Warangal District News
-
నేర రహిత సమాజమే లక్ష్యం
● పరకాల ఏసీపీ సతీష్బాబు పరకాల: నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరకాల ఏసీపీ సతీష్బాబు కోరారు. అసాంఘిక శక్తులు శాంతి భ ద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. పోలీసులు, ర్యాఫిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని బీసీ కాలనీ నుంచి పరకాల బస్టాండ్ వరకు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా నిలవాలని కోరారు. ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి, పరకాల, శాయంపే ట, ఆత్మకూరు సీఐలు క్రాంతికుమార్, రంజిత్రా వు, సంతోష్, ఎస్సైలు శివకృష్ణ, రమేష్, పరమేశ్వర్, కొంక అశోక్, తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, కార్యక్రమ కన్వీనర్ నాయిని రవి, కార్మిక నాయకులు, తెలంగాణ ఆటో యూనియన్, ప్రతాపరుద్ర ఆటో యూనియన్, భవన నిర్మాణ రంగంలోని 14 రంగాల కార్మికులు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ధర్మసాగర్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబా టులో ఉంచాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్ కుమార్ సూచించారు. వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వివిధ విత్తన షాపుల్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు కలిసి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు షాపుల్లోని విత్తన స్టాక్ రిజిస్టర్లు, విత్తన నిల్వలు, బిల్లులు, స్టోర్స్, సర్టిఫికెట్లు, గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధీకృత డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జానీపాషా, వ్యవసాయ అధికారులు సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లాలో స్కిల్స్టార్క్ స్కూల్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మూడో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్సై ఎం.రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై పిలిప్స్రాజు, షీటీమ్స్ ఎస్సై విద్యాసాగర్, సైబర్ క్రైమ్స్ ఎస్సై శివకుమార్ మాట్లాడారు. శిక్షణ కేంద్రం ఇన్చార్జ్లు విజయ్ మోహన్, మధుసూదన్ రెడ్డి, డీఆర్పీలు శానుగుల భద్రయ్య, జీవీ.ప్రసాద్, అజయ్, అలీ, శశికళాధర్, శివకుమార్, సంపత్, శ్రీను, విద్యానంద్, అట్ల రవి, సీఆర్పీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగిసిన టీచర్ల శిక్షణ హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఈఐఎస్ ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల ఉపాధ్యాయులకు మే 13నుంచి 31వ తేదీ వరకు మూడు దశల్లో సుమారు 2,700 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, అభ్యసనాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ప్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ప్రోష్ యాక్ట్ –2013’ చట్టంపై జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా శని వారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవితో కలిసి ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిష్కారానికి చట్టా లు ఉన్నాయని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయమూర్తులు రితిక, ఫరీనా అహ్మ, డాక్టర్ అనితారెడ్డి వివరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుధఋర్, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి● హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, తదితర అంశాలపై అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్ వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, ఆర్డీఓ కె.నారాయణ, డీపీఓ లక్ష్మి రమాకాంత్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జి.రవీందర్తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు ప్రణాళికలు● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, మలేరియా నోడల్ పర్సన్స్, హెల్త్ అసిస్టెంట్లతో శనివారం సమీక్షా సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ విభాగాలతో కలిసి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యుడు నరేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీగణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీనెలా ఒకరు ఎత్తుకుని 1 శాతం చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని.. నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్స రీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. నగరంలోని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో రెండు డివిజన్ల పరిధిలోని ప్రధాన నాలాతో పాటు రైల్వేట్రాక్ వైపు, మేదరి బస్తీ వద్ద ఉన్న డ్రెయినేజీల పరిస్థితిని పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సీపీలు రవీందర్, వాడేకర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, టీపీఎస్ శ్రీకాంత్, ఏఈ ముజామిల్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారం
నెక్కొండ: కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారమవుతుందని పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దీక్షకుంట్ల గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లావుడ్య తిరుమల్ చౌహాన్, మండల కాంగ్రెస్ నాయకులు ఈదునూరి సాయికృష్ణ, కుసుమ చెన్నకేశవులు, ఆవుల శ్రీనివాస్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, శ్రీకాంత్, మెర్గు కుమార్, స్వామి, పులి నవీన్, రాజుకుమార్, సూరయ్య, రాంబాబు, రాజు, తదితరులు ఉన్నారు. పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి అర్హులకు ఇళ్ల పత్రాల అందజేత -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్మహల్లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆఏర్పాట్లు ఆదివారం వరకు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద అధికారులతో సమావేశం -
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు స్థల పరిశీలన
హసన్పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం 25 ఎకరాల మేరకు స్థలం అవసరం ఉండగా, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రెండు రోజులుగా రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాలు పరిశీలించారు. మామునూరు, హసన్పర్తి మండలం భీమారంలోని కొచ్చెరు, పెగడపల్లిల్లో భూములను పరిశీలించారు. భీమారంలోని సర్వే నంబర్ 70లో స్కూల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్యే భావించారు. ఎన్ని ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కిరణ్, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్, నాయకులు ఐలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ దాడులుదుగ్గొండి: మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ల ఆధారంగా తనిఖీలు చేశారు. అయితే కొన్ని సీడ్ దుకాణాల్లో పీసీలు, (ప్రిన్సిపుల్ సర్టిఫికెట్) లేకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండల కేంద్రంలోని పరమేశ్వర సీడ్స్, మనగ్రోమోర్ సెంటర్లలో పీసీలు లేని విత్తనాలు లభించడంతో వాటి అమ్మకాన్ని నిలిపేయాలని ఆదేశించి సీజ్ చేశారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రియ, మండల వ్యవసాయ అధికారి మాధవి, హెచ్ఈఓ హన్మంతు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఇద్దరి ఆత్మహత్య●● గవిచర్లలో విషాదం సంగెం: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని గవిచర్లలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన పెండ్లి సాయమ్మ (72)కు కొన్నేళ్ల క్రితం కుమారుడు, భర్త చనిపోయారు. చిన్నకుమారుడి ఇంటి ఎదుట ఆమె జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే తగ్గింది. అప్పటి నుంచి తరచూ జ్వరంతో బాధపడుతోంది. షుగరు, బీపీ పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది. ఆరోగ్యం కుదుట పడడంలేదనే మనస్థాపంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది.. గవిచర్ల గ్రామానికి చెందిన కందుల సరోజన(53) అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. సరోజన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారుడు మోహన్ ఇటీవల ఆమెకు వరంగల్లో చికిత్స చేయించాడు. అయినప్పటికీ కడుపులో మంట, అలసటతో జీవితంపై విరక్తి చెంది.. శనివారం సాయంత్రం బాత్రూమ్ లోపల చీరతో ఉరేసుకుంది. భర్త కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఒకే రోజు, ఒకే గ్రామంలో, అనారోగ్యంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో గవిచర్లలో విషాదం నెలకొంది. విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మైనార్టీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ఫ్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం గాలివాన కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.సమాజం అండతోనే పద్మశ్రీ సమాజ అండదండలతోనే తనకు పద్మశ్రీ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. – 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దుక్కిలో వేసిన అచ్చులుకొత్తూరులో ట్రాక్టర్తో దుక్కిదున్నుతున్న రైతు న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
ఖిలా వరంగల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ విత్తనషాపుల డీలర్లు, యజమానులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతోపాటు వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టారు. విత్తన షాపుల్లో నిల్వల రిజిస్టార్ను పరిశీలించారు. విత్తన నిల్వలు, విత్తనాల లేబుల్, ట్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని ఆదేశించారు. అనుమతి లేని నాసిరకం విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడుతామని హెచ్చరించారు. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు సైతం పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఎరువులు, విత్తనాలను రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. తనిఖీల్లో ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఎస్సై చాంద్పాషా, వ్యవసాయ అధికారి నేలకుర్తి రవీందర్, టెక్నికల్ వ్యవసాయ అధికారి సాగరిక, ఏఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయించొద్దు నర్సంపేట రూరల్ : అదిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ బృందం వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని పలు విత్తన, ఎరువుల షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అధికృత డీలర్ దగ్గరే కొనుగోలు చేయాలన్నారు. సీడ్ ప్యాకెట్స్పై అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోవాలని, పూర్తి వివరాలతో బిల్లు తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని తెలిపారు. కల్తీ విత్తనాల ప్యాకెట్లు అయితే వారిపై కేసు నమోదుచేసి నష్టపరిహారం పొందేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎస్సై రవి కుమార్, వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు విత్తన ప్యాకెట్లను పరిశీలించిన ఏసీపీ నందిరామ్, డీఏఓ అనురాధ -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు.నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివిజన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ సవరం రంజిత తదితరులు పాల్గొన్నారు.ఆస్పత్రిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులుసంగెం: మండల కేంద్రంలోని గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ స్వస్థ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మెరుగైన, ఉన్నతస్థాయి వైద్యానికి కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి నివేదిక తయారు చేసి అందజేస్తామని బృందం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ క్వాలిటీ మేనేజర్ శ్రీనివాస్, వైద్యాధికారి వంశీకృష్ణ, డీపీఎంయూ అర్చన, డాక్టర్ క్రాంతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.పాఠశాలల్లో మార్పుపై దృష్టిసారించాలివిద్యారణ్యపురి: పాఠశాలల్లో మార్పుపై హెచ్ఎంలు దృష్టిసారించాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లాలోని హెచ్ంఎలకు ఐదురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలన్నారు. డీఈఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే దిశగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సాంకేతికతను ఉపయోగించి విద్యాబోధన చేయాలని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ కట్ల శ్రీనివాస్, రవీందర్, మోహన్రావు, మహేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రిసోర్స్ పర్సన్లను సన్మానించారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఖానాపురం/నర్సంపేట రూరల్/దుగ్గొండి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఖానాపురం మండలంలోని రాగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి, ధాన్యం తేమశాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తూర్పాల పట్టుకుంటే తేమశాతం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందులో నర్సంపేట నియోజకవర్గంలోనే 15 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నర్సంపేట రూరల్ పరిధిలోని రాజుపేటలో హరి రైస్ మిల్, నర్సంపేట పట్టణంలని ద్వారకపేట శివారు గోపికృష్ణ రైస్మిల్, దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామంలో వినాయక రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోతల పేరుతో దిగుమతులు ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ న్యూశాయంపేట : జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల మంజూరిపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పథకంలో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో తక్షణమే పంపిణీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జూన్ 6 వరకు అందించేందుకు సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేష్ ఆదేశించారు. రేషన్ కార్డు మంజూరిలో భాగంగా ప్రజా పాలన కౌంటర్ల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్ల ద్వారా ఎంకై ్వయిరీ చేసి అర్హత మేరకు రేషన్ కార్డులు మంజూరి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
ఖరీఫ్లో ముందస్తు ప్రణాళికలు అవసరం
ధర్మసాగర్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని కేవీకే మామునూరు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న సూచించారు. మండలంలోని మల్లక్పల్లిలో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో శుక్రవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ రాజన్న మాట్లాడుతూ.. వ్యవసాయ, పాడిపశువులకు సంబంధించి ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యాలను రైతులకు వివరించారు. నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించి వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా నేలసారాన్ని కాపాడుకోవాలన్నారు. ఏఈఓ కల్యాణ్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. పశువైద్య శాస్త్రవేత్త సాయికిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు సలహాలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనుపమ, విజయ డెయిరీ సూపర్వైజర్ రఘు, శోభ, పశు వైద్య సహచరులు ఎల్లారెడ్డి, రైతులు కరుణాకర్ తదితరులు ఉన్నారు. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న -
అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీగా రాయల ప్రభాకర్రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రావును వరంగల్ పోలీస్ కమిషనరరేట్ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభాకర్రావు వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. ఈమేరకు కమిషనర్ సన్ప్రీత్సింగ్ను ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : కలెక్టర్ ప్రావీణ్యహన్మకొండ అర్బన్: జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో 157 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,16,290.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇది గతేడాది రబీ సీజన్తో పోలిస్తే 40,330.240 మెట్రిక్ టన్నులు అధికమని పేర్కొన్నారు. ఽ24,814 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 252.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన 53 రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరిగతిన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు.యువత మత్తు వలలో పడొద్దుహన్మకొండ అర్బన్: యువత వారి భవిష్యత్, దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు మహమ్మారి వలలో పడొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదకద్రవ్యాలు, గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ వైవీ గణేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ , గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు.ఆదాయం పెంచాలి.. ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్హన్మకొండ: డిపో ఆదాయాన్ని పెంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1, హనుమకొండ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాల్ని పరిశీలించారు. వరంగల్–1 డిపోలో మొక్క నాటారు. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి సోలమన్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వివిధ హోదాలో ఉన్న 20 మందితో ఒక టీమ్ ఏర్పాటు చేసి డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నెక్కొండ: ఖరీఫ్ ప్రారంభం కాకముందే మండలంలో విత్తన షాపులు, రికార్డులను ఇటు వ్యవసాయ శాఖ, అటు పోలీస్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో అక్కడక్కడా నకిలీ విత్తనాలు విక్రయిస్తుండడంతో జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా శక్రవారం నెక్కొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఏడాది సీజన్ ముందు ప్రతీ విత్తన షాపును తనిఖీ చేస్తామన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేని షాపుల్లో విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దని సూచించారు. సన్న రకం వరి విత్తనాలతోపాటు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అధికంగా కల్తీవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవి అయితే.. రశీదు ఆధారంగా రైతులకు పరిహారం అందే వీలుంటుందని, రైతులు రశీదులను పంట కాలం పూర్తయ్యేవరకు జాగ్రత్త చేయాలని సూచించారు. అనంతరం షాపుల్లోని రికార్డులు, నిల్వలు, కాలం చెల్లినవి ఏమైన ఉన్నాయా.. అనే కోణంలో తనిఖీలు చేశారు. దాడుల్లో నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఏఓలు గోపాల్రెడ్డి, నాగరాజు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి నెక్కొండలోని ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
హనుమకొండకు మంత్రి కొండా సురేఖ, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. -
కేఎంటీపీలో ఫైర్ సేఫ్టీ పరిశీలన
● సందర్శించిన ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గీసుకొండ: జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో నెలకొల్పిన పరిశ్రమల యూనిట్లలో అగ్రిప్రమాదాలు సంభవించకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, ఎస్సైలు కుమార్, ప్రశాంత్బాబులతో కలిసి ఆయన కేఎంటీపీలోని గణేశా ఎకోటెక్ కంపెనీని పరిశీలించారు. కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, ఫైర్సేఫ్టీకి పాటిస్తున్న జాగ్రత్తల గురించి హెచ్ఆర్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రెండు పత్తి జిన్నింగ్ మిల్లులను సందర్శించి వాటిల్లో అగ్రిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దృష్ట్యా గణేశ కంపెనీతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో ఫైర్ సేప్టీపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
మేయర్ సుధారాణి న్యూశాయంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ద్వారా రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు బల్దియా ద్వారా వంద రోజుల పాటు చేపట్టే కార్యాక్రమాల గురించి వివరించారు. ఈవంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటడం, ముంపు నివారణకు 36 ప్రధాన నాలాల్లో రూ.1.21 కోట్లతో పూడికతీత పనులు పూర్తి చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నగరంలోని గోడలపై మృనాల్ పెయింటింగ్లు వేయడం, వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో ఉన్న బ్లాకేజ్ ప్రాంతాలను గుర్తించి మెష్లు ఏర్పాట్లు చేయాలని, జంక్షన్లలో సుందరీకరణ పనులు, రెండు పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, శిథిలావస్థ నిర్మాణాల తొలగింపు, అంతర్గత మురుగు కాల్వల పరిశుభ్రత, తదితర పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వంద రోజుల ప్రణాళిక విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
వైద్యసేవలు మరింత సులభం
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్, సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం మొబైల్ యాప్స్ అప్లికేషన్ డిజిటల్ సేవలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, 12 లక్షల మంది రైల్వే సర్వీస్లోని ఎంప్లాయీస్ కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్), హాస్పిటల్ రిసోర్స్మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)ను దేశవ్యాప్తంగా 714 ఆస్పత్రులు/హెల్త్ యూనిట్ల అనుసంధానంతో పాటు, మొబైల్ యాప్స్తో డిజిటల్ సేవలు అమలు చేయనున్నారు. హెచ్ఎంఐఎస్ను 2019లో, హెచ్ఆర్ఎంఎస్ను 2020లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉమిత్కార్డు (యూనిక్ మెడికల్ ఐడీకార్డు)తో ఇండియన్ రైల్వేలో రూ.60 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో 26 వేల మంది పెన్షనర్స్ మెడికల్ సేవలు పొందుతున్నారు. హెచ్ఎంఐఎస్ యాప్లో రైల్వే పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం, రెఫరల్ ఆస్పత్రి ఆస్పత్రుల వివరాలు, మందులు అందుబాటులో ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ యాప్లో రైల్వే ఎంప్లాయిస్ లీవ్స్, పీఎఫ్, సాలరీ, ఎస్ఆర్, ఈ–పాస్లు (పెన్షనర్స్ కోసం–సంవత్సరానికి రెండు ఉచిత ట్రైన్ పాస్ ఉంటుంది) హెచ్ఎంఐఎస్, హెచ్ఆర్ఎంఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోకి వెళ్లి డిజిటల్ సేవలు పొందాలి. డిజిటల్ సేవలు ఉపయోగకరం.. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే పెన్షనర్స్, రైల్వే ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు డిజిటల్ సేవలు ఎంతో ఉపయోగం. రైల్వే పెన్షనర్స్ యాప్ తెలియకుంటే ఇంట్లో పిల్లలతో, లేదంటే తెలిసిన వారితో సేవలు పొందాలి. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లు, 70 రైల్వే డివిజన్లలో ఈ డిజిటల్ సేవలపై రైల్వే శాఖ అధికారుల సహకారంతో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (ఎఐఆర్ఆర్ఎఫ్)తో వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్.శ్రీధర్, ఏఐఆర్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పెన్షనర్లు, ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక యాప్లు ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ -
చిరువ్యాపారుల జీవితాలతో ఆటలొద్దు
హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారుల హక్కుల సాధన కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ చౌరస్తాలో కూరగాయలు, బట్టలు అమ్ముకునే చిరువ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించిన నేపథ్యంలో.. శుక్రవారం క్షేత్రస్థాయిలో బాధితులతో ఆయన మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరువ్యాపారులకు పరిహారం చెల్లించి, చౌరస్తాలోని అడ్డాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ రిజ్వాన్షమీమ్ చిరువ్యాపారులతో కలిసి స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి చిరువ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్కు ఏఐటీయూసీ నాయకులు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్లు లోహిత రాజు, సోదా కిరణ్, చెన్నం మధు, సంపు నర్సింగ్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్, బొల్లెపెల్లి పున్నంచందర్, ఖలీల్ నాయకులు పేర్ల మనోహర్, జోరిక రమేశ్, మేకల బాబురావు, సారంగపాణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్ నేడు ఏకశిలపార్కు వద్ద ధర్నా -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివి జన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్ లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ రంజిత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
యువతకు హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
ఎంజీఎం : యువతకు హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అన్నారు. గురువారం నగరంలోని డబ్బాల జంక్షన్ వద్ద మొబైల్ వ్యాన్ హెచ్ఐవీ/ఎస్టీఐ సంపూర్ణ సురక్ష కేంద్రం సేవలపై ప్రదర్శన నిర్వహించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ హైరిస్క్లో ఉన్నవారికి అవగాహన కలిగించడంతోపాటు టెస్టింగ్ చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే కూడళ్లలో ఈ మొబైల్ వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, పోచమ్మకుంట పీహెచ్సీ వైద్యాధికారి దీప్తి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, హెచ్ఈఓ శ్రీనివాస్, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ పాషా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలి : డీఈఓ విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలను మూసివేసి సీజ్ చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్, పెన్నులు తదితర వస్తువులను తమవద్దనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒ త్తిడి చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే శాఖాపర ంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడిగా దయాకర్కేయూ క్యాంపస్: రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ అప్పీలేట్ అథారిటీ సభ్యుడిగా కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ గాదె దయాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దయాకర్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ ఎక్సఫర్ట్ అప్రైజర్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో 15 ఏళ్లపాటు కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ జోనల్ మెంబర్గా ఉన్నారు. టాస్క్ఫోర్స్ సభ్యుడిగా పనిచేశారు. వరంగల్ ధర్మారానికి చెందిన దయాకర్ హనుమకొండలో స్థిరపడ్డారు. కేయూలో పలు పలు పదవులు నిర్వర్తించారు. దరఖాస్తుల ఆహ్వానం హసన్పర్తి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బండారుపల్లి, వేలేరు, హసన్పర్తి, వంగర, నెక్కొండ, కొడకండ్ల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్రెడ్డిలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, గణితం, ఫిజిక ల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ సబ్జెక్ట్లు, కళాశాలలో గణితం, బోటని, జువాలజీ, ఫిజిక్స్, కెమి స్ట్రి బోధించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. జూన్ 3వ తేదీన బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. -
సన్నాలకు బోనస్ ఏది?
కమలాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లింపులు జరగడం లేదు. యాసంగి సీజన్కు సంబంధించిన సన్నరకం బోనస్ జిల్లాలోని ఏ ఒక్క రైతుకూ అందలేదు. యాసంగి సీజన్ ముగిసి వానాకాలం సాగు ప్రారంభమవుతున్నప్పటికీ సన్నవడ్లకు బోనస్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా బోనస్ వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. బోనస్ విలువ రూ.10.57 కోట్లు.. యాసంగి పంటల సాగుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈక్రమంలో సన్నరకం వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 76 కొనుగోలు కేంద్రాలు, డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో 70 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 151 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,031 మంది రైతుల నుంచి 21,153 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.10,57,65,000 బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ యాసంగి పంట కొనుగోళ్లు దాదాపు పూర్తయి వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ డబ్బులు మాత్రం జమకాలేదు. బోనస్ ఇంకా జమకాలే.. రెండున్నర ఎకరాల్లో నేను సన్నరకం వడ్లు సాగు చేసిన. ఈనెల 9వ తేదీన కొనుగోలు కేంద్రంలో అమ్మగా, కటింగ్లు పోను 50.80 క్వింటాళ్ల లెక్కకొచ్చింది. సన్నాలకు ఇప్పటిదాకా బోనస్ పైసలు మాత్రం జమకాలే. ఇప్పటికే వానాకాలం పనులు ప్రారంభమయ్యాయి. వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలి. – పింగిలి జయపాల్రెడ్డి, కమలాపూర్ నెలదాటిన బోనస్ రాలే.. నేను ఆరెకరాల్లో సన్న వడ్లు సాగు చేసిన. నాలుగెకరాల్లో 120 క్వింటాళ్ల సన్న వడ్లు పండగా గూడూరు సొసైటీ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వడ్ల పైసలు వచ్చినయి, కానీ నెల రోజులైనా బోనస్ పైసలు మాత్రం జమ కాలేదు. వానాకాలం పనులకు ముందే నాకు రావాల్సిన రూ.60 వేల బోనస్ డబ్బులు ప్రభుత్వం వెంటనే ఇయ్యాలి. – మామిడిశెట్టి తాతారావు, గూడూరు సీజన్ ముగిసినా.. జమకాని డబ్బులు అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు బోనస్ వెంటనే చెల్లించాలని రైతుల వేడుకోలు -
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళలు ఐకమత్యంగా ఉండి అనేక రంగాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డెయిరీ వారి శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డీడీ) సహకారంతోపాటు అధికారులు అండగా ఉంటారని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు మహిళలు శిక్షణ పొందాలన్నారు. నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రత్యేక విజన్తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వివిధ అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం ‘మహాజన సభ ’ సమావేశం అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ దామెర మండలం ల్యాదెల్లలో ఏర్పాటు చేస్తున్న మహిళా నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రం జూన్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ కోసం జిల్లాలో 10 మండలాల్లోని పది గ్రామాలను ఎంపికయ్యాయని, ఈ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగే విధంగా సహకార శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతోపాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద -
పిల్లలను ప్రభుత్వ బడికి పంపండి
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2025–26విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో కొద్దిరోజులుగా అనేక చోట్ల ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే తమ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తామని కరపత్రాలు, బ్రోచర్లు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్న తల్లిదండ్రులను, ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకే వెళ్లి ప్రభుత్వ బడిలో అందించే సౌకర్యాలపై టీచర్లు అవగాహన కల్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వివిధ తరగతుల్లో చేర్పించేందుకు 1,908 మంది విద్యార్థులను గుర్తించారు. మౌలిక సదుపాయాలపై అవగాహన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఏఐ కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కూడా అందిస్తున్నామని ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ హైస్కూల్స్ పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా, అందులో ప్రత్యేక నిధులతో గ్రంథాలయాలు, ఆట వస్తువులు, ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే బడిఈడు పిల్లలను సైతం గుర్తిస్తున్నారు. బడిమానేసిన పిల్లలు ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. జూన్ 6వ తేదీనుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతోనూ సమావేశాలు ఈనెల 2వ తేదీన, 16న పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయిలో ఆయా పరిధిలోని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమిటీలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 30న స్థానిక ప్రజాప్రతినిధులతో, యువకుతల చేత సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల అవశ్యకతను వివరించి విద్యార్థుల నమోదుపై దృష్టిసారించాలని డీఈఓ వాసంతి హెచ్ఎంలను, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధచోట్ల ఒకటో తరగతికి 728 మంది విద్యార్థులను గుర్తించారు. ఆరో తరగతికి 893 మందిని, ఎనిమిదో తరగతికి 287 మందిని గుర్తించారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలియజేశారు.జిల్లాలో కొనసాగతున్న ముందస్తు ‘బడిబాట’ ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ ఉపాధి పనుల వద్దకూ వెళ్లి ప్రచారం చేస్తున్న టీచర్లు ఇప్పటివరకు 1,908 మంది విద్యార్థుల గుర్తింపు -
రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం
వర్ధన్నపేట: రైతుల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని.. 16 రకాల పంటలకు మద్దతు ధర పెంచడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కడారిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువుల సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఫసల్ బీమా యోజన, లేబర్ బీమా కార్డులు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ విధానాల కోసం, కిసాన్ విశిష్టత కార్డుల కోసం గ్రామ వ్యవసాయ అధికారుల వద్ద రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.పే..ద్ద పనస!నర్సంపేట: సాధారణంగా పనస కాయ 10 నుంచి 15 కిలోల మధ్య ఉంటుంది. కానీ.. చెన్నారావుపేట మండలం శంకరం తండా గ్రామంలో భూక్య శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఉన్న పనస చెట్టుకు ఓ కాయ 22 కిలోల బరువుతో ఉంది. జన్యుపరమైన మార్పిడి, వాతావరణంలోని మార్పుల కారణంగా అధిక బరువుగల పనస కాయలు కాస్తుంటాయని నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి గోపాల్రెడ్డి తెలిపారు.మెరుగైన వైద్య సేవలందించాలి..గీసుకొండ: జిల్లాలోని పల్లె దవాఖానల్లో వైద్యులు మెరుగైన సేవలందించి, ప్రభుత్వం నిర్ణయించిన వైద్య, ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ విషయంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలన్నారు. టీబీ నియంత్రణ అధికారి ఆచార్య, ఎయిడ్స్ విభాగం మేనేజర్ స్వప్న మాధురి, డిప్యూటీ డెమో అనిల్కుమార్, డీఎండీఓ కమలాకర్, హెచ్ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా హెచ్ఐవీ, ఎస్టీఐల గురించి ప్రచారం చేయడానికి మొబైల్ ఎల్ఈడీ స్క్రీన్ వాహనాన్ని ప్రారంభించారు.క్రీడలతో ఉద్యోగావకాశాలురాయపర్తి: క్రీడలు దేహదారుఢ్యంతోపాటు ఉద్యోగావకాశాలకు దోహదపడతాయని జిల్లా క్రీడల అధికారి(డీవైఎస్ఓ) సత్యవాణి అన్నా రు. గురువారం మండలంలోని కాట్రపల్లి, తి ర్మలాయపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వార్షిక వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో సెల్ఫోన్లు విని యోగించకుండా,బావుల్లో ఈతలకు వెళ్లకుండా సమయాన్ని క్రీడలపై దృష్టి సారించడం సంతో షకరమన్నారు. క్రీడల్లో వచ్చిన సర్టిఫికెట్లు ఉ ద్యోగావకాశాలకు ఉపయోగపడతాయన్నారు. సందర్భంగా ట్రైనర్లు ఉపాధ్యాయులు పుట్ట సమ్మయ్య, శ్రీనివాస్ను అభినందించారు.మాల్దీవుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనన్యూశాయంపేట : ప్రభుత్వ పథకాల అమలు, ఆడిట్, అభివృద్ధి కార్యకలాపాల తీరును పరిశీలించేందుకు వచ్చిన మాల్దీవుల అధ్యయన బృందం పర్యటన గురువారం ముగిసింది. బృందంలోని 30మంది సభ్యులు వరంగల్ జిల్లాలోని జెడ్పీ, డీఆర్డీఓ కార్యాలయాలు, గీసుకొండ మండలంలోని మరియపురం, వర్ధన్నపేట మండలాలను మూడ్రోజుల పాటు సందర్శించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కలెక్టర్ను కలిసి పర్యటన వివరాలను తెలిపి సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు
ఖిలా వరంగల్ : ప్రైవేట్ విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని, సకాలంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు సూచించారు. వరంగల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్యపు) పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం ఫిట్నెస్ కోసం వచ్చిన బస్సులను అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా ఇన్చార్జ్ ఆర్టీఓ పరిశీలించారు. ఇప్పటి వరకు ఆరు బస్సులకు వివిధ కారణాలతో ఫిట్నెస్లు రిజెక్ట్ చేయగా, 40 బస్సులకు పరీక్షలు పూర్తి చేసి సర్టిఫికెట్స్ జారీ చేశామని వివరించారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకి బస్సు చర్యలు తప్పవన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళలు ఐకమత్యంగా ఉండి అనేక రంగాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డెయిరీ వారి శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డీడీ) సహకారంతోపాటు అధికారులు అండగా ఉంటారని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు మహిళలు శిక్షణ పొందాలన్నారు. నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రత్యేక విజన్తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వివిధ అంశాలపై ఎమ్మెల్యే సమావేశం ‘మహాజనసభ ’ సమావేశం అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ దామెర మండలం ల్యాదెల్లలో ఏర్పాటు చేస్తున్న మహిళా నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రం జూన్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ కోసం జిల్లాలో 10 మండలాల్లోని పది గ్రామాలను ఎంపికయ్యాయని, ఈ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగే విధంగా సహకార శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతోపాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలి : కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద -
లో లెవెల్.. హై రిస్క్!
నర్సంపేట: వర్షాకాలం వచ్చిందంటే భారీ వరదలతో ఆ రహదారి బ్లాక్ అవుతుంది. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు రాకపోకలు బంద్ అవుతాయి. చిన్న సమస్య పరిష్కారం చేయడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి వాహనదారులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో సమస్య ఎప్పటిలాగే పునరావృతం కానుంది. ప్రయాణం.. ప్రమాదకరం నర్సంపేట నెక్కొండకు చెన్నారావుపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో పాత మగ్ధుంపురం గ్రామ సమీపంలో ఉన్న లో లెవల్ కాజ్వే మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కాజ్వేకు ఇరువైపులా ఉన్న రక్షణ దిమ్మెలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా లో లెవల్ కాజ్వేకు బుంగ పడింది. ఆర్అండ్బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అయినా ఈ లోలెవల్ కాజ్వే శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరహదారి మీదుగా వెళ్లాలంటే కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించడంతో కాజ్వేపై నుంచి నర్సంపేట–నెక్కొండకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు.. ● కాజ్వే పై నుంచి వర్షాకాలంలో ప్రవహిస్తున్న నీటిని దాటి వెళ్తూ ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. ● ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు చూసి కాపాడారు. ● గతేడాది వర్షాకాలంలో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను ప్రవాహం నుంచి దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ● మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రాత్రి వేళ వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోలెవెల్ కాజ్వే కింద పడిపోయి ఇప్పటి వరకు అచేతన స్థితిలో మంచానపడి ఉన్నాడు. ఇలా.. ప్రతీ వర్షాకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.లో లెవల్ కాజ్వేపై బ్రిడ్జి నిర్మాణమెప్పుడో? వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ప్రధాన రహదారిలోని కాజ్వే విరిగిన రక్షణ దిమ్మెలు భయాందోళనలో ప్రయాణికులు, వాహనదారులు నూతన బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు... -
విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
వర్ధన్నపేట: మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో గురువారం డిస్ట్రిక్ట్ సీడ్ స్క్వాడ్, వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా షాపుల్లోని సరుకు నాణ్యత ప్రమాణాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈతనిఖీల్లో భాగంగా.. కొన్ని విత్తన ప్యాకెట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటి శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. షాపుల నిర్వాహకులు ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మినట్లయితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బోర్డు తప్పనిసరిగా పకడ్బందీగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా నాసిరకం విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయభాస్కర్, అధికారులు రంజిత్, విజయ్కుమార్, ఎస్సై చందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకుమించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాల కు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖ ర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే లా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొ న్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహు ల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస, తదితరులు పాల్గొన్నారు.ఎరువులు, విత్తనాలపై నిఘా ఉంచాలి ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్పై సమీక్ష పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు,భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. -
పరకాల మాజీ కౌన్సిలర్పై హత్యాయత్నం
హసన్పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... పరకాల మాజీ కౌన్సిలర్ పల్లె దశరథం బుధవారం ఇంటినుంచి బైక్పై హనుమకొండకు బయలుదేరాడు. అప్పటికే దశరథం బైక్పై వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో జాతీయ రహదారిపై మాటు వేశారు. దశరథం వంగపహాడ్ దాటిన తర్వాత ప్రత్యర్థులు అతని బైక్ను అడ్డుకుని పొత్తి కడుపుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడినుంచి దశరథం చాకచక్యంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం అతను వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. పాత కక్షలే కారణం? ఈ దాడికి పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మాజీ కౌన్సిలర్ దశరథానికి, పరకాలకు చెందిన ఓ వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం సదరు వ్యక్తిపై దశరథం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించినట్లు స్థానికులు తెలిపారు. ఆ కక్షలను దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు. ఇనుపరాడ్లతో దాడి.. గాయాలు -
విపత్తులనుంచి రక్షణకు ‘ఆపదమిత్ర’లు
పరకాల: ప్రకృతి విపత్తుల బారినుంచి రక్షణ చర్యల కోసం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ(ఆపద మిత్రలు)ను ప్రోత్సహిస్తున్నట్లు పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర విపత్తు సంస్థ వారి ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 80 మంది వలంటీర్ల(ఆపదమిత్రలు)కు వివిధ శాఖల నిపుణులతో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్, ఫైర్ అధికారి భద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నారాయణ మాట్లాడుతూ విపత్తు సంస్థ ద్వారా వలంటీర్లు శిక్షణ పొందడం గొప్ప అవకాశమన్నారు. ప్రతీ వలంటీర్ను మంచి అవగాహన, టెక్నిక్తో కూడిన వ్యక్తిగా మరల్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ మాట్లాడుతూ మానవ కారక వైపరీత్యాలు సహజంగా ఉంటాయని, ప్రతీ వలంటీర్ విషయ పరిజ్ఞానంతో వాటి నివారణ కోసం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ దివ్య, మెప్మా ఏడీఎంసీ సతీష్, మెప్మా సిబ్బందితోపాటు వలంటీర్లు పాల్గొన్నారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ -
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడిన ఉద్యోగం తప్ప వేరే పనులు చేసుకోలేని స్థితిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా.. కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఆదాయం అందజేయడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి. – మోతె శ్రీనివాస్రెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ అందజేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్లోని టీఎన్జీఓస్ భవన్లో, సెక్రటేరియట్లో వినతులు అందజేశాం. కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం – జగన్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ సభ్యుడు -
సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి
హసన్పర్తి: సీపీఐ హనుమకొండ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులుగా సిరబోయిన కర్ణాకర్, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, నద్దునూరి అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, మునిగాల భిక్షపతి, నేదునూరి రాజమౌళి, ఉట్కూరి రాములు (రైతు సంఘం), కర్రె లక్ష్మణ్ (వ్యవసాయ కార్మిక సంఘం), ఓదెలు, బాషబోయిన సంతోష్ (విద్యార్థి సంఘం), మంచాల రమాదేవి(మహిళా సమాఖ్య), జక్కుల రాజుగౌడ్ (ఏఐటీయూసీ)తోపాటు మరో 45 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి హనుమకొండ జిల్లాలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు వల్ల నిరుద్యోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీల అమలులో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ మహాసభలను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు భిక్షపతి కృతజ్ఞలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు పాల్గొన్నారు. -
విత్తనాల కోసం పరుగులు.. ‘సబ్సిడీ’ ఊసేలేదు...
గత వానాకాలం సీజన్లో మే మాసం మొదటి వారంలోనే సబ్సిడీపై శనగ, మొక్కజొన్న, వరి విత్తనాలను జాతీయ ఆహార భద్రత పథకం కింద వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అందజేశారు. బీపీటీ5204, 2270, 2782, ఎన్డీఎల్ఆర్8, ఎంటీయూ, ఎంసీయూ తదితర వైరెటీలను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు కాలం నెత్తిమీదికొచ్చినా.. సబ్సిడీ విత్తనాలు అందడం లేదని రైతులు చెబుతున్నారు. అనుకున్నదానికంటే ముందే వర్షాలు పడుతుండడంతో రైతులు కూడా విత్తనాల కోసం తొందరపడి దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ‘కొరత ఏర్పడుతుందని, బ్లాక్ చేస్తారని నేను పత్తి విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నా. సీజన్ మొదలైనప్పటికి మరో వారం రోజుల తర్వాత విత్తనాలు పెడతా. ఎందుకంటే వర్షాలు మధ్యలో ఆగిపోతే విత్తనాలకు పెట్టిన పెట్టుబడి వృదా అవుతుంది’ అని పరకాలలో ఫర్టిలైజర్ దుకాణం వద్ద ఆత్మకూరుకు చెందిన పంతూరి మల్లయ్య చెప్పాడు. పరకాల మండలం చెన్నాపూర్కు చెందిన ఇంగె రాజమల్లు కూడా ‘వర్షాకాలం ముందే వచ్చినట్లు అనిపించి చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ నాకు రెండు.. మూడు వర్షాలు పడితే నమ్మకం కుదురుతుంది. వారం రోజులు ఆగిన తర్వాత విత్తనాలు వేస్తా. పేరున్న బీటీ విత్తనాలు బ్లాక్ చేస్తారనే భయంతో వారం క్రితమే కొనుగోలు చేశా’అని చెప్పుకొచ్చారు. -
కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులు
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్మహల్ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు.వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ : ఎంపీ కావ్యహన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.క్రైం ఏసీపీగా సదయ్యహసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు.నిట్లో టెమ్ ఎక్స్పోకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.కాజీపేట రైల్వే అమృత్ భారత్ పనుల తనిఖీకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ రైల్వే పునరాభివృద్ధి పనులను బుధవారం సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) గోపాల్ తనిఖీ చేశారు. స్థానిక రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కాజీపేట రైల్వే రన్నింగ్ రూం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి రైల్వే డిజిల్ లోకోషెడ్కు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేసి షెడ్ అధికారులతో మాట్లాడారు. ఆయనవెంట సికింద్రాబాద్ డివిజన్ ఏడీఈన్ ప్రంజల్ కేసరి, కాజీపేట ఏడీఈఎన్ కేఆర్కె.రాజు, ఐఓడబ్ల్యూ విజయ్కుమార్, వివిధ విభాగాల స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
ధర్మసాగర్: వైద్యసిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.అప్పయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ, సబ్ సెంటర్లలో పలు రికార్డులను పరిశీలించి ఏఎన్ఎంలు, ఆశాలకు దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించేలా చూడాలన్నారు. టీబీ కేసులకు క్రమం తప్పకుండా మందులను అందించి వేయించాలని, రోజూ సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించి మందులు ఇవ్వాలని తెలిపారు. కేన్సర్ రోగుల దగ్గరకి వెళ్లి రెగ్యులర్గా మందులు వాడుతున్నారా లేదా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.అరుణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నెహ్రూచంద్ నాయక్, పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్లు మహేందర్, అలేఖ్య, శృతి, భారతి, రుచిత, కవిత, శ్వేత, సూపర్వైజర్లు ప్రసన్న కుమారి, రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
‘ఆర్యువీ’పై వీసీలో సమీక్ష
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బుధవారం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగా ఎలా పనిచేస్తుందో రెగ్యులర్గా అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి కలెక్టర్లుప్రావీణ్య, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇదీ వానాకాలం యాక్షన్ప్లాన్..
వర్షాకాలంలో (జూన్–అక్టోబర్) పండించే పంటల సాగు కోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల, పురుగుల మందులు, మార్కెటింగ్ వంటి అంశాలపై హనుమకొండ జిల్లా వ్యవసాయశాఖ యాక్షన్ప్లాన్ సిద్ధం చేసింది. ఈవానాకాలంలో 2,31,320 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా వేసిన అధికారులు.. 1,46,800 ఎకరాల్లో వరి సాగు కోసం 36,700 క్వింటాళ్లు, 5.400 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకోసం 432 క్వింటాళ్ల విత్తనాలు అవరసరమని పేర్కొన్నారు. అదేవిధంగా 78,000 ఎకరాల్లో పత్తిసాగు కోసం 1,95,000 ప్యాకెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సుమారుగా 4,894 టన్నుల యూరియాతో పాటు డీఏపీ ఇతర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎరువులు ఇప్పుడే అంత అవసరం లేకపోయినా ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు రైతులు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కూడా రైతులను నాసిరకం విత్తనాలు భయపెడుతున్నాయి. ఈ సీజన్ కోసం సిద్ధం చేసిన రూ.78.63లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను మార్చి చివరి వారంలో హనుమకొండ జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా జిల్లాలో ఈ ముఠా సభ్యులు విక్రయిస్తున్నారన్న ప్రచారం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. -
వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ : ఎంపీ కావ్య
హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిట్లో ‘టెమ్ ఎక్స్పో’ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. -
మూడు ముక్కలైన ట్రాక్టర్
● ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ దుగ్గొండి: ప్రమాదవశాత్తు అదుపు తప్పి గోతిలో పడిన ట్రాక్టర్ ఇంజిన్ మూడు ముక్కలైంది. బంధంపల్లి గ్రామానికి చెందిన బుస్సారి రాజుకు చెందిన సోనాలిక ట్రాక్టర్పై ప్రవీణ్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ రైతు భూమిలో దుక్కిచేయడానికి బుధవారం ఉదయం రోటోవేటర్తో వస్తున్నాడు. ఈక్రమంలో పొనకల్–లక్ష్మీపురం గ్రామాల మధ్య కొత్త చెరువు కట్ట దిగే క్రమంలో ఇంజన్ అదుపు తప్పింది. 100 మీటర్ల వరకు పంట పొలాల్లోకి వెళ్లి ఓ భారీ గోతిలో పడింది. ఇదే సమయంలో ట్రాక్టర్ను వదిలి డ్రైవర్ ప్రవీణ్ బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గోతిలో పడిన ఇంజన్ మూడు ముక్కలైంది. క్రేన్ సాయంతో బయటికి తీసి ట్రాలీలో ఎక్కించారు. ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి● డీఎంహెచ్ఓ సాంబశివరావు సంగెం: ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యాధికారులు, సిబ్బంది వంద శాతం చేరుకోవడానికి కృషి చేయాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని కాపులకనపర్తి, సంగెంతో పాటు 17వ డివిజన్ వసంతాపురంలోని ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు కొమురయ్య, మోహన్సింగ్, సీసీ నాగరాజు, పల్లెదవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మరియపురంలో మాల్దీవ్స్ బృందం పర్యటనగీసుకొండ/వర్ధన్నపేట: జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ మరియపురం, వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామాన్ని మాల్దీవులకు చెందిన ప్రతినిధులు బుధవారం సందర్శించారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందుతూ స్టడీ టూర్లో భాగంగా వారు గ్రామ సందర్శనకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వెచ్చింపు వివరాలు తెలుసుకున్నారు. గీసుకొండ, వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి ఆడిట్ రికార్డుల్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, బృంద సభ్యులు పాల్గొన్నారు. ‘యువ వికాసం’పై పటిష్ట కార్యాచరణ● వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువవికాసం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. లబ్ధిదారులకు వ్యాపార నైపుణ్యాలపై సంపూర్ణ శిక్షణ ఇవ్వాలన్నారు. జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
నర్సంపేట/నెక్కొండ: మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఏదో ఒక కుటీర పరిశ్రమతో అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆశాజ్యోతి మండల సమాఖ్య 16వ మహాసభ, నెక్కొండ రైతు వేదికలో బుధవారం భారతీ మండల సమాఖ్య 17వ వార్షిక మహా సభ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆశాజ్యోతి మండల సమాఖ్యకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు, భారతీ మండల సమాఖ్యకు రూ. 15.10 లక్షల బ్యాంకు లింకేజీ రుణం చెక్కును అందించారు. చెన్నారావుపేటలో కడుదూరి హైమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్ ఫణికుమార్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ మోహన్కాంత్, ఏపీఎం ముక్కెర ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు భూక్య గోపాల్నాయక్, మొగిలి వెంకట్రెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈశ్వర్, సీసీలు మంజుల, మాణిక్యం, కట్టయ్య, శ్రీలత, సుజాత, రజిత, సిబ్బంది పాల్గొన్నారు. నెక్కొండలో మహా సభ సమాఖ్య మండల అధ్యక్షురాలు మార్త లావణ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య ఓబీ నాగరాణి, పద్మ, సునీత, సీసీలు రవీందర్, ఏకాంబ్రం, శారద, వెంకట్, ఎస్ఎన్ లావణ్య, వివిధ గ్రామాల వీఓ ప్రతినిధులు, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పలు మండల సమాఖ్య మహాసభలు -
శిక్షణలో నేర్చుకున్నవి అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని నాణ్యమైన విద్యాబోధన, నూతన పద్ధతుల్లో బోధించాలని వరంగల్ విద్యాశాఖ క్వాలిటీ కో–ఆర్డి నేటర్ సుజన్తేజ అనఅనఅన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఐదురోజులగా ఉర్సు గుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న శిక్షణ బుధవారం సాయంత్రం ముగిసింది. ఈముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. టీచర్లు సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్స్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతి బోధనలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ఈ ముగింపు సమావేశంలో ఘనంగా సన్మానించారు. సమావేశంలో శిక్షణా కేంద్రం ఇన్చార్జ్ వెంకటేశ్వర్రావు, డీసీఈబీ సెక్రటరీ జి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మూడు దశల్లో మొత్తంగా సుమారు 1,800 మంది స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ పూర్తయ్యింది. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ ముగిసిన టీచర్ల శిక్షణ -
మీ సేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
ఖిలా వరంగల్: మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని మీసేవ కేంద్రం జిల్లా మేనేజర్ రాజ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు బుధవారం ఖిలా వరంగల్ మండల పరిధి మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యకలాపాలను పరిశీలించారు. కేంద్రానికి వివిధ పనులపై వచ్చిన వినియోగదారులను అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాలు పారదర్శకంగా పని చేయాలని, నిబంధనలు అతిక్రమించి అధికంగా వసూళ్లకు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరులకు స్పష్టంగా కనిపించేలా పౌర సేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఎప్పటికప్పడు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలన్నారు. అనధికార ప్రదేశాల్లో మీసేవ కేంద్రాలు నడపవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
సాగుకు సమాయత్తం..
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025– 8లోuసాక్షి, వరంగల్: వారం రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఓవైపు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అవస్థలు పడుతుండగా.. ఇంకోవైపు వర్షాలు రావడంతో పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు వరి పండించేందుకు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ట్రాక్టర్తో ఫ్లవ్ వేసి, రోటవేటర్ చేసి పత్తి విత్తనాలు కొన్ని మండలాల్లో విత్తుతున్నారు. మరికొందరు రైతులు ఇప్పటికే కురిసిన వర్షంతో దుక్కి దున్ని విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం చాలామంది రైతులు వరంగల్ నగరంలోని విత్తన దుకాణాలకు చేరుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో నకిలీ, నాసిరకం విత్తనాలు, ప్రభుత్వ అనుమతి తీసుకుని కంపెనీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. కలెక్టర్ సత్యశారద విత్తన దుకాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విత్తనాలు కొనే ముందు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరోవైపు రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి. 3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, ఇతర ఆరుతడి పంటల విత్తనాలు విత్తుకోవడం ప్రారంభించారు. జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సాగు 3.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు ఉంటుందని, 2,90,419.50 క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉందని వ్యవసాయ అధికారులు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 1,43,803 ఎకరాల్లో వరి, 1,26,173 ఎకరాల్లో పత్తి, 9,820 ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. ఇందుకోసం యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,11,430 క్వింటాళ్లు అవసరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు 5,511 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. మోస్తరు నుంచి భారీ వర్షం.. జిల్లాలో బుధవారం కూడా వర్షం దంచికొట్టింది. ఖిలావరంగల్లో 80.4 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 69.2 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. వరంగల్లో 58.6, నల్లబెల్లిలో 55.2, ఖానాపూర్లో 51, చెన్నారావుపేటలో 50.2, వర్ధన్నపేటలో 40.2, గీసుకొండలో 34.4, నర్సంపేటలో 31.4, రాయపర్తిలో 28.4, నెక్కొండలో 24.4, పర్వతగిరి, సంగెంలో 21.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ విభాగాధికారులు వెల్లడించారు.న్యూస్రీల్విత్తనాలు విత్తడం షురూ.. దుగ్గొండి: మండల పరిధి నాచినపల్లి, పొనకల్, తొగర్రాయి, గిర్నిబావి, మందపల్లి, చాపలబండ, అడవి రంగాపురం, పీజీతండా, రాజ్యతండా గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. బుధవారం పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. కొనేముందు ఇవి చెక్ చేసుకోవాలి.. విత్తన ప్యాకెట్పై ధర ఎంత ఉందో చూడాలి. బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయవద్దు. షాపు యజమానులు రైతులు అడిగిన విత్తనాలు లేవని అదేపేరుతో ఉన్న మరో విత్తన ప్యాకెట్ ఇస్తామంటారు. అలాంటి ప్యాకెట్లు తీసుకోవద్దు. షాపు యజమానులు రైతులను తప్పుదోవ పట్టిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవచ్చు ప్యాకెట్పై ఉన్న ధర కంటే ఎక్కువ చెబితే అధికారులకు ఫిర్యాదు చేయాలి. లైసెన్స్ ఉన్న షాపు వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.జిల్లాలో ఈ ఏడాది 3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. వర్షాలు ముందుగా రావడంతో సిద్ధమైన అన్నదాతలు దుక్కులు దున్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తిన కొందరు రైతులు ఇంకొందరు విత్తనాల కోసం దుకాణాలకు క్యూ నాసిరకంతో జాగ్రత్త అంటున్న వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులుఏడెకరాల్లో పత్తి గింజలు వేసిన..ఈఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయనే ఆలోచనతో దుక్కి సిద్ధం చేసుకున్నాను. ఎప్పుడు వర్షం పడితే అప్పుడే విత్తనాలు నాటేందుకు సన్నద్ధమయ్యా. మంగళవారం అచ్చు తోలుకొని సిద్ధం చేసుకున్నా. బుధవారం ఏడెకరాల్లో పత్తి విత్తనాలు నాటా. కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కలు అన్ని దక్కుతాయనే ఆశాభావం ఉంది. – పెండ్లి మల్లారెడ్డి, మహబూబ్నగర్ గ్రామం, రాయపర్తి విత్తనాలు కొనేముందు చెక్ చేసుకోవాలి.. విత్తన ప్యాకెట్లను కొనేముందు రైతులు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏమైనా అనుమానాలుంటే మా దృష్టికి తీసుకురావాలి. నాసిరకం విత్తనాల్ని నియంత్రించేందుకే ఇప్పటికే మా టాస్క్ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిఘా వేసి ఉంచాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉన్నాం. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు పండించిన ధాన్యం తడవకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ప్రభుత్వం సూచించిన మేరకు రైతుల నుంచి ధాన్యం ధాన్యం పక్కాగా సేకరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్యదేవి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తపడాలి.. ఖానాపురం: రైతులు వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని ఖానాపురం, పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకోగానే రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. వర్షాలతో తేమశాతం వచ్చేలా లేదని, ధాన్యాన్ని బాయిల్డ్ మిల్కు పంపి న్యాయం చేయాలని వేడుకున్నారు. అదనంగా మరో కిలో కోతతో ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేయించాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ రైతులకు తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, డీటీ సంధ్యారాణి, ఇన్చార్జ్ తహసీల్దార్ కృష్ణ, ఏఓ శ్రీనివాస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ -
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఆ ఉద్యోగులకు వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం -
సర్వే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్లు
హసన్పర్తి : రాబోయే రోజుల్లో సర్వే నివేదిక ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో 50రోజుల పాటు నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. సర్వేకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థులకు అవసరమైన మెటీరియల్ను అందజేశారు. అనంతరం ప్రావీణ్య మాట్లాడుతూ.. శిక్షణలో సర్వేయర్లు అన్ని అంశాలపై పట్టు సాధించాలన్నారు. చివరగా పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే భూ–భారతి సర్వేయర్లుగా అవకాశం లభిస్తుందన్నారు. భూవివాదాల పరిష్కారానికి సర్వే నివేదికే కీలకమన్నారు. కాగా, కలెక్టర్ స్వయంగా శిక్షణార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ చల్లా ప్రసాద్స, లైసెన్స్ సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు పెసరు బొందయ్య, చుంచు రవి, తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ అదేవిధంగా మండలంలోని లక్ష్మీ ఫర్టిలైజర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించారు. గోదాంలోని నిల్వలను స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, మండల వ్యవసాయాధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూసేకరణ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణ మొదటి దశలో గుర్తించిన రైతులకు జూన్ 30 నాటికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, ఆర్అండ్బీ ఈఈ సురేష్ బాబు, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కె.నారాయణ, నేషనల్ హైవే అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
చిన్నకొర్పోలులో వికటించిన వైద్యం
నెక్కొండ: వైద్యం వికటించి ప్రాణపాయం నుంచి ఓ బాధితుడు బయటపడ్డ ఘటన మండలంలోని చిన్నకొర్పోలు శివారు చెరువుముందరి తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా తెలంగాణ వైద్యమండలి దృష్టికి తీసుకెళ్లడంతో సూరిపల్లిలోని మహేశ్వర్ క్లినిక్, మండలం కేంద్రంలోని లావణ్య, రుద్ర, అమ్మ ఫస్ట్ ఎ యిడ్ సెంటర్లలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆజీర్మా తులస్య అలియాస్ తుల్చా ఏప్రిల్ 7న ఒళ్లు నొప్పులతో నీరసంగా ఉండడంతో చిన్నకొర్పోలులో ఫస్ట్ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్న బర్మావత్ మోహన్ను సంప్రదించాడు. దీంతో తొంటికి ఇంజక్షన్ వేయగా అది గడ్డ కట్టింది. తీవ్రనొప్పి, జ్వరం రావడంతో మళ్లీ సంప్రదించాడు. వివిధ రకాల ఇంజక్షన్లతోపాటు సైలెన్లు పెట్టి చికిత్స చేశాడు. సమస్య జఠిలం కావడంతో కుటుంబ సభ్యులు 12న నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అత్యవసర పరిస్థితిలో రెండుసార్లు ఆపరేషన్ చేసి తొంటి, తొడ, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ను తగ్గించారు. మళ్లీ ఇన్ఫెక్షన్ సోకడంతో తొర్రూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్ చే శారు. ప్రస్తుతం తులస్య ఆరోగ్యం కుదుట పడింది. కాగా, నకిలీ వైద్యుడు మోహన్పై చర్య తీసుకో వాలని బాధితుడి భార్య బుజ్జి తన బంధువుల సా యంతో పోలీస్ స్టేషన్తోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివిన మోహన్ మూడేళ్లుగా వైద్యం చేస్తున్నాడని తేలింది. సూరిపల్లి మహేశ్వర్ క్లినిక్ సెంటర్ నిర్వాహకుడు ఎం.రమేశ్, మండల కేంద్రంలోని అమ్మ, రుద్ర, లావణ్య ఫస్ట్ఎయిడ్ నిర్వహకులు డి.అశోక్, బి.రవి, ఎం.రమేశ్ ఆస్పత్రుల్లో కాంపౌండర్లుగా పనిచేసి, చట్టవిరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. మోహన్తోపాటు మరో నలుగురిపై కేసునమోదు చేశారు. తనిఖీలో జిల్లా హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు, ఐఎంఏ ఆంటీ క్వాకరీ కమి టీ సెక్రటరీ డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ నవీన్, ఎస్సై మహేందర్, తదితరులు పాల్గొన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తెలంగాణ వైద్య మండలి తనిఖీలు -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
గీసుకొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, ఆరూరి రమేశ్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీష్, రత్నం,సతీష్షా, వల్లాల వెంకటరమణ, కంభంపాటి పుల్లారావు, బాకం హరిశంకర్ పాల్గొన్నారు. బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ -
ధాన్యం దిగుమతి చేయాలని రాస్తారోకో
ఖానాపురం: మిల్లు వద్దకు చేరిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపురం శివారులో మంగళవారం రైతులు ధాన్యం ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. రైతుల రాస్తారోకోకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సైలు రఘుపతి, పవన్ అక్కడకు చేరుకొని రైతులు, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు. సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి, డీటీ రాజారేణుక, ఆర్ఐ స్వామి, ఏఎస్ఓ సుగుణ.. ధాన్యం దిగుమతి చేయించేందుకు మిల్లర్తో చర్చించారు. అయితే.. మిల్లులో స్థలం లేదని, తాను దిగుమతి చేసుకోనంటూ మిల్లర్ నిరాకరించారు. బుధరావుపేటలోని రైతు ఉత్పత్తిదారుల సంఘానికి చెందిన గోదాంలో దిగుమతి చేయించాలని సూచించినా మిల్లర్ వినిపించుకోలేదు. దీంతో రైతుల ధాన్యం దిగుమతి కాకుండా మిల్లు వద్దనే నిలిచిపోయింది. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్లు మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికార పార్టీ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కు కావడంతోనే రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆరోపించారు. సోమయ్య, సుమన్, అశోక్, బాలు, రైతులు యాక య్య, నాగరాజు, ఈర్యనాయక్, కుమారస్వామి, ఎల్లస్వామి, వెంకన్న, భీమానాయక్ పాల్గొన్నారు. అధికారులు చెప్పినా.. నిరాకరించిన మిల్లర్ -
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ధర్మసాగర్ : పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 32 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మసాగర్, వేలేరు మండలాల తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య -
6.8కిలోల గంజాయి స్వాధీనం
శాయంపేట : మండలంలోని మాందారిపేట స్టేజి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంజిత్రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మాందారిపేట స్టేజి వద్ద ఎస్సై జక్కుల పరమేష్.. సిబ్బందితో కలిసి మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఎస్సై అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాటిని తూకం వేయగా 6 కిలోల 85 గ్రాములు ఉండగా, దీని విలువ సుమారు రూ.3.10లక్షల వరకు ఉంటుంది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన సయ్యద్ షారుఖ్ జాకీరుద్దీన్ అహ్మద్గా గుర్తించారు. ఒడిశాకు చెందిన జితేంద్ర కుమార్ వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించగా, జితేంద్ర కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై, సిబ్బందిని సీఐ అభినందించారు. -
చిరువ్యాపారులపై అధికారుల జులుం
కూరగాయల దుకాణాల తొలగింపు హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారులపై బల్దియా అధికారులకు కోపం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్నారంటూ నేలపై పడేశారు. దండం పెడతాం వదిలేయండని వేడుకున్నా కనికరించలేదు. దీంతో పలువురు చిరువ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. హనుమకొండ చౌరస్తాలోని ఖాళీ స్థలంలో గత నాలుగేళ్లుగా దాదాపు 40కి పైగా వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం చౌరస్తా కూరగాయల అడ్డా వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు ‘మీకు ఖాళీ చేయాలని రెండు రోజుల ముందే చెప్పాం. అయినప్పటికీ మీరు చేయడం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్ : జూన్ 2వ తేదీన జిల్లాలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వీ గణేష్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు రమేష్, కె.నారాయణ, తదితరులు పాల్గొన్నారు. జూన్ 17న డాక్ అదాలత్ఖిలా వరంగల్: జూన్ 17న పోస్టల్ సర్వీస్ విని యోగదారులకు 50వ ప్రాంతీయస్థాయి డాక్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ గూగుల్ మీట్ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ బి.రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల పరిధిలోని వరంగల్ డివిజన్కు సంబంఽధించిన తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్ కవర్పై 50వ డాక్ అదాలత్, అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాప్ అండ్ విజిలెన్స్) కె.శ్రీకాంత్, పోస్ట్మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్, అడ్రస్ రాసి జూన్ 6వ తేదీలోగా చేరేలా పంపించాలని సూచించారు. ‘వాట్సాప్’తో విద్యుత్ సమస్య పరిష్కారంహన్మకొండ : వాట్సాప్ చాట్బాట్ ద్వారా విని యోగదారులు విద్యుత్ సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకు రావొచ్చని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు మధుసూదన్ రావు, కె.గౌతం రెడ్డి తెలిపారు. వాట్సాప్ చాట్బాట్ ద్వారా సమస్యలను పంపే వివరాలను వారు మంగళవారం వేర్వేరు ప్రకటనలో వివరించారు. వినియోగదారులు తమ మొబైల్ నుంచి 79016 28348 నంబర్కు హాయ్ అని చాట్ చేయగానే.. వెల్కమ్ టు టీజీ ఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ వస్తుందని, క్రమపద్ధతిలో వివరాలు ఇస్తే కంప్లయింట్ నమోదవుతుందని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి కూడా సేవలు పొందాలని సూచించారు. నేటినుంచి 31వరకు రైల్వేగేటు మూసివేత కమలాపూర్ : మండలంలోని ఉప్పల్–హసన్పర్తి రైల్వే స్టేషన్ల మధ్యలో గల రైల్వేగేటును నేటినుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర మరమ్మతులు చేపడుతున్న దృష్ట్యా నాలుగు రోజుల పాటు రైల్వేగేటు బంద్ ఉంటుందని పేర్కొన్నారు. దేశరాజుపల్లి, దండెపల్లి మార్గంలో ప్రయాణించే వాహనదారులు గమనించి రైల్వే శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ముగిసిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలువిద్యారణ్యపురి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (జనరల్) మంగళవారంతో ముగిశాయి. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇంటర్ జనరల్ విభాగంలో ఫస్టియర్ పరీక్షకు 6,298 మంది విద్యార్థులకు 5,663 మంది(90శాతం) హాజరు కాగా 635మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఖానాపురం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం నిర్వహించిన చైతన్య మండల సమాఖ్య వార్షిక మహాసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈసందర్భంగా రుణాలు తీసుకొని పలు వ్యా పారాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి చెందుతున్న మహిళలను సన్మానించారు. ప్రభుత్వం నుంచి సంఘానికి మంజూరైన రూ.10.20 కోట్ల చెక్కును అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్రెడ్డి, ఏపీడీ రేణుకాదేవి, డీపీఎం అనిత, ఎంపీడీఓ సునీల్కుమార్, ఏపీఎంలు కందిక సుధాకర్, వేణు, అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
భూ సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
న్యూశాయంపేట: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైందని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ భూ రికా ర్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 315 మంది సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజులపాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే సర్వేయర్లుగా నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అభ్యర్థులకు శిక్షణ మెటిరియల్ కిట్ను అందించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలకం ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు పాత్ర కీలకమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ నుంచి కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హాస్టళ్లలో వసతులు కల్పించాలి జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెడియల్ స్కూల్స్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆర్సీఓలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్తో మంగళవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జూన్ 12న పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే యూనిఫాం సిద్ధంగా ఉండాలన్నారు. హాస్టల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వారి అవసరాలను గుర్తించాలన్నారు. హాస్టల్స్లో కంప్లైంట్స్ బాక్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తన కంపెనీ గోదాం పరిశీలన గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రాసి సీడ్స్ కంపెనీ గోదాంను మంగళవారం కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. గోదాం స్టోరేజి పాయింట్ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించా రు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రమేష్, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్, ఏఓ హరిప్రసాద్బాబు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
దేశపౌరులను చంపిన వారితో చర్చలా?
హసన్పర్తి : దేశపౌరులను చంపిన ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధపడిన కేంద్ర ప్రభుత్వం..పేదల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. హసన్పర్తిలో జరుగుతున్న ఆ పార్టీ హనుమకొండ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఐ ప్రతినిధుల సభలో సాంబశివరావు మాట్లాడారు. ఉగ్రవాదుల కంటే కమ్యూనిస్టులు అంటేనే మోదీకి భయమన్నారు. బూటకపు ఎన్కౌంటర్ వల్లే శవాలను ఇవ్వడానికి భయపడ్డారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీతో జతకట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, కేసీఆర్కు కవిత రాసిన లేఖ ద్వారా అది స్పష్టమైందన్నారు. ఆపరేషన్ కగార్పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేసి మనువాదాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నివేదికను సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రవేశపెట్టగా, వాటిని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, కార్యక్రమ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, సారంగపాణి, శంకర్, షేక్ బాబా, సిరబోయిన కర్ణాకర్, శ్యాం సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు -
శిక్షణ అంశాలు అమలుపర్చాలి
● డీఈఓ జ్ఞానేశ్వర్ విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అమలుచేసేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్ హెచ్ఎంలకు వరంగల్లోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రారంభమైన ఐదురోజుల శిక్షణ శిబిరంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. క్వాలిటీ కోఆర్డినేటర్ సుజ న్తేజ, ఏసీజీ అరుణ, సెంటర్ ఇన్చార్జ్ లక్ష్మయ్య, శ్రీనివాస్, రవీందర్, మహేష్నాయక్ పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయొద్దు
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతుల ను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులు, వినతుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి 101 దరఖాస్తులు, వినతులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల్లో ఎక్కువగా రెవెన్యూ విభాగానికి సంబంధించి 44 రాగా.. పీడీ హౌసింగ్ 11, మిగితా శాఖలకు సంబంధించినవి 46 వినతులు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయశాఖాధికారి అనురాధ, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. నాలా పర్మిషన్ కోసం తిరుగుతున్నా.. నా ఐదు గుంటల భూమికి నాలా పర్మిష న్ ఇవ్వమని అధికా రుల చుట్టూ తిరుతున్నా. వృద్దురాలు అయినప్పటికీ నాపని చేయడంలేదు. ఆఫీసు ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. సంవత్సరన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నాను. – ముత్తమ్మ, ధర్మారం, గీసుకొండ ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి అదనపు కలెక్టర్ సంధ్యారాణి ప్రజలనుంచి 101 దరఖాస్తుల స్వీకరణ -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
రాయపర్తి/పర్వతగిరి/ నల్లబెల్లి: రైతులకు నాణ్యతలేని కల్తీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ (పెస్టిసైడ్ టెస్టింగ్ లాబోరేటరి) అధికారి విజయభాస్కర్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని మైలారం, కొండూరు, రాయపర్తి, కాట్రపల్లి గ్రామాల్లో ఏఓపీటీఎల్ సీహెచ్ రంజిత్, మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రంతో కలిసి సీడ్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్లు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. గడువు ముగిసిన, నకిలీ విత్తనాలు విక్రయించొద్దని తెలిపారు. నిషేధించిన బీటీ–3 విత్తనాలను కొనుగోలు చేయొద్దని తెలిపారు. కొండూరులోని శ్రీరాజరాజేశ్వర ఏజెన్సీస్ షాపులో బిల్బుక్కు, స్టాక్ రిజిస్టర్ సరిగ్గా మెయింటనెన్స్ లేకపోవడంతో రూ.3,15000 విలువ చేసే ఆ షాపులోని 350 పత్తి విత్తనాల ప్యాకెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పర్వతగిరి మండల వ్యవసాయ అధికారి టీవీఆర్ఆర్ ప్రశాంత్కుమార్ మండలంలో వ్యవసాయశాఖ, పోలీసు శాఖలతో కలిసి విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. నల్లబెల్లి మండలంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు పి.గోవర్ధన్రెడ్డి, కె.లలిత, బి.సుధాకర్, పోలీసులు శ్రావణ్కుమార్, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు రంజిత్ రెడ్డి, రామ్మోహన్, బన్న రజిత, ఏఈఓలు సాయి, క్రాంతి, మనస్విని పాల్గొన్నారు. ఏడీఏపీటీఎల్ విజయభాస్కర్ -
ఇన్చార్జ్ల పాలన!
రవాణా శాఖలో సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లనే ఇన్చార్జ్ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్చార్జ్ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం.. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపివేసి ఒక్కో సీనియర్ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్ డిప్యుటేషన్ పోస్టింగ్’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద పదవీ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని సస్పెండయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్చార్జ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది. పాతుకుపోయారు.. ఉమ్మడి వరంగల్లో ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణలున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ కేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ సస్పెండ్ కావడం కలకలం రేపింది. ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి హనుమకొండ డీటీఓగా జూనియర్కు బాధ్యతలు తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు విచారణలు, ఆరోపణలున్నా.. కుర్చీలు వదలని అధికారులు ఆదాయం ఉన్న పోస్టింగ్ల కోసం ఇంకా పైరవీలు కీలక పోస్టుల్లో ఇన్చార్జ్లు.. హనుమకొండ డీటీఓ, డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ డీటీసీ పురుషోత్తంకు ఇన్చార్జ్ డీటీసీ బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన రమేశ్రాథోడ్కు ఇన్చార్జ్ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్కు చెందిన వేణుగోపాల్కు ఇన్చార్జ్ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. మహబూబాబాద్ గౌసుపాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్ ఎంవీఐ జైపాల్రెడ్డిని ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ములుగు డీటీఓ సిరాజ్ రెహమాన్ పదవీ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్ను ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు. జేఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించ లేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్ డీటీఓ లక్ష్మి పై బదిలీ వేటు పడింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్బాబు ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. -
‘సూపర్’ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎంజీఎం : ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశాతద, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రామకృష్ణరావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఐకానిక్ అని.. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నదని చెప్పారు. నిర్దేశిత గడువు లోగా పూర్తయ్యేలా పనుల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్ర కుమార్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ నాగేంద్ర, ఎల్అండ్టీ ఏరియా మేనేజర్ వెంకట్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సీఎస్ను కలిసిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు వరంగల్ ఎన్ఐటీ అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. సీఎస్ కె.రామకృష్ణారావు పనుల పరిశీలన.. ఉన్నతాధికారులతో సమీక్ష -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422 మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
ఆర్ట్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా జితేందర్
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కల్పన చేపట్టేందుకు ఈప్లేస్మెంట్ సెల్ అ ధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ నియమాక ఉత్తర్వులను జితేందర్కు అందించి అభినందించారు.‘కలం ధార’.. సామాజిక అంశాల కలబోత● ఆచార్య బన్న అయిలయ్యవిద్యారణ్యపురి: సామాజిక అంశాల కలబోత ‘కలం ధార’ కవితా సంపుటి అని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య అన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యాన కవి నక్క కుమారస్వామి రచించిన ‘కలం ధార’ కవితా సంపుటిని ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ పాఠశాలలో ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో బన్న అయిలయ్య మాట్లాడుతూ.. కుమారస్వామి కవిత్వంలో వస్తువైవిధ్యం బాగుందన్నారు. డీఆర్ఓ మేన శ్రీను మాట్లాడుతూ కవి.. వృత్తిపట్ల నిబద్ధతతో పాటు సామాజిక దృక్పథాన్ని కలిగి ఉండడం సంతోషంగా ఉందన్నారు. కవి, రచయిత జర్నలిస్టు నాగబెల్లి జితేందర్, కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్, యువకవి కార్తీకరాజు, బందెల భద్రన్న, వల్లంపట్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.వైభవంగా కల్యాణోత్సవంహన్మకొండ కల్చరల్: మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వర, రుద్రేశ్వరీ అమ్మవార్లకు మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆదివారం 50 వేల మంది భక్తులు రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు మణికంఠ శర్మ, సందీప్ శర్మ, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఫస్టియర్ పరీక్షకు 6,759 మంది విద్యార్థులకు 6,262 మంది(93శాతం), మధ్యాహ్నం సెకండియర్ పరీక్షకు 2,944 మందికి 2,820 మంది(96శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపా ల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ఫస్టియర్ పరీక్షకు 1,333 మందికి 1,244 మంది, మధ్యాహ్నం సెకండి యర్ పరీక్షకు 740 మంది విద్యార్థులకు 706 మంది హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్సుమన్ తెలిపారు.ఆ టీచర్లు స్క్రూటినీకి హాజరుకావాలివిద్యారణ్యపురి: బెస్ట్ ప్రాక్టీస్కు ఎస్సీఈ ఆర్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈనెల 26న పెద్ద పెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించనున్న స్క్రూటినీకి హాజరు కావాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలల్లో వినూత్నంగా విద్యాబోధన ఇతర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ ద్వారా 39 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు పీపీటీ, ఆడియో విజువల్ డెవలప్మెంట్ సమాచారం ఇతర మెటీరియల్తో హాజరుకావాలని కోరా రు. ఉపాధ్యాయులకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీస్లో మూడింటిని ఎంపిక చేసి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. -
ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత..
అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సో ర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా? అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. -
సౌధామిని.. పుష్కర మణి!
ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే గోదావరికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరెసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని నదికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రశాంతంగా గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష
హన్మకొండ అర్బన్: నగరంలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూలో ఆదివారం జరిగిన గ్రామపాలన ఆఫీ సర్ల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈపరీక్షకు 133 మంది అభ్యర్థులకు 122 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ తీ రును పరిశీలించేందుకు హనుమకొండ కలెక్టర్ ప్రా వీణ్య పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నారాయణ, కలెక్టరేట్ ఏఓ గౌరీ శంకర్, చీఫ్ సూపరిటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో..న్యూశాయంపేట: గ్రామపాలన అధికారి రాత పరీక్ష–25 ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. నగరంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 198మంది అభ్యర్థులకు 187 మంది హాజరై పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. 12 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఇస్లామియా కళాశాలను సందర్శించి కలెక్టర్ పరీక్ష జరుగుతున్న తీరు ను పరిశీలించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీ ఆర్డీఓ విజయలక్ష్మి,ఏఓ సత్యప్రసాద్,తహసీల్దాదార్ ఇక్బాల్,చీఫ్ సూపరెండింట్ తదితరులు ఉన్నారు. -
హోర్డింగులు భద్రమేనా?
వరంగల్ అర్బన్: వానాకాలం రాకముందే గాలి దూమారం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో మహా నగరం ఆగమాగమవుతోంది. హోర్డింగులు, ఫ్లెక్సీలు, వృక్షాలు నేలమట్ట మవుతున్నాయి. నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు భద్రమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? తగు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్లను బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. నగర పరిధిలో చిన్న బస్ స్టాప్లు మొదలుకొని, రహదారులు, పెద్ద పెద్ద హోర్డింగ్ల వరకు ఎటు చూసినా భారీ వ్యాపార ప్రకటనలే కనిపిస్తున్నాయి. నిబంధనలేం చెబుతున్నాయంటే.. నిబంధనల ప్రకారం జనసంచారం ఉన్న ప్రాంతా ల్లో, కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. ట్రాఫి క్ సిగ్నల్స్ వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభు త్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికలు, ప్రధాన రహదారులపై ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా గోడలకు పత్రికలను కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం మహా నగర పాలక సంస్థ (జీబ్ల్యూఎంసీ), కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునే అధికారం ఉంది. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయవచ్చు. లేకపోతే రూ. 5 వేలకు పైబడి జరిమానా విధించాలి. అయినప్పటికీ తీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు గాలికి.. ప్రజల రక్షణను బల్దియా గాలికి వదిలేస్తోంది. అనేక చోట్ల ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్, క టౌట్లతో ప్రమాదాలు జరుగుతున్నా బల్దియా అధి కారుల్లో చలనం లేదు. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పా టు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించి అనుమతిచ్చిన త ర్వాతే ఏర్పాటు చేయాలి. భవనం పటిష్టత, హోర్డింగ్ ఐరన్,నిర్దేశిత సైజు,స్థాయిలో ఉందా లేదా? అనే ది చూడాల్సి ఉంటుంది. ఏదైనా లోపాలుంటే భవ న యాజమానులకు నోటీసులు జారీ చేసి,రద్దు చే యాలి. కానీ.. అధికారులు పరిశీలనను మరిచిపోయారు. కానీ కొందరు అధికారులు కొన్ని ప్రైవేట్ భవన యజమానులు, క్షేత్రస్థాయి సిబ్బందితో లో పాయకార ఒప్పందం చేసుకొని నిబంధనలు పాటించట్లేదు. అనుమతి లేని హోర్డింగ్లు తొలగిస్తాం నగరంలో అనుమతులు లేని హోర్డింగ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. అనుమతి లేకపోతే జరిమానా విఽధించడంతోపాటు తొలగిస్తాం. – రవీందర్ వాడేకర్, బల్దియా సీపీ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రచారం ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? బల్దియా అధికారుల తీరుపై విమర్శలుఅనధికార హోర్డింగ్లే అధికం.. వరంగల్ ట్రైసిటీలో కూడళ్లు ఫ్లెక్సీలకు నిలయంగా మారాయి. కాజీపేట నుంచి మొదలుకొని హనుమకొండ, కాజీపేట వరకు ఎక్కడ చూసినా వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు ఇప్పటికే డివిజన్ల వారీగా జాబితా తయారు చేస్తే 1,200 వరకు ఫ్లెక్సీలు, హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పా టు చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సాహసించడం లేదు. యాడ్ సంస్థలకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు. -
మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్ బో రెడ్డి అయోధ్యరెడ్డి సందర్శించారు. ఆల య సంప్రదాయం ప్రకారం.. అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం గర్భాలయంలో స్వామి వారి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు అయోధ్యరెడ్డి–జ్యోతిరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా.. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాలు, మల్లికార్జునస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఐ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
మేడారంలో భక్తుల సందడి
● వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారంలో జాతర కళ సంతరించుకుంది. మేడారానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల వద్ద భక్తులు స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్నారు. చీరసారె, పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను, మేకలను అమ్మవార్లకు మొక్కుగా చెల్లించారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, బాలకృష్ణలు భక్తులకు సేవలందించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల ప్రాంగణంలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పర్వతగిరి/గీసుకొండ: పోలీస్ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ సూచించారు. మామునూరు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆదివారం పర్వతగిరి పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్లో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన డ్యూటీలను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్, పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్, ప్రొబేషనరీ ఎస్సై బి.స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఏసీపీ వెంకటేశ్.. స్టేషన్ పరిధిలోని కేసులు, సమస్యాత్మక ప్రాంతాలు, రికార్డుల నిర్వహణ తదితర విషయాలను సీఐ మహేందర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐతోపాటు ఎస్సై కె.కుమార్, సిబ్బంది.. ఏసీపీకి మొక్కలు అందించి స్వాగతం పలికారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ -
మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం.. అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం గర్భాలయంలో స్వామి వారి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు అయోధ్యరెడ్డి–జ్యోతిరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా.. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాలు, మల్లికార్జునస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఐ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి మొలకలు
వరంగల్సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025కాళేశ్వరానికి పెరిగిన భక్తులు.. సరస్వతీనది పుష్కరాలు ముగింపు సమీపిస్తుండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఆది వారం సెలవు దినం కావడంతో ఆర్టీసీకి భక్తులు ఒక్కసారిగా పెరిగారు. – 8లోuసౌధామిని.. పుష్కర మణి! ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే గోదావరికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని నదికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. – వివరాలు, ఫొటోలు: 8లోuన్యూస్రీల్ -
అమెరికా సభకు ఆహ్వానం
నర్సంపేట: బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను జూన్ 1వ తేదీన అమెరికా డల్లాస్లో నిర్వహించనున్న నేపథ్యంలో హాజరు కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో రజతోత్సవ సభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు.వైభవంగా రుద్రేశ్వరస్వామి మాస కల్యాణోత్సవంహన్మకొండ కల్చరల్: మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వర, రుద్రేశ్వరీ అమ్మవార్లకు మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. ఈసందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి పుష్పరాల సందర్భంగా ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మణికంఠ శర్మ, సందీప్ శర్మ, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,333 మందికి 1,244 మంది హాజరవ్వగా.. 89 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. మధ్యాహ్నం 740 మంది విద్యార్థులకు 706 మంది హాజరవ్వగా 34 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 6,759 మంది విద్యార్థులకు 6,262 మంది (93శాతం) హాజరయ్యారు. 497 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 2,944 మందికి 2,820 మంది (96శాతం) హాజరుకాగా... వారిలో 124 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.ఆర్ట్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా జితేందర్కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్ను నియమిస్తూ ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేపట్టేందుకు ఈప్లేస్మెంట్ సెల్ అధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ నియామక ఉత్తర్వులను జితేందర్కు అందించి అభినందించారు. -
కరెంట్పనులు సొంతంగా చేయొద్దు..
పర్వతగిరి: విద్యుత్ సమస్యలు ఉంటే ప్రజలు సొంతంగా చేయకుండా సంబంధిత శాఖ సిబ్బంది సాయం తీసుకోవాలని ఏడీఈ తిరుపతి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న సూచనమేరకు విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్కు సంబంధించిన పనులు చేయకూడదని తెలిపారు. ఇబ్బందులు ఉంటే టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. ఇళ్లలో దుస్తులు ఆరవేసే దండెముగా ఇనుప తీగలు వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పశువుల యజమానులు మేతకు తీసుకెళ్లినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి వైరింగ్కు సరైన ఎర్తింగ్ చేయించి నాణ్యమైన ప్లగ్గులు, సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించాలన్నారు. ఎవరైనా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మోటారు రిపేరు అర్హత గల ఎలక్ట్రిషియన్తో రిపేర్లు చేయించాలని, వ్యవసాయ మోటార్లకు, గృహాల్లో నాణ్యతగల, అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే ఉపయోగించాలని వివరించారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 4,141 మంది అభ్యర్థులకు హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422 మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ ని యా మకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమి ంచేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రైవేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేల జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాలి. సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ఈనెల 25న (ఆదివారం)న జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈపరీక్షకు ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 4,141 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. గ్రామపాలన ఆఫీసర్లు పరీక్ష హనుమకొండ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందని, ఈ పరీక్షకు 132 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, యూపీఎస్సీ అధికారి కేశ్ రామ్ మీనా, ఏసీపీ నరిసింహారావు, ఏఓ గౌరీ శంకర్, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలిజిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడిబాటపై అవగాహన కార్యక్రమాలు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సమన్వయంతో జూన్ 6వ తేదీనుంచి నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే యూనిఫామ్స్ సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలలకు అవసరమైన వసతుల కల్పనపై ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లి ఎంఎన్ఆర్, ఈజీఎస్ ద్వారా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమాల నిర్వహణపై డీఈఓ వాసంతి సంబంధింత శాఖల అధికారులకు వివరించారు. జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా సంక్షేమాధికారి జయంతి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఎంఈఓలు పాల్గొన్నారు. -
నేడు మార్కెట్లోకి విజయ డెయిరీ కొత్త ప్యాకింగ్
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ పాలు, పెరుగు ఉత్పత్తులను నేటి (శనివారం) నుంచి కొత్త ప్యాకింగ్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వరంగల్ యూనిట్ డీడీ శ్రవణ్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా ప్యాకింగ్ ఉత్పత్తులను ములుగురోడ్ సమీపంలోని విజయ డెయిరీ ఆవరణలో ఉదయం 11గంటలకు డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డిల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 150 ఎంఎల్ టోన్డ్ మిల్క్, 120, 400 టీఎం పెరుగు ప్యాకెట్లతోపాటు 900 గ్రాములు, 1 కేజీ, 5కేజీ, 10కేజీ డీటీఎం పెరుగు బకెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఎంబీఏ పరీక్షల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్లోని కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయనవెంట కళాశాల ప్రిన్సి పాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు. బాలికను దత్తత తీసుకున్న అమెరికా దంపతులుహన్మకొండ అర్బన్: జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుంబంధ శిశు గృహ, బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న పదేళ్ల బాలికను అమెరికా దేశానికి చెందిన దంపతులకు ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇచ్చినట్లు జిల్లా సంక్షేమాధికారి జయంతి తెలిపారు. గతంలోనే ఈ దంపతులు అంతర్రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నట్లు.. దరఖాస్తును పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం వారికి సీనియార్టీ ప్రకారం శిశు గృహ, బాలసదనంలో రక్షణ సంరక్షణ పొందిన బాలికను నిబంధనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో దత్తత అందించినట్లు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాతృత్వం ఒక వరమని అందుకు చట్టబద్ధమైన దత్తత ప్రధాన మార్గమన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, బాలరక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, సూపరింటెండెంట్ కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, దత్తత కేంద్రం సోషల్ వర్కర్ సంగి చైతన్య పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఉదయం నిర్వహించిన ఇంటర్ ప్రథమ ఫస్టియర్ పరీక్షలకు 2,127మంది విద్యార్థులకుగాను 1,851మంది (87శాతం)హాజరుకాగా 276మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 152మందికిగాను 75మంది హాజరుకాగా, 77మంది విద్యార్దులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 91మంది గైర్హాజరు... వరంగల్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో 559మందికి 499మంది హాజరుకాగా, 60మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. సెకండియర్ పరీక్షల్లో 131మందికిగాను 110మంది హాజరుకాగా, 31మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. భరతనాట్యంలో ధనశ్రీ ప్రతిభ ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్కు చెందిన రామారపు రాజు–సంధ్యారాణి దంపతుల కుమార్తె ధనశ్రీ భరతనాట్యంలో రాణిస్తోంది. ఈ మేరకు భూటాన్ దేశం రాజధాని తింపు నగరంలోని ప్రసిద్ధి గాంచిన ప్రముఖ బౌద్ధ ఆలయంలో గురువారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ మయూరి నాట్య కళాక్షేత్రం గురువు కుండే అరుణ రాజ్కుమార్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడిలో రాణించి బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు సొంతం చేసుకుంది. కాగా, బౌద్ధాలయ ప్రధాన అర్చకుడు ఈ అవార్డు అందజేశారు. గురువు రాజ్కుమార్ ధనశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. -
బదిలీల కుదుపు...
కొద్దిరోజులుగా పోలీస్శాఖలో హాట్టాపిక్ సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో బదిలీల కుదుపు మొదలైంది. చాలా రోజుల తర్వాత ఉమ్మడి వరంగల్లో పలువురు డీఎస్పీ/ఏసీపీలకు స్థానచలనం కలిగింది. నార్త్జోన్–1 పరిధిలో పలువురు ఎస్హెచ్ఓలు బదిలీ కాగా, అడిషనల్ ఎస్పీలు కూడా మారారు. పది రోజుల వ్యవధిలో రేంజ్ పరిధిలో ఐదారు ఉత్తర్వుల ద్వారా 29 మంది ఎస్హెచ్ఓల బదిలీలు అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్హెచ్ఓలు మారారు. ఈనేపథ్యంలో త్వరలోనే మరో ఇద్దరు డీఎస్పీలు, భారీ సంఖ్యలో సీఐ/ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్లు ఉంటాయన్న ప్రచా రం పోలీస్శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బదిలీల కలకలం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన డీఎస్పీ/ఏసీపీల మూకుమ్మడి బదిలీలు కలకలంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 77మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేయగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురికి స్థానచలనం కలిగింది. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్కుమార్ డీజీపీ ఆఫీస్కు బదిలీ కాగా, ఆ స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేసిన పున్నం రవీందర్ రెడ్డిని నియమించారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ హైదరాబాద్ ‘హైడ్రా’ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితులు కాగా, సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా ఉన్న పింగిళి ప్రశాంత్రెడ్డిని తీసుకొచ్చారు. మామునూరు ఏసీపీ బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేశ్ను, రాచకొండ ‘షీ’టీమ్ ఏసీపీగా పని చేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అదేవిధంగా సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా నియమించగా.. త్వరలో మరో ఇద్దరు నుంచి ముగ్గురు డీఎస్పీలకు స్థానచలనం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఖమ్మం అడిషనల్ డీసీపీగా ఉన్న ఎ.నరేశ్కుమార్ భూపాలపల్లి ఏఎస్పీగా నియమించిన డీజీపీ, భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న బోనాల కిషన్ వరంగల్ ఏఎస్పీగా, కొమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఆర్.ప్రభాకర్రావును వరంగల్ కమిషనరేట్కు అదనపు డీసీపీగా నియమించారు. త్వరలోనే ఎస్హెచ్ఓల వంతు.. ఇప్పటికే ఠాణాల్లో ఖర్చీఫ్లు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పలువురికి త్వరలోనే స్థానచలనం కలగనుంది. వాస్తవానికి ఇరవై రోజుల కిందటే జరుగుతాయన్న ప్రచారం జరిగింది. అయితే ఏసీపీ, డీఎస్పీల బదిలీ తర్వాత ఎస్హెచ్ఓలపై కసరత్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో అప్రమత్తమైన పలువురు సీఐలు ఎస్హెచ్ఓలుగా ఠాణాల్లో ఖర్చీఫ్లు వేసుకుని పోస్టింగ్లు పదిలం చేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారన్న ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా మిల్స్కాలనీ పీఎస్లో సస్పెండైన ఎస్హెచ్ఓ వెంకటరత్నం స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పలువురు ఎస్హెచ్ఓలను బదిలీ చేస్తారన్న చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. హనుమకొండ, హసన్పర్తి, సుబేదారి, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, ఏనుమాములలతో పాటు కమిషనరేట్ పరిధిలోని పన్నెండు ఠాణాల్లో ఎస్హెచ్ఓల మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులనుంచి హామీలు పొందిన ఇన్స్పెక్టర్ల పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. సెలవులో వెళ్లిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తిరిగి విధుల్లో చేరాక ఈ ప్రక్రియ జరుగుతుందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషనరేట్పై పట్టు బిగిస్తున్న సీపీ.. వరంగల్ పోలీస్ కమిషనర్గా మార్చి 10న బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్.. కమిషనరేట్పై పట్టు బిగించారు. సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే సుమారు 18 పోలీస్స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతల గురించి ఆరా తీశారు. సబ్డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆయన నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులపై పనితీరుపైనా గ్రేడింగ్ చేస్తున్నారు. ఓ కేసులో వివాదాస్పదంగా మారిన మిల్స్కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ.. కట్టుదాటితే ఎవరిౖపైనెనా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే 8 మంది డీఎస్పీ/ఏసీపీల బదిలీ ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్ త్వరలో మరికొందరు డీఎస్పీలు.. సీఐలకు కూడా స్థానచలనం? పోస్టింగ్లకు హామీలు పొందిన ఎస్హెచ్ఓలు సెలవులో పోలీస్ కమిషనర్.. వచ్చాక ప్రక్రియ మొదలు -
నిట్లో క్యాంపస్ సెలక్షన్స్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ 2025 సెలక్షన్స్లో 1,201 యూజీ, పీజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ శుక్రవారం క్యాంపస్ సెలక్షన్స్ వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సాధించుకున్న నిట్ వరంగల్ క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఈ ఏడాది 290కి పైగా.. కంపెనీలు పోటీ పడినట్లు తెలిపారు. నిట్ వరంగల్కు చెందిన 791 అండర్ గ్రాడ్యుయేట్, 717 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పూర్తిగా 1,508 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్కు హాజరుకాగా.. 1,201 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారని తెలిపారు. బీటెక్లో ఈసీఈ విభాగానికి చెందిన సోమిల్ మాల్ధాని అత్యధిక ప్యాకేజీ రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కాగా.. అత్యల్పంగా రూ.14.35 లక్షల ప్యాకేజీకి, అదే విధంగా పీజీలో రూ.12.20 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికై నట్లు తెలిపారు. ఈఏడాది పీహెచ్డీ విద్యార్థులు సైతం క్యాంపస్ సెలక్షన్లలో పోటీపడగా.. ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికై నట్లు పేర్కొన్నారు. నిట్లో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ఎంపికకు సీపీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్) ప్రత్యేకంగా పని చేస్తుందని తెలిపారు. 1,201 మందికి ఉద్యోగాలు రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీతో సోమిల్ మాల్దానీ -
రెడ్క్రాస్ సేవలు స్ఫూర్తిదాయకం
పరకాల: రక్తదాన కార్యకలాపాల్లో రెడ్క్రాస్ సేవలు గర్వించదగ్గవని, గ్రామీణ ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తరించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. పరకాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల నిధులతో బ్లడ్ స్టోరేజీ సెంటర్ను శుక్రవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా శంకుస్థాపన (భూమి పూజ) నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బ్లడ్ స్టోరేజీ సెంటర్ ప్రాణ రక్షణ సాధనంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు నెలలకోసారి రక్తదానం చేయాలన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. బ్లడ్ స్టోరేజీ భవన నిర్మాణానికి అదనపు నిధుల కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ.శ్రీనివాసరావు, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, డాక్టర్ సంధ్యారాణి, బిళ్ల రమణారెడ్డితో పాటు పరకాల ప్రముఖ వైద్యుడు పి.రాజేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య బ్లడ్ స్టోరేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది.. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది.. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది.. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. అని కాళేశ్వరానికి వచ్చినవారు భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. – వివరాలు, ఫొటోలు 10లోu -
ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఎల్కతుర్తి: రానున్న రెండు, మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో సత్తా చాటాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని వెంకటసాయి గార్డెన్లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సత్యసాయి గార్డెన్లో జరిగిన ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి హాజరై మాట్లాడారు. కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టినట్లైతే కేటీఆర్ మాటలను పిటిషన్గా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీబీఐ ద్వారా లేదా ఇతరత్రా శాఖల ద్వారా విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతున్నాడని మండిపడ్డారు. ప్రాజెక్టులను నిర్మించడంలో బీఆర్ఎస్ విఫలమైతే ఆ చెడ్డ పేరును కాంగ్రెస్పైనే రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను కూల్చే చరిత్ర కాంగ్రెస్కు లేదన్నారు. కేటీఆర్ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గత ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశాల్లో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, పరిశీలకుడు మాక్సూన్, పీసీసీ సభ్యుడు అశోక్రెడ్డి, మండల అధ్యక్షులు చిట్టంపల్లి అయిలయ్య, ఇంద్రసేనారెడ్డి, నాయకులు సుకినె సంతాజీ, చంద్రశేఖర్గుప్తా, ఊసకోయిల ప్రకాశ్, కొ లుగూరి రాజు, ఆదరి రవి, చిదురాల స్వరూప, జ క్కుల అనిల్, గోలి రాజేశ్వర్రావు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాలు -
ఈ–పాస్ మిషన్లతోనే ఎరువులు విక్రయించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఈ–పాస్ మిషన్లతో ఎరువులను విక్రయించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్లోని రిటైల్ ఎరువుల వ్యాపారులకు శుక్రవారం ఎల్–1 ఈపాస్ మిషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్రెడ్డి, నర్సింగం, ఏఓ రవీందర్రెడ్డి, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, కోరమండల్ కంపెనీ ప్రతినిధులు సుజనకుమార్, సుమన్రెడ్డి పాల్గొన్నారు ప్రత్యేక ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు ఖానాపురం: జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డు, బుధరావుపేట, మంగళవారిపేటలో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్కు పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో మరో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలి పారు. ఇందులో నర్సంపేట నియోజకవర్గంలోనే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి తరలించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఏఓ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు న్యూశాయంపేట: వరంగల్లోని ఇస్లామియా జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్న జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జీపీఓ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదేవిధంగా ఉద్యాన శాఖపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఉద్యాన సాగును విస్తృతం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. అని కాళేశ్వరానికి వచ్చిన వారు భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. – మరిన్ని ఫొటోలు, వివరాలు10లోu -
నకిలీ విత్తనాలతో జాగ్రత్త..
సాక్షి, వరంగల్: వానాకాలం సీజన్కు ముందుగానే రైతులు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకతాయని, అవి రాష్ట్రానికి చేరుకోవడానికి జూన్ మొదటి వారం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే మిర్చి, పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆయా మండల కేంద్రాలు, వరంగల్ నగరంలోని షాపులకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో పల్లెల్లో కమీషన్ల కోసం రైతులకు కొందరు నకిలీ విత్తనాలను అంటగడుతున్న సందర్భాలున్నాయి. కొంతమంది రైతులు గతేడాది ఓ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు సాగుచేసి దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ముఖ్యంగా పత్తి, వరి, మిరప, మొక్కజొన్న వంటి విత్తనాల్లో నకిలీవి ఎక్కువగా ఉన్నాయి. కొనేముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంట దిగుబడి, పంట కాలం వృథా అయ్యే ప్రమాదంతో పాటు రైతు అప్పులపాలు కావడం ఖాయమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అందుకే విత్తనాలు కొన్న రైతులు కచ్చితంగా రసీదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇటీవల వరంగల్ నగరంలోని విత్తన దుకాణాల్లో వ్యవసాయ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి రూ.6.84 లక్షల విలువచేసే పత్తి, మిరప విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీ విత్తనాల అమ్మకాలకు అనుమతి రెన్యువల్ చేయలేదు. దుకాణంలో నిల్వ ఉన్న పత్తి, మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విత్తన ప్యాకెట్లను పరిశీలించాలి.. లైసెన్స్ ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తన మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై లాట్నంబర్, ప్యాకింగ్ తేదీ, లేబుల్ తదితర వివరాలను పరిశీలించాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్తో స్కాన్ చేస్తే విత్తనాల పూర్తి వివరాలు ఆన్లైన్లో కనిపిస్తాయి. విత్తే ముందు కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం పరీక్షించుకోవాలి. విత్తన సంచులు, రసీదులను భద్రపరుచుకోవడం మంచిది. తెలిసిన షాపుల్లో విత్తనాలు కొంటే ఇంకా మంచిది. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి రైతులు ఏమరుపాటుగా ఉంటే దిగుబడి, పంటకాలం కోల్పోవాల్సిందే.. సీడ్స్ కొనుగోలు చేస్తే రసీదు తీసుకోవాలి వ్యవసాయ, పోలీసు అధికారుల సూచన దుకాణాల్లో విస్తృత తనిఖీలు రెన్యువల్ చేసుకోని కంపెనీల సీడ్స్ ప్యాకెట్లు సీజ్మచ్చుకు కొన్ని.. గతేడాది నర్సంపేట మండలానికి చెందిన రైతు రాజు పత్తి సాగు చేశాడు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పత్తి ఏపుగా పెరిగినా కాయ కాయలేదు. దీంతో రెండున్నరెకరాల్లో రూ.మూడు లక్షల వరకు నష్టపోయాడు. వర్ధన్నపేటకు చెందిన శ్రావణ్ అనే రైతు రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. కంపెనీ విత్తనమేనంటూ కొనుగోలు చేసి నాటాడు. తీరా చూస్తే ఏముంది దిగుబడి రాలేదు. కొనుగోలు సమయంలో రసీదు తీసుకోకపోవడంతో ఆయన నష్టపోయాడు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ఆత్మకూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పెంచి గుణాత్మక విద్యను అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి సమాజంలోని అన్ని వర్గాల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియపర్చాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ విజయ్కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు తిరుపతిరెడ్డి, బుచ్చిరెడ్డి, ఉపేందర్రెడ్డి, లక్ష్మణ్రావు, రాజు, సుధాకర్ పాల్గొన్నారు. -
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కుచెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – మరిన్ని ఫొటోలు 8లోu -
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్ రిపోర్ట్’.●సాక్షిప్రతినిధి, వరంగల్20 ఏళ్ల నుంచి ఇప్పటికీ పట్టాకాలేదు..సర్వేనంబర్ 161లో 1–01 ఎకరం భూమి ఉంది. మా తండ్రి వాటా కింద 20 ఏళ్ల కింద ఇచ్చిన భూమి ఇప్పటికీ నా పేరు మీద పట్టా కాలేదు. రెవెన్యూ అధికారులు మోకా మీదికి రాకుండానే గ్రామ పంచాయతీలో రికార్డులు చూసి గత పహాణీల్లో నీ పేరు లేదు కాబట్టి పట్టా చేయమని చెప్పారు. తాతలిచ్చిన ఆస్తులకే పట్టాలు చేయడం లేదు. గత ప్రభుత్వం ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నా. – శెట్టి సంపత్, వెంకటాపురం(ఎం)పాస్ బుక్ కోసం అర్జీ పెట్టుకున్నా..నాకు రామన్నగూడెం శివారులో 24 గుంటల అసైన్డ్ భూమి ఉంది. గత ప్రభుత్వంలో సర్వే నిర్వహించారు. కానీ, ఇప్పటివరకు పట్టా కాలేదు. భూభారతి సదస్సులో పట్టా పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేశా. – జంగేటి సంజీవ్, రామన్నగూడెం, రేగొండ మండలం వారసత్వ భూమి పట్టా కోసం అర్జీ పెట్టినం..జాలుబావుల్లో సర్వేనంబర్ 58, 67, 68లో రెండెకరాల 10 గుంటలు చెలుక నా పేరు, మా అన్న కొండ లింగయ్య పేర్లపై పట్టా కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. అప్పుడు ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నం. మా తాత వారసత్వంతో పాటు కొన్న భూమి కూడా ఉంది. – కొండ భూపాల్, రైతు, దంతాలపల్లి భూభారతితో సత్వర పరిష్కారం..భూభారతి చట్టంతో భూసంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటికే నలభై శాతానికి పైగా పరిష్కరించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు భూభారతి దరఖాస్తులపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాం. మొదట పైలట్ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో పూర్తి చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, తహసీల్దార్, స్టేషన్ఘన్పూర్న్యూస్రీల్పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి.. హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు. అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..అంశాలు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మానుకోట సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246 అసైన్డ్ 481 746 1,362 35 732 60 వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56 భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101 డీఎస్ పెండింగ్ 331 45 247 29 100 20 మ్యుటేషన్పెండింగ్ 16 33 06 41 20 23 మిస్సింగ్ సర్వే నంబర్లు 08 30 23 05 100 37 ఇనామ్–ఓఆర్సీ జారీ 119 28 00 07 01 07 భూ వివరణ 00 22 01 11 203 02 భూ సేకరణ 14 05 08 23 03 29 పేరు సరిచేయుట 21 04 19 11 21 22 నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 07 01 03 19 24 10 38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00 ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213 -
ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టండి
క్షేత్రస్థాయిలో మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్ పర్యటన హసన్పర్తి: వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. 55, 56వ డివిజన్లలోని జవహర్ కాలనీ, పోచమ్మ గుడి, గోపాలపురం చెరువు, నక్షత్ర కాలనీ ప్రాంతాల్లో వారు పర్యటించారు. నాలాల్లో చేపట్టనున్న పూడిక పనుల ప్రక్రియను పరిశీలించారు. వడ్డేపల్లి మత్తడి నుంచి వచ్చే నాలా జవహర్నగర్ వద్ద ముంపునకు గురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానికుల కోరిక మేరకు గోపాలపురం చెరువును శుభ్రం చేసి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వడ్రా.. హైడ్రా తరహాలో ఇక్కడ వడ్రా అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. శిఖం, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్, జక్కుల రజిత, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, గడ్డం శివరాం, మణీంధర్నాథ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రవికిరణ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్కు అధికారులు
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖలో జరిగిన బదిలీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు ఇద్దరు, భూపాలపల్లికి ఒకరు వచ్చారు. రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న ఏ.నరేశ్కుమార్ భూపాపల్లి అడిషనల్ ఎస్పీగా, భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ను వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీగా (ఆపరేషన్ అండ్ క్రైం), ఆసిఫాబాద్లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాయల్ప్రభాకర్రావును వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ( లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్)కు బదిలీ చేశారు. -
భక్తికి రూపం హనుమంతుడు
వేయిస్తంభాల దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి హన్మకొండ కల్చరల్: భగవంతుడి భక్తికి రూపం హనుమంతుడని, చిన్నాపెద్దా భక్తితో అతడిని కొలుస్తారని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, సందీప్ శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేదపండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్మాల్ అధినేత వెంకటరమణ, భరత్భూషణ్ దంపతుల అధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈసందర్భంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. – ఖిలా వరంగల్ కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ – వివరాలు 8లోu -
వరంగల్
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025– 8లోuఅధిక సంఖ్యలో అర్జీలు.. క్షేత్రస్థాయి పరిశీలన.. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సదస్సుల్లో అర్జీలు అధికసంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి వరంగల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈనెల 5 నుంచి 18 తేదీల వరకు సదస్సులు నిర్వహించారు. ఈ ఆరు మండలాల్లోని గ్రామాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు సాదాబైనామా, అసైన్ట్, వారసత్వ మార్పిడిలను ఎక్కువగా అడిగారు. భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, భూ హద్దుల సమస్య, పేర్లు సరిచేయడం, సర్వే నంబర్ల మిస్సింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. 19,655 అర్జీల్లో 8,339 సాదాబైనామా, 3,416 అసైన్డ్, 1,331 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడాల సవరణ కోసం 910 మంది అర్జీ పెట్టుకోగా.. మిగిలిన 5,659 దరఖాస్తులు వివిధ అంశాలపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేసిన అధికారులు, ఆవివరాలను భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా ఆరు మండలాల్లో 21 ప్రత్యేక బృందాలను నియమించగా.. వారు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్, రెవెన్యూ బృందాలు భూములను పరిశీలించేందుకు వెళ్తున్నాయి. పట్టాదారు పాసుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి, వెంటనే సరిచేస్తారు. ఈ భూసమస్యలను రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లలో సవరణ చేస్తారు. ఆరు మండలాల ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటి వారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు.జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా..హనుమకొండ 2,898వరంగల్ 3,197 జేఎస్ భూపాలపల్లి 7,111 జనగామ 1,068 ములుగు 4,555 మహబూబాబాద్ 826సాక్షిప్రతినిధి, వరంగల్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనపై ‘గ్రౌండ్ రిపోర్ట్’. పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి.. ● హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. ● వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు. ● జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు. ● ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ● జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.న్యూస్రీల్అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..అంశాలు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మహబూబాబాద్ సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246 అసైన్డ్ 481 746 1,362 35 732 60 వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56 భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101 డీఎస్ పెండింగ్ 331 45 247 29 100 20 మ్యుటేషన్ పెండింగ్ 16 33 06 41 20 23 మిస్సింగ్ సర్వే నంబర్లు 08 30 23 05 100 37 ఇనామ్–ఓఆర్సీ జారీ 119 28 00 07 01 07 భూ వివరణ 00 22 01 11 203 02 భూ సేకరణ 14 05 08 23 03 29 పేరు సరిచేయుట 21 04 19 11 21 22 నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 07 01 03 19 24 10 38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00 ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213ఆరు పైలట్ మండలాల నుంచి 19,655 దరఖాస్తులు సదస్సుల ద్వారా అర్జీల స్వీకరణ.. సాదాబైనామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఆతర్వాత అసైన్డ్, వారసత్వ మార్పిడి ప్రధానంగా 12 అంశాలపై అర్జీలు ఆన్లైన్ పోర్టల్కూ దరఖాస్తులు.. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఏ నరసింగం, ఖిలా వరంగల్ మండల వ్యవసాయధికారి రవీందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ స్టేషన్ రోడ్డు, ఫోర్ట్ రోడ్డులోని ఎరువులు, విత్తన దుకా ణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 25 షాపులను తనిఖీ చేసి రికార్డులు,విత్తనాల అమ్మకాలు, అనుమతి, కంపెనీ గుర్తింపును అడిగి తెలుసుకున్నారు. నిషేధించిన విత్తనాలు అమ్ముతున్నారా అని ఆరా తీశారు. గాయత్రి, అరుంధతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేశారు. స్టేషన్రోడ్డులోని ఓ షాపు నిర్వాహకులు కళాష్ సీడ్స్ కంపెనీ వారి విత్తన లైసెన్స్ రెన్యువల్ కాపీని అధికారులకు చూపించలేదు. దీంతో రూ.6,85,980 విలువైన 580 పత్తి ప్యాకెట్లు, మిర్చి ప్యాకెట్ల విక్రయాలను నిలిపివేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న షాపులోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. పంట ముగిసే వరకు విత్తన బిల్లులను భద్రపర్చుకోవాలని చెప్పారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు యాకయ్య, విజయ్, హెడ్కానిస్టేబుల్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కు చెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో అధికారులు, రైస్మిల్లర్లతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాల్లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 25,923 మంది రైతుల నుంచి 1,22 372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు అందుబాటులో గన్నీ సంచులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని సూచించారు. 83 మిల్లులను ట్యాగింగ్ చేసి, కొనుగోలు సెంటర్ల కేంద్రాల ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అదనంగా లారీలను కేటాయించి రవాణా చేయించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ రైస్మిల్లర్లు పాల్గొన్నారు. కాల్సెంటర్ను వినియోగించుకోవాలి ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి ఏర్పా టు చేసిన కాల్సెంటర్ను జిల్లాలోని రైతులు సద్వి నియోగం చేసుకోవాలన కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో కోరారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, సేకరణ, రవాణా, మద్దతు ధర, సమాచారం, ఇతర ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్ 18004253424కు కాల్ చేయాలని ఆమె సూచించారు. -
ఉనికిచర్లకు పట్టణ రూపు తీసుకొస్తా..
ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత స్వయంగా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉనికిచర్ల నుంచి రాపాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉనికిచర్లకు 24 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, త్వరలో మరో 24 మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలో రూ.59 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను, ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మసాగర్ గ్రామానికి 68 ఇల్లు మంజూరు అయ్యాయని, ఇల్లు మంజూరు అయిన వారంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్ ఆవాల రాధికా రెడ్డి, గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంతోశ్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సీడీపీఓ విశ్వజ, పీఆర్ డీఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఏఈ నిఖిల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, బల్దియా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆత్మకూరు: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. మండలంలోని తిరుమలగిరిలో నిర్మించిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్ని పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలకు రూ.307 వచ్చేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. ఐకేపీలో యూనిఫామ్ కుడుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గుడెప్పాడ్లో ఈజీఎస్లో సాగుచేస్తున్న అజోల్లా సాగును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఈజీఎస్ పనుల్ని రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీ సిబ్బంది రోగులకు అవసరమైన సేవలను జాప్యం లేకుండా అందించాలన్నారు. గ్రామాల్లో చెత్తసేకరణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మహిళలు కుట్టు పనిపై శ్రద్ధ వహించాలని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ స్వాతి, ఏపీఓ రాజిరెడ్డి, డీపీఎం ప్రకాశ్, ఏపీఎం లలిత తదితరులు పాల్గొన్నారు. అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి.. హన్మకొండ అర్బన్: రాజీవ్ యువ వికాస ం పథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధిపథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అంగన్వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి పథకం ద్వారా 24 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు, ఈఈ నరేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025– 8లోuహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీలు.. వాటివెనుకున్న రాజకీయ ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి తహసీల్దార్లు వచ్చారు. ఇక్కడి వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. తాజాగా ప్రభుత్వం తహసీల్దార్ల అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపింది. దీంతో జిల్లాకు వచ్చినవారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్ పోస్టులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమకు ప్రాధాన్యం ఉన్న మండలాల్లో పోస్టు కావాలని ఉన్నతాధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిల్లాలోని 14 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా హసన్పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, ఎల్కతుర్తి, కాజీపేట మండలాల విషయంలో అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతిధులను సమన్వయ పరుస్తూ జిల్లా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని మండలాల తహసీల్దార్లు తమ సీటుకు ఎసరు వస్తుందని ముందే పసిగట్టి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా స్థానచలనం కలగకుండా చూడాలని చివరి దాకా ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈక్రమంలో తమకేం కాదని, తమ మండలాలకు ఎవరూ రారులే అనుకుని ఉన్నవారికి మాత్రం ఊహించని రీతిలో బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ప్రస్తుత బదిలీల్లో భీమదేవరపల్లి, నడికూడ, పరకాల, వేలేరు తహసీల్దార్ పోస్టులతోపాటు పరకాల డీఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పోస్టులకు కేటాయించారు. వారిలో కొందరికి మంచి పోస్టులే వచ్చినా.. తాము అనుకున్న స్థాయి పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బదిలీల్లో వేలేరు తహసీల్దార్ కోమిని కలెక్టరేట్కు, కలెక్ట్టరేట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ప్రసాద్ను వేలేరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాటిని బుధవారం మళ్లీ మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడి నుంచి కలెక్టరేట్కు బదిలీ చేసిన తహసీల్దార్ కోమిని వేలేరులోనే ఉండేలా, ప్రసాద్ కలెక్టరేట్లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా చాలాకాలం తర్వాత జరిగిన తహసీల్దార్ల బదిలీలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. త్వరలో జిల్లాకు మరో ఇద్దరు తహసీల్దార్లు వస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వారి రాక ఎవరి సీటుకు ఎసరుతెస్తుందోనని గుసగుసలు మొదలయ్యాయి. న్యూస్రీల్అయినా అసంతృప్తి.. కలెక్టరేట్లో ఉండేందుకు ససేమిరా... వేలేరు తహసీల్దార్ రిటెన్షన్ కొందరికి ప్రజాప్రతినిధుల భరోసా హనుమకొండ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర చర్చ -
ఘనంగా సైలానీ బాబా గంధం జాతర
దామెర: మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని సైలానీబాబా దర్గా గంధం ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం సమర్పణ కార్యక్రమం కనులపండువగా సాగింది. ఈసందర్భంగా ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, ఏసీపీ సతీశ్బాబు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సీఐ రంజిత్రావు, ఎస్సై అశోక్ విద్యుత్ ఏఈ రమేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాదర్లను తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఒంటెలపై గంధం తీసుకొచ్చే తంతు కనులపండువగా సాగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన డప్పు కళాకారుల నృత్యాలు, ఫకీర్ల విన్యాసాలు ప్రదర్శిస్తుంటే దర్గా ప్రధాన ద్వారం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా వచ్చి గంధం సమర్పించారు. దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్(సైలానీబాబా) ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు -
మహిళా కానిస్టేబుల్కు సీపీ అభినందన
వరంగల్ క్రైం: ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ స్పందనను సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ వి భాగంలో మహిళా కానిస్టేబుల్ స్పందన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్లో నిర్వహించిన మొదటి ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సీనియర్ ఉమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ ఏసీపీ అంతయ్య పాల్గొన్నారు.ఎంసీఏ పరీక్షలు షురూ..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్యాంపస్లోని ఎకనామిక్స్ విభాగంలో ఏర్పా టు చేసిన ఎంసీఏ పరీక్ష కేంద్రాన్ని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం పరిశీలించారు. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వివిధ సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.వెంకటయ్యతో కలిసి పరిశీలించారు.బెస్ట్ ప్రాక్టీసెస్ నమోదు గడువు పెంపువిద్యారణ్యపురి: ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ పాఠశాలల్లో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువును ఎస్సీఈఆర్టీ పెంచినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలలు, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈనెల 22వ తేదీ వరకు ఎస్సీఈ ఆర్టీవెబ్సైట్లో, హెచ్టీటీపీఎస్//ఎస్సీఈఆర్టీ.తెలంగాణ.గౌట్.ఇన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సందేహాలుంటే డి.మధుసూదన్రెడ్డి 97058 06579 నంబర్లో సంప్రదించాలని సూచించారు.ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెందిన శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి..విద్యారణ్యపురి: పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన విషయాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. బుధవారం జిల్లాలోని భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని డీఈఓ వాసంతి సందర్శించి హెచ్ఎంలను ఉద్దేశించి మాట్లాడారు. వృత్తిపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకోవాలన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ మార్గాలను అనుసరించాలని హెచ్ఎంలకు డీఈఓ సూచించారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, రిసోర్స్పర్సన్లు రామకృష్ణ, వేణు ఆనంద్, మనోహర్నాయక్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
హన్మకొండ: తమకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే పనులు చేయడం సాధ్యపడుతుందని విద్యుత్ కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఈక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ పరిధిలో సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సంబంధ పనులు పూర్తి చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు పిలిచారు. ఈనెల 22న టెండర్లు వేయాల్సి ఉంది. దీనికిగాను షెడ్యూల్ తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువులోగా ఒక్క కాంట్రాక్టర్ కూడా షెడ్యూల్ తీసుకోలేదు. దీంతో గురువారం టెండర్లు వేసే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు హనుమకొండ సర్కిల్ కార్యాలయానికి వచ్చినా షెడ్యూల్ మాత్రం తీసుకోలేదు. వచ్చిన వారు కూడా ఇతరులెవరైనా టెండర్ల షెడ్యూల్ తీసుకుంటారేమోనని జాగ్రత్తగా గమనిస్తూ కార్యాలయం ఆవరణలోనే కాపుకాశారు. కాంట్రాక్టర్లంతా సమష్టిగా టెండర్లు వేయడానికి ముందుకు రావట్లేదు. వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల క్రితం స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు పెంచలేదని, ప్రతీ మెటీరియల్ రేట్ రెట్టింపు స్థాయిని మించి పెరిగాయని, ఈరేట్లతో పనులు చేస్తే గిట్టుబాటు ఏమో కానీ.. అప్పుల పాలు కావాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తాము సమ్మెకు వెళ్లగా.. నెలన్నర రోజుల్లో పెంచుతామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ముగిసిన కాల పరిమితి సబ్ డివిజన్ పరిధిలో రూ.20 లక్షల్లోపు విద్యుత్ అభివృద్ధి పనులు చేసేందుకు ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టర్లను నియమిస్తారు. ఈకాంట్రాక్టర్ల నియామకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టెండర్లు పిలుస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖరారు చేసిన కాంట్రాక్టర్ల నియామక కాల పరిమితి ముగిసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్ల నిరాకరణ ఎదురైంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లపై పూర్తి అసంతృప్తితో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఏ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరు. రేట్ల ఖరారుపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కాంట్రాక్టర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆరేళ్లుగా పెంచని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు రేట్లు పెంచితేనే టెండర్లకు వస్తామంటున్న కాంట్రాక్టర్లు -
పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్లు వివరించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. -
పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సంపేట: పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వెంకట్రెడ్డి సూచించారు. చెన్నారావుపేట రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సాగు ఖర్చులు, రసాయన ఎరువుల వినియోగం ఎలా తగ్గించుకోవాలి, సాగునీరు ఆదా, పంట మార్పిడి ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, విత్తన రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. సూక్ష్మశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస సుస్థిర వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, చెన్నారావుపేట మండల వ్యవసాయ అధికారి గోపాల్రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడిదుగ్గొండి: పంట మార్పిడి పద్ధతితో అధిక దిగుబడి సాధించవచ్చని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి ప్రధాన శాస్త్రవేత్త వీరన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటలకు అధికంగా యూరియా వాడటం అనర్థమని, పచ్చిరొట్ట పైరుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కీటక శాస్త్రవేత్త శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలని కోరారు. వరిసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎస్ఎం ప్రతినిధి సారంగం, ఏఓ మాధవి, ఏఈఓ విజయ్నాయక్, రైతులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు.. అమృత్ వెలుగులు
సాక్షి, వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.25.41 కోట్ల అమృత్ నిధులతో కాకతీయుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫాంలు, ట్రాక్లు, సౌకర్యాల కల్పనతోపాటు అనేక విస్తరణలు, ఆధునికీకరణ పనులు చేశారు. ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఏమేం పనులు చేశారంటే.. కాకతీయ కళాతోరణం ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతోపాటు మూడు లిఫ్ట్లు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫాం విస్తీర్ణం పెంపు, ప్లాట్ఫాంపై అదనపు కప్పు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకులు నిర్మించారు. వెయిటింగ్ హాల్ అభివృద్ధి, ఆహ్లాదం కోసం స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా స్టేషన్ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. కళలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేశారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు అమర్చారు. రోజుకు 31,887 మంది రాకపోకలు.. ● కాజీపేట, విజయవాడ సెక్షన్లో ఉన్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ● ఈ స్టేషన్లో దాదాపు 137రైళ్లు ఆగుతాయి. న్యూ ఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్లకు ఇక్కడా హాల్టింగ్ ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్కు నూతన సొబగులు రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రయాణికులకు సకల సౌకర్యాలు వర్చువల్గా నేడు ప్రారంభించినున్న ప్రధాని మోదీ -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నెక్కొండ: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం ఏడీఏ దా మోదర్రెడ్డి, నెక్కొండ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల షాపులను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విత్తన స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్స్, విత్తన నిల్వలు, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసా య, పోలీసు శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలను అరికట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతుకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత మ నందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సై మహేందర్, వ్యవసాయ అధికారులు టి.కృష్ణ, సీహెచ్ గోపాల్రెడ్డి, నాగరాజు, షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణతో మెరుగైన బోధనఖానాపురం: మెళకువలతో విద్యార్థులకు బోధించాలని శిక్షణ కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ బొమ్మెర కుమారస్వామి అన్నారు. బుధరావుపేట మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో వినియోగించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన, సులభమైన విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఆర్పీలు వాగ్యా, కిరణ్, భిక్షపతి, శ్రీనివాస్, చంద్రమౌళి, సారయ్య, ఎమ్మార్సీ సిబ్బంది శశిధర్, రాజేందర్, మహేందర్, రజిని, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలువర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..తొర్రూరుకు చెందిన ఎర్ర అశోక్ తన స్విఫ్ట్ కారులో రాయపర్తి వైపు నుంచి వర్ధన్నపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వర్ధన్నపేట ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాల సమీపంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి వద్ద కారు ముందు టైరు పగిలిపోయింది. దీంతో అదుపు తప్పి రాయపర్తి వైపు వెళ్తున్న ఆటోతోపాటు మూడు బైక్లను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన రామారపు రాములు,వర్ధన్నపేటలోని నీలగిరి స్వామి తండాకు చెందిన బానోత్ పద్మ, ఏఎన్ఎం వజ్జాల మంగతాయారు, బైక్లు నడుపుతున్న డీసీ తండాకు చెందిన బానోత్ నరేశ్, సపావట్ దశరథం, పెద్దవంగరకు చెందిన మార్గం సతీశ్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురితోపాటు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి● స్ఫూర్తి కార్యక్రమంలో డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ విద్యారణ్యపురి: ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ కోరారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాల విద్యార్థులకు మట్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలా చదివి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాలో ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీజీ కె.అరుణ, స్ఫూర్తి కార్యక్రమం ఇన్చార్జ్ మల్లారెడ్డి, ఎంఈఓ గంప అశోక్కుమార్, హెచ్ఎం వెంకన్న, ఉపాధ్యాయుడు దేవులపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేసవి శిబిరం పరిశీలన పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ పరిశీలించారు. 15 రోజులుగా నిర్వహిస్తున్న శిబిరం బుధవారం ముగిసింది. విద్యార్థులకు క్రీడాపోటీలు, యోగా, నృత్యం తదితర అంశాల్లో వలంటీర్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. వలంటీర్ యాకూబ్, భరతనాట్యం గురువు శశాంక్, జూడో కోచ్ వీరస్వామి, ఆర్ట్ క్రాఫ్ట్ వలంటీర్ సర్వత్బేగం, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● కలెక్టర్ సత్యశారదపర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని కొంకపాక, చౌటపల్లి, జమాల్పురం గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీల ద్వారా దిగుమతి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. తడిసిన ధా న్యాన్ని వెంటనే ఎండబెట్టి, ఆరిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, రైస్మిల్లర్లు, పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోuఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం సరస్వతి ఘాట్లో స్నానాలు.. ముక్తీశ్వరుడి దర్శనం -
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకోవాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో వివిధ బ్యాంకులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం, అందించిన రుణాలు, చేరాల్సిన లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలన్నారు. అలాగే దామెర మండలానికి సంబంధించిన బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవికుమార్, ఆర్బీఐ అధికారి తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ బ్యాంకుల, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్లతో ఉన్నతాధికారుల చర్యలు -
లండన్లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజీ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేశ్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు తరుణ్తేజ
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీకి చెందిన విద్యార్థి అట్ల తరుణ్తేజ ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్తేజ ఐఐటీ ముంబాయి నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషివిద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం మండల స్థాయిలో ఐదు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను హనుమకొండలోని ప్రశాంత్నగర్లోని డీపీఎస్ స్కూల్లో ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెలుగు, ఆంగ్ల, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ఐదు రోజులపాటు రిసోర్స్పర్సన్లు ఇస్తున్న శిక్షణ వినియోగించుకుని ఇందులో నేర్చుకున్న అంశాలతో విద్యను బోధించాలన్నారు. శిక్షణలో హనుమకొండ ఎంఈఓ జి.నెహ్రూ, రిసోర్స్పర్సన్లు శ్రీపాల్రెడ్డి, ఎం.శ్రీధర్, పృధ్వీరాజ్, శివకోటి, అశోక్, ఎ.శ్రీధర్, మధు, జ్యోతి, రాజ్కుమార్, మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. ప్రతీ రోజు రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,063 మంది, సెకండియర్లో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్బీఐఈ.సీజీజీ. గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
పార్టీని బలోపేతం చేయండి
హసన్పర్తి: ‘రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో ముందుకు వెళ్తోంది.. ప్రచారంలో మాత్రం మనమంతా వెనుకబడి ఉన్నాం’ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణమన్నారు. గోపాలపురంలోని ఓ బాంక్వెట్ హాల్లో మంగళవారం హసన్పర్తి, ఐనవోలుతో పాటు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ఇగో వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని.. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయా పదవులకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, గడ్డం శివరాం, కార్పొరేటర్లు సునీల్కుమార్, జక్కుల రజిత, అరుణకుమారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
విత్తనాల కోసం క్యూలైన్లో చెప్పులు
కమలాపూర్: కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం జీలుగ విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. ఆలస్యమైతే దొరుకుతాయో లేదోనని ఎండకు నిల్చోలేక తమ చెప్పులను క్యూలైన్లో ఉంచారు. మండలానికి ఇటీవల 500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. కమలాపూర్ పీఏసీఎస్లో 400 క్వింటాళ్లు, అంబాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 100 క్వింటాళ్ల చొప్పున తరలించి మంగళవారం నుంచి రైతులకు పంపిణీ చేశారు. విత్తనాల్ని పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు ఉదయం 7 గంటలకే పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులుదీరి ఎండ తీవ్రతను భరించలేక క్యూలైన్లో చెప్పులను ఉంచారు. విత్తన పంపిణీ సమయంలో రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచి ఎగబడడాన్ని గమనించిన అధికారులు క్యూలైన్లో రావాలని చెప్పడంతో మళ్లీ క్యూ కట్టారు. పోలీసు పహారాలో కమలాపూర్లో 250 క్వింటాళ్లు, అంబాలలో 100 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో సుమారు రూ.1,100 వరకు ఉన్నవి ప్రస్తుతం రూ.2,140కి పెరిగినా రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఎగబడుతుండడం గమనార్హం. -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల్లో భయం.. భయం వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్పై వేటు వేయడం కమిషనరేట్లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్ప్రీత్సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
కోళ్లఫాం పనులు నిలిపివేయాలి
దుగ్గొండి: తమ ఆరోగ్యాలకు పెను ప్రమాదంగా మారే కోళ్లఫాంను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనిచ్చేది లేదని తొగర్రాయి గ్రామస్తులు శపథం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న పౌల్ట్రీఫాంలో నూతనంగా మరో భారీ కోళ్లఫాం నిర్మాణం కోసం సదరు వ్యాపారవేత్త ముగ్గు పోసి పిల్లర్ గుంతలు తీయించాడు. దీంతో గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం పౌల్ట్రీపాంలోకి వెళ్లి పిల్లర్ గుంతలను పూడ్చి వేశారు. అక్కడే ఉన్న పొక్లెయిన్ను బయటికి పంపించారు. ఇసుక, కంకర, సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చిన ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడారు. గ్రామ సమీపంలో కోళ్లఫాం నుంచి వెలువడే దుర్వాసనతో ఇప్పటికే వ్యాధుల బారినపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ విస్తరిస్తే ఇంకా ఎక్కువ వాసనతో తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులు ఆపకుంటే ఎంతటి పోరాటాలకై నా సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాస చేరాలు, యార శ్రీనివాస్, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఎస్సీ కాలనీవాసులు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలి
న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఆర్ఓ ఆధ్వర్యంలో కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పీసీపీ ఎన్టీడీ యాక్ట్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకోర్టు చీఫ్ ఏఓ కోట్ల రాధాదేవి మాట్లాడుతూ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని శిక్షించడానికి కోర్టులు సహకరిస్తాయని తెలిపారు. డీసీపీ అంకిత్కుమార్ సంకాల్వే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధంసమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరి గింది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్ సత్యశారద సమీక్షించారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్ అఽభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు ఉమారాణి, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, రవీందర్రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి, కమిటీ సభ్యులు బిర్రు మహేందర్, మహంకాళి యాదగిరి, పాలకుర్తి విజయ్కుమార్, భూక్యా హుస్సేన్నాయక్ పాల్గొన్నారు. రక్తనిధి నిర్మాణానికి హామీగవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభ్యత్వం, యూత్ రెడ్క్రాస్, జూనియర్ రెడ్క్రాస్ కార్యకలాపాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు, రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు.. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్పై వేటు వేయడం కమిషనరేట్లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్ప్రీత్సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి
నల్లబెల్లి: గొట్టపు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండలంలోని రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను విరివిగా వినియోగించాలని రైతులకు సూచించారు. రసంపీల్చు పురుగుల ఉధృతి నివారించడానికి ఎర పంటలను వేసుకోవాలని కోరారు. శాస్త్రవేత్త యశస్విని మాట్లాడుతూ తృణ ధాన్యాలు, అపరాలు పండించాలని రైతులకు సూచించారుఎ. అనంతరం నల్లబెల్లి రైతువేదికలో నిర్వహించిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తన డీలర్ల సమావేశంలో నర్సంపేట వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్రెడ్డి మాట్లాడుతూ పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు సబ్సిడీపై త్వరలోనే రానున్నాయని వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు విక్రయించినప్పుడు రైతులకు కచ్చితంగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఈఓపీఎస్ మిషన్లతోనే విక్రయాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఓ రజిత, ఏఈఓ శ్రీకాంత్రెడ్డి, శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రామారావు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ రంగాపురంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం -
లండన్లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కార్యవర్గం
గీసుకొండ: టీఎన్జీవోస్ అ నుబంధ అంగన్వాడీ టీచ ర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు మంగళవారం వరంగల్ నగరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన మేక అని తాకుమారి ఎన్నికయ్యారు. సహ అధ్యక్షురాలి గా కె.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా కుంట లలి త,టి.శోభారాణి, ఎన్.రమ, కార్యదర్శిగా వి.భవాని, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ రమ, సీహెచ్ సునీత, ఎం.స్వరూప, ఆర్గనైజింగ్ కా ర్యదర్శులుగా రాణి, బి.సునీత, ప్రచార కార్యదర్శులుగా బి.భవాని,కె.ఉమాదేవి,కోశాధికారి గా పి.హైమావతి, కార్యవర్గ సభ్యులుగా ఆర్. ఎస్తేర, రాజసులోచన, ఎండీ నస్రీన్ ఎన్నికై న ట్లు ప్రకటించారు. కాగా, నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి సదా నందం అభినందించారు. అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పాకాలలో రేపు నేచర్వాక్ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఈనెల 22న నేచర్వాక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఔల్స్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ సహకారంతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు సమావేశం, 6.30 గంటలకు నేచర్వాక్, 10.15 గంటలకు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంపై అవగాహన సదస్సు, 11 గంటలకు బటర్ ఫ్లైగార్డెన్ సందర్శన, 11.30 గంటలకు బోటింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రకృతి, వనప్రేమికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగేశ్వర్రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతినర్సంపేట: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..చెన్నారావుపేట గ్రామానికి చెందిన మర్రి రాములు(65) సైకిల్పై మంగళవారం ఉదయం రోజు మాదిరిగానే పాల బాటి ల్ ఇవ్వడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ప్రధాన సెంటర్ వద్దకు వచ్చి తన ఇంటి వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. నర్సంపేట నుంచి నెక్కొండ వైపు వెళ్తున్న టాటాఏస్ వా హనం వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు,కూతురు ఉన్నారు.మృతుడి కుమారు డు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహా న్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు..గీసుకొండ: ధర్మారం–స్తంభంపల్లి మార్గంలోని కోళ్లఫాం దగ్గర ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన చిట్టిమల్ల మనోహర్ (71) మంగళవారం కోళ్లఫాం దగ్గర చనిపోయి ఉన్నాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు చేయగా అనుమాన్పాద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్తో ఉన్నతాధికారుల చర్యలు -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
● సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్కమలాపూర్: విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 15 రోజులుగా జిల్లాలోని 9 కేజీబీవీలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థినులు వేసవి శిబిరంలో పాల్గొని స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ మ్యా థ్స్, క్రాఫ్ట్, పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, గేమ్స్లో శిక్షణ పొందుతున్నారు. ఈ మేర కు సోమవారం నిర్వహించిన వేసవి శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి శిబిరంలో నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థుల కు నేర్పించడంతో పాటు భవిష్యత్లో మరింత నైపుణ్యం సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన క్రాఫ్ట్ మెటీరియల్తో పాటు సంగీతం, నృత్య ప్రదర్శనలకు తిలకించారు. ముగింపు సమావేశంలో జిల్లా జీసీఈఓ సునీత, ఎంఈఓ కె.శ్రీధర్, శిబిరం సమన్వయకర్త అర్చన, పలు కేజీబీవీల ఎస్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. -
– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్
కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం. సరిపడేంత స్థలం లేని మెట్లు. కనిపించని వెంటిలేషన్. ఇదీ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమా దం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మమైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహల్, గోపాలస్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాల కు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కొనాల్సిందే.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనా లు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనా లు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్య ల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం జరిగినా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాల కు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావా లి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికై నా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలిసంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
ఘనంగా తిరంగా యాత్ర
హన్మకొండ: ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా తిరంగా యాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు భారత్ సరైన జవాబు చెప్పిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
వివరాల సేకరణ ఇలా..
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రైతుకు ఆర్థిక స్థోమత ఉందా? డెవలప్మెంట్కు ఇచ్చారా..? రైతు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాడా..? భారీ పెట్టుబడి కావడంతో రైతుల వెనుక ఎవరైనా ఉన్నారా..? రైతులకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేంద పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది..? డెవలప్మెంట్కు ఇస్తే ఏ విధానంలో ఇచ్చారు..? రైతుకు ఎంత భూమి ఉంది.. ఎన్ని మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.. ఈ భూమి పంటకు అనుకూలమా కాదా.. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారా.. రైతు వాటాగా భరించే స్థాయి ఉందా.. ఉంటే ఆ సొమ్ము ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు.. పెట్టుబడి వచ్చే మార్గాలు ఏమిటీ.. తదితర వివరాలు అడుగుతున్నారని రైతులు తెలిపారు. -
నేడు కాకతీయ వారసుడి రాక
హన్మకొండ: కాకతీయ 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ మంగళవారం వరంగల్ పర్యటనకు వస్తున్నారని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కోర్సు పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్లో భాగంగా క్యాంపస్లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగం అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్కుమార్ ఉన్నారు. జీఎంహెచ్లో ప్రత్యేక విభాగంహన్మకొండ చౌరస్తా/ఎంజీఎం: గర్బిణుల నమోదు, ప్రసవాల శాతం పెంచేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జీఎంహెచ్ సిబ్బంది వైద్యులకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక సెల్ ఉంటుందని చెప్పారు. అందుకు ముగ్గురు మహిళా పబ్లిక్ హెల్త్ అధికారులను డిప్యుటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ గర్భిణికి మొదటి రెండు చెకప్లు పీహెచ్సీ డాక్టర్ వద్ద, మూడు, నాలుగు చెకప్లకు హనుమకొండలోని జీఎంహెచ్ తప్పనిసరి వచ్చేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, పీహెచ్ఎన్లు లీల, సుందరి, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అట్రాసిటి కేసు విచారణ అధికారిగా ఏసీపీ తిరుపతిఖిలా వరంగల్ : వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఆదివారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచారయత్నం కేసు విచారణ అధికారిగా మామునూరు ఏసీపీ తిరుపతిని నియమిస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును సమగ్రంగా, పాదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ‘భద్రకాళి’ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాన తన కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని మేడ్చ ల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో.. వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన వినతులను ఆయా శాఖ అధికారులు త్వరగా ప రిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వి విధ సమస్యలపై మొత్తం 86 వినతులు వచ్చినట్లు చెప్పారు. వాటిని ఆయా శాఖ అధికారులకు కే టాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పరకాల ఆర్డీఓ నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు ప్రావీణ్య -
బయో గ్యాస్ ప్లాంట్కు చొరవ తీసుకోవాలి
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి -
‘పీఎం కుసుం’పై విచారణ
చెల్లించిన ఈఎండీలు 162లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ జారీ 141 ముందుకు రాని రైతులు 520 మందిఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 682సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఇంటిలిజెన్స్ వివరాల సేకరణ ● 100కు పైగా ప్రశ్నలతో దరఖాస్తుదారుల వద్దకు.. ● అంతర్యమేమిటని సందేహిస్తున్న రైతులు ● భారీ పెట్టుబడి కావడంతో పథకంపై పలువురి అనాసక్తి -
బయో గ్యాస్ ప్లాంట్కు చొరవ తీసుకోవాలి
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీసీలో పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి -
ఇరుకు గల్లీలు.. చిన్న మెట్లు
గ్రేటర్ వరంగల్లోని గల్లీల్లో వేలాది భవనాలు.. అగ్గి రాజుకుంటే అంతే సంగతి! కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం.. సరిపడేంత స్థలం లేని మెట్లు.. కనిపించని వెంటిలేషన్.. ఇది ఆదివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. – సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్ యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మ మైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహేల్, గోపాల స్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాలకు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కోవాలి.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్యల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీ ప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాలకు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావాలి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)సంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలి -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
న్యూశాయంపేట/విద్యారణ్యపురి: ఇంటర్, పదోతరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 28 వరకు ఇంటర్ సప్లమెంటరీ, జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనునున్నట్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్డీఓలను 16మంది చొప్పున నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ శ్రీధర్ సుమన్, డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తి న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్కుమార్, ఎన్హెచ్ హైవే టీం లీడర్ సంపత్కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తే బిల్లులు చెల్లిస్తాం..దుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన వారు నిబంధనల మేరకు వేగంగా ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు చెల్లిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని రేకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సోమవారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇంటిని నిర్మించుకుంటున్న రంపీస అశ్విని, రంపీస కళావతితో మాట్లాడారు. బేస్మెంట్కు రూ. లక్ష, రూఫ్ లెవెల్కు రూ.లక్ష చెల్లించి నిర్మాణం పూర్తి చేశాక మిగతావి చెల్లించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, హౌసింగ్ పీడీ గణపతి, డీఈ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి అశోక్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
సబ్స్టేషన్.. రైతులకు ఉపయోగం
రాయపర్తి: సబ్స్టేషన్ నిర్మాణం చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జగన్నాథపల్లిలో సుమారు రూ.2.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు అధికారులు, మండల నాయకుడు నంగునూరి అశోక్, శారద దంపతులు, ప్రజలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్స్టేషన్ మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి రుణపడి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోతు కిషన్నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, విద్యుత్ ఏఈ రవళి, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కో–ఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. రైలు కింద పడి ఒకరి మృతినెక్కొండ: మండలంలోని రెడ్లవాడకు చెందిన కర్నెకంటి మహేశ్(19) నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి సోమవారం మృతి చెందాడు. వరంగల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ తల్లిదండ్రులు ఐలయ్య–పద్మ కుటుంబం హైదరాబాద్లో నివసిస్తోంది. మహేశ్ హైదరాబాద్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. కాగా.. మృతుడి తాత యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందగా.. ఐలయ్య కుటుంబం రెడ్లవాడకు వచ్చింది. ఉదయం హైదరాబాద్కు వెళ్లేందుకు వచ్చి పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్ తల పగిలి, కాళ్లు, చేతులు విరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సుదర్శన్ తెలిపారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముగిసిన వేసవి శిక్షణ శిబిరంగీసుకొండ: మండలంలోని వంచనగిరిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వివిధ అంశాల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈముగింపు కార్యక్రమానికి డీఈఓ జ్ఞానేశ్వర్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలు వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. శిక్షణ శిబిరంలో జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫ్లారెన్సా, పాఠశాల ప్రత్యేకాధికారి హిమబిందు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. సైన్స్ కోర్సు, పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్లో భాగంగా క్యాంపస్లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగాధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్కుమార్ ఉన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో శుక్రవారం ఉదయం ములుగు రోడ్డు ఐటీఐ క్యాంపస్లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అర్జీలను వెంటనే పరిష్కరించండి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణిలో మొత్తం 128 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ 54, హౌసింగ్ మున్సిపాలిటీ 7, మిగతా శాఖలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సమస్య తదితర అంశాలపై యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, వరంగల్ తహసీల్దార్ ఎక్బాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్టేషనరీ షాపు ఇప్పించండి.. నర్సంపేటలోని నర్సింగ్ కళాశాల ఆవరణలో స్టేషనరీ, జిరాక్స్ షాప్ పెట్టుకుని జీవించేందుకు అనుమతి ఇప్పించాలని కలెక్టర్ను వేడుకున్నా. – దివ్యాంగుడు సుమన్, కొత్తపేట, ఏనుమాముల కలెక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో దరఖాస్తుల స్వీకరణ -
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లు సంతకాలు చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్ -
కానిస్టేబుల్కు అభినందనలు
రామన్నపేట: వృత్తి ధర్మంలో భాగంగా మానవత్వం చాటుకున్న ఓ కానిస్టేబు ల్ మంచి మనస్సును ప్రజలు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దుస్తులు కూడా సరిగ్గా లేక ఎండవేడి తట్టుకోలేక పడిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మట్టెవాడ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ కల్యాణ్కుమార్ అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తికి దుస్తులు తెప్పించి తొడిగి 108 వాహనాన్ని పిలిపించి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించాడు. ఇదంతా గమనించిన స్థానికులు సదరు కానిస్టేబుల్ స్పందించి సహాయం చేసిన తీరుకు అభినందనలు తెలిపారు. -
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎయిడ్స్, హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వరకు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్తో మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ఎవరైతే హెచ్ఐవీతో జీవిస్తున్నారో వారికి సంఘీభావంగా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, పరకాలలోని సీఎస్సీ ఐసీటీసీ సెంటర్లుగా పని చేస్తున్నాయన్నారు. 2024–25లో 55,000ల మందిని పరీక్షించగా.. 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణఽ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్లు రాపర్త సురేశ్, రాజేందర్, సంపూర్ణ, సురక్ష కేంద్ర బృందం ఇక్బాల్, భాషా ల్యాబ్ టెక్నిషియన్లు, కరుణ మైప్రాజిటివ్ నెట్వర్క్ రవీందర్, మారి, విజయ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఽఖ అధికారి అప్పయ్య -
మారిన యూనిఫామ్ డిజైన్లు
విద్యారణ్యపురి/వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు(2025–26) విద్యాసంవత్సరం అందిందే స్కూల్ యూనిఫామ్ డిజైన్లో స్వల్ప మార్పులు చేశారు. తరగతుల వారీగా బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించేందుకు ఇప్పటికే హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళ సంఘా ల సమాఖ్యలకు క్లాత్ను మండలాల వారీగా పాఠశాలల స్థాయిలో అందజేశారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించి టీఎల్ఎఫ్లకు అప్పగించారు. క్లాత్ను టిస్కో పంపిణీ చేసింది. ఈసారి స్టి చింగ్ డిజైన్లో మార్పులను గమనిస్తే.. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ ఫ్రాక్లకు పట్టీలు, భుజాలపై క ప్స్ వంటి ప్యాచ్లు లేకుండా కుట్టిస్తున్నారు. స్టిచ్చింగ్ సరళంగా ఉండేందుకు స్వల్పమార్పులు చేశారు. తరగతుల వారీగా యూనిఫామ్ ఇలా.. ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12వ తరగతి వరకు బాలురకు చొక్కా, పాయింట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్ఫ్రాక్, 4, 5 తరగతుల బాలికలకు షర్టు, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్ మోడల్లో ఉండేలా టాప్ బాటమ్ చున్నీ లేకుండా కుట్టిస్తున్నారు. ఈసారి వేసవి సెలవులకు ముందే యూనిఫాం కుట్టించేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. దుస్తులు హెచ్చు తగ్గులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఒకే జతకు క్లాత్రాక యూనిఫాం స్టిచ్చింగ్ కోసం ముందుగా ఒకే జత కోసం క్లాత్ను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఈనెల 31 వరకు స్టిచ్చింగ్ పూర్తి చేసి అందజేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో 314 పీఎస్లు, 72 యూపీఎస్లు, 147 హైస్కూళ్లు, 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్, 25 వరకు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 30,922 మంది ఉండగా ఇందులో బాలురు 14,852, బాలికలు 16,070 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి రెండుజతల చొప్పున స్కూ ల్ యూనిఫామ్ అందజేస్తున్నారు. ఈసారి తొలుత ఒక జత పంపిణీ చేసేందుకు స్టిచ్చింగ్ చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్ల లకు అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండో జతకు క్లాత్వచ్చే అవకాశం ఉంటుంది.స్వల్పమార్పులతో స్టిచ్చింగ్ ప్రస్తుతానికి ఒకే జతకు క్లాత్ రాక కుట్టుపనికి 31వ తేదీ వరకు డెడ్లైన్ జిల్లాలో 30,922 మంది విద్యార్థులు రూ.75తో గిట్టుబాటు కాని కూలి.. ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ స్టిచ్చింగ్కు రూ.75 చొప్పున చెల్లిస్తోంది. గతంలో ఒక్కో జతకు రూ.50 చొప్పున చెల్లించగా గత ఏడాది నుంచి రూ.25 పెంచారు. ఇందులో కుట్టు కూలికి రూ.50, కటింగ్, బటన్స్, కాజాలు, ఎంఎస్ సర్వీస్ చార్జ్ రూ.25 కలిపి రూ.75 ఇస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300 నుంచి రూ.400 తీసుకుంటుండగా ప్రభుత్వం రూ.75 నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు పేర్కొంటున్నారు. యూనిఫాంకు కనీసం రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాల్య వివాహం అడ్డగింత
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి లోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్లైన్ అధికారులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివా హం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వంకాయ రైతు ఆగ్రహంపరకాల: ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలను పరకాల మార్కెట్కు అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచిని పర్తి గ్రామానికి చెందిన రైతు సదయ్య వంకా యలను ఆదివారం అమ్మకానికి తెచ్చాడు. అయితే ఉదయం కిలో రూ.25 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు.. కాస్త ఆలస్యంగా వచ్చిన సదయ్య వద్ద కిలో రూ.10 చొప్పున కొంటామని చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. మార్కెట్లో కిలో రూ.60 అమ్ముతుండగా.. వ్యాపారులు రైతుల నుంచి రూ.10కి కొంటామని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతు మీరిచ్చే ధర కనీసం కూలీలకు కూడా సరిపోదని మండిపడుతూ మార్కెట్లో ఉన్న పశువుల మేతకు వంకాయలను పారబోశాడు.