Warangal District News
-
దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం
హన్మకొండ : దేశ ఐక్యతకు రాజ్యాంగమే బలమైన ఆధారమని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ అన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో అంబేడ్కర్ పాత్ర అనిర్వచనీయమన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్, అతిథులు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండీ రియాజ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ రవి, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బలపర్చేందుకు ఓటు హక్కు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీడబ్ల్యూఓ విశ్వజ, హౌసింగ్ పీడీ సిద్ధార్థనాయక్, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ బండారి సురేందర్, నాయకులు మంద కుమార్, పుట్ట రవి, అంకేశ్వరపు రామచంద్రరావు, చుంచు రాజేందర్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు అందరికీ ఆదర్శం కాశిబుగ్గ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాశి బుగ్గ సెంటర్లోని విగ్రహానికి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలు ప్రతీ ఒక్కరికి మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోని ‘ఆరైవ్ –అలైవ్’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహనపై కలెక్టర్ సత్యశారద ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్, అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏసీపీ డాక్టర్ శుభంప్రీత్, గజ్జెల రాంకిషన్, జన్ను భాస్కర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ -
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నగర దశ దిశను చూపించే కీలకమైన పట్టణ ప్రణాళిక విభాగానికి సిటీప్లానర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీ ఉంటుంది. అప్పట్లో పూర్తిస్థాయి సిటీప్లానర్ రాజకీయ కారణాలతో హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో డిప్యూటీ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా రెండు డీసీపీ, మూడు ఏసీపీ, టీపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అనుమతి లేని భవనాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతి తీసుకున్నా ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, జంక్షన్ల విస్తరణ అటకెక్కింది. వరంగల్ మహానగర పాలకసంస్థకు కొత్త కమిషనర్తోపాటు కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం ఉంది. ● ఫిర్యాదులు, ఫైళ్లు, అభివృద్ధిని పట్టించుకునే వారే లేరు! ● కార్యాలయాల చుట్టూ నగరవాసుల ప్రదక్షిణ ● మరికొద్ది రోజుల్లో స్పెషల్ ఆఫీసర్ పాలనవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకవైపు పాలకవర్గం పదవి కాలం మరో 22 రోజుల్లో ముగియనుంది. మరోవైపు పూర్తిస్థాయి కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదు. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఇన్చార్జ్ కమిషనర్గా పని చేస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ కీలకవిభాగాల్లో ఇన్చార్జులే కొనసాగుతున్నారు. దీంతో పరిపాలన అదుపు తప్పింది. పాలకవర్గం గడువు ముగిస్తే హనుమకొండ కలెక్టర్.. బల్దియా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె కలెక్టర్గా, ఇన్చార్జ్ కమిషనర్గా, కుడా వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాల్గా మారనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే పెద్ద నగరమైన వరంగల్ సాంస్కృతిక, వారసత్వ, కాకతీయుల రాజధానిగా ఘనకీర్తి చెందింది. భవిష్యత్ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ), ఇన్నర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్పోర్టు, రైల్వే కోచ్ఫ్యాక్టరీ, నగర శివారులో టైక్స్టైల్ పార్కు పనులు ఊపందుకున్నాయి. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోవడం లేదు. సమస్యల సవాళ్లు.. మహా నగర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతుల్లేవు. ప్రతి సోమవారం గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజలు వందల సంఖ్యలో వినతులు అందజేస్తున్నారు. ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో పౌరసేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసస్థాయిలో కూడా జవాబుదారీ తనం కరువైంది. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. సిటిజన్ చార్టర్ ఉద్దేశమే లేదు. బాధ్యత లేని సిబ్బంది ఫిర్యాదులను ఉల్లంఘిస్తే జరిమానా విధించి బాధితులకు అందజేయాలి. ఈ నిబంధన బేఖాతర్ చేస్తున్నారు. ఇంజినీర్లు, టౌన్ప్లానింగ్ అధికారులు చూద్దాం.. చేద్దామంటున్నారు. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వేసవికి సరిపడా నీళ్లున్నా ఇంజనీర్లు ఫిల్టర్ బెడ్ల నిర్వహణపై అశ్రద్ధ చూపెడుతున్నారు. పైపులైన్ల లీకేజీలతో నీరు వృథాగా కాల్వల్లో పారుతోంది. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.వందల కోట్లు వెచ్చించినా ఇంకా మురికివాడలు, విలీన గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లే శరణ్యంగా మారాయి. విద్యుత్ లైట్లు వెలగక కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ క్రమం తప్పింది. 3వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో సుమారు 400 మంది పనులు చేయకుండానే అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లను మేనేజ్ చేసుకుంటూ జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుక్కలు, కోతులు, దోమలతో నిత్యం ప్రజలు పాట్లు పడుతున్నారు. అన్ని విభాగాల్లో పైసలిస్తేనే పనులు ముందుకు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నర నెలలుగా ఎస్ఈ పోస్టు ఖాళీ..నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ఎస్ఈ సత్యనారాయణ రెండున్నర నెలల కిందట పదవి విరమణ చేశారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్కు అదనంగా బల్దియా ఎస్ఈ బాధ్యతలు అప్పగించారు. రూ.వందల కోట్లతో నగరంలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన పెద్ద దిక్కు లేరు. మూడు ఈఈ పోస్టులు, నాలుగు డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు కట్టబెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పనులు చేయలేకుండా పోతున్నారు. అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -
తునికాకు సేకరణకు సిద్ధం!
సాక్షిప్రతినిధి, వరంగల్: తునికాకు సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధరను ఖరారు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 104 యూనిట్ల ద్వారా ఈ బీడి ఆకు సీజన్లో తునికాకుసేకరణ చేయనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాళేశ్వరం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్ సర్కిళ్లలో 104 యూనిట్లు ఏర్పాటు చేసి 1,22,000 స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీలు)లు కొనుగోలు లక్ష్యంగా ప్రకటించారు. అయితే, అటవీశాఖ ఉమ్మడి వరంగల్ (కాళేశ్వరం, భద్రాద్రి సర్కిళ్లు) 14 డివిజన్లల పరిధి ఎనిమిది డివిజన్లలో 77 యూనిట్ల ద్వారా 80,200 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధర నిర్ణయం.. ఈసారి ఆకు సేకరణ చేసిన కూలీలకు స్టాండర్డ్ బ్యాగు (50 ఆకుల కట్టలు వెయ్యి)కు రూ.3,300 చెల్లించనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వుల్లో వెల్ల డించారు. తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) చట్టం, 1971లోని సెక్షన్ 7 ప్రకారం.. సలహా కమిటీతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ ధరలను ఖరారు చేసింది. ఈ లెక్కన ఆకు సేకరణ కోసం రూ.54.90 కోట్లు విడుదల చేశారు. కాళేశ్వరం సర్కిల్ పెద్దపల్లి, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మహదేవపూర్, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్లలో 37 యూనిట్ల ద్వారా 32,900 స్టాండర్డ్ బ్యాగులు కొనుగోలు చేయనున్నారు. భద్రాద్రి సర్కిల్ కేజీఎం భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కేడబ్ల్యూఎస్ కిన్నెరసాని, కొత్తగూడెం, ఇల్లందు అటవీశాఖ డివిజన్లలో 40 యూనిట్లలో 47,300, చార్మినార్ సర్కిల్లో మూడు యూనిట్ల ద్వారా 800 స్టాండర్డ్ బ్యాగుల బీడీ ఆకు సేకరించనున్నట్లు రాష్ట్ర పరిసరాల, అడవుల ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, బీడీ ఆకు సేకరణ వ్యవహారంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీఎల్) ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరించనుంది. సేకరణకు రూ.54.90 కోట్లు తునికాకు సీజన్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ రూ. 54.90 కోట్లు వివిధ విభాగాలకు కేటాయించింది. ఇందులో తునికాకు సేకరణకు స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీ)కి రూ.3,300 చొప్పున రూ.40.26 కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్లో అతిపెద్ద వాటా. నిర్ణీత ధర రూ.3,300 చొప్పున 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ కోసం ఈ నిధులు కేటాయించారు. అదేవిధంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, మానిటరింగ్ పనుల కోసం 12 నెలల కాలానికి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోసం రూ.4.90 కోట్లు, గోదాం రికార్డు కీపర్లు, టీఎంలకు 45 రోజుల కోసం రూ.5 లక్షలు కేటాయించారు. మిగతా రూ.14,54,10,000లు కార్యాలయ, అటవీశాఖ క్వార్టర్ల నిర్వహణ, పోస్టల్, విద్యుత్, మున్సిపల్ పనులు, టెలిఫోన్, వాహనాలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. తగ్గిన యూనిట్లు! ఐదేళ్ల క్రితానికి.. ఇప్పటికీ తునికాకు యూనిట్లు గణనీయంగా తగ్గింది. 309 యూనిట్ల ద్వారా 3,569 కల్లాలు ఏర్పాటు 5,42,70 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ చేసేవారు. నూటికి నూరు శాతం లక్ష్యాలు నెరవేరగా, రాను రానూ 243 యూనిట్లు, 2,41,700 స్టాండర్డ్ బ్యాగులకు పడిపోయింది. ఈ ఏడాది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 104 యూనిట్లు, 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఉమ్మడి వరంగల్లో 8 డివిజన్లలోనే ఆకు సేకరించనున్నారు. ఆకు సేకరణ లక్ష్యాలు తగ్గడం ద్వారా ఉపాధి కూలీలు ఆదాయం, పనిదినాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రూనింగ్ (కొమ్మలు కొట్టె) ఈ నెలాఖరు వరకు ముగియనుండగా, అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించి సుమారు 30–45 రోజుల్లో ఆకు సేకరణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 77 యూనిట్లు.. 80,200 ఎస్బీలు లక్ష్యం వరంగల్ సర్కిల్ లోని 14 డివిజన్లలో సేకరణ స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధర ఖరారు రూ.54.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం -
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి కాళోజీ సెంటర్: ప్రభుత్వం చెల్లింవాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం డి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక తెప్పించుకొని దానిని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి మూలవేతనంలో ఒక శాతాన్ని చందాగా స్వీకరించి హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఏ.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.గోవిందరావు, ఉపాధ్యక్షుడు డి.రవీందర్, కార్యదర్శిలు ఎం.రామస్వామి, టి.సూరయ్య, ఆనంద చారి, నర్సింహులు, జాన్, రామ్రెడ్డి, కొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సూర్యుడు సలసల..తాగి నడిపితే తంటాలే! డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఇక అంతే సంగతులు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు. సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఆరు జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనాలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెండు వడదెబ్బ మరణాలు, అంతకుముందు రెండు ఘటనలు జరగడంతో హైరానా పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంచాలకురాలు దివ్యదేవరాజన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. హడలెత్తిస్తున్న వడదెబ్బ మరణాలు... ● వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గాదం వినయ్ కుమార్ (30) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 8న పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య (55) రోజువారీ కూలీ పనుల్లో భాగంగా పనికి వెళ్లగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. ● హనుమకొండ జిల్లా దర్గా కాజీపేటకు చెందిన ఎండీ అఫ్జల్ (28) ఆదివారం పనికి వెళ్లి వచ్చి రోజులానే నిద్రకు ఉపక్రమించారు. డీహైడ్రేషన్కు గురై వడదెబ్బతో నిద్రలోనే మృతి చెందారు. ఈ నెల 10న భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ గ్రామానికి చెందిన బరిగెల శోభ (45) కోతులనడుమ గ్రామానికి సీడ్ పనులకు వచ్చి ట్రాక్టర్లో తిరిగి వెళ్తున్న క్రమంలో గోపాల్పూర్ వద్ద వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందారు. జాగ్రత్తలు తప్పనిసరి..ఉదయం 10 గంటల్లోపు పనులు పూర్తి చేసుకోవాలి. మళ్లీ సాయంత్రం ఐదు గంటల తర్వాత చేపట్టాలి. తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం, తలకు తెల్లని టోపీ, చెవులలోకి వేడి గాలి వెళ్లకుండా వస్త్రం, రుమాలు కట్టుకోవాలి. గొడుగు వాడితే మంచిది. ద్రవ పదార్థాలు, నీరు, తరచుగా ఓఆర్ఎస్ తీసుకోవాలి. వెంట కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపిన సాధారణ నీటి సీసా ఉంచుకోవాలి. వృద్ధులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీరసంగా ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి నర్సంపేట: నిర్మానుష్యంగా ఉన్న పాకాల–మహబూబాబాద్ రోడ్డు ఇప్పటికే నాలుగు వడదెబ్బ మరణాలు నమోదు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులులక్షణాలు ఇవి.. మొదట దాహంగా ఉంటుంది. పిల్లలైతే విపరీతంగా ఏడుస్తారు. పెద్దలు చికాకు స్వభావం కలిగి ఉంటారు. కళ్లు లోపలికి పోవడం, నోటిలో, నాలుకపై తేమ తగ్గడం, తడారిపోవడం, మూత్రం తగ్గడం, అది తీవ్రమైతే పిల్లలు షాక్లోకి వెళతారు. నాడి తక్కువగా కొట్టుకోవడం, మూర్చ, కలవరింతలు వస్తాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి చెమటపట్టడం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు దాటొచ్చు. -
‘అరైవ్–అలైవ్’ను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికా 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా చేపడుతున్న చర్యల పురోగతిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు కాశిబుగ్గ: వరంగల్లోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు ఆవిష్కరించారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన హన్మకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నేడు (బుధవారం) వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ ఓ సిటీలోని వీధి వ్యాపారులను సన్మానించి వారికి టీ స్టాళ్లు పంపిణీ చేయనున్నారు. 3 గంటలకు గ్రాండ్ గాయత్రి హోటల్లో మీడియా సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు 44వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం నుంచి నారీశక్తి వందన్ అథినియం కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. -
అంబేడ్కర్ అందరికీ ఆదర్శం
కాశిబుగ్గ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాశిబుగ్గ సెంటర్లోని విగ్రహానికి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ య్య మాట్లాడుతూ డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలు ప్రతిఒక్కరికి మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోని ‘ఆరైవ్ అలైవ్’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహనపై కలెక్టర్ సత్యశారద ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఆయుబ్, అదనపు కలెక్టర్లు వైవీ గణేష్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏసీపీ డాక్టర్ ఽశుభం ప్రీత్, గజ్జెల రాంకిషన్, జన్ను భాస్కర్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఘనంగా అంబేడ్కర్ జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సారయ్య, కలెక్టర్ సత్యశారద -
అంబేడ్కర్ భవన నిర్మాణానికి విరాళం
కాశిబుగ్గ: వరంగల్లో అంబేడ్కర్ భవన నిర్మాణానికి టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు రూ.5లక్షల విరాళం ప్రకటించారు. మంగళవారం వరంగల్ కేఎంసీ ఎన్ఆర్ఐ భవనంలో జరిగిన అంబేడ్కర్ జయంతిలో భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.5లక్షల విరాళం ప్రకటించడంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందించారు. ఈ సందర్భంగా శేఖర్రావును శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నాయకులు బిర్రు మహేందర్, మన్నె బాబురావు, చిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎస్ఈగా ఆనందంహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఎ.ఆనందం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో నలుగురు ఎస్ఈలకు స్థానచలనం కల్పిస్తూ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వరంగల్ ఎస్ఈగా పనిచేస్తున్న కె.గౌతంరెడ్డి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ జీఎం (ఓ అండ్ ఎం)గా బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎస్ఈగా పనిచేస్తున్న బేతి భిక్షపతిని ములుగు ఎస్ఈగా బదిలీ చేశారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వేణుమాధవ్ను సిరిసిల్ల ఎస్ఈగా బదిలీ చేశారు. ములుగు ఎస్ఈగా పనిచేస్తున్న ఆనందంను వరంగల్ ఎస్ఈగా బదిలీ చేయడంతో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకాశిబుగ్గ: జిల్లాలోని అగ్నిమాపక కేంద్రంలో ఉన్నతాధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన (డీఎఫ్ఓ) ఎ.యజ్ఞనారాయణ జిల్లా అగ్నిమాపక అధికారిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుంచి బదిలీపై వచ్చిన పి.వినోద్కుమార్ అగ్నిమాపక కేంద్ర అధికారి (ఎస్ఎఫ్ఓ) గా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నతాధికారులను ఆఫీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయంకాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరిక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించడం ప్రశంసనీయమని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. సోమవారం జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదంద్రులను శాలువా, మెమెంటోతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపురం జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీ గ్రూప్లో 989/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు యశ్వంత్, అల్ఫియా ఆనం, జి.పల్లవి, నందినిని ప్రిన్సిపాల్స్ సంపత్కుమార్, శరదృతి తదితరులు ఉన్నారు. వర్ధన్నపేటలో ‘న్యాయభోజ్’వర్ధన్నపేట: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ‘న్యాయభోజ్’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా సహపంక్తి భోజనం మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సహపంక్తి భోజనం ఏర్పాటు చేశామన్నారు. -
గ్రేటర్కు దిక్కెవరు
సిటీప్లానర్ లేక ఏడాదిన్నర.. నగర దశ దిశను చూపించే కీలకపై పట్టణ ప్రణాళిక విభాగానికి సిటీప్లానర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీ ఉంటుంది. అప్పట్లో పూర్తిస్థాయి సిటీప్లానర్ రాజకీయ కారణాలతో హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో డిప్యూటీ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా రెండు డీసీపీ, మూడు ఏసీపీ, టీపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అనుమతి లేని భవనాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతి తీసుకున్నా ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, జంక్షన్ల విస్తరణ అటకెక్కింది. వరంగల్ మహానగర పాలకసంస్థకు కొత్త కమిషనర్తోపాటు కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం ఉంది.వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకవైపు పాలకవర్గం పదవి కాలం మరో 22 రోజుల్లో ముగియనుంది. మరోవైపు పూర్తిస్థాయి కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇన్చార్జ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేక ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్ కీలకవిభాగాల్లో ఇన్చార్జులు కొనసాగుతున్నారు. దీంతో పరిపాలన అదుపు తప్పింది. పాలకవర్గం గడువు ముగిస్తే హనుమకొండ కలెక్టర్ బల్దియా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె కలెక్టర్గా, ఇన్చార్జ్ కమిషనర్గా, కుడా వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాల్ మారనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే పెద్ద నగరమైన వరంగల్ సాంస్కృతిక, వారసత్వ, కాకతీయుల రాజధానిగా ఘనకీర్తి చెందింది. భవిష్యత్ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ), ఇన్నర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్పోర్టు, రైల్వే కోచ్ఫ్యాక్టరీ, నగర శివారులో టైక్స్టైల్ పార్కు పనులు ఊపందుకున్నాయి. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోవడం లేదు. సమస్యల సవాళ్లు.. మహా నగర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతుల్లేవు. ప్రతి సోమవారం గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజలు వందల సంఖ్యలో వినతులు అందజేస్తున్నారు. ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో పౌరసేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసస్థాయిలో కూడా జవాబుదారీ తనం కరువైంది. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. సిటిజన్ చార్టర్ ఉద్దేశమే లేదు. బాధ్యత లేని సిబ్బంది ఫిర్యాదులను ఉల్లంఘిస్తే జరిమానా విధించి బాధితులకు అందచేయాలి. ఈ నిబంధన బేఖాతారు చేస్తున్నారు. ఇంజినీర్లు, టౌన్ప్లానింగ్ అధికారులు చూద్దాం.. చేద్దామంటున్నారు. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వేసవికి సరిపడా నీళ్లున్నా ఇంజనీర్లు ఫిల్టర్బెడ్ల నిర్వహణపై అశ్రద్ధ చూపెడుతున్నారు. పైపులైన్ల లీకేజీలు నీరు వృథాగా కాల్వల పాలవుతోంది. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.వందల కోట్లు వెచ్చించినా ఇంకా మురికివాడలు, విలీన గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లే శరణ్యమంగా మారాయి. విద్యుత్ లైట్లు వెలగక కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ క్రమం తప్పింది. 3వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో సుమారు 400 మంది పనులు చేయకుండానే అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లను మేనేజ్ చేసుకుంటూ జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో పైసలిస్తేనే పనులు ముందుకు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నర నెలలుగా ఎస్ఈ పోస్టు ఖాళీ.. నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ఎస్ఈ సత్యనారాయణ రెండున్నర నెలల కిందట పదవి విరమణ చేశారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్కు అదనంగా బల్దియా ఎస్ఈ బాధ్యతలు అప్పగించారు. రూ.వందల కోట్లతో నగరంలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన పెద్ద దిక్కు లేరు. మూడు ఈఈ పోస్టులు, నాలుగు డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు కట్టబెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పనులు చేయలేకుండా పోతున్నారు. అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కీలకమైన కమిషనర్, ఎస్ఈ, సిటీప్లానర్ పోస్టులు ఖాళీ ఫిర్యాదులు, ఫైళ్లు, అభివృద్ధిని పట్టించుకునే వారు కరువు కార్యాలయాల చుట్టూ నగర ప్రజల ప్రదక్షిణ మరికొద్ది రోజుల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన -
ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం
వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించడం ప్రశంసనీయమని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో సోమవారం సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపురం జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీలో 989/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు యశ్వంత్, అల్ఫియా ఆనం, జి.పల్లవి, నందిని ని ప్రిన్సిపాల్స్ సంపత్కుమార్, శరదృతి ఉన్నారు. -
ప్రణాళికాబద్ధంగా ‘అరైవ్–అలైవ్’ నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు షురూ.. కాశిబుగ్గ : వరంగల్లోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆవిష్కరించారు. -
ఆర్టిజన్ల సమ్మెతో సర్కారుకు షాక్
హన్మకొండ : కరెంటోళ్ల సమ్మెతో కాంగ్రెస్ సర్కార్కు షాక్ తప్పదని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ములుగు రోడ్డులోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె శిబిరాన్ని రాకేశ్రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టి అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొమ్మిది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులది కీలక పాత్ర అని కొనియాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి ఫలాలు ఉద్యోగులకు అందాలని చరిత్రలో ఎక్కడ లేని విధంగా అప్పటి సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ అన్న మాటే ఉండకూడదన్న సంకల్పంతో కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి, వారికో గుర్తింపునిచ్చారని తెలిపారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులను 23 వేల మందిని ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని దుయ్యబట్టారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో వర్తింపజేస్తున్న సర్వీస్ రూ ల్స్ వీరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఉద్యోగులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమ్మె శిబిరానికి రావాలి బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి -
పేరుకుపోతున్న మొక్కజొన్న
● మార్కెట్కు పోటెత్తుతున్న వాహనాలు ● ఆవరణలో స్థలం లేక గేటుకు తాళం ● అధికారులతో రైతుల వాగ్వాదంనర్సంపేట: మక్క రైతుకు తిప్పలు తప్పడం లేదు. మార్కెట్లో మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్తామంటే వెళ్లలేని దుస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో చాలామంది రైతులు ఉన్నారు. జిల్లాలో 2025 –26వ సంవత్సరంలో 46వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేయగా, లక్షా 38వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లా పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కొంత ఉపశమనం లభించగా, జిల్లాలో మిగతా చోట్ల మక్క రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొనుగోళ్లలో ఆలస్యం ఏనుగల్, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్లలో మక్కలు పేరుకుపోయాయి. మక్కలకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2400 ప్రకటించడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1600ల నుంచి రూ.1900ల వరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తుండడంతో మార్కెట్లోనే అమ్ముకోవడం కోసం రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు ఆలస్యం కావడం.. మక్కలు మార్కెట్కు భారీగా తరలిరావడంతో మార్కెట్కు మక్కలు తీసుకురావద్దని బహిరంగంగానే అధికారులు ప్రకటన చేస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో భారీగా పేరుకుపోయాయని, ఈ క మ్రంలో మార్కెట్కు మక్కలు తీసుకురావద్దని అధికారులు శనివారం పత్రికా పరంగా వెల్లడించారు. అయినప్పటికీ మక్కలను రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్ సిబ్బంది గేటుమూసి వేసి మక్కలకు నో ఎంట్రీ అనడంతో రవాణా చార్జీలు మీద పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ జిల్లావ్యాప్తంగా మక్కలను తాజాగా మార్క్ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో రైతులను ప్రైవేట్ వ్యాపారులు నిలువు దోపడీ చేస్తున్నారు. క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,800 మాత్రమే వెచ్చిస్తుండడంతో ఒక్కో రైతు రూ.700 నుంచి రూ.900 వరకు నష్టపోతున్నాడు. ఎకరాకు పెట్టుబడి ఖర్చు సుమారుగా రూ.28వేల నుంచి రూ.40వేల పెట్టుబడి పెట్టామని, తక్కువ ధరకు అమ్ముకుంటే గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం మద్దతు ధరకు వెనువెంటనే కొనుగోలు చేసేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.మక్క రైతుల ఆందోళన నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాటు చేసిన సెంటర్లో మక్కలు కొనుగోలు చేయాలని రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్లో భారీగా నిల్వఉన్న మక్కలను కొనుగోలు చేసే వరకు ఇతర మక్కలను తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ప్రకటన చేసినప్పటికీ గత రెండు రోజులుగా నర్సంపేట మార్కెట్కు పంట ఉత్పత్తులను రైతులు తీసుకువస్తున్నారు. దీంతో మార్క్ఫెడ్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగి వాగ్వాదానికి దిగారు. మక్కల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. -
గుట్కాపై గురి పెట్టాల్సిందే
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడిన వారు ఎంత ధరైనా కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఉన్నంత పోలీసు నిఘా ఇప్పుడు లేకపోవడం, ఒకవేళ దారితప్పి ఈ కేసుల్లో ఇరుక్కున్నా గరిష్టంగా ఆరు నెలల జైలు, లేదంటే రూ.లక్ష జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండూ అమలైనా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తక్కువ పెట్టుబడితో వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. నిఘా కరువు.. తగ్గుతున్న కేసుల సంఖ్య ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2024 సంవత్సరంలో 342 కేసులు నమోదు చేసిన పోలీసులు.. 2025లో 463 కేసులతో నిఘా ఉధృతం చేశారు. 2026 మార్చి ముగిసే నాటికి కేవలం 21 కేసులు మాత్రమే నమోదవడం చూస్తే గుట్కా నిల్వలు, అక్రమ రవాణాపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలొస్తున్నాయి. రాజకీయంగా ఈ వ్యాపారానికి అండదండలు ఉండడంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని కొంత పోలీసులు చిన్నచిన్న పాన్షాప్లు, దుకాణాలపై దాడులు చేసి మమ అనిపిస్తున్నారు. ఇటీవల మిల్స్ కాలనీ, హనుమకొండ పోలీసు స్టేషన్ల పరిధిలో గుట్కా విక్రయదారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కీలకంగా ఉండే డీలర్లు, హోల్సేల్ షాప్ యజమానులపై చూసీచూడనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ఆగమాగం చేసే ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల కఠినంగా ఉండాలన్న డిమాండ్ వస్తోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో సరుకు నిల్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు వరంగల్ కేంద్రంగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే పిన్నావారి వీధి, రామన్నపేట, ఎస్ఆర్ఆర్ తోట, నగర శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో సరుకును నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకొని పక్కా ప్రణాళికతో విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంబర్, పాన్బార్, విమల్, ఆర్ఆర్, రజినిగంథ్, మీరజ్, అనార్ వంటి గుట్కా నిల్వలను వరంగల్ పిన్నావారి స్ట్రీట్లోని హోల్సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యమనే చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా కేంద్రంగా జోరుగా దందా నామమాత్రంగా దాడులతో పోలీసుల సరి ఫలితంగా పల్లెల్లోకి పాకిన వ్యాపారం ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ పకడ్బందీగా పొగాకు ఉత్పత్తుల సరఫరాసంవత్సరం కేసులు అరైస్తెన సొత్తు వారు స్వాధీనం2024 342 365 రూ.కోటి 44 లక్షలు 2025 463 487 రూ.72 లక్షలు 2026 21 16 రూ.12 లక్షలువరంగల్ గుట్కా డాన్లు రేట్ ఫిక్స్ చేస్తే అదే ఫైనల్. పొగాకు ఉత్పత్తులకు ఎమ్మార్పీ రేటుకు రెండింతలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఎవరైనా వారి వద్ద సరుకు తీసుకోకుంటే వారే పోలీసులకు పట్టిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యాపారులు, డీలర్లు వారి వద్దనే సరుకు తీసుకుంటారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఉమ్మడి కరీంగనర్లోని పలు ప్రాంతాల్లో గుట్కా డాన్ల వ్యాపార సామ్రాజ్యం విస్తరించించినట్లు తెలుస్తోంది. కోల్బెల్ట్లో అధిక శాతం వ్యాపారం జరుగుతుండడంతో గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైన ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. పకడ్బందీగా దుకాణాలకు సరుకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. -
సాదాబైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తుల పరిశీలించే పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై ‘పిల్’దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’ నిబంధనల సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం.. జిల్లా పెండింగ్ హనుమకొండ 27,057 వరంగల్ 26,630 ములుగు 20,150 జేఎస్ భూపాలపల్లి 51,347 జనగామ 33,305 మహబూబాబాద్ 31,250 మొత్తం 1,89,739 -
గుట్కాపై గురి పెట్టాల్సిందే
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడిన వారు ఎంత ధరైనా కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఉన్నంత పోలీసు నిఘా ఇప్పుడు లేకపోవడం, ఒకవేళ దారితప్పి ఈ కేసుల్లో ఇరుక్కున్నా గరిష్టంగా ఆరు నెలల జైలు, లేదంటే రూ.లక్ష జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండూ అమలైనా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తక్కువ పెట్టుబడితో వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. నిఘా కరువు.. తగ్గుతున్న కేసుల సంఖ్య ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2024 సంవత్సరంలో 342 కేసులు నమోదు చేసిన పోలీసులు.. 2025లో 463 కేసులతో నిఘా ఉధృతం చేశారు. 2026 మార్చి ముగిసే నాటికి కేవలం 21 కేసులు మాత్రమే నమోదవడం చూస్తే గుట్కా నిల్వలు, అక్రమ రవాణాపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలొస్తున్నాయి. రాజకీయంగా ఈ వ్యాపారానికి అండదండలు ఉండడంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని కొంత పోలీసులు చిన్నచిన్న పాన్షాప్లు, దుకాణాలపై దాడులు చేసి మమ అనిపిస్తున్నారు. ఇటీవల మిల్స్ కాలనీ, హనుమకొండ పోలీసు స్టేషన్ల పరిధిలో గుట్కా విక్రయదారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కీలకంగా ఉండే డీలర్లు, హోల్సేల్ షాప్ యజమానులపై చూసీచూడనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ఆగమాగం చేసే ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల కఠినంగా ఉండాలన్న డిమాండ్ వస్తోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో సరుకు నిల్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు వరంగల్ కేంద్రంగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే పిన్నావారి వీధి, రామన్నపేట, ఎస్ఆర్ఆర్ తోట, నగర శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో సరుకును నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకొని పక్కా ప్రణాళికతో విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంబర్, పాన్బార్, విమల్, ఆర్ఆర్, రజినిగంథ్, మీరజ్, అనార్ వంటి గుట్కా నిల్వలను వరంగల్ పిన్నావారి స్ట్రీట్లోని హోల్సేల్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యమనే చర్చ జరుగుతోంది. వీరు ఫిక్స్ చేసిందే ఫైనల్ రేటు వరంగల్ గుట్కా డాన్లు రేట్ ఫిక్స్ చేస్తే అదే ఫైనల్. పొగాకు ఉత్పత్తులకు ఎమ్మార్పీ రేటుకు రెండింతలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఎవరైనా వారి వద్ద సరుకు తీసుకోకుంటే వారే పోలీసులకు పట్టిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యాపారులు, డీలర్లు వారి వద్దనే సరుకు తీసుకుంటారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఉమ్మడి కరీంగనర్లోని పలు ప్రాంతాల్లో గుట్కా డాన్ల వ్యాపార సామ్రాజ్యం విస్తరించించినట్లు తెలుస్తోంది. కోల్బెల్ట్లో అధిక శాతం వ్యాపారం జరుగుతుండడంతో గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైన ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. పకడ్బందీగా దుకాణాలకు సరుకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.వరంగల్ జిల్లా కేంద్రంగా జోరుగా దందా నామమాత్రంగా దాడులతో పోలీసుల సరి ఫలితంగా పల్లెల్లోకి పాకిన వ్యాపారం ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ పకడ్బందీగా పొగాకు ఉత్పత్తుల సరఫరాసంవత్సరం కేసులు అరైస్తెన సొత్తు వారు స్వాధీనం2024 342 365 రూ.కోటి 44 లక్షలు 2025 463 487 రూ.72 లక్షలు 2026 21 16 రూ.12 లక్షలు -
ఆస్పత్రి స్థలానికి హద్దులు నిర్ధారించాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట: పట్టణంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ స్థలానికి త్వరితగతిన హద్దులు ఏర్పాటు చేసి మ్యాపింగ్ చేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆదేశించారు. పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని సోమవారం సందర్శించి పరిశీలించారు. స్థలం ఎంత ఉందని అధికారులను అడుగగా, మూడు సర్వే నంబర్లలో ఐదెకరాలు ఉందని వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన ఈ భూమి పూజారుల ఆధీనంలో ఉందని, అందుకు బదులుగా వారికి గువ్వలబోడు వద్ద స్థలం కేటాయిస్తామని చెప్పారు. అత్యాధునిక వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్పర్సన్ షీబారాణి, మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్కుమార్, కౌన్సిలర్లు పాపారావు, కమిలీ, దేవేందర్, వాణి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూల్ల రవి, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పోశాల వెంకన్న, రామకృష్ణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
వరంగల్ అర్బన్ : మహా నగర ప్రజలు చెబుతూ, రాతపూర్వకంగా అందజేసిన సమస్యలకు జవాబు దారీగా ఉండాలని బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వింగ్ అధికారులతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆక్రమణలు, అతిక్రమణలపై 40 వినతులు అధికంగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ సెక్షన్కు 20, రెవెన్యూ విభాగానికి 7, ప్రజారోగ్యం, శానిటేషన్కు 8, నీటి సరఫరాకు 5, హర్టికల్చర్కు 1 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లా నర్ రవీందర్ వాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నా రాణి, ఎంహెచ్ఓ రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఎఫ్ ఓ శంకర్ లింగం, వెటర్నరీ వైద్యులు డా.గోపాల్ రావు, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. కొన్ని ఫిర్యాదులు ఇలా.. ● వరంగల్లోని 11–18–3/2 ఇంటినంబర్కు 2021లో మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇచ్చినా నీళ్లు రాలేదని, గతనెల మరోసారి నల్లా కనెక్షన్ ఇచ్చి సిబ్బంది రూ.6వేలు వసూలు చేసినట్లు రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ● 48వ డివిజన్ సిద్ధివినాయక కాలనీ రోడ్డు 2లో రోడ్డు, డ్రెయినేజీ అధ్వానంగా ఉందని, నూతనంగా నిర్మించాలని గుజా సోమేశ్వర్రావు, ప్రణతి, విజయ్కుమార్లు కోరారు. ● చింతల్ 16–11–371/1ఇంటినంబర్లో నల్లా కనెక్షన్ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారని, తొలగించాలని మహ్మద్ రాజీయోద్దీన్ విజ్ఞప్తి చేశారు. ● శివనగర్ 24 ఫీట్ల రోడ్డు, డ్రెయినేజీపై అక్రమ నిర్మాణం చేపట్టి తప్పడు పత్రాలతో ఇంటినంబర్ తీసుకున్నారని, రద్దు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 14వ డివిజన్ సుందరయ్య నగర్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు వినతిపత్రం సమర్పించారు. ● ఫోర్టు రోడ్డులోని శ్రీరాంనగర్లో సీసీరోడ్డు, డ్రె యినేజీ, లైటింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు విన్నవించారు. ● 37, 38వ డివిజన్లలో డ్రెయినేజీ నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్లోని 19–12–23/ఎ/3లో ఇంటికి 3 నల్లా కనెక్షన్లు, 1వ డివిజన్ 52–3–154 ఇంటికి రెండు బిల్లులు వస్తున్నాయని, రద్దు చేయాలని కృష్ణమూర్తి , ప్రసాద్లు వేర్వేరుగా కోరారు. ● పెద్దమ్మగడ్డ పీఈఎస్ జూనియన్ కాలేజీ వద్ద వరద, మురుగు నీరు స్తంభిస్తుందని, డ్రెయినేజీ నిర్మించాలని థానా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ● కడిపికొండలో రోడ్డు ఆక్రమిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ 9వ డివిజన్ కాకతీయ కాలనీలో డ్రెయినేజీ నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు వివరించారు. ● 1వ డివిజన్ ముచ్చర్ల నాగారంలో డ్రెయినేజీ ని ర్మించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదని ఎ.ప్రసాద్ వినతి అందజేశారు. ● బాలసముద్రం ఏకశిల పార్కు దగ్గర పెద్ద ఇనుప డబ్బాను ఏర్పాటు చేశారని, ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గ్రేటర్ గ్రీవెన్స్కు 85 ఫిర్యాదులు -
ఉపేందర్ ఆస్పత్రి సీజ్
నెక్కొండ: గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రిలో ఇన్ పేషంట్లు, అవుట్ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తూ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆరోపణలతో ఉపేందర్ ఆస్పత్రిని సీజ్ చేశామని నర్సంపేట డిఫ్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఉపేందర్ ఆస్పత్రిని వైద్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆస్పత్రి నిర్వహించడంపై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయిందని తెలిపారు. ఇటీవల లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేసినట్లు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో వెలుగులోకి రావడంతో ఐనవోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్కుమార్, నెక్కొండ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రహేలాతన్వీర్, డిఫ్యూటీ డెమో అనిల్కుమార్, ఎస్ఓ విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబు ల్ రమేష్, హోంగార్డ్ సురేందర్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి
● యూనియన్ జనరల్ సెక్రటరీ మన్నె శశికుమార్ కాజీపేట అర్బన్ : న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగిన ఆర్టిజన్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మన్నె శశికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు సోమవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పకుండా వస్తుందని సూచించారు. కార్యక్రమంలో 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, కార్మికులు పాల్గొన్నారు. -
చిక్కులకు చెక్!
సాదా బైనామా‘అఫిడవిట్’ నిబంధనల సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలుఈ ఫొటోలోని రైతు పేరు జేరుపోతుల విజయ్ కుమార్. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామం. ఈయనకు మొత్తం నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. కాస్తులో ఉన్నా.. విజయ్కుమార్ తాతకు పట్టా కాలేదు. తండ్రికి అందులోనుంచి అర ఎకరం మాత్రమే పట్టా కాగా.. నాలుగు ఎకరాల కోసం సాదాబైనామానుంచి పట్టా కోసం ఐదున్నరేళ్లలో రెండు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం భూ భారతిలో కూడా దరఖాస్తు చేశాడు. అధికారుల ఇప్పటివరకు పట్టా గురించి ఎలాంటి సమాచారం రాలేదని, ఇప్పటికై నా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలిగించాలని రైతు విజయ్కుమార్ కోరుతున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. -
ప్రజావాణికి 168 అర్జీలు
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 168 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ప్రజావాణికి 166 అర్జీలు న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో జూమ్ కాల్లో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 166 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు 74, జీడబ్ల్యూఎంసీ 25, ఇతర శాఖలకు చెందిన 67 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ రెఫరీగా ఇర్ఫాన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ బాస్కెట్బాల్ రెఫరీగా కాజీపేటలోని బాపూజీనగర్ కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అర్హత సాధించాడు. ఈ మేరకు ఆయనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరక్టర్ గుగులోత్ అశోక్కుమార్ సోమవారం శాలువాతో సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెల్బాల్ అసోసియేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఆన్లైన్లో నిర్వహించిన రెఫరీ పరీక్షలో ఇర్ఫాన్ ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్ను బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ చైర్మన్ నార్మన్ ఐజాక్ మెయిల్ ద్వారా జారీ చేసినట్లు ఇర్ఫాన్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాస్కెట్బాల్ అంతర్జాతీయ రెఫరీగా సాధించిన మొదటి వ్యక్తి ఇర్ఫాన్ కావడం విశేషం. కార్యక్రమంలో బాస్కెల్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి రాజు, కార్యదర్శి డోలి సాంబయ్య, డీఎస్ఏ రెజ్లింగ్ కోచ్ రాజు ఉన్నారు. హనుమకొండ డీఐఈఓ గోపాల్ విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చునని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. సంబంధిత కళాశాలల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని, యాజమాన్యాలు కళాశాలల సమీకృత బోర్డుకు ఫీజులను ఆన్లైన్ద్వారా చెల్లించాల్సింటుందని వివరించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వతేదీ నుంచి నిర్వహిస్తారని తెలిపారు. కేయూ క్యాంపస్: మహారాష్ట్రలోని ఎంజీఎం యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 18వరకు జరగనున్న సౌత్జోన్ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొంటుందని యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. జట్టులో ఎండీహబీబుద్దీన్, ఎన్.రాకేష్, పి.మోహన్లాల్, ఎండీ రియాజ్, ఎండీ జసీమ్పాషా, జె.సంజీవ్ ఉన్నారు. యూసీపీఈ కేయూ ఫిజికల్ డైరెక్టర్ ఎం.అన్వేష్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాకేంద్రంలోని ఫాతిమా హైస్కూల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యూంకనం కొనసాగుతోంది. మొదటి దశలోని సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా ప్రస్తుతం రెండో దశలో ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ జవాబుపత్రాలను దిద్దుతున్నారు. ఈనెల 17నుంచి మూడవ దశలో సోషల్ స్టడీస్ జవాబుపత్రాలు మూల్యాంకనం ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగనుంది. హన్మకొండ కల్చరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మార్కశంకర్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలోని డబ్బాలు హనుమాన్నగర్ ఫేస్–1 కాలనీలోని కాదంబరి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించే కవి సమ్మేళనంలో కవులు, సాహితీవేత్తలు పాల్గొనాలని కోరారు. నేడు ఆశాభోంస్లే సంతాప సభ హనుమకొండలోని శ్రీసాయిమీరా కళామందిరంలో వరల్డ్ పీస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే సంతాపసభ నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. సభకు కవులు, కళాకారులు, గాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తరలిరావాలని, ఆశాభోంస్లేకు నివాళులు అర్పించి ఆమె జ్ఞాపకాలను స్మరించుకోవాలని కోరారు. -
సురక్షిత ప్రయాణమే శ్రేయస్కరం
ఎల్కతుర్తి: సురక్షిత ప్రయాణమే ప్రతీ ఒక్కరికి శ్రేయస్కరమని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ద్విచక్రవాహనాదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. ముఖ్యంగా యువత ద్విచక్రవాహనం నడిపేటప్పుడు ర్యాష్గా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్లాలన్నారు. అతివేగంతో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం వాహనాదారులకు హెల్మెట్ లేకపోతే గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామస్తులు తీర్మానం చేశారు. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పలువురు వాహనాదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ పులి రమేష్, ఎస్సైలు ప్రవీణ్కుమార్, రాజు, సుధాకర్రెడ్డి, చేరాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, గ్రామ సర్పంచ్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
బాలికలదే హవా
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026వరంగల్ అర్బన్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అత్యంత కీలకమని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రేటర్ కౌన్సిల్ హాల్లో ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ప్రారంభించారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, ఫీనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అవినాష్, శంకర కంటి ఆస్పత్రి మేనేజర్ బాలరాజు, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ 69.16 శాతం సెకండియర్ 78.57 శాతం ఉత్తీర్ణత వరంగల్ జిల్లాలో ఫస్టియర్ 52.81 శాతం సెకండియర్ 60.80 శాతం ఉత్తీర్ణత మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు -
బాలికలదే హవా
● ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 52.81 శాతం ● సెకండ్ ఇయర్లో 60.80శాతం ఉత్తీర్ణత ● మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుకాళోజీ సెంటర్: ఫిబ్రవరి మాసంలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు ఆదివారం విడదల చేశారు. ఈ మేరకు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,678 మందికి 2,844 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాఽధించి 60.80 శాతంలో నిలిచారు. ఇందులో బాలురు 1,824 మందికి 776 మంది పాసయ్యారు. బాలికలు 2,851 మందికి 2,068 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో మొత్తం 737 మందికి 545 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 251 మందికి 142 మంది, బాలికలు 486 మందికి 403 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరంలో మొ త్తం 5,211 మందికి 2,752 మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 2,133 మందికి 726 మంది విద్యార్థులు, బాలికలు 3,078 మందికి 2,026 మంది ఉత్తీర్ణులు కాగా 52.81 శాతంలో నిలిచారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 793 మందికి 428 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 269 మందికి 83 మంది, బాలికలు 524 మందికి గాను 345 మంది ఉత్తీర్ణత (53.97 శాతం) సాధించారు. 20వ తేదీ వరకు రీ కౌంటింగ్ ఇంటర్ వార్షిక ఫలితాల్లో ఏమైన అభ్యంతరాలు ఉంటే రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు ఈనెల 13 నుంచి 20వ వరకు టీజీబీఐఈ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్కు ప్రతీ సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీ వెరిఫికేషన్, స్కాన్ కాపీ కోసం ప్రతీ సబ్జెక్టుకు రూ.800 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం కానున్నాయి. – డాక్టర్ శ్రీధర్ సుమన్, డీఐఈఓ -
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడ్డింగ్, హెయిర్ కట్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ఫ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈ నెల 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలి బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌస్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించవచ్చు. -
నాలుగో రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్ కో వరంగల్ జోనల్ కార్యాలయం వద్ద, హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జయచందర్, గంగరాజు, శ్రీనివాస్, సతీశ్, రహీం, రాజేశ్, జీవన్, రాజ్ కుమార్, శివ, రమేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ రచించిన ‘బుచ్చిబాబు జీవితం –సాహిత్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. విశ్వనాథ సాహిత్యపీఠం వ్యవస్థాపకుడు వెలిశాల కొండల్రావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత అంపశయ్య నవీన్, తెలుగుభాషా సాంస్కృతికశాఖ అధ్యక్షుడు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, కవులు, రచయితలు దర్బశయనం శ్రీనివాసచార్య, అశోక్కుమార్, నెల్లుట్ల రమాదేవి శశికిరణ్ పాల్గొన్నారు. హన్మకొండ: ఎంజీఎంలో పని చేస్తూ తొలగింపునకు గురైన 12 మంది ల్యాబ్ టెక్నీషియన్లు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఉద్యోగ సంఘం నాయకుడు సతీశ్ తమ సమస్యలు వివరించారు. 24 ఏళ్లుగా పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని వివరించారు. సమస్యలు విన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎంజీఎంలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల తొలగింపు ఈ ప్రభుత్వ మోసపూరిత తనానికి నిదర్శనం అన్నారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. అదేవిధంగా గుణదల లోకో పైలెట్, ట్రైన్ మేనేజర్ల డిపోను మూసేసి వరంగల్లో సెంట్రలైజ్డ్ క్రూ డిపోను ఏర్పాటు చేయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్కు వినయ్భాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్ త్వరలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి చర్చిస్తానని హామీ ఇచ్చారు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
స్టేక్ హోల్డర్లను భాగస్వామ్యం చేయాలి
వరంగల్ అర్బన్: మహా నగరంలో భూగర్భ డ్రెయినేజీ డీపీఆర్, క్షేత్ర స్థాయి పరిశీలనపై స్టేక్ హోల్డ ర్లను భాగస్వామ్యం చేస్తూ, అభిప్రాయాలు స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. గత రెండు రోజులుగా జర్మనీకి చెందిన కన్సల్టెన్సీ బృందం ప్రతినిధులు నగరంలో క్షేత్రస్థాయిలో భూగర్భ డ్రెయినేజీపై సేకరించిన అభిప్రాయాలు, నివేదికపై ఇంజనీర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రాథమిక నివేదికపై సమాలోచనలు చేశారు. నగరంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించాలని కోరారు. సమావేశంలో జర్మనీ ప్రతినిధుల బృందం సభ్యులు డాక్టర్ రావు పరిమల్, ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రావు, ప్రధాన ఆరోగ్య అధికారి రమేశ్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశ్, కార్యనిర్వాహక ఇంజనీర్లు మహేందర్, రవికుమార్, మాధవీలత, సంతోశ్బాబు పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణ బలోపేతంపై అవగాహనహనుమకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ హాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ జె.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్ చాహత్ బాజాపాయ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ జర్మనీ కన్సల్టెన్సీ, ఇంజనీర్లతో సమావేశం -
మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు
వేలేరు: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొనుగొలు కేంద్రాల వద్ద టార్పలిన్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు మంచీనీరు, నీడ, వాచ్మెన్, లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జూలై నాటికి మల్లన్న గండి ఎత్తిపోతల పైప్లైన్ పనులు పూర్తి చేసి చిల్పూరు, వేలేరు మండలాల రైతులకు సాగునీరు అందిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి, డీఎంఎస్సీ మహేందర్, తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, సర్పంచ్లు బిల్లా యాదగిరి, అశోక్, మనోజ్, సాంబయ్య, రాజు, శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆల్ల రేణుక, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, నాయకులు లక్ష్మణ్నాయక్, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, కత్తి సంపత్, శ్రీకర్, రమేశ్, నాగరాజు, రణధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
డీ–అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డీ–అడిక్షన్ సెంటర్ను పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా సెంటర్లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపర్చాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళా అభివృద్ధికి పూలే విశేష కృషి
పూలే విగ్రహం వద్ద మాట్లాడుతున్న ఎంపీ కావ్య, పక్కన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తదితరులురామన్నపేట : జ్యోతిరావుబా పూలే మహిళల అభివృద్ధికి విశేష కృషి చేశారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే జయంతిని పురస్కరించుకుని ములుగు క్రాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎంపీ కావ్యతోపాటు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రెండు జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యమిస్తూ సమాజంలో కొత్త మార్గాలను చూపించిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక కులగణనను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. సేకరించిన డేటాను అసెంబ్లీలో ప్రవేశపట్టడం ద్వారా తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
మహిళలు చేనేతను కాపాడాలి
చేనేత జౌళి శాఖ అదనపు డైరెక్టర్ విజయలక్ష్మి శాయంపేట: మహిళలు సంప్రదాయ వృత్తి అయిన చేనేతను కాపాడుకోవాలని చేనేత జౌళి శాఖ అదనపు డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘంలో నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ సహాయ సోషల్ సర్వీస్ సేవా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.సువిధ చేనేత శిక్షణ పొందిన మహిళలకు శనివారం నాబార్డ్ సహాయ ఎన్జీఓ కార్యదర్శి విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీ విజయలక్ష్మి హాజరయ్యారు. మహిళలు చేనేత రంగాన్ని కాపాడుకుంటూ ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని వినూత్న డిజైన్లతో చీరలు, టవెల్స్ తయారు చేయాలని సూచించారు. అనంతరం నేతన్న భరోసా పథకం కింద వచ్చిన రూ.3లక్షల 25వేల 500 చెక్కును, చేనేత రుణమాఫీ పథకం కింద రూ.9 లక్షల చెక్కును కార్మికులకు అందజేశారు. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎం.సువిధ నాబార్డ్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మండల పరుశురాములు, సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, టెస్కో ప్రతినిధి వెంకటేశ్వర్లు, చేనేత అభివృద్ధి అధికారి సునీత, మాస్టర్ ట్రైనర్లు మురళి, జనార్దన్, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. -
డీ–అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కాశిబుగ్గ: ఎంజీఎం డీ–అడిక్షన్ సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్ను పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర అంగన్వాడీలదేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకోవాలని ఆయన సూచించారు. వర్ధన్నపేటలోని ఎంఎంఆర్ ఫంక్షన్హాలులో మున్సి పల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి 150 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు, 38 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించిందని తెలపారు. చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీస్కూల్స్ ఏర్పాటుచేసి చిన్నారులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్కుమార్, వైస్ చైర్పర్సన్ షీభారాణి రాజేందర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అథ్లెటిక్స్ పోటీలు షురూ.. హనుమకొండలోని జేఎన్ఎస్లో రెండు రోజులపాటు జరగనున్న 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు జాతీయ స్థాయిలో పతకాలు ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
మక్కల కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేత
నర్సంపేట : నర్సంపేట మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యార్డుల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన బస్తాలు సుమారు 50వేల వరకు నిల్వ ఉన్నట్లు, తగినంత స్థలం లేకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12 తర్వాత ప్రకటన వెలువడే వరకు రైతులు మార్కెట్కు మొక్కజొన్నల అమ్మకానికి తీసుకురావొద్దని సూచించారు. 19న ‘మోడల్’ పరీక్ష గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు ప్రవేశాలు పొందగోరే విద్యార్థులకు ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. 6వ తరగతికి సంబంధించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మిగిలిన వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి పర్వతగిరి : హైదరాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాలులో ఈనెల 18న జరిగే రాష్ట్ర స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశాన్ని జయప్రదం చేయాలని వరంగల్ జిల్లా అధ్యక్షుడు చల్ల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం ఓడపల్లి శ్యాంకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సాంబారావు, రాష్ట్ర కార్యదర్శి సోమారపు వీరస్వామి హాజరయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ న్యాయవాది అనుముల రమేష్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరలి రావాలని కోరారు. వరంగల్ పట్టణ మీడియా ఇన్చార్జ్ కందకట్ల మోహన్, హనుమకొండ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మోగుసాల దేవేందర్రెడ్డి, దుప్పటి ప్రకాశ్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు అనపురం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో యువకుడి మృతిగీసుకొండ: మద్యం తాగిన మత్తులో కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతంలోని శాంతినగర్కు చెందిన ఎండీ ఆసిఫ్ (32) మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి గ్రీన్సిటీ రోడ్డు (100 ఫీట్ల రోడ్డు సమీపం)లోని ఖాళీ స్థలంలో కిందపడి అక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న దగ్ధం దుగ్గొండి : ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన మండలంలోని రాజ్యతండా శివారు గోబ్రియా తండాలో శనివారం సాయంత్రం జరిగింది. తండాకు చెందిన అజ్మీరా రవికుమార్ తనకున్న ఎకరంన్నర భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంకులు తీసి చేనులోనే వేశాడు. సాయంత్రం ఇంటినుంచి పొలం వద్దకు రాగా విద్యుత్ తీగలు గాలికి ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. దీంతో చేనుకు నిప్పు అంటుకుంది. మంటలు తీవ్రమై పంటంతా కాలిబూడిద అయింది. తనకు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ఫ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలి బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్హౌస్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
నకిలీ మందులు తయారుచేస్తే చర్యలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ/రామన్నపేట/వరంగల్ చౌరస్తా: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నాణ్యమైన మందులు ఎంతో కీలకమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎవరైనా నకిలీ మందులు తయారు చేసినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యలో మందుల నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై శనివారం వరంగల్ కొత్తవాడలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ మందులపై టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
టీయూఎఫ్ అధికార ప్రతినిధిగా రఘు
గీసుకొండ: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన గుర్రం రఘు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీయూఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రఘు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. కొంతకాలం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఉద్యమకారుల్లో ఐక్యతను పెంపొందిస్తానని పేర్కొన్నారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు
● ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రాయితీలు ● రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ ● జిల్లాలో 1,855 ఎకరాల్లో పంటల సాగుఖానాపురం: కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలు సాగుచేసి ఆర్థికంగా నష్టపోతున్న రైతులను కూరగాయల సాగువైపు వెళ్లేందుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సాగు పద్ధతులు, సబ్సిడీపై అవగాహనతోపాటు శిక్షణ సైతం ఇస్తోంది. వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తింపు పొందిన వరంగల్లో రైతులు అనేక రకాల పంటలను సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1,855 ఎకరాల్లో ప్రస్తుతం వివిధ రకాల కూరగాయల పంటలు వేశారు. ప్రతీ మండలంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులు మండలాల్లోని రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉండే కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాయితీలు ఇలా.. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందించడంతో పాటు సబ్సిడీలను అందజేస్తుంది. ఇందులో ప్రధానంగా కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600 పెట్టుబడి ఇస్తోంది. అలాగే, మల్చింగ్ పద్ధతి ద్వారా నేలలో తేమ నిల్వ, కలుపు నియంత్రణ, దిగుబడి పెరుగుదల సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఎకరాకు రూ.8 వేల వరకు సబ్సిడీ సైతం ఇస్తుంది. అధునాతన పద్ధతిలో సాగును పెంచడానికి (షేడ్ నెట్, నెట్ హౌస్) రూ.లక్ష వరకు సబ్సిడీలు సైతం అందిస్తుంది. ఉచితంగా టమాట, మిర్చి, బెండకాయ, తోటకూర, పాలకూర, వంకాయ, దోసకాయ, బీరకాయ, పొట్లకాయ, వృక్షవల్లీతో పాటు పలు రకాల విత్తనాలను రైతులకు అందజేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్కు ప్రోత్సాహం.. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. డ్రిప్ పద్ధతి కోసం 70 నుంచి 100 శాతం వరకు రైతులకు సబ్సిడీ అందించనున్నారు. డ్రిప్ ద్వారా మొక్కలకు అవసరమైనంత నీరు నేరుగా వేర్లకు అంది నీటి వృథా తగ్గుతుంది. ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించవచ్చు. డ్రిప్ విధానంతో దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత సైతం మెరుగవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మండలం సాగు విస్తీర్ణం గీసుకొండ 650 సంగెం 235 ఖిలావరంగల్ 220 వరంగల్ 60 నెక్కొండ 100 చెన్నారావుపేట 100 దుగ్గొండి 150 ఖానాపురం 40 నర్సంపేట 50 నల్లబెల్లి 50 వర్ధన్నపేట 50 పర్వతగిరి 100 రాయపర్తి 50 మొత్తం 1,855 -
ఆస్పత్రికి నిధులు మంజూరు చేయిస్తా
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డినర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన హెచ్డీఎస్ (హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ) కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. హెచ్డీఎస్ చైర్పర్సన్గా కలెక్టర్, 28 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి వైద్య సేవలందించారు, ఎంతమందిని ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేయాల్సి వచ్చిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది వంటి అంశాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిషన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.08 కోట్ల బడ్జెట్ అవసరమని సూపరింటెండెంట్ వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి సుమారు రూ.3కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం గది నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని టీఎస్ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న బడ్జెట్ నుంచి ఆర్వో వాటర్ప్లాంట్ మంజూరుకు కృషిచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆర్డీఓ ఉమారాణి, డీహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, బీఎండబ్ల్యూ రమేశ్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
మహిళా అభివృద్ధికి పూలే విశేష కృషి
● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య రామన్నపేట : జ్యోతిరావుబా పూలే మహిళల అభివృద్ధికి విశేష కృషిచేశారని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. గుర్తు చేశారు. ఆయన ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే 200వ జయంతిని పురస్కరించుకుని ములుగు క్రాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎంపీ కావ్యతోపాటు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రెండు జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో కొత్త మార్గాలను చూపించిన మహనీయుడి అని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక కులగణనను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. సేకరించిన డేటాను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ కావ్య పేర్కొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యానశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందజేస్తున్నాం. రైతులు కూరగా యల విత్తనాలు తీసుకొని సాగును పెంచుకోవాలి. కూరగాయల సాగుతో అధిక దిగుబడి పొంది ఆర్థికంగా బలోపేతం కావొచ్చు. ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు పథకాలను అందించడానికి కృషి చేస్తున్నాం. – యడ్ల భిక్షంరెడ్డి, ఆత్మ చైర్మన్, ఖానాపురంపదివేల ఎకరాల పెంపు లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగును పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. సబ్సిడీలతో పాటు ఉచితంగా విత్తనాలు, డ్రిప్ను అందిస్తోంది. జిల్లాలో మరో పదివేల ఎకరాల్లో కూరగాయల సాగును పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. కూరగాయల సాగుతో మంచి లాభాలు పొందవచ్చు. రైతులు కూరగాయల సాగుకు ముందుకు రావాలి.– తరుణ్, ఉద్యానశాఖ అధికారి, ఖానాపురం -
‘అరైవ్–అలైవ్’తో ప్రతీ ప్రాణం కాపాడాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ● మూడు జిల్లాల అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసి ప్రతీ ప్రాణం కాపాడే ప్రయత్నం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో సీపీ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అధికారులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హసనన్పర్తి ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా, మునిసిపల్, గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేషనల్ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు, అదనపు కలెక్టర్లు, ఆర్అండ్బీ, రవాణా, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సన్ప్రీత్ సింగ్ -
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ వైవీ గణేష్ వర్ధన్నపేట: గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వై వీ గణేష్ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఇల్లంద గ్రామంలో ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశా రు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనులు, నర్సరీ నిర్వహణ, డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించారు. కా ర్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు పక్కాగా ని ర్వహించాలన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి సర్పంచ్ బేతి సాంబయ్య పలు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ నగేష్, జీపీఓ లావణ్య, ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యపై కత్తితో భర్త దాడి
ఐనవోలు: అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడిచేసి గాయపరిచిన సంఘటన మండలంలోని గర్మిళ్లపల్లి శివారులో జరిగింది. జఫర్గఢ్ ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన ఏటూరి స్వప్న– రాజు దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం క్రాస్వద్ద ఉన్న కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కాగా స్వప్న, రాజు గురువారం కూతురిని కలవడానికి ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి బయలుదేరారు. గర్మిళ్లపల్లి శివారు మీదుగా కేజీబీవీకి వెళ్తుండగా మార్గమధ్యలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్వప్న వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో రాజు తాను వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన స్వప్నను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్వప్న మేనల్లుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు రాజును శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రామారావు తెలిపారు. కానిస్టేబుళ్లు రాజు, రిషికేష్, హోం గార్డు పూర్ణ పాల్గొన్నారు. -
‘అరైవ్–అలైవ్’తో ప్రతీ ప్రాణం కాపాడాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హన్మకొండ అర్బన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసి ప్రతీ ప్రాణం కాపాడే ప్రయత్నం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో సీపీ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అధికారులతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో కార్యక్రమ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హసన్పర్తి ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా, మున్సిపల్, గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేషనల్ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు, అదనపు కలెక్టర్లు, ఆర్అండ్బీ, రవాణా, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్లు అంకితభావంతో పనిచేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు అంకితభావంతో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, దామెర, ఆత్మకూరు, నడికూడ మండలాల సర్పంచ్లు, అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, బోరుబావులు, పైపులైన్ లీకేజీల మరమ్మతులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026వందలాది మంది వైద్య విద్యార్థులు ఉండే ఆయా హాస్టళ్లలో భద్రతపై నీ లి నీడలు కమ్ముకున్నాయి. అర్ధరాత్రి 12:30 నుంచి మూడు గంటల వరకు ర్యాగింగ్ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉండే హాస్టల్ వార్డెన్కు ఏమి తెలియకపోవడం, భద్రత విధుల్లో ఉండే సిబ్బందికి కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెసర్లు, ఇతరులకు కూడా ఇంతపెద్ద ఘటన యూజీసీ నుంచి వచ్చే వరకు తెలియకపోవడం బట్టి చూస్తే ఆ యా విద్యార్థులపై పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఇప్పటికై నా కేఎంసీలో సీసీ కెమెరాలను మరింత పెంచి, రాత్రి సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడం ద్వారా వీటిని నియంత్రించే వీలుంది. ఈ ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో తమ పిల్లలు ఎవరన్న అందులో ఉన్నారా అని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు వాకబు చేశారు. ప్రమాదంలో కేఎంసీ వైద్య విద్యార్థుల ‘కెరీర్’ ● ర్యాగింగ్ ఘటనలో పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు ● ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ● ఆందోళనలో తల్లిదండ్రులుభద్రతా ఉన్నా.. లేనట్టేనా..? -
ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 18 నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 154 కేంద్రాలు (ఐకేపీ 64, పీఏసీఎస్ 90) ఏర్పాటు చేసి 1.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులకు ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఆయన వెల్లడించారు. 1.24 లక్షల ఎకరాల్లో సాగు.. 2.70 లక్షల టన్నుల దిగుబడి అంచనా రబీలో జిల్లాలో 1,24,480 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 2.70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 1.66 లక్షల టన్నుల సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలోని 60 రైస్ మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నట్లు వివరించారు. ప్రతి రైస్మిల్లుకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ కోసం 41.53 లక్షల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 20.69 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి త్వరలో చేరనున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా 585 టార్పాలిన్లు, 180 తేమ కొలిచే యంత్రాలు, 196 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వ పరిశీలనలో రైస్మిల్లర్ల సమస్యలు సమావేశంలో రైస్మిల్లర్లు కొన్ని సమస్యలను ప్రస్తావించారని, అవి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని రైస్ మిల్లర్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఎం మహేందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 18 నుంచి విక్రయాలు ప్రారంభం ఐకేపీ 64, పీఏసీఎస్ 90 సెంటర్ల ఏర్పాటు 1.66 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం అధికారులతో అదనపు కలెక్టర్ ఎన్.రవి సమీక్ష ఈసారి రైతులకు ముందుగా గన్నీ సంచులు ఇస్తామని, వారు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత అక్కడే సంచులు అందజేసి నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం తీసుకురావాలని, లేకపోతే తరుగు సమస్యలు ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రైతులు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి త్వరలో నంబర్ ప్రకటిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 1.35 లక్షల టన్నుల సేకరణఖరీఫ్ సీజన్న్లో జిల్లాలో 154 కేంద్రాల ద్వారా 36,331 మంది రైతుల నుంచి 1.35 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఇందుకు రూ.3.24 కోట్లు చెల్లించగా, 26,173 మంది రైతులకు రూ.48.66 లక్షల బోనస్ అందజేసినట్లు పేర్కొన్నారు. -
ర్యాగింగ్ను ప్రోత్సహించినా, చేసినా శిక్షార్హులే..
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం. విద్యార్థుల జీవితాలని నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యం పిల్లల మానసిక ప్రవర్తనపై నిఘా ఉంచాలి. తోటి వారిని బాధపెట్టి సంతోషపడడం అనేది మానసిక వైకల్యం. ఇటీవల కొన్ని కళాశాలలో జరిగిన సంఘటనలో చర్యలు తీసుకున్నాం. మానసిక, శారీరక, ఎమోషనల్, ఇంకేరకంగా ఇతరులను ఇబ్బంది పెట్టినా ర్యాగింగ్ కిందకే వస్తుంది. ర్యాగింగ్ని ప్రోత్సహించినా, చేసినా శిక్షార్హులే అవుతారు. – డాక్టర్ అనితా రెడ్డి, యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్● -
ర్యాగింగ్.. ఫ్యూచర్ ప్రశ్నార్థకం!
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో వైద్య విద్యార్థుల ర్యాగింగ్ వారి కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చింది. రూ.లక్షలు ఖర్చు చేస్తూ డాక్టర్గా తమ బిడ్డలను చూడాలనుకుంటున్న తల్లిదండ్రుల కలలను చిదిమేస్తున్న వీరు క్షణికావేశం, సరదా కోసం ర్యాగింగ్ చేస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. ర్యాగింగ్ కేసులో పోలీసులు కేసులు నమోదు చేయగా ప్రైవేట్ ఉద్యోగవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలను చేజార్చుకునే పరిస్థితికి రావడం తల్లిదండ్రులకు ఆందోళనగా మారింది. కేఎంసీలోని గౌతమ పురుషుల హాస్టల్ టెర్రస్పై గత నెల 29వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 30వ తేదీ తెల్లవారు జామున 3:00 గంటల వరకు రెండో సంవత్సర విద్యార్థులను ‘నీల్ డౌన్’, ‘ఎయిర్ చైర్’ వంటి భంగిమల్లో ఉంచి థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధించినట్లు తేలింది. ఈ ఘటనకు అసలైన ఏడుగురిని బాధ్యులను చేస్తూ ర్యాగింగ్ నియంత్రణ కమిటీ ఒక సెమిస్టర్తో పాటు ఆరు నెలల పాటు హాస్టల్ సౌకర్యాల నుంచి దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరికి మే నెలలోనే సెమిస్టర్ పరీక్షలుండడం, మరో నాలుగు నెలల్లోనే మళ్లీ పరీక్షలు ఉండడంతో దాదాపు ఏడాది పాటు వీరి చదువు కెరీర్కు ఇబ్బందిగా మారిందని వైద్య విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.సంధ్య ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు నిందితులపై తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం, 1997లోని సెక్షన్ 4(జీ), 4(జీజీజీ), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 189, 126(2), 127(2), 190 కింద కేసులు నమోదు చేశారు. అక్రమంగా గుమిగూడటం, అడ్డుకోవడం, నిర్బంధించడం వంటి అభియోగాలపై ప్రస్తుతం మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు విచారణ చేస్తున్నారు. -
పూడికతీత.. సాగదీత!
ఏడాది గడిచినా పూర్తికాని భద్రకాళి చెరువు పూడికతీత.. మట్టి తరలింపుసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారుగా ఏడాది గడిచినా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చారిత్రక చెరువు సుందరీకరణ, లోతు, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు ఎంతకు పూర్తవకపోవడం నగరవాసులను అసహనానికి గురి చేస్తున్నాయి. తాజాగా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ ఏడాది మే మాసం వరకు ప్రధాన పనులు పూర్తి చేయాలని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తరచూ పరిశీలించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ధరలు తగ్గించి పనులు.. నత్తనడకన పూడికతీత గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ సుమారు 50 ఏళ్ల తర్వాత 2025, జనవరిలో భద్రకాళి చెరువు పూడికతీతపై దృష్టి సారించింది. దీంతో చెరువులో పూడికతీత కోసం నీరంతా ఖాళీ చేశారు. అంతకుముందే పూడికతీత పనుల కోసం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం రూ.13,00,09,046తో రెండు పనులకు నీటిపారుదలశాఖ 2025, జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచింది. ఇందులో ఒక పని చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్ కోసం క్యూబిక్ మీటర్కు రూ.53 చొప్పున రూ.3,49,11,446 కేటాయించారు. అదే విధంగా క్యూబిక్ మీటరుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తరలించేందుకు రూ.9,50,97,600 చెల్లించేలా మరో పనికి టెండర్ పిలిచారు. మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే... పూడిక మట్టి తరలించే పనికి సంబంధించి గతేడాది జనవరి 17, 27 రెండు తేదీల్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబిక్ మీటర్ రూ.162.56 నుంచి రూ.71.83కు తగ్గించి పనులు అప్పగించారు. అయినప్పటికీ 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసి తరలించాల్సి ఉండగా.. ఇప్పటికీ సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్లే తీశారు. ఆలస్యానికి అనేక కారణాలు.. భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల విడుదలో ఆలస్యం, యంత్రాల కొరత, సాంకేతిక సమస్యలను అధికారులు కారణాలుగా చూపుతున్నారు. భద్రకాళి చుట్టూ కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అడ్డంకులు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికి 30 శాతం పనులే కాగా.. అధికారులు చెబుతున్నట్లు మే–జూన్ మాసాల నాటికి పూర్తి అనుమానమే అంటున్నారు. పూర్తిస్థాయి డీప్ డీసిల్ట్రింగ్, బండలు, చెత్త తొలగింపు, చెరువు పరిసరాల అభివృద్ధి (ఫుట్పాత్లు, గ్రీనరీ) తదితర పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతేడాదే పూడికతీత పేరుతో చెరువును ఖాళీ చేయడం వల్ల గ్రేటర్ వరంగల్ నగరంపై తాగునీటి ప్రభావం పడింది. ఈసారి కూడా ఆ ప్రభావం మరింతగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘పనులు త్వరగా పూర్తి చేసి చెరువును పరిరక్షించాలి. గతేడాదిలా ఈసారి ఆ పరిస్థితి రావద్దు’ అని నగరవాసులు కోరుతున్నారు. 14 మాసాల్లో 7.70 లక్షల క్యూబిక్ మీటర్లకు తీసింది 2 లక్షల క్యూబిక్ మీటర్లే క్యూ.మీ.లకు రూ.162.56 నుంచి రూ.71.83 రేట్లు తగ్గించినా ఇంకా నత్తనడకన పనులు మే నాటికి పూర్తికాకపోతే తాగునీటికి సమస్య -
ముగిసిన ‘బార్’ ఎన్నికలు
● వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి ● హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ రామకృష్ణ, వి.నరేందర్వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల (2026–2027 సంవత్సరం) ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చకిలం ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చొల్లేటి రామకృష్ణ, వి.నరేందర్ ఎన్నికై నట్లు రెండు జిల్లాల ఎన్నికల ప్రధాన అధికారులు వై.శ్రీ రాఘవరావు, కొండబత్తుల రమేష్బాబు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. వరంగల్ బార్ అసోసియేషన్కు మొత్తం 695ఓట్లకుగాను 542 ఓట్లు పోలయ్యాయని, హనుమకొండకు 1,021 ఓట్లకుగాను 877 ఓట్లు పోలైనట్లు వారు పేర్కొన్నారు. అనంతరం జరిగిన లెక్కింపులో వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చకిలం ఉపేందర్, ఆర్.నాగేంద్రచారి, ఉపాధ్యక్షుడిగా చిర్ర సాంబశివరావు, కోశాధికారిగా (మహిళా రిజర్వ్) బి.ఉమామహేశ్వరీ, సహాయ కార్యదర్శిగా (పురుషుడు) ఆడేపు సునీల్, సహాయ కార్యదర్శిగా (మహిళా) ఎస్.కవిత, సీనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా జి.సుజాత, కార్యవర్గ సభ్యులుగా ఎం.వినయ్కుమార్, జె.ప్రభాకర్, కిరణ్కుమార్, జూనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా పి.రజిత ఎన్నికై నట్లు పేర్కొన్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పి.రఘుపతి, ఉపాధ్యక్షురాలిగా (మహిళా)జి.వనజా, సహాయ కార్యదర్శి (పురుషుడు)గా పి.శ్రీనివాస్, లైబ్రరీ సెకెట్రరీ (మహిళా)గా జె.స్వప్న, కోశాధికారిగా జె.జగన్, క్రీడా, సాంస్కృతిక విభాగం జాయింట్ సెక్రటరీగా ఎ.సందీప్కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఆర్.నవీన్, ఎం.సాంబ రాజు, ఈ.మహేందర్, బి.అరుణ్కుమార్, కార్యవర్గ సభ్యులు(మహిళా)గా ఎన్.సంధ్యారాణి ఎన్నికల ప్రధాన అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అప్పుడే ఈ స్థానాలు ఏకగ్రీవం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో ఏకగ్రీవమైన స్థానాల్లో మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.లలితకుమారి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపాల శ్రీను, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా డి.రాజేష్, 30ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కూరపాటి అశోక్, 20ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా జీ.వీ రమణమూర్తి ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా హనుమకొండ మహిళా జాయింట్ సెక్రెటరీగా జె.సుధా, 30 ఏళ్ల సీనియర్ కార్యవవర్గ సభ్యుడిగా టి.జితేందర్రెడ్డి, 20ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.వెంకటేశ్వర్లు, 10 ఏళ్ల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా వి.ఇందిరా విశాలి గతంలోనే ఏకగ్రీవమైనట్లు తెలిపారు. -
స్మార్ట్ సేవలు !
గీసుకొండ: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్ల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్న సిబ్బందికి 4జీ సెల్ ఫోన్లను అందిస్తుండటంతో సమస్య తీరనుంది. జిల్లాలో మూడు ప్రాజెక్టులు జిల్లాలో వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 919 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో 32 మంది సూపర్వైజర్లు, ముగ్గురు బ్లాక్ కోఆర్డినేటర్లు విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 85 అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామకం ఇంకా చేపట్టలేదు. జిల్లా అధికార యంత్రాంగం తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ సెల్ఫోన్లను అందించాలని నిర్ణయించింది. సుమారు 874 సెల్ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు అందించనున్నారు. తీరనున్న సమస్యలు 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదారులకు పారదర్శకంగా పౌష్టిక ఆహారం అందించేందుకు ‘పోషణ్ ట్రాకర్ ’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత టెక్నాలజీ ఉన్న ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం, డిస్ప్లేలు పగిలి పోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లను కొనుగోలు చేసి వాడుతున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం వారికి సెల్ఫోన్లను అందించాలని నిర్ణయించింది. నెలకోసారి ఎఫ్ఆర్ఎస్ నమోదు అంగన్వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14–18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతీ నెల ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరు తీసుకుంటారు. దీని కోసం కొత్త 4జీ ఫోన్లు ఉపయోగపడుతాయి. అలాగే ప్రతీ రోజు యాప్లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. విధుల నిర్వహణకే.. అంగన్వాడీ టీచర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం 4జీ ఫోన్లను అందిస్తోంది. అయితే వారి వ్యక్తి గత అవసరాలకు ఫోన్ను వాడకుండా ఆ ఫోన్లలో ‘హానో’ అనే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు. దీంతో కేవలం ప్రభుత్వం రూపొందించిన ప్రోగ్రాంల వివరాలను అప్లోడ్ చేసే విధంగా ఫోన్లు పని చేస్తాయని, అంతే కాని వ్యక్తిగత అవసరాలకు ఫోన్ను వాడటం కుదరదని అధికారులు తెలిపారు. సేవలు మరింత వేగవంతం పరకాల ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద 4జీ ఫోన్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత వేగవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కొనాయమాకుల రైతువేదిక వద్ద గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 119 మంది అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. డిజిటల్ సదుపాయాలు ఫీల్డ్ స్థాయిలో డేటా నాణ్యతను పెంచడంతో పాటు సేవల పర్యవేక్షణను బలోపేతం చేయవచ్చన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి పుష్పలత, డీడబ్ల్యూఓ రాజమణి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, సీడీపీఓ డెబోరా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు 4 జీ ఫోన్లు ఇక ఆన్లైన్ సేవలు వేగవంతం జిల్లాలో 874 ఫోన్ల పంపిణీకి సన్నాహాలు గీసుకొండలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద -
యోగాతో మానసిక ప్రశాంతత
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: యోగా సాధనతో మనస్సు ప్రశాంతత, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖిలావరంగల్ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల నడమ శిల్పాల ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ దినోత్స వం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి సాంబశివరావు, శామ్యూల్, అధికారులతో కలిసి యోగాసనాలు వే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం పడమర కోట ముదిరాజ్ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయూష్ హెల్త్ క్యాంప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, ఆయూష్ జిల్లా ఇన్చార్జ్ ఎం.రాజు, డీపీఎం రాజు, నేచురోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృత వల్లి, ఆయుష్ వైద్యులు రాజేందర్, రాము, శ్రీలత, కార్పొరేటర్లు ఉమా,దామోదర్, వెల్పుగొండ సువర్ణ, బోగి సురేష్, నర్సులు పాల్గొన్నారు. వెండింగ్ యూనిట్ల ఎంపిక న్యూశాయంపేట: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం వెండింగ్ యూనిట్ లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఇందులో 18 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా జనరల్ కేటగిరీకి 13, ఎస్సీ కేటగిరీ 3, ఎస్సీ కేటగిరీ 1, మహిళా కేటగిరీలో ఒకరిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్డీఏ, జిల్లా అధికారులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. టెలికం సేవల విస్తృతికి చర్యలు జిల్లాలో టెలికం సేవల విస్తరణ, నెట్వర్క్ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భాస్కర్రావు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సేవల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. -
పోస్టుమాస్టర్ను బదిలీ చేయాలి
● పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం ● నెక్కొండలో లబ్ధిదారుల డిమాండ్ నెక్కొండ: నెక్కొండ పోస్టుమాస్టర్ రత్నమాల తీరుతో ఇబ్బందులు పడుతున్నామని పింఛన్దారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రజాసంఘాలు, గ్రామస్తుల సహకారంతో గురువారం నెక్కొండ పోస్టాఫీస్ ఆవరణలో ఆందోళనకు దిగారు. పోస్టుమాస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులతో దురుసుగా ప్రవరిస్తున్న పోస్టుమాస్టర్ తమకు వద్దని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తోందని, తీరులో మార్పు లేనందున బదిలీ చేయాలని కోరారు. సదరు పోస్టుమాస్టర్పై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఆందోళనకారులు దాసరి శ్రీనివాస్, రవిబాబు, రేగుల అశోక్, వరుణ్, శ్రీకాంత్, వినోద్, చంద్పాషా, వీరమ్మ, నూర్జహాన్, విజయరాణి, కుమార్, కట్టయ్యల, పింఛన్దారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఓటీ..లూటీ
మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఓవర్ టైమ్ (ఓటీ) చెల్లింపులు చేయకుండా ఆర్థిక నష్టం కలిగించారు.శునకం..భయానకంసాక్షి, వరంగల్: వేసవిలో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. వేడితో ఒళ్లంతా చిమచిమలాడుతుంటుంది. చెమటతో చిరాగ్గా ఉంటుంది. ఈ కాలంలో మనుషుల మాదిరిగానే కుక్కలకు కూడా హీట్ స్ట్రెస్ మరింత ఎక్కువ ఉంటుది. దీంతో ఎండాకాలంలో కుక్కలు విపరీత ధోరణి ప్రదర్శిస్తూ ప్రజలను హైరానా పెడుతున్నాయి. వేసవి కుక్కలకు ఒత్తిడి కాలం.. వేడితోపాటు ఆహారం, నీటి లభ్యత తగ్గడంతో అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటివి వాటి వద్దకు వెళ్తే ఒక్కోసారి వాటంతటవే దాడి చేస్తున్నాయి. జనవరిలో 328 కేసులు, ఫిబ్రవరిలో 376 కేసులు నమోదైతే మార్చిలో 382 కేసులు పెరగడం జనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కోతులు కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులు చేస్తుండడంతో మూడు నెలల్లో 64 కేసులు నమోదయ్యాయి. ఇక ఇంట్లో పెంచుకుంటున్న పిల్లులు కూడా ఎండ భరించలేక కొన్ని సందర్భాల్లో యజమానులు, వారి పిల్లలను కరుస్తున్నాయి. జనవరిలో ఐదు, ఫిబ్రవరిలో 8 కేసులు నమోదైతే మార్చిలో ఏకంగా 12 పిల్లి కరిచిన ఘటనలు జరిగాయి. ఇవి వైద్యవిభాగ గణాంకాలు చెబుతున్నా వీరి దృష్టికి రాని కేసులు ఇంకా అనేకం ఉండొచ్చని తెలుస్తోంది. కొందరు వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానల్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. రేబిస్ వ్యాక్సిన్ కోసం బాధితులు ఆయా ఆస్పత్రులు, పీహెచ్సీలకు పరుగులు తీస్తున్నారు. ఏప్రిల్, మేలో ఎండ వేడిమి మరింత పెరిగి కుక్క, కోతి, పిల్లి కాట్లు పెరిగే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మూడు నెలల్లో 1,086 కాట్లు వేసవిలో రెచ్చిపోతున్న కుక్కలు వాటిదారిలోనే కోతులు, పిల్లులు కూడా.. దాడులతో భయాందోళన చెందుతున్న ప్రజలు రేబిస్ వ్యాక్సిన్ కోసం పీహెచ్సీలకు బాధితుల పరుగులువాతావరణ మార్పులతోనూ దాడులు.. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువసేపు ఇంటి బయట గడుపుతుంటారు. చిన్న పిల్లలైతే వారికి తోడుగా తల్లిదండ్రులు రోడ్లపైకి వస్తుంటారు. ఇలా మనుషుల సందడి పెరగడంతో కుక్కలు భయాందోళనతో దాడులు తెగిస్తున్నాయి. దీనికితోడు వాతావారణంలో మార్పులు, డీహైడ్రేషన్, సమ్మర్ స్ట్రెస్తో కుక్కలు బాగా ప్రభావితమవుతాయి. వ్యాక్సిన్ చేయించని కుక్కలు కరిస్తే రేబిస్ వచ్చే అవకాశముంటుంది. పిల్లలు కుక్కలను తరమవద్దు. రాళ్లు విసరడం, అరవడం లాంటివి చేయవద్దు. ఈ సందర్భాల్లో కుక్కలు దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కోతులు, పిల్లుల విషయంలోనూ అందరూ జాగ్రత్తలు పాటించడం మంచింది. ఆస్పత్రుల్లో రేబిస్ వ్యాక్సిన్ సరిపడా అందుబాటులో ఉంది. బాధితులకు వైద్యులు సత్వర వైద్యం చేయాల్సిందే. – సాంబశివరావు, డీఎంహెచ్ఓ -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశలించారు. అంతకుముందు రుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కల్యాణమండపం పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. రెండో రోజూ సమ్మె హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె గురువారం రెండో రోజూ కొనసాగింది. జెన్కో, ట్రాన్స్ కోతో పాటు ఎన్పీడీసీఎల్లో ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆర్టిజన్లు 3,457 మంది ఉండగా 2,760 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఆర్టిజన్లు విధుల్లో పాల్గొంటున్నారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గురువారం విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా ఈనెల 13న మరోసారి చర్చలు జరపనున్నారు. నిర్ణయం తీసుకునే స్థాయి ఉన్న ప్రతినిధులను చర్చలకు పంపాలని కార్మికశాఖ లేఖ రాసింది. -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ర్యాలీ కాశిబుగ్గ/రామన్నపేట: అవగాహన, సురక్షిత జీవన విధానంతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిలో భాగంగా గురువారం కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్పై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తమార్పిడి, కలుషిత సూదులు/సిరంజిల వినియోగం ద్వారా వ్యాపించే ఎయిడ్స్పై అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు భయపడకుండా వాటిని వినియోగించుకోవాలని ఆమె కోరారు. అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. 87 ఫీట్ల రెడ్రిబ్బన్, రక్త బిందువు, ఎయిడ్స్ సింబల్స్తో ర్యాలీ.. ఏవీవీ స్కూల్ ఎన్ఎస్ఎస్ మాజీ ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు ఎయిడ్స్పై 20 సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంజీఎం కూడలి వద్ద స్టేట్ రిసోర్స్పర్సన్ రెడ్ రిబ్బన్క్లబ్స్, యూత్ ఫర్ సొసైటీ రూపొందించిన 87 ఫీట్ల రెడ్రిబ్బన్, రక్త బిందువు, ఎయిడ్స్ సింబల్స్తో ర్యాలీ నిర్వహించారు. యూత్ ఫర్ సొసైటీ బాధ్యులు దేవిశ్రీ, ప్రసాద్, శివరాజ్, రిత్విక్, రోహిత్, విష్ణు, ఎన్జీఓలు రేణుక, ప్రవళిక, లక్ష్మి పాల్గొన్నారు. -
గృహాలను బ్లాక్లుగా విభజించాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి దుగ్గొండి: జనగణన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని గృహాలను బ్లాక్లుగా విభజించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ)ల ఏర్పాటులో ఎలాంటి తప్పులు ఉండొద్దన్నారు. ఒక్కో బ్లాక్లో 160 నుంచి 180 ఇళ్లు ఉండేలా చూడాలని, బ్లాక్లకు హద్దులు ఏర్పాటు చేసి మ్యాపింగ్ చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుంచి జరగనున్న జనగణన కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. లక్ష్మీపురం, చలపర్తి గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న హెచ్ఎల్బీలను సరిచేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల పరిధిలో ఉన్న 15,015 ఇళ్లను సముదాయాలుగా విభజించి ఎన్యుమరేటర్లకు అందించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. జనగణనలో భాగంగా ఇళ్లకు వచ్చిన ఎన్యుమరేటర్లకు వివరాలు చెప్పకపోవడం, విధులకు ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా చర్యలతోపాటు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్ ముస్కు సమ్మక్క, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు. -
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపండి
నయీంనగర్: ప్రజల అభీష్టం మేరకు హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో పౌర సంఘాలు, మేధావులు, నాయకులు నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. హైదరాబాద్ మాదిరి అన్ని జిల్లాలతో కలిపి మూడు కోట్ల అరవై లక్షల మంది ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరాన్ని ముక్కలు చేసి, పార్కుల భూములు కబ్జా చేసి, వరంగల్ జైలు భూమిని తాకట్టు పెట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలో, వరంగల్ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తాత్సారం చేస్తోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొత్త జిల్లాలు రాష్ట్రంలోని అనేక జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయని, హనుమకొండ జిల్లా దయనీయంగా చివరగా 33వ స్థానంలో ఉందని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కె.సుధాకర్ ప్రభుత్వ గణాంకాలతో వివరించారు. వరంగల్ మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు మాట్లాడుతూ ఇతర జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే 1400 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగర ప్రజల ఆకాంక్షను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సీపీఎం నాయకుడు చుక్కయ్య మాట్లాడుతూ వరంగల్ మహా నగర అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. సదస్సులో నాయకులు వెంకటరాజం, సీనియర్ జర్నలిస్ట్ దాసరి కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ వి.రవీందర్, డాక్టర్ విజయలక్ష్మి, లాయర్ చిల్లా రాజేంద్రప్రసాద్, జిలకర శ్రీనివాస్, రామమూర్తి, సాయిని నరేందర్, మల్లేశ్వర్ పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ ఫిర్యాదులపై డీపీఓ విచారణ
పర్వతగిరి: గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా పంచాయతీ అధికారి కల్పన గురువారం అన్నారం షరీఫ్లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా షాపుల నిర్వాహకులు సామగ్రిని గ్రామపంచాయతీ ఇచ్చిన రెడ్మార్క్ లోపల పెట్టాలని సూచించారు. లేకుంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులను కోరారు. అనంతరం అన్నారం బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. డీఎల్పీఓ వేదవతి, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ శేషు, సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై సమీక్షన్యూశాయంపేట: అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డు భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల సంఖ్య పెరగడం, అతివేగంతో డ్రైవింగ్ చేయడం ఈ ప్రమాదాలకు కారణ మన్నారు. కలెక్టర్లు రోడ్డు భద్రతకు ప్రాధాన్యమి స్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలినర్సంపేట రూరల్: ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ సెంట్రల్ జైలు, నర్సంపేట సబ్జైలులో గురువారంఆయన వైద్యశిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. జైలులో ఖైదీలు, సిబ్బంది, వివిధ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు, చికిత్స చేయించనున్నట్లు తెలిపారు. సాధారణంగా సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక ఒత్తిడి, శరీరకశ్రమ లేకపోవడం కూడా వ్యాధులు రావడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, ధ్యానం, చేయాలని కోరారు. దరఖాస్తు గడువు పొడిగింపు న్యూశాయంపేట: షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చే మినీ డెయిరీ పథకం (రెండు పాడిగేదెలు)నకు దరఖాస్తుల గడువు ఈనెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఓబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సర్క్యూట్హౌస్ రోడ్డులోని తుషారా స్కూల్ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. హమాలీ ఆత్మహత్యనర్సంపేట రూరల్: హమాలీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేటలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో పంబి రమేశ్ (49) నివాసం ఉంటూ హమాలీ పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రవేశాలు
● కరపత్రాలతో ఉపాధ్యాయుల ప్రచారం కాళోజీ సెంటర్: పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా జూన్ నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈసారి మార్చి చివరి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడు పీఎంశ్రీ పాఠశాలలకు రూ.32,840 నిధులు జిల్లాలోని ఏడు పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి సమగ్రశిక్ష అభియాన్ కింద రూ.32,840 నిధులు విడుదల చేస్తూ డీఈఓ బి.రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.4,691 చొప్పున కేటాయించారు. ఈనిధులతో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. నాణ్యమైన బోధనకు ఫ్లెక్సీ బ్యానర్, కలర్ కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. దుగ్గొండి, ఇటికాలపల్లి, నర్సంపేట (బాలికలు), కొండూరు, నరేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఇల్లంద, నారక్కపేట ఎంపీపీఎస్లకు నిధులు కేటాయించారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలి.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో బడికి వెళ్లే విద్యార్థులను గుర్తించాలి. బడిబయట ఉన్న పిల్లలు, చదువు మధ్యలో ఆపేసిన వారిపై దృష్టి పెట్టాలి. అవగాహన సదస్సులు నిర్వహించి పీఎంశ్రీ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, నాణ్యమైన విద్య గురించి గ్రామస్తులకు వివరించాలి. కరపత్రాల పంపిణీ, ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు, మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. బాలికలు, వెనుకబడిన వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్) నమోదు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఈఓలు పర్యవేక్షించాలి.. జిల్లాలోని ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు కేటాయించాం. విద్యార్థుల ప్రవేశాల కార్యక్రమాలకు మాత్రమే నిధులు వినియోగించాలి. ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, వినియోగపత్రాలను (యూసీఎస్) సకాలంలో సమర్పించాలని హెచ్ఎంలను ఆదేశించాం. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని మండల విద్యాశాఖ అధికారులకు సూచించాం – రంగయ్యనాయుడు, డీఈఓనల్లబెల్లి మండలం నారక్కపేట పీఎం శ్రీపాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయుల ప్రచారం -
గ్రామాల్లో పక్కాగా జ్వర సర్వే
● జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజినిగీసుకొండ: గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రజిని సూచించారు. రక్త పరీక్షలు, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గీసుకొండ పీహెచ్సీ పరిధిలోని వంచగిరిలో గురువారం నిర్వహించిన మలేరియా వాహక నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బంది తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వెల్ ఆపరేషన్లు చేపట్టాలని, ప్రతి శుక్రవారం తప్పక డ్రైడే పాటించాలని, వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. గ్రామంలో గతంలో మలేరియా, డెంగీ వ్యాధులు నమోదయ్యాయి. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. సర్పంచ్ కొమ్ముల కమల, స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శౌర్య శరణ్య, హెచ్ఈఓ సదానందం, సూపర్వైజర్ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వైద్య సిబ్బంది సుజాత, హెల్త్ అసిస్టెంట్లు మాధవి, లక్ష్మణ్, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
మార్కులు తగ్గినా జీవితం ఆగదు
కాళోజీ సెంటర్: విద్యాసంవత్సరం ముగిసింది. విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు రానున్నాయి. ఉత్తీర్ణులు కాకపోయినా, మార్కులు తగ్గినా జీవితం అంతటితో ఆగిపోదు. మళ్లీ పుంజుకొని విజయం కోసం విద్యార్థులు అడుగులు వేయాలి. ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ సైకాలజిస్టులు పలు సూచనలు చేస్తున్నారు. మార్కులే సర్వస్వం కాదు.. జీవితంలో ఓటమిని, విజయాన్ని ధైర్యంతో స్వాగతించాలి. ఫలితం ఏదైనా విజయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మార్కులే సర్వస్వం కాదు. మార్కులు తక్కువ వస్తే తెలివితేటల లోపం కాదని భావించాలి. కేవలం మూడు గంటల పరీక్ష సమయం సహకరించలేదని భావించి దూరదృష్టితో నీ మేధస్సుకు పదును పెట్టాలి. ఓటమి ఒక పాఠం, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొని రెట్టింపు ఉత్సాహంతో సిద్ధపడాలి. ప్రపంచాన్ని శాసించిన ఎందరో మేధావులు ఒకప్పుడు పరీక్షలు తప్పినవారే అని గుర్తు చేసుకోవాలి. అపజయం నుంచి అడుగులు పడితేనే విజయం నీ దరిచేరుతుంది. లోపాలను ప్రేమతో సరిదిద్దాలి.. పరీక్ష ఏదైనా ఫలితాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండాలి. మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి. మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను నిందించి చిన్నచూపు చూస్తే వారు పెద్ద ప్రమాదంలో పడొచ్చు. ఎదుటివారితో పోల్చడం మానాలి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా దూషించకుండా ధైర్యం చెప్పాలి. ఏడాది పొడవునా శ్రమించారని పిల్లలను అభినందించాలి. లోపాలను ప్రేమతో సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అసలైన గెలుపు కోసం మళ్లీ అడుగులు వేయాలి విద్యార్థులు, తల్లిదండ్రులకు సైకాలజిస్ట్ల సూచన త్వరలో విడుదల కానున్న ఇంటర్మీడియట్ ఫలితాలుఓడినప్పుడు కుంగిపోవొద్దు.. జీవితం అంటే పరీక్షలు మాత్రమే కాదు.. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. విద్యార్థులకు మార్కుల కంటే సంస్కారం, ధైర్యం, పట్టుదల నేర్పించడం ఈ సమయంలో అత్యంత అవసరం. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే నేడు విఫలమైన విద్యార్థి రేపు అద్భుత విజేత అవుతాడు. ఒక మార్కుల షీట్ మీబిడ్డ మేధస్సును కొలవగలదేమే కాని వారి భవిష్యత్ను కాదు. ఈ సమయంలో తల్లిదండ్రుల అండే వారికి కొండంత ధైర్యం. – పోగు అశోక్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు : బీజేపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు రుద్రేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కల్యాణమండపం పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ప్రతీ చిన్న విషయానికి క్రెడిట్ కొట్టేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, భైరి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తా: హోమియోపతి పితామహుడు క్రిస్టియన్ ఫ్రెడ్రిచ్ సామ్యూల్ జయంతి సందర్భంగా నేడు(శుక్రవారం) వడ్డేపల్లిలోని ప్రణయ్ పార్క్ వద్ద ఉచిత ఆయుష్ వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ మహేంద్రకుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఉచిత యోగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్, కిడ్నీ, చర్మ, బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులు ఉచితంగా వైద్యసేవలందించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఖిలా వరంగల్: ఓరుగల్లు కోటను గురువారం డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగం డీఎస్పీ మాధవీలత సందర్శించారు. శిల్పకళాసంపదతో పాటు ఖుష్మహల్, ఏకశిలగుట్ట, రాతి, మట్టికోటను తిలకించారు. కాకతీయ విశిష్టతను గైడ్ రవియాదవ్ వివరించారు. అ నంతరం చారిత్రక కళాఖండాలు అద్భుత సంపదని కొనియాడారు. ఆమె వెంట మిల్స్కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ సురే్శ, సిబ్బంది ఉన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట నుంచి పెద్దంపేట మధ్య గురువారం నిర్వహించాల్సిన హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్రన్ను శుక్రవారం చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి రూట్లో కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్ ట్రయల్ రన్ను శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులపాటు అధికారికంగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి రెండు లోకోలను గురువారం రాత్రి కాజీపేట జంక్షన్కు తరలించారు. ఇక్కడి నుంచి ట్రయల్ రన్ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ శిక్షణ ఉపాధి సంస్థ ప్లేస్మెంట్లో భాగంగా తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టాంకాం) ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అర్హులైన నిరుద్యోగులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ కలెక్టరేట్ కాంప్లెక్స్లోని మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లోu●మొత్తం ప్రాజెక్టులు : సుమారు 119పూర్తయినవి : సుమారు 66% మాత్రమే (2025 మధ్య నాటికి) ప్రగతిలో : 66 పనులు (రూ.518 కోట్ల విలువ) ‘గ్రేటర్’లో ‘స్మార్ట్’ పనులు ఇంకా పెండింగ్జేపీఎన్రోడ్డులో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా పూర్తి చేయని ఫుట్పాత్ పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ పూర్తి కాకపోవడానికి అధికారులు వివరణలో అనేక కారణాలు చూపుతున్నారు. మొదట భూ సేకరణ సమస్యలు కారణమని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత టెండర్/కాంట్రాక్టర్ ఆలసత్వం, తరచూ అధికారులు మారడం (స్థిరత్వం లేకపోవడం), విభాగాల మధ్య సమన్వయం లోపం తదితర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుత పనుల వేగాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ నెలాఖరులోనైనా పెండింగ్ పనులు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు గడువు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ తర్వాత మరోసారి పొడిగింపు ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే స్మార్ట్ సిటీగా వరంగల్ను తీర్చిదిద్దే లక్ష్యం ఇంకా కాగితాలపైనే ఉండగా, క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ‘రోడ్లు తవ్వి వదిలేశారు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పడం లేదు. ట్రాఫిక్, దుమ్ముతో జీవించడం కష్టంగా మారింది’ అంటూ హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్మార్ట్ సిటీ అంటే సౌకర్యాలు రావాలి. కానీ, ఇబ్బందులే పెరిగాయి’ అంటూ కాజీపేట నివాసి ఒకరు అభిప్రాయపడ్డారు. అసంపూర్తిగా మిగిలిపోయిన భద్రకాళి బండ్ పనులుసాక్షిప్రతినిధి, వరంగల్: డెడ్లైన్లు పెరుగుతున్నాయే తప్ప వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్సీఎం) పూర్తి కావట్లేదు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాల్సిన గ్రేటర్ వరంగల్లో పనులు ఇంకా పూర్తి స్థాయిలో ముగియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరుసగా గడువు పొడిగించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఆశించిన వేగంతో సాగట్లేదు. 2026 మార్చి గడువు సైతం ముగిసినా వందశాతం పనులు కాకపోవడంతో ఈనెలాఖరులోనైనా పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు అందిన్నట్లు సమాచారం. మూడేళ్ల కిందటే పూర్తి కావాల్సి ఉన్నా.. రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలు స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికయ్యాయి. మార్చి 16న స్మార్ట్ సిటీలపై కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.2,895 కోట్ల వ్యయంతో మొత్తం 168 ప్రాజెక్టులను మంజూరు చేయగా, వీటిలో రూ.2,520 కోట్ల విలువైన 143 ప్రాజెక్టులు (85 శాతం) ఏడాదిన్నర క్రితమే పూర్తయ్యాయి. వరంగల్ కార్పొరేషన్లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో రూ.375 కోట్ల పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం మొదట ఇచ్చిన గడువు 2023. ఆతర్వాత 2024, 2025 మార్చి 31 వరకు పెంచింది. అప్పటికీ 66 శాతం వరకే పూర్తి కావడంతో ప్రత్యేకంగా వరంగల్ కోసం 2025 డిసెంబర్ 31 వరకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చింది. తాజాగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహూ మార్చి 16న రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గడు వు దాటినప్పటికీ గ్రేటర్ వరంగల్లో రూ.375 కోట్ల వ్యయం కాగల 25 ప్రాజెక్టులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో 2026, మార్చి 31వ తేదీ వరకు మరోసారి గడువు ఇచ్చినా పూర్తికాలేదు. పోతనగర్లో ఆగుతూ సాగుతున్న డ్రెయిన్ బ్రిడ్జి పనులుసునీల్ థియేటర్ ముందు అండర్ డ్రెయినేజీ వేసి దానిపై నిర్మించని ఫుట్పాత్గ్రేటర్ వరంగల్లో స్మార్ట్ సిటీ మిషన్ పనులు ఇలా.. 2026 నాటికి గ్రౌండ్ రియాలిటీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశం నిధుల మళ్లింపుపై ఇప్పటికే ‘కాగ్’ అక్షింతలు స్మార్ట్ సిటీ పనుల్లో డొల్లతనంపై అభ్యంతరాలు బాధ్యతారహితంగా అధికారులు.. ఏడాదిగా పనుల సాగదీతదారిమళ్లిన నిధులపై కాగ్ అంక్షింతలుజీడబ్ల్యూఎంసీలో అమృత్ పథకంతో సంబంధం లేని రోడ్డు పనులు, టీ–ఫైబర్ ప్రాజెక్టు పనుల కోసం ‘మిషన్’ నిధులనుంచి రూ.21.30 కోట్లు చెల్లించడంపై కాగ్ ప్రశ్నించింది. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన సిమెంట్, ఇనుము ధరల సర్దుబాటు కోసం రూ.8.60 కోట్లు అమృత్ నిధులు వాడడం కూడా నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంది. నీటి సరఫరా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్కు అక్రమంగా లబ్ధి చేకూర్చమేంటని ప్రశ్నించింది. పెట్రోల్, ఆయిల్, లూబ్రికెంట్స్ లీటరుకు రూ. 64.36 ఉండగా, తప్పుగా రూ.62.46గా తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్కు రూ.1.05 కోట్లు అదనంగా చెల్లించడంపై మండిపడింది. -
13నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘ఆరైవ్ – ఆలైవ్’లో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు వారాంతపు రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనరేట్ నుంచి సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడారు. 13న మొదటి రోజు గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, సభ్యులతో ప్రమాణం చేయిస్తామని తెలిపారు. రెండవ రోజు అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాల వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు ప్రజలతో ప్రమాణం చేయించడంతోపాటు ప్రమాదాలకు గురయ్యే కూడళ్లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మూడవ రోజు బాలల రోడ్డు భద్రత దినోత్సవంగా నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు దాటే విధానం, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. నాల్గవ రోజు సోషల్ మీడియా ద్వారా అధికారులు, ప్రజలు రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు. డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఐదవ రోజు గోల్డెన్ అవర్ స్పందనపై శిక్షణ నిర్వహించి, ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించే విధానాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. 18న ఆరవ రోజు జీరో ఎన్ఫోర్స్మెంట్ డేగా నిర్వహించి, ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు జరిమానాలు విధించకుండా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. సమావేశంలో డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీ ప్రభాకర్రావు, ఏసీపీలు సత్యనారాయణ, జాన్ నర్సింహులు, ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, శ్రీనివాస్, రమేష్లు పాల్గొన్నారు. 13 నుంచి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం : హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని వారం రోజులపాటు విస్తృతంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గురువారం హైదరాబాద్నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హనుమకొండనుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, డీఎంహెచ్ఓ అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
కాశిబుగ్గ/రామన్నపేట: అవగాహన, సురక్షిత జీవ న విధానంతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిలో భాగంగా గురువారం కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్పై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తమార్పిడి, కలుషిత సూదులు/సిరంజిల వినియోగం ద్వారా వ్యాపించే ఎయిడ్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంజీఎం కూడలి వద్ద ఏవీవీ స్కూల్ ఎన్ఎస్ఎస్ మాజీ ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు, స్టేట్ రిసోర్స్పర్సన్ రెడ్ రిబ్బన్ క్లబ్స్, యూత్ ఫర్ సొసైటీ రూపొందించిన 87 ఫీట్ల రెడ్రిబ్బన్, రక్త బిందువు, ఎయిడ్స్ సింబల్స్తో ర్యాలీ నిర్వహించారు. ‘అరైవ్–అలైవ్’ అమలుపై సమీక్ష న్యూశాయంపేట: అరైవ్–అలైవ్ అమలుపై గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. వరంగల్ నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ర్యాలీ -
గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్.. అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ కమిటీ సమావేశంలో మేఘా గ్యాస్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో చేపట్టనున్న గ్యాస్ సరఫరా విధానం, పైపులైన్ ఏర్పాట్లు, గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు నమోదైన కనెక్షన్లు, సబ్సిడీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్కు దరఖాస్తు చేసే విధానం, సంబంధిత పోర్టల్పై ప్రజలకు వివరించాలని సూచించారు. వీటికి సంబంధించి అనుమతుల సమన్వయం కోసం పరిశ్రమలశాఖ జీఎం నవీన్కుమార్ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, మేఘా గ్యాస్ జిల్లా మేనేజర్ అవినాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలురామన్నపేట: హెచ్ఐవీపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన పెంచడానికి కార్యక్రమాలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి అదాలత్ జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షితమైన జీవన విధానంతో హెచ్ఐవీ నివారణ సాధ్యమన్నారు. అనంతరం అదాలత్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్రావు, డిప్యూటీ డీఎంహె చ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ రుబీనా, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానం.. ఐదుగురికి ప్రాణదానం
హన్మకొండ: ప్రాణం పోతూ అవయవదానం ద్వారా ఐదుగురికి ప్రాణదానం చేశాడు హనుమకొండ గాంధీనగర్కు చెందిన ఈవీ సతీష్ కుమార్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్ రావు తమ్ముడు అయిన సతీష్ కుమార్ (56) బ్రెయిన్ హెమరేజ్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్ డెడ్ స్థితిలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ చర్యను పలువురు అభినందించారు. మృతుడి సతీమణి అనురాధ, కుమారుడు అమయ్ రాణా మాట్లాడుతూ అవయవ దానం ద్వారా ఇతరులకు ప్రాణం పోయడం తమకు ఓదార్పునిచ్చిందని, ఆయన సేవా భావం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. -
నిద్రపోతున్న నిఘా నేత్రం
కాజీపేట అర్బన్: ‘ఎవరూ చూడట్లేదు ఇష్టం వచ్చినట్లు మన పని మనం చేసుకోవచ్చు’ అన్నట్లుగా మారింది వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం తీరు. ఇందుకు నిదర్శనమే కళ్లు మూసుకున్న నిఘా నేత్రాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిత్యం భూక్రయవిక్రయదారులు దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తుంటారు. కాగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రతిదీ రికార్డు అయ్యేలా ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎక్కడా పని చేయట్లేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు తెర తీయడం, ఏసీబీ అధికారులు దాడులు చేయడం వరకు పరిస్థితి వెళ్లింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం.. డాక్యుమెంట్ రైటర్లే వసూల్ రాజాలుగా మారి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని శాసించే స్థాయికి ఎది గినా ఎక్కడా వీరి ఆగడాలను రికార్డు చేయలేకపోతున్నాయి సీసీ కెమెరాలు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పని చేస్తే అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంటుదని ప్రజలు చర్చించుకుంటున్నారు. తీరు మారేనా? ఏసీబీ దాడుల తర్వాత తాత్కాలిక పద్ధతిలో సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండగా.. పూరిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను ఉన్నతాధికారులకు నియమించి అక్రమాలకు చెక్ పెట్టాలని భూక్రయవిక్రయదారులు, మధ్య తరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయి. అక్రమాలకు నెలవుగా మారిన వరంగల్ ఆర్ఓ తీరుమారేనా? ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం ఆర్ఓ తీరుమారేనా? -
నేడు హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్రన్
కాజీపేట రూరల్ : కాజీపేట–పెద్దంపేట రైల్వేస్టేషన్ల వరకు 101 కిలోమీటర్ల మేర గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ)ను పూర్తిచేసి గురువారం ట్రయల్ రన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎస్టీఈపీవీ మురళీకృష్ణ, సీఎస్టీఈ ఎం.కోటేశ్వర్రావు నేతృత్వంలో సికింద్రాబాద్ డిప్యూటీ సీఎస్టీఈ జి.కుమారన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ యూనిట్ పనిని పూర్తి చేశారు. స్వదేశీ భద్రత సాంకేతికతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణమధ్య రైల్వేలో గ్రాండ్ ట్రంక్ రూట్ అయిన బల్లార్షా–విజయవాడ సెక్షన్ అత్యంత రైళ్ల ట్రాఫిక్ కలిగింది. ఈ సెక్షన్లో ఎస్ఐఎల్ –0 కవచ్ వ్యవస్థ ప్రమాదాలను నివారిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్పై రెండు రైలు ఇంజన్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ట్రయల్రన్ నిర్వహణకు పలువురు అధికారులు గురువారం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు రానున్నారు. కవచ్ ఫీచర్లు ఇవే.. రైళ్లు ఢీకొనకుండా నివారణ, బ్లాక్ సెక్షన్లో రైళ్లు ముఖాముఖి లేదా వెనుక నుంచి ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతికత. బ్లాక్స్టాప్ సందేశాలు : ఎదురుగా వచ్చే రైళ్లను అప్రమత్తం చేయడానికి సెక్షన్ పరిధిలో తక్షణమే బ్లాక్ స్టాప్ సందేశాలను పంపుతుంది. రోల్బ్యాక్ ప్రొటెక్షన్ : లోకోమోటివ్ అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి, అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి ఆటోమేటిక్గా నిరోధిస్తుంది. మాన్యువల్ ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో లోకోపైలెట్లు మాన్యువల్ ఎస్ఓఎస్ సిగ్నల్ను పంపే కీలక సదుపాయం ఉంది. వ్యూహాత్మక ప్రాధాన్యం: విజయవాడ–బల్లార్షా మార్గం ప్రాంతీయ రైల్వే మౌలిక సదుపాయాలకు వెన్నెముక వంటిది. ఈ హైస్పీడ్ కారిడార్ కవచ్ను అనుసంధానించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించి సిగ్నలింగ్ నెట్వర్క్ విశ్వసనీయతను పెంపొందించనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఆస్పత్రి అస్తవ్యస్తంపై కలెక్టర్ ఆగ్రహం
వర్ధన్నపేట: వర్ధన్నపేటలోని ఆస్పత్రి అస్తవ్యస్తంగా ఉండడంపై కలెక్టర్ సత్యశారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న బ్యాండేజీ విభాగంలో ప్రమాదాలు జరిగిన వారికి ఎలా చికిత్స చేస్తారని ప్రశ్నించారు. దుమ్ముధూళిని చూపించగా సిబ్బంది నీళ్లు నమిలారు. విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్ స్టోర్లో మందులు అస్తవ్యస్తంగా, ఇంజక్షన్ గదిలో స్క్రాప్ ఉండడం చూసి మందలించారు. తనిఖీ చేస్తున్న సమయంలోనే టాయిలెట్లను శుభ్రం చేయడం ఏమిటన్నారు. టాయిలెట్లకు మరమ్మతులు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి కాంట్రాక్టర్ తీసుకురాగా.. వెంటనే ఆమె స్పందిస్తూ కోటి రూపాయలు అవుతాయా, చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటే నిధులు ఇవ్వడం లేదా అడిగారు. వైద్య సిబ్బంది, వైద్యులు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు పరిమితికి మించి వైద్యం చేస్తే ప్రాణాపాయం ఉండే ప్రమాదముందని ఓ వైద్యుడి గురించి అన్నారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది, పాలనాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలను కలెక్టర్ దృష్టికి రాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ అధికారి, సిబ్బందిపై వేటు పడుతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందికి వెంటనే మెమోలు జారీ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావును ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి, డాక్టర్ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్కుమార్, తహసీల్దార్ విజయసాగర్, వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వర్ధన్నపేట సీహెచ్సీ తనిఖీ అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బంది పనితీరుపై అసహనం నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు ఆదేశం -
వడ్డేపల్లి అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డేపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ డివిజన్లో దవాఖాన, శ్మశానవాటిక, రహదారులు, డ్రెయినేజీల వంటి మౌలిక సదుపాయాలు దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వడ్డేపల్లి, శాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ భాస్కర్ పాల్గొన్నారు. అవగాహన అవసరం: ఎంపీ కావ్యమహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గర్భధారణకు ముందే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు. మేయర్ గుండు సుధారాణి, ఎ మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. -
నేడు హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్రన్
కాజీపేట రూరల్ : కాజీపేట–పెద్దంపేట రైల్వేస్టేషన్ల వరకు 101 కిలోమీటర్ల మేర గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ)ను పూర్తిచేసి గురువారం ట్రయల్ రన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎస్టీఈపీవీ మురళీకృష్ణ, సీఎస్టీఈ ఎం.కోటేశ్వర్రావు నేతృత్వంలో సికింద్రాబాద్ డిప్యూటీ సీఎస్టీఈ జి.కుమారన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ యూనిట్ పనిని పూర్తి చేశారు. స్వదేశీ భద్రత సాంకేతికతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణమధ్య రైల్వేలో గ్రాండ్ ట్రంక్ రూట్ అయిన బల్లార్షా–విజయవాడ సెక్షన్ అత్యంత రైళ్ల ట్రాఫిక్ కలిగింది. ఈ సెక్షన్లో ఎస్ఐఎల్ –0 కవచ్ వ్యవస్థ ప్రమాదాలను నివారిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్పై రెండు రైలు ఇంజన్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ట్రయల్రన్ నిర్వహణకు పలువురు అధికారులు గురువారం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్నుంచి కాజీపేటకు రానున్నారు. కవచ్ ఫీచర్లు ఇవే.. రైళ్లు ఢీకొనకుండా నివారణ, బ్లాక్ సెక్షన్లో రైళ్లు ముఖాముఖి లేదా వెనుక నుంచి ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతికత. బ్లాక్స్టాప్ సందేశాలు : ఎదురుగా వచ్చే రైళ్లను అప్రమత్తం చేయడానికి సెక్షన్ పరిధిలో తక్షణమే బ్లాక్ స్టాప్ సందేశాలను పంపుతుంది. రోల్బ్యాక్ ప్రొటెక్షన్ : లోకోమోటివ్ అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి, అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి ఆటోమెటిక్గా నిరోధిస్తుంది. మాన్యువల్ ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో లోకోపైలెట్లు మాన్యువల్ ఎస్ఓఎస్ సిగ్నల్ను పంపే కీలక సదుపాయం ఉంది. వ్యూహాత్మక ప్రాధాన్యం: విజయవాడ–బల్లార్షా మార్గం ప్రాంతీయ రైల్వే మౌలిక సదుపాయాలకు వెన్నెముక వంటిది. ఈ హైస్పీడ్ కారిడార్ కవచ్ను అనుసంధానించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించి సిగ్నలింగ్ నెట్వర్క్ విశ్వనీయతను పెంపొందించనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. -
హౌస్ లిస్టింగ్ బ్లాక్లు ఏర్పాటు చేయాలి
నల్లబెల్లి: పకడ్బందీగా హౌస్ లిస్టింగ్ బ్లాక్లు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న అన్నారు. ఎంపీడీఓ కార్యాలయలో బుధవారం సెన్సెస్–2027 ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెన్సెస్–2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ల క్రియేషన్, క్రమబద్ధీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, బీఎల్లకు దిశానిద్దేశం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీఓ పసరగొండ రవి, ఏఎస్ఓ అనిల్, ఆర్ఐలు సంపత్, చామంతి పాల్గొన్నారు. జనాభా లెక్కల సర్వే పూర్తిచేయాలిరాయపర్తి: అన్ని శాఖల సమన్వయంతో గ్రామాల్లో జనాభా లెక్కల సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీఎస్ఓ కల్యాణ్, సర్వేయర్ వీరస్వామి, ఆర్ఐలు చంద్రమోహన్, సంధ్యారాణితో జనాభా లెక్కల సర్వే–2027పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
విద్యుత్ సరఫరాలో సమస్యలు అధిగమించాలి
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గౌతంరెడ్డి గీసుకొండ: విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమించాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి అన్నారు. కోటగండి సమీపంలోని పీడీఆర్ గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన ఎన్పీడీసీఎల్ డివిజన్స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వైర్ల బిగింపు తదితర పనులు కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టాలన్నారు. డీటీఆర్ వైఫల్యాలను అధిగమించాలన్నారు. 11 కేవీ ఫీడర్ల విషయంలో అంతరాయాలు, బ్రేక్డౌన్లు లేకుండా జాగ్రత్త వహించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. వరంగల్ రూరల్ ఓపీ డీఈ బి.దానయ్య, వరంగల్ ఎం అండ్ సీ డీఈ జాటోత్ హర్జీనాయక్, క్వాలిటీ కంట్రోల్ డీఈలు శ్రీధర్, రాందాస్నాయక్, వరంగల్ టౌన్ ఓపీ డీఈ ఎస్.మల్లికార్జున్, సంగెం, గీసుకొండ ఓపీ ఏడీఈ బానోతు రవినాయక్, ఏడీఈలు మహేందర్, రవికుమార్, తిరుపతి, తిరుపతి, ఈఆర్ఓ ఏఏఓ పి.శ్రీనివాస్రెడ్డి, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఎంపీ కావ్యకు టీజీఓ నేతల అభినందనలు హన్మకొండ అర్బన్: వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ కడియం కావ్యకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో టీజీఓ బృందం ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోలా రాజేశ్గౌడ్, అస్నాల శ్రీనివాస్, టీజీఓ నేతలు సంతోశ్, మల్లయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, రమేశ్, భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
మానవతా దృక్పథంతో సేవలందించాలి
కాశిబుగ్గ: వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది మానవతా దృక్పథంతో వైద్య సేవలందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఆడ, మగ తేడా చూడకుండా పిల్లలను సమానంగా పెంచాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సమాజంలో లింగవివక్ష కారణంగా అధికంగా భ్రూణహత్యలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, ఇతర వార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించారు. గర్భిణులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, అదనపు కలెక్టర్లు గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈం రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు. పీఎన్జీ సరఫరా పెంచేందుకు చర్యలు న్యూశాయంపేట: పైపులైన్ల ద్వారా సహజవాయువు (పీఎన్జీ) సరఫరాను పెంచేందుకు జిల్లాలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా గ్యాస్ విస్తరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే నర్సంపేటతోపాటు వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సార్ఎన్బీ రాఘవరెడ్డి, డీపీఓ కల్పన, ఇండస్ట్రీస్ జీఎం నరసింహమూర్తి, డీసీఎస్ఓ కిష్టయ్య, మెగా గ్యాస్ కంపెనీ ప్రతినిధులు హరి, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీకేఎం ఆస్పత్రిలో మాతృత్వ దినోత్సవం -
ఆమె ఆర్థికాభివృద్ధికి..
గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీల)కు రుణాల పంపిణీలో జిల్లా మెరుగైన స్థానం సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 8,226 సంఘాలకు రూ.502,83,46,000 బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 7,242 సంఘాలకు రూ.503,14,10,000 ఇచ్చారు. వంద శాతానికి పైగా రుణాలు పంపిణీ చేసిన జిల్లాగా గుర్తింపును సాధించింది. ఎక్కువ ఎస్హెచ్జీలకు రుణాల పంపిణీలో జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. రాష్ట్రంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానం(124.58 శాతం), పెద్దపల్లి జిల్లా రెండో స్థానం (94.23 శాతం), వరంగల్ జిల్లా (88.04 శాతం) తృతీయ స్థానంలో నిలిచింది. లక్షాధికారులను చేయాలన్నదే లక్ష్యం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలనే లక్ష్యంతో లింకేజీ రుణాలను అధికంగా ఇస్తున్నారు. సంఘాల్లోని మహిళలకు ఎవరికి ఎంత అవసరమో ముందే గుర్తించి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు, మండల సమాఖ్య ప్రతినిధులు, సీసీలు వీఓల వారీగా రుణ ప్రణాళిక తయారు చేస్తారు. సంఘాల మహిళలకు వారి అవసరాలు, సామర్థ్యాల ఆధారంగా కుట్టుమిషన్లు, పిండిగిర్ని, కిరాణం, బట్టల షాపు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, పెట్టుబడి సాయం, శానిటరీ న్యాప్కిన్ల తయారీ లాంటి వాటికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నారు. దీంతో వారి జీవనోపాధి మెరుగుపడుతోంది. అలాగే సోలార్ప్లాంట్ల ఏర్పాటు, పాల ఉత్పత్తుల కేంద్రాలు తదితర వాటి నిర్వహణ కోసం రుణాలు అందిస్తున్నారు. ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు 7,242 సంఘాలకు రూ.503,14,10,000 పంపిణీలో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానం జిల్లాలో గీసుకొండ టాప్.. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లాలో గీసుకొండ మండలం ఈసారి కూడా టాప్లో నిలిచింది. ఎక్కువ సంఘాలకు (202.91 శాతం) రుణాలను అందించడం, రుణ పంపిణీలో (118.81 శాతం) ఇతర మండలాలతో పోలిస్తే ముందు నిలిచింది. 2023 నుంచి 2026 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ వరుసగా మండలం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ద్వితీయ స్థానంలో చెన్నారావుపేట, తృతీయ స్థానంలో సంగెం మండలాలు ఉన్నాయి. మండలాల వారీగా ఎస్హెచ్జీలు, పంపిణీ చేసిన రుణాలు(రూ.లలో)గీసుకొండ 413 33,99,98,000 838 40,39,57,000 118.81 చెన్నారావుపేట 642 42,00,30,000 820 46,32,68,000 110.29 సంగెం 847 55,98,93,000 806 62,00,15,000 110.74 వర్ధన్నపేట 664 40,70,20,000 617 43,60,50,000 107.13 ఖానాపురం 677 41,84,41,000 605 41,87,31,000 100.07 నర్సంపేట 478 31,02,51,000 405 32,77,11,000 105.63 పర్వతగిరి 814 49,83,89,000 664 49,21,51,000 98.75 రాయపర్తి 1005 61,36,53,000 780 57,97,62,000 94.48 నెక్కొండ 1001 62,99,11,000 736 59,24,04,000 94.05 నల్లబెల్లి 692 86,63,000 409 31,17,35,000 76,28 దుగ్గొండి 993 2,20,97,000 559 38,56,26,000 91.36 8,226 502,83,46,000 7,242 503,14,10,000 100.06 -
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఒకరి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు హసన్పర్తి: హసన్పర్తి మండలం చింతగట్టు శివారులో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతగట్టు శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. సుమారు రూ.7 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ప్రధాన నిందితుడైన హసన్పర్తికి చెందిన ఓర్సు భానును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్లోని గాంధీనగర్కు చెందిన మౌటం మధుకర్, భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన చిత్తారి ఎర్రగట్టు పరారీలో ఉన్నట్లు వివరించారు. దాడిలో ఇన్స్పెక్టర్ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం
మామునూరు: మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు రైతులనుంచి సేకరించిన 252 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు నిర్ణయానికి వచ్చారు. రన్వే విస్తరణ కోసం రైతులనుంచి సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు మిగతా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు మరో మూడునెల్లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మామునూరుతో పాటు ఆది లాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. హన్మకొండ అర్బన్: చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కోర్సు వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)గా ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, జూలై 1,2026 నాటికి కనీస వయస్సు 15 సంవత్సరాలు పూర్తయ్యి ఉండి.. గరిష్ట వయస్సు 23 సంవత్సరాలుగా ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తారని, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 90300 79242 నంబర్లో లేదా ihithyderabad@gmail.com, klbiht2024@ gmail. com ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. హన్మకొండ అర్బన్: వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ కడియం కావ్యకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో టీజీఓ బృందం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోలా రాజేశ్గౌడ్, శ్రీనివాస్, టీజీఓ నేతలు సంతోశ్, మల్లయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, రమేశ్, భీమ్రావు, పాల్గొన్నారు. హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈఓగా ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ డిప్యూటీ సీఈఓగా పని చేస్తున్న బి.రవి పదోన్నతిపై ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా బదిలీ అయ్యారు. ఈస్థానంలో ములుగు డీఆర్డీఏలో డిప్యుటేషన్పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పని చేస్తున్న ఎం.శ్రీనివాస్ను హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ చౌరస్తా: గర్భిణి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అందుకు గర్భం దాల్చినప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. సురక్షిత మాతృ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు, మహిళల ఆరోగ్యానికి ఆరు అంశాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ మంజుల పాల్గొన్నారు. -
ఆదాయంలో నర్సంపేట మార్కెట్ టాప్
నర్సంపేట: ఆదాయంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ప్రథమ స్థానాన్ని సాధించింది. జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. మిగిలిన మూడు మార్కెట్ల కంటే ఆదాయపరంగా లక్ష్యాన్ని దాటి ముందు వరుసలో నిలిచింది. రూ.5.68 కోట్లకు రూ.6.75 కోట్ల ఆదాయాన్ని ఈ సంవత్సరం సమకూర్చుకుంది. గత సంవత్సరం నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెటింగ్ శాఖకు 46.91 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం రూ.61.45 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, మూడు వ్యవసాయ మార్కెట్లు తక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోగా నర్సంపేట మాత్రం ముందంజలో నిలిచింది. చైర్మన్, అధికారులు, సిబ్బంది సహకారంతో.. జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ల కంటే నర్సంపేట వ్యవసాయ మార్కెట్ అధిక ఆదాయం సమకూర్చుకోవడంలో అందరి కృషి ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేయడంతో లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడం, ఈ సంవత్సరం లక్ష్యాన్ని అధిగమించి రూ.కోటి 7లక్షల వరకు అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం. నెక్కొండ రూ.6లక్షలు వెనుకబడి ఉండి కొంత ఫరవాలేదు అనిపించుకుంది. ఏనుమాముల, వర్ధన్నపేట మార్కెట్లు మాత్రం వెనుకబడి పోయాయి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి, ధాన్యం, మక్కలు ప్రధానంగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో పాటు ఫీజు వసూళ్లలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండడంతో ఆదాయం పెరిగింది. అందరి కృషితోనే ఆదాయం..నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆదాయం లక్ష్యం కంటే అధిగమి ంచడంలో అందరి కృషి ఉంది. రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తూనే ఆదాయం సమకూర్చడంలో సఫలీకృతం అయ్యాం. రానున్న రోజుల్లో వ్యవసాయ మార్కెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతాం. – పాలాయి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ -
మ్యాపింగ్ సమగ్రంగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల మ్యాపింగ్ను సమగ్రంగా, కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ పరిధి 67 రెవెన్యూ వార్డుల్లో ప్రతీ గృహ సముదాయం పూర్తిగా కవర్ అయ్యేలా మ్యాపింగ్ చేపట్టాలని సూచించారు. ఆయా సమావేశాల్లో సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్ఓ రామ్ దయాకర్రెడ్డి, జనగణన అధికారి సతీశ్, తహసీల్దార్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంల తరలింపు పరిశీలన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని తాత్కాలిక ఈవీఎం గోదాముల నుంచి హనుమకొండ జిల్లాకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సుబేదారి రెడ్ క్రాస్ వెనుక నిర్మించిన నూతన గోదాంకు బుధవారం తరలించారు. ఈప్రక్రియను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగాధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలి
సీపీ సన్ప్రీత్ సింగ్ భీమదేవరపల్లి: డ్రగ్స్ నియంత్రణపై స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ రికార్డులు, పలు పెండిగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అదేవిధంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరవధిక సమ్మెలోకి..
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దాదాపు పూర్తి స్థాయిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు బుధవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను సబ్స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్ల నిర్వహణను ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు చూసుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జె న్ కో, ట్రాన్స్కో, డిస్కంలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,382 మంది అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, 3,457 మంది ఆర్టిజన్ ఉద్యోగులున్నారు. వీరిలో కొందరు మినహా అందరూ సమ్మెకు దిగారు. సర్కిల్, డివి జన్ కార్యాలయాల వద్ద సమ్మె నిర్వహించారు. వర్కర్ల కొరత.. ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు విధులకు దూరంగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు వర్కర్ల కొరత నెలకొంది. ఈ తరుణంలో ఈదురుగాలు, ప్రకృతి విపత్తులు తలెత్తి విద్యుత్ లైన్లలో సమస్యలు తలెత్తితే అంధఃకారం తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల బాధ్యతలు నిర్వహించడానికి సరిపోతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏదైనా సమస్య ఏర్పడితే పని చేయడానికి అందుబాటులో ఎవరూ లేరు. ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలోనూ విద్యుత్ స్తంభాలు ఎక్కి చక్కదిద్దే పనులు ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు చేసేవారు. ప్రస్తుతం వీరు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య జఠిలంగా మారనుంది. మాట్లాడుతున్న టీఆర్పీఏయూ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు రమణారెడ్డి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఉద్యోగులు 3,457 అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,382 మంది సమ్మె కొనసాగితే ఇబ్బందులే.. ఈదులు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే అంధకారమే.. సర్వీస్ రూల్స్ అమలు చేయాలిరెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ ఉద్యోగులకు ఒకే సర్వీస్రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్ల అర్హతను బట్టి రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ రావుల రమణారెడ్డి అన్నారు. నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రమణారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ యూనియన్ ఆర్టిజన్ల పోరాటానికి అండగా ఉంటుందన్నారు. టీఎస్ఈఈయూ–327 హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, టీఆర్పీఈయూ నాయకులు కడెం మహేశ్, వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ట్రాన్స్కో జోనల్ కార్యాలయం ఎదుట.. నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ట్రాన్స్కో ఆర్టిజన్ ఉద్యోగులు హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయం వద్ద నిరసన తెలి పారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి ఆర్టిజన్లకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో విభాగం రాష్ట్ర కన్వీనర్లు వెంకటేశ్, భరత్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రెటరీ సునీల్, జేఏసీ నాయకులు శ్రీనివాస్, మూర్తి, ప్రసాద్, ఆనంద్, రంగారావు పాల్గొన్నారు. టీఆర్పీఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు రావుల రమణా రెడ్డి -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూ నే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీంతో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటరు లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటరు లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగతం’పై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
వరంగల్
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ7● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ఫ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌస్రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
కాశిబుగ్గ: పది జిల్లాలకు వైద్యసేవలందించాల్సిన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపరచాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అలాగే, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల ఆస్పత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో ఉన్న అలసత్వం, వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళ ఆర్ఎంఓలు తప్పనిసరిగా రౌండ్స్ వేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ టెండర్ను ఇంకా పెట్టడం లేదని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి వారం రోజుల్లో డ్రగ్స్ టెండర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సినన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైన నిధుల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించినట్లు ఆయన వివరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు -
వైద్యసేవలపై అవగాహన కల్పించాలి
కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఐఎంఎ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ జీవితం మహోన్నతమైనదని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ, తగిన ఆహారం సమయానుకూలంగా తీసుకోవాలని కోరారు. వ్యాధులు రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పు లేకపోవడమేనన్నారు. వైద్యశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన కలిగిన వారంతా వ్యాధులకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాలకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ భరత్కుమార్, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి సంగెం: నిర్దేశిత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఆశాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, లబ్ధిదారులకు ఎంతవరకు బిల్లులు అందాయి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఆలస్యం కాకుండా సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు సామూహిక గృహప్రవేశాలను ప్రభుత్వం నిర్వహించనున్నందున లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ డీఈ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ కొంగర మల్లమ్మ, మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్యాదవ్, పంచాయతీ కార్యదర్శి సృజన తదితరులు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్ పూర్తిచేయాలిన్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 17లోగా జనగణనకు సంబంధించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ వారీగా పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
గ్రామ పంచాయతీ స్థలం ఆక్రమణ
నెక్కొండ: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగారంలో గ్రామ పంచాయతీ స్థలాన్ని అక్రమించి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్న సంఘటనపై గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ స్థలంలో కొన్నేళ్లుగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. పక్కనే జాతీయ జెండా గద్దె, నల్లా ట్యాంకు ఉంది. ఆ స్థలం పక్కనే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్కాల మల్లారెడ్డి ఇల్లు ఉంది. ఆయనకు ఉన్న స్థలంతోపాటు గ్రామ పంచాయతీ స్థలంలోని గద్దెను, నల్లా ట్యాంకును కూల్చాడు. ఆక్రమించిన స్థలంలో ఏకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. గ్రామస్తులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత నెల 23న కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి విచారణకు డీపీఓను ఆదేశించారని వారు విలేకరులకు వివరించారు. విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని ఎంపీఓ దయాకర్కు.. డీపీఓ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. విచారణ అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆక్రమణకు పాల్పడిన మల్లారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ శీలం వెంకన్న, కేతిరెడ్డి స్వామిరెడ్డి, పిచ్చయ్య, యాకూబ్రెడ్డి, ఉప్పల సాంబయ్య, కూరపాటి నగేశ్, రాయపురం ఉప్పలయ్య, జంగిలి రాములు తదితరులు పాల్గొన్నారు. దర్జాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం.. నాగారంలో కాంగ్రెస్ నాయకుడి నిర్వాకం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
ఏడాది ఎదురుచూసుడే!
హనుమకొండ, వరంగల్ ఇప్పట్లో కలవడం కష్టమే! {‘కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చవద్దని గడువు విధించింది. అది ముగిసిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’ – ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రీ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ● 2027 మార్చి 31 తర్వాత జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు ● కేంద్రం గడువు విధించినట్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ● మరోవైపు ఏడాదిగా ఉద్యమం ఉధృతం ● రెండు జిల్లాల పరిధి కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకమయ్యే చాన్స్ ● రాజకీయ పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు తీసుకునేలా కార్యాచరణసాక్షి, వరంగల్: అశాసీ్త్రయంగా ఏర్పడిన హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో మరో ఏడాది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం విధించిన గడువు ఏడాది, ఆతర్వాత కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది. ఇలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన అశాసీ్త్రయ జిల్లాల విభజన అంశం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం ఉంది. ముక్కలైన చారిత్రక నగరం.. వరంగల్ కలెక్టరేట్తో పాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి. వరంగల్ జిల్లా వాసులు కలెక్టర్ను కలవాలంటే హనుమకొండకు రావాల్సిన పరిస్థితి. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో కలిపి ట్రైసిటీగా పిలవబడే ఈ చారిత్రక నగరాలను గత ప్రభుత్వం రెండు ముక్కలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది కాలంగా వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ అంశం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార పార్టీకి చిక్కులు తేవొచ్చన్న చర్చ జరుగుతోంది. కాగా, రెండు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టేలా సదస్సులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేయూ ప్రొఫెసర్లు చెబుతున్నారు. కలిపితేనే ఎదుగుదలవ్యవసాయ, పారిశ్రామిక, సేవా, పర్యాటక రంగాలు కలిస్తేనే ఒక ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుంది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఆ రంగాల అభివృద్ధికి అవకాశాలు, వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇలా చేస్తేనే ఈ రెండు జిల్లాలు ఒకే ఆర్థిక యూనిట్గా అభివృద్ధి చెందగలవు. పరిపాలనపరంగా కూడా ఈ రెండు జిల్లాల కలయిక ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఆర్థికంగా, సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా ఏ కోణం నుంచి చూసినా ఈ రెండు జిల్లాలు వేర్వేరుగా మనలేవు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర ఆదాయ పెంపుదలకు, ఉపాధి కల్పనకు హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా చేయడం తక్షణ అవసరమని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వపు జిల్లాను సాధిస్తాం..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండు జిల్లాల పరిధిలో జరగనున్నాయి. విడగొట్టిన చారిత్రక నగరాన్ని కలపాలనే డిమాండ్ ఇప్పటికే వినిపిస్తున్నాం. రాబోయే ఈ బల్దియా ఎన్నికల్లో ఈ నినాదాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ట్రైసిటీని కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం. మాకు మద్దతిచ్చిన వారికి ఓటు వేయాలని బహిరంగంగా ప్రజలకు కూడా చెబుతాం. మా ఏకై క లక్ష్యం విడిపోయిన చారిత్రక నగరాన్ని కలిపి వరంగల్ జిల్లాగా చేయడమే. ఇతర సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులను కలుపుకొని ముందుకెళ్లి పూర్వపు జిల్లాను సాధిస్తాం. – పుల్లూరు సుధాకర్, అధ్యక్షుడు, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ -
ఏడాది ఎదురుచూసుడే!
‘కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చవద్దని గడువు విధించింది. అది ముగిసిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’– ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రీ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షి, వరంగల్: అశాసీ్త్రయంగా ఏర్పడిన హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో మరో ఏడాది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం విధించిన గడువు ఏడాది, ఆతర్వాత కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది. ఇలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన అశాసీ్త్రయ జిల్లాల విభజన అంశం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం ఉంది. ముక్కలైన చారిత్రక నగరం.. వరంగల్ కలెక్టరేట్తో పాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి. వరంగల్ జిల్లా వాసులు కలెక్టర్ను కలవాలంటే హనుమకొండకు రావాల్సిన పరిస్థితి. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో కలిపి ట్రైసిటీగా పిలవబడే ఈ చారిత్రక నగరాలను గత ప్రభుత్వం రెండు ముక్కలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది కాలంగా వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ అంశం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార పార్టీకి చిక్కులు తేవొచ్చన్న చర్చ జరుగుతోంది. కాగా, రెండు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టేలా సదస్సులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేయూ ప్రొఫెసర్లు చెబుతున్నారు. పూర్వపు జిల్లాను సాధిస్తాం.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండు జిల్లాల పరిధిలో జరగనున్నాయి. విడగొట్టిన చారిత్రక నగరాన్ని కలపాలనే డిమాండ్ ఇప్పటికే వినిపిస్తున్నాం. రాబోయే ఈ బల్దియా ఎన్నికల్లో ఈ నినాదాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ట్రైసిటీని కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం. మాకు మద్దతిచ్చిన వారికి ఓటు వేయాలని బహిరంగంగా ప్రజలకు కూడా చెబుతాం. మా ఏకై క లక్ష్యం విడిపోయిన చారిత్రక నగరాన్ని కలిపి వరంగల్ జిల్లాగా చేయడమే. ఇతర సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులను క లుపుకొని ముందుకెళ్లి పూర్వపు జిల్లాను సాధిస్తాం. – పుల్లూరు సుధాకర్, అధ్యక్షుడు, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్హనుమకొండ, వరంగల్ ఇప్పట్లో కలవడం కష్టమే! 2027 మార్చి 31 తర్వాత జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు కేంద్రం గడువు విధించినట్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఏడాదిగా ఉద్యమం ఉధృతం రెండు జిల్లాల పరిధి కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకమయ్యే చాన్స్ -
ప్రభుత్వ పాఠశాల సందర్శన
వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విభాగాల అకడమిక్ పరిశీలనలో భాగంగా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) డాక్టర్ బండారు మన్మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్ కలిసి ఎర్రబెల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా ప్రీ–ప్రైమరీ తరగతుల్లో అమలవుతున్న అకడమిక్ ప్రమాణాలు, బోధన విధానాలు, పిల్లల అభ్యసన స్థాయి, తరగతి గది వాతావరణం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించేలా ఆటల ద్వారా బోధన అమలవుతున్న తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న బోధన అభ్యాస సామగ్రి, ప్రీప్రైమరీ కిట్లు, ఫర్నిచర్, ఆట వస్తువులు నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటం ఉధృతం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగతం’పై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
ఎండను ఎదుర్కొందామిలా..
హన్మకొండ అర్బన్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండల ధాటికి పిల్లలు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండను దీటుగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు వైద్యులు. ఆ వివరాలే ‘సాక్షి’ ప్రత్యేకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు గుడ్డ, టోపీ లేదా హెల్మెట్ ధరించాలి. బయటకు వెళ్లే ముందు నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఉదయం11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలి. ● దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎక్కువగా చెమట పడితే ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం లేదా మజ్జిగ తీసుకోవాలి. బస్సులు, బైక్లపై ఎక్కువసేపు ప్రయాణించొంద్దు. తల నేరుగా ఎండలో ఉండకుండా జాగ్రత్తపడాలి. ● సాధారణంగా 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి, బయట పని చేసే వారు 4 నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవాలి. పిల్లలకు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువగా తాగకుండా మధ్య మధ్యలో తాగాలి. ● పెరుగు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, కర్బూజ, దోస వంటి తేలికైనవి తీసుకోవాలి. ● వేపుడు పదార్థాలు, మసాలా ఆహారం, మద్యపాన పదార్థాలు, గ్యాస్ పానీయాలకు దూరంగా ఉండాలి. డీహైడ్రేషన్, వడదెబ్బ లక్షణాలు నోరు ఎండిపోవడం, తల నిర్భంధం, బలహీనత, అలసట మూత్రం గాఢంగా రావడం. శరీరం చాలా వేడిగా ఉండడం, చెమట తగ్గిపోవడం, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం తక్షణ చర్యలు వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. నీరు లేదా ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమైతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. బయట నుంచి వచ్చిన తర్వాత.. వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగితే ప్రమాదమే ● 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణంగా భరించగల స్థాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. కానీ, నీళ్లు తాగకపోతే అలసట, చెమట ఎక్కువగా వస్తుంది. ● 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు మోస్తరు ప్రమాద స్థాయి, తలనొప్పి, అలసట, చెమట ఎక్కువగా రావడం ఎక్కువసేపు ఎండలో ఉంటే బలహీనత అనిపిస్తుంది. ● 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ప్రమాద స్థాయి, తల తిరగడం, నీరసం, వాంతులు వచ్చే అవకాశం, హీట్ ఎగ్జాషన్ లక్షణాలు కనిపిస్తాయి. బయట ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం ● 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ప్రమాదకర స్థాయి, వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ. ● శరీరం వేడి పెరగడం, చెమట తగ్గిపోవడం తక్షణ జాగ్రత్తలు అవసరం ● 42 డిగ్రీల సెల్సియస్కు పైగా అత్యంత ప్రమాదకర స్థాయి. శరీరం తట్టుకోలేని పరిస్థితి స్పృహ కోల్పోవడం, ప్రాణాపాయం వరకు వెళ్లే అవకాశం. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలి. ముందు జాగ్రత్త అవసరం.. వేసవిలో వడదెబ్బకు గురై ఇబ్బందులు పడేకంటే ముందు జాగ్రత్తలు పాటిస్తే ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం అవసరం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ టి.సనత్ కుమార్, ఎండీ ఫిజీషియన్, మనీష క్లినిక్, బాలసముద్రండిగ్రీలు (సెల్సియస్లలో)39 38 37 37 37 37 35 36 పిల్లలు, వృద్ధులు రక్షణ చర్యలు పాటించాలి ముందస్తు జాగ్రత్తలతో డీహైడ్రేషన్కు చెక్ తేదీ 8 7 6 5 4 3 2 1 -
వైద్యసేవలపై అవగాహన కల్పించాలి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ● ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు కాశిబుగ్గ: పది జిల్లాలకు వైద్యసేవలందించాల్సిన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపర్చాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అలాగే, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల ఆస్పత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో ఉన్న అలసత్వం, వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళ ఆర్ఎంఓలు తప్పనిసరిగా రౌండ్స్ వేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ టెండర్ను ఇంకా పెట్టడం లేదని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో డ్రగ్స్ టెండర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైన నిధుల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించినట్లు ఆయన వివరించారు. -
దోస్తు మేరా దోస్తు..
దుగ్గొండి: వారంతా చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నారు. టెన్త్ అనంతరం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. 47కు మళ్లీ కలుసుకున్నారు. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978–79 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన వారంతా సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. జీవిత చరమాంకం వరకు తరచూ కలుసుకుంటూ సంతోషంగా ఉండాలని తీర్మాణించుకున్నారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి, గుడిపెల్లి సాయిరెడ్డి, నల్ల జనార్ధన్రెడ్డి, ఓదేలు, కొమ్మెర పెద్దన్న, బోళ్ల చంద్రయ్య, సారంగం, చల్ల సంజీవరెడ్డి, గోవర్ధన్రెడ్డి, యాదగిరి, రంగారెడ్డి, మోహన్రావు, రాజిరెడ్డి, మోహన్రెడ్డి, లీలారాణి, రాధిక, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 47 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ప్రజావాణిలో 150 వినతులున్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న కలెక్టర్ దరఖాస్తుదారుల సమక్షంలోనే అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో వినూత్నంగా దరఖాస్తుదారుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జూమ్ వీడియో కాల్ ద్వారా సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమన్వయం చేసి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 150 వినతులు రాగా అందులో రెవెన్యూ 58, జీడబ్ల్యూఎంసీ 27, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, ఆర్డీఓలు సుమ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా బిల్లులు మంజూరు చేయాలని తిర్మలాయపల్లి, రాయపర్తి మండలవాసులు వినతిపత్రం అందించారు. ● జిల్లా చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతన్నల ఉపాధిని దెబ్బతీసే ప్రైవేట్ టెండర్ విధానాన్ని ఆపాలని వరంగల్ చేనేత కార్మికులు విన్నవించారు.జనరల్ ఆస్పత్రిగా మార్చండి ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చాలి. ఇలా చేస్తే వేలాది మందికి ఉపయుక్తంగా ఉంటుంది. ఔషధ గిడ్డంగిని వేరేచోటుకు మార్చాలి. కరీమాబాద్ వై ఆకారం బ్రిడ్జిపై పాదాచారులకు ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలి. మోంథా బాధితులకు ఆర్థికసాయం అందించాలి. – మరుపల్ల రవి, కార్పొరేటర్ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే నిర్మాణం చేసుకుంటా. ఇప్పటికీ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. పేద కుటుంబానికి చెందిన తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కే.అశోక్, రామతీర్థం, నల్లబెల్లి -
లింగనిర్ధారణ చట్టరీత్య నేరం
● జిల్లా బాలల సంరక్షణాధికారి కె.ఉమ రాయపర్తి: లింగనిర్ధారణ చట్టరీత్య నేరమని, తల్లిదండ్రులు బాలికలపై ఎటువంటి వివక్ష చూపకూడదని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.ఉమ పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంలో సహకార సంఘాల మహిళలకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఉన్నత స్థానాలను అధిరో హిస్తారన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎక్కడైనా తెలిసినట్లయితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ఆనంద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రసూన, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, 102, 108 వాహనాల వినియోగం, బ్లడ్ బ్యాంక్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్ ప్రసవాలు తగ్గించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. ఆహారంలో నాణ్యత పాటించాలి.. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫుడ్ ఇన్చార్జ్ లు, వంట కార్మికులు, సహాయకులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి సాధనకు శిక్షణ..మహిళలు స్వయం ఉపాధిని సాధించేందుకు శిక్షణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో దామెర మండలం ల్యాదెళ్లలో మహిళలకు ఉపాధి కల్పించే శిక్షణ కార్యక్రమాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వి–హబ్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరకాల నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, చీర రోలింగ్ యూనిట్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా క్వింటా రూ.2,400 చొప్పున కొనుగోలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, డీఎస్ఓ నీరజ, తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరిలో.. పర్వతగిరి: మండలంలోని పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంట ఉత్పత్తులను విక్రయించాలని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
మాముళ్ల దందా..!
కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు?సీకేఎంలో ఆగని కాశిబుగ్గ : పేదల ఆస్పత్రిగా పేరున్న వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ ఆస్పత్రిలో (సీకేఎం ప్రసూతి హాస్పటల్) వసూళ్ల దందా ఆగడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది సిబ్బంది పాత అలవాటును మానుకోలేక అందిన కాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వయంగా కలెక్టర్ సందర్శించి, వసూళ్ల విషయంలో ఘాటుగా హెచ్చరించినా సిబ్బంది దందా ఆగడం లేదు. వారం రోజుల నుంచి డెలివరీగా కాగానే.. లేబర్ రూంలో కొంతమంది దాయమ్మలు (ఎఫ్ఎన్ఓ) వసూళ్ల బేరం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, సోమవారం సూపరింటెండెంట్ పేషీకి చేరడం చర్చనీయాంశంగా మారింది. మారని సిబ్బంది తీరు వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందాపై ఇటీవల సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యి ఆకస్మిక తనిఖీలు చేపట్టి, పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రత్యేకంగా ప్రతీవార్డులో ఫిర్యాదుల బాక్స్లు ఏర్పాటు చేయించారు. అలాగే వార్డుల్లో పేషెంట్లు వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అడిగితే కలెక్టర్ కార్యాలయం, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకు రావాలంటూ, సెల్నంబర్లలో కూడా ఫిర్యాదు చేయాలని మైకు ద్వారా చాటింపు చేయించారు. అయినా వసూళ్ల విషయంలో తొలుత కొంతవరకు భయంతో ఆగినా కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు సమాచారం. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కూడా రెండుసార్లు సందర్శించి, వైద్యసిబ్బందిని మందలించినా తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దాయమ్మలు, స్వీపర్లపై ఆరోపణలు ఆస్పత్రిలోని లేబర్ రూమ్లో కొంతమంది దాయమ్మలు, స్వీపర్లు రోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ దందాను ఒకరిపై ఒకరు నెట్టివేస్తున్నారు. దాయమ్మలు తీసుకోమంటేనే తీసుకుంటున్నామని శానిటేషన్ సిబ్బంది, తమకు సంబంధం లేదని దాయమ్మలు వాదిస్తున్నట్లు సమాచారం. చివరకు పేషంట్లు, అటెండెంట్లు దీనిపై ఫిర్యాదు రాసి బాక్స్లో వేసినట్లు తెలుస్తోంది. దీనిని కప్పి పుచ్చుకోవడానికి ఫిర్యాదు చేసిన వారినుంచి వైద్యసిబ్బంది డబ్బులు తీసుకోలేదంటూ కాగితం రాయించుకోవడం విమర్శలకు దారితీస్తుంది. కొంతమంది పేషంట్ల అటెండెంట్లు ధైర్యం చేసి ఫిర్యాదుల బాక్స్లో వేసినప్పుడు వారితో కాంప్రమైజ్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. డబ్బుల వసూళ్ల విషయంలో అధికారులు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోకుండా ప్రైవేట్ సిబ్బందిని తొలగింపునకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూపరింటెండెంట్ వద్దకు చేరిన ఉదంతం వసూళ్ల విషయంలో ఏర్పడిన ఉదంతం సోమవారం సూపరింటెండెంట్ వద్దకు చేరింది. ఓస్వీపర్తో అనవసరంగా రా యించుకుని పక్కకు పెట్టడం ఏంటని యూనియన్ నా యకులు సూపరింటెండెంట్తో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సర్కార్ సిబ్బందికి మద్దతు, ప్రైవేట్ వ్యక్తుల తొలగింపు సూపరింటెండెంట్ వద్దకు వసూళ్ల వ్యవహారం! -
అర్జీలు సత్వరమే పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 155 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతి నగరంలోని 65వ డివిజన్ పరిధి చింతగట్టు గ్రామానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని సీనియర్ సిటిజన్న్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విద్యారణ్యపురి–గోపాలపురం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ద్వారా హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి లేఖ అందజేశారు. వరంగల్ అర్బన్: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు ‘ఎర్లీ బర్డ్’ పద్ధతిలో అందిస్తున్న 5 శాతం రాయితీపై ప్రత్యేక దృ సారించాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. సోమవారం నగర ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లలో అధికారులు చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. ఎర్లీ బర్డ్ రాయితీ ప్రయోజనాలను ప్రతీ పన్నుదారుడికి చేరవేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో సుమారు రూ.80 కోట్ల నల్లా పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వసూళ్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్) పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్ను కూడా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కూలి చెల్లింపులో మరింత పారదర్శకత
● రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శేషు సంగెం: ఉపాధి హామీ పథకంలో ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్)తో కూలి చెల్లింపు విధానంలో మరింత పారదర్శకత ఉంటుందని రూరల్ డెవలప్ మెంట్ జాయింట్ కమిషనర్ శేషు అన్నారు. సోమవారం మండలంలోని తీగరాజుపల్లిలోని తెట్టెకుంట వద్ద ఉపాధి హామీ పని చేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి పనితీరు, ఫొటో క్యాప్చర్ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కూ లీలతో మాట్లాడారు. సాంకేతికత వినియోగంతో పనితీరు మరింత మెరుగవుతుందన్నారు. ఉదయం, సాయంత్రం ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయడం అవకతవకలకు తావు ఉండదన్నారు. యాప్ వినియోగాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో ఇంటర్నెట్ సమస్యతో ఫొటో క్యాప్చర్లో ఆలస్యం అవుతుందని సిబ్బంది తెలిపారు. కూలీలు పనిచేసిన సకాలానికి డబ్బులు జమ కావడం లేదని దృష్టికి తేగా ఈ వారంలో వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, ఎంపీడీఓ రవీందర్, డీఆర్పీ విజయ, ఏపీఓ గణేష్, కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, టెక్నికల్ అసిటెంట్లు సురేష్, సుధాకర్, సర్పంచ్ కర్జుగుత్త గోపాల్, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఎఫ్ఏ సుమలత, కూలీలు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు
● మద్యం మత్తులో కారు డ్రైవర్ ● విద్యార్థులకు తప్పిన ప్రమాదం దామెర: మద్యం మత్తులో కారు నడిపి.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఘటన దామెర మండలంలోని ఒగ్లాపూర్లో సోమవారం చోటుచేసుకుంది. దామెర శివారులోని ఏకశిల పాఠశాల విద్యార్థులను ఇళ్లల్లో దింపేందుకు బస్సులో దుర్గంపేట్వైపునకు స్కూల్ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో గూడెప్పాడ్ నుంచి హనుమకొండకు వెళ్తున్న టీఎస్03ఎఫ్సీ 0456 నంబర్గల కారును రాజశేఖర్ అతివేగంతో, అజాగ్రత్తతో నడుపుతూ.. ఒగ్లాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్వద్ద స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. కారును నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది విద్యార్థులు ఉండగా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై పాఠశాల ప్రిన్సిపాల్ బేతి కొండల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొంక అశోక్ పేర్కొన్నారు. -
లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతీ శాఖకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు ముందుకు సాగితేనే ఫలితాలు ఉంటాయన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి.గణేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ రికవరీ చట్టంపై వీడియోకాన్ఫరెన్స్ రెవెన్యూ రికవరీ చట్టం అమలుపై సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్షించారు. ప్రభుత్వ బకాయిల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, పారదర్శకంగా వ్యవరించాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సీఈఓతో పాటు బిహార్ అదనపు సీఈఓ ప్రశాంత్కుమార్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన ఎన్ఆర్ఈజీఎస్ జేసీ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను సోమవారం కలెక్టరేట్లో ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శేషుకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
జల్సా రాజాలు
కాజీపేట: యువత ప్రస్తుతం రెండు పదుల వయస్సు దాటకుండానే జల్సారాయుళ్లవుతున్నారు. అమ్మాయిల మనస్సు గెలుచుకోవాలనే ఆరాటంతో విలువైన కానుకలు ఇచ్చేందుకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చులకు అలవాటు పడుతున్నారు. డబ్బు దొరకని సమయంలో చోరీలు, చైన్స్నాచింగ్లకు సైతం వెనుకాడడం లేదు. వరంగల్ మహా నగరంలో అప్పుడప్పుడు ఎక్కడో ఓ చోట చైన్స్నాచింగ్ జరుగుతునే ఉంది. ఇటీవల ట్రైసిటీలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు అధిక సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సగానికి పైగా యువకులే ఉండడం గమనార్హం. విచారణలో వారు ప్రేమికురాలి కోసమే చోరీలకు పాల్పడుతున్నట్లుగా చెబుతుండడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రవర్తనలో మార్పులు.. పదో తరగతి పూర్తయ్యి కళాశాలలో అడుగు పెట్టిన విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వస్తోంది. కొత్త స్నేహితులు పరిచయం కావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిన ఖర్చులు కొన్ని అయితే తెలియకుండా ఇతరత్రా ఖర్చులు మరికొన్ని. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు ఇప్పుడు తోటి స్నేహితుల కంటే అమ్మాయిలతో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చైన్ స్నాచింగ్లకు రెక్కీలు.. యువకులు బైక్లపై స్నేహితులతో తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. రెండు, మూడు సార్లు రెక్కీ నిర్వహించి, ఆభరణాలు ధరించి ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయిస్తున్నారు. దొంగల్లో యువకులే ఎక్కువ మంది నిందితులుగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాజీపేట పట్టణంలో తొమ్మిది ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన యువకుడు జల్సాలకు అలవాటు పడే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం విశేషం. ఇటీవల సీసీఎస్ పోలీసులకు చిక్కిన యువకులు ప్రేమ పాఠాల్లో మునిగి తేలుతున్నట్లుగా విచారణలో అంగీకరించడం గమనార్హం. కళాశాలకు వెళ్తున్న తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వెంటనే వారిని సున్నితంగా మందలించాలి. అదే పనిగా డబ్బులు అడగడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు చేస్తున్నారంటే వారు గాడి తప్పినట్లేనని గుర్తించాలి. – పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేట మితిమీరుతున్న యువకుల ఖర్చులు నగదు కోసం చోరీలు, చైన్స్నాచింగ్లు -
బొగ్గు లారీలు అడ్డగించి ఆందోళన
కమలాపూర్: మండలంలోని ఉప్పల్లో పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నేతాజీ రైల్వే లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఉప్పల్ ఆర్ఓబీ వద్ద బొగ్గు లారీలను అడ్డగించి ఆందోళన చేపట్టారు. నేతాజీ రైల్వే లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు మాట్లాడుతూ.. నేతాజీ లోడింగ్, అన్లోడింగ్ యూనియన్లో 280 మంది సభ్యులు ఉన్నారని, గతంలో తమకు ఒక్కో లోడింగ్, అన్లోడింగ్కు రూ.11 వేలు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టర్ మాత్రం తమకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు లేబర్తో పని లేదని, తాము లేబర్ను పెట్టుకోవాలన్న నిబంధన ఏమీ లేదని అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రూ.11 వేలు ఇచ్చినప్పుడే ఇంకొంత పెంచాలని అడిగామని, ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ మాత్రం వేతనం పెంచకపోగా మరీ అధ్వానంగా తక్కువ ఇస్తానంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరసన ఆందోళనకు దిగి బొగ్గు లారీలను అడ్డగించామని, పనికి తగ్గ వేతనం ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో లోడింగ్, అన్లోడింగ్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పనికి తగిన వేతనం చెల్లించాలని కార్మికుల డిమాండ్ -
కేన్ మొక్కలను సంరక్షించాలి
● వృక్షశాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీశ్ వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీశ్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీశ్ కోరారు. -
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభయమ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధి పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు. కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో 12 ఏళ్ల క్రితం 3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ట్యాంకు శిథిల దశకు చేరుకుంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలోని 16 బ్లాకులు, 512 క్వాటర్స్లో నివాసం ఉండే ప్రజలకు నిత్యం తాగునీరందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ట్యాంకు చుట్టూ రంధ్రాలు ఏర్పడి నీరు లీకవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని రాజీవ్ గృహకల్ప వాసులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని వాటర్ ట్యాంకుకు మరమ్మతులు చేయాలని, లేకపోతే నూతన ట్యాంకు నిర్మించి ఇవ్వాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్పాయ్ ప్రస్తుతం ఐదు కీలక పదవులను ఒకేసారి నిర్వర్తిస్తూ పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్ హోదాతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (ఎఫ్ఏసీ), జిల్లా పరిషత్ సీఈఓ, డీసీసీ బ్యాంక్ చైర్మన్, ‘కుడా’ వైస్ చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతమైన పనుల్లో బిజీగా గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కలెక్టరేట్లో అన్ని శాఖల పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ శాఖల సమావేశాలు, సమీక్షలతో పాటు మున్సిపల్, డీసీసీ బ్యాంకు కార్యక్రమాలకు హాజరవుతూ.. బాధ్యతలను సమన్వయం చేస్తున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి వచ్చే వినతులను స్వయంగా స్వీకరించి, వారికి తగిన సమాధానాలిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పనులు వే గంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే అధికారి ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే, కలెక్టర్గా మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ హోదాల్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
వరంగల్ నుంచే మైనారిటీల గళం వినిపిద్దాం
● టీఎస్ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్న్యూశాయంపేట: మైనారిటీల హక్కుల కోసం వరంగల్ నుంచే గళం వినిపిద్దామని టీఎస్ఎంహెచ్పీఎస్ (తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మైనార్టీలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. అడ్వకేట్ అబ్దుల్ కరీం వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ తన్వీర్ మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సచార్, రంగనాఽథ్ మిశ్రా కమిటీలు నివేదికలు ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో చిన్నచూపు చూస్తూ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పదవుల్లో తమ వాటా దక్కేవరకు పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను ప్రకటించారు. నాయకులు ఎండీ వసీం, తాజుద్దీన్, అబ్దుల్ కరీం, రాజ్మహ్మద్, జుబేదా, నన్నేసాబ్, మెహిబుద్దీన్, సర్వర్ఘాజీ, షర్ఫోద్దీన్, గుంషావలీ, బిలాల్, హమీద్షరీఫ్, అజ్మెర్, ఖాజాషర్ఫొద్దీన్, అజర్, గులాం హుస్సేన్ కరీంనగర్, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధి మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
బీరమయ్య జాతర.. తరలొచ్చిన భక్తజనం
వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మకు ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కానీ, రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం దేవర్ల రాకతో మొదలైన జాతర -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్, పిట్టరాములు, వలుస కిరణ్ పాల్గొన్నారు. చేనేత సంఘాల ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ -
వరంగల్ నుంచే మైనారిటీల గళం వినిపిద్దాం
మాట్లాడుతున్న అబ్దుల్ కరీం ట్రస్ట్ చైర్మన్ తన్వీర్న్యూశాయంపేట: మైనారిటీల హక్కుల కోసం వరంగల్ నుంచే గళం వినిపిద్దామని టీఎస్ఎంహెచ్పీఎస్ (తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మైనా ర్టీలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. అడ్వకేట్ అబ్దుల్ కరీం వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ తన్వీర్ మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సచార్, రంగనాఽథ్ మిశ్రా కమిటీలు నివేదికలు ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో చిన్నచూపు చూస్తూ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పదవుల్లో తమ వాటా దక్కేవరకు పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర నాయకులు ఎండీ వసీం, తాజుద్దీన్, అబ్దుల్ కరీం, రాజ్మహ్మద్, జుబేదా, నన్నేసాబ్, మెహిబుద్దీన్, సర్వర్ఘాజీ, షర్ఫోద్దీన్, గుంషావలీ, బిలాల్, హమీద్షరీఫ్, అజ్మెర్, ఖాజాషర్ఫొద్దీన్, అజర్, గులాం హుస్సేన్ కరీంనగర్, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ విగ్రహ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నా రు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. దళితుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్లో జగ్జీవన్రామ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రారంభించారు. డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బండారి సురేందర్, వైస్ చైర్మన్లు మంద సంపత్, మాదాసి సురేశ్, కన్నం సునీల్, గరిగె అనిల్, కమిటీ సభ్యులు అంకూస్, రవికుమార్, మంద స్వరాజ్, చిట్యాల బాబు, బొర్ర సంపూర్ణ, కూనమల్ల అనిత, డీఎంహెచ్ఓ అప్పయ్య, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద రామన్నపేట: సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయంపై నిరంతరం పోరాడిన మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతంతో ముగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కులవివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం కోసం జగ్జీవన్రామ్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న నాలుగు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున విలువైన బాండ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు తరాల సందీప్, మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాపురావు, తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్ద ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందకట్ల విజయ్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు మహంకాళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
● చేనేత సంఘాల ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీకాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్, పిట్టరాములు, వలుస కిరణ్ పాల్గొన్నారు. -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
బీరమయ్య జాతరకు తరలివచ్చిన భక్తజనం
● లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం ● దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాల్లో జాతరకు రావాల్సిన దుస్థితి నెలకొంది. -
స్టిక్కరేసి.. నొక్కేసి!
క్యూఆర్ కోడ్ పేరుతో దందాఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి వెళ రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాహనదారులు గుర్తించే వీలుంటుంది. కాగా, సాధారణ స్టిక్కర్ల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లు వేయాలని దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్ప డడం అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కు బాధ్యతలు.. వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది లారీలతోపాటు ఇతర వాహనాలకు క్యూ ఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మార్చి 25న ఫిట్నెస్కు వచ్చే వాహనాలకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను లారీకి అంటిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల వరకు, అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6,500 వసూలు చేయడంతో ఓనర్లపై అదనపు భారం పడుతోంది. బిల్లు ఇవ్వరు.. ఇంతకాలం ఫిట్నెస్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే లారీకి రూ.300ల నుంచి రూ.500లోపు వసూలు చేసి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వేసేవారు. ప్రస్తుతం లారీలకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసి బిల్లు చేతిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్ వేస్తే ఫిట్నెస్ క్రమ బద్ధీకరణ కోసం కార్యాలయానికి వచ్చే వాహనాలకు మొదట స్టిక్కర్లు వేసిన తర్వాతే అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. స్టిక్కర్ల సైజు ఎంత..? వసూలు చేసిన మొత్తం? సంబంధిత వివరాలతో కూడిన బిల్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తుండడంతో శనివారం లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు రూ. 500లోపు ఖర్చయ్యేదని, ఇప్పుడు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన బిల్లువ్వడం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూపాల్ ఆరోపించారు. లారీ ఓనర్లకు అదనపు భారం లారీకి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ సిబ్బందిఆర్థిక భారం వేయొద్దు.. రిప్లెక్లివ్ స్టిక్కర్లతో లారీల ఓనర్లకు భారమవుతోంది. లారీకి రూ.1500 నుంచి రూ.5వేలకు పైగా వసూలు చేస్తున్నారు. స్టిక్కర్లకు బిల్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేస్తే లారీలకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. భారంగా మారిన క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు తొలగించాలి. దీనిపై లారీ ఓనర్ల అసోసియేషన్ ద్వారా రవాణాశాఖ మంత్రిని కలిసి సమస్యను విన్నవిస్తాం. – వేముల భూపాల్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారిఇబ్బందులు పడుతున్నాం.. క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలకు స్టిక్కర్లు ఉన్నా.. వాటి పై క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేసి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై రవాణాశాఖ అధికారులు స్పందించాలి. భారంగా మారిన రిఫ్లెక్లివ్ స్టిక్కర్లను ఫిట్నెస్తో ముడిపెట్టొద్దు – ఎండీ జాకీర్, లారీ ఓనర్స్ జిల్లా కోశాధికారి -
స్కిక్కర్లకు లెక్క ఉందా?
వాస్తవానికి వాహనానికి ఎంత సైజులో స్టిక్కర్ వేస్తారు? ఏ వాహనానికి ఎంత చెల్లించాలి. తదితర వివరాలతో కాంట్రాక్టర్ కార్యాలయంలో ఫ్లెక్సీలు ప్రదర్శించాలి. అవేమీ లేకుండానే వసూళ్లకు పాల్ప డడంతో కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది అడిగినంత చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. స్టిక్కర్లు వేయడానికి వసూలు చేసే డబ్బుతో రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకపోయినా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈవిషయమై జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబును వివరణ కోరగా.. తీసుకున్న డబ్బుకు బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్లు ఇవ్వకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించవద్దని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సిరికొండ సుదర్శన్, వెంకట్ నారాయణ, డాక్టర్ ప్రేమ్రాజ్, డాక్టర్ బిల్లా మహేందర్రెడ్డి, డాక్టర్ పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్రెడ్డి, కంది మనోహర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్, క్రీడాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద రామన్నపేట: సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయంపై నిరంతరం పోరాడిన మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతంతో ముగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కులవివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం కోసం జగ్జీవన్రామ్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించడం, రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతిపౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న నాలుగు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున విలువైన బాండ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు తరాల సందీప్, మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాపురావు, తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్ద ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందకట్ల విజయ్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు మహంకాళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభయమ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సిరికొండ సుదర్శన్, వెంకట్ నారాయణ, డాక్టర్ ప్రేమ్రాజ్, డాక్టర్ బిల్లా మహేందర్రెడ్డి, డాక్టర్ పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్రెడ్డి, కంది మనోహర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్, క్రీడాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతే కాలనీవాసుల లక్ష్యం కాశిబుగ్గ: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రొఫెసర్ రతన్సింగ్ ఠాకూర్, వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బండా కాళీదాసు సూచించారు. ఓసిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని పరిశుభ్రత కార్యక్రమాలను ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఆదివారం కాలనీవాసులందరు ముందుకొచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం అభినందనీయమన్నారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి, బస్తాల్లో నింపి మున్సిపల్ సిబ్బంది అందించడం ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బాల శ్రీనివాస్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, కాలనీ పెద్దలు, జవాన్ ప్రభాకర్, రాజు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● లారీ ఓనర్లకు అదనపు భారం ● లారీకి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు ● చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ సిబ్బందిఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి వెళ రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాహనదారులు గుర్తించే వీలుంటుంది. కాగా, సాధారణ స్టిక్కర్ల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లు వేయాలని దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్ప డుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కు బాధ్యతల అప్పగింత.. వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది లారీలతోపాటు ఇతర వాహనాలకు క్యూ ఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మార్చి 25న ఫిట్నెస్కు వచ్చే వాహనాలకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను లారీకి అంటిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల వరకు, అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6,500 వసూలు చేయడంతో ఓనర్లపై అదనపు భారం పడుతోంది. బిల్లులివ్వరు.. ఇంతకాలం ఫిట్నెస్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే లారీకి రూ.300ల నుంచి రూ.500లోపు వసూలు చేసి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వేసేవారు. ప్రస్తుతం లారీలకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసి బిల్లు చేతిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్ వేస్తే ఫిట్నెస్ క్రమ బద్ధీకరణ కోసం కార్యాలయానికి వచ్చే వాహనాలకు మొదట స్టిక్కర్లు వేసిన తర్వాతే అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. స్టిక్కర్ల సైజు ఎంత..? వసూలు చేసిన మొత్తం? సంబంధిత వివరాలతో కూడిన బిల్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తుండడంతో శనివారం లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు రూ. 500లోపు ఖర్చయ్యేదని, ఇప్పుడు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన బిల్లువ్వడం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూపాల్ ఆరోపించారు. వాస్తవానికి వాహనానికి ఎంత సైజులో స్టిక్కర్ వేస్తారు? ఏ వాహనానికి ఎంత చెల్లించాలి. తదితర వివరాలతో కాంట్రాక్టర్ కార్యాలయంలో ఫ్లెక్సీలు ప్రదర్శించాలి. అవేమీ లేకుండానే వసూళ్లకు పాల్పడడంతో కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది అడిగినంత చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. స్టిక్కర్లు వేయడానికి వసూలు చేసే డబ్బుతో రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకపోయినా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈవిషయమై జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబును వివరణ కోరగా.. తీసుకున్న డబ్బుకు బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్లు ఇవ్వకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించవద్దని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
వరంగల్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మక్క రైతుల● పంట అమ్ముకునేందుకు రోజులకొద్ది ఎదురుచూపులు ● నల్లబెల్లి, నర్సంపేట, వర్ధన్నపేటలో మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ● జిల్లాలో 46వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుడాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నజర్! వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతికి కారణమైన డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నిఘా పెంచింది. నర్సంపేట: జిల్లాలో వరి పంట తర్వాత రైతులు యాసంగిలో మొక్కజొన్న పంట ఎక్కువ సాగుచేశారు. భారీగా పెట్టుబడి పెట్టి పంట చేతికందిన తర్వాత విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 46 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగైంది. కిలో విత్తన మక్కలకు రూ.200 నుంచి రూ.600 వరకు రైతులు వెచ్చించారు. ఎకరాకు 8 నుంచి 16 కిలోల విత్తనాలు విత్తారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.40వేల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 18 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్, నల్లబెల్లి మండల కేంద్రం, వర్ధన్నపేటలో మాత్రమే అధికారులు మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉంది. ప్రస్తుతం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని మార్క్ఫెడ్ కేంద్రం మక్కలతో నిండిపోయింది. ఒకే కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండడంతో ఒక్కో రైతు వారం రోజులపాటు మక్కలు విక్రయించుకునేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థి తి నెలకొంది. చేసేదేమిలేక కొంతమంది రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రూ.1,600 నుంచి రూ.1,900 ధరకు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోతున్నారు. పంటను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వచ్చిన మక్కలు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అజ్మీరా బుజ్జమ్మ. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామ శివారులోని చక్రంతండాలో తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసింది. బావిలో నీరు సరిపోకపోవడంతో ఎకరంన్నర విస్తీర్ణంలో మక్కజొన్న పంట ఎండిపోయింది. మిగిలిన మక్కజొన్న పంటను మిషన్ ద్వారా పట్టి వారం రోజుల క్రితం నర్సంపేట వ్యవసాయ మార్కెట్కు అమ్మేందుకు తీసుకొచ్చి ఆరబెట్టింది. ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడంతో మార్కెట్ కార్యాలయం ఆవరణలోనే తన మనడు మోహన్తో కలిసి వంద బస్తాల మక్కలను అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతోంది. ఇలాంటి పరిస్థితి వందలాది మంది రైతులకు ఎదురవుతోంది. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
హన్మకొండ చౌరస్తా: వరంగల్ ట్రైసిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ కోసం శనివారం నిర్వహించిన రన్ ఫర్ జీసస్’ ర్యాలీలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రారంభమైన ర్యాలీకి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. రన్ నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ట్రైసిటీ నుంచి క్రైస్తవులు రన్లో ప్లకార్డులు చేతబూని అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య వేలేరు: రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఆయన వ్యాక్సిన్లు వేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గొల్లకిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారి డాక్టర్ నవీన్కుమార్, కేజీబీవీ ఎస్ఓ స్రవంతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు
కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. వివిధ విభాగాలను స్వయంగా సందర్శించారు. ఓపీ విభాగాల్లో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్ను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. రోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని, సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమ, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను వేగవంతం చేయాలి.. న్యూశాయంపేట: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే కొంత పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అలాగే, డెమోగ్రాఫికల్ సిగ్నల్స్ ఎంట్రీలో 290 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన కలెక్టర్ నగరానికి శనివారం వచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్మిట్టల్ను వరంగల్ కలెక్టర్ సత్యశారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై చర్చించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎంజీఎం ఆస్పత్రిలో తనిఖీ -
సహకార సంస్థల సందర్శన
భీమదేవరపల్లి: గ్రూప్–ఐ సేవా అధికారుల (బ్యాచ్–ఐఐ) ఆరు వారాల కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా శిక్షణ పొందుతున్న అధికారుల బృందం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ, మహిళా సహకార డెయిరీని శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ చేపడుతున్న వివిధ కార్యకలాపాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అమలు చేస్తున్న సమగ్ర విధానం తెలుసుకున్నారు. అనంతరం సంస్థ అధ్యక్షుడే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ట్రెయినీ అధికారుల సందేహాలను నివృత్తి పర్చారు. అనంతరం అధికారులు సంస్థకు చెందిన రైస్ మిల్లు, కాటన్ జిన్నింగ్ మిల్లు, సీడ్ ప్లాంట్లను సందర్శించారు. ఈసందర్భంగా ట్రెయినీ అధికారులు మాట్లాడుతూ.. రైతుల ఆధీనంలో నడుస్తున్న ఈ సంస్థ రైతుకు అండగా నిలుస్తూ రైతు ఆధారిత ఆహార ఉత్పత్తి వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో 216 మంది ట్రైనీ అధికారులు, భీమదేవరపల్లి మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ను వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే కొంత పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అలాగే, డెమోగ్రాఫికల్ సిగ్నల్స్ ఎంట్రీలో 290 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన కలెక్టర్ నగరానికి శనివారం వచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్మిట్టల్ను కలెక్టర్ సత్యశారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై చర్చించారు. -
నియామకంలో జాప్యం!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి నియమాకంలో యూనివర్సిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆవిభాగాధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకటయ్య రెండేళ్ల పదవీకాలం గత నెల 26న ముగిసింది. రొటేషన్ పద్ధతిలో ఆవిభాగంలో మరో సీనియర్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను విభాగాధిపతిగా నియమించాల్సి ఉంది. అయితే ఆవిభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య తాను సీనియర్ అని, మరో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత కుమారి తానే సీనియర్ను అని పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా తననే నియమించాలని ఇద్దరూ వేర్వేరుగా ఇటీవల యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది వివాదాస్పదమైంది. ఆ విభాగంలో రెగ్యులర్ అధ్యాపకులు ఎవరూ లేరు. దీంతో రెండేళ్ల క్రితం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకటయ్యను విభాగాధిపతిగా నియమించగా రెండేళ్ల పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. ఎవరు సీనియరో.. తేల్చేందుకు కమిటీ కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో విభాగాధిపతి నియామకం కోసం ఆ ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది తేల్చేందుకు వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా సోషల్ సైన్స్ డీన్ ఎకనామిక్స్ విభాగాధిపతి ఆచార్య బి.సురేశ్లాల్, సభ్యుడిగా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ను, మెంబర్ కన్వీనర్గా సీడీసీ డీన్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రణయ్కుమార్ను నియమించారు. కమిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది తేల్చాల్సి ఉంటుంది. పరిపాలనా భవనంలో టీచింగ్ విభాగంలో ఆయా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి సర్వీస్ వివరాలు ఎప్పుడు నియామకం అయ్యారనే వివరాలుంటాయి. ఆయా రికార్డులను పరిశీలించనున్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం విభాగాధిపతిని నియమించనున్నారు. మరొకరిని నియమించే వరకు సంకినేని వెంకటయ్య బాధ్యతల్లో కొనసాగుతారని సంబంధిత అధికారులు తెలిపారు. పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఎవరు? ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఒకరికి అవకాశం -
మహర్దశ
మౌలిక వసతుల కల్పనకు రూ.43.33 కోట్లు మంజూరురాజీవ్ టౌన్షిప్నకుటౌన్షిప్ అభివృద్ధికి నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో) కాల్వల నిర్మాణం : రూ. 9.10నీటి సరఫరా వ్యవస్థ, అండర్గ్రౌండ్ సంపు, పంప్రూం, మూడు మురుగు నీటి ట్యాంకులు, నీటి శుద్ధిప్లాంట్ : రూ.9.20ప్రాథమిక పాఠశాల : రూ. 2.77 పీహెచ్సీ నిర్మాణం : రూ. 1.60 గ్రామపంచాయతీ కార్యాలయం రూ.63 లక్షలు పశువుల ఆస్పత్రి : రూ. 50 లక్షలు బీటీ రోడ్లు, వర్షపు నీటి కాల్వలు, కల్వర్వులు రూ. 7.60 విద్యుత్ లైన్లు, వీధిదీపాలు : రూ. 1.82 ఎంఎస్ఎంఈ క్లస్టర్ : రూ. 10.10● వాటర్ ట్యాంకు, వెటర్నరీ ఆస్పత్రి, పీహెచ్సీ, పాఠశాల పనులు ముమ్మరం ● కేఎంటీపీకి భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో 866 ప్లాట్లు 51 -
వరంగల్
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కృత్రిమ మేధతో వేగంగా సేవలు కృత్రిమ మేధ వినియోగంతో విద్యుత్ రంగంలో సేవలు వేగంగా అందుతున్నాయని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. గీసుకొండ: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు భూములిచ్చిన రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న రాజీవ్ టౌన్షిప్నకు మహర్దశ పట్టనుంది. కేఎంటీపీ కోసం సుమారు 1300 ఎకరాల భూమిని సేకరించారు. ఒక్కో ఎకరానికి వంద గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఊకల్–స్టేషన్ చింతలపల్లి మార్గం ఇరువైపులా పైలాన్ సమీపంలో 54.11 ఎకరాలు కేటాయించింది. 2024 డిసెంబర్ 7న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పార్కు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్రా పద్ధతిన రైతులకు ప్లాట్లను కేటాయించారు. 50 నుంచి 60 గజాల స్థలాలు వచ్చిన రైతులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుపడకపోవడంతో ఈ సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్కువ స్థలాలు వచ్చిన 183 మందికి 75 గజాల చొప్పున కేటాయించారు. సీఎం రేవంత్రెడ్డి 2024లో కేఎంటీపీని సందర్శించి భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2024 నవంబర్లో టౌన్షిప్కు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్దప్రసాద్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే, ఇంటి స్థలాలకు కేటాయించిన ప్రాంతాన్ని రాజీవ్ టౌన్షిప్గా పేర్కొంటూ మౌలిక సదుపాయాల కోసం సీఎం రూ.43.33 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో టౌన్షిప్ వద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వెటర్నరీ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు నిర్మాణ పనులు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిని వాటర్ట్యాంకు, అండర్గ్రౌండ్ సంపు, పంపురూంల పనులు చేపట్టారు. 115 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి రాజీవ్ టౌన్షిప్లో 866 ప్లాట్లకు ప్రస్తుతానికి 155 ప్లాట్ల లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్ తెలిపారు. మిగిలిన వారంతా త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అవసరమైన పత్రాలను తహసీల్దార్కు అందించాలని ఇటీవల కొనాయమాకుల వద్ద జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కోరారు. వర్షాకాలం లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మోడల్ ఇళ్ల నమూనాలపై ప్రచారం టౌన్షిప్లోని తమ ప్లాట్లలో సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని వారికి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాలు చేపడుతామని ఓ సంస్థ వారు ముందుకొచ్చారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఇటీవల రైతులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ద్వారా వివరించారు. -
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రేటర్ వరంగల్ పరిధిలో 400 మంది బడా బకాయిదారులున్నారు. వారందరికీ రెడ్ నోటీసులు అందించి వెంటనే పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. – చాహత్ బాజ్పాయ్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ ●నగరంలో ఇటీవల పలు డివిజన్లలో చేపట్టిన పన్నుల వసూళ్లను కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నేరుగా పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు హనుమకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలు రూ.85,61,262 మొత్తం చెక్కును బల్దియా పన్నుల విభాగం అధికారులకు అందజేశారు. కానీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో ఏమాత్రం కదలిక రాకపోగా, బల్దియా అధికారులు నోరు మెదపడం లేదు. వరంగల్ అర్బన్ : ‘నగర వాసులు పన్నులు చెల్లించి.. అభివృద్ధికి తోడ్పడాలి’ అంటూ ఇచ్చే సందేశాలు తమకు వర్తించవు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల విలువ కోట్లలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్య, వైద్యం, ఇరిగేషన్ మొదలుకొని కేంద్ర ప్రభుత్వ విభాగాలైన రైల్వే, పోస్టాఫీస్ వంటి సంస్థలు ఏళ్లతరబడి రూ.లక్షల మేరకు బకాయిలు ఉన్నాయి. పేదోడిపై బల్దియా అధికారుల ప్రతాపం.. సాధారణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించకపోతే బల్దియా అధికారులు నోటీసుల మీద నోటీసులు జారీచేశారు. ఇళ్లకు వెళ్లి రెవెన్యూ వసూలు చట్టం ప్రయోగించి ఆస్తులు జప్తు చేశారు. ఇళ్లకు, షాపులకు తాళాలు వేశారు. నిబంధనల పేరిట బజారు పాలు చేసి పరువు తీశారు. ఇదేవిధంగా సర్కారీ శాఖలకు రూ.కోట్లలో పెండింగ్లో ఉన్న ఆ సంస్థలకు తలుపులు లేవా? వాటిపై దృష్టి పెట్టకపోవడంఏంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొద్దునిద్ర.. గ్రేటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 1,556 పైగా ఆస్తులు ఉన్నాయి. ఏటా ఆయా శాఖల నుంచి సేవలకు గాను బల్దియా ఆస్తిపన్ను వసూలు చేస్తోంది. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న నగర పాలక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నగరంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తులు 917 ఉండగా.. ప్రతీ ఏడాది రూ.3.63 కోట్లు, కేంద్ర ప్రభుత్వ శాఖలు 699 కాగా, పన్ను రూ. 67.45 లక్షలతోపాటు ఖాళీ స్థలాల బకాయిలున్నాయి. కొన్నేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆస్తి పన్ను, వడ్డీ కలిపి రూ.80 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.కేంద్ర ప్రభుత్వ శాఖలు 639పన్నుల వసూళ్లలో ‘గ్రేటర్’ అధికారుల తీరుపై విమర్శలు సర్కారీ శాఖల్లో రూ.కోట్లలో బకాయిలు రూ.వందలు, వేలు పెండింగ్ ఉన్న పేదలపైనే ప్రతాపం! ‘బడా’ వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం -
భాషా నైపుణ్యాలను పెంపొందించాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి నర్సంపేట: పాఠశాలస్థాయి నుంచే విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం భారతీయ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో భాషా నైపుణ్యాలు, గొప్పతనాన్ని విస్తృతపర్చాలని సూచించారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ మాట్లాడుతూ భాషలు మన భావాలను వ్యక్తపరిచే ముఖ్యమైన సాధనాలన్నారు. భారతీయ భాషల విలువ ఎన్నటికీ తరగదని, విద్యార్థులకు భాషా నైపుణ్యాలను పెంపొందించడం అవసరమని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలు గొప్ప విలువలను కలిగి ఉన్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భాషా ఔన్నత్యంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. డీఈఓ బి.రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్తేజ్, జిల్లా విద్యాశాఖ కమిటీ మొలిలైజర్ ఆఫీసర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఎంఈఓ కొర్ర సారయ్య, ఎస్ఓ నాగేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎస్.సారంగపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు
కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. వివిధ విభాగాలను స్వయంగా సందర్శించారు. ఓపీ విభాగాల్లో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్ను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. రోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని, సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమ, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎంజీఎం ఆస్పత్రిలో తనిఖీ పలు విభాగాల పరిశీలన వైద్యులు, సిబ్బందితో సమీక్ష -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధి అన్ని అల్టాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, ఎస్.బీ 87126 85257 కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వం కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.ఎల్.శ్రీదేవి హన్మకొండ: సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని హనుమకొండ జిల్లా ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.ఎల్.శ్రీదేవి అన్నారు. హనుమకొండ సర్క్యూట్ హౌస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఆదరణ ఆల్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్కు జిల్లా కోర్టు ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వివిధ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివాదాలు, తగాదాలను ఉచితంగా న్యాయబద్ధంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం, సుబేదారి ఎస్సై టి.సుమన్ పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కాంతి ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చని సూచించారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రి వరంగల్ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణాకు అద్దె వాహనానికి ఈ–టెండర్ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం లీగల్ మెట్రాలజీ అధికారి కె.మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తూకాన్ని తిరిగి తూకం వేసి పరిశీలించారు. తూకం యంత్రాలను సరిచూసి, ముద్ర వేయించుకోకుండా వినియోగంలో ఉంచిన రెండింటిపై కేసులు నమోదు చేశారు. కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న నూనె ప్యాకెట్ల తూకాలను పరిశీలించారు. అదేవిధంగా కొలతలకు సంబంధించిన నిబంధనలు పాటించని ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారి మనోహర్ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో కాలనాగ మహర్షి గురూజీహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శనివారం కాలనాగ మహర్షి గురూజీ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ పరిశీలకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావు ఆయనను స్వాగతించారు. గురూజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నీటి సమస్య లేకుండా చూడాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: నియోజకవర్గంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామసర్పంచ్లు, అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కల్పన, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ సురేందర్, పబ్లిక్ హెల్త్ ఈఈ సుచరణ్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన అరూరి రమేశ్
వర్ధన్నపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ శనివారం హైదరాబాద్లో కలిశారు. తన జన్మదినం సందర్భంగా కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అరూరిని మాజీ సీఎం ఆశీర్వదించారు. దివ్యాంగులకు ఇంటి వద్దే బోధన : డీఈఓనర్సంపేట: దివ్యాంగ విద్యార్థులకు ప్రతి శనివారం ఇంటి వద్దే సమ్మిళిత విద్య ఉపాధ్యాయులు (ఐఈఆర్పీ) విద్యాబోధన చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు పేర్కొన్నారు. నర్సంపేట వల్లభ్నగర్కు చెందిన దివ్యాంగ విద్యార్థి చరణ్నికేష్ ఇంటికి శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయకుడు, సీఎంఓ, సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్ వెళ్లారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన మెళకువలను వివరించారు. దివ్యాంగ విద్యార్థులకు ముందస్తుగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్య ఉపాధ్యాయురాలు సుచరిత పాల్గొన్నారు. కొమ్మాలలో వేలంగీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి వేలాన్ని శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ అంగడి ఐదు గ్రామాల పరిధిలో ఉంది. కొమ్మాల గ్రామ పంచాయతీ వాటా కోసం నిర్వహించిన వేలంలో 74 మంది టెండర్దారులు పాల్గొన్నారు. వారిలో 17 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా, 8 మంది సీల్డ్ టెండర్లను దాఖలు చేశారు. కొమ్మాల గ్రామానికి చెందిన జూలూరి వేణు రూ.61,11,116 అత్యధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నారు. ఏడాదిలో 20 వారాలపాటు పశువులు, జీవాల రహదారి, ఇతర ఫీజులను వసూలు చేయడానికి ఈ టెండర్ నిర్వహించారు. సర్పంచ్ కన్నెబోయిన యమునప్రవీణ్, ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, ఉపసర్పంచ్ బట్టమేకల శివ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గత ఏడాది వేలంతో పోలిస్తే ఈ సారి అధిక ఆదాయం రానుంది. చట్టాలపై అవగాహన పెంచుకోవాలిసంగెం: సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలకు లోబడి నడుచుకోవాలని న్యాయవాది కల్తి త్రివేణి అన్నారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్లో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, బాల్యవివాహాలు, పోక్సో చట్టం, ఈవ్టీజింగ్, మైనర్లు వాహనాలు నడిపితే పడే శిక్షలను గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువతకు చట్టాలపై అవగాహన ఎంతోముఖ్యమని, చిన్న తప్పిదాలు పెద్ద న్యాయపరమైన సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉదాహరణతో చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్పీ ప్రసన్నలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భూసేకరణ త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో భూసేకరణ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ ద్వారా సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సాదాబైనామా సమస్యలు, మీసేవ సర్టిఫికెట్ల జారీపై తీసుకోవాల్సిన చర్యలను అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓలు, జాతీయ రహదారుల శాఖ, రహదారులు, భవనాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలిసి సమీక్షించారు. సమావేశంలో ఆర్డీఓలు రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, రహదారులు–భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. విజయవంతంగా నిర్వహించాలి.. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తేదీల వారీగా కార్యాచరణను వివరించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ వేగవంతానికి చర్యలుప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి సమయానికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సుమారు 65 శాతం పూర్తయ్యిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తహసీల్దార్లు రవీందర్రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్ హన్మకొండ: ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం కలిశారు. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్లో జరిగిన సమీక్షకు వచ్చిన నవీన్ మిట్టల్కు ఆమె మొక్క అందించారు. వడ్డేపల్లి బండ్ సమస్యల పరిష్కారానికి కృషి కాజీపేట రూరల్: కాజీపేట వడ్డేపల్లి ట్యాంక్బండ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వడ్డేపల్లి ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం కమిషనర్ సందర్శించారు. ఈసందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి కలియదిరిగారు. వాకర్స్తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, సీనాసాగర్, మాజీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కై లాస్నంద్ అగర్వాల్, శ్రీనివాస్రెడ్డి, కోండ్ర శంకర్, వాకర్స్, అధికారులు పాల్గొన్నారు. పూడికతీత పనుల్లో వేగం పెంచండి నయీంనగర్: భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్, కుడా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ భద్రకాళీ చెరువులో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు చేశారు. మే 15 లోగా పూడికతీత పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇరిగేషన్ ఈఈ కిరణ్ కుమార్, డీఈ మధుసూదన్, ఏఈ శ్యామ్ పాల్గొన్నారు.


