగా ఐనవోలు మల్లన్న ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ఆలయం మూసివేసి బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హన్మకొండ కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం మూసివేయనున్నట్లు ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకుడు తాతాభట్ల నరసింహశర్మ ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల వరకు పూజలు నిర్వహించిన అనంతరం 7.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఈద్గా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రామన్నపేట/ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధి జెమిని థియేటర్ సమీపంలోని ఈద్గాలో చేపట్టిన అభివృద్ధి పనులను రంజాన్ పర్వదినానికి ముందే పూర్తిచేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం సర్కిల్లో శిశు సంరక్షణ ప్రతిబింబించేలా రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రతిమను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా మట్టెవాడ ఈద్గాలో కోటి రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదలో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈద్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా 40వ డివిజన్ కరీమాబాద్లో రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఉర్సు శ్మశానవాటిక, గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల పనులను కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు మరుపల్లి రవి, పల్లం పద్మ, మీసాల ప్రకాశ్, గోపాల నవీన్రాజు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
డ్రెయినేజీలో నల్లా కనెక్షన్లు
వరంగల్: వరంగల్ 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు–2లో డ్రెయినేజీలోనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాలనీలో డ్రెయినేజీల నిర్మాణంలో భాగంగా పాత పైపులైన్ తీసివేశారు. కాల్వ మధ్యలో పైపులైన్ వేసి కనెక్షన్లు ఇవ్వడంపై కాలనీవాసులు అభ్యంతరం చెబుతున్నారు. కాల్వ మధ్యలో ఉన్న పైపుపై సిమెంట్, కాంక్రీట్ వేస్తామని ప్లంబర్ చెప్పగా.. భవిష్యత్లో లీకయితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి పైపులైన్ను మధ్య నుంచి పక్కకు జరిపి, సైడ్ డ్రెయిన్ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
వైద్యం అందించరూ..
ఎంజీఎం: నగరంలోని 11వ డివిజనల్లో ఆదివా రం ఈద్గా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఓ మహిళ తన కొడుకుకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యశారదను వేడుకుంది. వివరాలి లా ఉన్నాయి.. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఓ మహిళ తన కుమారుడు గుండెటి సతీష్ ఆదివారం ఉదయం కడుపునొప్పితో ఎంజీఎంకు రాగా ఓపీ స్లిప్తో చికిత్స అందించి మందులు ఇచ్చి పంపించారని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను వేడుకుంది. స్పందించిన కలెక్టర్ ఎంజీఎం ఆర్ఎంఓతో ఫోన్లో మాట్లాడటంతో పాటు తన సీసీని ఎంజీఎంకు పంపించి చికిత్స అందించాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద చొరవపై అక్కడ ఉన్న ప్రతీఒక్కరు హర్షం వ్యక్తం చేశారు.కలెక్టర్ సత్యశారదను వేడుకున్న మహిళ -
పాకాలలో వలస పక్షులు
ఖానాపురం: మండలంలోని పాకాల అటవీప్రాంతంలో స్వదేశీ, విదేశీ పక్షులను గుర్తించారు. హైదరాబాద్కు చెందిన హైటీకోస్ (హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ)కి చెందిన సమన్వయకర్త వెంకట్, రిటైర్డ్ నావీ కమాండర్ బిష్ణోయ్లు పాకాలకు బర్డ్వాచ్కు రెండు రోజుల క్రితం వచ్చారు. రెండు రోజుల పాటు పాకాల అటవీప్రాంతంలో బర్డ్వాచ్ చేస్తూ పలు రకాల పక్షులను గుర్తించారు. పాకాలలో ప్రస్తుతం 70 రకాల స్వదేశీతో పాటు 20 రకాల విదేశీ పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలపారు.పాకాలలో గుర్తించిన విదేశీ నార్తర్న్ పింటేయిల్స్ -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగరాజుపల్లి, ముచ్చింపుల, రంగాపురం గ్రామాల్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.48 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి దళితవాడలతో పాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోరిక మేరకు ముచ్చింపుల, దస్థగిరిపల్లి, రంగాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని, కాటమయ్య దేవాలయ నిర్మాణంతో పాటు మహిళ బిల్డింగ్ నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పాలాయి శ్రీనివాస్, తోకల శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ రమేష్, వైనాల అశోక్, ఇస్తారి శేఖర్, మునేందర్, సురేష్, సర్పంచ్లు ఎరుకల లలిత రఘు, సిద్ద సంతోష్, సంగ పోశాలు, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి -
హాట్ హాట్గా మిర్చి
● రోజురోజుకూ పెరుగుతున్న దేశీ, వండర్హాట్ ధరలు ● ఇతర రకాల మిరపకు సైతం మార్కెట్లో డిమాండ్ ● దేశీ మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.50,000 ● జనవరి నుంచి ఇప్పటివరకు 1,27,200 క్వింటాళ్ల విక్రయాలుఅత్యధిక ధర పలికిన దేశీ మిర్చి (ఫైల్) సాక్షి, వరంగల్: వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు హాట్ హాట్గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటా రూ.50,000లు పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు తొమ్మిది బస్తాల దేశీ మిర్చిని తీసుకురావడంతో అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా రూ.50,000లు ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు భారీగానే పంట దెబ్బతింది. ఉన్న పంటలోనూ ఆశించిన స్థాయిలో పంట రాకపోవడంతో మార్కెట్కు మిర్చి రావడం తగ్గింది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారస్తులు పోటీపడి కొంటున్నారు. దీంతో మిర్చికి ధర పలుకుతోంది. ఆయా మిర్చి నాణ్యతను బట్టి రూ.15 వేల నుంచి రూ.50,000ల వరకు ధర వస్తోంది.మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సీజన్లో అన్ని రకాల మిర్చికి కాస్త ఎక్కువగానే ధర పలుకుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 3,18,020 బ్యాగులు ఎనుమాముల మార్కెట్కు వచ్చాయి. మొత్తంగా 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. రాబోయే రోజుల్లో ఇంకా మిర్చి రాక పెరుగుతుంది. – మల్లేశం, కార్యదర్శి, ఎనుమాముల మార్కెట్ దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం, ఇప్పుడూ సీజన్ కూడా కావడంతో ఉన్న కొద్దిపంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. 2022 మార్చి 30న ఈ దేశీ రకం మిర్చి క్వింటాకు అత్యధికంగా రూ.52వేల ధర పలికిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సింగిల్ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. కారం తక్కువగా, రంగు బాగా ఉండడం, ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్ ఏర్పడింది. ఈసారి అత్యధికంగా రూ.35,000లకు అమ్ముడుపోయింది. 2022 మార్చి 10న అత్యధికంగా క్వింటాకు రూ.42 వేల ధర పలికిందని మార్కెట్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆకుపచ్చ, లేదంటే ఎర్రగా లేదంటే పొడిగా ఉండే యూఎస్ 341 మిర్చిని పంజాబ్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇందులో కారంస్థాయి సమంగా ఉన్నందున తయారీకి అనుకూలంగా ఉంటుంది. వండర్హాట్ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో ఉన్న మసాలా పరిశ్రమలు ఈ మిర్చికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. గాడ ఎరుపు రంగులో మెరిసేతత్వం ఉంటుంది. మంచి డ్రైయింగ్ క్వాలిటీ ఉండడంతో ఖరీదుదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. యల్లో మిర్చి, దీపిక, 1048, తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. -
గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి
వర్ధన్నపేట: యువకులు సంఘాలుగా ఏర్పాడి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేరా యవ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభ్యాస్ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. యువ మండల్ అభ్యాస్ ద్వారా యువజన సంఘాల అభివృద్ధితో పాటు గ్రామాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. యువత సంఘాలుగా ఏర్పడి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. మండల పరిఽధిలో క్రీడా స్టేడియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం పాల్గొన్న యువకులకు సర్టిఫికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింత అన్వేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్యాదవ్, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల నుంచి యువకులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్మన్ సారంగపాణి -
బోనస్ సంబురం
ఖిలా వరంగల్: రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వానాకాలం సన్న ధాన్యం బోనస్ బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గడిచిన వానాకాలంలో జిల్లాలోని 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పీఏసీఎస్ సొసైటీలు, మెప్మా, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 39,567 మంది రైతుల నుంచి 1,62,269.40 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జనవరి మొదటి వారానికే ధాన్యం సేకరణ పూర్తి కాగా సన్న రకాలకు సంబంధించి క్వింటాకు రూ.500ల చొప్పున బోనస్ మొత్తం రూ.79,20,58,800 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో శనివారం సాయంత్రం వరకు రూ.78,23,58,800కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయగా మరో రూ.97 లక్షలు విడుదల కావాల్సి ఉంది. రైతుకు ప్రోత్సాహం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చే స్తుండటంతో స్థానిక అవసరాలు పెరిగా యి. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వరి సాగు గణనీయంగా పెరగడంతో రాష్ట్రం నుంచి దొడ్డుబియ్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం గత సీజన్లలో సేకరించిన దొడ్డు ధాన్యం మిల్లులు, బియ్యం గోదాముల్లో పేరుకుపోయాయి. గత వానాకాలం నుంచి సన్నాలను సాగు చేయించాలనే ప్రభుత్వ ఆదేశాలతో రైతులు సన్న ధాన్యం పంటకు మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రభుత్వం రూ.500లు బోనస్ రూపేనా చెల్లించి పోత్సహిస్తోంది. జిల్లాలో 1,62,269 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జిల్లాలో గత వానాకాలంలో సుమారు 1,62,269.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 265 కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం సేకరించింది. వీటిలో 1,67,269 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యానికి సంబంధించిన రూ.79,20,58,800 కోట్లను ప్రభుత్వం రైతులకు బోనస్ రూపంలో చెల్లించాలి. సన్న రకం క్వింటాకు రూ.500లు బోనస్ చెల్లింపులకు చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.78,23,58,800 కోట్లు బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా రూ. 97 లక్షలు మాత్రమే జమ చేయాల్సి ఉంది. రైతుల ఖాతాల్లో రూ.78.23 కోట్లు జమ జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం -
జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, జాతర విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ అన్నారు. హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్లోని తన కార్యాలయంలో గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో శనివారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్–నర్సంపేట రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, ప్రభబండ్లతో వచ్చే వారు సంయమనం పాటించి గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలకు పాల్పడవద్దని నోటీసులు జారీ చేయగా.. తాము జాతర ప్రశాంతంగా జురగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డీసీపీకి మాట ఇచ్చారు. మామునూరు, నర్సంపేట ఏసీపీలు వెంకటేశ్, రవీందర్రెడ్డి, గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్, సాయిరమణ, శ్రీనివాస్, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రాజ కీయ నాయకులు అల్లం బాలకిశోర్రెడ్డి వీరగోని రాజ్కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, కన్నెబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి సమీక్షలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ -
బైక్ స్టంట్స్.. ప్రోషో అదుర్స్
● రణీనారెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండవ రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కొ నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైం సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనారెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. -
ఉపాధ్యాయులకు మంచి రోజులు
● ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి గీసుకొండ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంచి రోజులు రానున్నాయని, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్కార్డుల జారీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు తీరనున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. గంగదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అరుకాల స్వరూపారాణి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. స్వరూపారాణి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, విద్యార్థులకు మంచి బోధనచేసి నడవడిక నేర్పారని పేర్కొన్నారు. అనంతరం స్వరూపారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు అబ్దుల్ రజాక్, ప్రముఖ సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్రెడ్డి, సర్పంచ్ కూసం స్వరూప, ఏఏపీసీ చైర్మన్ నాగిరెడ్డి లావణ్య, ఎంఈఓ రవీందర్, అల్లం బాలిరెడ్డి, పీఎస్ హెచ్ఎం జెసింత, పీఆర్టీయూ జల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్, నాయకులు ఎడ్ల ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్ గుర్తుకురాలేదా?
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావు శనివారం కాజీపేట పర్యటనపై ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించారన్నారు. వరంగల్ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, పర్యటనల పేరుతో పదేళ్లు పబ్బం గడిపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీలంతా కాజీపేటకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు కాజీపేట పర్యటన.. స్వామి కార్యం, స్వకార్యంగా ఉందని హేళన చేశారు. సీఎం రేవంత్ను కలిసిన నాయిని సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఇటీవల కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. సొంతగడ్డపై మమకారంతో వైద్య రంగానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సుజిత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, విష్ణురెడ్డి ఉన్నారు. -
బైక్ స్టంట్స్.. ప్రో షో అదుర్స్
● రణీనా రెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండో రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కో నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైమ్ సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్ వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనా రెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల బైక్ విన్యాసాలు -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ధరలు బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే అల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. – అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
నెక్కొండ: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తునట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతంరెడ్డి అన్నారు. నెక్కొండ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గౌతంరెడ్డి ఆదేశించారు. నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఏ శ్రీధర్, ఏఈలు చిరంజీవి, సంపత్, సబ్ ఇంజనీర్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి
గీసుకొండ: ఎంచుకున్న లక్ష్యాలను సాధించే విషయంలో ఎదురుగా ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలని, ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు సాగాలని కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాల, వంచనగిరి కేజీబీవీలో శనివారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రెండు మోటివేషనల్ వీడియోలను విద్యార్థులకు చూపించి ఆత్మన్యూనతను వీడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులు భయాందోళన వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి ఈ వీడియోలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంతకుముందు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజనం, తరగతులు, పాఠశాలల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంఈఓ రవీందర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, హెచ్ఎం సాంబయ్య పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూపంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకునే పైలట్ ప్రాజెక్టును కలెక్టర్ అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. కలెక్టరేట్లో ఆర్సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. డీబీసీడీఓ పుష్పలత, డీఎస్డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, టెమ్రిస్ ఆర్ఎల్సీ జంగా సతీశ్ ఉన్నారు. కలెక్టర్ను కలిసిన ఆడిట్ టీం.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెంట్రల్ ఆడిట్ టీం శనివారం కలెక్టర్ సత్యశారదను కలిసింది. సంగెం, పర్వతగిరి మండలాల్లో ఎంపికై న గ్రామాల్లో జరుగుతున్న, పూర్తిఅయిన ఉపాధిహామీ పథకం పనుల వివరాలను బృందం కలెక్టర్కు వివరించింది. కేంద్ర బృందంలో అమిత్ శ్రీవాత్సవ్, (టీంలీడర్) పరాష్శర్మ, మోహిత్కుమార్, మధుసూదన్, పీఆర్ కమిషనర్ కార్యాలయం నుంచి మురళి, రఘువీర్ ఉన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి పాల్గొన్నారు. విద్యార్థులకు కలెక్టర్ సత్యశారద పిలుపు రెండు పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం -
మాల సంఘాల జేఏసీ కన్వీనర్గా లక్ష్మీనారాయణ
కాళోజీ సెంటర్: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసి రాహుల్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మాలు, వంగేటి రాజ మౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్, వంగేటి ప్రభాకర్ నియమితులయ్యారు. బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరంకాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షకు 139 మంది గైర్హాజరుకాళోజీ సెంటర్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 139 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. 4,716 మంది జనరల్ విద్యార్థులకు 4,608 మంది, 744 మంది ఒకేషనల్ విద్యార్థులకు 713 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాలిదుగ్గొండి: చట్టసభల్లో ఆరె కులస్తులకు ప్రాతినిథ్యం ఉండాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ ఫంక్షన్హాల్లో ఆరె కుల సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరెకులస్తులు రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. 22 జిల్లాల్లో కులస్తులు సర్పంచ్లుగా పోటీచేసి చాలా మంది గెలుపొందారని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్వర్రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్రావు, నాయకులు కౌడగాని నర్సింహారావు, గుండెకారి రంగారావు, భుజంగరావు, సుకినె రాజేశ్వర్రావు, గుండెకారి రవికుమార్, ఒలిగె నర్సింగరావు, కుసుంభ బాబురావు, ఎడ్డె రఘుపతిరావు, సర్పంచ్లు నాగరాజు, ప్రభు, సుజాత పాల్గొన్నారు. ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రేకంపల్లి గ్రామానికి చెందిన ఒలిగె నర్సింగరావు ఎన్నికయ్యారు. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ శనివారం నియామకపత్రం అందించారు. అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గుండెకారి రవీందర్రావును నియమించారు. -
పోలీసులు పట్టించుకోవట్లేదని రాస్తారోకో
ఎల్కతుర్తి: భూ తగాదాలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలని వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన పలువురు బాధితులు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా–రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. తమకు న్యాయం జరిగేవరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు, పలువురు నాయకుల జోక్యంతో ధర్నాను విరమించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి ప్రమీల భర్త సారయ్య. వారు నలుగురు అన్నదమ్ములు. కాగా, 532 సర్వేనంబర్లో 35 గుంటలు ఉమ్మడి ఆస్తి ఉంది. కొమురయ్య (వరుసకు బావ) అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా పట్టా చేసుకున్నాడు. దీనిపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మార్చి 1న (ఆదివారం) నాడు పంచాయితీ పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు 568, 569 సర్వే నంబర్లో వారసత్వ భూమి గురించి చర్చిస్తే వారి తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో కావాలనే గొడవ తయారు చేసి కొమురయ్య, వారి కుటుంబ సభ్యులు కలిసి మూకుమ్మడిగా ఈనెల 27న తమ ఇంట్లోకి అక్రమంగా చోరబడి కట్టెలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తమ కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా మూడు తులాల వెండి, తులం పుస్తెలు, పాకెట్లో ఉన్న రూ.20 వేలు పోయినట్లు తెలిపారు. అదేవిధంగా ఇంట్లో దాచిన రూ.4.80 లక్షలు పోయినట్లు పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వస్తే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు రహదారిపై ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాదాపు సుమారు 20 మంది బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భూ తగాదాలో పలువురికి గాయాలు హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం -
మోడల్ రాకెట్ విఫలం
ప్రయోగం తుస్.. వీక్షకుల నిరాశ నయీంనగర్: సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి చెరువులోని ఐలాండ్పై ఏర్పాటుచేసిన రుద్రమ–1 మోడల్ రాకెట్ లాంచ్ తుస్మంది. పట్టుమని వంద అడుగులు కూడా ఎగరలేదు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ‘కుడా’ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి తొలుత చిన్న రాకెట్ను లాంచ్ చేయగా.. కొన్ని అడుగుల ఎత్తులోకి వెళ్లి కొంత దూరంలో నేల కూలింది. కొంత సమయం తర్వాత మరో రాకెట్ను ప్రయోగించగా అది కూడా తుస్మంటూ చెరువులో పడింది. మోడల్ రాకెట్ విఫలం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన స్కూల్ విద్యార్థులు, యువత, సైన్స్, ఖగోళప్రియులు, నగర ప్రజలు నిరాశ చెందారు. మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ‘కుడా’, పోలీస్, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలి
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు అన్నారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ‘కోలువుల కోసం కోట్లాట’ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోరాటం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు 50 ఏళ్ల కృషి ఫలితంగానే కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతోందని, కానీ, కోచ్ఫ్యాక్టరీలో అసలు కోచ్లు తయారవుతాయా? వ్యాగన్లు తయారవుతాయా? అసలు ఎంత మందికి ఉద్యోగాలిస్తారు? భూమి ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులకు ఎన్ని ఉద్యోగాలు, స్థానికులకు ఎన్ని ఇస్తున్నారో తేల్చి కేంద్రం గెజిట్ ఇవ్వాలి’ అని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలి.. కేంద్రం లాతూర్, అస్సాం కోచ్ ఫ్యాక్టరీలో మాదిరి ఇక్కడ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ప్రారంభోత్సవానికి వచ్చే బీజేపీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలన్నారు. ఏపీలో విశాఖ రైల్వే జోన్ చేసినట్లు, కాజీపేట డివిజన్గా చేయాలని అందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఎంపీలు ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కాజీపేట నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేసేవరకు పోరాడుతాం స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ఉద్యమం ఉధృతం.. ‘కొలువుల కోసం కొట్లాట’లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
వర్ధన్నపేట: ప్రతి విద్యార్థి హక్కులు, కర్తవ్యంపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ సూచించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్ధన్నపేట మైనారిటీ బాలుర గురుకులంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి అభినందించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ సైన్స్పై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకత, ఆలోచనతో ముందుకుసాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులను వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పస్కుల రాజు మాట్లాడుతూ విద్యార్థుల సమష్టికృషితో సైన్స్ ఫెయిర్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్కుమార్, ఎంపీడీఓ రమణ, సైక్రియాట్రిస్ట్ భరత్, సీఐ శ్రీనివాసరావు, చీఫ్లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సురేశ్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ -
ఆ.. ముగ్గురే సూత్రధారులు
● దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా సిబ్బంది కీలకపాత్ర ● చార్జ్షీట్లో పేర్కొన్న సుబేదారి పోలీసులు ● దందాను గతేడాది జూన్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి సాక్షి, వరంగల్: వరంగల్ బాలరక్ష భవన్ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్ 13న దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ‘సాక్షి’లో ప్రచురితంకాగా, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది. అప్పుడలా.. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరారు. ఇప్పుడిలా.. పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏ3 గా మంద ప్రణయ్, సోషల్ వర్కర్తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సి పాల్ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది. -
ఆ.. ముగ్గురే సూత్రధారులు
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందాపై సుబేదారి పోలీసుల చార్జ్షీట్సాక్షి, వరంగల్: వరంగల్ బాలరక్ష భవన్ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్ 13న సాక్షిలో దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ప్రచురితమైతే, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పుడలా.. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరారు. ఇప్పుడిలా.. పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏ3 గా మంద ప్రణయ్, సోషల్ వర్కర్తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా పర్వతగిరి మండలం ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది. నిబంధనలు ఎలా ‘క్యాష్’ చేసుకున్నారంటే.. వాస్తవానికి ఇద్దరు భార్యాభర్తల వయస్సు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వస్తారు. ఇలా నకిలీ సర్టిఫికెట్ల దందాతో తక్కువ వయస్సున్న పిల్లలు అనర్హత కలిగిన దంపతులకు దత్తత వచ్చేలా చేస్తున్నారు. అసలు దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఇవేమీ చెప్పకుండానే దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకువచ్చి వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది. వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటపడుతుండడం రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలోనే పెద్ద చర్చకు దారి తీస్తోంది. గతేడాది జూన్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు, నిందితులుగా తేల్చిన పోలీసులు -
టెండర్ నిలిపివేయాలి
గుట్టపై మైనింగ్ చేయడానికి రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఎన్ఓసీని వెంటనే రద్దు చేయాలి. మైనింగ్ ఽశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలి. ఈ గుట్ట చుట్టూ రైతుల వ్యవసాయ భూములు, బావులు ఉన్నాయి. క్రషర్ ఏర్పాటుతో భూములు బీడుగా మారతాయి. బావులు కూలిపోతాయి. ముఖ్యంగా గ్రామంలోని పశువులు మేత లేక మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గుట్ట ప్రాంతాన్ని గొర్రెల మేత కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ సైతం జారీ చేసింది. ఇదే గుట్టపై వేంకటేశ్వరస్వామి దేవాలయం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. – కుసుమ సతీశ్, బోజెర్వు సర్పంచ్ -
నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వేడుకకు హాజరైన సినీ హీరోయిన్లు నభా నటేష్, సంయుక్త మీనన్● ఆకట్టుకున్న ‘స్వయంభు’ సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో ‘వారెవ్వ ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పేయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలపై డైనోసార్, కమెడియన్, హలోవేషన్, బటర్ఫ్లై, డేంజరస్ మ్యాన్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్ ఫెస్ట్) కలర్ఫుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీ సంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రో షోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. తొలిరోజు ఇలా... స్ప్రింగ్స్ప్రీ–26 తొలిరోజు శుక్రవారం లిటరరీ అండ్ డిబేటింగ్ క్లబ్ సౌజన్యంతో ఓపెన్ మైక్, కవిత్వం, కథనాలు, వ్యంగ్య ప్రదర్శనలు, మిస్టరీ ఆధారిత గేమ్ ఆన్సాల్వ్డ్, సమాజాన్ని మేల్కోలిపే నుక్కడ్ నాటక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తక్కువ సమయంలో కథను రూపొందించి ప్రదర్శించే డైరెక్టర్ స్కిట్, నువ్వా నేనా? అనేలా పోటీపడిన ట్రెజర్ హంట్ గేమ్, వారెవ్వ ఏమి ఫేసు అంటూ ఫేస్ పెయింటింగ్, నా చేతుల్లో హరివిల్లు అంటూ హ్యాండ్ పెయింటింగ్లతో వసంతోత్సవం అలరించింది.విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 52 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 18,803 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,397 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. తనిఖీ చేసిన కలెక్టర్.. హనుమకొండలోని కో–ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తనిఖీ చేశారు. ఈవార్షిక పరీక్షల్లో ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని డీఐఈఓ గోపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో కల్పించిన సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల ప్రశ్నపత్రాలను తెరిచే గదిని సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కు పలు సూచనలిచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్ తదితరులున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈ నెల 28న ఆర్టీసీ హనుమకొండ డిపో నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖిలా వరంగల్ మండల పరిధి ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఖిలా వరంగల్: మార్చి 25న పోస్టల్ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధి డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్/కవర్పై 53 డాక్ అదాలత్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్ అండ్ విజిలెన్స్) పోస్ట్మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్ హైదరాబాద్–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు. విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల్లో కేవలం 10 నుంచి 20 శాతం వరకే ఇస్తున్నారని, ఇలా చెల్లిస్తే మరో 3, 4 ఏళ్లు పడుతుందన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడతున్నామన్నారు. ఈసభలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎండీ అలీ, బాధ్యులు అబ్దుల్ గఫార్, మేకిరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, రఘవీర్, విశ్వనాథం, సారయ్య, శ్యామ్, సమ్మయ్య ఉన్నారు.మరిన్ని ఫొటోలు: 8లో‘నాతో పెట్టుకుంటే రంగు పడుతుంది’ అంటూ విద్యార్థులు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల్లో ఉత్సాహంగా హ్యాండ్ పెయింటింగ్లో పాల్గొన్నారు. ప్లేట్లో రంగును ఏర్పాటు చేసుకుని, దాన్ని అరచేతిలోకి తీసుకుని నా హ్యాండ్ చూడూ అంటూ వాల్పోస్టర్లను రూపొందించారు.కాలేజ్ డేస్.. హ్యాపీ మూమెంట్స్‘వావ్ నిట్ వరంగల్ క్యాంపస్ సూపర్గా ఉంది. కాలేజీ డేస్.. హ్యాపీ డేస్. విద్యార్థి జీవితం మరిచిపోలేని అనుభూతి’ అని సినీహీరో నిఖిల్ సిద్ధార్థ్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై మాట్లాడారు. భారతీయ సినిమాకు గ్లోబల్స్థాయి గుర్తింపు రావడం మనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. స్వయంభు సినిమాతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉందని, నేను చేస్తున్న ప్రతి సినిమాను డిఫరెంట్గా అందజేయాలని ఇలా స్వయంభుతో మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు.థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక ఆదరణసినిమాలు ఎన్ని వచ్చినా కూడా సైలెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుందని డైరెక్టర్స్ కట్లో డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపారు. ‘నాకు హిట్ ప్రాంఛైజ్, ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్లతోనే గుర్తింపు లభించింది. ఎవరికి వారు తమ అభిరుచులకు అనుగుణంగా జీవన ప్రయాణం సాగించాలి. సస్పెన్స్ థ్రిల్లర్లోనూ క్రియేటివిటీ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా అభిమానిస్తారు.. ఆదరిస్తారు’ అని డైరెక్టర్ శైలేష్ కొలను చెబుతున్నారు.నేను చేసే కుండ చూడు.. పాట్ మేకింగ్.. ‘నేను తయారు చేసే కుండ చూడు.. దిసిస్ మై పాట్ మేకింగ్’ అని కుమ్మరులు చేసే మట్టిని సారైపె లయబద్ధంగా తిప్పుతూ వివిధ రూపాల్లో పాత్రలను విద్యార్థులు తయారు చేశారు. వేసవిలో తాగునీటిని చల్లగా ఉంచేందుకు పల్లెల్లో ఇప్పటికీ ఇవే ప్రధానం అంటూ మట్టికుండలను రూపొందించారు. రోజులో 30నిమిషాలకు మించి అంతరాయం కలిగితే అధికారిదే బాధ్యతహన్మకొండ: విద్యుత్ అంతరాయాలపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సీరియస్గా దృష్టి సారించింది. వేసవిలో కోతలు లేని విద్యుత్ అందించడమే లక్ష్యంగా.. యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా లేకుండా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. ప్రధానంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లో పరిమితికి మించి విద్యుత్ అంతరాయాలు జరిగితే సంబంధిత సెక్షన్ అధికారి బాధ్యత వహించాల్సిందే. ప్రతీ రోజు రాత్రి 12 గంటల నుంచి మరునాడు రాత్రి 12 గంటల్లోపు నాలుగుసార్లు పైగా.. విద్యుత్ అంతరాయం జరిగినా, 30 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరాలో కోత విధించడాన్ని యాజమాన్యం సీరియస్గా తీసుకుంటోంది. నాలుగు పర్యాయాల్లో 30 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదు. అలాగని, ఒకేసారి 30 నిమిషాలకుపైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే సంబంధిత సెక్షన్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కటి నిక్షిప్తం.. ప్రతీ సబ్ స్టేషన్కు స్కాడా సాంకేతికతను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వినియోగిస్తోంది. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో విద్యుత్ అంతరాయం కలిగితే టీజీ ఎన్పీడీసీఎల్లో ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో నమోదవుతుంది. దీంతో రోజుకు ఎన్ని పర్యాయాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీని ఆధారంగా ప్రతీ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లు సమీక్షిస్తారు. టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి, ఆపరేషన్ డైరక్టర్ టి.మధుసూదన్ సమక్షంలో డివిజనల్ ఇంజనీర్లతో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లు సమీక్షించి కారణాలు తెలుసుకుంటారు. ప్రతీ రోజు ఉదయం 9.45 నుంచి 10.30 వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల్లోపు ప్రతీ రోజు ఏ సబ్ స్టేషన్ పరిధిలో ఏఏ ఫీడర్లలో ఎన్ని పర్యాయాలు అంతరాయం కలిగిందనే వివరాలను కార్పొరేట్ కార్యాలయం నుంచి డివిజనల్ ఇంజనీర్లకు చేరుతుంది. డివిజనల్ ఇంజనీర్లో సంబందిత సెక్షన్ ఆఫీసర్లు అయిన ఏఈల నుంచి సమాచారం సేకరిస్తారు. అనంతరం జరిగే వీడియో కాన్ఫరెన్స్లో కారణాలను సీఎండీ, ఆపరేషన్ డైరక్టర్, ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లకు వివరిస్తారు. తద్వారా అంతరాయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు.వేసవిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా వేసవి కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 1,524 ఉన్నాయి. 33 కేవీ ఫీడర్లు 691, 11 కేవీ ఫీడర్లు 6,636 ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 11 కేవీ ఫీడర్లు 590 ఉన్నాయి. సబ్ స్టేషన్లను రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కార్పొరేట్ కార్యాలయానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే కచ్చితమైన సమాచారం కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డులో నమోదవుతుంది. తద్వారా ప్రతీ రోజు ఎన్ని సార్లు విద్యుత్ అంతరాయాలు జరిగాయో తెలుస్తోంది. ● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదించిన స్థలం, నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించారు. హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధి అంశంపై ఆర్టీసీ, ‘కుడా’ అధికారులతో చర్చించారు. కాజీపేటలో బస్టాండ్ నిర్మాణంపై సమీక్షించారు. డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్, మధు, ఆ ర్డీఓ రాథోడ్ రమేశ్, ఆర్టీసీ డీఎం ధరమ్సింగ్, తహసీల్దార్ రాజు, అధికారులున్నారు. చట్టం సమర్థంగా అమలు కావాలి జిల్లాలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలు కావాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు బియ్యం పంపిణీ అంశాలపై అధికారులతో సమీక్షించారు. రేషన్ డీలర్ల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సిబ్బంది వివరాలు, పీడీఎస్ రైస్ పంపిణీలో అక్రమాలపై నమోదైన కేసుల స్థితిగతులను జిల్లా పౌర సరఫరాల అధికారి వాజీద్ వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఈఓ గిరిరాజు గౌడ్, ఎన్జీఓ ప్రతినిధి అనితా రెడ్డి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. కార్యాచరణతో.. వేసవిలో విద్యుత్ కోతలు లేని సరఫరానే లక్ష్యం ప్రతీ రోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
బ్లాక్స్పాట్స్ను గుర్తించాలి
న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో శుక్రవారం నిర్వహించిన రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎన్హెచ్ పరిధిలో ఉన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేయాలని సూచించారు. రోడ్లలో లోపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరంగల్ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మున్సిపల్ అధికారులకు తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఆర్అండ్బీ ఈఈ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలి న్యూశాయంపేట: మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం జరిగిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులకు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించాలని సూచించారు. అదేవిధంగా స్ఫూర్తి కార్యక్రమంలో నార్కోటిక్ అధికారులను భాగస్వామ్యం చేసి విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు. రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ సత్యశారద -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రాయపర్తి: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ.38,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎంపీడీఓ కార్యాలయంలో 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్చైర్మన్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, సర్పంచ్ గారె సహేంద్ర, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానించి, భేరీ పూజ తర్వాత స్వామి వారిని అశ్వవాహనంపై గుట్టకిందికి తోడ్కొని వెవెళ్లారు. అనంతరం స్వామివారిని గుట్టచుట్టూ తిప్పారు. అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని పల్లకీలో గుట్టపై నుంచి కిందికి తోడ్కొని వెవెళ్లి గుట్ట దిగువన ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణాన్ని అమ్మవార్లతో వేదపండితులు వైభవంగా నిర్వహించారు. గతం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం కొమ్మాల గ్రామంలోని కొమ్మిడి వంశస్తులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను తమ ఇంటి నుంచి సర్పంచ్ కన్నెబోయిన యమున ఇంటికి, సర్పంచ్ తన ఇంటి నుంచి కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించి దేవతామూర్తులకు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణి, పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రేవూరి -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం కల్చరల్ఫెస్ట్ కలర్పుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. ‘వారేవా ఏమీ ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పెయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలలపై డైనోసార్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. -
బోజెర్వు గుట్టలో క్రషర్ !
చెన్నారావుపేట: మండలంలోని బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేయవద్దని ప్రజలు పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం టెండరు ప్రక్రియ చేపట్టడంతో పంట పొలాలు దెబ్బతింటాయని, జీవనోపాధికి విఘాతం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాలు రెండుసార్లు మైనింగ్ ఆలోచనను విరమించుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ క్రషర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని బోజెర్వు సర్వే నంబర్ 133/1లో సుమారు 50 ఎకరాల్లో రాతిగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్ట మీద సుమారు 11 ఎకరాల్లో మైనింగ్కు అనుమతి ఇవ్వొచ్చంటూ రెవెన్యూ శాఖ ఇటీవల నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చింది. దీంతో గుట్ట మీద 11 ఎకరాల్లో మైనింగ్ చేసి కంకర విక్రయించడానికి క్రషర్ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వ్యాపారుల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మార్చి 2వ తేదీ వరకు గడువు ఉండగా శుక్రవారం వరకు ఐదు టెండర్లు దాఖలైనట్లు అధికారుల ద్వారా తెలిసింది. రైతుల ఆందోళనతో రెండుసార్లు ఎన్ఓసీ రద్దు బోజెర్వు గుట్టకు మైనింగ్ చేయడానికి గతంలో రెండుసార్లు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. ఓ కాంట్రాక్టర్ క్రషర్ ఏర్పాటుకు ముందుకు రాగా.. పంట పొలాలు నాశనం కావడమే కాకుండా గ్రామంలోని నాలుగు వేల గొర్రెలకు మేత కరువయ్యే ప్రమాదం ఉందంటూ రైతులు, గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళనలు చేపట్టారు. దీంతో తొలుత 2013లో నాటి ప్రభుత్వం క్రషర్ ఏర్పాటుపై ఎన్ఓసీ రద్దు చేసింది. అనంతరం 2021లో మళ్లీ క్రషర్ ఏర్పాటుకు టెండరు ప్రక్రియ చేపట్టగా ఓ కాంట్రాక్టర్ దరఖాస్తు చేశాడు. తహసీల్దార్ ఎన్ఓసీ ఇచ్చినా గ్రామసభలో ప్రజలు వ్యతిరేకించడంతో నాటి ప్రభుత్వం రద్దు చేసింది. క్రషర్ ఏర్పాటు చేస్తే భారీ నష్టం బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేస్తే తమకు భారీ నష్టం తప్పదని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ నుంచి వచ్చే దుమ్మూధూళికి పంట పొలాలు దెబ్బతింటాయని, వాపోతున్నారు. బాంబుల మోతతో వ్యవసాయ బావులు పూర్తిగా ధ్వంసమవుతాయని పేర్కొంటున్నారు. వాయుకాలుష్యం ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు.. క్రషర్ ఏర్పాటు చేస్తే గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ధ్వంసం ఖాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. ఆలయ పరిరక్షణ కోసం సైతం వెంటనే మైనింగ్ ఎన్ఓసీ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్ఓసీ రద్దు చేయాలని వినతి.. బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేయకుండా ఎన్ఓసీ రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. బోజెర్వు గ్రామంలోని గుట్టటెండర్ పిలిచిన అధికారులు మైనింగ్కు 11 ఎకరాల భూమి కేటాయింపు పొలాలు దెబ్బతింటాయని రైతుల ఆందోళన ఎన్ఓసీ రద్దు చేయాలని డీఆర్వో, ఎమ్మెల్యేకు వినతి -
దేశీ మిర్చికి రికార్డు ధర
వరంగల్: ప్రస్తుత సీజన్లో దేశీ మిర్చి రకానికి రికార్డు ధర క్వింటాల్కు రూ.50 వేలు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు 9 బస్తాల మిర్చిని తీసుకురావడంతో అంబికా కంపెనీ అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా క్వింటాల్కు రూ.50 వేలు చెల్లించి కొనుగోలు చేశారు.ఇటీవల ఇదే రకం మిర్చి క్వింటాల్కు రూ.36 వేలు పలుకగా శుక్రవారం అత్యధికంగా రూ.50 వేలు ధర పలికిందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్కు 300 బస్తాల దేశీ మిర్చి రకం వచ్చిందని, క్వింటాల్కు గరిష్ట ధర రూ.50 వేలు కాగా కనిష్ట ధర రూ.18 వేలు, మోడల్ ధర రూ.30 వేలు పలికిందన్నారు. -
మార్కెట్లో సదుపాయాల కల్పనకు కృషి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులకు మౌలిక సదుపాయాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఐదువేల మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, గోదాం చుట్టు సీసీ రోడ్డు నిర్మాణంలో హమాలీలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చాహత్ బాజ్పాయ్ వివరాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ప్రభుత్వం నియమించింది. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఐటీడీఏ పీఓ టు కరీంనగర్ కలెక్టర్.. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. పూర్తి పేరు: పి.స్నేహ శబరీష్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2017 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: కేరళ రాష్ట్రం కుటుంబం: ఆమె భర్త డాక్టర్ శబరీష్, ఐపీఎస్ (2017 బ్యాచ్). ఆయన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: ప్రాథమిక, ఉన్నత విద్య కేరళలో పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో (యూపీఎస్సీ 2016) జాతీయస్థాయిలో 47వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా, జోనల్ కమిషనర్గా సేవలందించారు. 2025 జూన్ 12న హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గురువారం జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్గా నియమితులు కాగా.. ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీగా పనిచేసే అరుదైన అవకాశం కలిగింది.పూర్తి పేరు: చాహత్ బాజ్పాయ్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2019 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: ఢిల్లీ సివిల్స్ ర్యాంకు: యూపీఎస్సీ, 2018 పరీక్షలో జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించారు. విద్యార్హతలు : ప్రాథమిక విద్య ఢిల్లీలో సాగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. కాగా, తెలంగాణలో యువ ఐఏఎస్ అధికారిగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) పనిచేశారు. అక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కషి చేశారు. 2025 జూన్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా నియమితులైన బాజ్పాయ్.. స్నేహ శబరీష్ బదిలీ తర్వాత ప్రభుత్వం ఆమెను హనుమకొండ కలెక్టర్గా గురువారం నియమించింది. చాహత్ బాజ్పాయ్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. సందీప్కుమార్ ఝా వివరాలు..సందీప్ కుమార్ ఝా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పంత్నగర్లోని జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుంచి అగ్రికల్చర్లో డిగ్రీ, ఆనంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి పీజీ డిప్లొమా పొందారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా, టీఎస్ ట్రాన్స్కో జేఎండీగా సందీప్కుమార్ పనిచేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులను పట్టించుకోలేదని, ప్రజాపాలన దినోత్సవానికి ఆలస్యంగా వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. విధుల పరంగా గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించారన్న పేరున్నా.. 2025 అక్టోబర్లో ఆయనను హైదరాబాద్కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న సందీకుమార్ ఝాకు ప్రభుత్వం జనగామ కలెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్బాజ్పాయ్.. ‘గ్రేటర్’ కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీగ్రేటర్ వరంగల్ ఇన్ ? అవుట్ చాహత్ బాజ్పాయ్ హనుమకొండ ఇన్ చాహత్ బాజ్పాయ్ అవుట్ స్నేహ శబరీష్ జనగామ ఇన్ సందీప్కుమార్ ఝా అవుట్ షేక్ రిజ్వాన్ బాషా మహబూబాబాద్ ఇన్ స్నేహ శబరీష్ అవుట్ అద్వైత్సింగ్ ఏటూరునాగారం ఐటీడీఏ ఇన్ ? అవుట్ చిత్రామిశ్రాస్నేహ శబరీష్ వివరాలు.. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 52 కేంద్రాల్లో తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ కలిపి 18,768మందికి, 18,375 మంది (98శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు డీబార్.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు 4,705 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ తెలిపారు. 98 శాతం మంది విద్యార్థుల హాజరు -
నేడు రాకెట్ ట్రయల్ రన్
నయీంనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా భద్రకాళి బండ్ ప్రామినాడ్ వద్ద నిర్వహించనున్న రుద్రమ–1 రాకెట్ ప్రయోగానికి ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కుడా కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, విద్య, కుడా, మున్సిపల్ శాఖల అధికారులు, రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి, నిట్ ప్రొఫెసర్ అంజన్కుమార్తో కలెక్టర్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ప్రజల రాకపోకలు, సమన్వయ విధానాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5:30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ లాంచింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు వెల్లంకి రాకెట్ ప్రయోగంపై ప్రసంగిస్తారని తెలిపారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ప్రజలకు సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత ప్రవేశం ఉందని తెలిపారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్గౌడ్, ఎంఆర్ఓ రవీందర్రెడ్డి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
జాతీయస్థాయి అవార్డు రావడం గర్వకారణం
ముల్కనూరు మహిళా సహకార డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ భీమదేవరపల్లి: మండలంలోని ముల్కనూరు మహిళా సహకార డెయిరీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) వారి రీజినల్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డు–2025 లభించడం గర్వకారణమని డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అన్నారు. హైదరాబాద్లో గురువారం ఆమె అందుకుని మాట్లాడారు. సహకార రంగంలో విశిష్ట సేవలు, పారదర్శక నిర్వహణ, మహిళా సాధికారతలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు తెలిపారు. పాలసేకరణ పెరుగుదల, సభ్యుల సంఖ్య విస్తరణ, ఆధునిక సాంకేతిక పద్ధతుల అమలు, మహిళా రైతులకు సమయానికి చెల్లింపుల వంటి అంశాల్లో డెయిరీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. డైయిరీ ప్రతినిధులు రవీందర్, మహిళలు పాల్గొన్నారు. -
నిట్లో వసంతోత్సవం సందడి
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా 1978లో ప్రారంభమైన స్ప్రింగ్ స్ప్రీ (వసంతోత్సవం) దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. ఈనెల 27, 28 తేదీల్లో స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలను నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను పంచుకునే వేదికగా వసంతోత్సవం నిలువనుంది. రెండు రోజుల పాటు 40కుపైగా ఈవెంట్స్, డైరెక్టర్స్ కట్లో కై లాశ్ కొలను, స్వయంభూ మూవీ టీం ఇంటరాక్షన్, ప్రోషోలో జోనితా గాంధీ, రాణీనారెడ్డి మ్యూజిక్ ప్రదర్శనలు అలరించనున్నాయి. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని నిట్ క్యాంపస్ను గోల్డెన్ లైట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. ఎంజాయ్ కల్చరల్ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 అంటూ సినీహీరో, దర్శకుడు అడవి శేషు సందడి చేశారు. నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్ప్రింగ్ స్ప్రీ–26ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడారు. డెకాయిట్ మూవీ షూటింగ్ యూరప్లో జరుగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు యూరప్ నుంచి నిట్కు వచ్చానని తెలిపారు. డెకాయిట్ మూవీలోని రూబరు సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సాంగ్కు విద్యార్థులు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. స్ప్రింగ్ స్ప్రీ–26 ప్రారంభోత్సవంలో సందడిగా గడిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రారంభించిన సినీహీరో అడవి శేషు రూబరు సాంగ్కు విద్యార్థుల స్టెప్పులు నేడు, రేపు స్ప్రింగ్ స్ప్రీ–2026 వేడుకలు -
భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని గురువారం సినీనటుడు అడవి శేషు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. శేషు అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు https:///tgss.telangana.gov. inలో రిజి స్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మూడో తరగతి పూర్తి చేసుకుని 1 సెప్టెంబర్ 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు, 610 మీటర్ల షటిల్రన్, మెడిసిన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి బోనోఫైడ్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, తహసీల్దార్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన, కులధ్రువీకరణ పత్రాలు, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్, ఒరిజినల్ పత్రాలు వెంట తీసుకురావాలని కోరారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండలస్థాయి, మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాస్థాయి, ఏప్రిల్ 27 నుంచి మే1 వరకు రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● నాభర్త ప్రాణాలు కాపాడండి ● ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఏఎస్సై భార్య వేడుకోలు వరంగల్ క్రైం: పోలీస్ శాఖలో సుమారు 40 ఏళ్లు పనిచేసి రిటైర్మెంట్ అయిన నా భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి భార్య విజయలక్ష్మి ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. వాట్సాప్లో ఆమె అభ్యర్థన వైరల్గా మారింది. గతేడాది రిటైర్డ్ అయిన మూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందలేదు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు తెచ్చిన అప్పులు భారంగా మారడంతోపాటు భర్త తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొంది. ఇంటి కిరాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ విషయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేరే విధంగా అధికారులు సహకరించాలని విజయలక్ష్మి కోరుతోంది. -
కేఎంటీపీ పనుల్లో వేగం పెంచాలి
● పూర్తి చేస్తే మరిన్ని పరిశ్రమలకు అవకాశం ● కలెక్టర్ సత్యశారదగీసుకొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కేఎంటీపీలో జరుగుతున్న పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణం, ఆర్ఓబీ, గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కేఎంటీపీకి రహదారి, విద్యుత్, తాగునీటి వసతుల పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తయితే మరిన్ని పరిశ్రమల వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్టీఓ సుమ, జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శన మండలంలోని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ సత్యశారద సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలను, పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధన చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్తేజ, ఎంఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టాలి న్యూశాయంపేట: జిల్లాలో చేపట్టనున్న జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణానికి అవసరైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులు సకాలంతో పూర్తయితే రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖలు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
వర్ధన్నపేట: మేలైన యాజమాన్య పద్ధతులతో ఆ యిల్ పామ్లో అధిక దిగుబడి సాధించవచ్చని జి ల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఇల్లందలో గురువారం తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు ఆయిల్ పామ్ క్షేత్రంలో ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగులో రైతు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయిల్ పామ్లో నీటి, ఇరుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యల ద్వారా అధిక ఆదాయం పొందడానికి ఆచరించాల్సిన పద్ధతలను శ్రీనివాసరావు వివరించారు. పశువుల ఎరువు, సహజ ఎరువులు వాడాలని సూచించారు. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో సాగవుతున్న పంట కొనుగోలు విధానం ఫ్యాక్టరీ నిర్మాణం తదితర విషయాలను రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ అధినే త సతీష్నారాయణ వివరించారు. మండల ఉద్యా న అధికారి రాకేష్ రాయితీ వివరాలు యూరియా వాడకంపై వివరించారు. భవాని ప్రసాద్, సర్పంచ్ సాంబయ్య, జ్యోతి, కృష్ణారెడ్డి, కల్యాణ్ ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి
ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతీరు మెరుగుపర్చాలని జిల్లా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బృందం నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. మండలంలోని బుధరావుపేట ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. బృందం సభ్యులు కుమారస్వామి, రఘు, హెచ్ఎం భద్రు, ఉపాధ్యాయులు రవీంద్రచారి, స్వర్ణలత, సంపూర్ణ, రాజ్కుమార్, సీఆర్పీ భాస్కర్ పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ గీసుకొండ: వంచనగిరి కేజీబీవీని జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు గురువారం సందర్శించారు. టీం–2 నోడల్ అధికారి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఉ పాధ్యాయినుల పనితీరు, రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యాబోధన కార్యక్రమాలను తెలుసుకున్నారు. బృందం సభ్యులు రామా సంతోష్, ఆనందమోహన్రావు, శ్రీనివాసరావు, డాక్టర్ భాస్కర్, మంద రాజు , చక్రవర్తుల నాగార్జునరావు, సంపత్, కేజీబీవీ ఎస్ఓ హిమబిందు, టీచర్లు పాల్గొన్నారు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు ముగ్గురు డీబార్ ● గైర్హాజరైన 147 మంది విద్యార్థులు కాళోజీ సెంటర్/పర్వతగిరి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు గాను 4,705 మంది హాజరు కాగా 116 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి గాను 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను సమీక్షించారని తెలిపారు. -
ఈజీఎస్ రిజిస్టర్లను సమగ్రంగా నిర్వహించాలి
● సెంట్రల్ ఆడిట్ బృందం సభ్యులుసంగెం: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో చేపట్టుతున్న పనుల రిజిస్టర్లు, మస్టర్లను సమగ్రంగా నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సెంట్రల్ ఆడిట్ బృందం టీం లీడర్ అమిత్ శ్రీవాస్తవ్ సూచించారు. మండలంలోని మొండ్రాయి, నర్సానగర్, బీకోజీనాయక్ తండాలను గురువారం ఆడిట్ బృందం సందర్శించింది. మొండ్రాయిలో 2025–26 కాలనికి సంబంధించి రికార్డులు, నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, నర్సానగర్లో కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మొండ్రాయిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సానగర్లో కూలీల హాజరు, మస్టర్ల నిర్వహణలో మహిళా కూలీలు, పురుష కూలీలను వాస్తవ హాజరు వేయడాన్ని పరిశీలించి సంసతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు పని ప్రారంభించినపుడు, 4 గంటల పని అనంతరం ముగింపు సమయంలో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని అలా చేస్తే హాజరు పడి కూలీలకు డబ్బులు వస్తాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో పనుల నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్ బృందం సభ్యులు పారాస్ శర్మ, మోహిత్ కుమార్, డీఆర్డీఓ రాంరెడ్డి, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, ఎంపీడీఓ రవీందర్, పీఆర్ఏఈ అభిరామ్, ఏపీఓ గణేష్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ జాన్పాకలో 15, 16, 17 డివిజన్లు, సంగెం మండలానికి చెందిన మొత్తం 50 మంది ముస్లిం మహిళలకు కలెక్టర్ సత్యశారదతో కలిసి గురువా రం ఆయన కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కుట్టులో శిక్షణ పొందితే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఆర్డీఓ సుమ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్, తహసీల్దార్ ఎండీ.రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు కొమురారెడ్డి, చిన్న, మాధవరెడ్డి, సంతోష్, ప్రవీణ్, సాల్మన్, మహ్మద్ జానీ ఉన్నారు. -
‘ఈ–నామ్’తో ఇబ్బందులు
వరంగల్: డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈ– నామ్లో 1.0 సాఫ్ట్వేర్ను అమలు చేస్తోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్లో పసుపుతోపాటు అపరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా అమలు చేయాలని మార్కెటింగ్ అధికారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం వరంగల్ మార్కెట్లో 2.0 వెర్షన్లో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మార్కెట్లో మధ్యాహ్నం 12గంటల వరకు ఈ–నామ్ పోర్టల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను రాష్ట్ర అధికారులకు వివరించగా వారం రోజులపాటు పాతవెర్షన్ (పద్ధతి)లో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. ఈ–నామ్ పేరుతో గంటల తరబడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయడంతో పసుపు, అపరాల యార్డుల్లోని రైతులు ఆందోళన చెందారు. కొత్త సాఫ్ట్వేర్తో తిప్పలు పాత పద్ధతిలోనే కొనుగోళ్లు -
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వరి, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. కాజీపేట అర్బన్: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. కాజీపేట మండలం రాంపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదో తరగతి, ఏడో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి జయించి, విజయం సాధించాలని కోరారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ రాజు, ఎంఈఓ మనోజ్కుమార్, హెచ్ఎం వేణుఆనంద్ పాల్గొన్నారు. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాల్లో మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ల పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి 19,638 మంది విద్యార్థులకు 19,099 మంది (97 శాతం) హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐఈఓ, చీఫ్ సూపరింటెండెంట్ సునీత, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లో 262 మంది గైర్హాజరు.. కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం 5,680 మంది విద్యార్థులకు 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. ఇదిలాఉండగా.. నేటి(గురువారం) నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హనుమకొండ జిల్లాలో 97 శాతం విద్యార్థుల హాజరు -
పార్కు స్థలం కబ్జాకు యత్నం!
● నగరం నడిబొడ్డున విలువైన 450 గజాల భూమి ● డాక్యుమెంట్లు పట్టుకుని ఈ స్థలం చుట్టూ తిరుగుతున్న నలుగురైదుగురు ● కబ్జాలో భాగంగా బోరు వేసిన ఆక్రమణదారులు.. అడ్డుకున్న స్థానికులుహన్మకొండ: హనుమకొండ 59వ డివిజన్ పరిధి ఎకై ్సజ్ కాలనీలో విలువైన కార్పొరేషన్ పార్కు స్థలం కబ్జాకు కొందరు వ్యక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. రూ.కోట్ల విలువ చేసే ఈ స్థలం కబ్జాకు నలుగురైదురు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ నెల 24న కొందరు వ్యక్తులు ఆ స్థలంలో బోరు తవ్విస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత.. సుబేదారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతి ఉంటేనే బోరు వేయాలని, అనుమతి పత్రాలు చూపించాలని వారు కోరగా త్వరలో పర్మిషన్ వస్తుందని కబ్జాదారులు బదులిచ్చారు. పర్మిషన్ వచ్చిన తర్వాతనే బోరు తవ్వాలని పోలీసులు, కార్పొరేటర్ ఆదేశించడంతో కబ్జాదారులు వెళ్లిపోయారు. ఇప్పటికే కొంతభాగం ఆక్రమణ.. పార్కు స్థలం దాదాపు 450 గజాలుంటుందని, దీని విలువ రూ.2కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. స్థలంలో కొంతభాగం ఇప్పటికే కొందరు ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నారని, ఇందులో ఒకరు ఓ భవనాన్ని అమ్మకానికి పెట్టారని స్థానికులు తెలిపారు. -
5 వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ అర్బన్/హన్మకొండ చౌరస్తా: ఖాళీ స్థలాలు కలిగి ఉండి, అర్హులైనవారు ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కోరారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తులను హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేస్తే బహుమానం ఇస్తామని తెలిపారు. ఫ్లోర్లీడర్ ఆఫీస్లో ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే నాయిని కోరారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. ఫిర్యాదు చేస్తే బహుమానం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ఇటు కుడాకు.. అటు రైతుకు లాభం
సాక్షి, వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూముల కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే రైతుల పరోక్ష పాత్ర.. కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడాను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉనికిచర్ల లేఅవుట్ సక్సెస్తో ముందుకొస్తున్న రైతులు ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయించడం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికివచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది. ల్యాండ్ పూలింగ్లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో) గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు ఆత్మకూరు 30 84,000 42,000 42,000 చింతగట్టు 25 70,000 35,000 35,000 ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000 చింతలపల్లి 50 1,40,000 70,000 70,000 -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు : సీపీ
వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిరంతర చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మత్తుపదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.శేషాద్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఫారిన్ డిప్యుటేషన్పై రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన శేషాద్రి మాతృ సంస్థ పంచాయతీరాజ్ శాఖకు తిరిగి వెళ్లగా హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నయీంనగర్: భూసేకరణ కోసం కుడా డిప్యూటీ కలెక్టర్గా అడ్ల రవీందర్రెడ్డిని బుధవారం ప్రభుత్వం నియమించింది. ఆర్డీఓ నుంచి పదోన్నతి పొందిన ఆయన డిప్యూటీ కలెక్టర్గా డిప్యుటేషన్పై కుడాకు వచ్చారు. -
ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్ సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
వరంగల్
చీఫ్ ఇంజనీర్ అక్రమాలు? ఓ చీఫ్ ఇంజనీర్ అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం టీజీ ఎన్పీడీసీఎల్లో కలకలం సృష్టించింది.గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూములు కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులనుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే రైతుల పరోక్ష పాత్ర... కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడా ను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచెర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉనికిచెర్ల లేఅవుట్ సక్సెస్తో ముందుకొస్తున్న రైతులు ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ ఇటు కుడాకు...అటు రైతుకు లాభం..ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులకు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికి వచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది. ల్యాండ్ పూలింగ్లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో) గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు ఆత్మకూరు 30 84,000 42,000 42,000 చింతగట్టు 25 70,000 35,000 35,000 ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000 చింతలపల్లి 50 1,40,000 70,000 70,000 -
దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి
రాయపర్తి: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం అధ్యాపకుల నియామకాల్లో దివ్యాంగులకు రోస్టర్ పాయింట్ల విధానం అమలు చేయాలని వీసీ ప్రతాప్రెడ్డిని కోరినట్లు డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్పాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగులకు అధ్యాపకులుగా అవకాశం కల్పింఆచలని వీసీతోపాటు రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, శ్రీశైలం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో కాపరి మృతి నెక్కొండ: ఓ రైతు తన పొ లం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఎర్త్ తగిలి మేకల కాపరి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై మహేందర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దకోర్పోలుకు చెందిన చెందిన మట్టె ఏలియా (50) రోజూ మాది రిగానే మేకలను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులోని లోట్లవాగు సమీపంలో గోదాం వద్ద కోతులు బెడద ఉంది. దీంతో ఓ రైతుల తన పొలం చుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మేకలు పొలం వద్దకు వెళ్లగా ఏలియా వాటిన అడ్డుకునే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ ఎర్త్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఏలియాకు కూతురు, భార్య ఉంది. భార్య సుభద్ర ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. -
లింగగిరిలో ఎలుగుబంటి ప్రత్యక్షం
చెన్నారావుపేట: మండలంలోని లింగగిరి గ్రామం చెన్నకేశవస్వామి దేవాలయం సమీపంలోని గుట్టల్లో బుధవారం ఉదయం ఎలుగుబంటి రైతుల కంటపడింది. గుట్టల వైపు నుంచి పలువురు రైతుల పంట పొలాల్లో గత రెండు రోజులుగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంటితోపాటు రెండు పిల్లలు సైతం ఉన్నట్లు రైతులు తెలిపారు. దీంతో సర్పంచ్ రజితకుమారస్వామి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నర్సంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి సరిత, బీట్ అధికారి యోగేష్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్రెడ్డి ఆధ్వర్యంలో ఎలుగుబంటి కోసం రెష్కూ టీమ్ పంటపొలాల్లో అన్వేషించింది. ఎంత వెతికినా ఎలుగుబంటి ఆచూకీ లభించలేదు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు పలుసూచనలు చేశారు. రాత్రిపూట ఎవరూ పొలాల వద్దకు వెళ్లొద్దని, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత మాత్రమే వెళ్లాలని సూచించారు. పొలాల వద్దకు వెళ్లేటప్పుడు అగ్గిపెట్టే తప్పకుండా వెంట తీసుకెళ్లాలని, ఎలుగుబంటి కనిపిస్తే నిప్పు పెట్టాలని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు పట్టుకోవడానికి ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు -
తూము నిర్మాణానికి స్థలపరిశీలన
దుగ్గొండి: మండలంలోని కంచర్లచెరువులోకి ఎస్సారెస్పీ నీటిని తరలించడానికి సాగునీటిశాఖ అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. కంచర్లచెరువు కింద భూములు కలిగిఉన్న మల్లంపల్లి, చంద్రయ్యపల్లి, బల్వంతాపురం, బొబ్బరోనిపల్లి గ్రామాల రైతులు నీరు లేక భూములు సాగుచేసుకోలేకపోతున్నారు. ఈసారి రైతులు వరిసాగు చేయగా నీరుసరిపడా లేక ఎండిపోయే ప్రమాదం వచ్చింది. దీంతో రైతులంతా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విషయం తెలియజేశారు. స్పందించిన ఆయన పరిశీలన చేయాలని సాగునీటిశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఎస్ఈ స్వామి ఎస్సారెస్పీ డీబీఎం –38 కాల్వకు చెందిన 14ఎల్ ఉపకాల్వకు తూము ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తూము ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ నీరు కంచర్ల చెరువులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సాగునీటిశాఖ ఈఈ సుదర్శన్, డీఈ రామకృష్ణ, ఏఈ పవిత్ర, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, సర్పంచ్ బూర రాధిక–చందుగౌడ్, రైతులు ఎర్ర ఆదిరెడ్డి, ఎండీ సర్వర్, కక్కెర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఈ–నామ్’లో ఇబ్బందులు
వరంగల్: డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–నామ్లో 1.0 సాఫ్ట్వేర్ను అమలు చేస్తోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్లో పసుపుతోపాటు అపరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా అమలు చేయాలని మార్కెటింగ్ అధికారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం వరంగల్ మార్కెట్లో 2.0 వెర్షన్లో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మార్కెట్లో మధ్యాహ్నం 12గంటల వరకు ఈ–నామ్ పోర్టల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను రాష్ట్ర అధికారులకు వివరించగా వారం రోజులపాటు పాతవెర్షన్ (పద్ధతి)లో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. రైతుల ఆందోళన.. ఈ–నామ్ పేరుతో గంటల తరబడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయడంతో పసుపు, అపరాల యార్డుల్లోని రైతులు ఆందోళన చెందారు. సులువైన పద్ధతిలో పంట విక్రయాలు జరిగేలా చూడాలని, సంక్లిష్టమైన నిబంధనలతో తమను వేధించవద్దని వారు డిమాండ్ చేశారు.● కొత్త సాఫ్ట్వేర్తో తిప్పలు ● పాత పద్ధతిలోనే కొనుగోళ్లు -
పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి
● వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి వర్ధన్నపేట: అధికారులు, సిబ్బంది వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేసి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ము న్సిపల్ కమిషనర్ సుధీర్కుమార్, అధికారులు, సిబ్బంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం, దోమల నివారణకు ఫాగింగ్, వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం తదితర అంశాల పై చర్చించారు. ఏమైనా సమస్యలు ఉన్నపుడు తన దృష్టికి తీసుకురావాలని, వార్డు కౌన్సి లర్లు అందరూ సమన్వయంతో ముందుకు సాగుతామని వారిచ్చే సలహాలను సూచనలను తప్పనిసరిగా స్వీకరిస్తామన్నారు. అనంతరం ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందచేశారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ నేనావత్ షీభారాణి, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, బానోతు జ్యోతి, గుజ్జ వీరన్న, నూనావత్ కమిలి, మాలోతు దేవేందర్, తిరుపతి సురేష్, సిలువేరు రమ, అరుణ, కుమారస్వామి, వాణి, తదితరులు పాల్గొన్నారు. చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి● గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: ఇంటింటా చెత్త సేకరణలో సమయపాలన పాటించాలని, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు నిర్ణీత సమయంలో వాహనాలు చేరుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండ బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ షెడ్కు చేరే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు తడి, పొడి చెత్తను వేరు గా తీసుకొస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
● ప్రథమ సంవత్సరం పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరు ● నేడు రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభంవిద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్న సిబ్బందిహంటర్ రోడ్డులోని షైన్ జూనియర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం విద్యార్థులు 5,680 మందికి గాను 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు గాను 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించినట్లు తెలి పారు. డీఈసీ సభ్యులు కె.మాధవరావు, విజయనిర్మల పూర్తిస్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. కాగా నేటి(గురువారం) నుంచి ఇంటర్మీ డియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
నర్సంపేట: వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగించకుండా పోరాటాలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆరోపించారు. ఏఐకేఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్టం బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఆమోదం పొందితే రైతులు విత్తన ఉత్పత్తి చేసే హక్కును కోల్పోతారని, బహుళజాతి కారొపరేట్ సంస్థలు తయారు చేసిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరమవుతుందన్నారు. విద్యుత్ మీటర్లకు రీచార్జ్ చేసుకునే విధానం తీసుకొస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిర్వహించే ఆందోళనల్లో పాల్గొనాలని తెలిపారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టి కృష్ణ, బొమ్మెడ సాంబయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కుల తిరుపతి, సారంగపాణి, శ్యామల రమేష్, బీమగాని మల్లన్న, మాచర్ల విజయ్, కొంపెల్లి సాంబయ్య పాల్గొన్నారు. -
డెస్క్ జర్నలిస్టులందరికీ
అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలిహనుమకొండ అర్బన్: డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే–143, జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 252 జీఓను సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్లుగానే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీఓలో పేర్కొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, ఐజేయూ రాష్ట్ర నాయకులు గాడిపల్లి మధు, గడ్డం కేశవమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కోశాధికారి బొల్ల అమర్, బాధ్యులు బొడిగె శ్రీను, అల్లం రాజేశ్వర్మ డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన మద్దతు తెలిపిన జర్నలిస్టు యూనియన్లు -
అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం
హన్మకొండ చౌరస్తా: కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హనుమకొండ యాదవనగర్లోని 4వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్యాదవ్ ఇంటికి వెళ్లారు. యువకుడిపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న బొంగు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ భార్య అనిత, కుమారుడు అఖిల్.. హరీశ్రావు ఎదుట బోరున విలపించారు. స్థానిక యువకులు రఘు, లక్ష్మణ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అశోక్యాదవ్ ప్రశ్నించారని, ఆ విషయం మనసులో ఉంచుకుని టార్గెట్ చేశారని వెల్లడించారు. నాన్న పై దాడి చేస్తే తాము పిటిషన్ ఇవ్వగా పోలీసులు తీసుకోలేదని అఖిల్ తెలిపారు. దీనిపై హరీశ్రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెడుతోందని, బాల్క సుమన్, బొంగు అశోక్ది అక్రమ అరెస్ట్ అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్కుమార్, స్థానిక నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు పదోన్నతి లభించింది. నలుగురు డిప్యూటీ సీఈఓలు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా, ఐదుగురు ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, జనగామ డీఆర్డీఓ ఎన్.వసంత, జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సరిత, హనుమకొండ జిల్లా హసన్ పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్ కౌసల్యదేవికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి లభించింది. అదే విధంగా హనుమకొండ జిల్లా పరకాల ఎంపీడీఓ బి.రవీందర్, వేలేరు ఎంపీడీఓ ఆర్.లక్ష్మి ప్రసన్న, జనగామ జిల్లా కొడకండ్ల ఎంపీడీఓ పి.నాగశేషాద్రి, జనగామ డీఆర్డీఏ ఏపీడీ జి.చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ డి.శ్రీనివాస రావుకు డిప్యూటీ సీఈఓగా పదోన్నతి లభించింది. బాలికల ధర్నా ఘటనపై విచారణ పాలకుర్తి టౌన్ : మండలంలోని గూడూరు బా లికల గురుకుల పాఠశాల, కళాశాలలో నాణ్య మైన భోజనం అందించడం లేదని ఈనెల 23న బాలికలు ధర్నా చేపట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డీఎస్ వెంకన్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాత, కొత్త బియ్యం తేడాతో భోజనం తయారీలో జాప్యం జరిగిందని విచారణలో తేలిందన్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్ తన చాంబర్లో వేడుకలు నిర్వహించిందని తెలిపారు. క్షుద్ర పూజల పేరుతో వస్తున్న అపోహలను బాలికలు నమ్మొద్దన్నారు. విచారణ నివేదికను గురుకుల సెక్రటరీతోపాటు కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపా రు. వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సబ్స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ: స్టేషన్ ఘన్పూర్లో చేపడుతున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డి అధ్యక్షతన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపడుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుతో రిజ ర్వాయర్లలోకి నీరు రావడంతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగరం, కొండాపూర్, కుర్చపల్లి సబ్ స్టేషన్లు మార్చి నెలాఖరు వరకు చార్జీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వినూ త్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ప్రమాదకరంగా ఉన్న లొకేషన్లు గుర్తించి వాటిని మార్చుతున్నామని చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ఈలు రాజు చౌహాన్, సురేందర్, ట్రాన్సో కో వరంగల్ జోన్ సి.ఈ శ్రీరామ్ కుమార్, జనగా మ, హనుమకొండ ఎస్ఈలు సంపత్ రెడ్డి, పి.మధు సూదన్ రావు, డి.ఈలు లక్ష్మీనారాయణ రెడ్డి, సార య్య, విజేందర్ రెడ్డి, మల్లికార్జున్, విజయ కుమార్, అనిల్ కుమార్, సంపత్ రావు, ఏడీఈ రణధీర్ రెడ్డి, సుధాకర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి
పలు కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులుఎస్ఎస్తాడ్వాయి : కాల్వపల్లి.. మావోయిస్టుల కంచుకోట. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఓ కుగ్రామం. ఇక్కడి నుంచి పలు కారణాలతో పలువురు గ్రామస్తులు మావోయిస్టు ఉద్యమ బాట పట్టారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. దామోదర్.. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో 1996లో పీపుల్స్వార్ పార్టీలో చేరి దళ సభ్యుడిగా మొదలు.. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టెది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుతోపాటు ప్రస్తుత పరిణామాల కారణంగా దామోదర్ 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వీడి పో లీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అజ్ఙాతం వీడి న దామోదర్ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారంలో ముందుడాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎన్కౌంటర్లో ఏడుగురి మృతి ఉద్యమానికి ఉపిరిగా నిలిచిన కాల్వపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఎన్కౌంటర్లో మృతి చెందారు. బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్, బడే మురళి, సిద్ధబోయిన సారక్క, కొప్పుల పాపారావు, రొక్కలి అశోక్, సిద్ధబోయిన అశోక్, గౌరబోయిన ఉర్మిళ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న దామోదర్ ప్రస్తుతం లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమంలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. కాల్వపల్లి గ్రామం గతంలో వివిధ ఎన్కౌంటర్లలో ఏడుగురి మృతి గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి.. ఆయన లొంగుబాటుతో గ్రామంలో హర్షాతిరేకాలు -
సిద్ధాపురంలో వృద్ధుడి హత్య
● మరదలిపై అనుమానం ● పోలీసులకు ఫిర్యాదుహసన్పర్తి: ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హసన్పర్తి మండలం సిద్ధాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె మొగిలి(70)కి కుమారుడు రాజ్కుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొగిలి, రాజ్కుమార్ నగరంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. దీంతో మొగిలి మరదలు ఇందిర(ఒంటరి మహిళ) సిద్ధాపురంలోని అతడి ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భార్య సరోజన మృతి చెందడంతో మొగిలి తిరిగి స్వగ్రామం వచ్చాడు. అప్పటి నుంచి నుంచి ఇందిర అతడితో నిత్యం గొడవ పడుతోంది. ఈవిషయమై ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాజ్కుమార్ ఇంటికొచ్చాడు. ఇదిలా ఉండగా, మంగళవారం మొగిలి ఇంటి ఆవరణలో శవమై కనిపించాడు. ఈవిషయాన్ని గమనించిన బంధువులు కుమారుడు రాజ్కుమార్కు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై రవి, దేవేందర్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానికంగా విచారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందిరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. -
పది శాతం పనులు కూడా చేయలె..
ఎంజీఎం : రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పదిశాతం కూడా పూర్తి చేయలేదని, కేసీఆర్పై కక్షతో సీఎం రేవంత్రెడ్డి.. పనులు ఆలస్యం చేస్తూ పేదల ప్రాణాలను బలిగొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. ఏ పనులు ఎంత వరకు వచ్చాయో కలియతిరిగి చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 24 అంతస్తుల స్లాబ్ పూర్తయిందని, ఇప్పుడు ఏ పనీ జరగకపోవడంతో ఆస్పత్రిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. 2024 దసరాకే ఆస్పత్రి ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద చూపెడుతున్న శ్రద్ధలో కేసీఆర్ పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన హెల్త్ సిటీపై పదిశాతం శ్రద్ధ చూపితే ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించిందన్నారు. అదేవిధంగా రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వర్క్ వంటివి చాలా తగ్గించేశారని ఆరోపించారు. జూన్ 2వ తేదీన ఆస్పత్రి ప్రారంభిస్తామని చెబుతున్నారని, 2వేల పడకల ఆస్పత్రికి 2వేల మంది నర్సులు, 1,500 మంది వైద్యులు, వెయ్యిమంది పారామెడికల్ సిబ్బంది అవసరమనే విషయాన్ని కనీసం గుర్తించలేదన్నారు. ఆస్పత్రి సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైందా..? అంటూ మండిపడ్డారు. పేపర్లలో చేస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తామని అని పేర్కొంటున్నారని, ఇది సూపర్స్పెషాలిటీ ఆస్పత్రా..? బస్తీ దవాఖానా..? అని మండిపడ్డారు. ఓపీ చూడడానికి ఈ ఆస్పత్రి ఎందుకు..? బీఆర్ఎస్ హయాంలో వరంగల్లో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామని, కానీ ఇప్పుడు ఆస్పత్రిలో ఏసీలో నీళ్లు కారుతున్నాయనే సాంకేతిక లోపంతో థియేటర్లు మూసివేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ఎంజీఎంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అవి పనిచేయని దుస్థితిలో కొనసాగుతున్నాయంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. గతంలోని ధర్మశాల, ఎలివేషన్ వర్క్స్ తొలగించారు రేవంత్రెడ్డిది ఫ్యూచర్ సిటీ ఆలోచన.. కేసీఆర్ది హెల్త్సిటీ ఆలోచన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలనజర్నలిస్టులపై పగ పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్రావు అన్నారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇన్సూరెన్సుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు ఒక్క శాతం కాంట్రిబ్యూషన్తో, జర్నలిస్టులకు ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని గుర్తు చేశారు .కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలకులకు మాలలపై కక్ష తగదు
హన్మకొండ: పాలకులకు మాలలపై కక్ష తగదని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని మాల భవన్లో జాతీయ మాలమహానాడు హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగలను వర్గీకరణ పేరుతో విడగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో నష్టపోతున్నామని మాలలు గొంతెత్తడంతో రోస్టర్ విధానాన్ని జీఓ 99 ద్వారా తీసుకువచ్చి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయానికి ప్రభుత్వం గురి చేసిందన్నారు. మాలల గొంతుకగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అసెంబ్లీలో మాట్లాడడం హర్షణీయమన్నారు. నాగర్కర్నూలు జిల్లాలో అగ్రవర్ణ వర్గాల కుల అహంకారానికి బలైన చిన్నారికి నివాళులర్పించారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నాయకులు నీరకి రాము, బన్ను సాంబయ్య, బొల్లం రాంకుమార్, పనికల శ్రీనివాస్, సంపతి రఘు, పాడుగుల నర్సయ్య, గొర్రె రమేష్, మల్లం రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్


