పాకాలలో వలస పక్షులు
ఖానాపురం: మండలంలోని పాకాల అటవీప్రాంతంలో స్వదేశీ, విదేశీ పక్షులను గుర్తించారు. హైదరాబాద్కు చెందిన హైటీకోస్ (హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ)కి చెందిన సమన్వయకర్త వెంకట్, రిటైర్డ్ నావీ కమాండర్ బిష్ణోయ్లు పాకాలకు బర్డ్వాచ్కు రెండు రోజుల క్రితం వచ్చారు. రెండు రోజుల పాటు పాకాల అటవీప్రాంతంలో బర్డ్వాచ్ చేస్తూ పలు రకాల పక్షులను గుర్తించారు. పాకాలలో ప్రస్తుతం 70 రకాల స్వదేశీతో పాటు 20 రకాల విదేశీ పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలపారు.
పాకాలలో గుర్తించిన
విదేశీ నార్తర్న్ పింటేయిల్స్
పాకాలలో వలస పక్షులు


