Warangal
-
ఇంటర్ లింక్తో నిరంతర విద్యుత్
హన్మకొండ: అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సబ్స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు హనుమకొండ సర్కిల్ (జిల్లా)లో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్, వరంగల్ సర్కిల్ (జిల్లా)లో ఐదు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక సబ్స్టేషన్, విద్యుత్ లైన్న్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారించడానికి ఆధునిక ఇంటర్లింక్ లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక విద్యుత్ లైన్లో లోపం ఏర్పడితే ఆ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే, ఇంటర్లింక్ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను మరో 33/11 కేవీ సబ్స్టేషన్తో, ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను సమీపంలోని 132/33 కేవీ సబ్స్టేషన్తో, అలాగే ఒక 33 కేవీ లైన్న్ను మరో 33 కేవీ లైన్తో అనుసంధానించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారు. దీని ఫలితంగా ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తారు. దీంతో విద్యుత్ అంతరాయం గణనీయంగా తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. అన్ని సబ్స్టేషన్లకు లైన్ల విస్తరణ.. అన్ని సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వ్యవస్థను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నాం. లైన్లో లోపం ఏర్పడినప్పుడు లేదా నిర్వహణ పనులు చేపట్టాల్సిన సందర్భంలో ప్రత్యామ్నా య మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తూనే మరమ్మతులు సులభంగా చేపట్టగలుగుతున్నాం. – బి.సామ్యానాయక్, ఎ.ఆనందం, హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు సబ్స్టేషన్ల మధ్య ప్రత్యామ్నాయ లైన్ నిర్మాణం సాంకేతిక కారణాలతో ఏర్పడే అంతరాయానికి చెక్ -
తుదిదశకు ‘ఇన్వెస్టిగేషన్’
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 70 శాతా నికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్న ల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
నకిలీ విత్తనాలతో మోసపోయాం..
ఆత్మకూరు: నకిలీ విత్తనాలతో మోసపోయామని నాగయ్యపల్లె రైతులు ఆత్మకూరు ఎస్సై తిరుపతికి మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. నాగయ్యపల్లి గ్రామ రైతులకు ఫైనీర్ 915 మేల్, ఫిమేల్ కంపెనీ ఆర్గనైజర్లు కొడారి సమ్మయ్య, ఇందూరి మచ్చేందర్, కొన్నే సూరయ్య సమావేశాలు పెట్టి మేల్, ఫిమేల్ వరి విత్తనాలు వేస్తే తామే క్వింటాలుకు రూ.3600తో కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించారు. తాము ఇచ్చే విత్తనాలతో ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ చూపడంతో 160 ఎకరాల్లో మేల్, ఫిమేల్ నకిలీ విత్తనాలను రైతులు సాగు చేశారు. ఎకరాకు 10 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి మాత్రమే వచ్చింది. ఫైనీర్ 915 కంపెనీ ఆర్గనైజర్లకు ఫోన్ చేసి రైతులు జరిగిన నష్టాన్ని వివరించారు. తాము వచ్చి పంటను పరిశీలించిన తర్వాత న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. గడువులోగా రాకపోవడంతో తిరిగి మళ్లీ ఫోన్ చేస్తే మేం చేయలేం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండని దబాయించారని రైతులు నేరెళ్ల రమణారెడ్డి, ఎన్.రవీందర్, రాజేందర్, మాదాసి కర్ణాకర్, కరుణాకర్రెడ్డి, విజేందర్, గుండాల క్రాంతి సురేశ్, సాంబరాజు, రమేశ్, మహేందర్, పురం కుమారస్వామి, ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్గనైజర్లు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పంటను రూ.3,600కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి రూ.2,800 చొప్పునే కొనుగోలు చేసి ఆర్థికంగా దెబ్బతీశారని ఎస్సై ఎదుట వాపోయారు. కంపెనీ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకొని పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరారు. ఫైనీర్ 915 కంపెనీ నుంచి పరిహారం ఇప్పించండి ఎస్సై తిరుపతికి నాగయ్యపల్లె రైతుల ఫిర్యాదు -
ఇంటర్ లింక్తో నిరంతర విద్యుత్
హన్మకొండ: అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింక్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సబ్స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు హనుమకొండ సర్కిల్ (జిల్లా)లో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్, వరంగల్ సర్కిల్ (జిల్లా)లో ఐదు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక సబ్స్టేషన్, విద్యుత్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారించడానికి ఆధునిక ఇంటర్లింక్ లైన్ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక విద్యుత్ లైన్లో లోపం ఏర్పడితే ఆ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే, ఇంటర్లింక్ లైన్ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను మరో 33/11 కేవీ సబ్స్టేషన్తో, ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ను సమీపంలోని 132/33 కేవీ సబ్స్టేషన్తో, అలాగే ఒక 33 కేవీ లైన్ను మరో 33 కేవీ లైన్తో అనుసంధానించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారు. దీని ఫలితంగా ఒక మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ను సరఫరా చేస్తారు. దీంతో విద్యుత్ అంతరాయం గణనీయంగా తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. సబ్స్టేషన్ల మధ్యప్రత్యామ్నాయ లైన్ నిర్మాణం సాంకేతిక కారణాలతో ఏర్పడే అంతరాయానికి చెక్ -
తుదిదశకు ఇన్వెస్టిగేషన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
లాక్ష్ ఫౌండేషన్తో ఆర్ట్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూతో వివిధ కంపెనీలతో నేరుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ తెలిపారు. లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యసన కార్యక్రమాలు కూడా ఉంటాయని వివరించారు. లాక్ష్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్లేస్మెంట్ మేనేజర్ వైద్యం రవికుమార్, సీనియర్ మేనేజర్ సునీల్ నుంచి కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఒప్పంద పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, సాయిచరణ్, గిరిప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో మంగళవారం విద్యార్థులు సందడి చేశారు. జోసా–26 (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, మిగతా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్లో తప్పులు చేయకుండా వివిధ కళాశాలలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిట్లో అత్యుత్తమ విద్యాబోధన, ల్యాబ్స్, సౌకర్యాలు, ప్లేస్మెంట్స్పై విద్యార్థుల సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్ వెంకయ్యచౌదరి, ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం ప్రమాద బీమా చెక్కు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ కానిస్టేబుల్ ఆర్.సతీశ్ గత సంవత్సరం మే 15న స్టేషన్ఘన్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సీపీ చేతుల మీదుగా రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి బెనిఫిట్స్ త్వరగా అందజేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, సూపరింటెండెంట్ సంధ్య, సహాయకురాలు తులసి పాల్గొన్నారు. పరకాల: లైసెన్స్ లేకుండా విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఏఓ విజయ్చంద్ర హెచ్చరించారు. డీలర్లు యూరియాను ప్రభుత్వ యాప్ ద్వారా మాత్రమే విక్రయించాలని, తమ వద్ద ఉన్న స్టాక్ను యాప్లో వెంటనే నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. పరకాల డివిజన్ పరిధిలోని విత్తనాలు, పురుగు మందుల డీలర్లకు వానాకాలం సమాయత్తం కార్యక్రమాన్ని పరకాల రైతు వేదికలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చోట లైసెన్స్ తీసుకొని మరోచోట షాపులు నిర్వహించినా, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విత్తనాల అమ్మకాల్లో లాట్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పరకాల ఏడీఎ ఆదిరెడ్డి, పరకాల డివిజన్లోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు. -
హనుమకొండ జిల్లాకు 12 బస్సులు
మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అందజేత హన్మకొండ అర్బన్: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా హనుమకొండ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం 12 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులకు బస్సులు అందజేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ముఖ్యమంత్రి బస్సులు ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని 12 మండలాల నుంచి దాదాపు 600 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఏపీఎంలు, మహిళా పోలీసులు, ఆశ కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. పట్టణ పరిధిలోని కాజీపేట, హనుమకొండ మండలాలు మినహా మిగిలిన మండలాల నుంచి ఒక్కో బస్సులో 50 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యులు వెళ్లారు. బస్సులను ఆయా మండలాల మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, వివిధ మండలాల ఏపీఎంలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
ఎంజీఎం‘బిగ్బాస్’ ఎవరో..?
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ‘బిగ్ బాస్’ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. బదిలీల ప్రక్రియ మూడు రోజులనుంచి కొనసాగుతున్నా సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కావడం లేదు. వాస్తవానికి ఇంత పెద్ద ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టు లేనే లేదు. అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్ పోస్టు ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ పోస్టు లేనందున మొదటినుంచి సీనియర్ ప్రొఫెసర్లను ఇన్చార్జ్ సూపరింటెండెంట్లుగా నియమిస్తూ వస్తున్నారు. ముందుకు రాని సీనియర్ ప్రొఫెసర్లు.. గతంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్ హోదాలో ఉన్న డాక్టర్ హరీష్చంద్రారెడ్డి మంగళవారం ఎంజీఎం బాధ్యతలనుంచి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం, కేఎంసీలో సీనియర్లుగా ఉన్న ప్రొఫెసర్లు ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. సీనియర్ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ రాంకుమార్రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని ఊహించారు. ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలిసింది. మూడు రోజులనుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రోగులకు వైద్యసేవలు ఏ విధంగా అందుతున్నాయో పర్యవేక్షణ చేసేవారు లేకుండాపోయారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీఓ జారీ చేసిన త ర్వాత కొత్త ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మినిస్టీరియల్, నర్సింగ్ విభాగంలో అంతంతమాత్రమే.. మినిస్టీరియల్ నర్సింగ్ విభాగంలో ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది అంతంతమాత్రంగానే జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో 13 మంది సీనియర్ అసిస్టెంట్లు అవసరం ఉండగా, ఆరుగురు ఉండేవారు. వీరిలో ముగ్గురు బదిలీపై వెళ్లగా ఇక ముగ్గురు ఉద్యోగులు మిగిలారు. ప్రస్తుతం 10 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ విభాగంలో దాదాపు 160 మంది ఉండాలి. ఇప్పటివరకు 35 మంది మాత్రమే జాయిన్ అయినట్లు సమాచారం. చాలామంది ఉద్యోగులు, నర్సింగ్ స్టాఫ్ విధుల్లో చేరేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా ఇన్చార్జ్ లేకుండానే పాలన బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాని ప్రొఫెసర్లు బదిలీల్లో మినిస్టీరియల్, నర్సింగ్ పోస్టులు భర్తీకాని పరిస్థితి.. -
బదిలీల కలకలం!
వైద్యారోగ్యశాఖలో కేటగిరీ వాళ్లకు దక్కని ప్రాధాన్యందూర ప్రాంతాలకు స్పెషల్ నీడ్ చిల్డ్రన్ తల్లిదండ్రుల బదిలీలు ● పట్టణంలో ఉన్నవారికి ఇక్కడే పోస్టింగ్ ● గ్రామీణ ప్రాంతాల వారికి తప్పని ఎదురుచూపులు ● న్యాయం చేయాలంటున్న బాధిత ఉద్యోగులుసాక్షి, వరంగల్: వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్ర క్రియ అపహాస్యం పాలవుతోంది. స్పౌజ్ కేసులు, దివ్యాంగులు, మానసిక వికలాంగుల పిల్లలు ఉన్న ఉద్యోగులు, వితంతువులు తదితర కేటగిరీల వారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జీఓ నంబర్ 38 చెబుతున్నా.. ఆచరణ ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపై పట్టణంలో నాలుగేళ్లకుపైగా ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలకు, అక్కడి వారు ఇక్కడికి బదిలీ చేయొచ్చన్న ఆప్షన్ను తుంగలో తొక్కుతూ ఈ బదిలీలు జరిగాయన్న టాక్ వినబడుతోంది. ఎంజీఎం, సీకేఎం ప్రసూతి హాస్పిటల్, హనుమకొండ మెటర్నిటీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్లో పని చేస్తున్న సిబ్బందిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎక్కువ బదిలీలు ఇక్కడిది ఇక్కడే జ రగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నవారు సిటీకి వచ్చే అవకాశం దక్కకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. స్పెషల్ నీడ్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు ఈ బదిలీల్లో ప్రాధాన్యం తీసుకొని వారు కోరుకున్న చోటికి, లేదంటే బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని జీఓ చెబుతున్నా.. అదేది తమకు కాదన్నట్టుగా వరంగల్ నగరంలో పనిచేసే ఓ 16 ఏళ్ల స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అమ్మా యి తల్లిని న గరం నుంచి 50 కిలోమీటర్ల దూ రంకు బదిలీ చే యడం అవకతవకలకు కేరా ఫ్గా నిలుస్తోంది. ఆమె బిడ్డకు అన్నీ తానై చూసుకోవాల్సిన పరి స్థితి ఉన్నా.. ఇ లా బదిలీ చేయ డం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్డర్లూ.. ఆలస్యమే.. మే ఒకటి నుంచి మే 31వ తేదీలోపు అన్ని ప్రభుత్వ విభాగాల బదిలీలు చేయాలంటూ జీఓ నంబర్ 38, ఆ తర్వాత జూన్ ఒకటి నుంచి ఆరు నెలల పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో బదిలీలపై నిషేధమంటూ జీఓ నంబర్ 57ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే జీఓ నంబర్ 28ని ప్రత్యేకంగా తెచ్చుకున్న వైద్యారోగ్యశాఖ బదిలీల ప్రస్తావన ఈ జీఓ నంబర్ 57లో ఎక్కడా లేకపోవడం బదిలీల పారదర్శకతపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. ఎందుకంటే జీఓ నంబర్ 57లో వైద్యారోగ్యశాఖ బదిలీలను మెన్షన్ చేస్తూ అందులో ఉండాలని, అలా లేని సందర్భంలో అన్ని విభాగాలకు వర్తించినట్టుగానే ఈ విభాగ బదిలీలపై నిషేధం ఉండాలన్న డిమాండ్ వినబడుతోంది. ఇదంతా ఇలా ఉన్నా మళ్లీ జీఓ నంబర్ 28ని తీసుకొచ్చి జూన్ 6వ తేదీలోపు అన్ని బదిలీలు చేస్తామని చెప్పినా ఇప్పటికీ చాలా మందికి ఆన్లైన్లో బదిలీల ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుందామంటే ఎర్రర్ అనే ఆప్షన్ వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సోమవారం బదిలీల ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకున్నా.. ఆరో తేదీ పేరున ఉండడంతో ఏడు, ఎనిమిది తేదీల్లో ఎక్కడ పనిచేశామనేది.. వారికే తెలియకపోవడం గమనార్హం. అలాగే సంఘాల్లో ఆఫీసు బేరర్లుగా కొనసాగుతూ బదిలీల్లో రిటెన్షన్ (మినహాయింపు) కోరిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉండడం గమనార్హం. ఇప్పటికై నా ఈ బదిలీ ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్ది, ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లతో వేసిన కమిటీ ఈ లోటుపాట్లపై చర్చించి అర్హులకు న్యాయం చేయాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యా రోగ్య శాఖ అధికారులను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. -
మాది ప్రజాప్రభుత్వం
పల్లగుట్టలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, చిత్రంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని, రేవూరి, కలెక్టర్ సందీప్కుమార్ ఝా చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
మోహన్నాయక్పై ఇక్కడా ఆరా!
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజనీర్ఇన్చీఫ్ జె.మోహన్నాయక్ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరీ మోహన్ నాయక్..? జె. మోహన్ నాయక్ తెలంగాణ ఆర్అండ్బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్–ఇన్–చీఫ్ (స్టేట్ రోడ్స్)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివృద్ధి పనులు స్టేట్ రోడ్స్ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్–ములుగు, వరంగల్–నర్సంపేట, వరంగల్–మహబూబాబాద్ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్ ఎస్ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్ నాయక్ పేరు ఉమ్మడి వరంగల్లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ వర్గాలకు సుపరిచితం. తాజాగా రూ. 6 లక్షల వసూలు.. కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే.. గ్రేటర్ వరంగల్ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్వర్క్ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎన్సీ హైదరాబాద్ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్అండ్బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అర్హత లేని కాంట్రాక్టర్కు భారీ పనులా? వరంగల్లో ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నాయి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్కు మాత్రం మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్ పత్రాలను కూడా విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్నాయక్ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది. చర్చనీయాంశంగా ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్లనుంచి ఎర్త్వర్క్ల వరకు ఆరోపణల జాబితా తాజాగా రూ.6 లక్షలు వసూలు? కిందిస్థాయి అధికారుల్లో చర్చ ఉమ్మడి వరంగల్లో నాలుగేళ్లు ఎస్ఈగా సేవలు ఏసీబీ దాడులతో ఆర్అండ్బీ వర్గాల్లో కలకలం -
మోహన్నాయక్పై ఇక్కడా ఆరా!
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజనీర్ ఇన్చీఫ్ జె.మోహన్నాయక్ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరీ మోహన్నాయక్..? మోహన్నాయక్ తెలంగాణ ఆర్అండ్బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్–ఇన్–చీఫ్ (స్టేట్ రోడ్స్)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివద్ధి పనులు స్టేట్ రోడ్స్ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్–ములుగు, వరంగల్–నర్సంపేట, వరంగల్–మహబూబాబాద్ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్ ఎస్ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్నాయక్ పేరు ఉమ్మడి వరంగల్లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ వర్గాలకు సుపరిచితం. తాజాగా రూ. 6 లక్షల వసూలు.. కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే.. గ్రేటర్ వరంగల్ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్వర్క్ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎన్సీ హైదరాబాద్ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్అండ్బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అర్హత లేని కాంట్రాక్టర్కు భారీ పనులా? వరంగల్లో ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నా యి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్కు మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్ పత్రాలను విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్నాయక్ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది. చర్చనీయాంశంగా ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్ల నుంచి ఎర్త్వర్క్ల వరకు ఆరోపణల జాబితా తాజాగా రూ.6 లక్షలు వసూలు? కిందిస్థాయి అధికారుల్లో చర్చ ఉమ్మడి వరంగల్లో నాలుగేళ్లు ఎస్ఈగా సేవలు -
ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలి
కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల క్షేత్రస్థాయి అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరి సాగుకు బదులుగా వాతావరణ పరిస్థితులు, నీటి ల భ్యత, నేల స్వభావానికి అనుగుణంగా తక్కువ నీటితో పండించే పంటలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టే వారిని గుర్తించి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా ఉ ద్యానవనశాఖ అధికారి ఆర్.శ్రీనివాస్రావు, వ్యవసాయ సంచాలకులు బి.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనఖిలా వరంగల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాములో భద్రపరచిన ఈవీఎంలను కలెక్టర్ సత్యశారద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల విభాగ డీటీ రంజిత్, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు సందర్శన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా పోటెత్తిన మిర్చి యార్డును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, కార్యవర్గ సభ్యులు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ జనార్దన్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, డైరెక్టర్ గజ్జల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణ షురూకాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఈ విద్యాసంవత్సరం నుంచి మారిన పాఠ్యాంశాలపై జిల్లా అధ్యాపకులకు మూడు రోజుల ఆన్లైన్ శిక్షణను మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9న తెలుగు, హిందీ, 10న సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, కామర్స్, 11న సైన్స్, గణితం అంశాలపై సంబంధిత విషయ నిపుణులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాలు, ప్రశ్న పత్రాలు, ప్రాక్టికల్స్ మార్కుల విభజన తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అంతర్గత మూల్యాంకనం ద్వారా 20 మార్కులు కేటాయిస్తున్నారని, ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, అన్ని కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విషయ నిపుణులు శ్రీనివాస శర్మ, ఆనంద్ కుమార్, కేశవ్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్ దుగ్గొండి: విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగించడానే కారణంతో మండలంలోని మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ రమేష్ను జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. ప్రభుత్వం రైతుల నుంచి మక్కలు, ధాన్యం సేకరిస్తున్న క్రమంలో రైతులకు సరైన విధంగా సేవలు అందించక పోగా ఇబ్బందులకు గురిచేశాడని, అలసత్వం ప్రదర్శించడంతో రైతులకు సరుకు అమ్మిన డబ్బులు వారి ఖాతాలలో జమకాలేదని, ఫలితంగా సకాలంలో పెట్టుబడికి డబ్బులు అందని పరిస్థితి వచ్చిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..
వరంగల్ జిల్లా: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ∙ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
గడువులోగా సర్వే పూర్తి చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న సర్వేను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో భూరికార్డులు, భూ కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లతో కలెక్టర్ వివిధ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ, పట్టా భూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన సర్వే, రీ–సర్వే కార్యక్రమాలు, చెరువుల శిఖం (వెట్ల్యాండ్స్) భూముల గుర్తింపు, కొలతలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో భూ రికార్డులు, భూ కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సారంగపాణి, రాజనర్సయ్యతో పాటు జిల్లాలోని 14 మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం తనిఖీ హనుమకొండ సుబేదారిలోని రెడ్క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపర్చిన గోదాంను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, టీపీసీసీ ఆర్యదర్శ ఈవీ శ్రీనివాస్రావు, బీజేపీ నుంచి రావు అమరేందర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి రజిని ఇతర పార్టీల ప్రతినిధులున్నారు. ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ట్రాన్స్జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి విశ్వజ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ సభ్యులు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’ను వేగంగా పూర్తి చేయండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీఎల్ఓలు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. సమావేశంలో నాయబ్ తహసీల్దార్ ఎండీ.సుభాన్, బీఎల్ఓలు పాల్గొన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
మహిళల భద్రతకు పెద్దపీట
ధర్మసాగర్: సమాజంలో మహిళల రక్షణ, భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మహిళలు, యువతులు సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపులు, వివిధ సమస్యల పరిష్కారానికి పోలీస్ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న షీ టీమ్స్ ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీధర్రావు, షీ టీమ్ సీఐ సుజాత, ధర్మసాగర్ ఎస్సై జానీ పాషా, స్థానిక సర్పంచ్ తోట నాగరాజు, ఎంపీడీఓ అనిల్కుమార్, ఏఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాలకు C/o ఎంజీఎం రోడ్డు
వరంగల్ అర్బన్ : నల్లా పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు ప్రధాన రహదారిపై భారీ గుంతలు తీశారు. పైపులైన్ మరమ్మతులు చేసి, మట్టిపోసి వదిలేశారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కీలకమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. హనుమకొండ, వరంగల్ బస్స్టేషన్లకు, ఇతర ప్రాంతాలనుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఈ దారిలోనే వెళ్తుంటాయి. నగరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన రహదారిలో రెండు వైపులా తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు తారు వేయకుండానే మట్టితో పూడ్చివేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరగడం, రోడ్డుపై గుంతలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సైతం ఇదే రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, వీరికి ఈ గుంతలు, బారికేడ్లు కనిపించడం లేదా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే ఆర్అండ్బీ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోచమ్మమైదాన్–సీకేఎం కాలేజీ రహదారిలో, కాశిబుగ్గ వివేకానంద కాలేజీ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు, వరంగల్ రైల్వేగేట్ ఫ్లైఓవర్ కింద రోడ్లు, తిలక్ రోడ్డు, కరీమాబాద్ దసరా రోడ్లలో నల్లా పైపులైన్ల లీకేజీలను అరికట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బల్దియా బాధ్యతాయుతంగా వ్యవహరించి గంతలను పూడ్చివేయాలని, మరిన్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా బారికేడ్లే దిక్కు పట్టించుకోని ఆర్అండ్బీ, బల్దియా ఇంజనీర్లు ప్రమాదాల బారిన వాహనదారులు -
చకచకా ఫార్మర్ రిజిస్ట్రీ
నెక్కొండ: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భూములు, రైతుల లెక్క పక్కాగా తేలనుంది. పట్టా పాస్పుస్తకాల వివరాలను రైతు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం ద్వారా ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా రైతులకు చేరాలనే లక్ష్యంతో ఆధార్ మాదిరిగా భూములకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు. అత్యధికం నెక్కొండ.. అత్యల్పం ఖిలా వరంగల్ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ 72.41 శాతమే పూర్తయ్యింది. 1,62,619 మంది రైతులు ఉండగా 1,17,747 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారు. ఇంకా 44,872 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 80.99 శాతం, అత్యల్పంగా ఖిలా వరంగల్ మండలంలో 64.38 శాతం నమోదు చేసుకున్నారు. పథకాలకు ప్రామాణికం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీని రానున్న రోజుల్లో ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ వంటి పథకాలకు అనుసంధానం చేయనున్నారు. విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడం వల్ల భూమికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూయజమాని స్థానం, విస్తీర్ణం, భూమి ఉపయోగాన్ని నిర్ధారించడమే కాకుండా అక్రమ కట్టడాలను నివారించడానికి దోహదపడనుంది. భూమి బ్యాంకింగ్, బీమా వ్యవస్థలతో సులభంగా అనుసంధానం చేయడానికి వీలవుతుంది. భూయజమానికి హక్కులను గుర్తించడమే కాకుండా భూ వివాదాలను నిరోధించి, పారదర్శకత పెంపొందించేందుకు, భూవివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయడం సులభతరం కానుంది. జిల్లాలో ఇప్పటివరకు 72.41 శాతం మొత్తం రైతులు 1,62,619 మంది నమోదు చేసుకున్నది 1,17,747 మంది ఆధార్ మాదిరిగా భూములకు విశిష్ట గుర్తింపు సంఖ్యమండలం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు నెక్కొండ 19,094 15,465 రాయపర్తి 20,251 15,393 వర్ధన్నపేట 14,655 11,057 గీసుకొండ 14,124 10,390 పర్వతగిరి 14,339 10,387 చెన్నారావుపేట 8,292 5,870 సంగెం 16,315 11,450 దుగ్గొండి 14,851 10,369 నర్సంపేట 12,636 8,741 ఖానాపురం 8,693 5,926 నల్లబెల్లి 14,049 9,274 ఖిలా వరంగల్ 5,320 3,425 మొత్తం 1,62,619 1,17,747నమోదు చేసుకోవాలి..జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కొనసాగుతోంది. క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రైతులు ఏఈఓలకు వివరాలు అందించి విశిష్ట గుర్తింపు కార్డు నంబర్ పొందాలి. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి. మీసేవ కేంద్రాల్లోనూ రైతుల వివరా నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పూర్తిస్థాయిలో రిజిస్ట్రీకి రైతులు సహకరించాలి. – విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
చేనేత కార్మికుల నిరసన దీక్ష
● టెస్కో ద్వారానే ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ ● నేటి నుంచి రిలే నిరాహార దీక్షలుకాశిబుగ్గ: సమస్య పరిష్కారం అయ్యేవరకు తమ ఆందోళన చేస్తామని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కొత్తవాడ గోపాలస్వామి గుడి బస్టాప్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద వారు నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం టెండర్ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని రద్దు చేయాలని, గతంలో మాదిరిగానే టెస్కో ద్వారా కార్పెట్లు, బెడ్షీట్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆదివారం నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సాక్షిగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామని వారు పేర్కొన్నారు. మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు.. చేనేత కార్మికులకు పలు పార్టీల నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లలో టెండర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడిందని గుర్తుచేశారు. పద్మశాలి సంఘం అఽధ్యక్షుడు ఆడెపు రవీందర్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు, పద్మశాలి సంఘం నాయకులు వడ్నాల నరేందర్, గోరంటల రాజు, బిట్ల అశోక్, న్యాయవాది ఎస్వీ రామచంద్రయ్య, బేతి అశోక్, నీలం రాజ్కిశోర్, కటకం విజయ్కుమార్ సంఘీభావం తెలిపారు. సహకార సంఘాల అధ్యక్షుడు డీఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడిగొప్పుల సంపత్, యెలుగం వెంకటమల్లు, చిన్న భద్రయ్య, యెలుగం సాంబయ్య, ఓం ప్రకాశ్, దూబాల రాజేందర్, కొలిపాక మదనయ్య, కూరపాటి సంపత్, జయరాం, ఓదెలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే వార్డు సభలు
పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్ పరకాల: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వార్డు సభలు నిర్వహించనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ పోతురాజు పవన్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 1, 2, 9, 11, 13 వార్డుల్లో శనివారం వార్డు సభలు నిర్వహించారు. సంబందిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించిన ఈసభలకు కమిషనర్ పవన్ హాజరు కాగా, ప్రజలు, స్థానిక వార్డు కౌన్సిలర్లు వార్డుల సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కమిషనర్ పవన్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా ఇతర మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డు సభల్లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబాసి వెంకటస్వామి, బొచ్చు శ్యామల, బెజ్జంకి పూర్ణాచారి, గూడెల్లి సదన్కుమార్, బొచ్చు మాధవిలత, తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు సాగుచేయాలి
● దుగ్గొండి గ్రామ సభలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద దుగ్గొండి: ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో చేతికి వచ్చే పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వర్షాలు 15 రోజులు ఆలస్యమైతే పత్తి, వరి పంటల జోలికి వెళ్లకుండా ప్రణాళికాబద్ధంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ సమ్మక్కను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ కోరగా ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ సమ్మక్క, ఎంపీడీఓ అరుంధతి, ఏఈఓ హనుమంతు, ఉపసర్పంచ్ పల్లె వైష్ణవిశ్యాం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి కాళోజీ సెంటర్: జయశంకర్ బడిబాట–2026 కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని మించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటా ప్రచారం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించాలని సూచించారు. ఏఐ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు పెంపునకు భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ఇంటర్ పూర్తిచేసిన వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు ప్రభుత్వం విదేశీ పర్యటన అవకాశం కల్పించనుందని కలెక్టర్ తెలిపారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీఐఈఓ శ్రీధర్ సుమన్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్గా పనిచేయుటకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖిలా వరంగల్, గీసుగొండ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి) మండలాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలు–గ్రేడ్2 గల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ అదనపు బాధ్యతలు తమ సాధారణ విధులతోపాటు నిర్వర్తించాలని, ఈ సేవలకు ఎటువంటి అదనపు జీతభత్యాలు ఉండవని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలకు పైబడి ఉద్యోగ విరమణకు సర్వీస్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని డీఈఓ తెలిపారు. -
విద్యాసంస్థల పరిధిలో మత్తు పదార్థాల విక్రయాల నిరోధానికి పోలీసుల కార్యాచరణ
మరికొద్ది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిపై అవగాహన పెంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ –2003, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే జస్టిస్ జువైనల్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్) యాక్ట్ 77, 2015 ప్రకారం కేసులు పెడతారు. జైలుకు పంపడంతోపాటు జరిమానా విధించవచ్చు. -
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
ఖానాపురం: గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఖానాపురం గ్రామసభలో ఆమె మాట్లాడారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తే అనేక ఉపయోగాలు ఉంటాయని, పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. తహసీల్దార్ నంగునూరి రమేశ్, ఎంపీడీఓ అద్వైత, సర్పంచ్ దాసరి రమేశ్, పశువైద్యాధికారి శ్రీకాంత్, ఏఈ స్వాతి, పీహెచ్సీ వైద్యాధికారి జ్యోతి, గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ సుబ్బారావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ, ఉపసర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ‘యూ–విన్’లో నమోదు తప్పనిసరి : డీఎంహెచ్ఓగీసుకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యూ–విన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ గర్భిణుల నమోదు, ప్రసవాలు, జనన సమయంలో ఇచ్చే టీకాల వివరాలను యాప్లో సకాలంలో నమోదు చేస్తే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఏరోజు వివరాలను ఆ రోజు వివరాలను నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డెమో అనిల్కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నియంత్రించాలినల్లబెల్లి: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా పంచాయతీ అధికారి కె.కల్పన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగాపురంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ను నియంత్రించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, సురక్షిత తాగునీటి సఫరాపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణను పరిశీలించారు. వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రవి, సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు, ఉపసర్పంచ్ కస్తూరోజు రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి రామారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమణ, హెచ్ఓ జ్యోతి, హెచ్ఎం యాకూబ్రెడ్డి, జీపీఓ శ్యాం తదితరులు పాల్గొన్నారు. మామిడికాయల పంచాయితీ నర్సంపేట రూరల్: మామిడికాయల కోసం పంచాయితీ ఇరువర్గాల పరస్పర దాడులకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన గాదెగోని రాజు, పక్కింటికి చెందిన తెప్ప చిరంజీవి, తెప్ప రాజయ్య, కొమురయ్య, రమేశ్ ఇళ్ల మధ్యలో మామిడి చెట్టు ఉంది. చెట్టు కాయలను చిరంజీవి కోయగా.. గాదెగోని రాజు ఎందుకు కాయలు కోశావని ప్రశ్నించాడు. ఈక్రమంలో ఇరుకుటుంబాలు మాటమాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరువర్గాలు శనివారం రాత్రి నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఈవిషయమై ఎస్సై గూడ అరుణ్ను వివరణ కోరగా మామిడి కాయల విషయంలో గొడవ పడి పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్సంగెం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. కాపులకనిపర్తిలో శనివారం ఉపాధి హామీ కూలీలతో, కాట్రపల్లిలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళ కూలీలు పనిచేయాలని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చవద్దని దుక్కిలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎల్నిన్ ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండేవి సాగుచేసుకోవాలని కోరారు. గొల్లపల్లి, గుంటూరుపల్లి, కాపులకనిపర్తి, కొత్తగూడెం, కుంటపల్లి, లోహితలో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి రమేశ్, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఏఓలు జగదీశ్వర్, రవీందర్రెడ్డి, విజ్ఞాన్, సర్పంచ్లు శ్రావణి, సంధ్య, శ్రీకాంత్, చంద్రమౌళి, చేరాలు, సువర్ణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్పర, రాయ్పూర్, దుర్గ్, వాడ్స, చాంద్ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయ్చూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, గూటి, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఝెలహంకలో హాల్టింగ్ కల్పించారు. 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)లో ప్రవేశాలకు సెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారం ముగిసింది. వీరు ఈ నెల 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు కోరారు. అధికారిక వెబ్సైట్ https://deecet. cdse.telangana.gov.inలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే 9న సవరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 14న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు డైట్ కళాశాలల్లో ఈనెల 17వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం జూలై 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. రామన్నపేట: ఫార్మసీ ఆఫీసర్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులు, పీహెచ్సీల నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు, సిబ్బందికి పంపిణీ చేసిన మందుల బ్యాచ్ నంబర్, గడువు తేదీ ఇతర వివరాలను సంబంధిత రికార్డుల్లో పక్కాగా నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా వచ్చిన మందులను ముందుగా ఉపయోగించాలని అదేవిధంగా ఏదైనా పీహెచ్సీలో తక్కువ వినియోగంలో ఉన్న మందులను దగ్గర్లోని అవసరమైన పీహెచ్సీలకు పంపించాలని కోరారు. రాబోయే వర్షాకాలానికి అనుగుణంగా అవసరమైన అన్ని మందులను సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సిస్టం దెబ్బతినకుండా వ్యాక్సిన్లను తగిన ఉష్ణోగ్రతలో భద్రపర్చాలన్నారు. ఈ ఔషదీ పోర్టల్లో అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యూ–విన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. వరంగల్ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ.. గర్భిణుల నమోదు, ప్రసవాలు, జనన సమయంలో ఇచ్చే టీకాల వివరాలను యాప్లో సకాలంలో నమోదు చేస్తే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఏరోజు వివరాలను ఆ రోజు నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డెమో అనిల్కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట
● మెదక్ ఎంపీ రఘునందన్రావు న్యూశాయంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బొల్లికుంట వాగ్దేవి కశాశాలలో జిల్లా కార్యకర్తల రెండు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. మోదీ మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకుంటున్నారన్నారు. సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, రాణీ రుద్రమదేవి, రాణా ప్రతాప్ పాల్గొన్నారు. -
విద్యాసంస్థల పరిధిలో మత్తు పదార్థాల విక్రయాల నిరోధానికి పోలీసుల కార్యాచరణ
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026మరికొద్ది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిపై అవగాహన పెంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ –2003, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే జస్టిస్ జువైనల్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్) యాక్ట్ 77, 2015 ప్రకారం కేసులు పెడతారు. జైలుకు పంపడంతోపాటు జరిమానా విధించవచ్చు. -
వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట
మెదక్ ఎంపీ రఘునందన్రావు న్యూశాయంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కశాశాలలో శనివారం వరంగల్ జిల్లా కార్యకర్తల రెండు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాకే మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొని రైతాంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం పీఎం కిసాన్, తదితర పథకాల ద్వారా దళారులు లేకుండా ప్రతీ పైసా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఏ చర్చకై నా తాము సిద్ధంగా ఉన్నామని, ఏ చౌరస్తాకై నా వస్తామని సవాల్ విసిరారు. రామగుండంలో యూరియా ప్లాంట్ను పునఃప్రారంభించింది ఎన్డీఏ మోదీ హయాంలోనే అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైన ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యువతకు మోదీతో కనెక్టివిటీ ఉందని, వారు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, రాణీ రుద్రమదేవి, రాణా ప్రతాప్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
కాశిబుగ్గ: ‘నోటి మాట.. నోటు వాటా’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ గాంధీనగర్లోని 107 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను శనివారం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ స్థలంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై స్థానిక కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమరేశ్ పలుమార్లు మున్సిపల్ కమిషనర్, గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగాయి. మళ్లీ ఫిర్యాదు చేయడంతో అధికారులు పోలీసుల సమక్షంలో రెండుసార్లు నోటీసులు అందించారు. ఈ ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసినప్పటికీ వారు నిబంధనల ప్రకారం సర్వే చేయాలని ఆదేశించారు. చివరకు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సీపీ ఉపేక్షించకుండా అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఆదేశించారు. కాగా, ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
నేటినుంచి రోడ్డెక్కనున్న నేతన్నలు
కాశిబుగ్గ: ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు టెండర్ విధానం రద్దు చేసి, టెస్కో ద్వారా కొనుగోలు చేసేవరకు ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం వరంగల్ కొత్తవాడలో చేనేత పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని చేనేత కార్మికులు ఐదు రోజుల నుంచి మగ్గాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారంనుంచి గోపాలస్వామి గుడి సెంటర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేస్తామని ప్రకటించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం టెండర్ విధానం ఉపసంహరిచుకోకపోతే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. దీనిపై మూడు నెలల నుంచి రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇకనైనా ఏకీకృత టెండర్ లోంచి చేనేత పరిశ్రమ ద్వారా తయారైన కార్పెట్లు, బెడ్షిట్లు తొలగించి, చేనేత మాతృ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కో మాజీ డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జిల్లా నాయకుడు భీమనాథుల సత్యనారాయణ, పలు సంఘాల పర్సన్ ఇన్చార్జులు పంతగాని శ్రీనివాస్, యెలుగం వెంకటమల్లు, అడిగొప్పుల సంపత్, ఝెలగం చిన్న భద్రయ్య, కొలిపాక మదనయ్య, యెలుగం సాంబయ్య పాల్గొన్నారు. టెండర్ విధానం రద్దు చేసేవరకు ఉద్యమాలు కొత్తవాడ చేనేత అవగాహన సదస్సులో వక్తలు -
ఆరు నెలల్లో పెరిగిన ధరలు (రూపాయల్లో)..
ఆరు నెలల క్రితం ప్రస్తుత ధరలు3000 4,5002800 4,5002400 3,2008001,000450 550500 650310360కంకర 20ఎంఎంసిమెంట్ బస్తాట్రాక్టర్ మొరంకూలీకి రోజుకుట్రాక్టర్ ఇసుకకంకర 40ఎంఎంమేసీ్త్రకి రోజుకు -
భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండడం, వాహనాలు, పారిశ్రామిక ప్రాంతాలనుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనివల్ల వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్ని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చర్యలు చేపట్టడం ద్వారా రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు నర్సింహారావు, నాగయ్య, అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీధర్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: అమరావతిలోని ఏపీ యూనివర్సిటీ వేదికగా శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో హనుమకొండ చిన్నారులు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–7 బాలుర విభాగంలో అక్షత్ చౌహాన్ లావుడియా, బాలికల విభాగంలో గుండెకారి హయాతి ఓపెన్ కేటగిరీలో క్లాసిక్ విభాగంలో విజేతలుగా నిలిచారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ట్రోఫీతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. విద్యారణ్యపురి: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాకు సంబంధించి తొలిరోజు తెలుగు పరీక్షకు 63 మంది విద్యార్థులకు 50 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. వరంగల్ జిల్లాలో కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 64 మంది విద్యార్థులకు 50 మంది హాజరయ్యారని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో (స్కిల్ డెవలప్మెంట్) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం అనుభవం ఉన్న భాగస్వామ్య సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల సంస్థలు తమ వివరణాత్మక ప్రతిపాదనలతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఉచిత శిక్షణ కోసం.. తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అవసరమైన ఐఈఎల్టీఎస్ శిక్షణ ఉచితంగా ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ ఇన్చార్జ్ మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 15లోగా అందించాలని, పూర్తి వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కాశిబుగ్గ: వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా జీఎస్కే ధర్మరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసి, పదోన్నతిపై సూపరింటెండెంట్గా వరంగల్కు వచ్చారు. ఇంతవరకు ఆస్పత్రి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరించారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మరాజుకు పలువురు వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మొబైల్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రిక్నగ్నేషన్ అటెండెన్స్) మొబైల్ యాప్ సేవలకు అంతరాయం కలిగిందని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పనిచేయడం లేదని, ఈనెల 7వతేదీ వరకు మాన్యూవల్గా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ, వివిధ కార్యాలయాల్లోని పలు విభాగాల్లో, కళాశాలల్లో డివైస్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు పనిచేస్తోందని, వారు యథావిధిగా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
మొక్కలతోనే మానవాళి మనుగడ
నెక్కొండ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలతోనే మావనవాళి మనుగడ సాధ్యమని భద్రాద్రి సర్కిల్ ఐఎఫ్ఎస్, చీఫ్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ భీమ్లానాయక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సూరిపల్లిలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై అధికారులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా భీమ్లానాయక్ మాట్లాడుతూ చెట్ల పెంపకాన్ని జీవితంలో భాగంగా ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులకు కారణం చెట్ల నరికివేతేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విస్తారంగా అడవులు, పచ్చదనం ఉంటేనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత బోగ, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎఫ్ఆర్ఏ నరేశ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎ.నవీన్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి సర్కిల్ ఐఎఫ్ఎస్ అధికారి భీమ్లానాయక్ -
కేయూలో ముఖగుర్తింపు హాజరుకు అంతరాయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మొబైల్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రిక్నగ్నేషన్ అటెండెన్స్) మొబైల్ యాప్ సేవలకు అంతరాయం కలిగిందని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పనిచేయడం లేదని, ఈనెల 7వతేదీ వరకు మాన్యూవల్గా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ, వివిధ కార్యాలయాల్లోని పలు విభాగాల్లో, కళాశాలల్లో డివైస్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు పనిచేస్తోందని, వారు యథావిధిగా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
అప్పుడే.. బా’గుండె’!
కాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థొరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. నేడు మూతపడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు కొన్నేళ్లుగా ఆగిన శస్త్ర చికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థోరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల విలువైన పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. నేడు మూతపడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థోరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థొరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
వరంగల్ లీగల్: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కాళోజీ మార్గ్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా కోర్టు ఆవరణలో మొక్క నాటిన అనంతరం ర్యాలీని జెండా ఊపి న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని మన భవిష్యత్తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలను కాపాడుకోవడంతోపాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు కాలుష్యాన్ని నిర్మూలించగలమని వివరించారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు డాక్టర్ టి.శ్రీనివాసరావు, నారాయణబాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేశ్, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ -
ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే..
నల్లబెల్లి: ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీపీఐ జిల్లా శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నేటి రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే పార్టీలు యాక్టివ్గా ఉంటున్నాయని, అధికారం కోల్పోగానే పార్టీల్లోని నాయకులు ఇతర పార్టీల వైపు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా పేదల కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని కొనియాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే తమ పార్టీ సిద్ధాంతమని, వందేళ్ల సుదీర్ఘ చరిత్రలో పార్టీ నిరూపించిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని పార్టీలు స్వప్రయోజనాల కోసం పనిచేస్తే.. కమ్యూనిస్టులు పేదల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి వెనుకాడరని స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే బాషామియా, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు చింతకింది కుమారస్వామి, నాయకులు పంజాల రమేశ్, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గుండె బద్రి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, బట్టు సాంబయ్య. మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కొర్నేల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
హాకీ.. వసతులు హుష్కాకి! వరంగల్ మహానగరంలో హాకీ క్రీడా మైదానం లేకపోవడం, వసతులు కల్పించకపోవడంతో చిన్నారులు మధ్యలోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.హన్మకొండ: వేసవిలో వ్యవసాయానికి జలాల వినియోగం తగ్గినప్పటికీ భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే కొద్దిగా పైనే ఉన్నాయి. కొద్ది నెలలుగా చూస్తే రుతు పవనాలకు ముందు మే మాసాంతం నాటికి భూగర్భ జలాలు పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో సగటున మే మాసాంతంలో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాది ఈ మాసాంతంలో 8.55 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2.38 మీటర్లపైనే ఉన్నాయి. రుతుపవనాల అనంతరం నవంబర్ మాసాంతంలో 4.16 లోతులో ఉన్నాయి. నవంబర్ మాసాంతంతో పోలిస్తే మే మాసాంతం నాటికి 2.01 మీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లాలోని నడికూడ మండలం చర్లపల్లిలో అత్యధికంగా 11.20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. భీమదేవరపల్లి జగన్నాథపురంలో 10.10 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈవర్షాకాలంలో వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరింత పడిపోయే అవకాశం వానాకాలం సాగు ప్రారంభమై భూగర్భ జలాలు తోడితే జూన్ నెలాఖరు వరకు మరింత పడిపోయే అవకాశముందని భూగర్భ జల నిపుణుల అభిప్రాయం. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తుంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తుంది. గత నెలలో జిల్లా సగటు 6.17 మీటర్ల లోతు గతేడాది మేలో జిల్లా సగటు 8.55 మీటర్ల లోతు నవంబర్లో జిల్లా సగటు 4.16 లోతుప్రాంతాల వారీగా భూగర్భ జల మట్టం(మీటర్ల లోతులో)గ్రామం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే గట్ల నర్సింగాపూర్ 0.68 3.54 4.80 6.00 7.10 జగన్నాథపూర్ 6.4 7.26 8.60 9.40 10.10 కొత్తపల్లి 5.4 6.26 6.70 7.40 9.40 వంగర 7.86 8.1 11.30 7.30 7.90 ధర్మాపూర్ 3.55 4.58 5.30 5.50 6.40 ధర్మసాగర్ 1.61 1.71 1.47 1.81 3.10 పెద్ద పెండ్యాల 2.92 3.23 6.00 7.40 7.93 నారాయణగిరి 3.3 4.35 6.00 4.54 4.92 ఎల్కతుర్తి 5.5 6.54 6.50 7.10 7.40 హనుమకొండ 4.75 4.83 5.30 5.30 6.50 నాగారం 5.3 5.41 5.60 4.70 5.90 సీతంపేట 2.4 2.56 1.64 3.50 5.22 ఎల్లాపూర్ 2.4 2.53 3.40 4.30 4.80 ఐనవోలు 5,65 5.72 4.40 5.30 5.50 పున్నేలు 2.4 2.5 2.77 3.30 4.30 పంథిని 2.75 2.8 3.40 4.90 5.00 శనిగరం 1.75 2.56 3.60 4.90 5.70 పీచర 9.1 12.57 17.80 10.80 8.00 వేలేరు 1.6 2.49 4.00 5.40 6.15 ఆత్మకూరు 2.09 1.8 2.15 1.48 3.20 దామెర 1.6 3.04 4.10 6.50 6.60 చెర్లపల్లి 8.6 9.85 11.80 11.20 11.60 నడికూడ 1.19 1.23 0.80 1.20 2.50 పరకాల 2.82 2.5 2.70 2.70 3.10 పత్తిపాక 2.9 2.2 3.70 4.70 5.90 -
ఎరువుల షాపుల్లో తనిఖీలు
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని పలు ఎరువులు, విత్తనాల షాపులను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర శుక్రవారం తనిఖీ చేశారు. నిల్వ లు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా డీలర్లు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విధిగా రసీదు ఇవ్వాలని చెప్పారు. విత్తనాలను ప్యాకెట్ల రూపంలో మాత్రమే అమ్మాలన్నారు. అలా కాకుండా విడిగా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దామెరలోని ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్నుంచి రావాల్సిన నగదు నిలిచిపోతుందని, ఇతర సబ్సిడీలకు కూడా అనర్హులవుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్కుమార్, ఏఈఓ పున్నంచందర్, రైతులు పాల్గొన్నారు. -
ధరల భారం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సామగ్రి రేట్లు ౖపైపెకి..నర్సంపేట: పేద, మధ్య తరగతి ప్రజలకు నిలువనీడ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత ప్రతి అసెంబ్లీ నియోజవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. అర్హులను ఎంపిక చేసింది. పెరిగిన ఇళ్ల నిర్మాణ ధరలతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఏమూలకు సరిపోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. మూడు నియోజకవర్గాలకు ఇళ్ల మంజూరు.. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతుండడం లబ్ధిదారులకు మరింత కష్టాలు తెచ్చి పెట్టింది. ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుకతో పాటు సిమెంట్ సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే సామగ్రి కొనుగోలు చేయడంతో లబ్ధిదారుపై ఆర్థిక భారం పడుతోంది. ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు కొంతమంది ముందుగానే అప్పులు చేసి స్థలాన్ని కొనుగోలు చేశారు. నిర్మాణానికి అవసరమైన ఐరన్, సిమెంట్ ధరలు గతంలో ఉన్న ధరలకు అటు ఇటుగా ఉన్నాయి. మిగిలిన ఇసుక, మట్టి, కంకర, మొరం, కూలి రేట్లు, ఇంటి నిర్మాణంలో వాడే కర్రతో పాటు ఇతర సామగ్రి ధరల పెరుగుదలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోవడం లేదని.. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతోందని వారు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 14,500 19,0005,500 7,500సామగ్రిమట్టి ఇటుకలు (1800 ట్రాక్టర్ లోడు)సిమెంట్ ఇటుకలు (ట్రాక్టర్ లోడు 300)నియోజకవర్గం ఇళ్ల మంజూరు బేస్మెంట్ లెవల్ రూఫ్ లెవల్ ఆర్చి లెవల్ పూర్తయిన ఇళ్లు ఒక్కో గృహానికి రూ.15 లక్షల వరకు ఖర్చు ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోవడం లేదంటున్న లబ్ధిదారులు -
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
కాశిబుగ్గ: దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ ఓసిటీ నుంచి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ర్యాలీని శుక్రవారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఽథీమ్ ‘ప్రకృతి నుంచి ప్రేరణ’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంటి ఇంధనంపై ఆధారపడకుండా, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె సూచించారు. పూర్వీకులు వాడిన మట్టి కుండలు, మట్టి పాత్రలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రిటైర్డు ఆఫీసర్ పురుషోత్తం, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, జెడ్సీ సీఈఓ రాంరెడ్డి, టి.శ్రవణ్కుమార్, ఎ.సంపత్కుమార్, వి.శ్రీనివాస్, భగవాన్, వెంకన్న, మండల పరశురాములు, రాజగోవింద్, డాక్టర్ సాంబమూర్తి, డాక్టర్ కొణతం కృష్ణ, ఫైజల్ రహమాన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నిల్వ వివరాలను నమోదు చేయాలి : డీఏఓ
నర్సంపేట రూరల్: పురుగుల, ఎరువుల, విత్తనాల షాపుల యజమానులు, డీలర్లు ప్రతిరోజు షాపుల్లో ఉన్న నిల్వ వివరాలను స్టాక్ బోర్డుపై నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. నర్సంపేట డివిజన్స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం పట్టణంలోని రైతువేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు స్టాక్బోర్డును రెగ్యులర్గా అప్డేట్ చేయాలని, వరి సన్న విత్తనాల రకాల వివరాలను నమోదు చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. విత్తనాలు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు రైతులకు అందించాలని, రైతులకు కోరిన విత్తనాలను మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ సంచాలకులు బొమ్మెన శ్రీనివాస్, టౌన్ సీఐ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారులు కృష్ణకుమార్, గోపాల్రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, రజిత, శ్యాం, డీలర్లు పాల్గొన్నారు. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకాళోజీ సెంటర్: జిల్లాలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 64 మంది విద్యార్థులకు 50 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. దరఖాస్తులు సమర్పించాలిన్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎ.పుష్పలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీసీహాస్టల్స్.సీజీజీజీ.జీఓవీ.ఇన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం వసతి గృహాల సంక్షేమాధికారులను లేదా హనుమకొండ లష్కర్బజార్లోని బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా ధర్మరాజుకాశిబుగ్గ: వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా జీఎస్కే ధర్మరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసి, పదోన్నతిపై సూపరింటెండెంట్గా వరంగల్కు వచ్చారు. ఇంతవరకు ఆస్పత్రి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరించారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మరాజుకు పలువురు వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ప్రతిరోజూ 120 మంది సభ్యులు పాల్గొననున్నారు. మొదటిరోజు శిక్షణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు, వ్యాపార నిర్వహణలో మెలకువలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై బల్దియా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, మెప్మా ప్రతినిధులు అవగాహన కల్పించారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదిత శిక్షణ భాగస్వామ్య సంస్థకు చెందిన నిపుణుడు మోహన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సందీప్ కుమార్, శ్రీలత, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమేష్, సీఓలు రమ, రజిత, శ్రీలత, రాజ్కుమార్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి శరత్ పరకాల: పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయిశరత్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి శరత్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీవల్లి శైలజ, న్యాయవాదులు మొక్కలు నాటారు. జడ్జిలు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ద్వారానే మానవాళి మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూకట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్దబోయిన వేణు, న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, గండ్ర నరేష్రెడ్డి, మేరుగు శ్రీనివాస్, గండ్ర నరేష్రెడ్డి, పి.వెంకటరమణ, రాఘవేంద్రశర్మ, లక్కం శంకర్, రాహుల్ విక్రం, తదితరులు పాల్గొన్నారు. -
భూముల విలువ ౖపైపెకి!
● పల్లెల్లో 50 నుంచి 70 శాతం పెరుగుదల ● నగరంలోనూ 50 నుంచి 100 శాతం వరకు.. ● భూయజమానులకు లాభం.. కొనుగోలుదారులకు భారం ● నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లుసాక్షి, వరంగల్: జిల్లాలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల విలువ రూ.లక్షల నుంచి ఆపైకి పెరగనున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 నుంచి 70 శాతం వరకు, వ్యవసాయేతర భూముల విలువ కూడా 30 నుంచి 100 శాతానికి పెరగనుంది. దీనివల్ల భూయజమానులకు ఆస్తి అధికారిక విలువ పెరగడంతోపాటు బ్యాంకు రుణాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. భూసేకరణ పరిహారం సమయంలో నష్టపరిహారం అధికంగా రావడం కలిసిరానుంది. అదే సమయంలో భూమి కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడంతో రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు తగ్గే చాన్స్ ఉంది. కొనుగోలుదారులకు రూ.వేల నుంచి లక్షల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. శుక్రవారం నుంచే ఈ పెరిగిన ధరల మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ రుసుం చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.కోట్లలో ఆదాయం రానుంది. సిటీలో ధరల దూకుడు.. వరంగల్, ఖిలా వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల ధరలు 50 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. మామూనూరులో ప్రస్తుతం ప్రభుత్వపరంగా గజం రేటు రూ.1500 నుంచి రూ.2500 ఉంటే అదీ రూ.4000 నుంచి రూ.5000 వరకు పెరిగింది. ఎందుకంటే ఇక్కడ విమానాశ్రయ భూములను సేకరించిన ప్రభుత్వం గజానికి రూ.4,887కు ధర చెల్లించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా వరంగల్ ఎస్వీఎన్, జేపీఎస్ రోడ్డులో ప్రస్తుతం గజానికి రూ.29,400 ఉంటే రూ.44,900 పెరిగింది. అలాగే, అపార్ట్మెంట్లకు 20 శాతం పెరిగింది. లక్ష్మీపురంలో రూ.4,100 నుంచి రూ.8,200 వరకు పెరిగింది. వరంగల్ కేఎస్ఎన్ గార్డెన్ సమీపంలో రూ.3100 నుంచి రూ.6,200, కాకతీయ మెగాటైక్స్టైన్ పార్కు సమీపంలో రూ.900 నుంచి రూ.1,800 వరకు పెరిగింది. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అయ్యప్ప టెంపుల్ సమీపంలో గజానికి రూ.2400 నుంచి రూ.3,100 ఉన్న విలువ రూ.4,100 నుంచి రూ.5,300 వరకు పెరిగింది. వర్ధన్నపేటలోే ఓపెన్ ప్లాట్లు గజానికి రూ.1700 ఉంటే 2600, కమర్షియల్ రూ.4,100 ఉంటే రూ.6,200 వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తగ్గేదేలే.. వర్ధన్నపేట బండౌతపూర్, దమ్మన్నపేట, రామవరం, దివిటిపల్లి, కొత్తపల్లి, నల్లబెల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లో ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.2,92,500 ఉండగా రూ.5,11,875లకు పెరిగింది. అలాగే, వర్ధన్నపేట, ఇల్లందలో ఎకరానికి రూ.4,50,000 ఉండగా రూ.7,87,500కు చేరనుంది. రాయపర్తి మండలంలోనూ కొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ.2,92,000 ఉండగా రూ.3,80,000కు పెరిగింది. సంగెం మండలంలో ఎకరాకు రూ.9 లక్షలుంటే రూ.13,50,000కు పెరిగింది. ముఖ్యంగా వరంగల్, ఖిలా వరంగల్లో వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల మధ్య ధర ఉండే అవకాశముంది. వ్యవసాయ భూముల ధరలు 50 నుంచి 70 శాతం వరకు పెరగనుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎకరం వ్యవసాయ భూమికి ఇలా.. పాత విలువ రూ.10 లక్షలుకొత్త విలువ (50% పెంపు) రూ.15 లక్షలురిజిస్ట్రేషన్ వ్యయం (7.5%)పాత విలువ రూ.75,000కొత్త విలువ రూ.1,12,500వివరాలు పాత రేటు కొత్త రేటు గజానికి మార్కెట్ విలువ రూ.10,000 రూ.15,000 ప్లాట్ 200 గజాలు రూ.20 లక్షలు రూ.30 లక్షలుమార్కెట్ విలువలో పెరుగుదల : రూ.10 లక్షలు రిజిస్ట్రేషన్ చార్జీలు సుమారు 7.5 శాతంగా తీసుకుంటే అదనపు రిజిస్ట్రేషన్ భారం : రూ.75,000 -
మేలో జిల్లాల వారీగా వివరాలు..
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి సంగెం: రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే లాభాలు గడించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చింతలపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభ ఆమె మాట్లాడారు. రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరిస్తే అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేయాలని సూచించారు. ఆడపిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య పెరగడం అభినందనీమన్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. గవిచర్లలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ బాషిపాక సదయ్య, పశుసంవర్థకశాఖ జేడీ బాలకృష్ణ, మండల ప్రత్యేకాధికారి రమేశ్ తహసీల్దార్ రాజ్కుమార్ పాల్గొన్నారు. 1,39,3561,20,88060,61656,09746,16542,83697,66092,6261,37,8211,22,591హనుమకొండజనగామవరంగల్భూపాలపల్లిములుగు -
పంట అవశేషాల కాల్చివేత నేరం
అదనపు కలెక్టర్ రవి ఆత్మకూరు: పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతపై సంపూర్ణ నిషేధం ఉందని ఎవరైనా అవశేషాలు కాలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలిపారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, నేల సారవంతం తగ్గిపోతుందన్నారు. అదేవిధంగా భూమిలోని సేంద్రియ పదార్థాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందన్నారు. చట్టపరంగా అన్ని గ్రామాల్లోని పంట క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చేయయడం నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. మండల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే ఏసీపీ సతీశ్బాబు మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సంతోశ్, ఎంపీఓ యోగిత, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్వేత, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్నినో’పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
● బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గీసుకొండ: ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ముందస్తుగా హెచ్చరించినా రాష్ట్ర మొద్దు నిద్ర పోతోందని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగుకు సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. గ్రేటర్ వరంగల్కు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీపేరుతో రూ.కోట్ల నిధులు కేటాయించినా ఎక్కడా స్మార్ట్గా లేదన్నారు. మురికి, అపరిశుభ్రత ఉందని చెప్పడానికి వరంగల్ కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికై నా నగరాన్ని క్లీన్గా, గ్రీన్గా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, గట్టికొప్పుల రాంబాబు, జయంత్లాల్, రాదారపు శివకుమార్, జాలిగపు ప్రసన్నరాంప్రసాద్, కూతురు రాజు, కొంగర రవి, కంది క్రాంతి కుమార్, గోదాసి అశ్విని, ప్రభాకర్, చంద్రమౌళి, సంకతాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● ఒగ్లాపూర్, ఊరుగొండ, ల్యాదెళ్లలో పర్యటన దామెర: ప్రజాపాలనతో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. దామెర మండలం ఒగ్లాపూర్, ఊరుగొండ, ల్యాదెళ్లలో గురవారం కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా.. ఒగ్లాపూర్లో డంపింగ్ యార్డును పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం ఊరుగొండ గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం బడి బాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 300కుపైగా విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ల్యాదెళ్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పరిశీలించారు. కార్యక్రమాల్లో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఈఓ గిరిరాజ్, అడిషనల్ డీఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంఈఓ జుమ్ము, డీపీఎం రాజేంద్రప్రసాద్, సర్పంచ్లు కేతిపల్లి శ్రీధర్రెడ్డి, పొలెపాక శ్రీనివాస్, బొంకూరి రవియాదవ్, ఊరుగొండ ఉపసర్పంచ్ నంద్యాల శ్రావణ్రెడ్డి, వివిధ శాఖల అఽధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పంట అవశేషాలు కాల్చడం నిషేధంహన్మకొండ అర్బన్ : జిల్లాలో పంట అవశేషాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతం తగ్గడం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజారోగ్యానికి, ప్రాణాలకు ముప్పు వాటిల్లితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రైతులు పంట అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మేడపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను ప్రజలకు వివరించారు. తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ అర్రెం సాంబయ్య, మేడపల్లి వైద్యాధికారి జ్యోతి, ఏపీఓ వెంకట్నారాయణ, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఫర్టిలైజర్ షాపులో టాస్క్ఫోర్స్ దాడినల్లబెల్లి: గడువు ముగిసిన పురుగు మందులను రైతులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగాపురంలోని విజయదుర్గ ఫర్టిలైజర్ షాపులో టాస్క్ఫోర్స్ అధికారులు గరువారం దాడులు చేశారు. గడువు ముగిసిన రూ.2.32 లక్షల విలువైన పురుగు మందులను అధికారులు సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత స్థానిక ఎస్సై సాయిప్రసన్న కుమార్కు అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఎస్సై భానుప్రకాశ్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే పురుగు మందుల గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ బన్న రజిత పాల్గొన్నారు. మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి ఖానాపురం: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని డీసీఓ సంజీవరెడ్డి సూచించారు. ఈ మేరకు బుధరావుపేట, ఖానాపురంలోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లారీల కొరతపై కాంట్రాక్టర్తో మాట్లాడారు. లారీలను పెంచాలని తెలిపారు. ట్రాక్టర్లతోనైనా రైతులు మిల్లులకు తరలించుకోవాలని సూచించారు. సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్ పాల్గొన్నారు. ఐదుగురు ఉద్యోగుల బదిలీ కాశిబుగ్గ: వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఒకేసారి ఐదుగురు ఉద్యోగులు బదిలీ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్ ప్రణీత్ నర్సంపేటకు బదిలీ కాగా.. ఈ స్థానంలో ఇంకా ఎవరూ రాలేదు. అలాగే, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ అవినాష్ పర్వతగిరికి బదిలీ కాగా ఈ స్థానంలో పర్వతగిరి నుంచి భారతి వచ్చారు. అలాగే, వర్ధన్నపేటకు చెందిన ఆర్ఐ కృష్ణస్వామి వరంగల్లో డిప్యుటేషన్పై పనిచేస్తూ బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఖిలా వరంగల్ నుంచి కీర్తన్ బదిలీపై వచ్చారు. సర్వేయర్ సందీప్కుమార్ ఖిలా వరంగల్కు బదిలీ కాగా, ఈ స్థానంలో చెన్నారావుపేట నుంచి విద్యశ్రీ వచ్చారు. 10న చెస్ ఎంపిక పోటీలు వరంగల్ స్పోర్ట్స్: జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ –9 చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, రెడ్డికాలనీలోని మాస్టర్జీ (వికాస్) హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
డెయిరీ పనులు వేగవంతం చేయాలి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ● రెండు జిల్లాల అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మరింత వేగంగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, డీఆర్డీఓలు మేన శ్రీను, నాగ పద్మజతో పాటు సంబంధిత శాఖల అధికారులతో డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఏడీడీబీ) అధికారులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. పరకాల మహిళా డెయిరీ పరిధి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆరు మండలాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. డెయిరీ అభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలకు స్థిర ఆదాయ వనరులు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి అవసరమైన చర్యలను అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారులు రాధాకిషన్, బాలకృష్ణ, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు సరిత, వరలక్ష్మి, మెప్మా కో–ఆర్డినేటర్లు రజిత రాణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
4 రోజులు.. 748 రిజిస్ట్రేషన్లు
● భూముల మార్కెట్ విలువ సవరణ ఎఫెక్ట్ ● ఫలితంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడిసాక్షి, వరంగల్: భూముల మార్కెట్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు ఒక్కసారిగా ఊపు వచ్చింది. పెరిగిన ధరలు అమల్లోకి రాకముందే పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు, భూ యజమానులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా తరలివచ్చారు. ఫలితంగా ఈ నెల ఒకటి నుంచి నాలుగు వరకు జిల్లాలోని నాలుగు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొత్తం 748 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు వరంగల్, ఖిలా వరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగాయి. ఈ రెండు కార్యాలయాల్లో కలిపి 578 రిజిస్ట్రేషన్లు నమోదుకావడం గమనార్హం. నగర ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల కొనుగోలు విక్రయాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ రద్దీ నెలకొంది. నర్సంపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయం తర్వాత స్థానం, వర్ధన్నపేట కార్యాలయంలో అత్యల్ప రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వ్యయం పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది ముందస్తుగా లావాదేవీలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న భూముల కొనుగోలు విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నాలుగు రోజుల్లోనే రూ.కోట్లలో ఆదాయం వచ్చి చేరింది. రోజుకు సగటున 187 రిజిస్ట్రేషన్లు.. మార్కెట్ విలువల పెంపు ప్రకటన అనంతరం కేవలం నాలుగు రోజుల్లోనే 748 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అంటే రోజుకు సగటున 187 రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాధారణ రోజులతో పోలిస్తే గణనీయమైన రద్దీ కనిపించింది. సబ్ రిజిస్ట్రార్ ఏప్రిల్ మే జూన్ కార్యాలయంవరంగల్ 568 943 369 ఖిలా వరంగల్ 602 904 209 నర్సంపేట 635 587 150 వర్ధన్నపేట 160 198 20 మొత్తం 1,965 2,632 748అదనపు రుసుం చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్.. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్దారులు, సవరించిన మార్కెట్ విలువల ప్రకారం వర్తించే అదనపు రుసుము (డెఫిసిట్ చలాన్)ను రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాలి. ఈ అదనపు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని రాష్ట్ర రిజిస్ట్రేషన్ వెబ్సైట్ (రిజిస్ట్రేషన్.తెలంగాణ.జీఓవీ.ఇన్)లో ప్రకటన ఇచ్చారని జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోటెత్తారు..
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో భూమి మార్కెట్ విలువలను శుక్రవారం నుంచి పెంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో గురువారం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయలకు పోటెత్తారు. వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినప్పటికీ సాయంత్రం 6.30 గంటలకు సర్వర్ పని చేయకపోవడంతో నూతన మార్కెట్ విలువలను అనుసంధానం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం 172 స్లాట్లకుగాను 130 స్లాట్స్ బుక్ చేసుకున్నారు. కాగా, సాయంత్రం 6.30 నిమిషాల వరకు కేవలం 109 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. -
డెయిరీ పనులు వేగవంతం చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మరింత వేగంగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, డీఆర్డీఓలు మేన శ్రీను, నాగ పద్మజతో పాటు సంబంధిత శాఖల అధికారులతో డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఏడీడీబీ) అధికారులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. పరకాల మహిళా డెయిరీ పరిధి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆరు మండలాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. డెయిరీ అభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలకు స్థిర ఆదాయ వనరులు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి అవసరమైన చర్యలను అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారులు రాధాకిషన్, బాలకృష్ణ, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు సరిత, వరలక్ష్మి, మెప్మా కో–ఆర్డినేటర్లు రజిత రాణి, పాల్గొన్నారు. -
ఫీజుల పేరుతో వేధించొద్దు..
హసన్పర్తి: ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించొద్దని డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలం భీమారంలోని స్కిల్స్ స్టార్క్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలకు చెందిన బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. నోట్బుక్లతో పాటు బూట్లు, సాక్స్, బెల్ట్లు, టైలు, యూనిఫాం వంటి వస్తువులను పాఠశాలల్లో విక్రయించొద్దని, వాటి కొనుగోలుకు మూడు దుకాణాలను సూచించాలని తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమకు నచ్చినచోటే వస్తువులను కొనాలన్నారు. సమావేశంలో జిల్లా సీఎంఓ సుమాదేవి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎంఈఓలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నూతనంగా ఈవిద్యాసంవత్సరం 39 ప్రీప్రైమరీ సెక్షన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరగతుల బోధనకు ఇన్స్ట్రక్టర్లను, అదేవిధంగా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒకటి లేదా అంతకన్న ఎక్కువ పాఠశాలలకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక ప్రక్రియలో సంబంధిత పాఠశాల ఉన్న గ్రామం, హ్యబిటేషన్కు చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను నిర్దేశిత దరఖాస్తు నమూనాను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు సమర్పించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 8వరకు గడువు ఉందని తెలిపారు. ఇన్స్ట్రక్టర్ల దరఖాస్తులకు ఇంటర్మీడిఝెట్ విద్యార్హత, లేదా ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్ కోర్సును పూర్తి చేసి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రీప్రైమరీ ఆయా పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం -
ప్రజల భద్రత కోసమే పోలీసులు
● ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గీసుకొండ: ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పించేందుకే పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎలుకుర్తిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వాహనాలపై బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి చేరాలన్నాదే లక్ష్యమన్నారు. యువత మాదక ద్యవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు. తొలుత ఆయన గీసుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులు, పోలీసులు పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్ఐ కుమార్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ దివ్యభారతి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉప సర్పంచ్ నల్ల సురేశ్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో గృహ జ్యోతి పథకానికి 26,17,502 మంది నమోదు చేసుకోగా.. 24,63,206 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. 1,70,438 మంది 200కుపైగా యూనిట్లు వినియోగించడంతో జీరో బిల్లులు జారీ కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేనెలలో గృహజ్యోతి లబ్ధిదారులు 5,95,805 ఉండగా విద్యుత్ వినియోగం పెరగడంతో 5,42,026 జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇక్కడ 53,779 సర్వీస్లకు జీరో బిల్లులు జారీ కాలేదు. 200 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారులు బిల్లులు చెల్చించాల్సి వచ్చింది. కాగా, గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల పరి మితిలో విద్యుత్ను వినియోగించి వాడకాన్ని నియంత్రిస్తేనే జీరో బిల్లు ప్రయోజనం పొందవచ్చని సూచి స్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడితే తిరిగి జీరో బిల్లులు జారీ అవుతాయని అధికారులు సూచిస్తున్నారు. మేలో జిల్లాల వారీగా వివరాలు.. పెరిగిన విద్యుత్ వినియోగం.. తగ్గిన జీరో బిల్లులు హన్మకొండ: భారీ ఉష్ణోగ్రతల కారణంగా గృహాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. మండుతున్న ఎండలకు వడగాలులు, ఉక్క పోత నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు, ఏసీల వినియోగం మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. ఈవేసవిలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటడంతో భరించలేని వేడి పెరిగింది. ఫ్యాన్లు వాడినప్పటికీ వేడి తగ్గకపోవడంతో కూలర్లు, ఏసీలు వినియోగించారు. విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిర్రున తిరిగాయి. యూనిట్లపై యూనిట్లు నమోదయ్యాయి. ప్రతీ నెల 200 యూనిట్లలోపు నమోదయ్యే యూనిట్లు ఆపైన రికార్డు అయ్యాయి. దీంతో జీరో బిల్లులు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఉచిత విద్యుత్ బిల్లులో భాగంగా.. 200 యూనిట్లలోపు నమోదయ్యే సర్వీస్లకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ ఉపకరణాలైన కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో 200 యూనిట్లు దాటడంతో జీరో బిల్లులు తగ్గాయి. 97,66092,62646,16542,8361,39,3561,20,8801,37,8211,22,59160,61656,0971,14,187 1,06,996జనగామహనుమకొండములుగుభూపాలపల్లివరంగల్మహబూబాబాద్గృహజ్యోతి వినియోగదారులుజారీ అయిన జీరో బిల్లులు -
ప్లాస్టిక్ను నిర్మూలించాలి
ఖానాపురం: సమాజంలోని ప్రతీఒక్కరు ప్లాస్టిక్ను నిర్మూలించుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు మండలంలోని పాకాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణ– ప్లాస్టిక్ వాడుక నిషేధంపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో అనేక అనర్థాలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మానవ, జీవరాశుల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకంతో సహజసిద్ధ సరస్సులోని జీవరాశులు అంతరించుపోతున్నాయన్నారు. ప్రతీఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించుకోవాలన్నారు. డీఎఫ్ఓ భోగ నిఖిత మాట్లాడుతూ భవిష్యత్ అటవీశాఖ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామన్నారు. అంతకుముందు పాకాలలో బ్యాటరీ ఆటోలో బటర్ఫ్లై గార్డెన్తో పాటు కట్ట, చెరువు అందాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎఫ్ఆర్వో నగేష్, డీఆర్వో రీనా, అశోక్నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం, మార్కెట్ డైరెక్టర్ సారంగపాణి, బేస్క్యాంప్ సిబ్బంది విజయ్, శ్రీకాంత్ ,ప్రకాశ్, రవి, రాజు, నాగరాజు, అటవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి -
భూసేకరణపై రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: ఎన్హెచ్–163 (జి) భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మచ్చాపూర్ రైతులతో బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల అభ్యంతరాలు, పరిహారం తదితరల అంశాలపై కలెక్టర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఓగా రంగారావు బాధ్యతల స్వీకరణఖిలా వరంగల్: జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా పి.రంగారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్న రంగారావు వరంగల్ జిల్లాకు బదిలీ చేయగా బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనచోదకులకు మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎంవీఐ జె. శ్రీనివాస్, ఏఓ జి. సుభాషిణీ, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్.నవీన్, ఏఎంవీఐలు ఎం.శంకర్, ఎస్.నిహారిక బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నర్సరీని బాధ్యతగా నిర్వహించాలి సంగెం: పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని, వాటిని బాధ్యతగా నిర్వహించాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. బుధవారం మండలంలోని మొండ్రాయి గ్రామ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో ఉండాలంటే నాణ్యమైన మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ గణేష్, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. కాస్త ఉపశమనం..నర్సంపేట: మండే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే విధంగా బుధవారం జిల్లాలో తొలకరి వర్షం పులకరించింది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది. ఆకాశం మేఘావృతమై నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. నెల రోజుల పాటు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో జిల్లాలో అనేక మంది వడదెబ్బతో మృతి చెందారు. దీంతో పాటు మండిన ఎండలకు పంట పొలాలు కూడా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లింది. బుధవారం కురిసిన చిరు జల్లులతో ప్రజలు ఉపశయనం పొందారు. -
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
అత్యవసరంగా కావాల్సినవి.. పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుసాక్షి, వరంగల్: పాతవి కదలవు.. కొత్తవి నడవవు.. అన్నట్లుంది ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి, దాని అనుబంధమైన కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాల మొరాయింపు, తరచూ మరమ్మతు, ఏఎంసీ (అన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) లేక పనిచేయకపోవడంతో వేలాది మంది రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంజీఎంలో ఉన్న 16 వైద్య యంత్రాల్లో 14 తరచూ మరమ్మతు, రెండు పనిచేయడం లేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 11 యంత్రాల్లోనూ ఐదు పనిచేయకపోవడం, మూడు మాత్రమే పనిచేయడం, సీఆర్ క్యాసెట్ల కొరతతో రెండు, మరొకటి ఏఎంసీ డ్యూ ఉండడం కలవరపెడుతోంది. ఫలితంగా రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేద కుటుంబాలకు ఇది అదనపు ఆర్థికభారం అవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత బుధవారం జరిగిన ఎంజీఎం ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు రావడంతో ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్లో ఉన్న రూ.8 కోట్లతోనైనా కొత్త పరికరాల కొనుగోలు, పాత యంత్రాల మరమ్మతుకు మార్గం సుగమమవుతుందా! అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోలుకు రూ.4,01,00,000 లు అవసరమవుతాయని, పాత పరికరాల మరమ్మతుకు మిగిలిన నగదును వాడుకోవాలని హెచ్డీఎస్ కమిటీ నిర్ణయించింది. ఇది సమావేశాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలోకి తీసుకురావడం ద్వారా వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. గుండె రోగులకు ఇబ్బందులు సూపర్ స్పెషాలిటీలోని క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడంతో గుండెరోగులకు పెద్ద సమస్యగా మారింది. అత్యవసర యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ కోసం ఇతర ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీటీ స్కాన్ యంత్రం కూడా నిలిచిపోవడంతో సూపర్ స్పెషాలిటీ సేవల లక్ష్యం దెబ్బతింటోంది. ప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు ఎంజీఎంలో పాత యంత్రాల మొరాయింపు సూపర్స్పెషాలిటీలోనూ పనిచేయని కొత్త యంత్రాలు క్యాథ్ ల్యాబ్ మూసివేతతో గుండె రోగులకు తప్పని ఇబ్బందులు కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ నిర్ణయం ఆచరణ రూపంలోకి తీసుకొస్తేనే రోగులకు మెరుగైన సేవలు -
వరంగల్
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. పలుచోట్ల వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మా పోరాటం పాలకులపై.. ఆదివాసీల పోరాటం లంబాడీలపై కాదని.. వారిని చట్టవిరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన పాలకులపై అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ అన్నారు. అత్యవసరంగా కావాల్సినవి.. పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుసాక్షి, వరంగల్: పాతవి కదలవు.. కొత్తవి నడవవు.. అన్నట్లుంది ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి, దాని అనుబంధమైన కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాల మొరాయింపు, తరచూ మరమ్మతు, ఏఎంసీ (అన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) లేక పనిచేయకపోవడంతో వేలాది మంది రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంజీఎంలో ఉన్న 16 వైద్య యంత్రాల్లో 14 తరచూ మరమ్మతు, రెండు పనిచేయడం లేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 11 యంత్రాల్లోనూ ఐదు పనిచేయకపోవడం, మూడు మాత్రమే పనిచేయడం, సీఆర్ క్యాసెట్ల కొరతతో రెండు, మరొకటి ఏఎంసీ డ్యూ ఉండడం కలవరపెడుతోంది. ఫలితంగా రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేద కుటుంబాలకు ఇది అదనపు ఆర్థికభారం అవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత బుధవారం జరిగిన ఎంజీఎం ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు రావడంతో ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్లో ఉన్న రూ.8 కోట్లతోనైనా కొత్త పరికరాల కొనుగోలు, పాత యంత్రాల మరమ్మతుకు మార్గం సుగమమవుతుందా! అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోలుకు రూ.4,01,00,000 లు అవసరమవుతాయని, పాత పరికరాల మరమ్మతుకు మిగిలిన నగదును వాడుకోవాలని హెచ్డీఎస్ కమిటీ నిర్ణయించింది. ఇది సమావేశాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలోకి తీసుకురావడం ద్వారా వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. గుండె రోగులకు ఇబ్బందులు సూపర్ స్పెషాలిటీలోని క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడంతో గుండెరోగులకు పెద్ద సమస్యగా మారింది. అత్యవసర యాంజి యోగ్రామ్, యాంజియోప్లాస్టీ కోసం ఇతర ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీటీ స్కాన్ యంత్రం కూడా నిలిచిపోవడంతో ఆస్పత్రి సేవల లక్ష్యం దెబ్బతింటోంది. ప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు ఎంజీఎంలో పాత యంత్రాల మొరాయింపు సూపర్స్పెషాలిటీలోనూ పనిచేయని కొత్త యంత్రాలు క్యాథ్ ల్యాబ్ మూసివేతతో గుండె రోగులకు తప్పని ఇబ్బందులు కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ నిర్ణయం ఆచరణ రూపంలోకి తీసుకొస్తేనే రోగులకు మెరుగైన సేవలు -
నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం
కాశిబుగ్గ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ ఎంజీఎంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, వైద్య పరికరాలు, నర్సింగ్ పాఠశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగంలో రద్దీ, ఆధునిక వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లులు, పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యమందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న నర్సింగ్ స్కూల్ భవనం, పరికరాల మరమ్మతులు, సిబ్బంది భర్తీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు ఆస్పత్రి అభివృద్ధికి తమ నిధుల నుంచి రూ.50లక్షలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ అశ్విన్కుమార్,జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిల్ బాలరాజు, డాక్టర్ రామ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు వనపర్తి శ్రీనివాస్, కన్నోజు లావణ్య, రాజ్కమల్, లత, పాల్గొన్నారు. కాగా, ఈ అభివృద్ధి కమిటీ సమావేశం 2018 సంవత్సరంలో జరగగా మళ్లీ 8 ఏళ్ల తర్వాత నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ కేర్ సెంటర్లను మంత్రి సురేఖ సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు నెలల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధం : మంత్రి కొండా సురేఖ వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నాలుగైదు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం ఆమె ఎంజీఎంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎంజీఎంలో రోగులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి మార్చిన తర్వాత ఇందులోనే కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలను ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీ గడువు ముగిసిందని, వేరే ఏజెన్సీని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైన సిబ్బంది డబ్బులు అడిగితే సస్పెండ్ చేయాలని, ప్రజలు ఇలాంటివారి గురించి కలెక్టర్, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే రాతపూర్వకంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాక్స్లో వేయాలని పేర్కొన్నారు. వీరిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ సూపర్వైజర్ను నియమించాలని ఆదేశించారు. అలుమిని డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి విరాళాలు పోగుచేసి ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ -
ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీలేని పోరాటాలు
నల్లబెల్లి: ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలో ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి అధ్యక్షతన మూడు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను బుధవారం ఆయన ప్రారంభించారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక, ఆర్థిక సమస్యల నుంచి మానవాళికి కమ్యూనిజమే ఏకై క ప్రత్యామ్నాయమన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా నిజాం నిరంకుశ పాలన నుంచి వేలాది గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర సీపీఐ పార్టీకి ఉందన్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా మాట్లాడే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాన్కు స్థిరమైన సిద్ధాంతం లేదని, ఆయనకు తెలంగాణ సమాజంలో, రాజకీయాల్లో ఎన్నటికీ స్థానంలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కె బాష్మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, జిల్లా కార్యదర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రజెండా వైపు యువత చూపు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
ఉక్కపోతకు కాస్త ఉపశమనం
హన్మకొండ : మండుటెండ నుంచి చిరుజల్లులతో కొంత ఉపశమనం కలిగింది. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు బుధవారం కురిసిన తేలిక పాటి వర్షంతో కాస్త చల్లదనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో స్వల్పవర్షం కురిసింది. చిరు జల్లులతో పరిసరాలు తడవడంతో, వేడిగాలుల తీవ్రత తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. రాత్రి 8 గంటల వరకు హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్లో 16.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చింతగట్టులో 3.5 మిల్లీ మీటర్లు, గీసుకొండలో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 4 మిల్లీ మీటర్లు, రెడ్లవాడలో 2.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ మహానగరంలోను చినుకులు పడడంతో వాతావరణం చల్లబడింది. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రైతుల ఆందోళన.. వర్షంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడం, వర్షాకాలం సమీపించి చిరు జల్లులు పడుతుండడంతో తడిసి నష్టపోతామనే భయం రైతుల్లో నెలకొంది. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయకపోవడంతో రైతులు నష్టపోయే ప్రమాదముంది. -
సర్వీస్ రికార్డే కీలకం..!?
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూపులైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలం -
బోనమెత్తిన పనికర
నెక్కొండ: ముదిరాజ్ కుల దైవం పెద్దమ్మ తల్లికి బుధవారం బోనాలతో తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని పనికర గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన పెద్దమ్మ తల్లికి చీరసారె సమర్పించారు. భక్తులు గ్రామ పురవీధుల గుండా బోనాలతో వెళ్లడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం వనభోజనాలకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కోల వెంకటేశ్వర్లు, పొన్నం వెంకన్న, సింగం కుమారస్వామి, ఎదరబోయిన రాజు, బండారు శ్రీహరి, రవి, కుంట సారయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. బోనాలతో తరలివెళ్తున్న మహిళలు -
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం
కాశిబుగ్గ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ ఎంజీఎంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, వైద్య పరికరాలు, నర్సింగ్ పాఠశాల, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగంలో రద్దీ, ఆధునిక వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పేదరోగులకు నాణ్యమైన వైద్యమందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న నర్సింగ్ స్కూల్ భవనం, పరికరాల మరమ్మతులు, సిబ్బంది భర్తీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియ కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు ఆస్పత్రి అభివృద్ధికి తమ నిధులనుంచి రూ.50లక్షలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ అశ్విన్కుమార్,జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిల్ బాలరాజు, డాక్టర్ రామ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, అభివృద్ది కమిటీ సభ్యులు వనపర్తి శ్రీనివాస్, కన్నోజు లావణ్య, రాజ్కమల్, లత, పాల్గొన్నారు. కాగా, ఈ అభివృద్ది కమిటీ సమావేశం 2018 సంవత్సరంలో జరగగా మళ్లీ 8 ఏళ్ల తర్వాత నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలోని ఎఎంసీ కేర్ సెంటర్లను మంత్రి సురేఖ సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు నెలల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధం : మంత్రి కొండా సురేఖ వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నాలుగైదు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం ఆమె ఎంజీఎంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎంజీఎంలో రోగులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి మార్చిన తర్వాత ఇందులోనే కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలను ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీ గడువు ముగిసిందని, వేరే ఏజెన్సీని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైన సిబ్బంది డబ్బులు అడిగితే సస్పెండ్ చేయాలని, ప్రజలు ఇలాంటివారి గురించి కలెక్టర్, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే రాతపూర్వకంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాక్స్లో వేయాలని పేర్కొన్నారు. వీరిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ సూపర్వైజర్ను నియమించాలని ఆదేశించారు. అలుమిని డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి విరాళాలు పోగుచేసి ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ -
సర్వీస్ రికార్డే కీలకం..!?
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూపులైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలం -
యువిన్ పోర్టల్లో నమోదు తప్పనిసరి
రామన్నపేట : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణుల నమోదు, ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎ.అప్పయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని బర్త్ డెలివరీ పాయింట్ ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యువిన్, హెచ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టల్లో రిపోర్టుల నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలు నమోదు చేయడం ద్వారా వారిని ఫాలోఅప్ సేవలు, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చిన వివరాలతో పాటు ఇంకా మిగిలిన టీకాల, అలాగే వివిధ కార్యక్రమాల ప్లానింగ్ కోసం ఈ డేటా ఉపయోగపడుతుందన్నారు. యువిన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ల మేనేజర్ శిరీష, డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ప్రవీణ్ ఆన్లైన్ పోర్టల్ సంబంధించిన వివరాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జ్ఞానేశ్వర్, మాతాశిశు సంక్షేమం ప్రో గ్రాం అధికారి రుబీనా అఫ్రోజ్, ప్రసన్నకుమార్, అశోక్ రెడ్డి, స్వప్న మాధురి పాల్గొన్నారు. అమృత్ భారత్ పనుల తనిఖీ కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే జంక్షన్లో చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి పనులను సికింద్రాబాద్ సెంట్రల్ డివిజనల్ ఇంజనీర్ (డీఈఎన్) ప్రంజల్ కేశర్వాణి బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ ఎదుట గల సర్క్యులేటింగ్ ఏరియాలో పనులు తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కాజీపేట రైల్వే వర్క్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసులు, సూపర్వైజర్ పి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. రేపటినుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు విద్యారణ్యపురి : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వతేదీ నుంచి 12వ తేదీవరకు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో ఫెయిల్ అయిన 197 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హై స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ను నియమించారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని, అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని వివరించారు. హాల్టికెట్లు అధికారిక వెబ్సైట్ బీఎస్ఈ తెలంగాణ.గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలిహన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం రాత్రి వివిధ శాఖల అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 4, 6, 8, 10 12 తేదీల్లో నిర్దేశించిన సమయానికి సభలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మధ్యవర్తులను మందలించండి
వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ హసన్పర్తి : భూ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించే వారిని మందలించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ నర్సింహారావు, పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సీపీకి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్, క్రీడా మైదానాన్ని సీపీ పరిశీలించారు. రౌడీషీటర్లు, అనుమానితుల రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. తగదాల్లో సెటిల్మెంట్లు చేసే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రౌడీషీటర్లపై సానుభూతి ప్రదర్శించొద్దన్నారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సై నవీన్, కళ్యాణ్ కుమార్, రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిసంగెం: మహిళలు కుటుంబ నిర్వాహణకే పరిమితం కాకుండా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేలా చేసి కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మహిళశక్తి వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని మొండ్రాయిలో ముమ్మడివరం, మొండ్రాయి, గొల్ల పల్లి, బాలునాయక్తండ, వంజరపల్లి, తిమ్మాపూర్లో నర్సానగర్, తిమ్మాపూర్, గాంధీనగర్, కొత్తగూడెం గ్రామాల్లో నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. కుట్టుశిక్షణ ద్వారా మహిళలకు కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగఅవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్డీఓ రేణుక, ఎంపీడీఓ రవీందర్, పీఆర్డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ అభిరామ్, మహిళ సమైక్య అధ్యక్షురాలు ఉమాదేవి, సర్పంచ్లు గూడ స్వరూప, కన్నెబోయిన సంధ్య, నాల్లం వీరస్వామి, నర్సింహనాయక్, చందర్రావు, వేల్పుల రాజు, రొట్టే శ్రీలత, కోడూరి శ్రీనివాస్రావు, గాలి చేరాలు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించి వారికి ఉజ్వల భవిష్యత్ను ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మొండ్రాయి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక
ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్గా బండి జనార్దన్ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. వరంగల్ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యదర్శిగా శ్రీనివాస్.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న మల్లేశం జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీపీ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్జెండర్లకు చెక్కుల పంపిణీకాళోజీ సెంటర్: స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో అర్హులైన 8 మంది ట్రాన్స్జెండర్లకు రూ.75 వేల చొప్పున రూ.6 లక్షల చెక్కులను మంత్రి కొండా సురేఖ పంపిణీ చేసినట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి తెలిపారు. ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన ట్రాన్స్జెండర్లకు 100 శాతం సబ్సిడీ కింద పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎద్దు నక్షత్ర, బండారి వీణ(శారీ సెంటర్), ఓరుగంటి ప్రియాంక, ఎదునూరి సుప్రజ (కిరాణా షాప్), ఓరుగంటి అశ్విని, జూలూరి శశి (బొటిక్), ఓరుగంటి స్నేహ (టీ స్టాల్), ఓరుగంటి సుధ (కూరగాయల దుకాణం) ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలిన్యూశాయంపేట: అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామసభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక చివరి దశకు చేరుకుందని, సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, అధికారులు పాల్గొన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ నయీంనగర్: వరంగల్ కోట పరిసరాలను, చారిత్రక అగడ్త అభివృద్ధి పనులను ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ కోట చుట్టూ ఉన్న అగడ్త రక్షణ, సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి ‘కుడా’ చైర్మన్ సమీక్షించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యగీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన చాపర్తి రమేశ్(45) అనే రైతు అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సుమలత కథనం ప్రకారం.. రమేశ్ తన 20 గుంటల సొంతభూమితో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆశించిన రీతిలో పంటలు సరిగా పండకపోవడం, పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో సుమారు రూ.15 లక్షల మేర అప్పులు చేశాడు. అప్పులభాధ భరించలేక తీవ్ర నిరాశ, మనోవేదనలో ఉన్న అతను సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన వ్యవసాయ భూమి వద్ద గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని పక్క చేను రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అదే రోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్ల వారుజామున చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. -
షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
● రంగాపురంలో రూ.2 లక్షల ఆస్తినష్టం నల్లబెల్లి: రంగాపురంలో గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం ఓ రైతు కుటుంబాన్ని వీధిన పడేసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మీరాల పెద్ద సమ్మయ్య తన రేకుల ఇంట్లో ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్తో నిప్పు రవ్వలు పత్తిపై పడి మంటలు వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద సమ్మయ్య ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. క్షణాల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 7 క్వింటాళ్ల పత్తి, బియ్యం, కట్టుబట్టలు, వంట సామగ్రి, ఇతర గృహోపకరణాలు, రూ.80 వేల నగదు, బ్యాంకు పత్రాలు, గుర్తింపు కార్డులు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పంచాయతీ కార్యదర్శి రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
హన్మకొండ అర్బన్: అర్హులంరికీ సంక్షేమ ఫలాలు అందించమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి సేవా పతకాలు, ప్రశంసపత్రాలు అందించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రోడ్లు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్నారు. హనుమకొండ–కాజీపేట రహదారిపై రూ.78 కోట తో, ఫాతిమా–మామునూరు మార్గంలో రూ.68 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. రవాణా సౌకర్యాల మె రుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం, భద్రకాళి చెరువు పూడికతీత పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. కాకతీయ మ్యూ జికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ బంగ్లాను ఆధునికీకరించి వారసత్వ కట్టడంగా పరిరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోందన్నారు. జిల్లాకు రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం జిల్లాలో 771 చెరువుల్లో కోటికి పైగా.. చేపపిల్లలను ఉచితంగా వదిలామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. వన మహోత్సవంలో 25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించామని వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత, గిగ్ వర్కర్ల సంక్షేమం, పేదలకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు అదాలత్ సర్కిల్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ముందంజ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, గృహలక్ష్మి కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు. మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హనుమకొండలో పోలీస్ పరేడ్ను పరిశీలిస్తున్న మంత్రి, వేడుకలకు హాజరైన అధికారులు, నాయకులుగ్రేటర్ నగరాభివృద్ధికి రూ.5 వేల కోట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జంట నగరాల అభివృద్ధికి ప్రణాళికఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హనుమకొండ జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. హనుమకొండ–వరంగల్ జంట నగరాల అభివృద్ధికి దాదాపు రూ.5 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 2040 వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు, 2057 జనాభా అంచనాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. -
అమరవీరులకు సీపీ నివాళి
వరంగల్ క్రైం: హనుమకొండ అదాలత్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరవొద్దని, వారి ఆశయ సాధనకు మనమందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని అంబులెన్స్లకు డీజిల్ కొరత ఏర్పడింది. మూడు రోజుల నుంచి ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎం, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, టూడీఈకో పరీక్షల కోసం తీసుకెళ్లే అంబులెన్స్లకు డీజిల్ లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారని రోగుల అంటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలు ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్లు ఆగిపోతే వైద్యసేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్లను నడిపించాలని కోరుతున్నారు. నయీంనగర్: వరంగల్ కోట పరిసరాలను, చారిత్రక అగడ్త అభివృద్ధి పనులను ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ కోట చుట్టూ ఉన్న అగడ్త రక్షణ, సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి ‘కుడా’ చైర్మన్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా అగడ్తను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్గా ప్రియాంకవైస్ చైర్మన్గా బండి జనార్దన్ ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్ పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్గా బండి జనార్దన్ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. వరంగల్ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జనవరిలో కమిటీని నియమించగా కొన్ని కారణాలతో హోల్డ్లో పెట్టారు. ఏనుమాముల మార్కెట్ కార్యదర్శిగా శ్రీనివాస్ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న మల్లేశం జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీపీ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సంగెం: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సాకారం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్లో పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆయన సన్మానించి మాట్లాడారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ, హౌసింగ్ పీడీ రాంరెడ్డి, డీఈలు కిషన్, విష్ణువర్ధన్, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఏఈ సంధ్యారాణి, సర్పంచ్లు వేల్పుల రాజు, శ్రీనివాస్రావు, చేరాలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవికుమార్, నాయకులు రమేశ్, ఉడుత అనిల్, సారంగం ఉన్నారు. ఎత్తిపోతల పనుల పరిశీలన గీసుకొండ: కొనాయమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులను ప్రాజెక్టు పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. -
‘సీకేఎం’లో అంబులెన్స్లకు డీజిల్ కొరత
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని అంబులెన్స్లకు డీజిల్ కొరత ఏర్పడింది. మూడు రోజుల నుంచి ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎం, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, టూడీఈకో పరీక్షల కోసం తీసుకువెళ్లే అంబులెన్స్లకు డీజిల్ లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారని రోగుల అంటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలు ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్లు ఆగిపోతే వైద్యసేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్లను నడిపించాలని కోరుతున్నారు. -
రాష్ట్ర ఆర్థిక రంగానికి విద్యుత్ రంగం వెన్నెముఖ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి విద్యుత్ రంగం వెన్నుముఖ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ అత్యంత కీలకమన్నారు. కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ కంట్రోల్ రూం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసం పత్రాలు అందించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, మాధవ రావు, కె.వెంకట రమణ, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
మహా నగర సమగ్రాభివృద్ధి
హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ప్రభుత్వ సహకారంతో వరంగల్ మహానగరం సమగ్రాభివృద్ధి చెందుతుందని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధికి విడుదల చేసిన నిధులు, జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ ఇసంపల్లి జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, అకౌంట్స్ ఆఫీసర్ శివలింగం, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్లుగా గ్రామసభలు హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ సభలు, గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ‘పంట అవశేషాలను కాల్చొద్దు.. పర్యావరణాన్ని కాపాడండి’ అంశంతో రూపొందించిన వాల్పోస్టర్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీసీపీ దార కవిత, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర పాల్గొన్నారు. వరంగల్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్ అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు అభినందన
వరంగల్ క్రైం: పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ ఉత్తమ సేవా పతకాలను, ఎస్సై కనకచంద్రం, ఏఎస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, స్వర్ణ లత సేవా పతకాలు అందుకున్నారు. -
ఉద్యమ దివిటీలు
కొందరు తెలంగాణ ఉద్యమంలో సమిధలయ్యారు. ఇంకొందరు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దివిటీలయ్యారు. మరికొందరు ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఊపిరిగా భావించి ఆంధ్రుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి.. జైల్లో ఊచలు లెక్కించారు. అలా ఎవరికి తోచినట్లుగా వారు పోరుబాట పట్టి పుట్టిన నేల రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమ గుర్తులు ‘సాక్షి’ ప్రత్యేకం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబాల వేడుకోలు -
ఉవ్వెత్తున మలిదశ ఉద్యమం
స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. జిల్లాలో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా 14 సంవత్సరాలు అందరూ కలిసికట్టుగా ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వంటావార్పు, బతుకమ్మ ఆట, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. నిరంతర రిలే దీక్షలు చేపట్టి రికార్డు సృష్టించారు. నర్సంపేటలోని అంబేడ్కర్ సెంటర్లో 400 రోజులు, దుగ్గొండి మండలం గిర్నిబావిలో జేఏసీ ఏర్పాటు చేసుకుని 203 రోజులు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. – నర్సంపేట/దుగ్గొండి స్వరాష్ట్రం కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు నర్సంపేట, గిర్నిబావిలో రిలే దీక్షలు, ర్యాలీలు -
అభివృద్ధిలో ముందంజ
జెండాకు వందనం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులుసాక్షి, వరంగల్: అభివృద్ధిలో జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఖిలావరంగల్లోని ఖుష్మహల్లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేసి జిల్లా ప్రగతిని మంత్రి కొండా సురేఖ వివరించారు. 3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.. జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.913 కోట్లకు పైగా జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల ద్వారా మరో రూ.303 కోట్లు, రైతు భరోసా కింద 1.59 లక్షల మంది రైతులకు రూ.118.70 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. 9,483 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 6.58 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందారని, గృహజ్యోతి పథకం ద్వారా 1.34 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,483 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 1,793 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. సాగునీరందించేందుకు ప్రణాళికలు.. సాగునీటి రంగంలో 2.93 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని మంత్రి వెల్ల డించారు. పాకాల, దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఉపాధి హామీ పథకం కింద 9.12 లక్షల పనిదినాలు కల్పించి రూ.21.94 కోట్ల వేతనాలు చెల్లించామని ఆమె వివరించారు. రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. వరంగల్ హెల్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.1,100 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 69 వేల మందికి పైగా వైద్య సేవలు అందించామని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 59 భవనాల నిర్మాణం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 59 గ్రామ సంఘాల భవనాల నిర్మాణానికి 10 లక్షల చొప్పున రూ. 5.90 కోట్లు కేటాయించామని తెలిపారు. జిల్లాలో 9,669 మంది మహిళా సభ్యులతో రూ. 40.67 కోట్లు వెచ్చించి చిన్నచిన్న వ్యాపారాలు ఏర్పాటు చేయించినట్లు వివరించారు. 555 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.37.42 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, రూ.48.54 కోట్ల సీ్త్రనిధి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. స్నేహ గ్రూప్స్ ద్వారా 11 మంది విద్యార్థినులకు సైకిళ్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరుపత్రాలు, 102 మహిళా సంఘాలకు రూ.12 కోట్ల రుణాల చెక్కులు అందించారు. చెన్నారావుపేట కేజీబీవీ విద్యార్థినులు చేసిన సాసోకి.. సరగం స్వాగతం పాట ఆకట్టుకుంది. చివరి దశకు పాకాల పనులు.. అటవీ పరిరక్షణలో భాగంగా 31.40 లక్షల మొక్కలు నాటామని, పాకాల ఎకో టూరిజం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీసీపీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ నిఖిత, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. జిల్లాలో 1.59 లక్షల మంది రైతులకు రూ.118.70 కోట్ల రైతు భరోసా సంక్షేమం, సదుపాయాల కల్పనలో రాష్ట్రం పురోగతి రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్ ఖుష్ మహల్లో పతాకావిష్కరణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా టెక్స్టైల్ పార్కు, మామునూరు విమానాశ్రయ విస్తరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి–163జీ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో మాస్టర్ప్లాన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.పురోగతిలో అభివృద్ధి పనులు.. -
పాఠశాలలకు ప్రశంసపత్రాలు
కాళోజీ సెంటర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు ఖిలా వరంగల్ ఖుష్ మహల్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ప్రశంసపత్రాలు అందజేశారు. రాయపర్తి మండలం కొండూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం, సంగెం మండలం గవిచర్ల మోడల్ స్కూల్, ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు ప్రశంసపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఈఓ డి.రంగయ్యనాయుడు, ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ సుజన్ తేజ తదితరులు పాల్గొన్నారు. -
పరకాల ప్రజల కల సాకారం
పరకాల: ప్రత్యేక రాష్ట్రంలో పరకాల అభివృద్ధిపరంగా పరుగులు పెడుతోంది. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల మంజూరైంది. 2022లో అప్పటి మంత్రి హరీశ్రావు రూ.35 కోట్ల నిధులతో ఆస్పత్రి పనులు ప్రారంభించారు. పనులు చివరి దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం ఉంది. అదేవిధంగా 2025లో పీఎం ఉషా స్కీం ద్వారా రూ.5 కోట్లతో డిగ్రీ కళాశాల మంజూరైంది. ఈ విద్యాసంవత్సరం కొత్త కోర్సులతో కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, పరకాలను అమరవీరుల జిల్లాగా చేయాలనే స్థానిక ప్రజల కోరిక మాత్రం నెరవేరలేదు. -
బోనాల కిషన్కు మహోన్నత సేవా పతకం
హన్మకొండ: మహోన్నత సేవా పతకానికి వరంగల్ టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్ ఎంపికయ్యారు. 1995 ఎస్సై బ్యాచ్కు చెందిన ఆయన వరంగల్ రేంజ్ పరిధిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కిషన్ డిప్యుటేషన్పై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంలో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవులపల్లి రమేశ్, కానిస్టేబుల్ కాలేరు ఉపేందర్ ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. వారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అభినంధనలు తెలిపారు. పలువురు పోలీసులకు పతకాలువరంగల్ క్రైం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులను ప్రభుత్వం పతకాలకు ఎంపిక చేసింది. ముగ్గురు పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకం, 19 మందిని సేవా పతకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక అధికారికి మహోన్నత సేవా పతకం కాశిబుగ్గ: జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.యజ్ఞనారాయణ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (మంగళవారం) ఈ సేవా పతకాన్ని అందజేయనున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యజ్ఞనారాయణకు అగ్నిమాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్–హనుమకొండ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పోరా టాలకు కేంద్రంగా నిలిచిన ఈ ప్రాంతం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రంగా మారింది. 2014లో పలు సమస్యలు ఉన్న నగరంలో నేడు విద్య, వైద్యం, రహదారులు, స్మార్ట్సిటీ ప్రాజెక్టులు, పర్యాటకం, ఐటీ తదితర రంగాల్లో పురోగతి సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనేక ప్రాజెక్టులు పూర్తికాగా.. హనుమకొండ జిల్లా పరిపాలన, విద్య, వైద్య కేంద్రంగా మరింత బలోపేతమైంది. మౌలిక సదుపాయాలు : నగరంలో 2014కు ముందు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. 2014 తర్వాత పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారాయి. తాగునీరు : వేసవిలో తాగునీటి కొరత ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథతో సమస్య పరిష్కారమైంది. వైద్యం: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, ఎంజీఎం విస్తరణ, కేఎంసీ బలోపేతంతో నగరం ప్రముఖ వైద్య కేంద్రంగా ఎదిగింది. విద్య: గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేయూతో విద్యారంగం బలోపేతమైంది. పర్యాటక, సాంస్కృతిక రంగం: వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం పరిసరాల అభివృద్ధి, కాకతీయ కళాతోరణం ప్రాచుర్యం, పర్యాటకులకు వసతులు మెరుగుపడ్డాయి. ఐటీ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐటీ కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించింది. అభివృద్ధి: నగరాభివృద్ధి హంటర్ రోడ్డు, మడికొండ, కాజీపేట, నయీంనగర్, వడ్డేపల్లి, ఎల్కతుర్తి రోడ్డు వైపు విస్తరించింది. హనుమకొండ జిల్లా ప్రత్యేకత.. తెలంగాణలో రెండో అతిపెద్ద విద్యా కేంద్రంగా హనుమకొండకు గుర్తింపు ఉంది. కేయూ, కేఎంసీ అభివృద్ధి చెందాయి. ఎంజీఎం, కలెక్టరేట్తో ప్రజలకు మరిన్ని సేవలు చేరువయ్యాయి. ఉత్తర తెలంగాణ కేంద్రంగా అభివృద్ధి.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన వరంగల్–హనుమకొండ జంట నగరాలు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధికి చిరునామాగా మారాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఐటీ రంగాల్లో నమోదైన పురోగతి నగర రూపురేఖలను మార్చింది. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ 2014తో పోలిస్తే నేడు గ్రేటర్ వరంగల్–హనుమకొండ ప్రాంతం ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా ఎదిగిందనడంలో సందేహం లేదు.గ్రేటర్ వరంగల్–హనుమకొండలో ప్రగతి పరుగులు మహానగర రూపురేఖలు మార్చిన పుష్కర కాలం -
రవాణాశాఖలో బదిలీలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐలు)లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పలువురు అధికారులు వచ్చారు. అదే సమయంలో ఈ జిల్లాల నుంచి మరికొందరు ఇతర డిస్ట్రిక్ట్లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఎంవీఐలు.. టి.జయపాల్రెడ్డి డీటీఓ వరంగల్ నుంచి డీటీసీ కరీంనగర్కు, రమేశ్ రాథోడ్ డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ నిజామాబాద్కు, బి.కిశోర్బాబు డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ ఆదిలాబాద్కు మహ్మద్ సంధాని డీటీఓ భూపాలపల్లి నుంచి డీటీఓ జగిత్యాలకు, మహ్మద్ గౌస్పాషా (సస్పెన్షన్లో) డీటీఓ మహబూబాబాద్ నుంచి డీటీసీ ఆదిలాబాద్ అటాచ్డ్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన ఎంవీఐలు.. బి. కిరణ్కుమార్ నిజామాబాద్ డీటీసీ నుంచి హనుమకొండ డీటీసీకి, టి.జనార్దన్రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమకొండ డీటీసీకి, వి. వెంకటరమణ ఖమ్మం డీటీఓ నుంచి హనుమకొండ డీటీసీకి, ఆర్. నాగలక్ష్మి కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, జి.వేణుగోపాల్ హనుమకొండ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, జె.శ్రీనివాస్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్ డీటీఓకు, శివపల్లి శ్రీనివాస్ ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, ఠాకూర్ ఈశ్వర్సింగ్ నిర్మల్ జిల్లా నుంచి ములుగు డీటీఓకు, ఎం.వెంకన్న జగిత్యాల డీటీఓ నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు, బి.శంకర్ కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ డీటీఓకు, ఎ.మహేందర్ నిర్మల్ జిల్లా నుంచి మహబూబాబాద్ డీటీఓకు, బి.శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఏఎంవీఐలు.. ఎం.సాయిచరణ్ మహబూబాబాద్ నుంచి జగిత్యాలకు, బి.విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, కీర్తి ఉదయ్ హనుమకొండ డీటీసీ నుంచి కరీంనగర్ డీటీసీ (స్పౌజ్ గ్రౌండ్స్)కి బదిలీ అయ్యారు. ఉమ్మడి వరంగల్కు వచ్చిన ఏఎంవీఐలు.. కొమ్ము శ్రీనివాస్ కామారెడ్డి నుంచి ములుగుకు, డి. శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి ములుగుకు, ఎం.డి. అఫ్రోజుద్దీన్ కామారెడ్డి నుంచి వరంగల్కు, శంకర్ మూడ్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్కు, షేక్ కాసీం మంచిర్యాల నుంచి మహబూబాబాద్కు, బి. విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, ఎం.శాలిని కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, జి.మాధవి కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, బి.అపర్ణ ఆదిలాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, కొట్టె మధుకర్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, బి.శ్రావణ్ కుమార్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, నిహారిక సర్జన ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు వచ్చారు. ఏఓలకు స్థానచలనం.. ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారు(ఏఓ)లకు స్థానచలనం కలిగింది. వరంగల్ డీటీఓ కార్యాలయం ఏఓ బి.నరేందర్ హనుమకొండ డీటీసీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం ఏఓ జి.సుభాషిణిని నియమించారు. జనగామ ఏఓ ఖలీల్ సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి కె.బెంజమిన్ జనగామకు బదిలీ అయ్యారు. పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలకు స్థానచలనం ఉమ్మడి వరంగల్ నుంచే ఎక్కువ మంది.. అదే స్థాయిలో నియామకాలు ఇన్చార్జ్ డీటీఓలుగా కొందరు ఎంవీఐలు రెండున్నరేళ్లలో ఇదే మొదటిసారి -
టీజీ ఎన్పీడీసీఎల్కు పీఎస్యూ ఐటీ అవార్డు
హన్మకొండ: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) ప్రతిష్టాత్మక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఐటీ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) కర్నాటి వరుణ్రెడ్డికి కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అందించారు. డిజిటల్ సేవల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తున్నందుకు, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు గవర్నెన్స్ నౌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మే 29న న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గవర్నెన్స్ నౌ 11 ఇండియా పీఎస్యూ ఐటీ అవార్డును టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నిర్వాహకుల నుంచి అందుకున్నారు. -
పోరు సల్పిన ఓరుగల్లు
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. దశాబ్దాల కిందటి పోరాటానికి నాయకత్వం వహించిన ముఖ్యులూ ఇక్కడి వారే. ప్రత్యేక పోరులో అసువులుబాసిన ఎక్కువ మందీ ఈ నేల బిడ్డలే. ఉద్యమానికి ఊపిరి పోసి.. పోరు సల్పిన ఓరుగల్లుది తెలంగాణ అధ్యాయంలో కీలకభూమిక. నేడు (మంగళవారం) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 ఏళ్ల తెలంగాణకు ఏర్పాటులో కీలకమైన కొన్ని ఘట్టాలు ‘సాక్షి’ ప్రత్యేకం. కమలాపూర్: 2009 డిసెంబర్ 7న కమలాపూర్తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు పార్టీలకతీతంగా వేలాదిగా కదిలి రావడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిసరాలు కిక్కిరిశాయి. జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. మొదట కాజీపేట వైపు వెళ్లే నాగపూర్ ప్యాసింజర్ రైలును అడ్డుకుని 20 నిమిషాల తర్వాత పంపించారు. ఆ తర్వాత న్యూఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైలును, మరో 45 నిమిషాల తర్వాత వచ్చిన కేరళ ఎక్స్ప్రెస్ను తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల్ రైల్వే స్టేషన్లో అడ్డుకున్నారు. 5 గంటలు గడిచినా రైళ్లు కదలకపోవడంతో కేరళ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న మిలటరీ బలగాలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. మిలటరీ బలగాలు, తెలంగాణవాదులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రైల్వే, సివిల్ పోలీసుల జోక్యంతో ఎనిమిది గంటల తర్వాత రాజధాని, కేరళ ఎక్స్ప్రెస్ రైళ్లను అక్కడి నుంచి పంపించారు. ఇలా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది ఉప్పల్ రైల్రోకో. అమరధామం స్ఫూర్తిగా ఉద్యమం పరకాల: తెలంగాణ మలిదశ పోరాటాలకు పరకాల పట్టణంలోని అమరధామం వేదికగా నిలిచింది. హైదరాబాద్ (తెలంగాణ) సంస్థాన్ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో భాగంగా తెలంగాణ 1947 సెప్టెంబర్ 2 జరిగిన మరో జలియన్ వాలాభాగ్ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని 2003లో అమరధామం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు లభించకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహావేశాలతో ఉద్యమానికి నడుం బిగించినట్లుగానే అమరధామంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు నాటి పోరాటాన్ని కళ్లకు కడుతుంటాయి. పరకాల ప్రాంత ప్రజలు అమరధామంలో ఏర్పాటు చేసిన విగ్రహాల స్ఫూర్తిగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాటి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ అమరధామం వద్ద నివాళులు అర్పించి ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ది కీలకభూమిక స్వరాష్ట్ర పోరాటానికి బీజం పడింది ఇక్కడే! తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ఉద్యమ ఘట్టాలు కొన్ని ‘సాక్షి’ ప్రత్యేకం.. -
3 నెలల్లో ‘సూపర్’ పనులు పూర్తి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాశిబుగ్గ: వరంగల్లో నిర్మస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ సూపర్ మల్టిస్పెషాలిటీ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మొదటి, రెండో అంతస్తులను పరిశీలించి, పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షించాలి..హన్మకొండ అర్బన్: పర్యావరణాన్ని పరిరక్షించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కుడా కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, పర్యావరణ శాస్త్రవేత్త జీమూత వాహన్ ఉన్నారు. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు హనుమకొండ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగే వేడుకలకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో.. ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. సోమవారం డిప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యశారద ఏర్పాట్లను పరిశీలించారు. ఖుష్మహల్, రాతికోట ముఖద్వారం, చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అమరవీరుల స్తూపాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్దీపాలతో అలంకరించారు. కాగా, నేడు (మంగళవారం) ఉదయం 7 గంటలకు వేడుకలు ప్రారంభంకానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7:45 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు, 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 8.15 గంటలకు పరేడ్, 8.25 గంటలకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరణ, 8.30 గంటలకు జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి ప్రసంగం, 9.15 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.30 గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 9.40 గంటలకు స్టాళ్ల సందర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. -
అగ్నిమాపక అధికారికి మహోన్నత సేవా పతకం
కాశిబుగ్గ: జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.యజ్ఞనారాయణ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (మంగళవారం) ఈ సేవా పతకాన్ని అందజేయనున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యజ్ఞనారాయణకు అగ్నిమాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణన్యూశాయంపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 12వ తే దీ వరకు చేపట్టే పర్యావరణం పరిరక్షణ ప్రత్యేక కార్యాచరణపై ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ. గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. విద్యుత్ మోటార్ల చోరీ! నల్లబెల్లి: మండలకేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానిక రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి గ్రామానికి చెందిన వేముల రాజు, ఉడుత బాబు, పిట్టల సుదర్శన్, మార్తా సాంబయ్య అనే రైతులు తమ పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు ఎస్సారెస్పీ కాల్వ వద్ద విద్యుత్ మోటార్లను అమర్చుకున్నారు. ఆదివారం రాత్రి కాల్వ వద్దకు వచ్చిన దొంగలు వీరి నలుగురికి చెందిన మోటార్లు, విద్యుత్ వైర్లను దొంగిలించారు. ఉడుత వీరన్న, వేముల నాగరాజులకు చెందిన మరో రెండు మోటార్లను దొంగిలించేందుకు ప్రయత్నించారు. సోమవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులు మోటార్లు మాయమవ్వడాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వానాకా లం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో మోటార్లు చోరీకి గురికావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిక్విజిషన్లపై ఆర్ఎంఓల విచారణ కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో పేషెంట్లకు అసంపూర్తిగా ఇస్తున్న రిక్విజిషన్లపై ఆర్ఎంఓలు డాక్టర్ రఘునాథస్వామి, డాక్టర్ మధుకర్ యాదవ్ సోమవారం విచారణ జరిపారు. క్యాజువాలిటీతో పాటు ఎక్స్రే రూంకు వెళ్లి విచారించారు. క్యాజువాలిటీలో సీఎంఓ, డీఎంఓ, ఓడీఎస్ఓ, డ్యూటీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు సంబంధించిన రిక్విజిషన్లను సీఎంఓలు కూడా పరిశీలించాలని వారు సూచించారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల తొందరలో రాయకుండా వదిలి వేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. -
వెలుగుల ఖిల్లా
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా 13 మండలాలతో ఏర్పడిన వరంగల్ జిల్లాలో జలవనరులు సందడి చేస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రభుత్వ వైద్యవసతులు మెరుగవుతున్నాయి. ఫామ్ టు ఫైబర్ నినాదంతో గీసుకొండ, సంగెం మండలాల్లోని శా యంపేట హవేలీ గ్రామంలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో ప్రపంచ యవనికపై వరంగల్ దశదిశ తిరగబోతోంది. ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యా క్చరింగ్, ఎంఎస్ఎంఈ యూనిట్లు పెరిగి ఉపాధి పెరుగుతోంది. త్వ రలోనే భూసేకరణ పూర్తయిన మా మునూరు ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభంకానుంది. అలాగే రైతుబంధు రాకతో వ్య వసాయ పంటల ఉత్పత్తి పెరిగి రైతులకు లాభదా యకంగా మారింది. పాఠశాలలు, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగి విద్యకు కేరాఫ్గా మారింది. ఆరోగ్య‘మస్తు’గా అడుగులు ● నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ప్రభుత్వ వైద్యాసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ 2024 సెప్టెంబర్ 19న ప్రారంభించారు. రూ.183 కోట్ల వ్యయంతో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ● వరంగల్ నగరంలో 19.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల వ్యయంతో 24 అంతస్తుల్లో అత్యాధునిక వైద్య సేవలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 2022లో నిర్మాణం ప్రారంభమైనా.. వివిధ కారణాలతో ఆలస్యమైన పనులు ఏడాదిన్నరగా వేగం పుంజుకున్నాయి. మరో మూడు నెలల్లో ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్ వైద్య సహాయం అందే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంజీఎం ఆస్పత్రిలో లక్షలాది మంది రోగులకు వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. జలసవ్వడుల దిశగా.. ● ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల మరమ్మతులు, పూ డికతీత పనులు ఎక్కువగా అవసరాల మేరకు జరిగేవి. భారీస్థాయిలో చెరువు పునరుద్ధరణ కా ర్యక్రమం లేకపోయింది. పూడిక పేరుకుపోవడంతో జిల్లాలోని ముఖ్యంగా పాకాల వంటి ప్రధాన నీటి వనరుతో పాటు వందలాది చెరువుల్లో పూడికతీత సమస్య పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని 300కుపైగా చెరువుల్లో మిషన్ కాకతీయ కింద పూడిక తీశారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా 279 చెరువుల్లో పూడిక తీయడం ద్వారా భూగర్భజల మట్టం పెంచేదిశగా ముందుకెళ్తున్నారు. దేవాదుల పూర్తయితే దశ తిరుగుద్ది ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టారు. మూడు దశలకు కలిపి 2005–06లో రూ.6,016 కోట్లకు పరిపాలన అనుమతులివ్వగా, 2025–26 ధరల ప్రకారం రూ.18,400 కోట్లు వ్యయమవుతుందని తేల్చారు. ఇప్పటివరకు రూ.14,422 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తే కానీ పథకం పూర్తి కాదు. మూడు దశల్లో కలిపి 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 58,000 ఎకరాల స్థిరీకరణకు నీరందించాల్సి ఉంది. 2027 డిసెంబర్ 31 వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తిచేస్తే జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ఓరుగల్లు నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మిషన్ కాకతీయ, ఉపాధి పనులతో చెరువుల్లో పూడికతీత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో ఉపాధి ఫుల్ -
రవాణాశాఖలో బదిలీలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐలు)లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎఎంవీఐ)లు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పలువురు అధికారులు వచ్చారు. అదే సమయంలో ఈ జిల్లాల నుంచి మరికొందరు ఇతర డిస్ట్రిక్ట్లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఎంవీఐలు.. టి.జయపాల్రెడ్డి డీటీఓ వరంగల్ నుంచి డీటీసీ కరీంనగర్కు, రమేశ్ రాథోడ్ డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ నిజామాబాద్కు, బి.కిశోర్బాబు డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ ఆదిలాబాద్కు మహ్మద్ సంధాని డీటీఓ భూపాలపల్లి నుంచి డీటీఓ జగిత్యాలకు, మహ్మద్ గౌస్పాషా (సస్పెన్షన్లో) డీటీఓ మహబూబాబాద్ నుంచి డీటీసీ ఆదిలాబాద్ అటాచ్డ్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఏఎంవీఐలు.. ఎం. సాయిచరణ్ మహబూబాబాద్ నుంచి జగిత్యాలకు, బి. విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, కీర్తి ఉదయ్ హనుమకొండ డీటీసీ నుంచి కరీంనగర్ డీటీసీ (స్పౌజ్ గ్రౌండ్స్)కి బదిలీ అయ్యారు. ఉమ్మడి వరంగల్కు వచ్చిన ఏఎంవీఐలు.. కొమ్ము శ్రీనివాస్ కామారెడ్డి నుంచి ములుగుకు, డి. శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి ములుగుకు, ఎం.డి. అఫ్రోజుద్దీన్ కామారెడ్డి నుంచి వరంగల్కు, శంకర్ మూడ్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్కు, షేక్ కాసీం మంచిర్యాల నుంచి మహబూబాబాద్కు, బి. విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, ఎం. శాలిని కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, జి. మాధవి కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, బి. అపర్ణ ఆదిలాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, కొట్టె మధుకర్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, బి. శ్రావణ్ కుమార్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, నిహారిక సర్జన ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు వచ్చారు. ఏఓలకు స్థానచలనం.. ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారు(ఏఓ)లకు స్థానచలనం కలిగింది. వరంగల్ డీటీఓ కార్యాలయం ఏఓ బి.నరేందర్ హనుమకొండ డీటీసీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం ఏఓ జి.సుభాషిణిని నియమించారు. జనగామ ఏఓ ఖలీల్ సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి కె.బెంజమిన్ జనగామకు బదిలీ అయ్యారు. పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐల స్థానచలనం ఉమ్మడి వరంగల్ నుంచే ఎక్కువ మంది.. అదే స్థాయిలో నియామకాలు ఇన్చార్జ్ డీటీఓలుగా కొందరు ఎంవీఐలు రెండున్నరేళ్లలో ఇదే మొదటిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన ఎంవీఐలు.. బి. కిరణ్కుమార్ నిజామాబాద్ డీటీసీ నుంచి హనుమకొండ డీటీసీకి, టి. జనార్ధన్రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమకొండ డీటీసీకి, వి. వెంకటరమణ ఖమ్మం డీటీఓ నుంచి హనుమకొండ డీటీసీకి, ఆర్. నాగలక్ష్మి కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, జి. వేణుగోపాల్ హనుమకొండ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, జె. శ్రీనివాస్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్ డీటీఓకు, శివపల్లి శ్రీనివాస్ ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, ఠాకూర్ ఈశ్వర్సింగ్ నిర్మల్ జిల్లా నుంచి ములుగు డీటీఓకు, ఎం. వెంకన్న జగిత్యాల డీటీఓ నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు, బి. శంకర్ కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ డీటీఓకు, ఎ. మహేందర్ నిర్మల్ జిల్లా నుంచి మహబూబాబాద్ డీటీఓకు, బి.శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు వచ్చారు. -
ఉద్యమానికి ఊపిరి వరంగల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్–హనుమకొండ జంట నగరాలు కీలక పాత్ర పోషించాయి. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2014 రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన ప్రతీ ప్రధాన ఉద్యమ ఘట్టానికి కాకతీయుల గడ్డ కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా కేయూ ఉద్యమానికి ఊపిరిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఉద్యమ ఘట్టాలు 1969: తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు. 2001: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఉద్యమ కార్యక్రమాల విస్తరణ. 2009: కేసీఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం. కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలు. 2009 డిసెంబర్ 9: తెలంగాణ ప్రకటనతో సంబురాలు. 2009 డిసెంబర్ 23: కేంద్రం వెనక్కి తగ్గడంతో ఆందోళనలు, నిరసనలు. 2010–11: విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్ర. 2011: సకల జనుల సమ్మె.. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించడం. రైల్రోకో, రాస్తారోకో: జాతీయ రహదారులు, రైల్వే మార్గాల్లో భారీ నిరసనలు. ధూంధాం కార్యక్రమాలు: తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంస్కృతిక ఉద్యమం. అమరవీరుల త్యాగాలు: ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయి. 2013: తెలంగాణ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీలు, సభలు. 2014 జూన్ 2: తెలంగాణ ఆవిర్భావంతో వరంగల్లో చారిత్రాత్మక సంబురాలు. ఉద్యమానికి గుర్తులు.. కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండ చౌరస్తా, ఏకశిల పార్కు, కలెక్టరేట్ పరిసరాలు, అమరవీరుల స్తూపాలు ప్రత్యేకత ఇదే.. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత అత్యధిక ఉద్యమ కార్యకలాపాలు జరిగిన కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాయి. -
సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. సోమవారం డిప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యశారద ఏర్పాట్లను పరిశీలించారు. ఖుష్మహల్, రాతికోట ముఖద్వారం, చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అమరవీరుల స్థూపాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్దీపాలతో అలంకరించారు. నేడు (మంగళవారం) జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయజెండాను ఆ విష్కరించనున్నారు. ఉత్తమ అధికారులను అభినందించి ప్రశంసాపత్రాలను అందించనున్నారు. కాగా సీపీ సత్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం డి ప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్కుమార్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి కట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో కమాండెంట్ పర్యవేక్షణలో మాక్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కర్రె స్వామి, ఎస్సైలు, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. షెడ్యూల్ ఇలా.. నేడు ఉదయం 7 గంటలకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రా రంభంకానున్నాయి. ఉదయం 7:45 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు, 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 8:15 గంటలకు పరేడ్, 8:25 గంటలకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరణ, 8:30 గంటలకు జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి ప్రసంగం, 9:15 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9:30 గంటలకు అమరవీరుల కుటుంబాలు సన్మానం, 9:40 గంటల స్టాళ్ల సందర్శన ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. నేడు ఖుష్మహల్ ప్రాంగణంలో ఆవిర్భావ వేడుకలు పనులను పరిశీలించిన కలెక్టర్ సత్యశారద జాతీయజెండాను ఆవిష్కరించనున్న మంత్రి సురేఖ -
మట్టిని మాడ్చకండి..
● ఏసీపీ రవీందర్రెడ్డిదుగ్గొండి: పంట వ్యర్థాలను తగులబెట్టి మట్టిని మాడ్చవద్దని, మంటలకు గాలితోడైతే తీవ్ర ప్రమాదం జరిగి ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్రెడ్డి అన్నారు. మండలంలోని శివాజినగర్, తొగర్రాయి గ్రామాల మధ్యన ఓరైతు మొక్కజొన్న బెండ్లను సోమవారం కాల్చుతున్నారు. ఇంతలోనే గాలిదుమారం మొదలై మంటలు చెలరేగి పక్కనే ఉన్న పౌల్ట్రీఫామ్ వద్దకు చేరుకుంటున్న క్రమంలో అటువైపుగా వెళ్తున్న ఏసీపీ రవీందర్రెడ్డి తన సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలోనే కలియదున్నాలయన్నారు. రైతులు ఎవరైన పంట వ్యర్థాలను కాల్చితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సాయిరమణ, ఎస్సై రావుల రణదీర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి నర్సంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ రవీందర్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని మహేశ్వరం గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
ఫామ్ టు ఫైబర్ నినాదంతో గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీ గ్రామంలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల పీఎం మిత్ర పథకం రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. కై టెక్స్, ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపారెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’, యంగ్వన్, గణేశా కంపెనీలు వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్ట్కు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
గ్రామాభివృద్ధిలో ఉపసర్పంచ్ల పాత్ర కీలకం
● జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండ నరేష్సంగెం: గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్లు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండ నరేష్ అన్నారు. సంగెం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఉప సర్పంచ్లకు ప్రత్యేక విధులు అప్పగించడంతో పాటుగా గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం ఉపసర్పంచ్ల మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా ఆగపాటి రాజు (సంగెం), వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాల ఉమేష్ (వెంకటాపూర్), ప్రధాన కార్యదర్శి గుమ్మడి సంపత్తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ప్రజా సౌకర్యార్థమే ప్రజావాణి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● గ్రీవెన్స్లో 173 దరఖాస్తులున్యూశాయంపేట: ప్రజా సౌకర్యార్థం జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్ నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా స్థాయిలో 140 దరఖాస్తులు రాగా డివిజన్ స్థాయిలో వరంగల్ నుంచి 22, నర్సంపేట డివిజన్ నుంచి 11 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వీ.గణేశ్, వరంగల్ ఆర్డీఓలు సుమా, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి దివ్యాంగుడైన తనకు ఇంటి స్థలం లేదు. ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఇల్లు ఇప్పిస్తామని ఆశ పెడుతున్నారు. ఇంతవరకు ఇల్లు రాలేదు. ఇందిరమ్మ ఇ ల్లు ఇప్పించడంతో పాటు అంత్యోదయ కార్డు మంజూరు చేసి న్యా యం చేయాలి. – ఎస్.లక్ష్మినర్సింహ, గట్టికల్ -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. డివిజన్ వస్తే కొత్తమార్గాలు.. ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. 1980 నుంచే ఉద్యమం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 1980 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగినప్పటికీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతోంది. కాగా, విశాఖపట్నం జోన్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ ఏడాదిలో డివిజన్ కోసం ఉద్యమాలు జరిగాయి. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తున్న సందర్భంగా కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు రైల్వే పునర్వ్యవస్థీకరణతో ప్రజల్లో ఆశలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలురానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. వరంగల్ను రైల్వే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉండనుండగా, పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహం తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. -
డీఏఓగా వి.విజయచంద్ర
హన్మకొండ : హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా వి.విజయచంద్ర (వి.జోజప్ప)ను ప్రభుత్వం నియమించింది. బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ సహాయ సంచాలకులుగా పని చేస్తున్న విజయచంద్రను హనుమకొండకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న రవీందర్ సింగ్ ఆదిలాబాద్ డీఏఓగా బదిలీ అయ్యారు. విద్యారణ్యపురి : డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్కు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, టెన్త్, ఇంటర్మీడియట్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయ, టీసీ, ఎన్సీసీ/స్పోర్ట్స్, పీహెచ్సీ పత్రాలతో రావాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటా యన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉ దయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. న్యూశాయంపేట: సమీకృత జిల్లా కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఓసిటీలో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, కాంట్రాక్టర్, అధికారులు ఉన్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం గ్రీవెన్ సెల్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్ : కులవర్గ విభేదాలను విస్మరించాలని చిన్మయానంద మిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీసువిరానందస్వామి ఉద్బోధించారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్ స్థాపించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పొగాకు ఉత్పత్తులను నియంత్రించాలి
● డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు కాశిబుగ్గ: పొగాకు ఉత్పత్తులను వాడటంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రతీ పౌరుడు అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. ఆదివారం ప్రపంచ పొగాకు డే సందర్భంగా ఎంజీఎం నర్సింగ్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వివిధ శాఖల సమన్వయంతో పోగాకు వాడటం వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పొగాకు రహిత సమాజం నిర్మించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తాదర్ అహ్మద్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.విజయ, డిప్యూటీ డెమో అనిల్కుమార్, నర్సింగ్ ట్యూటర్స్ చందామణి, వినోద, ప్రోగ్రాం సూపర్వైజర్లు సోమేశ్వర్, ప్రకాశ్రెడ్డి, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గడువులోగా కొనుగోళ్లు పూర్తిచేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖానాపురం: కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని గడువులోగా పూర్తిగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మండలంలోని మనుబోతులగడ్డ, పెద్దమ్మగడ్డ, ఖానాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, శ్రీనివాస, గోపికృష్ణ, సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీస్లో దిగుమతులను ఆదివారం సందర్శించారు. కొనుగోళ్లు, సౌకర్యాలు, హమాలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మనుబోతులగడ్డలో కొనుగోళ్లు ట్యాబ్లో జీరోగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులు హమాలీలు, లారీల కొరత, మిల్లర్లు 43 కిలోలుగా దిగుమతులు చేసుకోవటం వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి తీసుకెళ్లాలని, 41 కిలోలతో దిగుమతులు చేసుకోవాలని సూచించారు. హమాలీల కొరతను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పంట అవశేషాలను కాల్చొద్దనే సూచనలతో ముద్రించిన కరపత్రాలను రైతులకు అందించారు. రైతులకు అన్యాయం జరగకుండా తూకాల నిర్వహణ చేపట్టాలన్నారు. ధాన్యం దిగుమతుల్లో పారదర్శకత పాటించాలన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎస్ఓ కిష్టయ్య, సివిల్సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీఆర్డీఓ నాగపద్మజ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ నంగునూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సంక్షేమశాఖలో ఉద్యోగుల బదిలీలు
కాళోజీ సెంటర్: జిల్లా సంక్షేమశాఖ (డీడబ్ల్యూఓ) కార్యాలయంలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల నిబంధనల మేరకు మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పలువురు ఉద్యోగులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీడబ్ల్యూఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ను నర్సంపేట సీడీపీఓ కార్యాలయానికి బదిలీ కాగా ఆయన స్ధానంలో వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లిఖితను వరంగల్ డీడబ్ల్యూఓ కార్యాలయానికి బదిలీ చేయగా ఆమె స్థానంలో నర్సంపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రమాదేవిని వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే వరంగల్ సీడీపీఓ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డిని మాత్రం అదేస్ధానంలో రిటెన్షన్ ఇస్తూ కొనసాగించారు. వరంగల్ డీడబ్ల్యూఓ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ లావణ్యను నర్సంపేట సీడీపీఓ కార్యాలయానికి, వరంగల్ సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న మహ్మద్ ఇర్షత్ను డీడబ్ల్యూఓకు బదిలీ చేశారు. వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు భగవత్ను వరంగల్ సీడీపీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆదివారం సెలవు కావడంతో వారందరికి ఈమెయిల్ ద్వారా ఆర్డర్స్ పంపారు. -
పదోన్నతితో బాధ్యతలు: సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సైగా పదోన్నతి పొందిన సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్సైగా పదోన్నతి పొందిన రాజేంద్రప్రసాద్ ఆదివారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పోలీసు కమిషనర్ పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
జిగేల్.. జిగేల్
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంవిద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్ అమరవీరుల కీర్తిస్తూపంరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివారం రాత్రి అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం, కలెక్టరేట్, అమరవీరుల కీర్తిస్తూపం కాంతులీనుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. డివిజన్ వస్తే కొత్తమార్గాలు.. ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి.. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. వరంగల్ను రైల్వే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉండనుండగా, పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహం తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. 1980 నుంచే ఉద్యమం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 1980 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగినప్పటికీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతోంది. కాగా, విశాఖపట్నం జోన్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ ఏడాదిలో డివిజన్ కోసం ఉద్యమాలు జరిగాయి. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తున్న సందర్భంగా కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. రాజకీయ లబ్ధి కోసమే సౌత్ కోస్టల్ రైల్వే రాజకీయల లబ్ధి కోసమే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో రైల్వే కార్మికులకు ఎలాంటి లాభం లేదు. విడిపోతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రైల్వే బోర్డు పరిష్కరించాలి. –పిల్లలమర్రి రవీందర్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ కాజీపేటను డివిజన్గా చేయాలి..నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లతో దక్షిణ మధ్య రైల్వే జోన్గా, విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్టణం డివిజన్లతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్లుగా విడిపోతున్నాయి. సౌత్ కోస్టల్ రైల్వేజోన్ ఏర్పాటును తెలంగాణ ఎప్పుడు వ్యతిరేకించలేదు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ చేసి, కాజీపేట, నాందేడ్, హైదరాబాద్, సికింద్రాబాద్తో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. –దేవులపల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్ కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు రైల్వే పునర్వ్యవస్థీకరణతో ప్రజల్లో ఆశలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలు -
బదిలీల్లో గందరగోళం
● సీనియారిటీ జాబితా లేకుండానే కౌన్సెలింగ్ ● వ్యతిరేకించి నిరసన తెలిపిన వ్యవసాయ అధికారులుహన్మకొండ: వ్యవసాయ శాఖలో బదిలీలపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేనెల లోపు బదిలీలకు అవకాశం ఇచ్చింది. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు మినహా మిగతా అన్ని క్యాడర్లలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసింది. వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకుల బదిలీలపై స్పష్టమైన విధానం లేకుండా గందరగోళానికి గురి చేస్తోంది. వ్యవసాయాధికారులకు ఈ నెల 30 వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అదేరోజు రాత్రి 8.30 గంటలకు జిల్లా వ్యవసాయాధికారులకు మెమో వచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ఈ నెల 31న బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని మెసేజ్లు పంపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు ఆదివారం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ గది వద్దకు చేరుకోగానే ఎలాంటి సీనియారిటీ జాబితా, ఖాళీ పోస్టుల వివరాలు విడుదల చేయకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పడంతో వ్యతిరేకించారు. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సమాచారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వర్చువల్లోకి వచ్చి సీనియారిటీ జాబితా విడుదల చేస్తున్నామని, ప్రతి వ్యవసాయాధికారి 10 చొప్పున ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు ఆప్షన్లు ఇచ్చారు. -
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట: సమీకృత జిల్లా కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆదివారం వరంగల్ ఆజంజాహి మిల్ మైదానం ఓసిటీలో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటడంతో పాటు సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, కాంట్రాక్టర్, అధికారులు ఉన్నారు. నేడు ప్రజావాణిన్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను ప్రజావాణిలో అందించాలని కోరారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. స్పందిస్తున్న సహృదయులు శ్రుతి, సౌమ్యకు రూ.50వేల ఆర్థికసాయం దుగ్గొండి: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఇద్దరు అమ్మాయిలను ఆదుకోవడానికి సహృదయులు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో జిర్ర రాజు, కవితలు ఇద్దరు చనిపోవడంతో అనాథలుగా మిగిలిన శ్రుతి, సౌమ్యల దీనగాథను వివరిస్తూ ‘అనాథలు..ఆగని కన్నీటి ధారలు’ శీర్షికన మే నెల 30 (శనివారం)న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈ మేరకు పలువురు తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రూ.50 వేల వరకు విరాళాలు అందాయి. అయితే వచ్చిన కొద్దిపాటు డబ్బు ఇద్దరు పిల్లల చదువుకు సరిపడవని, వారిద్దరి చదువులు పూర్తి అయ్యేంత వరకు సరిపోయే విధంగా ఆర్థికసాయం అందించాల్సిన అవసరం ఉందని, దాతలు ముందుకు రావాలని ముదిరాజ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫేషనల్స్ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ పిలుపునిచ్చారు. ఇప్పటికి విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అగ్నివీర్కు సైనిక్ విద్యార్థుల ఎంపిక ఖానాపురం: అగ్నివీర్కు సైనిక్స్కూల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆలం రాహుల్, భూక్య కౌశిక్, మరిపెడ్డి సందీప్, శివగణేష్, ద్వితీయ సంవత్సరం నుంచి విస్లావత్ అనిల్, జర్పుల అనిల్, బానోతు అరవింద్, ప్రథమ సంవత్సరం నుంచి పృథ్వీరాజులు ఎంపికయ్యారు. భారత సైన్యంలో సేవలందించే అవకాశం రావడం సంతోషకరమన్నారు. విద్యార్థులు సైనిక్స్కూల్లో అందించే శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దామోదర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి నర్సంపేట: జూన్ 28వ తేదీన జరిగే భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జాతారకం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని పాత ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో ఆదివారం రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మనువాద బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి మనువాద రా జ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న కుట్ర లను తిప్పి కొడుతూ భారత రాజ్యాంగాన్ని కా పాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వర రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావుడియా మధుకర్నాయక్, గునిగంటి రమేష్, నాలిక యుగంధర్, కొండి రాజు, మంచాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బడి బస్సు భద్రమేనా?
ఖిలా వరంగల్: పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈక్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు మే 15తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్నెస్ పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) గడువు ముగిశాక బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ నిబంధనలు ఇలా.. బస్సుకు పవర్ స్టీరింగ్ ఉండాలి. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్ తప్పనిసరి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్ ఉండాలి. ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ హైండ్ బ్రేక్ ఉండాలి. గేర్ లీవర్లో అంతర్గత స్ప్రింగ్ బాగుండాలి. వెనకదారి కనిపించేలా అద్దం తప్పనిసరిగా ఉండాలి. బస్సులో విద్యార్థుల కదలకలు కనిపించేలా ఇంటర్నల్ అద్దం, విద్యార్థులు ఎక్కుడం, దిగడం స్పష్టంగా కనిపించేలా కన్వీక్స్క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. ఫుట్బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించి ఉండరాదు. ఫార్మింగ్ లైట్లు, అత్యవసర ద్వారం విధిగా ఏర్పాటు చేయాలి. బస్ డ్రైవర్కు 60 ఏళ్లు పైబడి ఉండొద్దు. బస్సులో డ్రైవర్ లైసెన్స్, బస్నంబర్, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ కలిగిన కాగితం పటం కట్టించి డ్రైవర్ కుడివైపు పెట్టాలి. స్కూల్ కరస్పాండెంట్ ఫోన్ నంబర్ ఉండాలి. బస్సు కండీషన్ పరిశీలించాలి.. స్కూల్ బస్సు కండీషన్ పరిశీలిస్తుండాలి. యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే ఆర్టీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవర్ తీరును గమనిస్తుండాలి. మద్యం సేవించినట్లు గుర్తిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. బ్రేక్ నిబంధనలు ఇవే.. బస్ బ్రేక్ చేసేందుకు 32 నిబంధనలు పరిశీలిస్తారు. బస్సు పసుపు రంగులో ఉండాలి. డ్రైవర్కు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ ఎక్కుతున్నారో వివరాలు ఉండాలి. బ్రేక్ ఇంజన్, టైర్లు, లైటింగ్ సిస్టం మొత్తం పరిశీలించి ఆర్టీఏ అధికారులు ధ్రువపత్రం జారీ చేస్తారు. ఎంవీఐ రూల్స్.. ఎంవీఐ రూల్ 185 (జీ) ప్రకారం పాఠశాల యాజమాన్యాలు 32 నిబంధనలు పాటించాలి. నెట్లో స్కూల్ పూర్తి వివరాలు, స్కూల్ అడ్రస్, స్కూల్ బస్ నంబర్, డ్రైవర్ వివరాలు, లైసెన్స్, బ్యాడ్జీ నంబర్, బీమా, ట్యాక్స్ ఫోన్ నంబర్లు పొందుపరచాలి. డ్రైవర్, అటెండర్ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రభుత్వ ధ్రువపత్రాన్ని రవాణా అధికారులకు అందించి తగిన రుసుం తెల్లించాలి. పరీక్షల అనంతరం ఫిట్నెస్ ధ్రువీకరణ జారీ అవుతుంది. సెలవుల్లోనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేసుకోవాలి. ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) గడువు ముగిసిన బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్చేస్తాం. తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. నిబంధనలు పాటిస్తేనే ఎంవీఐలు ఎఫ్సీ జారీ చేస్తారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ వరంగల్ ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు 444 225 219162 121 41ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ వాహనాలు తీసుకురావాలని యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారుల నోటీసులు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి -
బదిలీల్లో గందరగోళం
హన్మకొండ: వ్యవసాయ శాఖలో బదిలీలపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేనెల లోపు బదిలీలకు అవకాశం ఇచ్చింది. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు మినహా మిగతా అన్ని క్యాడర్లలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసింది. వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకుల బదిలీలపై స్పష్టమైన విధానం లేకుండా గందరగోళానికి గురి చేస్తోంది. వ్యవసాయాధికారులకు ఈ నెల 30 వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అదేరోజు రాత్రి 8.30 గంటలకు జిల్లా వ్యవసాయాధికారులకు మెమో వచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ఈ నెల 31న బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని మెసేజ్లు పంపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు ఆదివారం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ గది వద్దకు చేరుకోగానే ఎలాంటి సీనియారిటీ జాబితా, ఖాళీ పోస్టుల వివరాలు విడుదల చేయకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పడంతో వ్యతిరేకించారు. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సమాచారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వర్చువల్లోకి వచ్చి సీనియారిటీ జాబితా విడుదల చేస్తున్నామని, ప్రతి వ్యవసాయాధికారి 10 చొప్పున ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు ఆప్షన్లు ఇచ్చారు. సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు లేకుండానే కౌన్సెలింగ్ వ్యతిరేకించి నిరసన తెలిపిన వ్యవసాయ అధికారులు -
విద్యతోనే ఉన్నత స్థానం
● పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నర్సింహారెడ్డి ● విద్యార్థులకు ప్రతిభా అవార్డుల పంపిణీసంగెం: విద్యతో పాటు సంస్కారం ఉంటేనే విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి లింగాల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్తో కలిసి ప్రతిభ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలన్నారు. విద్య తపస్సు లాంటిదని సరియైన రీతిలో వినియోగించుకుని సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బానోత్ రవీందర్నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ సురేందర్, మంగపేట తహసీల్దార్ తోట రవీందర్, సర్పంచ్లు పేర్ల లలిత, పెంతల సువర్ణ, కోడూరి శ్రీని వాస్ రావు, ప్రతిభ ఆవార్డుల నిర్వహకుడు పులి రాజశేఖర్, దాతలు కోటేశ్వర్, లింగమూర్తి, ఉమాశంకర్, సురేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్లో వినూత్న సంస్కరణలు
విద్యారణ్యపురి : ఇంటర్ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వినూత్న సంస్కరణలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ సిలబస్లో ఇంటర్బోర్డు మార్పులు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 9, వరంగల్ 11, మహబూబాబాద్ 10, జయశంకర్ భూపాలపల్లి 5, జనగామ 7, ములుగులో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలు రీఓపెన్ చేయనున్నారు. సైన్స్ సబ్జెక్టుల సిలబస్ తగ్గింపు.. ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాల సిలబస్లో మార్పులు చేశారు. సైన్స్ సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో సిలబస్ను తగ్గించారు. ఫిజిక్స్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,–ఫిజిక్స్ అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. గణితం పేపర్ 1ఏలో కొత్తగా సెట్స్ అండ్ రిలేషన్స్ సీక్వెన్సెస్ అండ్ సీరిస్ పాఠ్యాంశాలు చేర్చారు. గతంలోఉన్న పలు పాఠ్యాంశాలు, రిపీటెడ్ అంశాలను తగ్గించారు. తెలంగాణ సంప్రదాయాలు, కళలతో తెలుగు పాఠ్యపుస్తకాలను రూపొందించారు. నీట్, జేఈఈలో లేని పాఠ్యాంశాలను కూడా తొలగించారు. బాటనీలో రెండు పాఠ్యాంశాలు తొలగించి కొత్తగా ఎకనామిక్స్ బాటనీ అధ్యాయాన్ని చేర్చారు. జువాలజీలో సెరికల్చర్తోపాటు రెండు అంశాలను చేర్చారు. ఇంటర్ విద్యలో సీబీఎస్ఈ సిలబస్కు అనుగుణంగా పలు మార్పులు చేశారు. పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్.. పాఠ్యపుస్తకాల కవర్పేజీలో మార్పులు చేసి మల్టీకలర్తో ముద్రించారు. ఈసారి క్యూఆర్కోడ్తో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెరిచినరోజే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలను ఇంటర్బోర్డు పంపింది. ఈసారి యూనిఫాం, నోట్బుక్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. జూన్ 12 నుంచి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. కొనసాగుతున్న అడ్మిషన్లు.. ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 2,680 మంది విద్యార్థులు సెకండియర్లో ఉండగా.. శనివారం వరకు ఇంటర్ ఫస్టియర్లో 380 మంది విద్యార్థులు పవేశాలు పొందారు. 123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. సెకండియర్లో 1,272 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. నాలుగు ఎయిడెడ్ కళాశాలలు, 11 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్నాం.. ఈసారి ఇంటర్లో వినూత్న మార్పులతోపాటు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో ఇంటర్లో అడ్మిషన్ల సంఖ్య పెరగుతుందని భావిస్తున్నాం. విద్యార్థుల హాజరుశాతం పెరగనుంది. జూన్ ఒకటి నుంచి తరగతులకు విద్యార్దులు హాజరుకావాలి. – ఎ.గోపాల్, డీఐఈఓ హనుమకొండ ఫస్టియర్ సిలబస్లో మార్పులు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం నేటినుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభంఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో ప్రయోగాత్మక విద్య అభ్యసనం పెరగుతుందని భావిస్తున్నారు. వివిధ సబ్జెక్టుల థియరీలో 80 మార్కులు ఇంటర్నల్లో 20 మార్కులు ఉంటాయి. ఈసారి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్తో ఏసీఈ అనే నూతన గ్రూపును కూడా ప్రవేశపెట్టారు. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్ -
ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
జనగామ: సంతానం కోసం కలలు కంటున్న దంపతుల ఆశలు ఫలించాయి. ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన మాచర్ల మౌనిక, రమేష్ దంపతులకు ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో అనేక ఆస్పత్రులకు తిరిగారు. చివరకు జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నారు. గర్భం దాల్చిన మౌనిక స్కానింగ్ సమయంలో ముగ్గురు శిశువులు ఉన్నట్టు నిర్ధారించగా, వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతినెలా రెగ్యులర్ చెకప్లు చేయించుకున్నారు. ఈ నెల 21న మౌనికకు పురిటినొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలో చేరి్పంచారు. డాక్టర్ స్వప్న, లింగమూర్తి నేతృత్వంలోని వైద్యబృందం సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. ఒకేసారి ముగ్గురు మగ శిశువులు జన్మించడంతో కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బంది సంబరపడ్డారు. పుట్టిన ముగ్గురు పిల్లలు, తల్లీ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా పిల్లల కోసం ఎదురుచూశాం. దేవుడి దయ, డాక్టర్ చలవతో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు పుట్టారు. మా ఆనందానికి అవధులు లేవు’.. అని తండ్రి రమేష్ సంతోషం వ్యక్తం చేశాడు. -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణత ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు టెన్త్లో 83.17 శాతం, ఇంటర్లో 78.78 శాతం ఉత్తీర్ణత -
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
వేసవి సెలవుల పొడిగింపు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్ ఐదో తేదీవరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శనివారం సర్క్యూలర్ జారీచేశారు. వేసవి సెలవులు ఈనెల 31తో ముగిసి జూన్ ఒకటి నుంచి డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జె.చిన్న, ఇతర బాధ్యులు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎండల నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని కోరగా.. జూన్ 5వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఈసెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు యథావిధిగానే విధులు నిర్వర్తించాలి. జూన్ 6 నుంచి కళాశాలలు రీ ఓపెన్ చేస్తారు. హన్మకొండ చౌరస్తా: మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బకాయిలను ప్రభుత్వం నిన్న జీపీఎఫ్ వందశాతం చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు తెలిపారు. శనివారం హనుమకొండలోని అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓస్ భవన్లో టి.రఘువీరు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తోందని, జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా తాము నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ జిల్లాలకు ఇన్చార్జ్ లను నియమించినట్లు తెలిపారు. హనుమకొండకు ఎం.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్కు టి.రఘువీర్ను నియమించినట్లు దేవదాసు తెలిపారు. కార్యక్రమంలో ఎ.సురేందర్, ఎం.పాపయ్య, పెద్ది ఆంజనేయులు, కామేశ్వర్, పి.సాంబయ్య, మీసా రాజమల్లయ్య, డాక్టర్ బి.కృష్ణమూర్తి, సాల్మన్, ప్రభుదాస్, వేణుగోపాల్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. భువనేశ్వరి బదిలీ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ)గా ఎ.మధుసూదన్రావు హైదరాబాద్ డీఈఓ కార్యాలయం నుంచి బదిలీపై వస్తున్నారు. ఈమేరకు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏసీజీఈగా విధులు నిర్వర్తిస్తున్న భువనేశ్వరి ఇక్కడి నుంచి హైదరాబాద్లోని ఎస్సెస్సీ బోర్డులో ఏసీజీగా బదిలీ అయ్యారు. కాగా, మధుసూదన్రావు సోమవారం విధుల్లో చేరుతారని సమాచారం. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు (ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ ఆిసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 10, 12, 15, 17, 19, 20 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు
జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. ఔట్కమ్స్, లెర్నింగ్ ఔట్కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ, ఎఫెక్టివ్ క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్, లెర్నింగ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కార్యకలాపాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ విద్య అమలు, గవర్నెన్స్ ప్రాసెస్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్షిప్ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధా వులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో) జిల్లా మార్కులు ర్యాంక్ జనగామ 357 01హనుమకొండ 306 10భూపాలపల్లి 295 20వరంగల్ 286 24ములుగు 266 29మహబూబాబాద్ 259 31 పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్–1 హనుమకొండకు 10వ ర్యాంకు అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్లోని మిగతా నాలుగు జిల్లాలు కేంద్ర మానవ వనరుల శాఖ నివేదికలో వెల్లడి -
జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు..
టెన్త్ విద్యార్థులుఇంటర్ విద్యార్థులు1,8621,1609878697908061,473687611550498భూపాల పల్లిహనుమ కొండమలుగుమానుకోటవరంగల్విద్యార్థులుఉత్తీర్ణత -
హోర్డింగ్.. హోల్డాన్!
ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అనధికారమే అధికం హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. చర్యల మాటేంటి? అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్లు తొలగిస్తామని తెలిపారు.‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగ్లు గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం! నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండినిబంధనలేం చెబుతున్నాయంటే.. ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి. ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు. -
సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు మైనార్టీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.తెలంగాణఈపాస్.సీజీజీ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 93988 60995 నంబర్లో లేదా సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కారు లక్ష్యం నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని రేలకుంట, ముచ్చింపుల, అర్షనపల్లి, కొండాపూర్, ఒల్లె నర్సయ్యపల్లి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేలకుంట, ముచ్చింపుల, కొండాపూర్ గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున గ్రామైక్య మహిళా సంఘాల భవనాలు, అర్షనపల్లి, బుచ్చిరెడ్డిపల్లి, అర్వయ్యపల్లి గ్రామాల్లో రూ.12 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణా పనులకు శంకుస్థాపన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ ముప్పు కృష్ణ, పీఆర్ డీఈ శ్రీకాంత్ రెడ్డి, ఏఈ అమీర్, అంగన్వాడీ సూపర్వైజర్ హేమలత, ఏపీఓ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అతివల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం గీసుకొండ: అతివల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని, పొదుపు సంఘాల మహిళా సభ్యులను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, చంద్రయ్యపల్లి, ఊకల్, గంగదేవిపల్లి, కొనాయమాకుల, విశ్వనాథపురం, మరియపురం, శాయంపేట గ్రామాల ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దారు రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ అనిల్, ఎంపీఓ పాక శ్రీనివాస్, సెర్ప్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
న్యూశాయంపేట: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఖిలా వరంగల్లోని ఖుష్ మహల్లో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి జిల్లాలో బాలబాలికలు విద్యకు దూరంగా కాకుండా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట –2026 సమావేశాన్ని జిల్లాస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్పై సమీక్ష అటవీశాఖ ల్యాండ్స్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్)పై సంబంధిత అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద, డీఎఫ్ఓ నిఖిత కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్, నీటి పారుదల, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీసీఓ నీరజ, అధికారులు పాల్గొన్నారు. వరంగల్కు మంత్రి కొండా సురేఖ.. సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్కు అటవీ, పర్యావరణం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కేటాయించింది. -
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు
జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు గాను 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు.అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ, ఎఫెక్టివ్ క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్, లెర్నింగ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కార్యకలాపా, ఇనన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ విద్య అమలు, గవర్నెన్స్ ప్రాసెస్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్షిప్ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో) జిల్లా మార్కులు ర్యాంక్ జనగామ 357 01హనుమకొండ 306 10భూపాలపల్లి 295 20వరంగల్ 286 24ములుగు 266 29మహబూబాబాద్ 259 31 పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్–1 హనుమకొండకు 10వ ర్యాంక్ అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్లోని మిగతా నాలుగు జిల్లాలు కేంద్ర మానవ వనరుల శాఖ నివేదికలో వెల్లడి -
హోర్డింగ్.. హోల్డాన్!
ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అనధికారమే అధికం హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. చర్యల మాటేంటి? అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్లు తొలగిస్తామని తెలిపారు.‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగులు గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం! నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండినిబంధనలేం చెబుతున్నాయంటే.. ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి. ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరిఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●725 కొనుగోలు కేంద్రాలు @ 4 మిల్లులుఅన్నదాతలకు ధాన్యం విక్రయ కష్టాలు తప్పడం లేదు. ఖానాపురం మండల పరిధిలో 25 కొనుగోలు కేంద్రాలు ఉండగా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి కేవలం నాలుగు మిల్లులు మాత్రమే కేటాయించడంతో తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి కోసం ఖానాపురం మండల కేంద్రంలోని శ్రీనివాస రైస్మిల్లుకు ధాన్యం లోడ్ వాహనాలు శనివారం బారులుదీరాయి. – ఖానాపురంరావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
మౌలిక వసతులు కల్పించాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కమలాపూర్, గూడూరు గ్రామాల్లో నిర్మించిన ‘డబుల్’ ఇళ్ల సముదాయాలను, అక్కడి వసతులను శుక్రవారం ఆమె పరిశీలించారు. త్వరగా పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పరిశీలన మండలంలోని ఉప్పల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఫామ్పాండ్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శుక్రవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో వసతులు, ఓర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ డీఆర్డీఓ, ఎంపీడీఓ, ఏపీఓలను అభినందించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. డంపింగ్ యార్డుల నిర్వహణ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని శనిగరంలో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సర్పంచులు వనజకళాధర్, సతీశ్, రమనాగరాజు, రాజు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్టులకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3వ, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను 4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ. రూ.75 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే పింక్బుక్ 2026–27లో కేటాయింపు వరంగల్ ఆర్ఓఆర్ సర్వేకు రూ.10 కోట్లు కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ. 0.43 కోట్లు -
పొల్యూటెన్షన్!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య మంచిగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది ఆఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బంతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్థమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగరంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్ష చేసేందుకు వరంగల్ మీసేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవ కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్టు స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు. మరో ఆరు స్టేషన్లు అవసరమే... ● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే అక్కడ నమోదయ్యే ఏక్యూఐ ఎంతమేర ఉంటుందనేది తెలియకపోతే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి. ● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలంలోని చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్డేట్ చేయడం లేదు. గ్రేటర్ వరంగల్లో తగ్గుతున్న గాలి నాణ్యత గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు ఎం10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు డంపింగ్ యార్డ్తోమడికొండ సమీప గ్రామాల్లో ప్రమాదకరస్థితివీటితో సమస్యే లేదు.. పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ కుడా ఆఫీస్లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు. సల్ఫర్ డైయాకై ్సడ్(ఎస్ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) 80 మైక్రోగ్రాం ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల్లోపుగా ఉంది. -
ఇక.. ఇండోర్ సబ్స్టేషన్లు
పట్టణాలు, నగరాల్లో ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ శ్రీకారంహన్మకొండ: ఇంటికి విద్యుత్ కావాలి కానీ, తన ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ పెట్టొద్దు.. ఇలా ప్రతి కాలనీలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు స్థానికుల నుంచి అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. సబ్స్టేషన్ ఏర్పాటుచేయాలంటే విశాలమైన స్థలం అవసరంనగరాలు, పట్టణాల్లో భూములకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంత ఖరీదు పెట్టి యాజమాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తక్కువ స్థలంలో నిర్మించాలనే ఆలోచనకు వచ్చిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మొదటిసారి ఇండోర్ సబ్ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తుండగా, అందులో గ్రేటర్ వరంగల్ పరిధిలో రెండు ఉన్నాయి. స్థలం.. ఖర్చు ఇలా.. ● సాధారణంగా ఒక 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరం. కానీ, స్థల సమస్య కారణంగా ఎకరం స్థలం నుంచి 15 గుంటల స్థలానికి చేరుకున్నారు. ● నగరాలు, పట్టణాల్లో 15 గుంటల భూమి లభ్యత సమస్యగా పరిణమించడంతో తక్కువ స్థలం, సమయంలో సబ్ స్టేషన్ నిర్మించాలనే ఆలోచనలో భాగంగానే ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ● ఇండోర్ సబ్ స్టేషన్కు కనీసం 600 గజాల స్థలం అవసరం కాగా, ఈ స్థలం కూడా లభించకపోవడంతో 400 గజాల్లోనే నిర్మిస్తున్నారు. ● సాధారణ సబ్ స్టేషన్తో చూసుకుంటే ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నది. ● సాధారణ 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల ఖర్చయితే, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.6.50 కో ట్ల నుంచి రూ.7 కోట్లు ఖర్చవుతుంది. ● టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ముందుగా రూ.3,770.43 లక్షల వ్యయంతో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి పూనుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఆరు చోట్ల.. అందులో గ్రేటర్ వరంగల్లో రెండు ఏర్పాటు స్థల సమస్య కారణంగా ఖర్చు ఎక్కువైనా భరించాలని నిర్ణయం -
ప్రైవేట్కు దీటుగా పూర్వ ప్రాథమిక విద్య
● నాలుగేళ్ల చిన్నారుల కోసం ప్రీప్రైమరీ స్కూళ్లు ● 13 మండలాలకు 48 పాఠశాలలు మంజూరు చేసిన ప్రభుత్వందుగ్గొండి: ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలతో వసతులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారు కోసం జిల్లాకు 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గనుంది. ఒక్కో పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు. ప్రభుత్వం మంజూరు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాల (ప్రీ ప్రైమరీ స్కూల్)లో ఒక టీచర్, ఒక ఆయాను నియమించనున్నారు. టీచర్కు రూ.8వేలు, ఆయాకు 6వేల చొప్పున వేతనం అందిస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 96 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. పిల్లలకు ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, స్నాక్స్ అందిస్తారు. నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.70 లక్షల నిధులు మంజూరు చేసింది... మండలాల వారీగా పాఠశాలల మంజూరు వివరాలు.. జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. వీటిలో చెన్నారావుపేట, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపురం, ఖిలా వరంగల్, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, మండలాలకు నాలుగు పాఠశాలల చొప్పున మంజూరయ్యాయి. కాగా, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట మండలాలకు 3 పాఠశాలల చొప్పున మొత్తం 48 పాఠశాలలు మంజూరయ్యాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 522 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27,729 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రాథమిక విద్య బలోపేతం.. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంలో భాగంగా మండలానికి నాలుగు ప్రీప్రైమరీ స్కూళ్లు మంజూరయ్యాయి. గత సంవత్సరమే అడ్మిషన్లు ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. ప్రీప్రైమరీతో ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడుతుంది. – వెంకటేశ్వర్లు, దుగ్గొండి ఎంఈఓ -
పొల్యూటెన్షన్ !
మూడు నెలలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (పీఎం10) ఇలా..గ్రేటర్ వరంగల్లో తగ్గుతున్న గాలి నాణ్యతసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య బాగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది అఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్తమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగ రంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్షించేందుకు వరంగల్ మీ సేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవా కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు. మరో ఆరు స్టేషన్లు అవసరమే.. ● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి. ● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్డేట్ చేయడం లేదు. పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ ‘కుడా’ ఆఫీస్లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవాలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు. సల్ఫర్ డైయాకై ్సడ్ (ఎస్ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) 80 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా.. కానీ ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల లోపు ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి.. ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు ఎం 10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు డంపింగ్ యార్డ్తో మడికొండ చుట్టుపక్కల ప్రమాదకరస్థితి -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
● పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు నర్సంపేట: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాలను శాసిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం ఇష్టారాజ్యంగా 25 నుంచి 50 శాతం ఫీజులు పెంచుతున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల నరేశ్, సహాయ కార్యదర్శి దండు వినయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు హర్షవర్ధన్, పి.అనూష, నాయకులు రజని, సౌమ్య, రాజు, కల్యాణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ అర్బన్: జిల్లాలో జూన్ 15 నాటికి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంపై తహసీల్దార్లు, బీఎల్ఓ, సూపర్వైజర్లతో శుక్రవారం కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ శ్రీనివాస్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బహిరంగంగా పొగ తాగితే చర్యలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఏటీసీపీ)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ చట్టం (కోట్పా యాక్ట్) జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 31న నిర్వహించే ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య జిల్లాలో చేపడుతున్న పొగాకు నియంత్రణ కార్యక్రమాలను వెల్లడించారు. సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామకృష్ణ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, డీఐఈఓ గోపాల్, ఏసీడీ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాస్, డీటీఓ వేణుగోపాల్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.‘ఎస్ఐఆర్’ హెల్ప్డెస్క్ల ఏర్పాటు ఎస్ఐఆర్–26 ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సవరణలు, సహాయం కోసం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి హెల్ప్డెస్క్ ఉంటుందని తెలిపారు. టోల్ఫ్రీ 1800–425–1126 /9701777182 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమీక్ష -
పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–27) ప్రవేశాలకు పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న అభ్యర్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ధ్రువీకరణ పత్రాలను అందించారు. జూన్1వ తేదీ వరకు ఈ సర్టిఫికెట్ల ప్రక్రియ కొనసాగనుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ మంగళవారం బదిలీ అయ్యారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధి బీఈడీ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 9, 10, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు. విద్యారణ్యపురి: ‘ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడుదాం’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని ప్రభుత్వ సుబేదారి పాఠశాలలో నిర్వహించిన విద్యారంగ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి, డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు రావుల రమేశ్, అటుకుల శ్రీనివాస్రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, అన్నారెడ్డి, మహేందర్రెడ్డి, కుమారస్వామి, రాంరెడ్డి, సుదర్శనం, శ్రీనివాస్రావు, సుదర్శన్ వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. సంప్రదాయాలు కాపాడాలిహన్మకొండ కల్చరల్/హన్మకొండ: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లిన మహాస్వామి.. తిరుగు ప్రయాణంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు స్వగృహానికి శుక్రవారం వెళ్లారు. స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కెప్టెన్ వొడితల లక్ష్మీకాంత రావు, సరోజనీ దేవి దంపతులు, మనుమడు ఇంద్రనీల్, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారితో భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషుశర్మ, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ, పద్మాక్షి దేవాలయ అర్చకుడు నాగిళ్ల షణ్ముఖ శర్మ తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట/ ఖిలా వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలలో గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను రేపటిలోగా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా రవాణాధికారి శోభన్బాబు, డీఎంసీఎస్ సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవాలి వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు’పై శుక్రవారం అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ వీడియోలు ప్రదర్శించారు. గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు 1,000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా ఆటబొమ్మలు, అభ్యసన సామగ్రి తయారీని వివరించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మాట్లాడుతూ పిల్లల్లో సహజ సిద్ధమైన సృజనాత్మకతను ప్రోత్సహించాలని, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నారం సబ్స్టేషన్కు మంటలు
● సమీపంలో పంట వ్యర్థాలు కాలుస్తుండగా ఘటన ● ఆర్పివేసిన అగ్నిమాపక, విద్యుత్ సిబ్బంది, సర్పంచ్పర్వతగిరి: రైతులు పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో సబ్స్టేషన్కు మంటలు వ్యాపించిన ఘటన అన్నారం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రైతులు శుక్రవారం పంట వ్యర్థాలను కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న పొలాలు, సబ్స్టేషన్కు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, సర్పంచ్ గాడిపల్లి మహేందర్ మంటలను ఆర్పివేశారు. ఈ మంటల్లో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యే తీగలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా కన్నెబోయిన మల్లయ్య రైతు పొలంలో 30 నీటి పైపలు కాలిపోయి రూ.30 వేల నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా డీఈ దానయ్య మాట్లాడుతూ వ్యవసాయ భూముల నుంచి మంటలు సబ్స్టేషన్ ఆవరణలోకి వ్యాపించాయని తెలిపారు. అందరం అప్రమత్తమై మంటలను ఆర్పివేసి రూ.2 కోట్ల నష్టాన్ని నివారించామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఏడీఈ తిరుపతి, విద్యుత్ సిబ్బంది శ్రావణ్, పూర్ణాచారి, పోలీస్కానిస్టేబుల్ రమేశ్, వీరస్వామి, వినయ్, రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
● వరంగల్ ఆర్వోఆర్ సర్వేకు రూ.10 కోట్లు ● కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ.0.43 కోట్లు కేటాయింపు ● రైల్వే పింక్బుక్ 2026–27లో వెల్లడికాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్లకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను రూ.4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ.గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ.గాను రూ.75 కోట్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. -
ధాన్యం తడవకుండా చూడాలి : డీఆర్డీఓ
ఖానాపురం: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని డీఆర్డీఓ నాగపద్మజ ఆదేశించారు. ఈ మేరకు రాగంపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. సేకరించిన ధాన్యం, తూకాలు, గన్నీల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దని, వాతావరణంలో మార్పుల దృష్ట్యా ధాన్యాం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న డీసీఎం, ట్రాక్టర్ల ద్వారా తరలించాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అద్వైత, ఏపీఎం రమాదేవి పాల్గొన్నారు. ఇరువర్గాల ఘర్షణ చెన్నారావుపేట: వరిగడ్డి వాము దగ్ధమైన ఘటనలో లింగాపురం గ్రామ పరిధిలోని మేగ్యానాయక్తండాలో ఇరువర్గాలు శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాయి. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. మేగ్యాతండాకు చెందిన గుగులోత్ రాజేందర్ వరిగడ్డి వాము ఇటీవల దగ్ధమైంది. దీంతో రాజేందర్ మనస్తాపం చెంది తిట్టాడు. ఇది విన్న అజ్మీరా శ్రీను ఎందుకు తిడుతున్నావని అడిగాడు. వరిగడ్డి కాల్చినవాడిని తిడుతుంటే నీకేమైందని రాజేందర్ అనడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా అజ్మీరా శ్రీను కత్తులు, ఇనుపరాడ్లతో నలుగురు వ్యక్తులను తీసుకుని రాజేందర్ ఇంటిపైకి దాడికి వెళ్లాడు. తండావాసులు వెంబడించడంతో ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. గణి అనే వ్యక్తి దొరకడంతో పక్కనే ఉన్న స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాపయ్యపేటలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన కొల్లూరి సతీశ్ (36) తన భార్య పిల్లలతో వరంగల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య అనూషతో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంట్లో భార్య అనూష, అత్త ఐలమ్మ, బామ్మర్ది శివ.. సతీశ్తో గొడవపడి దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన సతీశ్ పాపయ్యపేటకు వచ్చి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఓదెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. ఆయిల్పామ్ తోటలో అగ్నిప్రమాదంవర్ధన్నపేట: ఆయిల్పామ్ తోటలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన ఇల్లంద గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు తక్కళ్లపల్లి లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద గ్రామంలో 8 ఎకరాల్లో మూడు సంవత్సరాలుగా ఆయిల్పామ్ సాగు చేస్తున్నట్లు తెలిపాడు. తోటకు సమీపంలో రైతులు వరి కొయ్యలను తగుల బెట్టారు. మంటలు తోటలోకి విస్తరించి 400 మొక్కలు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నాడు. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, వాల్వ్సిస్టం కాలిపోయినట్లు వాపోయాడు. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. -
విద్యార్థులు అంకితభావంతో చదవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు కాళోజీ సెంటర్: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా సోషల్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సోషల్ ఫోరం నిర్వహించిన కార్యక్రమాలు మిగిలిన ఫోరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఏఎంఓ సుజన్తేజ, డీఎస్ఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఫోరం సేవాభావంతో విద్యార్థులను ప్రోత్సహిస్తోందని, సోషల్ సబ్జెక్టులో 100 శాతం మార్కులు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందని అభినందించారు. సోషల్ ఫోరం గౌరవ అధ్యక్షుడు మంగ రాజన్న, జిల్లా అధ్యక్షుడు తాటిపాముల రమేశ్, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి రవి, ఉపాధ్యక్షులు సాంబమూర్తి, ఉప్పల సతీశ్, అన్న సాంబయ్య, చిట్టిబోతుల సంపత్ , హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
అనాథలు.. ఆగని కన్నీటి ధారలు
దుగ్గొండి: నిరుపేద కుటుంబం.. ఉన్నదాంట్లో కష్టపడి ఇద్దరు కుమార్తెలను చక్కగా చదివిస్తున్నారు. ఇంతలోనే క్యాన్సర్ వారి పాలిట శాపమైంది. ఆ మహమ్మారి దంపతులను పొట్టనపెట్టుకుంది. ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఇప్పుడు వారి చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిర్ర రాజు–కవిత దంపతులది నిరుపేద కుటుంబం. ఇల్లు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం కవిత క్యాన్సర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. రాజు కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు శ్రుతి, సౌమ్య దిక్కులేని వారయ్యారు. గ్రామస్తుల సహకారంతో తండ్రికి అంత్యక్రియలు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రుతి బీటెక్, సౌమ్య పదో తరగతి చదువుతోంది. తమకు తల్లిదండ్రులు దూరమయ్యారు, చదువు ఎలా కొనసాగించాలో తెలియడం లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలో 44 మందికి క్యాన్సర్.. దుగ్గొండి మండలంలోని 34 గ్రామ పంచాయతీల పరిధిలో 44 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 2023లో నలుగురు, 2024లో ముగ్గురు, 2025లో ముగ్గురు, 2026లో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. బాధితులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదిస్తే ఉచితంగా పరీక్షలతో పాటు మందులు అందిస్తామని, తొలిదశ నుంచే మందులు వాడితే ప్రాణాపాయం ఉండదని మండల వైద్యాధికారి కిరణ్రాజు తెలిపారు. కన్నవారిని కాటేసిన క్యాన్సర్ మహమ్మారి 15 ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి కన్నీటిపర్యంతమవుతున్న ఇద్దరు కుమార్తెలు చదువు ఎలా కొనసాగించాలని ఆందోళన -
‘ఎస్ఐఆర్’పై అవగాహన ఉండాలి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య దామెర: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని దుర్గంపేట సమీపంలోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నియోజకవర్గ స్ధాయి కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడో దశలో భాగంగా జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ బృందం పర్యటించి ఓటరు నమోదు, జాబితా సవరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఏజెంట్లకు సూచించారు. ఈసీఐ, బీజేపీ కుమ్మకై ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని వెల్ల డించారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల హక్కులు కాపాడడం ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అయూబ్, దామెర, ఆత్మకూరు మండలాల అధ్యక్షులు దుబాసి రాజేందర్, రేవూరి జలందర్ రెడ్డి, నాయకులు సుధాకరరెడ్డి, రాజిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్లు బొంకూరి రవియాదవ్, పొలెపాక శ్రీనివాస్, దాసి శ్రీకాంత్, నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ మార్కెట్కు వరుస సెలవులు
ఖిలా వరంగల్: రోహిణి కార్తెలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రైతులు, వ్యాపారులు, గమస్తాలు, దడువాయి, కార్మికులు వడదెబ్బకు గురవకుండా జూన్ 1 నుంచి 7 వరకు సెలవు దినాలుగా ప్రకటించాలని మార్కెట్ కార్మిక సంఘాలు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యవర్గం ప్రతినిధులు కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు వరుస సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న తిరిగి మార్కెట్ యార్డు పునఃప్రారంభం కానుందని స్పష్టం చేశారు. రైతులు తమ సరుకులను సెలవు రోజుల్లో మార్కెట్కు తీసుకురావొద్దని కోరారు. -
‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ !
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత విద్యాసంవత్సరంలో ప్రీప్రైమరీ తరగతులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించుకునేలా గది ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఒక్కో తరగతికి రూ.లక్ష నిధులు హనుమకొండ జిల్లాలో 39, వరంగల్ జిల్లాలో 48 స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్రీ ప్రైమరీ సెక్షన్కు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. చిన్నారులను ఆకర్షించేలా తరగతిగది గోడలపై అక్షరాలు, సంఖ్యలు, వివిధ చిత్రాలు పేయింటింగ్ చేయించనున్నారు. ఆటలతో కూడిన విద్యనందించేందుకు ఆటవస్తువులను కూడా అందిస్తారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రతీ ప్రైమరీ సెక్షన్కు ఒక ఇన్స్ట్రక్టర్ను ఒక ఆయా చొప్పున నియమిస్తారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. అంగన్వాడీ స్కూళ్లకు సమీపంలో ఉండేవారికి అదనంగా స్నాక్స్ కూడా అందించనున్నారు. ఎస్సీఆర్టీఈ పాఠ్యప్రణాళిక ఆధారంగా వారికి విద్యను అందిస్తారు. హనుమకొండలో 39, వరంగల్లో 48 స్కూళ్లలో సెక్షన్ల ఏర్పాటు ఒక్కో ప్రీప్రైమరీకి రూ.లక్ష నిధులు


