Warangal
-
TG: చిన్నారిపై వీధి కుక్కల దాడి
వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. 35వ డివిజన్ లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఒంటరిగా వెళుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి గాయపడింది. ఆ సమయంలో స్థానికులు ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ చిన్నారి మీద కుక్కలు పడిన సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో ఆ కుక్కలు పారిపోయాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం గాయపడిన ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఊబర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
మొక్కజొన్నకు మద్దతు ధర
నర్సంపేట: మొక్కజొన్నకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మార్కెట్ యార్డులో తెలంగాణ మార్క్ఫెడ్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని, తేమ శాతం నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో తేమ శాతం 14కు మించకుండా ఉండాలని తెలిపారు. క్వింటాలుకు రూ.2,400 ధర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీఓ నీరజ, డీఎం మార్క్ఫెడ్ అధికారి రంజిత్రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
దుగ్గొండి: గ్రామంలో రోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. మండలంలోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రకాల రికార్డులు, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. వనమహోత్సవంలో నాటడానికి ఏ రకాల మొక్కలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఆదాయం పెరిగేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎంపీఓ మోడెం విద్యాసాగర్, సర్పంచ్ బూర రాధిక, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. హామీలను నెరవేర్చాలి : బీజేపీన్యూశాయంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ల మొత్తాన్ని పెంచాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, రత్నం సతీశ్, నాయకులు పరమేశ్వర్, మురళీకృష్ణ, మహేందర్రెడ్డి, హరిశంకర్, బన్న ప్రభాకర్, ఎ.జనార్దన్, ఎ.వెంకట్, రాజేశ్వర్రావు, రఘునారెడ్డి, క్రాంతి, రాజు, రాజ్కుమార్, శివకుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి రాముడిగా పూజలు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమానుసారంగా చెరకుమల్లి శ్రీవాత్సవాచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. పింఛన్ మంజూరు చేస్తాంసంగెం : పెయింటింగ్ చేస్తు ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన మండలంలోని లోహితకు చెందిన అరూరి మహేందర్కు దివ్వాంగ పింఛన్ మంజూరు చేస్తామని ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. మహేందర్ తండ్రి భిక్షపతి పదేళ్ల క్రితం మృతి చెందగా తల్లి కోమల కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో మహేందర్ పెయింటింగ్ పని చేస్తు ప్రమాదానికి గురి కాగా నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. మహేందర్కు ఇటీవల వైద్యులు సదిరం సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో మహేందర్ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ శుక్రవారం విచారణ చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, సర్పంచ్ బొమ్మెర నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమహన్మకొండ: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్పీ.జయంత్లాల్, సండ్ర మధు, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, దొంతి దేవేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, నానునాయక్, చాడా స్వాతి, దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల వసంత, బైరి లక్ష్మి, కోమల, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ బస్సులు ఆర్టీసీకే కేటాయించేలా చూడాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి ఉపేంద్రచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తూ ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని, ఆర్టీసీ యూనియన్లపై ఆక్షలు ఎత్తివేయాలని, 2021, 2025 వేతన సవరణ అమలు చేయాలని, 2017 అలవెన్సులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎస్ వరంగల్ –2 డిపో కార్యదర్శి వై.శ్రీనివాస్, కరీంనగర్ జోన్ కోశాధికారి ఎండీ ఆర్కేపాషా, ఉద్యోగి సంపత్ పాల్గొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో అర్చనహన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన సూరినేని నవీన్రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, సిబ్బంది పర్యవేక్షించారు. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖాధికారి అనూజ్అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం..స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఉబేర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ముస్లింలకు ఒక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో జిల్లా ప్రజలకు సుఖ సంతోషాలు, సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ అందరూ సోదరభావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
హన్మకొండ: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాదవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశలు శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు నెట్టేసి పోలీసులను తోపుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని వినతి పత్రం అందించి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశలను నాలుగో తరగతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ కార్యక్రమంలో ఆశ యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశలు పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట రోడ్డుపై బైఠాయించి ధర్నా -
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
హన్మకొండ అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద ఆయా జిల్లాల ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యూశాయంపేట : అంతరించిపోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్క్ క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీరును అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు, అటవీశాఖ సిబ్బంది సూరిదాస్, శివకుమార్, శారద, శ్వేత, సురేశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన సూరినేని నవీన్రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. పాంచరాత్ర ఆగమానుసారం చెరకుమల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో వివిధ ధాన్యాలు, పండ్లు, పూలు సమర్పిస్తూ మహా సుదర్శన హోమం ని ర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తమిళనా డు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ముఖేశ్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య రాష్ట్ర అ ధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, శ్రీరామసేవాసమితి సభ్యుడు కట్ల రాజు ఉన్నారు. విద్యారణ్యపురి: వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట మాత్రమే బడులు నడపాలని, రెండుపూటలా నడిపితే చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షల పేరిట హాల్ టికెట్లు జారీ సమయంలో ఫీజులు చెల్లించని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయని, విద్యాశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు పటిష్టంగా అమలు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, పోషణ్ అభియాన్, అక్షయపాత్ర భోజనం, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీడీపీఓలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, సఖి కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్డబ్ల్యూ కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పక్షి సంపదను సంరక్షించుకోవాలి
న్యూశాయంపేట : అంతరించి పోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్కు క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీటిని అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు పాల్గొన్నారు. -
నేడు ఈద్–ఉల్–ఫితర్
ఎంతో నిష్టతో కూడిన నెలరోజుల కఠిన రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఆత్మశుద్ధి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే రంజాన్ మాసానికి వీడ్కోలు పలుకుతూ సంతోషాల పండుగ ఈద్–ఉల్–ఫితర్ రానే వచ్చింది. నేడు (శనివారం) ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలతోపాటు గ్రామాలు కోలాహలంగా మారాయి. వరంగల్లోని ప్రధాన ఈద్గా మైదానాలను చదును చేసి సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు కార్పెట్లు, షామియానాలు ఏర్పా టు చేశారు. విద్యుత్ దీపాలతో పరిసరాలను అందంగా అలంకరించారు. – న్యూశాయంపేట రంజాన్ వేడుకలకు ముస్తాబైన జిల్లా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు -
మున్సిపాలిటీ బడ్జెట్ రూ.5.43 కోట్లు
● బడ్జెట్పై పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం సమావేశం ● హాజరైన అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరకాల: పరకాలలోని అన్ని రకాల ఆదాయ వనరులను ఆధారంగా చేసుకుని పరకాల మున్సిపాలిటీ 2026–27 వార్షిక అంచనా బడ్జెట్ను రూ.5 కోట్ల 43 లక్షల 10 వేల 270కు ఆమోదించినట్లు పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్ తెలిపారు. శుక్రవారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం పట్టణాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పట్టణ ప్రజల అవసరాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ అభివృద్ధి పనులకు ఖర్చుల ఆదారంగా బడ్జెట్ను ఆమోదించడాన్ని ఆయన అభినందించారు. మోడల్ మున్సిపాలిటీ కోసం రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధిలో భాగస్వాములం అవుదామని చైర్మన్ సునీల్కుమార్ కోరారు. బడ్జెట్ అంచనతో పాటు రూ. 5 కోట్ల 8 లక్షల 2వేలతో అంచనా వ్యయం, రూ.3.48 లక్షలతో మిగులు బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య మాట్లాడుతూ.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.50 లక్షలకు పైగా పన్నులు వసూలు జరిగితే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయని పాలకవర్గ సభ్యులకు వివరించారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. మొక్కల పెంపకానికి రూ.64 లక్షల ఖర్చు మున్సిపాలిటీ పరిధిలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం కోసం గత బడ్జెట్ 2025–26 సంవత్సరం బడ్జెట్లో రూ.64 లక్షలు ఖర్చు చేయయడాన్ని బీఆర్ఎస్ 14వ వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి ప్రశ్నించారు, అదే విధంగా ఈ ఏడాది కూడా అధికంగా హరితహారం మొక్కల కోసం కొత్తగా గ్రీన్ బడ్జెట్ను రూ.1 కోటి 2 లక్షల 5 వేలకు పెంచడాన్ని ఆమె తప్పు పట్టారు. గ్రీన్ బడ్జెట్ పేరిట కోట్ల రుపాయలు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికలను ఉపయోగంలోకి తీసుకురావాలని 21 వార్డు కౌన్సిలర్ అల్లె దశరథం కోరారు. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
● ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట ● రోడ్డుపై బైఠాయించి ఆశల ధర్నా హన్మకొండ: ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశాలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశాలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని, వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశాలను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ కార్యక్రమంలో ఆశా యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశాలు పాల్గొన్నారు. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాలో కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళల సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
దివ్యాంగులకు మొండిచేయి
● బీవీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ వర్ధన్నపేట: బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మొండిచేయి చూపించిందని బీవీహెచ్పీఎస్ (భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఇల్లంద గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా దివ్యాంగులను అణచివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రత్యేకశాఖ ఏర్పాటు వంటి అంశాలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో చేసిందని గుర్తుచేశారు. హామీలను నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఈదయ్య, ఎండీ షరీఫ్, బాలకృష్ణ, శేఖర్రెడ్డి, శ్రీనివాస్, సుమతి, వీరమ్మ, అలివేలు, పూలమ్మ, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు పాడె: బీజేపీ గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారంటీలకు పాడె కట్టినట్లుగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన బడ్జెట్పై మాట్లాడారు. జిల్లాకు బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఎంజీఎం అభివృద్ధి, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్పార్కుపై బడ్జెట్లో ఊసే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడడం తప్పితే రాష్ట్ర సర్కారు పెద్దగా ఏం కేటాయించలేదని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న పేదింటి మహిళలకు తులం బంగారం, పొదుపు సంఘాల వారికి నెలకు రూ.2500, ఫించన్ను రూ.4 వేల ప్రస్తావనే లేదన్నారు. బీసీలకు బడ్జెట్లో కేవలం నాలుగు శాతమే కేటాయింపులు చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బడ్జెట్పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. మొదటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిష్య పండితుడు అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ పఠనం నిర్వహించారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు ● రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని పూజలు హన్మకొండ కల్చరల్: పాలకులు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో రైతుల మహా గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అందరినీ మహా గర్జన సభకు ఆహ్వానిస్తున్నట్లు, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మహాగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు సంఘాల రాష్ట్ర జేఏసీ తోట సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతకు ప్రాధాన్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులోని డ్రెయినేజీల పూడికతీత పనులను చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. గతంలో కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇచ్చి తర్వాత తొలగించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ అంశఽంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పట్టణంలో అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి 250 మంది కార్మికులను నియమించాలని ఇటీవల సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ షీభారాణి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ సుఽధీర్కుమార్, కౌన్సిలర్లు కమిలి, పాపారావు, తిరుపల్లి వాణి, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, నాయకులు ఎండీ చోటు, ఎండీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
● సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు ● షాపులకు బియ్యం తరలింపునకు చర్యలుఖిలా వరంగల్: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో మరి ఎండలు ఎలా ఉంటాయోనని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు రేషన్ పంపిణీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల బియ్యాన్ని సమకూర్చుకునేందుకు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేటలో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాలోని మండలాలకు బియ్యం సరఫరా అవుతాయి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని స్టేజీ–1, స్టేజీ–2 గోదాముల్లో ఏప్రిల్ నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వలున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా మూడు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఏప్రిల్ లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. 16,782.84 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం జిల్లాలో 509 రేషన్ షాపుల పరిధిలో 2,93,824 రేషన్కార్డులు ఉన్నాయి. 8,88,153 మంది లబ్ధిదారులకు నెలకు 5504.268 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్లో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఆవసరం ఉంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిల్వ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి డిమాండ్ భాగా పెరిగింది. స్టేజీ–2 గోదాముల్లో ఒక నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. మూడు నెలల బియ్యం పంపిణీ కోసం ప్రత్యామ్నాయంగా నిల్వ ఉంచడమా లేక వచ్చిన లారీలను వెంటనే దుకాణాలకు సరఫరా చేయడమా అనేది ఆలోచిస్తున్నారు. చాలా వరకు రేషన్ దుకాణాల్లోనూ స్థలం తక్కువగా ఉంది. ఒక నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు ఉన్నాయి. దీంతో దుకాణాలు వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం, లేదా అమ్మగానే డీలరు గోదాముకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాల ప్రకారం పంపిణీ.. మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. సన్నబియ్యం గోదాముల్లో నిల్వ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 509 రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వ ఎంత మేర సరఫరా చేయాలనేది జాబితా తయారు చేశాం. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాల ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారిమండలాల వారీగా రేషన్షాపులు, కార్డులు, రేషన్ పంపిణీ వివరాలుమండలాలు రేషన్షాపులు కార్డులు మూడు నెలల రేషన్ (మెట్రిక్ టన్నుల్లో)చెన్నారావుపేట 23 14,240 784.872 దుగ్గొండి 34 16,044 854.568 గీసుకొండ 35 19,902 1073.778 ఖానాపురం 20 11,087 634.506 నల్లబెల్లి 30 12,882 742.53 నర్సంపేట 40 24,794 1377.168 నెక్కొండ 35 19,264 1073.079 పర్వతగిరి 35 16,636 925.419 రాయపర్తి 37 18,675 1087.923 సంగెం 31 16,562 901.8 వర్ధన్నపేట 32 16,649 935.013 వరంగల్ 85 54,613 3332.163 ఖిలా వరంగల్ 72 52,476 3059.985 మొత్తం 509 2,93,824 16,782.804 -
వరంగల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026● కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు ● త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభం ● మామునూరు విమానాశ్రయానికి రెక్కలొచ్చే అవకాశం ● మెగాటెక్స్టైల్ పార్కుతో మెండుగా ఉద్యోగాలు ● వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనున్న వాతావరణం ఉద్యోగం.. ఉద్యమంకాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలివ్వాలనే ఉద్యమం ఊపందుకుంటోంది.జిల్లా వరంగల్ ఇఫ్తార్ రాశి : వృషభం శుక్ర 6:33అభివృద్ధి.. సవాళ్లు!నక్షత్రం : రోహిణి ఆదాయం : 5 వ్యయం : 14 సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అభివృద్ధికి అవకాశం ఎక్కువ.. కానీ, సవాళ్లు కూడా తక్కువ కావు అని జ్యోతిష్య సిద్ధాంతులు చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం.. వరంగల్ను హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న గ్రేటర్ వరంగల్లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందర్లోనే ఈ పనుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉండడంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. ఇప్పటికే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాస్కీ (స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులతో పాటు వివిధ పనులు పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉండగా సంగెం, గీసుకొండ మండలాల్లో విస్తరించి ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ కంపెనీల వృద్ధి పెరిగి జిల్లా ప్రజలకు ఉద్యోగవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు.. జిల్లాలో అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది పంటలపై మాత్రమే కాకుండా పట్టణ జీవనంపై ప్రభావం చూపనుంది. అదే సమయంలో నకిలీ విత్తనాలు, పురుగు మందుల సమస్య, పంటల దిగుబడి అస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావం ఉండే చాన్స్ ఉంది. మిర్చి, పత్తి పంటలు రైతులకు ఆశ చూపుతున్నప్పటికీ దిగుబడి తగ్గుదల ఆందోళన కలిగించే అవకాశముంది. అయితే సమయానుకూల పనుల వల్ల కొంతమంది రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చే అవకాశం కూడా ఉంది. అలాగే, కీలక ప్రాజెక్టులు పనులు మొదలైనా నిధుల విడుదల్లో జాప్యం, భూసేకరణ ఆలస్యంతో నింపాదిగా అభివృద్ధి పనులు సాగే అవకాశముంది. అభివృద్ధిలో వరంగల్ దూసుకెళ్తుంది.. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లాకు రోహిణి నక్షత్రం, వృషభరాశి అవుతుంది. దీని ఆధారంగా ఆదాయం 5, వ్యయం 14 ఉంది. జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాలు, పారిశ్రామిక రంగాల్లో వరంగల్ అభివృద్ధి చెందుతుంది. అందరూ నేతలు కలిసికట్టుగా ఉండడం ద్వారా వరంగల్ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. రాబడి తక్కువ, వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ -
మినరల్ మిథ్య!
వరంగల్ అర్బన్: మినరల్ వాటర్ తాగుతున్నాం.. మా ఆరోగ్యానికి ఢోకా లేదని ధైర్యంగా ఉన్నారా.. మీరు తాగేది స్వచ్ఛమైన మినరల్ వాటరే అని అనుకుంటున్నారా.. ఆ నీటిని కాచి చల్లార్చకుండానే మీ పిల్లలకు తాగిస్తున్నారా.. అయితే ఆరోగ్యం చేజా రిపోతున్నట్లే.. నగరంలో అనేకమంది మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న నీరు స్వచ్ఛమైనది కాదని, ఆ నీటిలో కనీస నాణ్యత లేద ని మీకు తెలుసా? ఔను.. చాలా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అండర్గ్రౌండ్ నుంచి తీసిన నీటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా క్యాన్లు, ప్యాకెట్లలోకి నింపుతున్నారు. దీనిపై కా ర్పొరేషన్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకుంటే ప్రజారోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదముంది. 12 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్ గుర్తింపు.. వరంగల్ నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో చాలా మంది మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో ఇబ్బడి ముబ్బడిగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తామంటూ అనేక మంది అనుమతి లేకుండా, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 450కి పైగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు, 3,500 వరకు ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే బీఐఎస్ గుర్తింపు కలిగి ఉన్నాయి. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నగరంలో ఉన్న 450 ప్లాంట్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ వాటర్ ప్లాంట్ నుంచి 18 లక్షల లీటర్ల వరకు నీరు ఉత్పత్తి అవుతోంది. మినరల్ పేరుతో విచ్చలవిడిగా రసాయనాలు కలిపిన ఈ నీరు క్యాన్లు, ప్యాకెట్ల రూపంలో నివాస గృహాలు, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతోంది. 20 లీటర్ల వాటర్ క్యాన్కు రూ.10 నుంచి రూ.30 వరకు, వాటర్ ప్యాకెట్ రూ.2 చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.20 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతోంది. పట్టించుకోని అధికార యంత్రాంగం నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ప్రజారోగ్య విభాగం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాటర్, ఇండస్ట్రియల్ డిపార్టుమెంట్లు ఈ ప్లాంట్లను పర్యవేక్షించడం లేదు. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవిని తమ ‘మార్కెట్‘కు అనుకూలంగా ఎంచుకొని అక్రమార్కులు నగరప్రజలే టార్గెట్గా విజృంభిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామమాత్రంగా దాడులు నిర్వహించినా అధికారులపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే, ఇదే పరిస్థితి ఉంటే ‘మంచి’ నీటి రూపంలో మనకు అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వాకటి కరుణ పర్యవేక్షణలో అనుమతి లేని ప్లాంట్లను మూసివేసేందుకు జిల్లా అధికారులతో కమిటీని నియమించి, తనిఖీలు చేసి సీజ్ చేశారు. కొన్నేళ్లుగా ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ అధికారులు వాటర్ప్లాంట్ల వైపు చూడడం మరిచిపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులు నీటిలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం వ్యాధులబారిన పడుతున్న నగర ప్రజలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులువాటర్ ప్లాంట్కు బీఐఎస్ అనుమతి తీసుకోవాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.90 వేల ఫీజు చెల్లించాలి. విశాలమైన ప్రాంతంలో హెచ్డీపీ, స్టీల్ పైపులు ఏర్పాటు చేయాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఫిల్టర్ మిషన్లు ఉండాలి. నీటి ట్యాంకులు ఇతర సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్ పరీక్షలు చేయాలి. కానీ, వీటిలో ఒక్క నిబంధన కూడా ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. గల్లీకో చోట విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు. -
అభివృద్ధి.. సవాళ్లు!
సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కోసం.. హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న గ్రేటర్ వరంగల్లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూడీజీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘సాస్కీ’ ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులు, వివిధ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ హనుమకొండ ప్రాంత శుభాశుభ ఫలితాలు హన్మకొండ కల్చరల్: శ్రీపరాభవ నామసంవత్సరంలో హనుమకొండ జిల్లా పునర్వసు నక్షత్రం, మిధునరాశి అవుతుంది. ఈ సంవత్సరం గురువు జూన్ 1వరకు ఒకటో స్థానంలో ఉండి స్థానిక సమస్యల అవగాహన, ఆర్థిక, అభివృద్ధి పనుల్లో చురుకుగా ఉండగలదు. గురుగ్రహం వల్ల శుభం కలుగుతుంది. డిసెంబర్ నుంచి రాహు, కేతుల వల్ల స్థానమార్పులు ఉంటాయి. కొంత ప్రతికూల పరిస్థితులు, స్థానిక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని అధిగమించే అవకాశం ఉంది. పరాభవ నామ సంవత్సరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల జాతకం కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభంజిల్లాల వారీగా.. జిల్లా : వరంగల్ హనుమకొండ రాశి : వృషభం మిథునరాశి నక్షత్రం : రోహిణి పునర్వసు ఆదాయం : 5 08 వ్యయం : 14 11 -
లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి
సివిల్స్ 123వ ర్యాంకర్ అట్ల తరుణ్తేజ కాజీపేట అర్బన్: లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు ఇష్టపడి చదవాలని సివిల్స్ 123వ ర్యాంకు సాధించిన అట్ల తరుణ్ తేజ అన్నారు. హంటర్ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసంలో గురువారం సులక్ష్య సేవాసమితి 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సివిల్స్ సాధించాలనే సంకల్పంతో నాలుగుసార్లు విఫలమైనా ఐదోసారి 123వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు శ్రమించాలన్నారు. సమాజ సేవలో సులక్ష్య సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆవాసంలోని చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వాయుసేన ఆఫీసర్ అనిల్కుమార్ త్రిపాఠి, సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడు మండువ సంతోశ్, సాయికిరణ్, వినయ్, ప్రణీత్, వసుంధర, రామాచారి పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం పీఠం కార్యవర్గసభ్యులు గంధ శ్రీనివాస్, బన్న అయిలయ్య, ఎన్వీఎన్ చారి, అడ్టూరి చంద్రశేఖర్, జూలూరు నాగరాజు పాల్గొని పసుమర్తి సాంబశివ సోమయాజులు రాసిన ‘భూకంపాలు జ్యోతిష్య శాస్త్ర పరిశీలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉగాదిని పురస్కరించుకుని కవులు వల్స పైడి, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్ తదితరులు కవితాగానం చేశారు. ఈసందర్భంగా సాంబశివ సోమయాజులుకు జ్యోతిష్య జ్ఞానరత్న పురస్కారం ప్రదానం చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నగరానికి చెందిన వీఆర్ విద్యార్థి, రాజశేఖర్, రమేశ్బాబు, సుబేదార్ ప్రభాకర్, చెనుమల్ల శ్రీధర్ను సన్మానించి పోతన పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంపీ కడియం కావ్య హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మానసిక దివ్యాంగులపై ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గురువారం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్ పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళికి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. సంరక్షణ బాధ్యతగా భావించాలి.. మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్రెడ్డి పక్షి ప్రేమికుడు హనుమకొండ మందుల వినియోగం తగ్గాలి.. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
ఉగాది.. భవిష్యత్కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున కొత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. పంచాంగం విని భవిష్యత్కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు గ్రేటర్ వరంగల్ ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. చైత్రమాసం నాటికి కొత్తగా వచ్చే పంటలైన చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. ఈ పానీయం తాగితే మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయన్నుట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. రోడ్ల వెంట రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు, అమ్మకాలతో నగరంలో సందడి ఏర్పడింది. పరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, కుజగ్రహాలు మంత్రిగా ఉన్నాయి. గురువు రాజైతే పాలకులు కర్మయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు. ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. పాడి అభివృద్ధి, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు రుషులు అందించిన అద్భుత విజ్ఞానం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు ఉన్నదే పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ వంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు నగరంలో పండుగ రద్దీ నేడు వేయిస్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం బంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. ప్రముఖుల శుభాకాంక్షలు..న్యూశాయంపేట/వరంగల్క్రైం/హన్మకొండ అర్బన్: పరాభవ నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో ఆయా జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని వారు ఆకాంక్షించారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో అందరూ సంతోషం, శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
విదేశీ ప్రతినిధులతో అధ్యయనం
వరంగల్ అర్బన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్లానిటోరియాన్ని పునరుద్ధరిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్లానిటోరియం సివిల్ పనులపై విదేశీ ప్రతినిధులతో మేయర్ సమీక్షించారు. నిర్మాణ పనులకు సంబంధించి డోమ్ నిర్మిత పనులను మేయర్ పరిశీలించారు. ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు సాంకేతిక (మెకానికల్) పనులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈ సంతోశ్కుమార్, ఏఈలు సరిత, నరేశ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్కు 5 రెఫరెల్ ఆస్పత్రులు మంజూరు కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కుటుంబాలు, ఉద్యోగులు, పెన్షనర్స్కు ఉగాదిని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే రెఫరెల్ ఆస్పత్రులను మంజూరు చేస్తూ అనుమతిచ్చింది. కాజీపేట రైల్వే ఆస్పత్రికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని 5 ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫరెల్ అనుమతులు ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు బుధవారం కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ కో–ఆర్డినేటర్ నాయిని సదానందం తెలిపారు. సదానందం ఆధ్వర్యంలో రైల్వే మజ్దూర్ యూని యన్ నాయకులు రైల్వే డాక్టర్లు నిరంజన్, నరేందర్, యాకూబ్, వినయ్బాబు, దీపను సన్మానించారు. కార్యక్రమంలో రైల్వేమజ్దూర్ యూనియన్ నాయకులు పాక వేదప్రకాశ్, ఆర్.సమ్మయ్య, కాజీపేట సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్యాదవ్ అన్ని బ్రాంచీల ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ వారు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చర్యలు
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో యాసంగి వరి ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత సకాలంలో డబ్బులు అందేలా చూడాలని, గన్నీ సంచుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోలు శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమన్వయంతో పని చేసి రైతులకు ముందుగానే టోకెన్ విధానంలో సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైతుల ఆధార్ నంబర్ ఆధారంగా ధాన్యం వివరాలు, వాహన నంబర్, సాగు విస్తీర్ణం వంటి సమాచారాన్ని క్షుణ్ణంగా నమోదు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ శ్రీను, పౌరసరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. మండలానికో బస్సు హసన్పర్తి: గ్రామైక్య సంఘాల ద్వారా జిల్లాలోని 12 మండలాల్లో 12 బస్సులు కొన్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హసన్పర్తి మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో కాకతీయ మహిళా సమైక్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బస్సుల కొనుగోలు వల్ల ఒక్కో సంఘానికి నెలకు రూ.70 వేలు ఆదాయం సమకూరుతోందన్నారు. కాకతీయ మహిళా సమాఖ్యల్లో 1,16,576 మంది సభ్యులుు. రూ.460 కోట్లు లింకేజీ రుణాలు పొందడం హర్షనీయమన్నారు. ఈసందర్భంగా సంస్కృతి విహార్లో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, తహసీల్దార్ కిరణ్కుమార్, జిల్లా మహిళా సమాక్య అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి సుజాత, వివిధ గ్రామైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం
హసన్పర్తి: సర్కార్ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం హసన్పర్తి ప్రాథమిక ఆస్పత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు ఈ శిబిరంలో వైద్యసేవలు అందించారు. ఈకార్యక్రమానికి డాక్టర్ అప్పయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడితే వెంటనే స్థానిక ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె దవాఖాలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా 408 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందిచారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుమనవాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, స్థానిక మండల వైద్యాధికారి రామ్, భార్గవ్, వైద్యులు భరత్రెడ్డి, కృతిక, ప్రహసిత్, సురేశ్, క్రాంవతి, మానస, మల్లేశం, విజయ, సాయి, స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ సీకేఎం కళాశాలలో నిర్వహించిన ‘స్ఫూర్తి’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే లక్ష్యాన్ని సాధించగలరని అన్నారు. భయాన్ని జయిస్తే విజయాన్ని అందుకోవడం సులభమవుతుందని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులతోపాటు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల 6వ నుంచి 8వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. విద్యార్థులు ఒత్తిడి, పోటీ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
మమ్మీ, డాడీ ఎక్కడ?
● గుండెలను పిండేసిన చిన్నారుల రోదన ● మామ, భార్యను హతమార్చిన కిరాతకుడు కాజీపేట అర్బన్: ‘మమ్మీ ఎక్కడుంది. మమ్మీ కావాలి. డాడీ ఎక్కడున్నావు..’ అంటూ ఏడాదిన్నర బాలుడు జయాంశ్ బుజ్జి పలుకులకు కడిపికొండ రాజీవ్ గృహ కల్ప కంటతడి పెట్టింది. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహ కల్ప సముదాయంలో పొక్కుల ప్రవీణ్ తన భార్య రాజశ్రీ(24), మామ భాషబోయిన రాజశేఖర్(51)ను సుత్తితో తలపై మోది, ఒంటిపై డీజిల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో మునిగి ఉండగా రాజశేఖర్, రాజశ్రీ కాలి బూడిదయ్యారు. కాలి బూడిదైన రాజశ్రీ, పరారైన తండ్రి ప్రవీణ్ ఇద్దరూ కనపడకపోవడంతో జయాంశ్, ఆరు నెలల దివాంశిక వెక్కివెక్కి ఏడ్చారు. ఈ పిల్లలకు అండగా నిలిచేదెవరు దేవుడా.. ఎందుకు వీరి జీవితాలను ఇలా రాశావు అంటూ కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఛేదించిన మడికొండ పోలీసులు, క్లూస్, ఫోరెన్సిక్ టీం మామ రాజశేఖర్, భార్య రాజశ్రీని హత్య చేసి తనకు ఏం తెలియదన్నట్లుగా బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టిద్దామనుకుని స్కెచ్ వేశాడు నిందితుడు పొక్కుల ప్రవీణ్. కాగా, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ ఘటనా స్థలికి తెల్లవారుజామునే చేరుకుని క్లూస్, ఫోరెన్సిక్ టీం సారథ్యంలో ఘటనకు బాధ్యుడు ప్రవీణ్ అనే విషయాన్ని చేధించారు. మృతురాలి సోదరి తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. -
ఏఐని వినియోగించుకోవాలి
హన్మకొండ: కృత్రిమ మేధను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ.. ప్రతీ విభాగంలో కృతిమ మేధ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. కృతిమ మేధ అమలు ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన సేవలు అందించడమే ఎన్పీడీసీఎల్ లక్ష్యమన్నారు. సమావేశంలో డైరెక్టర్ వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదర్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్లాల్, తిరుమల్రావు, రాజుచౌహాన్, జయంత్రావు, అశోక్, సురేందర్, వెంకటరమణ, మాధవరావు, అన్నపూర్ణ, సీజీఎంలు చరణ్దాస్, కిషన్, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో 64 పరీక్ష కేంద్రాల్లో బుధవారం టెన్త్ విద్యార్థులకు హిందీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 12,037 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 12,021 మంది హాజరైనట్లు (99.87 శాతం)డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. 16 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ 5 పరీక్ష కేంద్రాలను, డీఈఓ కార్యాలయం ఏసీజీఈ భువనేశ్వరి నాలుగు పరీక్ష కేంద్రాలను, నాలుగు ఫ్లయింగ్స్క్వాడ్లు 23 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని జాయ్ వ్యవసాయ అగ్రిటెక్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 26, 27వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డికి ఆహ్వానం అందింది. వ్యవసాయ ఆర్థిక శాస్త్రం – సుస్థిర అభివృద్ధి అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సదస్సులో ఆయన సమర్పించనున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి బుధవారం తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక అగ్రిటెక్ విధానాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై చర్చలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించనున్నారని జ్యోతి వివరించారు. హన్మకొండ చౌరస్తా: ఈనెల 22వ తేదీన హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ చదరంగం టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలన్నారు. టోర్నమెంట్ బ్రోచర్లను హనుమకొండ ఏసీపీ నరసింహరావు చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఐదేళ్ల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండియర్ విద్యార్థి శ్రీవిద్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు మృతికి సంతాపకంగా కేయూలోని కెమిస్ట్రీ విభాగంలో విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి, అధ్యాపకులు బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీవిద్య చిత్రపటానికి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్లు శ్రీనివాస్, సుమలత నివాళులర్పించారు. -
దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి
నయీంనగర్: దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితులకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జకార్య, వీరేందర్, ప్రభాకర్, గోపి పాల్గొన్నారు. -
వినియోగదారులకు హక్కులపై అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: వినియోగదారులు తమ హక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వినియోగదారులను చైతన్యవంతం చేయడం ద్వారా నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తువుల వినియోగం పెరుగుతుందని తెలిపారు. నాణ్యత లేని ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వస్తువులు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని, ఉత్పత్తి వివరాలు, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి వాజీద్ అలీ, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రతాప్ సింగ్ ఠాగూర్, వరంగల్ కన్జూమర్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జగదీశ్ ప్రసాద్, అనుమాండ్ల విద్యాసాగర్, ఓరుగల్లు కన్స్మూర్ ఫోరం అధ్యక్షులు యుగేంధర్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఆదాయం 5.. వ్యయం 14
● ప్రముఖ జ్యోతిష్య పండితుడు సముద్రాల సుదర్శనాచార్యులు గీసుకొండ: ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరంలో జిల్లాకు ఆదాయం 5.. వ్యయం 14గా ఉంటుందని, అయితే ఈ ఖర్చు శుభపరంగా జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు, ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. బుధవారం ఆయన పంచాంగంలోని విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ ఏడాది వివాహాలు, నూతన గృహ నిర్మాణాలు బాగా జరుగుతాయని పేర్కొన్నారు. నవంబర్ 6 తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. అనారోగ్య పరిస్థితులు పెద్దగా ఉండవని, ఆరోగ్యంతోనే జనులు ఉంటారన్నారు. బంగారం ధరలు స్థిరంగా ఉంటాయని, పత్తి, మిర్చి, వరి, నువ్వుల పంటలు అధికంగా పండుతాయని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, శుక్రుడి కారణంగా స్టేడియాలు, ఆట స్థలాలు, కొత్త క్రీడాకారులు వస్తారని తెలిపారు. అక్టోబర్ వరకు పాలన సజావుగా సాగుతుందని, ఆ తర్వాత రాజకీయ దూషణలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని వివరించారు. -
ఎమ్మెల్యే దొంతి వైఖరిపై నిరసన
ఖానాపురం: ఉపాధి హామీ కాంపోనెంట్ నిధులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సర్పంచ్లు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అన్ని గ్రామాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయానికి బుధవారం తాళం వేసి ప్లకార్డులతో నినాదాలు చేశారు. కలెక్టర్, డీఆర్డీఓ పీడీ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. అధికారులు కార్యాలయంలోనే ఉండిపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్సై రఘుపతి, ఎంపీడీఓ సునీల్కుమార్ తెలుపడంతో నిరసన విరమించారు. కార్యాలయానికి వేసిన తాళాన్ని ఎస్సై తొలగించారు. బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మాడ్రాజు వెంకన్న, సర్పంచ్ దాసరి రమేశ్, సర్పంచ్లు బానోత్ వీరన్న, కూస విమల, గొంది సుజాత, బాధావత్ జ్యోతి, బాదరబోయిన నరేశ్ ఉన్నారు. -
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు
సంగెం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, తహసీల్దార్ రాజ్కుమార్, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, డాక్టర్ నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధికి దిక్సూచి కూసం రాజమౌళి గీసుకొండ: జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గ్రామాలకు దిక్సూచిగా నిలిచి నిరూపించారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. బుధవారం గంగదేవిపల్లిలో రాజమౌళి సంతాప సభ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నాగయ్య నాయకులు సీహెచ్ రంగయ్య, ఇసంపల్లి బాబు, భూక్యా సమ్మయ్య, బ్రహ్మచారి, రత్నమాల, పెద్దారపు రమేశ్, సర్పంచ్ కూసం స్వరూప, రాజమౌళి కుమారులు ఈశ్వర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.కలెక్టర్ చాంబర్లో బుధవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ఎండోమెంట్ ఏడీ సునీత, జిల్లా టూరిజం అధికారి శివాజీ, జిల్లా స్పోర్ట్ అధికారి అనిల్, ఆర్కియాలజీ ఏడీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా నుంచి వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవే –163జీలో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ పరాభవ నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కలెక్టర్ ఆక్షాంక్షించారు. -
వేప పువ్వుకు డిమాండ్
వరంగల్గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు ఈసారి దొరకడం కష్టంగా మారింది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడ్డాయి. కొమ్మలు మోడువారి వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. ఉగాది పచ్చడి షడ్రుచుల్లో ఒకటైనా వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. తప్పనిసరిగా పచ్చడిలో కలపాల్సిన ఈ పువ్వును కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల కోసం నగరానికి వచ్చిన వారితో పాటు నగరవాసులు కూడా డబ్బులు పెట్టి మామిడి కాయలతో పాటు ఈ వేప పువ్వు కొనడం కనిపించింది. మార్కెట్తో పాటు బహిరంగ ప్రాంతాల్లో రూ.20 నుంచి రూ.50 వరకు వేప పువ్వును వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే మూడేళ్ల క్రితం మాదిరిగానే ఈసారి కూడా వేప చెట్లు వైరస్ బారిన పడ్డాయి. ఉగాది పచ్చడికి వేపపువ్వుకు బదులు తులసి ఆకులను వాడొచ్చని వేదపండితులు సూచిస్తున్నారు. ‘నగర శివార్లలో ఉన్న వేపచెట్ల పువ్వును కోసుకొని తీసుకొచ్చాం. చాలాచోట్ల వేప చెట్లకు పువ్వు లేదు. కొన్నిచెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఉన్న చెట్లను ఎక్కి జాగ్రత్తగా వేప పువ్వు కొమ్మలను కోసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నాం’ అని చిరు వ్యాపారి నర్సమ్మ అన్నారు. ఎలా ఎండిపోతున్నాయంటే.. డై బ్యాక్ వైరస్ సోకిన చెట్లకు ముందుగా కొమ్మల చివరన ఆకులు ఎండిపోయి తర్వాత కొమ్ములు పసుపు రంగులోకి మారుతున్నాయి. కొత్త చిగుర్లు రాకుండా ఎండుతున్నాయి. తర్వాత చెట్లు మొత్తానికి వ్యాపించి పూర్తిగా ఎండిపోతోంది. వ్యాధి సోకిన చెట్ల కాండంపై అండాకార గాఢ గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది. గాయపడిన కొమ్మల ద్వారా శిలీంధ్రం ప్రవేశించి వైరస్ తీవ్రతను పెంచుతుంది. జిల్లాలోని వందలాది చెట్లు ఈ డైబ్యాక్ వైరస్ బారినపడి ఎండిపోతున్నాయి. ‘పురోగతిలో ఉండి ఎండిపోతున్న కొమ్మలను కత్తిరించి ధ్వంసం చేయాలి. కత్తిరించిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.3 శాతం లేదా మాంకోజెట్ 0.2 శాతం ద్రావణాన్ని చల్లాలి. చెట్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నియంత్రణ చర్యలు తీసుకోకపోతే అంతటా వేపచెట్లకు నష్టం జరిగే అవకాశం ఉంది’ అని వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన బి.సిద్ధార్థనాయక్ తెలిపారు. అయితే కొన్నిచోట్ల ఎండిన చెట్లు మళ్లీ చిగురిస్తుండడం శుభసూచకమన్నారు.ఉగాది పచ్చడి కోసం కొనుగోళ్లు వైరస్ సోకి ఎండిపోతున్న చెట్లు -
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. -
భక్తుల ఇంటికే సీతారాముల తలంబ్రాలు
నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో లాజిస్టిక్స్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి తెలిపారు. ఈ మేరకు డిపో కార్యాలయంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ భక్తులు తలంబ్రాలు బుకింగ్ కోసం నర్సంపేట బస్టాండ్లోని కార్గో, లాజిస్టిక్స్ ఆఫీస్లో కార్గో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సతీష్, కార్గో ఏజెంట్ వద్ద రూ.151 చెల్లించి రశీదు పొందాలన్నారు. భద్రాచలంలోని సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. తలంబ్రాలు బుకింగ్ కోసం 9704644543, 9989038476 నంబర్లో కూడా సంప్రదించవచ్చన్నారు.నేడు జాతీయ సెమినార్నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు (మంగళవారం) నిర్వహించనున్న రీసెంట్ అడ్వాన్స్ ఇన్ఫ్లాంట్ సైన్స్–ఇష్యూస్ అండ్ చాలెంజ్స్ ఇన్ క్రాప్ ఇంప్రుమెంట్ అనే అంశంపై జాతీయ సెమినార్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ మేరకు సెమినార్ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. సెమినార్ నిర్వహణకు రూసా స్పాన్సర్షిప్ అందించడం విశేషమన్నారు. జాతీయ సెమినార్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని సెమినార్ నిర్వహణ కార్యదర్శి రాంబాబు తెలిపారు. హజ్ యాత్రికులకు వైద్యశిబిరంన్యూశాయంపేట: మక్కా హజ్యాత్రకు వెళ్లే యాత్రికులకు ఈనెల 17, 18వ తేదీల్లో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అంజుమనే హుజాజ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అనీస్సిద్దీఖీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న హనుమకొండ జిల్లా వాసులు, 18న వరంగల్ జిల్లా వాసులకు ఉదయం 9 గంటల నుంచి శిబిరం ప్రారంభమవుతుందన్నారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్లో శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రికులు తమ వెంట పాస్పోర్ట్, ఆధార్ కార్డు, హజ్కమిటీ అందజేసిన కవరింగ్ లెటర్ నంబర్తో హాజరు కావాలని ఆయన సూచించారు. రాయితీని సద్వినియోగం చేసుకోవాలిదుగ్గొండి: రైతులు ఉద్యాన పంటల సాగులో ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పంటలకు డ్రిప్పు పద్ధతిలో సాగునీరు అందిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు. కూరగాయల తోటలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ తోటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త రాములు, డివిజన్ ఉద్యానశా ఖ అధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధి కారి శ్యామ్, ఏఈఓలు హన్మంతు, రాజేష్, విజయ్నాయక్, త్రివేణి పాల్గొన్నారు. ఎంజీఎంలో సమస్యలు పరిష్కరిస్తా ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈమేరకు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యానియన్ – 3194 (ఐఎన్టీయూసీ అనుబంధ) ఎంజీఎం బ్రాంచ్ కమిటీ అధ్యక్షురాలు శాంతికుమారి అధ్యక్షతన ఉద్యోగులు ఎంజీఎం సూపరింటెండెంట్ను సోమవారం కలిశారు. ఎంజీఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండెంట్కు వినతిపత్రం ఇచ్చారు. -
ఉచితం ఉత్తమాటే..!
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం (చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్)ను అక్కడి సిబ్బంది కమర్షియల్గా మార్చేస్తున్నారు. పేద రోగులకు ఉచితంగా అందించాల్సిన సర్కార్ వైద్య సేవలకు బేరమాడుతున్నారు. పర్యవేక్షఽణాధికారితో పాటు ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నప్పటికీ.. వైద్యం కోసం వచ్చే వారి నుంచి వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైరవీలతో, నగదు ముట్టజెప్పిన వారు నేరుగా వైద్య సేవలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక పాలనా విభాగంలో సైతం కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు.. సీకేఎం ఆస్పత్రిలో ఓపీ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. వీరిని క్రమపద్ధతిలో పంపించే ఏర్పాట్లు లేవు. ఎవరైనా చికిత్స కోసం త్వరగా ఓపీ వైద్యుడిని కలవాలనుకుంటే అక్కడి సిబ్బందికి డబ్బులు ముట్టజెబితే లోపలికి పంపిస్తారని ఇతర పేషెంట్లు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం కూడా... చికిత్సలు, డెలివరీతో పాటు ధ్రువీకరణ పత్రాల కో సం వచ్చినప్పుడు ఎంతో కొంతో ముట్టజెప్పాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. గైనిక్ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు కోసం రూ.500 నుంచి రూ.1000 ఇవ్వక తప్పదు. ఇక మెయిన్ గేట్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు తమ పేషెంట్కు అవసరమైన పనులు చేసి పెడితే సెక్యూరిటీ గార్డులకు రూ.100 నుంచి రూ.200, అలాగే పాలన విభాగంలో ఓ ఉద్యోగి డెలివరీ సర్టిఫికెట్ కోసం రూ.1,000 నుంచి రూ.2,000లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. వసూళ్ల దందాను అరికట్టాలి ఉచితంగా వైద్యం అందుతుందని సర్కార్ దవాఖానకు వస్తే ప్రైవేట్ మాదిరిగానే ఇక్కడ వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీదానికి డబ్బులివ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి డబ్బుల వసూళ్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు.. పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మురళి, ఆస్పత్రి ఆర్ఎంఓ సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందా.. అడుగడుగునా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ఆరుగురు ఆర్ఎంఓలున్నా నియంత్రణ కరువు ఇబ్బందులు పడుతున్న గర్భిణులుప్రతీ పనికో రేటు.. అడ్మిషన్ తర్వాత వార్డుల్లో క్లీనింగ్ కోసం రూ.50 నుంచి రూ.100, కుట్లు విప్పడానికి రూ.50 నుంచి రూ.100, వార్డు నుంచి వార్డుకు, స్కానింగ్ కోసం వీల్ చైర్లో వెళ్లినప్పుడు రూ.100 నుంచి రూ.200 స్కాన్ అండ్ ఎక్స్రేకు రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మెడిసిన్ కోసం రూ.100 నుంచి రూ.200లు, లేబర్ రూంలో రూ.200, ఆపరేషన్ రూంలో పుట్టిన బిడ్డలకు రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు సిబ్బంది రూ.200 నుంచి 500 తీసుకుంటున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద, పక్కన వివిధ శాఖల జిల్లా అధికారులు● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ప్రజావాణిలో 136 అర్జీలు న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. వినతి పత్రాలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో దరఖాస్తుదారుల సమక్షంలోనే చర్చించి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. వినతులను ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 136 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూకు సంబంధించి 60, జీడబ్ల్యూఎంసీ 15, ఇతర శాఖలకు చెందినవి 61 దరఖాస్తులు వచ్చాయి. అయితే రెవెన్యూకు సంబంధించి దరఖాస్తులు అధికంగా వచ్చిన నేపద్యంలో వాటిని సంబంధిత తహసీల్దార్లకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ఎండ తీవ్రత దృష్ట్యా కలెక్టరేట్ ఆవరణలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్లు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్ని దరఖాస్తులు ఇలా.. ● కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను తక్షణమే వె నక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు. ● ఖానాపురం మండల పరిధిలోని ధర్మారావుపేట, ఖానాపురం చిలకమ్మనగర్, కొడ్తిమాట్ తండా, నాజీతండా, భద్రుతండా, మంగళవారిపేట అయోధ్యనగర్, మనుబోతులగడ్డ గ్రామాల్లో ఈ ఆర్థిక సంవత్సరం పనిదినాలకు ఉపాధి కూలీలకు చెల్లింపులు జరిగాయి. గ్రామాలకు రావాల్సిన నిధులు కేటాయించాలని సర్పంచ్లు వినతిపత్రం అందించారు. ● గృహ నిర్మాణ పథకం కింద ‘డబుల్’ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్కు చెందిన పి. రాధిక విజ్ఞప్తి చేశారు. అక్రమ పట్టా రద్దు చేయాలిఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా పేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి. – ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు..80 సంవత్సరాలుగా వంశపారపర్యంగా వస్తున్న భూమిలో వ్యవసాయం చేస్తున్న. అందులో కొంతభాగం 6 గుంటల్లో రెండు గృహాలు నిర్మించుకున్న. దీనికి నర్సంపేట మున్సిపల్ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న. దీంతో ఒక గృహానికి ఇటీవల పర్మిషన్ రిజెక్ట్ అని మున్సిపల్ కమిషనర్ లెటర్ పంపించారు. మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలి. – ఎం.ఐలయ్య, ధనలక్ష్మి దంపతులు, మహేశ్వరం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కాళోజీ సెంటర్: కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రెండో దశ నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కాళోజీ విగ్రహం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాద రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎస్ఎ రవుఫ్, కార్యదర్శిలు పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, తాబేటి లింగమూర్తి, కె.రమేష్, జి.కరుణాకర్, టీవీ, సత్యనారాయణ, కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉగ్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో రుణాలు రికవరీ చేయాలి
● అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రేణుకాదేవిసంగెం: రుణ వాయిదాల రికవరీని వేగవంతం చేయాలని, గ్రామస్థాయిలో సీసీలు, వీఓఏలు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని డీఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రేణుకాదేవి ఆదేశించారు. సోమవారం శాంతి మండల సమాఖ్యలో మహిళా సంఘాలకు రుణాల జారీ, సీ్త్రనిధి రుణాల రికవరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్రనిధి రుణాలు బాకాయిలు బాగా పేరుకుపోయాయని, మార్చి 31 నాటికి రూ 1.79 కోట్ల రుణ బకాయిలను రికవరీ చేయాలన్నారు. రుణాల రికవరీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజ్కుమార్, సీసీలు కృష్ణమూర్తి, రవీందర్ రాజు, కుమారస్వామి, ఏలియా, రాజయ్య, వీఓఏలు పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
వర్ధన్నపేట: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని, ముస్లింలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. ప్రభుత్వం తరఫున సోమవారం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఫంక్షన్ హాలులో ముస్లింలకు ఏర్పాటు చేసిన దావత్ ఎ ఇఫ్తార్ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నిష్టతో చేసే ఈ పవిత్ర రంజాన్ మాసం ఎంతో గొప్పదని, ప్రతి మనిషి సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ముస్లింలు ప్రార్థిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ చోటూ, ఎండీ అప్సర్, ఎండీ అన్వర్, జలీల్, మున్సిపల్ వార్డు సభ్యులు దేవేందర్, పాపారావు, షిభారాణి రాజేందర్, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల అభివృద్ధికి కృషి
నర్సంపేట: అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సోమవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మధురిమ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. మున్సిపల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శ్రీరామోజు రోజారాణి పొన్నం నర్సింహారెడ్డి, సూపర్వైజర్స్ రమ, అరుణ, పారిజాతం, రాధ, హేమలత, నజ్మా, విజయరాణి, భాగ్యమ్మ, వాసంతి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. సాంకేతిక వ్యవసాయంపై దృష్టి సారించాలి● వ్యవసాయ శాస్త్రవేత్త గోన్యానాయక్ నెక్కొండ: వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో రైతులు సాంకేతిక యాజమాన్య వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) శాస్త్రవేత్త గోన్యానాయక్ అన్నారు. మండలంలోని తోపనపల్లిలోని రైతువేదికలో సోమవారం ఆత్మ సహకారంతో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వరిలో ప్రాధాన్య రకాల ప్రోత్సాహకం, వరిలో స్వల్ప, మధ్యస్త, దీర్ఘకాలిక రకాల గురించి రైతులతో ఆయన చర్చించారు. హెచ్టీ పత్తి సాగు యొక్క ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువుల వాడకం, సమీకృత వ్యవసాయం పద్ధతులను పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఏఓ నాగరాజు, సర్పంచ్ చాగంటి మమత, ఏఈఓలు, రైతులు బొప్పిడి కిషన్రెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు వసతులు
నల్లబెల్లి: మండలకేంద్రంలోని పెద్దచెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు అధికారులు, ప్రజాపతినిధులు సోమవారం వసతులు కల్పించారు. ఆదివారం సాక్షిలో ప్రచురితమైన శ్రీకరువుశ్రీ పనుల్లో కష్టాలు! అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్ నాగెల్లి జ్యోతిప్రకాష్ స్పందించి వార్డు సభ్యులతో కలిసి నల్లబెల్లి పెద్ద చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు సందర్శించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో నీడ కోసం పరదాలను ఏర్పాటు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. మంచినీటిని సరఫరా చేశారు. పని ప్రదేశంలో వసతుల కల్పనలో ఏమైన ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆమె వెంట వార్డు సభ్యులు పెద్దబోయిన రాజన్న, నాగెల్లి అనిల్, పరికి రమ కొర్నేల్, భూస రాజేశ్వరి లచ్చన్న, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ బత్తిని మధు, ఆశ కార్యకర్తలు ప్రియదర్శిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం.. ఔట్!
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026తనిఖీల్లో చిక్కుకుంటున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరికి నామమాత్రపు శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తున్నారు. కండక్టర్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రయాణీకుల రద్దీని తట్టుకుని టికెట్లు జారీ చేయాలి. ఈ క్రమంలో అనుభవలేమితో టికెట్ చెకింగ్లో చిక్కుతున్నారు. ఫలితంగా ఉద్యోగం ఊడిపోతుంది. కండక్టర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని ఏజెన్సీల మాయలో పడి డబ్బులు చెల్లించిన వారు ఆగమవుతున్నారు. ఏజెన్సీలు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి స్వల్ప వ్యవధిలోనే నెల రోజులు కూడా విధులు నిర్వహించకుండా, ఒక్క నెల జీతం కూడా తీసుకోకుండా ఉద్యోగాలు కోల్పోయిన వారు వరంగల్ రీజియన్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరు ఉద్యోగం పోయి.. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చిన సొమ్ము (డబ్బులు)పోయి లబోదిబో మొత్తుకుంటున్నారు. కండక్టర్ల కొరత తీర్చేందుకు.. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న వారు ప్రతీ నెల రిటైర్డ్ అవుతుండడంతో ప్రతీ నెల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. సాదారణ, అత్యవసర సెలవులు ఇవ్వకుండా డ్యూటీల మీద డ్యూటీలు వేస్తూ డ్రైవర్లపై తీవ్ర పని భారం మోపుతున్నారు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు నిర్వహిస్తుండడంతో అలసటలో డ్రైవింగ్తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో కండక్టర్ల కొరత ఏర్పడింది. సంస్థ బస్సుల్లో కండక్టర్ల కొరత తీర్చేందుకు వన్మ్యాన్ సర్వీస్ ద్వారా డ్రైవర్కు టిమ్ అప్పగించి డ్రైవర్తో పాటు కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు సంస్థ ఉద్యోగులు కాకపోవడంతో కండక్టర్ల కొరత తీర్చేందుకు ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టింది. అక్రమాలకు తెరలేపిన ఏజెన్సీలు సంస్థ నిబంధనలను ఆసరాగా చేసుకుని ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగం అంటేనే ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.. అయినప్పటికీ పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ ఏజెన్సీలు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాల్లో వసూళ్లకు తెగబడ్డారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో దాదాపు 15కు పైగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు 317 మంది కండక్టర్లను నియమించారు. ముందుగా నియమితులైన 179 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 120 మంది డ్రైవర్లు శిక్షణలో ఉన్నారు. వివరాలు ఎలా వెళ్లాయి? మరో వైపు అద్దె బస్సు డ్రైవర్ల వివరాలు ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏయే డిపోలో ఏ బస్సుపై ఏ డ్రైవర్ పని చేస్తున్నాడనే వివరాలు ఔట్సోర్సింగ్ ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయని, వీటి ఆధారంగా దళారులను నియమించుకుని పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ అద్దె బస్సు డ్రైవర్లను తమ వైపు లాక్కుంటున్నారు. పైగా, ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.20 వేలు, దశల వారీగా మొత్తం 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పని చేస్తున్న డ్రైవర్లు ఎలాంటి సమాచారం లేకుండా వెళ్లిపోవడంతో అద్దె బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో అద్దె బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లను ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవద్దని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. నవ్య (పేరు మార్చాం) అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగం కోసం ఏజెన్సీ ప్రతినిధికి రూ.50 వేలు చెల్లించింది. ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే టికెట్ ఇన్స్పెక్టర్లు బస్సును తనిఖీ చేశారు. తనిఖీలో ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా చిక్కారు. ప్రయాణికులేమో డబ్బులు ఇచ్చినప్పటికీ తమకు టికెట్ ఇవ్వలేదని చెబుతుండగా.. తనకు డబ్బులివ్వలేదని కండక్టర్ మొత్తుకుంది. వాస్తవాలు ఎలా ఉన్నా... ఔట్సోర్సింగ్ కండక్టర్ను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది. నవ్య ఏజెన్సీని సంప్రదిస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఏజెన్సీకి చెల్లించిన డబ్బులు రాక, ఉద్యోగం పోయి మొత్తుకుంటోంది. ఇది ఒక్క నవ్య పరిస్థితే కాదు. కొలువు కుదిరిన కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. స్వల్ప కాలంలోనే ఊడిపోతున్న కొలువులు 317 మంది కండక్టర్లు, 299 మంది డ్రైవర్ల నియామకం 15కు పైగా ఏజెన్సీలు.. డబ్బులిచ్చి మోసపోతున్న ఉద్యోగులు -
కేంద్రం వైఫల్యంతోనే చమురు సంక్షోభం
హన్మకొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేశంలో చమురు సంక్షభం సంభవించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు కట్ట్టెలతో వంటలు చేసి, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. గృహ వినియోగ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెరుగుదలతోపాటు అనేక ప్రాంతాల్లో లభ్యత లేకపోవడంతో, వంట గ్యాస్ పొందడానికి ప్రజలు మండే ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, నాయకులు కరుణాకర్, సదాలక్ష్మి, ఎల్లేష్, లింగారెడ్డి, రాములు, లక్ష్మణ్, ఎన్ఏ.స్టాలిన్, వెంకట్రాజం, భిక్షపతి, సదానందం, రవి, శంకర్ నాయక్, వెంకటేష్, రమేష్, సారంగపాణి, నర్సయ్య, రాజేందర్, వెంకటరమణ, స్వరూప, రాజయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
ఉచితం ఉత్త మాటే..!
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం (చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్)ను అక్కడి సిబ్బంది కమర్షియల్గా మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేద రోగులకు ఉచి తంగా అందించాల్సిన సర్కార్ వైద్య సేవలకు బేరమాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణాధికారి, ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నప్పటికీ.. వైద్యం కోసం వచ్చే వారి నుంచి వసూళ్లు మాత్రం ఆగట్లేదు. ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైరవీలతో, నగ దు ముట్టజెప్పిన వారు నేరుగా వైద్య సేవలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. పాలనా విభాగంలో సైతం కొందరు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు.. సీకేఎం ఆస్పత్రిలో ఓపీ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. వీరిని క్రమపద్ధతిలో పంపించే ఏర్పాట్లు లేవు. ఎవరైనా చికిత్స కోసం త్వరగా ఓపీ వైద్యుడిని కలవాలనుకుంటే అక్కడి సిబ్బందికి డబ్బులు ముట్టజెబితే లోపలికి పంపిస్తారని ఇతర పేషెంట్లు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం కూడా... చికిత్సలు, డెలివరీతో పాటు ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చినప్పుడు ఎంతో కొంతో ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కార్డు బెనిఫిట్ పొందాలన్నా, బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా రూ.500 నుంచి రూ.1,000 ఇవ్వక తప్పట్లేదు. ఇక మెయిన్ గేట్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు తమ పేషెంట్కు అవసరమైన పనులు చేసి పెడితే సెక్యూరిటీ గార్డులకు రూ.100 నుంచి రూ.200, అలాగే పాలన విభాగంలో ఓ ఉద్యోగి డెలివరీ సర్టిఫికెట్ కోసం రూ.1,000 నుంచి రూ.2,000లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. వసూళ్ల దందాను అరికట్టాలి.. ఉచితంగా వైద్యం అందుతుందని సర్కార్ దవాఖానకు వస్తే ప్రైవేట్ మాదిరిగానే ఇక్కడ వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీదానికి డబ్బులివ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి డబ్బుల వసూళ్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు.. పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మురళి, ఆస్పత్రి ఆర్ఎంఓ అడ్మిషన్ తర్వాత వార్డుల్లో క్లీనింగ్ కోసం రూ.50 నుంచి రూ.100, కుట్లు విప్పడానికి రూ.50 నుంచి రూ.100, వార్డు నుంచి వార్డుకు, స్కానింగ్ కోసం వీల్ చైర్లో వెళ్లినప్పుడు రూ.100 నుంచి రూ.200 స్కాన్ అండ్ ఎక్స్రేకు రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మెడిసిన్ కోసం రూ.100 నుంచి రూ.200లు, లేబర్ రూంలో రూ.200, ఆపరేషన్ రూంలో పుట్టిన బిడ్డలకు రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు సిబ్బంది రూ.200 నుంచి 500 తీసుకుంటున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందా.. అడుగడుగునా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నా నియంత్రణ కరువు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు -
వినతులు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ చాహత్ అధికారులతో కలిసి ప్రజల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి సంబంధిత జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రతీ అర్జీని పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులే స్వీకరించాలి.. కొంతమంది శాఖల నుంచి ఉన్నతాధికారుల బదులు కింది స్థాయి ఉద్యోగులు హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ, ఫిషరీస్ శాఖల నుంచి జూనియర్ సిబ్బంది రావడం సరికాదని పేర్కొన్నారు. ఇకపై ఇలా జరగకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులే హాజరై ప్రజల అర్జీలను పరిశీలించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర అధికారులను పంపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 170 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి అధికారులు పాల్గొన్నారు. సత్వరమే పరిష్కారం చూపండి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు చేయాలని ఒకరు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని ఇంకొకరు, లేబర్ కోడ్లు రద్దు చేయాలని మరొకరు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజ మణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు. ● కేంద్రప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు. ● గృహ నిర్మాణ పథకం కింద డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్కు చెందిన పి.రాధిక విజ్ఞప్తి చేశారు. అక్రమ పట్టా రద్దు చేయాలి.. ఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా వేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి. – ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్ -
ఎటు చూసినా ఎర్ర బంగారమే..
వరంగల్ మార్కెట్కు 70 వేల బస్తాల మిర్చి వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్కు మిర్చి భారీ మొత్తంలో తరలి వస్తోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం సుమారు 70వేల వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డులో చూసినా ఎర్రబంగారమే దర్శనమిచ్చింది. గురువారం ఉగాది కావడంతో రైతులు ముందుగానే కోసి మార్కెట్కు తరలించారు. పండుగతోపాటు మూడు రోజులు మార్కెట్కు సెలవు ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలో మిర్చి తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంటకు అధిక ధరలు పలుకుతుండడంతో రైతులు ఎప్పటికప్పుడు కోసిన మిర్చిని తరలిస్తున్నారు. సింగిల్ పట్టీ మిర్చికి 13వ తేదీన రూ.44వేలు ధర పలకగా సోమవారం అదే రకం మిర్చికి రూ.42వేలు పలికింది. యూఎస్ 341 రకం మిర్చికి రూ.22,400 పలకగా రూ.21,600 పలికింది. సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పక్క జిల్లాల నుంచి వస్తున్న మిర్చి.. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి కూడా తరలి వస్తోంది. పక్క జిల్లాల్లోని మార్కెట్లు చిన్నవి కావడంతో ఎక్కువ మిర్చి వస్తే సెలవు ప్రకటిస్తారు. మిర్చి మొత్తం కాంటాలైన తర్వాతే మళ్లీ కొనుగోళ్లు చేపడతారు. వరంగల్లో మిర్చిని నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం ఉండడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోకుండా సాగుతాయి. అందుకే రైతులు వరంగల్ మార్కెట్కు వస్తారని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు తెలిపారు. -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల్లోపు కార్యాలయాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూళ్లు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవానీ, తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా
హన్మకొండ: అభివృద్ధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని వడ్డేపల్లి ఎస్సీ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అదేదిశగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అందుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ మహానగరపాలక సంస్థ డీఈ సారంగం, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కరాబు రాజేశ్వర్రావు, ఎనుకంటి నాగరాజు, తాళ్లపల్లి సుదాకర్, తాళ్లపల్లి విజయ, మండల సమ్మయ్య, జేకే పాల్గొన్నారు. అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు..హన్మకొండ చౌరస్తా: అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్లోని కాకతీయ లైన్ ప్రాంతంలో రూ.1.30 కోట్లు, 10వ డివిజన్ పరిధిలోని అలంకార్ జంక్షన్లో రూ.29.50 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు చీకటి శారద, తోట వెంకటేశ్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం -
గ్యాస్ బుక్ చేస్తారు!
సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు ● గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్తో ఎర ● వాట్సాప్, ఎస్ఎంఎస్ లింక్లతో ప్రమాదమే ● సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్లు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులుసాక్షి, వరంగల్: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న వార్తలను నేరానికి పెట్టుబడిగా పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరుగుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్ఎంఎస్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెల్ఫోన్ వినియోగదారులకు వెళ్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. లింక్లు పంపి...పైసలు కొల్లగొట్టేలా... గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను మొబైల్లో డౌన్లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు పంపే యాప్ డౌన్లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సందేశాలు నేరుగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికలో ‘అత్యవసర గ్యాస్ బుకింగ్’, ‘తక్షణ డెలివరీ’ పేరుతో నకిలీ ప్రకటనలు విస్త్తృ తంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని, వెంటనే బుకింగ్ చేసుకునే ప్రత్యేక లింక్ ఇచ్చినట్లు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అలాంటి ఫైల్స్ను ఇన్స్టాల్ చేస్తే మొబైల్లోని బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వెళ్లే ప్రమాదం ఉంది. ముందుగా డబ్బు చెల్లిస్తే గ్యాస్ వస్తుందంటూ సందేశాలు వస్తే అది సైబర్ మోసమని గ్రహించాలి. 1930కి ఫిర్యాదు చేయండిసాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే చేయాలి. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే నేరుగా సంబంధింత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించండి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్షణ ఫిర్యాదు ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. – గిరి కుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్, వరంగల్ -
ప్రమాదంలో ‘కుడా’ అపార్ట్మెంట్స్
హన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లో అంబేడ్కర్ భవన్ పక్కన నిర్మించిన ‘కుడా’ అపార్ట్మెంట్స్ ప్రమాదకరంగా మారాయని అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు. ‘కుడా’ అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ రాగంశెట్టి సత్యనారాయణ అపార్ట్మెంట్ను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘కుడా’ అపార్ట్మెంట్లో అనేక సమస్యలున్నాయని వివరించారు. లిఫ్ట్ల అడుగు భాగంలో సీపేజ్ కారణంగా నీరు రావడం చాలా ప్రమాదకరమన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అపార్ట్మెంట్లో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారన్నారు. ఈ అపార్ట్మెంట్లో ‘కుడా’ గెస్ట్ హౌజ్ కోసం మూడు ఫ్లాట్లు వాడుతున్నప్పటికీ... నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించడం లేదని, ఇది అన్యాయమన్నారు. ‘కుడా’ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
ఐలోని మల్లన్నకు పెద్దపట్నం
ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం పెద్దపట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు. పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను మహా పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణ గావించి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షింతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు. అనంతరం ఉత్సవమూర్తులను ఒగ్గు పూజారులు బండారి చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేదపండిట్లు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ఒగ్గు పూజారులు పెద్ద మనుషులు మజ్జిగ మహేందర్, రాజయ్య, అశోక్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా కల్యాణోత్సం -
యూజీడీ వైపు అడుగులు
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతిసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా వర్షాకాలం వస్తే చాలు డ్రెయినేజీ లైన్లు తరచూ బ్లాక్ అవ్వడం, రోడ్లపై మురుగు నీరు రావడం, మ్యాన్హోల్స్ నుంచి మురుగు పొంగిపోవడం దోమలు, దుర్వాసన సమస్య సర్వసాధారణమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో పలు కాలనీలకు మురుగు, ముంపు బాధలు తప్పలేదు. ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది. యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు.. చెరువుల నీరు కలుషితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో నగరవాసులు తరచూ అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ, టెండర్ ప్రక్రియ ఖరారు, కాంట్రాక్టర్ ఎంపిక, పనుల ప్రారంభంపై కార్యాచరణ రూపొందించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్కు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పూర్తి, పనుల ప్రారంభం తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు నేడు మరోసారి సీఎంను కలవనున్న ప్రజాప్రతినిధులు పనుల ప్రారంభం ముహూర్తంపై చర్చించే అవకాశంయూజీడీ ప్రాజెక్టు వివరాలు..ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ వ్యవస్థ ఏర్పాటు పైపులైన్ నెట్వర్క్: 740 కిలోమీటర్లు యూజీడీ జోన్లు: 9 సీవరేజ్ ట్రీట్మెంట్ జోన్లు: 21 డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు 3.15 లక్షల ఇళ్లువరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్ హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు -
నేటినుంచి ఒంటిపూట బడులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు. -
హెచ్పీవీ టీకాలు ఇప్పించాలి
● హనుమకొండడీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ టీకాలు ఇప్పించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో 93 నుంచి 100 శాతం సామర్థ్యంతో హెచ్పీవీ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్లో దాదాపు రూ.4వేల ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. 14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు ఇంకా చేసుకో ని వారు ఈ టీకాలు వేసుకునేందుకు అర్హులని వివరించారు. ఈ టీకాలతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని, ఇతర టీకాల మాదిరిగా కొందరిలో ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం ఉండవచ్చని, ఇవన్నీ రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. హెచ్పీవీ టీకా సంతానోత్పత్తిని ఏ విధంగా ప్రభావితం చేయదని, వాస్తవానికి గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే, హెచ్పీవీ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ను నివారించడం ద్వారా సంతానోత్పత్తికి సహాయపడుతుందని వివరించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని, అలాగే వారి సమక్షంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. -
ఎంపీ వేం నరేందర్ను కలిసిన డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్ ఆదివారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పథకాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ, సినీ యాక్టర్ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్కాలనీలో అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి, కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్రావు, దిలీప్కుమార్, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలిహన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఆదివారం హనుమకొండ అంబేడ్కర్ కూడలిలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండమల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండానే ఆరోగ్య పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 40 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, ఎరియర్స్ వేతనంలో కలిపి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సుదర్శనాచార్యులుకు డాక్టరేట్
గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలిలోని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సుముద్రాల సుదర్శనాచార్యులుకు అరుదైన గౌరవం దక్కింది. వేద విజ్ఞానం, జ్యోతిష్యశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా బెంగళూరుకు చెందిన శుక్రాచార్య వేదాంగ విశ్వవిద్యాలయం ఆదివారం గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ గోపీనాధ్ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ‘వేదిక్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ పామిస్ట్రీ అండ్ రెమెడీస్’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈ మేరకు మండల ప్రజలు, ప్రముఖులు ఆయనను అభినందించారు. -
గ్యాస్ బుక్ చేస్తారు!
● గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్తో ఎర ● వాట్సాప్, ఎస్ఎంఎస్ లింక్లతో ప్రమాదమే ● సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్లు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులుసిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలుసాక్షి, వరంగల్: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న వార్తలనే నేరానికి పెట్టుబడిగా పెట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరుగుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేస్తూ, ఎస్ఎంఎస్లు పంపుతూ ప్రజలను బురిడీ కొట్టించి నగదు స్వాహా చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్ఎంఎస్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెల్ఫోన్ వినియోగదారులకు వెళ్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. లింక్లు పంపి...పైసలు కొల్లగొట్టేలా... ● గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వా ట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే గుర్తు తెలి యని లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు పంపే యాప్ డౌన్లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫో న్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సందేశాలు నేరుగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ● ఇటీవల సోషల్ మీడియా వేదికలో ‘అత్యవసర గ్యాస్ బుకింగ్’, ‘తక్షణ డెలివరీ’ పేరుతో నకిలీ ప్రకటనలు విస్త్తృతంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని, వెంటనే బుకింగ్ చేసుకునే ప్రత్యేక లింక్ ఇచ్చినట్లు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అలాంటి ఫైల్స్ను ఇన్స్టాల్ చేస్తే మొబైల్లోని బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వెళ్లే ప్రమాదం ఉంది. ముందుగా డబ్బు చెల్లిస్తే గ్యాస్ వస్తుందంటూ సందేశాలు వస్తే అది సైబర్ మోసమని గ్రహించాలి. 1930కి ఫిర్యాదు చేయండిసాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే చేయాలి. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించండి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్షణ ఫిర్యాదు ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. – గిరి కుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్, వరంగల్ -
భద్రకాళికి ఎస్బీఐ చైర్మన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు పూర్ణచందర్, ఆంజనేయులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఎస్బీఐ చైర్మన్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. అలాగే, రూ.1.20 లక్షలతో ఆలయ ఆర్చ్ గేట్కు రంగులు వేయించేందుకు దేవాలయ ధర్మకర్త మూగా శ్రీనివాసరావు కుమారుడు మూగా శ్రీధర్ ఆదివారం పెయింటర్కు అడ్వాన్స్ అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు. -
ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట్: రబీ సీజన్ ధాన్యం సేకరణకు సి ద్ధం కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధి కారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ 2025–26 ధాన్యం సేకరణ, 2024–25 సీఎంఆర్ డెలివరీ ప్రజా పంపణీ వ్యవస్థ అమలు, రైస్ మిల్లర్ల అసోషియేషన్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాల సమర్పణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో 2025–26 రబీ సీజన్లో సమారు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా సుమారు 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా అవసరమైన మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు ప్యాడీ క్లీనర్లు డ్రయర్లు తదితర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. ప్రజాపంపిణీ ద్వారా సరఫరా అవుతున్న బియ్యం ఎలాంటి దుర్వినియోగం జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మార్కెటింగ్ అధికారి సురేఖ, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇంటర్ మూల్యాంకనం షురూ
కాళోజీ సెంటర్: జిల్లాలోని ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకనం ఆదివారం ప్రారంభించినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలిరోజు వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన ఇంగ్లిష్, గణితం, సివిక్స్, తెలుగు, హిందీ (5 సబ్జెక్టులు) మూల్యాంకన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. వ్యాల్యుయేషన్ ప్రారంభానికి ముందు ఎల్బీ కాలేజీ అడిటోరియంలో శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూల్యాంకనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు పరిశీలకుడు రాజన్న మాట్లాడుతూ ఈనెల 18 నుంచి రెండవ స్పెల్, 20 నుంచి మూడవ స్పెల్ మూల్యాంకనంలో వివిధ సబ్జెక్టులు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు వరంగల్: హైదరాబాద్లోని గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎరబ్రెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తూర్పు నుంచి పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 బస్సులు, 50 కార్లలో సుమారు 1,500 మంది కార్యకర్తలు తరలివెళ్తున్న వాహన శ్రేణికి డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజు శిరీషశ్రీమాన్, బస్వరాజు కుమారస్వామి, పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, దూపం సంపత్, కరాటే ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి ఒంటిపూట బడులు విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ప్రమాదంలో ‘కుడా’ అపార్ట్మెంట్స్
హన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లో అంబేడ్కర్ భవన్ పక్కన నిర్మించిన ‘కుడా’ అపార్ట్మెంట్స్ ప్రమాదకరంగా మారాయని అపార్ట్మెంట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు. ‘కుడా’ అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం అపార్ట్మెంట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ రాగంశెట్టి సత్యనారాయణ అపార్ట్మెంట్ను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోషియేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘కుడా’ అపార్ట్మెంట్లో అనేక సమస్యలున్నాయని వివరించారు. లిఫ్ట్ల అడుగు భాగంలో సీపేజ్ కారణంగా నీరు రావడం చాలా ప్రమాదకరమన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా బేస్మెంట్, కారు పార్కింగ్ ప్రాంతంలోనూ ఇప్పటికీ నీటి ఊట చేరుతోందని, దీంతో భవన నిర్మాణంపై ప్రభావం చూపి బలహీనపడుతోందన్నారు. ఈ అపార్ట్మెంట్లో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారన్నారు. ఈ అపార్ట్మెంట్ సముదాయంలో ‘కుడా’ గెస్ట్ హౌస్ కోసం మూడు ఫ్లాట్లు వాడుతున్నప్పటికీ... నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించడం లేదని, ఇది అన్యాయమన్నారు. ఇప్పటికై నా ‘కుడా’ అధికారులు స్పందించిన సమస్యలు పరిష్కరించాలని, భవనానికి ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
ఏఓ కొత్త శ్రీప్రియకు ఇన్స్పైర్ అవార్డు
ఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ, సినీయాక్టర్ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. -
వ్యాపారులు నిబంధనలు పాటించాలి
నర్సంపేట: వ్యాపారులు తూనికలు, కొలతల చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించి వినియోగదారులకు న్యాయం జరిగేలా సరైన కొలతలతో వస్తువులు విక్రయించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో తూనికలు, కొలతల చట్టం అమలుపై ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ డెలివరీ ఆటోల్లో బరువు, పెట్రోల్ పంపులు, బంగారు దుకాణాలు, కిరాణా షాపులు, చికెన్, మటన్, చేపల దుకాణాలను పరిశీలించి తూనికలు, కొలతలు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. తనిఖీల్లో తూనికలు, కొలతల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా, చికెన్, మటన్, చేపల దుకాణాలపై 10 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తులు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కుకున్నారు. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధికంగా తరలిరావడంతో జాతర ప్రాంతం కిక్కిరిసింది. అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమునప్రవీన్, పంచాయతీ కార్యదర్శి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని నర్సంపేట చైర్పర్సన్ పెండం లక్ష్మీరామానంద్, కౌన్సిలర్లు కొంపల్లి వీణ, పొన్నాల మనీషా, ఇస్లావత్ రమ తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. -
ఇంకా నిర్మాణంలోనే..
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునఃర్విభజన ప్రక్రియ 2016లో అక్టోబర్ 11న (దసరా పండుగ రోజున) జరిగింది. అప్పటి వరకు ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత రం మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజిస్తూ వరంగల్ అర్బన్, వ రంగల్ రూరల్ జిల్లా, జనగామ, మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు గా విభజించారు. అనంతరం 2021లో వరంగల్ అర్బన్ జిల్లాను హనుమకొండ, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన జరిగి ప దేళ్లు కావస్తున్నా.. కార్యాలయాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి ల్లా కార్యాలయాలు నగరంలోని విసిరి పారేసినట్టు ఉండటంతో ఏ పనికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజల్లో గందరగోళం నెలకొంది. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలో నూతనంగా కలెక్టరేట్ (ఇంటిగ్రేటెట్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) నిర్మాణం పూర్తి కావస్తున్నా ప్రారంభానికి ముహూర్తం ఏప్పుడొస్తుందా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రూ.80 కోట్ల అంచనాతో.. జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆజంజాహి మిల్లుకు చెంది న సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టారు. 2023 జూన్లో సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. సుమారు 40కి పైగా ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకే భవనంలో కొలువుదీరనున్నాయి. ఇప్పటివరకు నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న రెవెన్యూ, వ్యవసాయ, విద్యా, వైద్య, సంక్షేమ, తదితర శాఖలన్నీ ఇకపై ఒకే భవనంలో ఉండనున్నాయి. విశాలమైన చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూమ్లు, పబ్లిక్ గ్రీవెన్స్ హాల్స్తో ఈ భవనం హైటెక్ లుక్ సంతరించుకోనుంది. ఒకే కాంప్లెక్స్లో అన్ని పనులు పూర్తవుతాయి. పైగా ప్రజల ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా కానున్నాయి. కలెక్టరేట్ ఆవరణలో ఆహ్లాదకర ఉద్యానవనాలు, వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు. పురోగతిలో నిర్మాణ పనులు ప్రస్తుత భవనానికి సంబంధించిన చివరి విడత పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తయ్యాయి. కా ర్యాలయాల్లో ఫర్నిచర్ బిగింపు, ఇంటర్నల్ సీసీ రో డ్లు, గ్రీనరీ పనులు పార్కింగ్ షెడ్స్ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక పనుల కోసం కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేకుండా మెట్టు ది గి తే ఆఫీస్, మెట్టు ఎక్కితే మరో ఆఫీస్ అన్నట్టుగా పా లన సాగనుంది. జిల్లాకు ప్రత్యేకంగా సకల సౌకర్యా లతో కలెక్టరేట్ నిర్మాణంతో పరిపాలన సవ్యంగా సాగనుంది. ఒక వేళ భవిష్యత్లో జిల్లాల పునర్విభజనపై ఏదైన కొత్త నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రస్తుతానికి కొత్త కలెక్టరేట్ నుంచి పాలన సాగనుంది. మూడేళ్లయినా పూర్తికాని కలెక్టరేట్ పనులు 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక అద్దె భవనాల్లోనే జిల్లా కార్యాలయాలు ఇబ్బందులు పడుతున్న జిల్లా వాసులు -
మహర్షి గోశాలకు సహకారం అందిస్తాం..
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హసన్పర్తి: మహర్షి గోశాలలో గోఆధారిత ఉత్పత్తులు తయారుచేయడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. చింతగట్టులోని మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్, ఎస్ఆర్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచగవ్య ఉత్పత్తుల తయారీ శిక్షణ శిబిరాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గోవులకు మేత వేసి మాట్లాడారు. మహర్షి గోశాలకు సహకారం అందిస్తామన్నారు. పొద్దుటూరులోని సురభి గోశాల ప్రతినిధి దిలీప్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ కోసం 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సర్జన రమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, తెలంగాణ రాష్ట్ర గోశాల సేవా సమితి సభ్యుడు ఆకుతోట రామారావు, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు యుగేంధర్, యాదగిరి, స్వామి నారాయణ, ప్రొఫెసర్ కేశవరావు, డి.కిషన్రావు, జయ, మలహర్రావు, నాగ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షలు షురూ
విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 64 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. 12,049 మంది విద్యార్థుల్లో 12,033 మంది (99.87 శాతం) హాజరయ్యారు. కాగా, హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో ఐదు పరీక్ష కేంద్రాలను రాష్ట్రస్థాయి అబ్జర్వర్, రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారి, 21 పరీక్ష కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి. జిల్లాలో 99.87 శాతం మంది హాజరు -
కోచ్ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి..
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్, గుర్రపు సుధాకర్రావు, వస్కుల రవీందర్, వల్లపు తిరుపతి, జి.భాస్కర్, జి.నాగరాజు, శిరుమల్ల రమేశ్ పాల్గొన్నారు. రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ నేడు రైల్వే జేఏసీ మహా నిరసన దీక్ష -
వైద్యసేవలు వినియోగించుకోవాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య కమలాపూర్: వైద్యసేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వరంగల్ ఎంజీఎం వైద్యులు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,597 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 132 మందిని తదుపరి వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, జీఎంహెచ్లకు పంపినట్లు తెలిపారు. సర్పంచ్ రమనాగరాజు మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక ఒక మంచి కార్యక్రమం అని, ప్రజలు వ్యాధులబారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరైనా వ్యాధులతో బాధపడుతుంటే ప్రభుత్వం వైద్యం చేయిస్తుందన్నారు. శిబిరంలో ఉపసర్పంచ్ సిద్ధార్థ, ఎంజీఎం, పీహెచ్సీ వైద్యులు రేణుక, సంయుక్త, సర్వేశం, హెల్త్ సూపర్వైజర్లు కనకలక్ష్మి, ప్రభాకర్, ఫార్మసిస్ట్ సుచరిత, స్టాఫ్నర్స్ సరిత, ల్యాబ్ టెక్నీషియన్ సురేశ్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు
అదనపు కలెక్టర్ రవికమలాపూర్: జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ ఎన్.రవి కోరారు. కమలాపూర్లోని హెచ్పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్లాంట్ రికార్డులు పరిశీలించి గ్యాస్ బాట్లింగ్, సిలిండర్ల సరఫరా తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ సంక్షోభంలో ప్రజలు గ్యాస్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తిస్థాయి గ్యాస్ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కమలాపూర్లోని గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్కు గతంలో మాదిరిగానే రోజుకు 15 లోడ్ల గ్యాస్ ట్యాంకర్లు వస్తున్నాయని, ఇక్కడి నుంచి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం పాత జిల్లాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గతంలో సగటున 3 వేల సిలిండర్ల బుకింగ్ ఉండగా.. ఇప్పుడు 15 వేల వరకు సిలిండర్లు బుకింగ్ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆస్పత్రులు, స్కూల్స్, విద్యా సంస్థలకు నిత్యం గ్యాస్ సరఫరా చేస్తున్నామని, హోటల్స్కు మాత్రమే సరఫరా నిలిపివేశామన్నారు. గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వినియోగదారులు నమ్మవద్దని కోరారు. అంతకుముందు ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. కిచెన్షెడ్డు, భోజనాన్ని పరిశీలించారు. వంటల గురించి అడిగి తెలుసుకుని, వంటగ్యాస్ నిల్వల గురించి ఆరా తీశారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, జిల్లా మేనేజర్ మహేందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సదానందం, ఆర్ఐ సమ్మయ్య, హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ నిర్వాహకులున్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
కాంతులీనే విద్యుద్దీపాలు.. నోరూరించే హలీం, హరీస్, బిర్యానీ సువాసనలు. మంత్రముగ్ధుల్ని చేస్తూ విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్త్రాభరణాలు. సుగంధాలు వెదజల్లే అత్తరు సీసాలు. ఇలా ఒక్కటేమిటి త్రినగరిలో మండి బజార్ వెళ్తే అది ఓ మధుర జ్ఞాపకం. రంజాన్ సందర్భంగా ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. వరంగల్ పాత లక్ష్మీటాకీస్ మొదలు, పోచమ్మమైదాన్ వరకు, అక్కడి నుంచి ఎల్బీనగర్, చార్బౌళి ప్రాంతంలో రంగుల విద్యుత్ దీపాలు ఆకర్షిస్తుంటాయి. సిటీ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిన మండిబజార్పై రంజాన్ నేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – న్యూశాయంపేటచిరు వ్యాపారులకు జీవనోపాధి..రంజాన్ మాసంలో చిరువ్యాపారులకు పుష్కలంగా జీవనోపాధి దొరుకుతుంది. ఒక్క నెలలోనే జరిగే వ్యాపారంపై వందలాది కుటుంబాలు ఏడాదిపొడవునా ఆధారపడతాయి. తోపుడు బండ్ల మీద అమ్మే వస్తువుల నుంచి షోరూంల వరకు ప్రతీ ఒక్కరికి ఇది మెయిన్ సీజన్. అదనపు రద్దీని తట్టుకోవడానికి హోటళ్లు, బట్టల షాపుల్లో తాత్కాలికంగా వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ ఉత్సవం గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా నిలుస్తోంది. మండిబజార్లో రాత్రి 10 గంటలకు మొదలయ్యే కోలాహలం మళ్లీ తెల్లవారుజామున సహర్ ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. పోలీస్ ఉన్నతాధికారులు మహిళల రక్షణ కోసం ఈవ్టీజర్స్ నుంచి కాపాడేందుకు షీ–టీమ్స్ను ఏర్పాటు చేయాలి. – మహ్మద్ అల్తాఫ్, మండిబజార్, వరంగల్ మండి బజార్ నైట్ వ్యూవరంగల్ నగరంలోని మండిబాజార్ నిత్యం రద్దీగానే ఉంటుంది. రంజాన్ మాసం వేళ ఇక్కడి దుకాణాలు విద్యుత్ దీపాలతో తళతళలాడుతుంటాయి. ముత్యాలు, రాళ్లతో పొదిగిన గాజులు, మేకప్ సామగ్రి కొనుగోలు చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. సంప్రదాయ ఖారా దుపట్టా, జరీవర్క్ ఉన్న దుస్తులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం బొమ్మలు, ఈద్కు సంబంధించిన పఠానీ, షల్వార్ ఖమీస్, షెల్వార్ షూట్ కొత్త దుస్తుల కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. అత్తరు వాసన(రోజ్, మొగ్రా) ఘుమఘుమలు, చేనేత కళాఖండాలు, కొత్తరకం బెడ్ షీట్లు, పరదాలు, క్రాకరీ ఐటమ్స్ పాదరక్షలు తదితరాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ఇక్కడ కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. నోరూరించే ఘుమఘుమలు.. మండిబజార్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు.. హలీం, హరీస్, పత్తర్కా ఘోష్ట్, కబాబ్, సమోసా, జిలేబీ, షీర్ ఖుర్మా, కద్దూకా ఖీర్, డబుల్కా మీఠా, ఖుర్బానీకా మీఠా, షాయిదూద్ వంటి పదార్థాలు నోరూరిస్తాయి. సహరీ సమయం వరకు ఇరానీ చాయ్–ఉస్మానియా బిస్కెట్లను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. సాధారణంగా నగరమంతా నిద్రపోయే సమయంలో ఈ ప్రాంతం మేల్కొని ఉంటుంది. రంజాన్లో ఉపవాసాలు ఉండే వారికి నైట్బజార్లో షాపింగ్ అయ్యాక తెల్ల వారుజామున 3 గంటల నుంచి 4.30 మధ్య సహరీ (సూర్యోదయానికి ముందు సమయం) సందడి మొదలవుతుంది. కేవలం ఇఫ్తార్కే కాకుండా సహరీ కోసం ప్రత్యేకంగా ఖిచిడీ–ఖట్టా–ఖీమా, నహారీ–కుల్చా తదితర వంటకాలు ఇక్కడ హాట్ కేక్ల్లా అమ్ముడవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పర్యాటకులే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఇక్కడి వచ్చి తెల్ల వారుజామున ఈ విందును ఆస్వాదిస్తారు. భద్రత కట్టుదిట్టం.. వేలాది మంది తరలి వచ్చే ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నగర పోలీసు అధికారులు ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వేలాది వాహనాలను నియంత్రించడానికి ట్రాఫిక్ను డైవర్ట్ చేసి నియంత్రిస్తున్నారు. కంట్రోల్ రూం ద్వారా నిరంతర నిఘా పెడుతున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు.● హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ..ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద ని బద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీ య పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపా రం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధా న్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టమ్ మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పర్వతగిరి: విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం పర్వతగిరి మండలంలోని ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, భోజనశాల, వంట గది, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. వంటగది, తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ సంధ్యారాణి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శారదను సస్పెండ్ చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత డీసీఓను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక అమలు నిర్లక్ష్యం వహించడం, విద్యార్థుల విద్యా కార్యకలాపాలపై పర్యవేక్షణ లేకపోవడంపై పీఓ అపర్ణ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రేవతి, బీజీఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను పరిశీలించి విద్యార్థుల ఫిర్యాదులను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, తదితరులు ఉన్నారు. పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి న్యూశాయంపేట: విద్యార్థులు పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టర్ చాంబర్లో హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం విడుదల చేసిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీవైడబ్ల్యూఓ అనిల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. సిలిండర్ కొరత లేదు.. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత లేదని కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొంత మంది వినియోగదారులు సిలిండర్ల కొరత వచ్చే అవకాశం ఉందని భావించి ముందుగానే ఎల్పీజీ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారన్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనన్నారు. కలెక్టర్ సత్యశారద ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ -
‘కరువు’ పనుల్లో కష్టాలు!
నల్లబెల్లి: గ్రామాల్లో వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పథకంలో అక్రమాలను నివారించేందుకు నూతన సాఫ్ట్వేర్ను రూపొందించింది. కానీ, కూలీలకు పని ప్రదేశంలో వసతులు కల్పించడంలో మాత్రం విస్మరిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేక పనులు అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పడం లేదని, అసౌకర్యాల నడుమ ఇబ్బందులు పడుతూ పనులు చేస్తున్నామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం చెరువుల్లో గుంతలు, పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి. కానరాని ఫస్ట్ఎయిడ్ కిట్లు ఎండలు దంచికొడుతుండడంతో ఉపాధి కూలీలు బిక్కుబిక్కుమంటూ పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ, తాగునీరు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నా అవి ఏమి కానరావడంలేదు. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే ప్రథమ చికిత్స అందించడానికి ఫస్ట్ఎయిడ్ కిట్లు సైతం అందుబాటులో లేవు. వసతులు లేకపోవడంతో చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు కూలీలు మొగ్గు చూపడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండవేడిలో గంటల తరబడి పనులు చేస్తున్న కూలీలు కొంత సమయం సేద తీరేందుకు పని ప్రదేశాలోల నీడ ఉండడం లేదు. నీడ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అధికారులు, సిబ్బంది అటువైపుగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీడ కోసం 8 సంవత్సరాల క్రితం పరదాలు అందించిన ప్రభుత్వం తిరిగి పరదాలు అందజేసిన దాఖలాలు లేవు. గతంలో అందించిన పరదాలు ఎప్పుడో చినిగిపోయాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధి హామీ పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీ నాగెల్లి సామ్యేల్. ఉపాధి పనులు చేసేందుకు వచ్చిన కూలీలు భోజనం చేసి సేద తీరేందుకు అధికారులు నీడ ఏర్పాటు చేయలేదు. దీంతో చేసేదేమిలేక మండుటెండలో మొట్టుపై కూర్చుండి అన్నం తిన్నాడు. అధికారులు పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇది కేవలం ఒక్క సామ్యేల్ దుస్థితే కాదు.. జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చాలాచోట్ల కూలీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.ఎండలో విలవిలాడుతున్న ఉపాధి హామీ కూలీలు మౌలిక వసతులు కల్పించడంలో అధికారుల నిరక్ష్యం -
వరంగల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026కాంతులీనే విద్యుద్దీపాలు.. నోరూరించే హలీం, హరీస్, బిర్యానీ సువాసనలు. మంత్రముగ్ధుల్ని చేస్తూ విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్త్రాభరణాలు. సుగంధాలు వెదజల్లే అత్తరు సీసాలు. ఇలా ఒక్కటేమిటి త్రినగరిలో మండి బజార్ వెళ్తే అది ఓ మధుర జ్ఞాపకం. రంజాన్ సందర్భంగా ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. వరంగల్ పాత లక్ష్మీటాకీస్ మొదలు, పోచమ్మమైదాన్ వరకు, అక్కడి నుంచి ఎల్బీనగర్, చార్బౌళి ప్రాంతంలో రంగుల విద్యుత్ దీపాలు ఆకర్షిస్తుంటాయి. సిటీ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిన మండిబజార్పై రంజాన్ నేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – న్యూశాయంపేటవాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ప్రమాదాలకు అడ్డుకట్ట రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, రియర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేసింది. చిరు వ్యాపారులకు జీవనోపాధి..రంజాన్ మాసంలో చిరువ్యాపారులకు పుష్కలంగా జీవనోపాధి దొరుకుతుంది. ఒక్క నెలలోనే జరిగే వ్యాపారంపై వందలాది కుటుంబాలు ఏడాదిపొడవునా ఆధారపడతాయి. తోపుడు బండ్ల మీద అమ్మే వస్తువుల నుంచి షోరూంల వరకు ప్రతీ ఒక్కరికి ఇది మెయిన్ సీజన్. అదనపు రద్దీని తట్టుకోవడానికి హోటళ్లు, బట్టల షాపుల్లో తాత్కాలికంగా వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ ఉత్సవం గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా నిలుస్తోంది. మండిబజార్లో రాత్రి 10 గంటలకు మొదలయ్యే కోలాహలం మళ్లీ తెల్లవారుజామున సహర్ ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. పోలీస్ ఉన్నతాధికారులు మహిళల రక్షణ కోసం ఈవ్టీజర్స్ నుంచి కాపాడేందుకు షీ–టీమ్స్ను ఏర్పాటు చేయాలి. – మహ్మద్ అల్తాఫ్, మండిబజార్, వరంగల్ మండి బజార్ నైట్ వ్యూవరంగల్ నగరంలోని మండిబాజార్ నిత్యం రద్దీగానే ఉంటుంది. రంజాన్ మాసం వేళ ఇక్కడి దుకాణాలు విద్యుత్ దీపాలతో తళతళలాడుతుంటాయి. ముత్యాలు, రాళ్లతో పొదిగిన గాజులు, మేకప్ సామగ్రి కొనుగోలు చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. సంప్రదాయ ఖారా దుపట్టా, జరీవర్క్ ఉన్న దుస్తులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం బొమ్మలు, ఈద్కు సంబంధించిన పఠానీ, షల్వార్ ఖమీస్, షెల్వార్ షూట్ కొత్త దుస్తుల కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. అత్తరు వాసన(రోజ్, మొగ్రా) ఘుమఘుమలు, చేనేత కళాఖండాలు, కొత్తరకం బెడ్ షీట్లు, పరదాలు, క్రాకరీ ఐటమ్స్ పాదరక్షలు తదితరాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ఇక్కడ కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. నోరూరించే ఘుమఘుమలు.. మండిబజార్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు.. హలీం, హరీస్, పత్తర్కా ఘోష్ట్, కబాబ్, సమోసా, జిలేబీ, షీర్ ఖుర్మా, కద్దూకా ఖీర్, డబుల్కా మీఠా, ఖుర్బానీకా మీఠా, షాయిదూద్ వంటి పదార్థాలు నోరూరిస్తాయి. సహరీ సమయం వరకు ఇరానీ చాయ్–ఉస్మానియా బిస్కెట్లను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. సాధారణంగా నగరమంతా నిద్రపోయే సమయంలో ఈ ప్రాంతం మేల్కొని ఉంటుంది. రంజాన్లో ఉపవాసాలు ఉండే వారికి నైట్బజార్లో షాపింగ్ అయ్యాక తెల్ల వారుజామున 3 గంటల నుంచి 4.30 మధ్య సహరీ (సూర్యోదయానికి ముందు సమయం) సందడి మొదలవుతుంది. కేవలం ఇఫ్తార్కే కాకుండా సహరీ కోసం ప్రత్యేకంగా ఖిచిడీ–ఖట్టా–ఖీమా, నహారీ–కుల్చా తదితర వంటకాలు ఇక్కడ హాట్ కేక్ల్లా అమ్ముడవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పర్యాటకులే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఇక్కడి వచ్చి తెల్ల వారుజామున ఈ విందును ఆస్వాదిస్తారు. భద్రత కట్టుదిట్టం.. వేలాది మంది తరలి వచ్చే ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నగర పోలీసు అధికారులు ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వేలాది వాహనాలను నియంత్రించడానికి ట్రాఫిక్ను డైవర్ట్ చేసి నియంత్రిస్తున్నారు. కంట్రోల్ రూం ద్వారా నిరంతర నిఘా పెడుతున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నెక్కొండ: గ్రామ పంచాయతీ వర్కర్లు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మల్టీపర్సస్ వర్కర్ విధానంతో కార్మికులు, సిబ్బంది ఒత్తిడి గురవుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం జీఓ నంబర్ 51ను సవరించి మల్టీపర్సస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, గతంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలను అమలు చేయాలని పేర్కొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు, మేర్గు మధార్, నాయకులు కనకం కష్ణ, గుజ్జునూరి రాజు, ఈదునూరి వెంకటేష్, మహేశ్, బాబు, వెంకన్న, నాగేశ్, సబిత, రామనర్సమ్మ, స్వరూప, కళావతి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు కట్టమల్లన్నస్వామి కల్యాణం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణాన్ని నేడు (ఆదివారం) వైభవంగా జరపనున్నట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, మ్యాదరబోయిన వంశీయులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాలను గొర్రెకుంట గ్రామంలోని కట్టయ్య ఇంటి నుంచి తోడ్కొని వెళ్లి ఆలయం వద్ద అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మతో కల్యాణం జరపనున్నట్లు తెలిపారు. ఒగ్గు పూజారులు ఆలయం వద్ద పెద్ద పట్నం వేస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జనగణనపై రెండో రోజు శిక్షణన్యూశాయంపేట: దేశాభివృద్ధికి ప్రభుత్వ పథకాల అమలుకు జనగణన–27 కీలకమని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ సంయుక్త సంచాలకుడు డి.సుబ్బరాజు, గణాంక అధికారి సీహెచ్ సతీష్లు తెలిపారు. శనివారం కలెక్టర్ సమావేశ హాల్లో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, సీపీఓ చంద్రకళ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. కొవ్వొత్తులతో నివాళిగీసుకొండ: గంగదేవిపల్లి గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకుడు, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి గ్రామంలోని మహిళలు శనివారం రాత్రి నివాళులర్పించారు. అమర్ రహే రాజమౌళి.. అంటూ గ్రామంలో నినాదాలు చేస్తూ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిన్ను ఎన్నటికీ మరువమంటూ ర్యాలీ నిర్వహించి, ముందుకు సాగారు. సర్పంచ్ కూసం స్వరూపరమేశ్, ఉపసర్పంచ్ మేడిద ప్రశాంత్, నాయకులు గోలి కుమారస్వామి, సీఏ పెండ్లి జనార్దన్, యువకులు పాల్గొన్నారు. రాజమౌళి ఆశయాలను, ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనంకాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ నేటి నుంచి ప్రారంభం కానుందని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నేడు (ఆదివారం) లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, గణితం, తెలుగు, సివిక్స్, హింది సబ్జెక్టులు ప్రారంభమవుతాయన్నారు. ప్రతీ రోజు ఒక్కో ఎగ్జామినార్ 30 పేపర్ల మూల్యాంకనం చేయాలని, చీఫ్ ఎగ్జామినర్, విషయ నిపుణులు మూల్యాంకనాన్ని పర్యవేక్షించాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో సెల్ ఫోన్ల వినియోగం నిషేధమన్నారు. బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కోడింగ్ అధికారులు మాధవరావు, శోభాదేవి, సంపత్కుమార్, విష య నిపుణులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు షురూ
ఖానాపురం: పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు ● తొలిరోజు 13 మంది విద్యార్థులు గైర్హాజరు ● పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారదకాళోజీ సెంటర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9,492 మంది కాగా 13 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా సీసీ కెమెరాలు అమర్చి పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా నగరంలోని కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను ఆర్డీఓ సుమ, ఖిలావరంగల్ తహసీల్దార్ ఎండీ ఎక్బాల్, శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, పోచమ్మమైదానంలోని ఎస్ఆర్ హైస్కూల్ సెంటర్, దేశాయిపేటలోని నాగార్జున హైస్కూల్ సెంటర్, కొత్తవాడలోని గిర్మాజిపేట ప్రభుత్వ పాఠశాల సెంటర్, పైడిపెల్లి హైస్కూల్ సెంటర్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సత్యశారద నర్సంపేట: జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నర్సంపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు. అలాగే ధర్మారంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. -
టెన్త్.. ఆల్ ది బెస్ట్!
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026నేటినుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ● ఉదయం 9.35 గంటలు దాటితే నో ఎంట్రీ ● అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు ● తొలిసారిగా సెంటర్ల వద్ద క్లాక్ రూమ్ విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో సంబంధిత విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం నుంచి ఏప్రిల్ 15వరకు జరగనున్న పరీక్షలకు హనుమకొండ జిల్లాలో 64 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ కలిపి 12,079 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్కో సెంటర్కు ఒకరు చొప్పున 64మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు తీసుకురాకూడదు. ఒకవేళ ఏమైనా బ్యాగ్లు తీసుకొస్తే ఆ క్లాక్ రూమ్లో భద్రపర్చుకునే వెసులుబాటు కల్పించారు. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ విద్యార్థులకు హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఆ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షకేంద్రం అడ్రస్ గూగుల్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది. ఇప్పటికే హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైనా ఫీజుల పేర హాల్టికెట్ ఇవ్వకుంటే నేరుగా బీఎస్ఈ.తెలంగాణజీఓవీ.ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ హాల్టికెట్తో పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉంటుంది. కేంద్రాల్లోని సీఎస్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకూ ఫోన్ అనుమతి లేదు. సీసీ కె మెరాల నిఘాలోనే చీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నపత్రాల బండిళ్లను విప్పాల్సి ఉంటుంది. పరీక్షలు ముగిశాక మళ్లీ సీసీ కెమెరా నిఘాలోనే జవాబుపత్రాలను బండిళ్లుగా కట్టాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్షకు వ్యవధి.. శనివారంనుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు బాగా ప్రిపేరయ్యే అవకాశం ఉంది. మధ్య లభించే ఈ గడువులో వారికి సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలు, అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9–35గంటల తర్వాత అనుమతి ఉండబోదు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాం. ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – ఎల్వీ గిరిరాజ్ గౌడ్, డీఈఓ హనుమకొండ●పరీక్షసమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు ఫిజికల్, బయాలాజికల్ సైన్స్ : ఉదయం 9–30 నుంచి 11గంటల వరకుకేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్సెంటర్లను మూసివేయాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడుపుతారు. విద్యుత్కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ (సెల్నంబర్ 79817 67208)లో సంప్రదించవచ్చు. విద్యార్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది. ఉదయం 9–35గంటల తర్వాత లోనికి అనుమతి ఉండదు. సమాచారం కోసం ప్రతీ సెంటర్ వద్ద బ్యానర్ కట్టారు. అందులో సెంటర్ పేరు, కంట్రోల్ రూమ్ సెల్నంబర్ను పొందుపర్చారు. -
ఆర్టీసీలో నియామకాలపై విచారణ షురూ
● ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ హన్మకొండ: ‘అమ్మకానికి ఉద్యోగం’ శీర్షికన ఈ నెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఔట్ సోర్సింగ్ నియామకాలపై విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.. కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాలు అందుకున్న ఆయన విచారణ షురూ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ కవిత వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్ డీసీపీ దార కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. మార్కెట్ క్యాంటీన్లో పాము కలకలం వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పల్లికాయ యార్డు పక్కనే ఉన్న క్యాంటీన్ నిర్వాహకుడిని పాము కాటేసింది. శుక్రవారం క్యాంటీన్ నిర్వాహకుడు శ్రీనివాస్ కట్టెలు తీసే క్రమంలో పామును పట్టుకోవడంతో కాటు వేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అతడిని హోటల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వంటకు ఉపయోగించే కట్టెలను పెద్ద మొత్తంలో పల్లికాయ యార్డు పక్కనే స్టాక్ పెట్టడంతో పాములు, విష పురుగులకు ఆవాసంగా మారిందని, వెంటనే కట్టెలను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంక క్రికెట్ టూర్కు పవన్, వైష్ణవ్ వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు కొలంబోలో జరగనున్న టీ–20, వన్డే మ్యాచ్లలో పాల్గొనేందుకు హెచ్సీఏ సంయుక్త జిల్లాల జట్టులో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో జి.పవన్, వి.వైష్ణవ్తో పాటు టూర్ పరిశీలకుడిగా చాగంటి శ్రీనివాస్, కోచ్లుగా జీఎస్ రాజు, సీహెచ్ వెంకటేశ్వర్లును హెచ్సీఏ అపెక్స్ కమిటీ ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. -
అక్కడ యుద్ధం..
ఇక్కడ ఆందోళన!సాక్షి ప్రతినిధి, వరంగల్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ ప్రభావం పరోక్షంగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలపై పడుతోంది. ఇప్పటికే వంటింటిపై ఎల్పీజీ గ్యాస్ బండ భారమవుతోంది. గ్రేటర్ వరంగల్ నగరంలో చిన్న చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ పా యింట్లు మూతపడుతున్నాయి. పబ్లిక్ గార్డెన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కేయూసీ ప్రాంతాల్లో ఉదయం వాకింగ్ చేసేవారికి రాగి జావా, జొన్న గట్క ఇవ్వలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంపైనా.. ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో సుమారు 4.27 లక్షల మంది రైతులు, 5 లక్షలకుపైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ధరల పెరుగుదలతో సాగు వ్యయం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన వినియోగం ఎక్కువ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకు సుమారు 40–50 లక్షల లీటర్ల పెట్రోల్, 70–80 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రభావం సుమారు 13 లక్షల మందిపై పడుతుందని అంచనా. ఉమ్మడి వరంగల్లో ఏటా యూరియా 1.3 – 1.5 లక్షల టన్నులు, డీఏపీ 60 – 70 వేల టన్నులు, పొటాష్ 25 – 30 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 80 – 90 వేల టన్నుల వినియోగం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఎరువులు ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం పడితే ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, డీజిల్, ఎరువుల ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరుగుతాయని ఎల్క తుర్తి మండలానికి చెందిన రైతు నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్, ఇంధన ధరలు పెరిగితే కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, చిరువ్యాపారస్తులపై భారం పడుతోంది’ అని టీ పాయింట్ నిర్వాహకుడు, గ్యాస్ వినియోగదారుడు సాయి సిద్ధార్థ్ చెప్పారు. వ్యాపార వాణిజ్య రంగంలో ఆందోళన.. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ రంగం ఇతర వృత్తుల్లో పనిచేసేవారి సంఖ్య 4,46,399 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, సరుకుల ధరలపై ప్రభావం పడుతోంది. గృహ పరిశ్రమలు/చిన్న పరిశ్రమల్లో పనిచేసేవారు 34,820 మంది ఉండగా.. ముడి పదార్థాల ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో అన్ని రంగాల్లో పనిచేసే జనాభా 17,05,655 మంది ఉండగా.. యుద్ధాల వల్ల వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ వర్గాలందరికీ పరోక్ష ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంటింటిపై తీవ్ర ప్రభావం.. మొదలైన గ్యాస్ సిలిండర్ల కొరత టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలకు దెబ్బ వ్యవసాయం సహా పలు రంగాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉమ్మడి వరంగల్పై పరోక్ష ప్రభావంఈ ఫొటోలో దిగాలుగా కూర్చున్నది మునగాల కల్యాణ్కుమార్. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద రోజూ ఉదయం రాగి జావా, జొన్నగట్క, మొలకల స్టాల్ ఏర్పాటు చేసి వాకర్లకు విక్రయిస్తుంటాడు. రెండు రోజులనుంచి మొలకలు మాత్రమే విక్రయిస్తున్నాడు. రాగి జావా, జొన్న గట్క ఎందుకు పెట్టడం లేదని అడిగితే ‘గ్యాస్ అయిపోయింది. ఇంతకుముందు బుక్ చేసిన వెంటనే సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండు రోజులుగా రాగి జావా, జొన్న గట్క తయారు చేయడం లేదు’ అని సమాధానమిచ్చాడు. -
గ్యాస్ కోసం చింతించొద్దు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు కల్గకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పౌర సరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్టిబ్య్రూషన్ ఏజెన్సీల యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితి, వినియోగదారులకు అందుతున్న సిలిండర్లపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి చర్చించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు నారాయణ, రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీసీఎస్ఓ ఎండీ.వాజీద్ అలీ, బీపీసీఎల్ వరంగల్ మేనేజర్ సాహిల్ ధోబ్లె తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. జిల్లాలో 68.56 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, హనుమకొండ, పరకాల తహసీల్దార్లు రవీందర్రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలి.. ¯]lƇʅ¯]lVýSÆŠḥæ: నగర పరిధి చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం ‘కుడా’ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’, ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇందులో ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇరిగేషన్, ‘కుడా’, బల్దియా అధికారులు కిరణ్ కుమార్, భీమ్ రావు, మహేందర్, సంతోశ్బాబు, ఇరిగేషన్ డీఈ హర్షవర్ధన్, ఎన్ఐటీ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు పాల్గొన్నారు. గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్ హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్ ఎన్.రవి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కలెక్టరేట్లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
● జెడ్పీ సీఈఓ బి.శేషాద్రి కమలాపూర్: నివాస గృహాల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ బి.శేషాద్రి సూచించారు. ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా.. శుక్రవారం ఆ యన కమలాపూర్లో పర్యటించారు. ఈసందర్భంగా ఫ్రైౖడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మార్క మొగిలి ఇంటి ఆవరణను పరిశీలించి డ్రమ్ముల్లో ఉన్న నీటి నిల్వలను స్థానిక అధికారులతో కలిసి పారబోశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఉగాది లోపు గృహ ప్రవేశాలు చేసుకోవాలని, మొదటి విడత లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటే రెండో విడతలో మండలానికి మరిన్ని ఎక్కువ ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్ పబ్బు సతీశ్, ఎంపీడీఓ గుండె బాబు, సూపరింటెండెంట్ కరణ్సింగ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏపీఓ రమేశ్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. -
క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
● హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణాధికారి హిమబిందుఎంజీఎం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు అన్నారు. మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకతీయ మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాలలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ.. టీబీని నివారించడం కంటే ముందుగా దాన్ని గుర్తించడం ముఖ్యమని, ప్రాథమిక దశలో గుర్తించి తగు చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రివచ్చన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ టి.సునీత, నర్సింగ్ ట్యూటర్స్ అనురాధ, సుకన్య, జిల్లా క్షయ వ్యాధి టీబీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు సుష్మా, కిరణ్ కుమార్, నగేశ్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ విజయ్, సతీశ్, హెల్త్ విజిటర్స్ అంజమ్మ, సునీత, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. పీహెచ్సీ సందర్శన హసన్పర్తి: హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ ప్రతినిధి డాక్టర్ శిరీష సందర్శించారు. ఈసందర్భంగా కుష్ఠువ్యాధి డిటెక్షన్ సర్వే నిర్వహించారు. పైలేరియా, కుష్ఠు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ రామ్ భార్గవ్, డాక్టార్ భరత్, హెచ్ఈఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, సతీష్రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ అబ్బాస్, విప్లవ్కుమార్ పాల్గొన్నారు. -
పొగ.. సెగ
మత్స్యకారుల విలవిల మడికొండ సమీప గ్రామాల చెరువుల్లో చేపలు పెంచే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. నీరు కలుషితం కారణంగా చేపలు ఎదగడం లేదని, చాలా వరకు చనిపోతున్నాయని, పెట్టుబడి సైతం రావట్లేదని వారంతా వాపోతున్నారు. సొంతంగా సీడ్స్ తెచ్చుకుని వేసుకుంటే కనీసం బతకడానికి కూడా కష్టమవుతోందని, డంపింగ్ యార్డు కారణంగా వృత్తిని వదిలి కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లుతాళ్లు.. మడికొండ ప్రాంతంలో సుమారు 2,000కు పైన తాటిచెట్లు ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని సుమారు 200 కల్లుగీత కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి. డంపింగ్ యార్డు పొగ, కలుషిత జలాల కారణంగా కల్లు రుచిపోతోందని, తమ గిరాకీ తగ్గుతోందని గీతకార్మికులు వాపోతున్నారు. ఇదివరకు మాదిరిగా కల్లు పారడం లేదని ఈ వృత్తిని నమ్ముకున్న తమకు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వారంతా ఆందోళన చెందుతున్నారు.కాజీపేట అర్బన్: ‘పొగ తాగరాదు’ అని సినిమా థియేటర్లలో పలు బహిరంగ ప్రదేశాల్లో బోర్డులు చూస్తుంటాం. పొగ తాగే వారితో పాటు పీల్చినా ఆరోగ్యానికి ప్రమాదమే అని హెచ్చరిస్తుంటారు వైద్యులు. అలాంటిది నిత్యం చిన్నాపెద్దా తేడా లే కుండా పొగ పీలుస్తూనే ఉన్నారు మడికొండ, రాంపూర్, కాజీపేట, డీజిల్ కాలనీ, అయోధ్యపురం, కడిపికొండ, ధర్మసాగర్, కుమ్మరిగూడెం, తదితర గ్రామాల ప్రజలు. ఆయా ఊళ్ల ప్రజల జీవన విధానంలో పొగ అంతర్భాగమైంది. అనారోగ్యం రోజుకింత చొప్పున శరీరం లోపలికి వ్యాపిస్తోంది. పొసగకుండా చేస్తున్న ఈ పొగ జీవనోపాధిపై ఎనలేని ప్రభావం చూపుతోంది. చెమ్మగిల్లుతోన్న చెరువు.. చెరువు.. ఊరికి ఆదెరువు. మడికొండ చుట్టుపక్కల పంట పొలాలకు చెరువునీరు ఆధారంగా ఉండేది. ఈ నీటితో సమృద్ధిగా పంటలు పండించేవారు. 2011లో డంపింగ్ యార్డు ఏర్పాటైన తర్వాత చెరువు నీరు కలుషితమవుతోంది. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాల్లో పంటల దిగుబడి సైతం తగ్గిందని స్థానికులు వాపోతున్నారు. కాగా, మడికొండ పెద్ద చెరువులో కలుషితమైన నీరు సోమిడి చెరువుకు చేరుతుంది. అక్కడి నుంచి వడ్డేపల్లి పెద్ద చెరువులోకి చేరుతుంది. ఇలా ఆయా చెరువులు కలుషితమవుతున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయి. మడికొండలోని డంపింగ్ యార్డుతో ప్రశ్నార్థకంగా కులవృత్తులు ముదిరాజ్, గీత కార్మికుల జీవనోపాధిపై ప్రభావం యార్డును తొలగించాలని డిమాండ్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
దుగ్గొండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు మెరుగైన వైద్య సేవలందిస్తారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నర్సంపేట జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆరుగురు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందదు అనే అపోహను ప్రజలు తొలగించుకోవాలని సూచించారు. 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ టీకాను వేయించాలని ఆయన కోరారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, మండల వైద్యాధికారులు కిరణ్రాజు, విజయ్కుమార్, రాకేశ్, నర్సంపేట జనరల్ ఆస్పత్రి వైద్య నిపుణులు రవితేజ, కావ్య, అనూపమ్, సింధూరి, దివ్య, శివాని, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు -
గంగదేవిపల్లిలో రాజమౌళి స్మారక విగ్రహం
గీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లిని జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రవారం గ్రామస్తులు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కమిటీ ఏర్పాటు కాగా సుమారు రూ.10 లక్షలతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. కమిటీ అధ్యక్షుడిగా కూసం రమేశ్, సభ్యులుగా గోనె కుమారస్వామి, సోమిడి శ్రీనివాస్, ఆకుల రుద్రప్రసాద్, గోనె మల్లారెడ్డి, నాగరాజు, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, గోనె రాజయ్య, గడ్డమీది బాలరాజు, ముస్కు రమేశ్, చల్ల లింగం, గోపాల్రాజు, కూసం మల్లికార్జున్, గోనె సంపత్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న గ్రామంలో రాజమౌళి సంతాప సభను నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించాలని కమిటీ అధ్యక్షుడు కూసం రమేశ్ కోరారు. ఏర్పాటుకు కమిటీ ఎన్నిక 18న గ్రామంలో సంతాప సభ -
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్ డీసీపీ దార కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలుకాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు పరీక్షకు 163 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 4,736 మంది జనరల్ విద్యార్థులకు 4,605 మంది, 671 మంది ఒకేషనల్ విద్యార్థులకు 639 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
యాంత్రీకరణకు ప్రాధాన్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి యాంత్రీకరణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన 27 మంది రైతులకు 50 శాతం రాయితీపై రోటవేటర్స్, టేలర్స్, స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు రాయితీతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. డ్రోన్ స్ప్రేయర్లు రైతు సంఘాలు లేదా మహిళ సంఘాలకు కేటాయించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని పేర్కొన్నారు. పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్ర మంలో ఇల్లంద సర్పంచ్ బేతి సాంబయ్య, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్ పర్సన్ నేతావత్ షిభారాణి రాజేందర్, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, వర్ధన్నపేట, పర్వతగిరి మండలా పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, జాటోతు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
విజయోస్తు..
వరంగల్శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలుఘనంగా నిర్వహిస్తాం.. కాళేశ్వరంలో పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంఈఓ చరణ్సింగ్ కాళోజీ సెంటర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 288 పాఠశాలల నుంచి 9,492 మంది విద్యార్థులు (బాలురు 4,932 మంది, బాలికలు 4,560 మంది) హాజరుకానున్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, ఆరుగురు రూట్ అధికారులు, ఆరుగురు అదనపు రూట్ అధికారులు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులు), 496 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోని సీఎస్ రూంలలో 22 శాశ్వత సీసీ కెమెరాలు, మిగిలిన 25 ప్రభుత్వ కేంద్రాల్లో తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులకు సౌకర్యాలు.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, కుర్చీలు, బెంచీలు, మరుగుదొడ్లు, వైద్యసేవలు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతా లకు మొబైల్ ఫోన్లు తీసుకురావడం నిషేధం. అదేవిధంగా విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులు భద్రపరుచుకునేందుకు పరీక్ష కేంద్రాల్లోని ప్రవేశద్వారం వద్ద క్లాక్రూంలు ఏర్పాటు చేశారు. హాల్టికెట్లపై క్యూఆర్కోడ్.. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు హాల్టికెట్లపై క్యూర్ కోడ్ ముద్రించారు. గూగుల్ లెన్స్తో హాల్టికెట్పై ఉన్న క్యూర్ కోడ్పై స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం వెళ్లడానికి మార్గం చూపుతుంది. ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు సీసీ కెమెరాల నిఘా.. పోలీస్ బందోబస్తు సమస్య ఉంటే 9440234571 నంబర్లో సంప్రదించవచ్చు -
జనగణన సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జనగణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని, 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. జనాభా గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్స్థాయి అధికారులకు కలెక్టరేట్లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జనగణన సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. జనాభా గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన ఉంటుందని వివరించారు. మొదటి దశ మే 2026 మే నుంచి జూన్ 9 వరకు, రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. 1 మార్చి 2027ను రెఫరెన్స్ తేదీగా ప్రకటిస్తారని చెప్పారు. జనాభా గణన విభాగం సంయుక్త సంచాలకులు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ చంద్రకళ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఆఫీసర్ను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ -
వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం
వర్ధన్నపేట : ఎండాకాలంలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ స్కూల్లో హెచ్ఎం లింగం శైలజ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంపై ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసే విషయమై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే సెల్ నంబర్ 8712699310లో పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్రెడ్డి ల్యాబర్తిలో అవగాహన -
మనోళ్లు బుకింగ్లే!
జనవరితో పోలిస్తే ఏకంగా 270 శాతం పెరుగుదల ● అప్పుడు రోజుకు 16,000.. ఇప్పుడు 59,200 బుకింగ్ ● పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రజల్లో అపోహలు ● గ్యాస్ ఏజెన్సీలపై అదనపు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి ● ఇదే అదునుగా కొన్నిచోట్లా సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ● నిఘా ఉంచామంటున్న పౌరసరఫరాల అధికారులుజిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు : 16 (వరంగల్ నగరంలో 12, నర్సంపేటలో 2, వర్ధన్నపేటలో 1, సంగెంలో ఒకటి) గ్యాస్ సిలిండర్ కంపెనీలు : ఇండేన్, హెచ్పీ, భారత్ గురువారం బుకింగ్ కాల్స్ : 48,000 శుక్రవారం బుకింగ్ కాల్స్ : 59,200 గతనెలలో ఒకరోజు పంపిణీ చేసిన సిలిండర్లు : 15,200 ప్రస్తుతం ఒకరోజు పంపిణీ చేస్తున్న సిలిండర్లు :19,200 డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్లు : 3,15,056 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు : 1,452 524 సిలిండర్లతో ఒక లారీ లోడ్ అంటే నెలకు వచ్చేవి : 800 అంటే జిల్లాకు రోజుకు వచ్చే లోడ్లతో కూడిన లారీలు : 26సాక్షి, వరంగల్: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వరంగల్ జిల్లాపై పడింది. అక్కడి నుంచే అవుతున్న ఎల్పీజీ సరఫరా దెబ్బతింటుందనే అపోహలు ప్రజల్లో నెలకొనడంతో ముందస్తుగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో అవసరం లేకపోయినా కొందరు వినియోగదారులు బుకింగ్ చేస్తుండడంతో అసలు అత్యవసరం ఉన్నవారికి సమయానికి సిలిండర్ రాక తిప్పలు తప్పడం లేదు. జనవరిలో 16 ఏజెన్సీల పరిధిలో రోజుకు 16,000 వరకు గ్యాస్ బుకింగ్ అయితే, ఇప్పుడు ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 59,200 బుకింగ్ అవుతున్నాయి. అంటే ఏకంగా 270 శాతం బుకింగ్ పెరుగుదల ఉన్నట్లు ఆయా ఏజెన్సీల సరాసరి గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో రోజుకు సగటున 16,000 వరకు బుకింగ్ ఉంటే.. ఫిబ్రవరిలో లారీ యజమానులు సమ్మె చేయడంతో గ్యాస్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మార్చి తొలివారం నుంచి లారీలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక గ్యాస్ సరఫరా అంతా సర్దుకుంటుందనుకున్న తరుణంలో ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో మళ్లీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అదనపు ఒత్తిడి పడే పరిస్థితి ఎదురవుతోంది. గతంలో ఒక ఏజెన్సీలో రోజుకు వెయ్యి బుకింగ్ జరిగితే 900 వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు చేరవేసేవారు. ఇప్పుడు ఒక్కరోజే 3,700 బుకింగ్ అవుతుంటే కొంత కష్టపడినా 1200 వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేర్చగలుగుతున్నా రు. దీన్నిబట్టి గ్యాస్ సిలిండర్లు ఉన్నా సిబ్బందితోనే వినియోగదారుడి ఇంటికి సిలిండర్ వచ్చేవరకు రో జుల సమయం పట్టే అవకాశముందని డీలర్లు అంటున్నారు. అయితే, ఇటీవల డొమెస్టిక్ సిలిండర్కు రూ.60, కమర్షియల్ సిలిండర్కు రూ.115 పెరిగినా అది భారమనుకొని ప్రజలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటే చాలనుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలే.. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొందరు దళారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశం ఉండడంతో పౌరసరఫరాల విభాగాధికారులు అటువైపుగా కన్నేశారు. అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ల రాక తక్కువవడంతో గృహ వినియోగదారుల సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించడం, ఏజెన్సీల నుంచి సిలిండర్లను మళ్లించడం వంటి వాటిపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకోసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలి. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తాం. ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. – కలెక్టర్ల వీసీలో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ముల్కనూర్లో పేలుడు పదార్థాల పట్టివేత
భీమదేవరపల్లి : ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ బాక్సులు తీసుకెళ్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భీమదేవరపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథకాలనీకి చెందిన గుంజి ఐలయ్య (40) అనే వ్యక్తి ఆటోలో పేలుడు పదార్థాలైన 8 బాక్సుల జిలెటిన్ స్టిక్స్, 1,950 డిటోనేటర్స్ బాక్సులు, పెద్ద కార్డెక్స్ వైర్ బండిల్స్ 8, చిన్న కార్డెక్స్ వైర్ బండిల్స్ 2 తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం, ముల్క నూర్ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఐలయ్యను అదుపులోకి తీసుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ ఆటోతో కలిపి సుమారు రూ.7,07,500గా అంచనా వేశారు. ఈ ఘటనలో మరో నిందితుడు వల్లెపు రాజయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు రాజు, భానుప్రకాష్, ఆర్ఎస్ఐ, టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం పాల్గొన్నారు. -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి -
రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ ఉమారెడ్డి దామెర: రైతులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆర్.ఉమారెడ్డి అన్నారు. వరంగల్ వ్యవసాయ కళాశాల ఆధర్యంలో మండలంలోని పులుకుర్తిలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అధునాతన పద్ధతులతో సులభతర వ్యవసాయం చేయాలన్నారు. సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించి చీడ పీడలను నివారించుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ వి.రవీంద్రనాయక్, టీఆర్వీకే కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అఽధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ గోపిక, ఏఓ అల్లె రాకేశ్, ఏఈఓ రామకృష్ణ, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం!
ప్రమాదంలోప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యుల చెలగాటంసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద ఊపందుకుంటుంటే, ఇంకోవైపు ఎంబీబీఎస్ చదివిన కొంతమంది తమకు లేని స్పెషలైజేషన్ అర్హతను చేర్చుకొని వైద్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ, వైద్యులమని చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాల మీదికి తెస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చిన్న క్లినిక్ల నుంచి ఆస్పత్రుల వరకు కొందరు తమకు లేని అర్హతను ఉన్నట్లుగా ప్రకటనలు, ప్రిస్కిప్షన్లు ఇస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజమైన వైద్యులు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చేసిన దాడుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 126 కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 వాట్సాప్ ద్వారా ఇస్తే చర్యలు తీసుకుంటోంది. స్పెషలిస్ట్.. సూపర్ స్పెషలిస్ట్ పదాలు వాడుతూ ప్రత్యేక వైద్య విద్య (ఎండీ, ఎంఎస్) లేకపోయినా కొందరు వైద్యులు తమ క్లినిక్ల వద్ద ‘స్పెషలిస్ట్’, ‘సూపర్ స్పెషలిస్ట్’ వంటి పదాలను ఉపయోగిస్తూ రోగులను ఆకర్షిస్తున్నారు. దీంతో రోగులు వారికి పూర్తి అర్హతలు ఉన్నాయనే భావనతో చికిత్స పొందుతున్నారు. అర్హతలు లేకుండా స్పెషలైజేషన్ పేరుతో వైద్యం చేయడం వైద్య నైతిక నియమాలకు విరుద్ధమని వైద్యారోగ్య విభాగాధికారులు చెబుతున్నారు. నకిలీ వైద్యులు, అర్హతలు లేని వ్యక్తులు చికిత్స చేయడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ విద్య మాత్రమే ఉన్నవారు కూడా క్లినిక్లు నడుపుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్న ఘటనలు బయటపడినట్లు ఆరోగ్య శాఖ పరిశీలనల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమ వైద్యంపై చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రుల అర్హతలను ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి నకిలీ వైద్యులు, తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు వైద్యారోగ్యవిభాగాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రజలు చికిత్స పొందే ముందు వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మచ్చుకు కొన్ని కేసులిలా.. వరంగల్లోని కాశిబుగ్గలో షేక్ నయీంపాషా ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అనధికారికంగా వైద్యుడిగా చెలామణి అవుతూ చికిత్స, మందులు ఇస్తున్నారని కేసు నమోదైంది. వైద్యపరంగా విద్యార్హత లేకుండా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుమాములలో బోయిని శంకర్ (కల్యాణి క్లినిక్), కర్రు రాజేందర్ (జయశ్రీ ఫర్ట్స్ ఎయిడ్ సెంటర్), పి.రమేశ్ (శ్రీవెంకటేశ్వర ఫస్ట్ఎయిడ్ సెంటర్)పై కూడా టీజీఎంసీ కేసులు నమోదు చేసింది. ఎంబీబీఎస్ విద్యార్హత లేకున్నా మడికొండలో టి.రాజయ్య, ఈ.జయరాం, భాగ్యలక్ష్మి వైద్యులుగా చెలామణి అవుతూ చికిత్స అందిస్తుండడంతో కేసు నమోదైంది. అర్హత, అనుభవం లేకున్నా యథేచ్ఛగా క్లినిక్ల నిర్వహణ ఎంబీబీఎస్ చదివినా స్పెషలిస్ట్ అని కొందరు ప్రలోభాలు నిజమైన వైద్యులెవరో తెలియక ప్రజల గందరగోళం ఫేక్ డాక్టర్ల సమాచారం తెలిస్తే 91543 82727 నంబర్కు వాట్సాప్ చేయండి ప్రజలకు తెలంగాణ వైద్య మండలి విజ్ఞప్తి -
పకడ్బందీగా పదో తరగతి వార్షిక పరీక్షలు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తన చాంబర్నుంచి డీఈఓ గిరిరాజ్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరీలతో కలిసి పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులకోసం 64 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, శాఖా అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షకేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యా న్లు, లైట్లు, వైద్యసేవలు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్ష హాల్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాలబాలికలకు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి!
కాజీపేట అర్బన్: డంపింగ్యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు. రోజుకు 500 టన్నుల చెత్త.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపించాలి. కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ. నాలుగు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయ డం లేదు. దీంతో గుట్టలుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్యార్డును తరలించాలని ప్రజలు కోరుతున్నారు. మరో ఢిల్లీగా మడికొండ–రాంపూర్వాయుకాలుష్యం, పొగమంచు కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీలో అక్కడి ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అక్కడి పరిస్థితినే రాంపూర్లోని డంపింగ్యార్డు తలపిస్తోంది. ఉదయం చెత్త డంపింగ్, రాత్రి డంపింగ్ చేసిన చెత్తను కాల్చి వేయడం, చెత్తలో వివిధ రసాయన ప్రక్రియలు చోటుచేసుకుని మిథైన్ వాయువు ఉత్పత్తి అవుతోంది. దుర్వాసనతో కూడిన పొగ వెలువడి మడికొండ–రాంపూర్ రాత్రివేళ పొగమంచు కురిసినట్లు తలపిస్తోంది. డంపింగ్యార్డు పొగతో ఊపిరాడడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డంపింగ్యార్డు ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.రాంపూర్ డంపింగ్యార్డు నుంచి పొగ, విషవాయువులు శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన పడుతున్న ప్రజలు రూ.కోట్లు ఖర్చుచేసినా ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్ -
కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. మార్కెట్లో జీరో జరిగితే అందుకు సూపర్వైజర్లు, ఇతర అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తప్పవని జేడీఎం లక్ష్మణుడు.. ఇటీవల హెచ్చరించడంతో ఈ దందా వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మిర్చి సీజన్లో మార్కెట్ ఉద్యోగులు బిజీగా ఉండడం గుర్తించిన కొంతమంది దడవాయిలు రైతులతో మాట్లాడుకుని సరుకు ధరలను సగానికి తగ్గించి మార్కెట్ ఫీజును దోపిడీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్లైన్లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈదందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ శారు. ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్లో చర్చించుకుంటున్నారు. హసన్పర్తి/హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్ఐ సదానందం పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: చండీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల 14నుంచి 16వరకు జరగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు గురువారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో జి.అనూషా, బి.ప్రతూషా, కె.శ్రావణి బి.అంజలి, జె.శ్రావణి ఉన్నట్లు పేర్కొన్నారు. వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ రవీందర్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
● అప్పుడే దత్తత సమస్యలు త్వరగా పరిష్కారం ● హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మిసాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి
● అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ కాళోజీ సెంటర్: ప్రాథమిక విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలను అభివృద్ది చేయాలని అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్ తేజ అన్నారు. హనుమకొండలోని డైట్ కళాశాలో గురువారం రెండో రోజు జరిగిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధిస్తే వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు. నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడానికి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థి సులభంగా చదివేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పద్ధతులను ఉపయోగించి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని అంచనా వేయనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్లేవే మెథడ్, చైల్డ్ సెంటర్ టీచింగ్ పద్ధతులను విస్తృతంగా ఉపయోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రిస్సోర్స్ పర్సన్స్ రాయపురెడ్డి గంగాధర్, పద్మజ, సౌజన్య, నరేందర్ పాల్గొన్నారు. -
కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్లు ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాన్పాకలో ఇఫ్తార్ విందు
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాకలోని గోల్డెన్ విల్లాలో గురువారం ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారద హాజరయ్యారు. నగరంలోని 15, 16, 17 డివిజన్లు, గీసుకొండ రూరల్ మండలంలోని ముస్లింలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి, మత సామరస్యానికి ప్రతీకగా పండుగను జరుపుకోవాలని సూచించారు. వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎండీ జానీ, ముస్లింలు పాల్గొన్నారు. ముగిసిన ఓరియంటేషన్ కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా ఈనెల 6న ప్రారంభమైన ఓరియంటేషన్ ప్రోగ్రాం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. మిషన్ తేజస్ యాప్ ద్వారా విద్యార్థులు ఓరియంటేషన్ ప్రోగ్రాంను వీక్షించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి గారె కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి యాకూబ్రెడ్డి పాల్గొన్నారు. 242 మంది విద్యార్థుల గైర్హాజరు కాళోజీ సెంటర్: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షకు 242 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 5,544 మంది జనరల్ విద్యార్థులకు 5,369 మంది, 767 మంది ఒకేషనల్ విద్యార్థులకు 700 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలకు 16న పోటీలు నర్సంపేట: క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 16న నర్సంపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు ఉంటాయని ఎంఈఓ కొర్ర సారయ్య తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆధార్, స్టడీ, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ప్రతిభ ఆధారంగా క్రీడా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పొందుతారని తెలిపారు. కిడ్నీ రోగులకు అవగాహన నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్, ఆర్ఎంఓ డాక్టర్ కల్యాణి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకుంటూ కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం కిడ్నీ రోగులకు అవగాహన కల్పించారు. ఆస్పత్రి హెడ్ సిస్టర్, నర్సింగ్ ఆఫీసర్, డయాలసిస్ సెంటర్ మేనేజర్ వినయ్, టెక్నీషియన్లు, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. హైర్ బస్సుల్లో బ్యాటరీలు చోరీనర్సంపేట రూరల్: రెండు హైర్ బస్సుల్లో బ్యాటరీలు చోరీ అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని హైర్ బస్సులను బుధవారం రాత్రి వరంగల్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బస్సులకు సంబంధించిన నాలుగు బ్యాటరీలు, టర్నల్స్ అపహరించాయారు. గురువారం ఉదయం డ్రైవర్లు బస్సులను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదు. అనుమానం వచ్చి చూడగా బస్సుల్లో బ్యాటరీలు, టర్నల్స్ కనిపించలేదు. దీంతో బస్సుల యజమానులు నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాటి విలువ సుమారు రూ. 60వేల వరకు ఉంటుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
73 గ్యాస్ సిలిండర్లు సీజ్
హసన్పర్తి: వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్ఐ సదానందం పాల్గొన్నారు.గ్యాస్ సిలిండర్లను సీజ్చేసిన అధికారులు -
పదవి బాధ్యత.. అలంకారం కాదు
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ● మరియపురం ఎస్ఎస్ గార్డెన్లో స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణగీసుకొండ: పదవి అనేది బాధ్యత.. అంతేకాని అలంకారం కాదు అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో జిల్లాలోని సర్పంచ్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒక ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు భర్త చాటు భార్యలుగా ఉండవద్దని, వారి అభిప్రాయాలు గౌరవిస్తూనే ముందుకు సాగాలని హితవు పలికారు. ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి నివాళులర్పించారు. అంతకు ముందు స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్లు పెండ్యాల లక్ష్మి, సారంగపాణి, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, శిక్షణ కార్యక్రమానికి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు హాజరు కాలేదు. మంత్రి వెళ్లిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. -
సీఎం హామీని అమలు చేయాలి
● ఆజంజాహి మిల్లు కార్మికుల రాస్తారోకో కాశిబుగ్గ: గత ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మిల్లు కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు వరంగల్ వెంకట్రామ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను ఆందోళన విరమింప చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మికుల అధ్యక్ష, కార్యదర్శులు ఇనుముల శ్రీనివాస్, ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల ఇంటిస్థలం కేటాయిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు హామీ నెరవేర్చలేదని, దశలవారీగా అనేక రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేసి, కార్మిక సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సామాజిక కార్యకర్త జనగాం కుమారస్వామి, హరినారాయణ, యశోద, సందీప్, శ్యాం, ప్రవీణ్, సూర్య, భాను, భిక్షపతి, సంజీవ, ప్రభావతి, సనా, ఉమా, ప్రమీల, కుమారస్వామి, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
రుణం చెల్లించలేదని రైతు భూమి వేలం
నల్లబెల్లి: తీసుకున్న రుణం చెల్లించలేదని నారక్కపేటలో రైతు భూమిని డీసీసీబీ అధికారులు గురువారం వేలం వేశారు. అధికారుల కథనం ప్రకారం.. నారక్కపేట గ్రామానికి చెందిన వరికెల రాంబాబు నర్సంపేట డీసీసీ బ్యాంకు బ్రాంచ్లో రూ.8 లక్షల రుణం తీసుకున్నాడు. నాలుగేళ్లుగా కిస్తీలు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో భూమిని వేలం వేశారు. అదేగ్రామానికి చెందిన గుండెకారి శంకర్ ఎకరం భూమిని రూ.12.80 లక్షలకు సొంతం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ విజయ కుమారి, బ్యాంకు మేనేజర్లు జయప్రకాశ్, యాకూబ్పాషా, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం!
ప్రమాదంలోప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యుల చెలగాటంసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద ఊపందుకుంటుంటే, ఇంకోవైపు ఎంబీబీఎస్ చదివిన కొంతమంది తమకు లేని స్పెషలైజేషన్ అర్హతను చేర్చుకొని వైద్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ, వైద్యులమని చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాల మీదికి తెస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చిన్న క్లినిక్ల నుంచి ఆస్పత్రుల వరకు కొందరు తమకు లేని అర్హతను ఉన్నట్లుగా ప్రకటనలు, ప్రిస్కిప్షన్లు ఇస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజమైన వైద్యులు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చేసిన దాడుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 126 కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 వాట్సాప్ ద్వారా ఇస్తే చర్యలు తీసుకుంటోంది. స్పెషలిస్ట్.. సూపర్ స్పెషలిస్ట్ పదాలు వాడుతూ.. ప్రత్యేక వైద్య విద్య (ఎండీ, ఎంఎస్) లేకపోయినా కొందరు వైద్యులు తమ క్లినిక్ల వద్ద ‘స్పెషలిస్ట్’, ‘సూపర్ స్పెషలిస్ట్’ వంటి పదాలను ఉపయోగిస్తూ రోగులను ఆకర్షిస్తున్నారు. దీంతో రోగులు వారికి పూర్తి అర్హతలు ఉన్నాయనే భావనతో చికిత్స పొందుతున్నారు. అర్హతలు లేకుండా స్పెషలైజేషన్ పేరుతో వైద్యం చేయడం వైద్య నైతిక నియమాలకు విరుద్ధమని వైద్యారోగ్య విభాగాధికారులు చెబుతున్నారు. నకిలీ వైద్యులు, అర్హతలు లేని వ్యక్తులు చికిత్స చేయడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ విద్య మాత్రమే ఉన్నవారు కూడా క్లినిక్లు నడుపుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్న ఘటనలు బయటపడినట్లు ఆరోగ్య శాఖ పరిశీలనల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమ వైద్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రుల అర్హతలను ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి నకిలీ వైద్యులు, తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు వైద్యారోగ్యవిభాగాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రజలు చికిత్స పొందే ముందు వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అర్హత, అనుభవం లేకున్నా యథేచ్ఛగా క్లినిక్ల నిర్వహణ ఎంబీబీఎస్ చదివినా స్పెషలిస్ట్ అని కొంతమంది ప్రలోభాలు నిజమైన వైద్యులెవరో తెలియక ప్రజల గందరగోళం ఫేక్ డాక్టర్ల సమాచారం 9154382727కు వాట్సాప్ చేయండి ప్రజలకు తెలంగాణ వైద్య మండలి విజ్ఞప్తిమచ్చుకు కొన్ని కేసులు.. వరంగల్లోని కాశీబుగ్గలో షేక్ నయీంపాషా ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అనధికారికంగా వైద్యుడిగా చెలామణి అవుతూ చికిత్స, మందులు ఇస్తున్నారని కేసు నమోదైంది. వైద్యపరంగా విద్యార్హత లేకుండా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుమాములలో బోయిని శంకర్ (కల్యాణి క్లినిక్), కర్రు రాజేందర్ (జయశ్రీ ఫర్ట్స్ ఎయిడ్ సెంటర్), పి.రమేశ్ (శ్రీవెంకటేశ్వర ఫస్ట్ఎయిడ్ సెంటర్)పై కూడా టీజీఎంసీ కేసులు నమోదు చేసింది. ఎంబీబీఎస్ విద్యార్హత లేకున్నా మడికొండలో టి.రాజయ్య, ఈ.జయరాం, భాగ్యలక్ష్మి వైద్యులుగా చెలామణి అవుతూ చికిత్స అందిస్తుండడంతో కేసు నమోదైంది. -
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి!
రాంపూర్ డంపింగ్యార్డు నుంచి పొగ, విషవాయువులు● శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన పడుతున్న ప్రజలు ● రూ.కోట్లు ఖర్చుచేసినా ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్ కాజీపేట అర్బన్: డంపింగ్యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు. రోజుకు 500 టన్నుల చెత్త.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపిచాలి. కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించా రు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయంలో రూ. నాలు గు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయడం లేదు. దీంతో గుట్టలు గా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్యార్డు ను తరలించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం
రామన్నపేట: హంటర్రోడ్డులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్హాల్లో ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ (ఎన్ఐఆర్సీ) చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్ బ్రాంచ్కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్ మాట్లాడుతూ సీఏ మెంబర్స్, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్స్టిట్యూట్ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. సీఏ మెంబర్స్ కోసం సెమినార్స్, విద్యార్థులకు తరగతులు, రీడింగ్ రూం సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఏ సుధాటి వినీల్రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్, స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.భరత్రాజ్, ఎంసీ మెంబర్ సత్యనారాయణ, రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సీఏ మండవ సునీల్, రీజినల్ కౌన్సిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ దీపక్ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో ఇందిరామహిళా శక్తి లక్ష్యాలు పూర్తిచేయాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత విభాగాల ప్రాజెక్టు నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రతి విభాగానికి కేటాయించిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కోరారు. వ్యవసాయేతర విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పెట్రోల్బంకు, సౌరవిద్యుత్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించే మహిళా మార్కెట్ పనులను ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు నిర్వాహకులు దయాకర్, రాజేంద్ర ప్రసాద్, అనిత, సరిత, పద్మప్రియ, సీ్త్రనిధి ప్రాంతీయ నిర్వాహకుడు రమేశ్ పాల్గొన్నారు. సమర్థవంతమైన శిక్షణకు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు నిర్వహించే శిక్షణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను అదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట: హంటర్రోడ్డులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్హాల్లో ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ (ఎన్ఐఆర్సీ) చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్ బ్రాంచ్కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్ మాట్లాడుతూ సీఏ మెంబర్స్, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్స్టిట్యూట్ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్, సీఏ సుధాటి వినీల్రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్, స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.భరత్రాజ్, ఎంసీ మెంబర్ సత్యనారాయణ, రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సీఏ మండవ సునీల్, రీజినల్ కౌన్సిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ దీపక్ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
మొత్తం జనాభా: 35,12,576పురుషులు : 17,59,281మహిళలు : 17,53,295కుటుంబాలు : 8,86,279సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు. 2011లో ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా వివరాలు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల పట్టణ జనాభా: 28.3%గ్రామీణ జనాభా: 71.7%అక్షరాస్యత: 65.11% లింగ నిష్పత్తి: 1000 మంది పురుషులకు 997 మంది మహిళలు -
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్ వద్దు
కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్ విధానం అమలు చేయవద్దని వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు హుస్నాబాద్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్స్ బెడ్షీట్స్, బెడ్డింగ్ మెటీరియల్ను టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మి కులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దూబల రాజేందర్, ఆడెపు రవి, ఝెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్, కూచన ఓదెలు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని లంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ చేనేత సమస్యలను తప్పకుండా చట్టసభల్లో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు
వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్ అధ్యక్షతన కోర్టు హాల్లో బుధవారం జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను వారికి కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం పలు తీర్మానాలను సార్వత్రిక సభ ఆమోదించింది. మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను కేటాయించినట్లు వలుస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఈనెల చివరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.రమాకాంత్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ఎం.శ్రీధర్ గౌడ్, శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు సురేష్, నిర్మలజ్యోతి, రాజు, మహేందర్, తోట అరుణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు.అక్షరాస్యత 65.11% గ్రామీణ జనాభా 71.7% పట్టణ జనాభా 28.3%కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల -
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్ వద్దు
కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్ విధానం అమలు చేయవద్దని వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను హుస్నాబాద్లో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్లు, బెడ్షీట్స్, బెడ్డింగ్ మెటీరియల్ను టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దూబల రాజేందర్, ఆడెపు రవి, యెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్, కూచన ఓదెలు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వివరాలు (రూ.కోట్లలో)
మొత్తం ఆస్తి పన్ను : రూ.178.19 ఇప్పటి వరకు వసూలైంది : రూ.66.24 బకాయిలు మొత్తం : రూ.111.95 మొత్తం అసెస్మెంట్లు : 2,28,758ఆస్తి పన్ను : 81.58 వడ్డీ: 49.55 పాత బకాయిలు: 47.06 వసూలైంది: 53.88వసూలైంది: 8.35వసూలైంది: 4.01బ్యాలెన్స్: 27.70 బ్యాలెన్స్: 38.71 బ్యాలెన్స్: 45.54 -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలు చాలా ముఖ్యం
● డీఈఓ రంగయ్య నాయుడు కాళోజీ సెంటర్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలు చాలా ముఖ్యమని, 3వ తరగతి నాటికి ప్రతీ విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో పటిమ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. డైట్ కళాశాలలో ఎఫ్ఎల్ఎన్ – ఏఎక్స్ఎల్ఏఐ టీచర్స్ ట్రైనింగ్ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జిల్లాలోని 11 పాఠశాలలకు చెందిన 50 శాతం మంది ఉపాధ్యాయులు, డీఆర్పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారని, మిగతా 50 శాతం మంది ఉపాధ్యాయులకు 12న ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విద్యారంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఎక్స్ఎల్ఏఐ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విద్యార్థుల అభ్యాసన స్థాయిని అంచనా వేసి బోధనను మెరుగుపర్చాలని అన్నారు. ఏఎంఓ సుజన్తేజ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగు పర్చాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల అధ్యాపకులు సోమయ్య, డీఆర్పీలు గంగాధర్, సౌజన్య, నరేందర్, పద్మజ పాల్గొన్నారు. -
మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు ఉన్నారు. హసన్పర్తి: క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరుకుంటారని అంతర్జాతీయ అథ్లెట్ నందిని అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన 24వ వార్షిక క్రీడోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని శ్రమిస్తే విజయం సాధ్యమని పేర్కొన్నారు. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ దీపక్గార్గ్, ప్రొ వైస్చాన్స్లర్ డాక్టర్ మహేశ్, రిజిస్ట్రార్ పీవీ.రమణారావు, ప్రొఫెసర్ సుధాకర్ పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధించవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో బుధవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు అందిపుచ్చుకుని సాధికారత సాధించాలన్నారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, వరంగల్, మహబూబాబాద్ బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ పాల్గొన్నారు. హన్మకొండ: వ్యాక్సినేషన్తో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారించవచ్చని హనుమకొండ జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని పశువైద్యశాలలో బుధవారం పశువులకు గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు నెలలకోసారి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 9 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యప్రసాద్రెడ్డి, వడ్డేపల్లి పశువైద్యాధికారి సీహెచ్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
● లీవ్ పెట్టకుండా గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ ● సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించిన సత్యశారదసంగెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అపరిశుభ్రతపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రభుత్వ పాఠశాలను బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని గోడలు బూజుపట్టి, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగులకు వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రిలో లీవ్ పెట్టకుండా జూనియర్ అసిస్టెంట్ శాలిని ఎలా గైర్హాజరయ్యారని వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణను ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించారు. పాత కార్యాలయాలకు రంగులు వేయించి కొత్తవాటిలా కనిపించేలా చూడాలన్నారు. రెండు రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటివరకు అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, స్థానిక సర్పంచ్ పేర్ల లలిత తదితరులు పాల్గొన్నారు. నేడు సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ ● గీసుకొండ మండలంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గీసుకొండ: జిల్లాలోని 11 మండలాల్లోని సర్పంచ్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. గీసుకొండ మండలం మరియపురం సమీపంలోని ఎస్ఎస్ గార్డెన్స్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. స్థానిక ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, శిక్షణకు అవసరమైన పుస్తకాలు, ప్రదర్శన సామగ్రిని సిద్ధం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 99 రోజుల పాటు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులు, మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, తహసీల్దార్లు ఎండి.రియాజుద్దీన్, రాజ్కుమార్, ఎంపీడీఓ కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు. -
మంచి మార్కులు తెచ్చుకోవాలి
సంగెం: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కలెక్టర్ సత్యశారద పదో తరగతి విద్యార్థులకు సూచించారు. సంగెం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ను బుధవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలి. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వారు.. వారి తల్లిదండ్రులతో సహా తన కార్యాలయాలనికి వచ్చి బిర్యాని విందు స్వీకరించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సాంబశిరావును ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, హెచ్ఎం రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు ఉన్నారు. కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.44 లక్షలు గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా పలు రకాల సేవల ద్వారా రూ.21,44,433 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టగా గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు శీఘ్ర, ప్రత్యేక దర్శనాలు, కేశ ఖండనం, అష్టోత్తర సేవలు, స్వామివారి కల్యాణ కానుకలు, హుండీ ద్వారా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున, నాయకులు ప్రవీణ్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉగాది వరకు జాతర సాగుతుందని వారు తెలిపారు. హన్మకొండ: ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధించవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో బుధవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు అందిపుచ్చుకుని సాధికారత సాధించాలన్నారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, వరంగల్, మహబూబాబాద్ బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, తదితరులు పాల్గొన్నారు. -
శిశువులకు శాపం
సమన్వయ లోపం.. ఉమ్మడి వరంగల్ శిశుగృహలో దత్తత పిల్లలకు బాలారిష్టాలు● 13 మందిలో ముగ్గురికి మార్గం సుగమం.. మిగిలిన వారికి అడ్డంకులు ● శిశువుల అక్రమ దత్తత కేసుల్లో ఐదుగురికి తప్పని నిరీక్షణ ● డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల్లో నలుగురికి ఆలస్యం ● అధికారులు, కోర్టుల కేసులతో దత్తతకు ఎదురుచూపులు ● పోక్సో కేసుల మాదిరిగానే ఈ కేసుల్లో వేగం పెంచాలిసాక్షి, వరంగల్: జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా సంక్షేమ అధికారులు, వైద్యారోగ్య విభాగాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడడం.. దత్తతకు పోయే శిశువులకు శాపంగా మారుతోంది. అక్రమంగా దత్తత కేసులు, డీఎన్ఏ పెండింగ్ కేసులు, అపహరణ కేసులతో హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యప్తంగా హనుమకొండలో ఉన్న ఒకేఒక శిశుగృహలోని 13 మంది పిల్లల్లో 10 మంది దత్తతకు అనర్హులుగా ఉండడంతో ఆ పిల్లలు.. కుటుంబ ఆలనపాలన దూరమవుతున్నారు. వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పోక్సో కేసుల మాదిరిగానే ప్రత్యేక దృష్టితో దత్తతకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తే శిశువులు త్వరగా కుటుంబ వాతావరణంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఆయా విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే శిశువులకు న్యాయం జరుగుతుందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ కేసులో పిల్లల అక్రమ దత్తతలో వ్యవహారం చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమ రవాణా)కు దారితీసి, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధమున్నా ఆ దత్తతను అనుమతించలేమని, దత్తత విషయంలో కేంద్రం రూపొందించిన సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు ఇటీవల తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో శిశుగృహలో ఉంటున్న నెలల పాపల నిరీక్షణ అంశం తెరమీదకు వచ్చింది. సమన్వయంతోనే ముందుకు సాగాలి అక్రమంగా దత్తత తీసుకున్న శిశువులను తిరిగి పొందేందుకు కొందరు వ్యక్తులు కోర్టుల్లో కావాలనే కేసులు వేస్తుండడం వల్ల దత్తత వ్యవహారాలు ఆలస్యమవుతున్నాయి. చట్టబద్ధంగా కాకుండా పిల్లలను తీసుకున్న సందర్భాల్లో అధికారులు శిశువులను ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో శిశువులను తిరిగి పొందేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తూ ప్రక్రియను దీర్ఘకాలం పాటు సాగదీస్తున్నారు. పత్రాల ధ్రువీకరణ, అసలు తల్లిదండ్రుల గుర్తింపు, డీఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు కూడా కోర్టు విచారణల్లో కీలకమవుతున్నాయి. ఈ కారణాలతో కేసులు ఎక్కువకాలం పెండింగ్లో ఉండి చట్టబద్ధ దత్తత ప్రక్రియకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ కేసులను అన్ని విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే త్వరగా కోర్టు ఆదేశాలు వచ్చి దత్తతకు మార్గం సుగమం అవుతుంది. ప్రాధాన్యతా క్రమంలో వేగం పెంచాలి దత్తత లేదా శిశువుల మార్పిడి, అపహరణ వంటి కేసుల్లో శిశువు నిజమైన తల్లిదండ్రులను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు కీలకం. కేసు నమోదు అనంతరం పోలీసులు శిశువు, అనుమానిత తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపాలి. సాధారణంగా ఈ పరీక్షల ఫలితాలు 15 నుంచి 30 రోజుల్లో వెలువడాలి. అత్యవసర పరిస్థితుల్లో కోర్టుల ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలు నిర్వహించి ఒకటి నుంచి రెండు వారాల్లోనే నివేదిక ఇవ్వాలి. అయినా ఈ కేసులను ఆయా అధికారులు ఇతర కేసుల ఒత్తిడితో ఫాలోఅప్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో జాప్యం అవుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనల ప్రకారం పిల్లల గుర్తింపు, తల్లిదండ్రుల నిర్ధారణ త్వరగా చేయాలి. జువెనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం శిశువుల సంరక్షణ, దత్తత వ్యవహారాలు త్వరగా పరిష్కరించాలని సామాజికవేత్తలు అంటున్నారు. గుర్తుతెలియని శిశువుల దత్తతలోనూ అదే తీరు కిడ్నాప్ కేసుల్లో పోలీసులకు దొరికిన గుర్తు తెలియని శిశువులను దత్తత ఇవ్వడంలో అనేక చట్టపరమైన ప్రక్రియలు ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ముందుగా శిశువు అసలు తల్లిదండ్రులు ఎవరన్నది పోలీసులు గుర్తించాలి. శిశువు అపహరణకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు వివిధ ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల వివరాలను పరిశీలించాలి. అలాగే శిశువును తాత్కాలికంగా శిశుగృహలో ఉంచి కోర్టు ఆదేశాలు పాటించాలి. ఇలా శిశువు కేసుల్లో పోలీసులు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దత్తత ప్రక్రియలో సీడబ్ల్యూసీ అనుమతి, ప్రతి కేసు నివేదిక, ప్రొసీడింగ్స్, ఆర్డర్స్, శిశువు ఆరోగ్య పరీక్షల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి కావడంతో ఆలస్యమవుతోంది. పెండింగ్లో ఉన్న కేసులు.. 2024 జూలై 25న జనగామ జిల్లాలో పోలీసులకు, జిల్లాల బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీకి దొరికిన 25 రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కింద కోర్టులో నడుస్తుండడంతో ఇంకా పాపను దత్తత ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ రాలేదు. 2024 ఆగస్టు 27న మహబూబాబాద్ జిల్లాలో 39 రోజుల బాబు, 2024 నవంబర్ 19న ములుగు జిల్లాలో దొరికిన ఐదు నెలల 15 రోజుల పాప, 2025 జూన్ 5న ములుగు జిల్లాలో దొరికిన 20 రోజుల పసికందు, 2025 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో దొరికిన రెండు నెలల నాలుగు రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కోర్టు కేసులు నడుస్తుండడంతో దత్తతకు అనర్హులుగా ఉన్నారు. 2025 నవంబర్ 26న లభ్యమైన 36 రోజుల పాప, 2025 డిసెంబర్ 24న లభ్యమైన ఒకరోజు మగబాబు, 2026 ఫిబ్రవరి 8న లభ్యమైన ఒకరోజు పాప డీఎన్ఏ పెండింగ్లో ఉంది. 2026 జనవరి 10న కిడ్నాప్ కేసులో దొరికిన 8నెలల పాప, 16 నెలల పాప తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనాల్సి ఉండడంతో వారు కూడా పెండింగ్లో ఉన్నారు. -
మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ అధ్యక్షతన కోర్టు హాల్లో బుధవారం జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను వారికి కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం పలు తీర్మానాలను సార్వత్రిక సభ ఆమోదించింది. మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను కేటాయించినట్లు వలస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఈనెల చివరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.రమాకాంత్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ఎం.శ్రీధర్ గౌడ్, శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు సురేష్, నిర్మలజ్యోతి, రాజు, మహేందర్, తోట అరుణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లించలేదని గ్యాస్ సిలిండర్ సీజ్
వరంగల్: ఇంటి పన్ను చెల్లించలేదంటూ మున్సిపల్ సిబ్బంది వంట గ్యాస్ సిలిండర్ను తీసుకెళ్లి సీజ్ చేశారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై ఇంటి యజమాని సుజాత కథనం ప్రకారం.. సుజాత అనే మహిళ రూ.6 వేల వరకు ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఇంటికి వచ్చి పన్ను చెల్లించాలని కోరారు. ఇదేఇంటిలో అద్దెకు ఉంటున్న వారు వంట చేస్తుండగా.. వారి గ్యాస్ సిలిండర్ బయటికి తీసుకొచ్చి సీజ్ చేశారు. సిబ్బంది రాగానే తమ దగ్గర డబ్బులు ఉంటాయా?, కొన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ సుజాత బతిమిలాడినా వినిపించుకోలేదు. చివరకు పక్క ఇంటి నుంచి డబ్బులు చేబదులు తీసుకుని వచ్చి ఇంటి పన్ను చెల్లించిన తర్వాతే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అలాగే, పోచమ్మమైదాన్ ఏరియాలో కూడా పన్ను చెల్లించలేదని ఓ ఇంటి నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బడా వ్యక్తులు పన్నులు చెల్లించకున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోరని విమర్శలు వస్తున్నాయి. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
● డీఎంహెచ్ఎం సాంబశివరావు రాయపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, అందుబాటులో ఉండి సేవలందించకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సాంబశివరావు హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. వేసవిలో వచ్చే ఇబ్బందులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్చంద్ర, సీహెచ్ఓ జ్ఞానసుందరి, కమలాగ్రిసి, రవీందర్, సూపర్వైజర్లు శ్యాంసుందర్, మథ్యాస్రెడ్డి, శోభ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తాగు నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
హసన్పర్తి: వేసవి ప్రారంభంలోనే హసన్పర్తిలోని 66వ డివిజన్లో నీటి ఎద్దడి సమస్య మొదలైంది. తమ ప్రాంతానికి తాగునీరు సరఫరా కావడం లేదని హసన్పర్తి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా జీడబ్ల్యూఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్తో మాట్లాడి తాగునీటి ఎద్దడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులపై సీరియస్ అయ్యారు. తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు డీఈ రవికిరణ్ 66వ డివిజన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఎంజీఎం: హెచ్పీవీ వ్యాక్సినేషన్తో బాలికల్లో గర్భస్థ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా నివారించగలమని హెచ్పీవీ వాక్సిన్ జిల్లా పర్యవేక్షణాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంజీఎంలో ఆర్ఎంఓ మధుకర్తో కలిసి అయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమగ్ర ఆలోచనలతో స్థిరాభివృద్ధికేయూ క్యాంపస్: దూర దృష్టి, బాధ్యతాయుత సమగ్ర ఆలోచలనతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ నిట్ ప్రొఫెసర్ శైలజకుమారి అన్నారు. కేయూలోని మహిళా ఆధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘లిటరేచర్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ షేపింగ్ వికసిత్ భారత్ 2047’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. సదస్సుకు ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. నిజమైన నాయకత్వం ధైర్యమైన నిర్ణయాలతో కూడి ఉండాలన్నారు. అనిశ్చితి పరిస్థితులకు ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రరాజు, కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, సోషియాలజీ విభాగాధిపతి, ఎం.స్వర్ణలత, కేయూ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దీపాజ్యోతి, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ సీజే శ్రీలత పాల్గొన్నారు. -
నో
వరంగల్బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం పదో తరగతి పరీక్షల సమయం ముంచుకొస్తోంది. పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల ఆహార నియమాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్, సాక్షి, వరంగల్: వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల లైసెన్స్ ‘రెన్యువల్’ అంశం రచ్చరచ్చ చేస్తోంది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్లు ఉన్నాయి. వీటిలో పలు ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు డీఎంహెచ్ఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. గతంలో డీఎంహెచ్ఓ స్థాయిలోనే ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ అంశం ఉండేది. రెండేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ ప్రకారం కలెక్టర్లు పరిశీలించి అనుమతులిస్తున్నారు. రెండేళ్లలో ఒకేసారి ఈ ఆస్పత్రుల రెన్యువల్పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష చేయగా సరాసరిన ఐదు ఆస్పత్రులకు మాత్రమే రెన్యువల్ క్లియర్ అయ్యింది. ఇంకా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్లు లైసెన్స్ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీనివల్ల ప్రజలతోపాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆ ఆస్పత్రి నిర్వాహకులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో 20 పడకలలోపువే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఎవరెవరికీ నష్టం కలుగుతుందంటే... ● ఆయా వైద్యులపై ఉన్న నమ్మకంతో ఆ ఆస్పత్రులకు వచ్చి వైద్య పరీక్షలు, సర్జరీలు, ఆపరేషన్లు చేయించుకుంటున్న రోగులు ఆర్థిక సాయం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు.ఆ సమయంలో ఈ ఆస్పత్రులకు రెన్యువ ల్ లేకపోవడంతో తిరస్కరణకు గురవుతున్నాయి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ ఆస్పత్రుల్లో బిల్లులతో దరఖాస్తు చేస్తే అక్కడ కూడా రిజెక్ట్ అవుతోంది. దీంతో రూ.వేలు, రూ.లక్షల్లో రోగులు నష్టపోతున్నారు. ● ఇలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఆయా ఆస్పత్రుల నిర్వహణ భారం అధికమై యాజామాన్యాలు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల వైద్యులు, నర్సరీలు, ఫార్మసిస్టులకు కూడా సకాలంలో జీతాలు రావడం లేదు. కలెక్టర్ చొరవచూపితేనే.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా నమోదు చేసుకుని నిర్దిష్ట కాల వ్యవధిలో తమ లైసెన్స్లు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ కోసం ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, భవన అనుమతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ అనుమతి వంటి పలు పత్రాలు సమర్పించాల్సి రావడంతో ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇవి సమర్పించాక కూడా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆలస్యం కావడమే అసలుకే మోసం వస్తోంది. అన్ని విభాగాల నుంచి కావాల్సిన అనుమతి పత్రాలు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, డీఎంహెచ్ఓ ఆఫీస్లో రెన్యువల్ అప్లికేషన్ పూర్తిగా నింపి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసినా అడుగు ముందుకు పడడం లేదు. ఈ దరఖాస్తుతో బిల్డింగ్ పర్మిషన్ లెటర్, అద్దెకు అయితే ఓనర్ నుంచి లీజు సర్టిఫికెట్, ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్, విజిటింగ్ డాక్టర్స్ అగ్రిమెంట్ కాపీ, ఫైర్ సేఫ్టీ, క్వాలిఫైడ్ స్టాఫ్ (నర్సులు, మత్తుడాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్), ఫార్మసి సర్టిఫికెట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి బయో మెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ సమర్పించారు. అయినా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు ఏడాదిన్నరకుపైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కావాలనే డీఎంహెచ్ఓ ఆఫీస్లో ఆలస్యం చేస్తున్నారా లేదా కలెక్టర్కు సమయం లేక నిర్లక్ష్యం అవుతోందా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎంహెచ్ఓ, పోలీసు అధికారులు, ఐఎంఏ అధ్యక్షుడు లేదా సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ఆయా ఆస్పత్రుల డాక్యుమెంట్లు వెరిఫై చేసి రెన్యువల్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల రెన్యువల్ అంశంపై డీఎంహెచ్ఓ సాంబశివరావును ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.డీఎంహెచ్ఓ కార్యాలయం ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో హాస్పిటల్స్కు ‘రెన్యువల్’ కష్టాలు డీఎంహెచ్ఓ కార్యాలయంలో 40కిపైగా పెండింగ్ దరఖాస్తులు ఫలితంగా రోగులు, ఆస్పత్రులు, వైద్యులకు తప్పని తిప్పలు చికిత్స తీసుకున్నవారికి వర్తించని బీమా, సీఎం సహాయనిధి పథకం కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారిస్తేనే ప్రయోజనం -
మత్తు పదార్థాలను అరికట్టాలి
● జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణిసంగెం: మత్తు పదార్థాలను అరికట్టడానికి సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండలంలోని గవిచర్ల జెడ్పీహెచ్ఎస్, పీఎస్మోడల్ స్కూల్ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మామునూరు ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాంవిజయ్కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసైతే వారి భవిష్యత్, కుటుంబాలు నాశ నం అవుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఎస్సై వంశీకృష్ణ, ఎంఈఓ నర్సింహాచార్యులు, సర్పంచ్ బాషిపాక సదయ్య, ఉపసర్పంచ్ సంపత్ పాల్గొన్నారు. దురలవాట్లకు బానిసకావొద్దు..దుగ్గొండి: యువత దురలవాట్లకు బానిసగా మారితే భవిష్యత్ లేకుండా పోతుందని హైదరాబాద్ నార్కోటిక్ డీఎస్పీ మధుమోహన్రెడ్డి అన్నారు. నాచినపల్లి, దుగ్గొండి ఉన్నత పాఠశాలలు, గిర్నిబావిలోని పూలే గురుకుల విద్యాలయాలలో విద్యార్థులకు డ్రగ్స్పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. యువత డ్రగ్స్కు అలవాటుపడితే కలిగే అనర్థాలను మొదట ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. అనంతరం మధుమోహన్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దన్నారు. నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, ఎస్సై రావుల రణధీర్రెడ్డి, సర్పంచ్లు పెండ్యాల రాజు, కామిశెట్టి ప్రశాంత్, పెండ్లి వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు జ్యోతిలక్ష్మి, రామస్వామి, ఓదెల మల్లయ్య, సీసీ శోభారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థు తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ‘సూపర్’ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వేగవంతం ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
హాల్మార్క్ లేని నగలు కొనొద్దు
● బీఐఎస్ స్టేట్ డైరెక్టర్ అభిసాయి నర్సంపేట: బీఐఎస్ కేర్ యాప్ బంగారు నగలపై ప్రభుత్వం హాల్మార్క్ ముద్రణ తప్పనిసరి చేసిందని బీఐఎస్ స్టేట్ డైరెక్టర్ అభిసాయి అన్నారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో బంగారు నగల నాణ్యతా ప్రమాణాలపై మంగళవారం జిల్లా అధ్యక్షుడు గిరగాని సుదర్శన్గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిసాయి మాట్లాడుతూ నిబంధనలు పాటించని వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా, ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. హాల్మార్క్ లేకుండా బంగారు, వెండి నగలు అమ్మరాదని, కొనరాదని పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఏఐ ట్రేడ్ మార్క్ ఉన్న ఆహార వస్తువులు, పానీయాలను వాడాలని సూచించారు. స్టేట్ కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు శంకర్లాల్ మాట్లాడుతూ ట్రేడ్మార్క్ ఉన్న వస్తువులను కొని కల్తీ, నకిలీపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. మార్క్బ్రాండ్ ఉంటేనే పట్టువస్త్రాలను కొనాలని, వాటిని పరీక్షించదల్చుకుంటే దారాలను కొన్ని తీసి కాలిస్తే తల వెంట్రుకల వాసన వస్తుందని, మిగతావి బూడిద, ప్లాస్టిక్ వాసన వస్తాయని తెలిపారు. దేశంలో మల్బరీ పట్టు, తసర్ పట్టు, ఎరీ పట్టు, మగ పట్టు మాత్రమే ఒరిజినల్ అని, మిగిలినవి డూప్లికేట్గా గుర్తించాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ బంగారం, పట్టు వస్త్రాలపై గురించి కన్జ్యూమర్ ఫోరం అవగాహన కల్పించడం గొప్ప విషయం అన్నారు. మున్సిపపల్ కమిషనర్ కాట భాస్కర్, ములుగు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, ఉమ్మడి జిల్లా వినియోగదారుల మండల అధ్యక్షులు కె.దామోదర్, శ్రీనివాసరావు, వినియోగదారుల మండలి కార్యదర్శి ఈగ సత్యనారాయణ, కె.లక్ష్మయ్య, బెజ్జంకి ప్రభాకర్, బోయిని వెంకటస్వామి, అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, గుడి అరుణ, అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి, డ్వాక్రా మహిళల నాయకురాలు మాధవి, ప్రతిభ కుట్టు శిక్షణ గిరిగాని స్వాతి, షరీఫా, శిరీష పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి/భీమదేవరపల్లి: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తి మండల కేంద్రం, భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ రైతువేదికల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండలస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతీ గ్రామంలో పరిశరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్, వైద్య ఆరోగ్యశాఖ వైద్య పరీక్షలు, కాకతీయ వైద్యకళాశాల వైద్యశిబిరాలు, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్టు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి గృహప్రవేశాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్శాఖ అధికారులు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. యువజన, క్రీడల శాఖ అధికారులు క్రీడలు నిర్వహించాలని, పర్యావరణ, అటవీ శాఖ అధికారులు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు చేపట్టాలని, వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీలను సిద్ధం చేయాలని కోరారు. గ్రామాల్లో తాగునీటి వనరులు పరిశీలించి అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎల్కతుర్తి జెండర్ రిసోర్స్ భవనాన్ని ప్రారంభించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. సమీక్షల్లో అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎంపీడీఓలు విజయ్కుమార్, వీరేశం, భీమదేవరపల్లి తహసీల్దార్ రాజేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, సర్పంచ్లు మునిగడుప లావణ్య, అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కీటక జనిత వ్యాధులను నివారించాలి
● జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజిని గీసుకొండ: మలేరియా, డెంగీ తదితర కీటక జనిత వ్యాధులను నివారించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజిని అన్నారు. గీసుకొండ పీహెచ్సీలో ఆశ డే సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె వైద్యులు, సిబ్బందికి వ్యాధుల నియంత్రణపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో గతంలో డెంగీ కేసులు నమోదైన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకండా చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ డాక్టర్ శౌర్య శరణ్య, డాక్టర్ అరుణ్కుమార్, సీహెచ్ఓ ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ కిరణ్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందు కు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ‘సూపర్’ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వేగవంతం ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
హైదరాబాద్ తరలిన రైల్వే జేఏసీ బృందం
కాజీపేట రూరల్: ఈ నెల 15న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ వద్ద నిర్వహించనున్న నిరసనలో పాల్గొనాలని ఆహ్వానించేందుకు రైల్వే జేఏసీ హైదరాబాద్ తరలింది. కాజీపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాపై మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు మంగళవారం రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ తెలిపారు. మంగళవారం కరపత్రాలు తీసుకుని హైదరాబాద్లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంను, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావును, అరుణోదయ సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కను, ఎన్ఎఫ్ఐఆర్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ సెక్రటరి ఎం.రాఘవయ్యను, సంఘ్ ఏజీఎస్ భరణి భానుప్రసాద్, ఎజీఎస్ రుద్రారెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ ప్రభురాజ్, ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ, రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, ఏజీఎస్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్, ప్రెసిడెంట్ ఖాజాపాషా, ట్రెజరర్ నర్సింహారెడ్డిని కలిసి కరపత్రాలు అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బృందం పాక వేదప్రకాశ్, వస్కుల రవీందర్, బి.మాధవరావు, వాయిల్ల తిరుపతి, పి.రమేశ్, కె.సాయిరాజ్, అనుముల శ్రీనివాస్, డి.రవీందర్, ఎం.రాజయ్య, భూ నిర్వాసితులు ఇలాసాగరం ప్రదీప్, కాయిత కుమార్ పాల్గొన్నారు. ‘హెచ్పీవీ’తో క్యాన్సర్ నివారణ ఎంజీఎం: హెచ్పీవీ వ్యాక్సినేషన్తో బాలికల్లో గర్భస్థ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా నివారించగలమని హెచ్పీవీ వాక్సిన్ జిల్లా పర్యవేక్షణాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంజీఎంలో ఆర్ఎంఓ మధుకర్తో కలిసి అయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఒక్కపూట పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేయాలి వరంగల్ అర్బన్: వేసవిలో ఎండలు మండుతున్నాయని, పారిశుద్ధ్య కార్మికులకు ఒకపూట పనులు కల్పించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు బల్దియా ప్రధాన కార్యాలయంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేష్ను మంగళవారం కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ధర్మరాజు, జన్ను ప్రకాష్, ఆర్.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యం కేయూ క్యాంపస్: విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని బీసీ సెల్ ఆధ్వర్యంలో కేయూ దూరవిద్యా కేంద్రం ప్రాంగణంలో మంగళశారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, బీసీసెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీష్, కేయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేశ్లాల్, డాక్టర్ రమ, డాక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
జనగణన సమర్థంగా నిర్వహించాలి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ: హనుమకొండ జిల్లాలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి అధికారులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణను మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా గణన ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. జన గణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు, మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఈ దశ మే 11 ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి దాదాపు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ ఎన్యుమరేటర్లు.. మొదటి దశలో మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అధికారులకు శిక్షణలో వివరిస్తారన్నారు. హైదరాబాద్కు చెందిన జన గణన విభాగం సంయుక్త సంచాలకుడు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బి.సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఇళ్లపై సౌర వెలుగులు
హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. 20.16 కోట్ల రాయితీ విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్లు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో) పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వినియోగం ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది.జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులుభూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని విని యోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. వినియోగదా రుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్స్టలేషన్కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది. రాయితీ వినియోగించుకోవాలి.. ప్రభుత్వం రూఫ్టాప్ సోలార్ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్రెడ్డి, రెడ్కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ పలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో)పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు 300 యూనిట్ల వరకు వినియోగం ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్ జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులు భూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
‘పది’లో
100% లక్ష్యం‘పదో తరగతి పరీక్షలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. వందశాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం’ అని హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ అన్నారు. టెన్త్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. ఆయన మాటల్లోనే.. – విద్యారణ్యపురిహనుమకొండ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేయించాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్స్కూళ్లు అన్నింటిలో కలిపి జిల్లాలో 12,079 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలు, 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించాం. నాలుగు ఫ్లయింగ్స్క్వాడ్లు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. తొలిసారిగా క్లాక్ రూమ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. విద్యార్థులు ఏవైనా బ్యాగులు, వస్తువులు తీసుకొస్తే ఈ పరీక్ష కేంద్రం వద్ద ఉన్న క్లాక్ రూమ్ సిబ్బందికి ఇచ్చి లోనకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల హాల్టికెట్లపై క్యూర్ కోడ్ కూడా ముద్రించారు. దీనిద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల పేరిట హాల్టికెట్ ఇవ్వకపోతే నేరుగా బీఎస్ఈ, తెలంగాణ జీఓవీ.ఇన్లో డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరవ్వొచ్చు. సెల్ఫోన్లు ఎవరికీ అనుమతిలేదు.. పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వారికి సెల్ఫోన్లు అనుమతి లేదు. సీసీ కెమెరాల నిఘాలోనే చీఫ్ సూపరింటెండెంట్ గదిలోనే సీఎస్ ప్రశ్నపత్రాల బండిళ్లు విప్పాలి. పరీక్షలు ముగిశాక మళ్లీ సీసీ కెమెరా నిఘాలోనే జవాబుపత్రాల బండిల్స్ కట్టాలి. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వర్తించేందుకు 144 సెక్షన్ను విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లో (79817 67208)కు సంప్రదించవచ్చు. ప్రణాళికాబద్ధంగా టెన్త్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్న 12,079 మంది పరీక్ష కేంద్రాల్లో ఈసారి కొత్తగా క్లాక్ రూమ్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఈసారి ఒక్కో పరీక్షకు మూడు నుంచి 4 రోజుల వ్యవధి అన్ని కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ‘సాక్షి’తో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ పరీక్షల వేళలుమార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి సెలవులున్నాయి. దీంతో విద్యార్థులు బాగా ప్రిపేర్ అ య్యేలా అవకాశం కల్పించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:35 గంటల తర్వాత లోనికి అనుమతి ఉండదు. -
హెచ్పీవీ వ్యాక్సిన్తో బాలికలకు రక్ష
● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు కాశిబుగ్గ: గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ టీకా బాలికలకు రక్షలాంటిదని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశిరావు తెలిపారు. వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 – 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. కౌమార దశలో ఉన్న అర్హత గల ఆడపిల్లలు తప్పనిసరిగా యు విన్ ఫోర్టల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో తమ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట, సీకేఎం, ఎంజీఎం, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిదేవి మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హత కలిగిన బాలికలకు వ్యాక్సినేషన్ ఇప్పించడంలో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ స్వరూప, డాక్టర్ స్వర్ణసుధ, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, స్థానిక వైద్యాధికారి డాక్టర్ దిలీప్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డికి సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. సాధ్యమైనంతవరకు అక్కడికక్కడే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యలుంటే అందుకుగల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్కు 113 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 46, జీడబ్ల్యూఎంసీకి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 46 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పట్టాపాసు పుస్తకాలు లేక ఇబ్బందులు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్కు చెందిన రైతులం మేము. మా భూములకు రికార్డులు, పట్టాలు లేవు. మేము.. మా తల్లిదండ్రులు, తాతల కాలం నుంచి వ్యవసాయ భూములను సాగుచేసుకుంటున్నాం. చాలా మట్టుకు సాదా కాగితాలతో కొనుగోలు చేసిన భూములే. గ్రామంలోని 80శాతం రైతులకు పట్టాపాసు పుస్తకాలు లేవు. వారసులకు బదిలీ (విరాసత్) చేయాలంటే, పట్టాలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మాకు న్యాయం చేయండి. – గొర్రెకుంట గ్రామ రైతులు ఖైదీగా శిక్ష అనుభవిస్తూ నా భర్త చనిపోయాడు నా భర్త మనుపాటి జంపయ్య. ఓ కేసులో వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురై 1996లో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. నా భర్త లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నాకు ముగ్గురు కూతుర్తెలు కాగా, అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నన్ను పోషించేవారు లేరు. అప్పట్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం జరగలేదు. నాకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి, ఆర్థిక సాయం అందించాలి. – మనుపాటి సారమ్మ, కాశిబుగ్గబెల్డ్, గుడుంబా స్థావరాలు తొలగించండి పర్వతగిరి మండలంలోని గోరుగట్టు తండాలో బెల్ట్షాపులు, గుడుంబా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. మద్యం అలవాటుతో గ్రామంలోని యువకులు మత్తుకు బానిసై జీవితాలు నాళనం చేసుకుంటున్నారు. దాంతో తాము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు. మద్యం వ్యసనపరులు రోడ్లపైనే తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే ఆ షాపులను తొలగించి మహిళలకు రక్షణ కల్పించాలి. – గోరుగట్టు తండా (పర్వతగిరి) మహిళలు ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణికి 113 దరఖాస్తులుమామునూరును మండల కేంద్రం చేయాలి మామునూరును మండల కేంద్రంగా ప్రకటించాలని మామునూరు మండల సాధన కమిటీ సభ్యులు కలెక్టర్ను కోరారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బొల్లికుంట, నక్కలపల్లి, గాడెపల్లి, గుంటూరుపల్లి, తిమ్మాపూర్, అల్లీపురం, మూమునూర్, సింగారం, కమ్మరపల్లి, కేసీఆర్ నగర్, జాన్సీనగర్, లక్ష్మిపురం, పెన్షన్పూర్, బెస్తంచెరు, జక్కలొద్ది, సత్యసాయినగర్, లెనిన్నగర్, సాయినగర్, రాంగోపాల్పూర్ తదితర గ్రామాలను కలుపుతూ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1932లో 19వందల ఎకరాల వ్యవసాయ సాగుభూమిని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మామునూరు రైతులు అప్పగించినట్లు గుర్తుచేశారు. -
ఆరోగ్య సంరక్షణకే 5కే రన్
● మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు నిర్వహించిన 5కే రనన్ను వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ హెల్త్ రన్ నిర్వహించామని తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు 5 కే రన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇవి దోహదపడతాయన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలు సాధించగలమని తెలిపారు. అనంతరం అధికారులు, యువత, ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, జన్ను శిభారాణి, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్ఎంఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, హనుమకొండ డీవైఎస్ఓ అశోక్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి
ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సవాల్హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కీలక అభివృద్ధి పనులు చేపట్టామని, మరో మూడేళ్లలో చేయనున్న పనులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓలను కరపత్రాల మాదిరిగా జారీ చేశాసిందని, కమీషన్ల కక్కుర్తి కోసం పనుల ఆలస్యం చేసే పరిస్థితి తమ పాలనలో లేదని అన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి మాదిరిగా ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీ అమల్లో భాగంగానే ట్రైసిటీలో యూజీడీ (అండర్గ్రౌండ్ డ్రెయినేజీ)నిర్మాణానికి రూ.5,257 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులను మంజూరు చేశారన్నారు. ఇది ఏ ఒక్కరి కృషి కాదు ప్రజల ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితమన్నారు. అనంతరం డీసీసీ భవన్ ఎదుట బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.


