breaking news
Warangal District News
-
దొడ్డు బియ్యం తరలించాలి
17 మాసాలుగా దొడ్డు బియ్యం నిల్వలు జిల్లాలోని మెజార్టీ షాపుల్లో ఉన్నాయి. రేషన్ షాపునకు యజమానులు గదులు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఉన్న ఇరుకు గదుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉండగా సన్న బియ్యం దిగుమతి చేసుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు బియ్యం ముక్కిపోయి, రంగు మారడంతోపాటు లక్కపురుగు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి దొడ్డు బియ్యం నిల్వలను ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించాలి. – దారవత్ మోహన్నాయక్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుజిల్లాలోని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లు ఉన్నది వాస్తవమే. గోదాముల్లోకి దొడ్డు బియ్యం తరలింపునకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. అనుమతి రాగానే తరలింపునకు చర్యలు తీసుకుంటాం. – కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
తమ్ముడిని కాపాడబోయి అన్న ..
ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్లాల్పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ములుగు జిల్లా గణేశ్లాల్పల్లి మొండికుంటలో మునిగి మృతిచెందిన అన్నదమ్ములు వినయ్, రాజేశ్ (ఫైల్) -
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
భీమదేవరపల్లి: సంక్షేమం, అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్లనర్సింగాపూర్, బుల్లోనిపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ముత్తారంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి.. ముత్తారం చౌరస్తా నుంచి గట్లనర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గొల్లపల్లిలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి త్వరలోనే నీళ్లు నింపే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ గురవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సత్యనారాయణరెడ్డి, ఉద్యానశాఖ అధికారి కమలాకర్రెడ్డి, సర్పంచ్లు ఊరడి భారతి జైపాల్ రెడ్డి, నేతుల చంద్రమోహన్, గడ్డం సుజాత రఘుపతిరెడ్డి, కొర్ర గోపాల్, బొల్లంపల్లి అజయ్ కుమార్, బొల్లి మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కేతిరి లక్ష్మారెడ్డి, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, వీరన్న, శ్రీకాంత్ ఉన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తిచేస్తాం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన రూ.14 వేల బిల్లులు చెల్లించాలని, 50 శాతం ఫిట్మెంట్లో నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నియమావళి కమిటీ చైర్మన్ రేగూరి సుభాకర్రెడ్డి, పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా బాధ్యులు, ఉపేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, పట్టాభి మహేందర్, మహిపాల్రెడ్డి, సతీష్రెడ్డి, కిరణ్, యాకూబ్రెడ్డి, తిరునగరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపు పీఆర్టీయూ మహాధర్నా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
పనితీరే కొలమానం
హన్మకొండ: వినియోగదారులకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సేవలను అందించడంతో పాటు సంస్థ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సమగ్ర చర్యలు చేపట్టింది. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్మిట్టల్ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల సమర్థవంతమైన పనితీరు, నాణ్యతా ప్రమాణాలకు కొలమానం విధించారు. వంద మార్కుల పనితీరుకు ప్రోత్సాహం అందించనున్నారు. టీజీ ఎన్న్పీడీసీఎల్లోని సెక్షన్ల పనితీరును మరింత పారదర్శకంగా కొలిచే విధంగా అంచనా వేయడానికి వంద మార్కుల ఆధారిత ఉద్యోగుల పనితీరు నిర్వహణ వ్యవస్థ అమలు చేసున్నారు. సంస్థ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ అంశాలకు మార్కులు కేటాయించి, వాటి ఆధారంగా సెక్షన్లకు ర్యాంకులు, గ్రేడ్లు నిర్ణయిస్తున్నారు. కొత్త సర్వీసుల విడుదల, రెవెన్యూ వసూళ్లు, పెండింగ్ వర్క్ ఆర్డర్ల ముగింపు, ట్రాన్న్స్ఫార్మర్ వైఫల్యాల నియంత్రణ, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, ఎనర్జీ ఆడిట్, నష్టాల తగ్గింపు, సైది, సైఫీ, నిలిపివేతకు సంబంధించిన తనిఖీలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, కాలిపోయిన, పనిచేయని మీటర్ల మార్పిడి, బిల్స్టాప్ తనిఖీల వంటి అంశాలు, పనితీరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. పనితీరు అంచనాలో ప్రస్తుత ఫలితాలతోపాటు గత నెలతో పోలిస్తే సాధించిన పురోగతికి కూడా అదనపు మార్కులు ఇవ్వడం ఈ విధానంలో ప్రత్యేకత. దీంతో వెనుకబడిన సెక్షన్లు కూడా తమ పనితీరును క్రమంగా మెరుగుపర్చుకునే అవకాశం కలుగుతుందని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యోగులు తమ ర్యాంకు స్కోర్ గ్రేడ్తో పాటు ఏ అంశంలో మార్కులు తగ్గాయో, గత నెలతో పోలిస్తే పనితీరు ఎలా ఉందో తెలుసుకునేలా ఉద్యోగుల పనితీరు మూల్యాంకన డ్యాష్ బోర్డ్ అందుబాటులో ఉంచుతారు. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు మాస్టర్ శిక్షకులచే శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అకౌంట్స్, రెవెన్యూ, టెక్నికల్, ఆపరేషన్, నిర్వహణ, సేఫ్టీ, స్టోర్స్, కమర్షియల్, బెస్ట్ ప్రాక్టీసెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్న్, సివిల్ విభాగాలకు శిక్షణ కార్యక్రమాలను యాజమాన్యం రూపొందించింది. క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన విద్యుత్ పనుల నాణ్యతను నిరంతరం తనిఖీ చేసేలా, ఎర్తింగ్, జంపర్ బైండింగ్, ఫ్యూజ్ వైర్ తదితర పునరావృత లోపాలను తగ్గించేందుకు కామన్ ఫీల్డ్ చెక్లిస్ట్ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి టీజీ ఎన్పీడీసీఎల్ చర్యలు పలు అంశాలకు మార్కులు.. సెక్షన్లకు ర్యాంకులు, గ్రేడ్లు ఆధునిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలుసాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవల కోసం వంద మార్కుల విధానం తీసుకొచ్చాం. తద్వారా విద్యుత్ అధికారులు, ఉద్యోగులు పోటీతత్వంతో మరింత మెరుగైన సేవలు అందిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. – కర్నాటి వరుణ్రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ -
జలం.. జర పదిలం
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటితో కళకళలాడాల్సిన చెరువులు, కుంటలు విషాదాలు నింపుతున్నాయి. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, చెరువుల చుట్టూ రక్షణ చర్యలు లేకపోవడం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలను నీటిగుంతలు బలితీసుకుంటున్నాయి. తాజాగా ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు కుంటలో పడి మృతి చెందడం ఉమ్మడి వరంగల్లో చెరువులు, కుంటల వద్ద భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తమ్ముడిని కాపాడబోయి అన్న.. ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్లాల్పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నగురిజాలలో ఘటన విషాదకరం.. 2022 మార్చి 13న నర్సంపేట మండలం చిన్నగురిజాలలో జరిగిన ఘటన మరింత విషాదకరం. పొలం పనులు ముగించుకుని కాళ్లు, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన కృష్ణమూర్తి (65) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మనవడు దీపక్ అలియాస్ లక్కీ (12) నీటిలోకి వెళ్లాడు. ఇద్దరూ మునిగిపోతుండడాన్ని చూసిన నాగరాజు (35) వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. చివరకు ముగ్గురూ నీటిలో మునిగి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తాత, కొడుకు, మనవడు ఒకేసారి మృత్యువాత పడడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు చిన్నారులు 2020 జనవరి 30న వరంగల్ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. బరిగెల రుచిత (7), ప్రణయ్పాల్ (9), రణధీర్ (11) మృతి చెందారు. కోటచెరువులో.. 2023 మార్చి 31న వరంగల్ నగరంలోని ఏనుమాముల ప్రాంతం కోటచెరువు వద్ద మరో విషాదం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన కిరణ్సింగ్ (12), దీపక్సింగ్ (9) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దశదినకర్మకు వచ్చి.. 2022 డిసెంబర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బంధువు దశదినకర్మకు వచ్చిన వర్షిత్ (7), మరో 11 ఏళ్ల బాలుడు ఇంటి సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరూ మృతి చెందారు. పశువులను కాపాడబోయి.. కాపరి మృతి 2024 సెప్టెంబర్ 5న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి పరిధిలోని మర్రిపల్లిలో ననుబోతుల రాజు (25) బర్రెలను చెరువులో నుంచి బయటకు పంపించే క్రమంలో నీటిలో పడిపోయి మృతి చెందాడు. పశువులను కాపాడే ప్రయత్నమే అతడి ప్రాణాలను బలిగొంది. తల్లీకొడుకును మింగిన రెడ్డికుంట 2026 ఆగస్టు 14న మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండాలోని మొగిలిచెర్ల రెడ్డికుంటలో విషాదం చోటుచేసుకుంది. కుంటలో పడి భూక్యా నవ్య (26), ఆమె కుమారుడు అన్వేష్ (9) మృతి చెందారు. హెచ్చరికల బోర్డులెక్కడ? ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నీటి గుంతలు విస్తారంగా ఉన్నాయి. వర్షాకాలంలో నీరు చేరితే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బహిర్భూమికి వెళ్లే సమయంలో, చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, పశువులను నీటిలో నుంచి బయటకు తీసే క్రమంలో, స్నానానికి వెళ్లినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ కంచెలు, అవసరమైన చోట్ల గస్తీ వంటి చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈత రాక.. లోతు తెలియక చిన్నారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవడానికి కారణం ఈత రాకపోవడం, నీటి లోతుపై అవగాహన లేకపోవడం. ఒకరు నీటిలో పడితే వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా మునిగిపోయిన ఘటనలు అనేకం.చెరువులు, కుంటల వద్ద ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లోతైన ప్రాంతాల వద్ద కంచెలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు కలిసి చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీరు జీవనాధారం.. కానీ, అప్రమత్తత లేకుంటే అదే నీరు ప్రాణాంతకంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్లో వరుసగా చోటుచేసుకుంటున్న జల ప్రమాదాలు దీనికి నిదర్శనం.చెరువులు, కుంటల్లో పలువురి జలసమాధి! పిల్లలు, రైతులు, కాపరులు.. ఒకరిని కాపాడబోయి మరొకరు ఒకే కుటుంబంలో మూడు తరాల వారు మృత్యువాత ఉమ్మడి వరంగల్లో విషాదం నింపిన పలు ఘటనలు -
పెరిగిన అడ్మిషన్లు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతీ సంవత్సరం అడ్మిషన్లు పెరుగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్ అందించడంతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాగే అధ్యాపకుల కృషితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 2,704 మంది విద్యార్థులకు త్వరలో యూనిఫాం కూడా అందుబాటులోకి రానున్నట్లు ఆయన వివరించారు. -
లేనిది ఉన్నట్టు.. బిల్లుల కనికట్టు!
● వరంగల్ లేబర్ కాలనీలోని 18వ డివిజన్లో 16–12–97/1 ఇంటి నంబర్కు నల్లా లేదు. కానీ, బిల్లు రూ.12వేలు ఉంది. బిల్లు మాఫీ చేయాలని యజమాని మాధవి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. ● వరంగల్ చింతల్లోని 16–11–371/1 ఇంటి నంబర్లో నల్లా కనెక్షన్ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారు. బిల్లు రద్దు చేయాలని మహ్మద్ రజీయొద్దీన్ అధికారులను కోరారు. ● రంగశాయిపేటలోని 19–9–449/2 ఇంటి నంబర్కు రెండు నల్లాలు ఉన్నాయి. ఒకదానిని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్ పలుమార్లు ఇంజనీర్లను వేడుకున్నా స్పందించడం లేదు. బకాయి చార్జీలు నెలనెల వస్తున్నాయి. ● నల్లా కనెక్షన్ లేదు. బిల్లు రూ.7,200 వేశారని హనుమకొండ లష్కర్బజార్కు చెందిన విజయలక్ష్మి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు. ● గుండ్లసింగారంలో 39–1–18 ఇంటి నంబర్కు నల్లా కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోందని మినహాయించాలని రవీందర్రెడ్డి కోరారు.వరంగల్ అర్బన్: ఒకవైపు నల్లా మీటర్లు లేని వాణిజ్యసంస్థలు, అపార్ట్మెంట్లు, మరోవైపు అక్రమ కనెక్షన్లతో గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండి కొడుతున్న జలగలను చూసీచూడనట్లుగా విడిచిపెడుతున్న ఇంజనీర్లు.. ఇంకో వైపు లేని నల్లాలకు మాత్రం బిల్లులు పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాడు మెప్మా రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) చేసిన తప్పిదాలు సరిచేసుకోకుండా.. వారు అనుకున్నదే తడవుగా బిల్లులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. తప్పు ఎక్కడ జరిగింది? కొందరు ఆర్పీలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నా లేనట్లుగా బల్దియా వెబ్సైట్లో నల్లా కనెక్షన్లు నమోదు చేశారు. నల్లా కనెక్షన్ అసలే తీసుకొని ఇంటి నంబర్లకు, నల్లా ఉన్నప్పటికీ అదనపు కనెక్షన్ జోడించారు. ఇళ్లకే కాదు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చూపడం దారుణం. దీంతో నగర వ్యాప్తంగా సుమారు 8వేల ఇళ్లకు అదనపు కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఈవిషయమై బల్దియా ఎస్ఈ రాజ్కుమార్ను వివరణ కోరగా విచారణ చేసి నల్లా కనెక్షన్లను రద్దుచేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో నల్లా లేకున్నా బిల్లులు! నాటి తప్పులతో నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు తొలగించాలని బల్దియా గ్రీవెన్స్లో వేలాది ఫిర్యాదులు పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఉన్నతాధికారులునల్లా కనెక్షన్ ఇవ్వకముందే, నల్లా లేకున్నా, ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఉండగా, అదనపు కనెక్షన్ ఇలా.. లేని నల్లాలకు బిల్లులు మంజూరు చేశారని తొలగించండి మహాప్రభో అంటూ వినియోగదారులు బల్దియా ప్రధాన కార్యాలయం గ్రీవెన్స్లో ప్రతి వారం పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారు. గతంలో ఉన్న నల్లా కనెక్షన్, అదనపు నల్లా, లేని నల్లాలకు బిల్లులు చేస్తే తొలగిస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ముందుకొచ్చి బిల్లులు చెల్లించినా కూడా రద్దు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కానీ, బల్దియా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో విచారణ చేయడంలో తాత్సరం చేస్తున్నారు. లేని కనెక్షన్లు తొలగించాలని సుమారు 4వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి నెల నల్లా బిల్లు రూ.150 చొప్పన పెరిగి తడిసిమోపెడవుతోంది. -
నాడు తండ్రి.. నేడు కుమారుడు
● ఇద్దరి మృతితో పరకాలలో విషాదం పరకాల: పట్టణంలో మూడు సంవత్సరాల కిత్రం తండ్రి, ఇప్పడు కొడుకు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పరకాలలోని 14వ వార్డుకు చెందిన రాగుల రాజు (28) ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఆండాలు కూలి పనులకు వెళ్తోంది. ఈక్రమంలో రాజు అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. పేద కుటుంబం కావడంతో కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇంట్లోనే శనివారం ఆయన మృతిచెందాడు. కాగా, మూడు సంవత్సరాల క్రితం రాజు తండ్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కుప్పకూలి చనిపోయాడు. నాడు భర్త, నేడు కొడుకు మృతితో ఆండాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. రాజు అంత్యక్రియలు చేయడానికి ఆమె వద్ద డబ్బులు లేవు. నాలుగో వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి భర్త బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రావు ముందుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించే బాధ్యత తీసుకున్నారు. శ్మశానవాటిక వరకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయించారు. -
నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీని వేగవంతం చేసి ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్ధిష్ట గడువులో విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో హైదరాబాద్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద వీసీలో పాల్గొని జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన చర్యలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1,94,399 నోటీసులకుగాను ఇప్పటివరకు 11,173 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలతో గడువులోపు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో సమర్పించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజిని, అధికారులు పాల్గొన్నారు. గ్రూప్స్ పరీక్షలకు మైనార్టీలకు ఉచిత కోచింగ్ న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ –1,2,3,4 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచేందుకు మైనార్టీలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను, వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. డిగ్రీ పాసైన మైనార్టీ కమ్యూనిటీకి చెందిన (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు) అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 040–23236112, 90590 50062 నంబర్లలో లేదా ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని వారు సూచించారు. ఆర్థికంగా ఎదగాలి వర్ధన్నపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీఓ నాగపద్మజ సూచించారు. మండలంలోని వెంకట్రావ్పల్లి, కొత్తపల్లి గ్రామాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం, కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి పంచాయతీ పరిధిలోని వీఓ భవనం, పీఎస్సీ కాంప్లెక్స్ను పరిశీలించారు. వెంకట్రావ్పల్లిలో వీఓ భవనం, అంగన్వాడీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ నాగేశ్వర్, సర్పంచ్లు కుల్ల పావని యాకాంతం, కౌడగాని సునీత, రాజేష్ఖన్నా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే నీటీ పీజీ ప్రవేశ పరీక్ష 2026కు అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీట్ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన నర్సంపేట: బిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్ను ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ ముస్కు శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు వారు తగు సూచనలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో 132మంది విద్యార్థులు ఆదివారం పరీక్ష రానున్నారు. -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. -
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2026కు అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాలల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి శనివారం తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఎంసీఏ, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్–2026లో ఉత్తీర్ణత సాధించిన, ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఆయా కళాశాలల్లో ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావని తెలిపారు. హన్మకొండ కల్చరల్: ఆలయాల ఆభరణాలు, భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని మల్లెల రామకృష్ణారావు దంపతులు సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు, సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రేశ్వరస్వామికి పూజలు చేసిన అనంతరం ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 16 పీరియడ్ల వర్క్లోడ్తో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్టైం అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు నమోదును సోమవారం చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపా రు. ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనెట్హాల్లో నమోదు ఉంటుందని తెలిపారు. ప్రతి పార్ట్టైం అధ్యాపకుడు తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు కోసం నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు.హన్మకొండ: వరంగల్ సర్కిల్ పరిధిలో 919, హనుమకొండ సర్కిల్ పరిధిలో 98 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ అందించినట్లు ఆయా సర్కిళ్ల ఎస్ఈలు ఎ.అనందం, బి.సామ్యానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండొచ్చని తెలిపారు. -
ప్రయాణికుల వసతులపై దృష్టి
కాజీపేట రూరల్/ఖిలా వరంగల్: కాజీపేట రూరల్ : సికింద్రాబాద్–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి మణుగూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ప్రయాణిస్తూ నైట్ పుట్ప్లేట్ తనిఖీ నిర్వహించారు. కాజీపేట వరకు రైలు ఇంజన్లో తనిఖీలో భాగంగా రైల్వే జీఎం సిగ్నల్స్, వాటి స్పష్టత, ఓవర్హెడ్ ట్రాక్షన్ ట్రాక్ పరిస్థితి, వేగ పరిమితి, హెచ్చరికలు, వేగాలు తదితర వాటిని సమీక్షించారు. రైలు నడుపుతున్న లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్ల పని విధానం, సిగ్నల్స్ మార్పిడి చేయడంలో మాస్టర్స్ పాయింట్స్మెన్, గేట్మెన్ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను గమనించారు. కాజీపేటలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. డీఆర్ఎం గోపాల కృష్ణన్తో కలిసి ఆయన స్టేషన్లోని ప్లాట్ఫారాలు, ప్రాంగణం, వెయిటింగ్ హాళ్లు పరిశీలించారు. స్టేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిశుభ్రత, తాగునీరు, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అమృత్ భారత్స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి, ఆధునిక ప్రవేశ ద్వారం, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్పామ్స్ షెల్టర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కాజీపేట జంక్షన్కు చేరుకుని ప్రత్యేక రైలులో సికింద్రాబాద్కు తరలివెళ్లారు. రెండు స్టేషన్ల మేనేజర్లు అగ్గి రవీందర్, వి.సుదర్శన్రావు, డీఓఎం నరేందర్ వర్మ, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్గౌడ్, వడ్డె నరేష్కుమార్, ఇన్స్పెక్టర్లు జాఫర్, మధు, సిగ్నలింగ్ అధికారి రాంఖీ తదితరులు పాల్గొన్నారు. దక్షణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్–కాజీపేట మధ్య నైట్ పుట్ప్లేట్ తనిఖీ కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సందర్శన -
ఇక పక్కాగా సాగు లెక్క
జిల్లాలో సాగు వివరాలిలా.. ఖిలా వరంగల్: జిల్లాలో పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ పంటల సర్వేకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జియో ట్యాగింగ్ విధానంలో క్షేత్రస్థాయిలో పంటల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తుండడంతో సాగు విస్తీర్ణంపై ఇక కచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ సర్వే నంబర్లోని ప్రతీ ప్లాట్ను పరిశీలించి పంట రకం, సాగు విస్తీర్ణం తదితర వివరాలను డిజిటల్గా నమోదు చేస్తున్నారు. పంటల సాగులో స్పష్టత జిల్లాలో పంట సాగు వివరాల సేకరణకు పంట సర్వేను ఈనెల 24న వ్యవసాయశాఖ ప్రారంభించింది. ఈసారి సర్వేను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పంటల వివరాలను నమోదు చేస్తూ సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కిస్తున్నారు. దీంతో పంటల వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రానుంది. జిల్లాలో 13 మండలాలు ఉండగా 184 గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం గల 184 మందిని సర్వే సిబ్బందిగా నియమించారు. వారి ద్వారా ఈనెల 24న జిల్లాలో గ్రామాల వారీగా సర్వే ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 3.70 లక్షల ప్లాట్లు ఉండగా ఇప్పటి వరకు 16,049 ప్లాట్లలో డిజిటల్ పంటల సర్వే పూర్తిఅయింది. మిగిలిన ప్లాట్లలో సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో మొత్తం 1,56,396 మంది రైతులకు సంబంధించిన సర్వే నంబర్లులోని పంటల వివరాలను సిబ్బంది సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా వరి సాగువుతోంది. ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం 64,293 ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. మరో 33,438 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. సర్వే పూర్తయితే జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగువుతోందన్న దానిపై పూర్తి స్పష్టత రానుంది. జియో ట్యాగింగ్తో పారదర్శకత పంటల సర్వేలో జియో ట్యాగింగ్ వినియోగిస్తుండడంతో క్షేత్రస్థాయిలో నమోదైన వివరాలను మరింత కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది. సర్వే సిబ్బంది నేరుగా పొలాల వద్దకు వెళ్లి సర్వే నంబర్ల ఆధారంగా పంటలను పరిశీలించి డిజిటల్ విధానంలో ఫొటోలు అప్లోడ్ చేసి సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో సాగు విస్తీర్ణంలో తేడాలు లేకుండా చూడడంతోపాటు ప్రభుత్వానికి అవసరమైన పంటల గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రైతు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణాన్ని కచ్చితంగా నమోదు చేయడం, సాగు భూమిని భౌగోళికంగా గుర్తించడం, రైతు, భూమి, పంట వివరాలను ఒకే డిజిటల్ డేటా బేస్లో అనుసంధానం చేయడం ఈ సర్వే ఉద్దేశం.జియో ట్యాగింగ్తో పంటల నమోదు కొనసాగుతున్న డిజిటల్ సర్వే వరిసాగుకే రైతుల మొగ్గు 3.70 లక్షల ప్లాట్లు సర్వే పూర్తిఅయిన ప్లాట్లు 16,049 వరి సాగు 64,293 ఎకరాలు ఆరుతడి పంటలు 33,438 ఎకరాలు రైతుల సంఖ్య 1,56,396 -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ఎల్కతుర్తి: సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్పష్టం చేశారు. సూరారం, దండేపల్లి, వీరనారాయణపూర్, వల్భాపూర్, ఇందిరానగర్ గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొత్త పెన్షన్ల కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎల్నినోతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, జలసిరి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్కు స్వస్తి పలికి స్టీల్ బ్యాంకును వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. యువత ఫోన్లకు బానిసకాకుండా క్రీడామైదానాలకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో రేషన్కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు రేషన్కార్డులు అందించే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. జెడ్పీ సీఈఓ గురువయ్య, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీఓ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’లో భాగంగా విద్యార్థుల భవిష్యత్ కోసం, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రూ.15వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో వేల మంది విద్యార్థులు చేతికి వచ్చిన ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా జెన్ జడ్ విద్యార్థుల భవిష్యత్ గురించి గొప్పలు చెప్పే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డ విద్యార్థుల గోడును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పున్నం వేణు, నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ స్వాతి, పెసరు విజయ్చందర్ రెడ్డి, రావుల కిషన్, ఆర్పీ జయంతి లాల్, కందగట్ల సత్యనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ హబ్ దిశగా హనుమకొండ
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని, క్రీడాకారులు త్వరలోనే తీపి కబురు వింటారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలో పునర్నిర్మించిన స్విమ్మింగ్పూల్, జేఎన్ ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను శనివారం ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇండోర్స్టేడియంలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏసీపీ జితేందర్రెడ్డి, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, తెలంగాణ జూడో అసోసియేషన్ బాధ్యుడు బి.కైలాశ్యాదవ్, వాలీబాల్ సంఘం రాష్ట్ర బాధ్యుడు మర్కాల యాదిరెడ్డి, వరంగల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. క్రీడల అధికారిపై కలెక్టర్ ఆగ్రహం.. ఇండోర్స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఫొటో స్థానంలో మరో అధికారి ఫొటోను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వేదిక పైకి రాగానే ఫొటోను గమనించిన కలెక్టర్ అక్కడే ఉన్న డీవైఎస్ఓ ప్రశాంత్ను పిలిచి ఇదేంటని ప్రశ్నించారు. తనకు ఆ ఫొటోకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసిన బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు, ప్రసంగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఫ్లెక్సీలో ఎంపీ ఫొటో లేకపోవడంపై చర్చ.. ప్లెక్సీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడం చర్చకు దారి తీసింది. ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫొటో లేదన్న విషయం తెలుసుకుని స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చిన ఎంపీ కావ్య స్టేడియం ప్రారంభోత్సవానికి రాకుండానే వెళ్లిపోయారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వండి
ధర్మసాగర్/వేలేరు: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, వేలేరు మండలంలోని సోడాషపల్లిలో మార్కెట్ కమిటీ అధీనంలో ఉన్న స్థలాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక అనిల్, అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముప్పారంలో మోడల్ స్కూల్, ప్రస్తుత గోదాములకు పోగా ఎంత స్థలం అందుబాటులో ఉందో 15 రోజుల్లో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సరిహద్దులు నిర్ణయించి పూర్తిస్థాయి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏనుమాముల మార్కెట్ అధికారులను ఆదేశించారు. సోడాషపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించిన సబ్మార్కెట్ యార్డు ఎందుకు నిరుపయోగంగా మారిందని అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమాల్లో మార్కె ట్ యార్డు వైస్ చైర్మన్ బండి జనార్దన్, సెక్రటరీ శ్రీనివాస్, తహసీల్దార్లు కోమి, భావుసింగ్, ఎంపీడీఓలు కిషన్, అనిల్కుమార్, ఏఓ కవిత, సర్పంచ్లు గుంటిపల్లి రేణుక, బిల్లా యాదగిరి, అశోక్, శ్రీనివాస్, అనిత, మానస, రమాదేవి, రాజు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముప్పారం, సోడాషపల్లిలో అధికారులతో స్థలాల పరిశీలన -
బాలల భవిష్యత్కు బాటలు వేయండి
వరంగల్ చౌరస్తా: బాలలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, సానుకూల దృక్పథంతో వారి భవిష్యత్కు బాటలు వేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. వరంగల్ ఆటోనగర్లోని బాలుర పరిశీలక వసతి గృహాన్ని శనివారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదుపాయాలను పరిశీలించారు. బాలలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయంపై కృషి చేయాలని హోం సూపరింటెండెంట్ శ్రీదేవికి పూజ పలు సూచనలు చేశారు. తనిఖీల్లో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.రజినీ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ -
పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు
న్యూశాయంపేట: టీజీ–ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిబంధనల మేర త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో టీజీ–ఐపాస్ ద్వారా పారిశ్రామిక అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న 19 పరిశ్రమలకు సంబంధించి 16.03 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో 152 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా టీప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన 9 వాహనాలకు 31.52 లక్షల రాయితీని కమిటీ ద్వారా మంజూరు చేశారు. సమావేశంలో ఇండస్ట్రీయల్ జీఎం నరసింహమూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ జీవన్కుమార్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళి భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత హాకీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కై లాసం యాదవ్, డీవైఎస్ఓ అనిల్కుమార్ తహసీల్దార్లు, కోచ్లు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. -
ప్రయాణికుల వసతులపై దృష్టి
కాజీపేట రూరల్/ఖిలా వరంగల్: కాజీపేట రూరల్ : సికింద్రాబాద్–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ప్రయాణిస్తూ నైట్ పుట్ప్లేట్ తనిఖీ నిర్వహించారు. కాజీపేట వరకు రైలు ఇంజన్లో తనిఖీలో భాగంగా రైల్వే జీఎం సిగ్నల్స్, వాటి స్పష్టత, ఓవర్హెడ్ ట్రాక్షన్ ట్రాక్ పరిస్థితి, వేగ పరిమితి, హెచ్చరికలు, వేగాలు తదితర వాటిని సమీక్షించారు. రైలు నడుపుతున్న లోకోపైలట్లు, ట్రైన్ మేనేజర్ల పనివిధానం, సిగ్నల్స్ మార్పిడి చేయడంలో మాస్టర్స్ పాయింట్స్మెన్, గేట్మెన్ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను గమనించారు. కాజీపేటలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. డీఆర్ఎం గోపాల కృష్ణన్తో కలిసి స్టేషన్లోని ప్లాట్ఫారాలు, ప్రాంగణం, వెయిటింగ్ హాళ్లు పరిశీలించారు. స్టేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, తాగునీరు, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అమృత్ బారత్స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి, అధునిక ప్రవేశ ద్వారం, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్స్ షెల్టర్లు, లిప్టులు, ఎస్కలేటర్లను పరిశీలించి..వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కాజీపేట జంక్షన్కు చేరుకుని ప్రత్యేక రైలులో సికింద్రాబాద్కు తరలివెళ్లారు. కార్యక్రమంలో రెండు స్టేషన్ల మేనేజర్లు ఆగ్గి రవీందర్, వి.సుదర్శన్రావు, డీఓఎం నరేందర్ వర్మ, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్గౌడ్, వడ్డె నరేష్కుమార్, ఇన్స్పెక్టర్లు జాఫర్, మధు, సిగ్నలింగ్ అధికారి రాంఖీ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్–కాజీపేట మధ్య నైట్ పుట్ప్లేట్ తనిఖీ కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సందర్శన -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
వరంగల్ చౌరస్తా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరంగల్ చౌరస్తాలో బీజేవైఎం జిల్లా ఆధ్వర్యంలో 12గంటల నిరసన దీక్షను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేని దుస్థితి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని పాలకులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల శ్రవణ్, నాయకులు ఆడెపు రవిరాము, రాళ్లబండి మున్నా, మహంత్, బాశెట్టి సాయి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, గోగుల రాణాప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ బీజేవైఎం ఆధ్వర్యంలో 12 గంటల నిరసన దీక్ష -
మురుగుకు.. ముకుతాడు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (కాంప్రెన్సీవ్ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ స్కీం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎస్టీపీలు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు (ఎస్పీఎస్), లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు మార్గం సుగమం చేసింది. భూసేకరణ, పునరావాస చట్టం–2013 కింద సాధారణంగా చేపట్టాల్సిన సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ (ఎస్ఐఏ)) ప్రక్రియ నుంచి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 225 జారీ చేసింది. నగరానికి కీలకం ఈ ప్రాజెక్టు... గ్రేటర్ వరంగల్ పరిధి విస్తరిస్తున్న కొద్దీ నివాస, వాణిజ్య ప్రాంతాలు పెరుగుతున్నాయి. దీంతో రోజురోజుకూ మురుగునీటి ఉత్పత్తి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో స్థానిక డ్రెయినేజీలు, నాలాలు, సెప్టిక్ ట్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వర్షపు నీటి కాలువల్లోకి చేరుతుండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి ఒక సమగ్ర అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నెట్వర్క్ అవసరం ఏర్పడింది. కాగా కొత్త వ్యవస్థలో మురుగునీటిని నేరుగా బయటకు వదలకుండా వివిధ ప్రాంతాలనుంచి సేకరించి శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఐదు ప్రాంతాల్లో భూములు.. తాజా ఉత్తర్వుల ప్రకారం బొల్లికుంట, ఉర్సు, ఖిలా వరంగల్, దేశాయిపేట, పైడిపల్లి ప్రాంతాల్లోని ప్రైవేట్ భూములను సేకరించనున్నారు. మొత్తం 11 నిర్మాణాలకు భూములు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందులో బొల్లికుంటలో ఎస్టీపీ–7 కోసం 2 ఎకరాల 8.8 గుంటలు సేకరించనుండడం అత్యధిక విస్తీర్ణం. మిగిలిన ప్రాంతాల్లో ఎస్పీఎస్లు, లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల కోసం కొన్ని వందల చదరపు గజాల చొప్పున భూములు తీసుకోనున్నారు. కాగా ప్రాజెక్టు ప్రజాప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంటూ, తెలంగాణ సవరణ చట్టం–2016లోని సెక్షన్ 10ఏ (బీ) కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఐఏ) ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చారు. భూసేకరణ కోసం అవసరమైన భూమిని సాధ్యమైనంత కనిష్ట విస్తీర్ణంలోనే తీసుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్ఐఏ మినహాయింపుతో భూసేకరణ ప్రక్రియలో ఒక దశ తగ్గడంతో ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ‘గ్రేటర్’లో యూజీడీకి కీలక ముందడుగు ఐదు ప్రాంతాలు, 11నిర్మాణాలకు ప్రైవేట్గా భూముల సేకరణకు ప్రభుత్వం ఓకే సామాజిక ప్రభావ అంచనానుంచి మినహాయింపు ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం.. తక్షణమే గెజిట్ ప్రచురణకు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రభుత్వానికి కృతజ్ఞతలు సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించడం చాలా అవసరం. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డిని అందరం కలిసి చాలాసార్లు విన్నవించాం. ప్రజలు ఎదుర్కొంటున్న డ్రెయినేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు. – నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యే -
హామీ నెరవేర్చాలి..
పేస్కేల్ విషయంలో మంత్రి సీతక్క గతంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు. సిబ్బంది దీర్ఘకాలిక సమస్యను ఇకపై వాయిదా వేయకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేస్కేల్ విధానాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి. – తిరుమలదేవి, కంప్యూటర్ ఆపరేటర్, నల్లబెల్లి ప్రభుత్వ హామీ అమలు కోసం ఎదురుచూస్తున్నాం. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం చాలీచాలని వేతనాలు అందిస్తోంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. జిల్లాలో 78 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారందరికీ పేస్కేల్ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. – జాకబ్, జేఏసీ జిల్లా చైర్మన్● -
పేస్కేల్ అమలు ఎప్పుడు?
నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో జాబ్కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత కరువైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాం జీ (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్) చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో పనిచేస్తున్న క్షేత్రస్థాయి, సాంకేతిక సిబ్బంది పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 78 మందికి ఉద్యోగ భద్రత కరువైంది. పేస్కేల్ అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కలిసి సిబ్బంది ఇటీవల విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు, ఆకాంక్షలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ ప్రకటించి, తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఈ పథకంలో సేవలందిస్తున్న సాంకేతిక సహాయకులు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలపై చర్చించి పేస్కేల్ వర్తింపజేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పేస్కేల్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వంపై ఎంతభారం పడినా వెనక్కి తగ్గేదిలేదని మంత్రి సీతక్క వారికి భరోసా కల్పించారు. కాగా, ఇటీవల పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినా.. ఆ హామీ నేటికి నెరవేరలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరకాల డిమాండ్ అయినా పేస్కేల్ ప్రకటన కోసం సిబ్బంది ఎదురు చూస్తున్నామని, చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పేస్కేల్ అమలు చేయాలని వీబీజీ రాం జీ సిబ్బంది కోరుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు..ఏపీఎంలు 11సీఓ, ఏఏలు 22ఈసీలు 7జేఈలు 3డీబీటీఎం 1టీఏలు 34 సంవత్సరాలుగా వీబీజీ రాంజీ సిబ్బంది ఎదురుచూపులు చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణకు ఇబ్బందులు -
మిత్రుడి పేరున బస్టాప్ నిర్మాణం..
దుగ్గొండి: మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన పీరాల భగవత్ ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భగవత్ బాల్య మిత్రులు 14 మంది కలిసి భగవత్ పేరిట తొగర్రాయి స్టేజీ వద్ద బస్టాప్ నిర్మించారు. దీనిని శుక్రవారం ఎస్సై రావుల రణధీర్రెడ్డి, సర్పంచ్ రాస రమతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్సై మాట్లాడారు. మిత్రుడి గుర్తుగా బస్టాప్ నిర్మించడం అభినందనీయమన్నారు. మిత్రులు కస్తూరి అరవింద్ పటేల్, బల్దు అశోక్, అమ్మ హరీశ్, ఇజ్జగిరి మధుకర్, బుసాని నరేందర్, చీర్ల నరేశ్రెడ్డి, బుసాని నవీన్రాజ్, మేకిరి పృథ్వీరాజ్, ఎలగొండ రాజేందర్, బొబ్బాల రాజేశ్రెడ్డి, చెల్పూరి రాజేశ్, తుమ్మలపల్లి రంజిత్, కంతిరి సతీశ్, లింగదారి శ్రీకాంత్, భగవత్ తండ్రి పీరాల మల్లయ్య, రవి, ఉప సర్పంచ్ బుసాని రాజు, మాజీ సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి, తుమ్మలపల్లి మహేందర్, అమ్మ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి మరణం తట్టుకోలేక..
● కుమారుడి మృతి ● ఐనవోలులో ఘటన ఐనవోలు: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఐనవోలులో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొండేటి మల్లికాంబ(65) కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందగా మృతదేహాన్ని అర్ధరాత్రి స్వగ్రామం తీసుకొచ్చారు. మల్లికాంబకు ఇద్దరు కుమారులు సమ్మయ్య, రవి ఉన్నారు. రవి(32) కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లి మృతితో రాత్రంతా ఏడుస్తూ మనోవేదనకు గురై అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లికి అంత్యక్రియలు చేపట్టడానికి శ్మశానవాటిక వద్దకు ఆటోలో వెళ్లి కర్రవేసి వచ్చాడు. అతను నడి చే పరిస్థితి లేక పోవడంతో రవి కుమారుడు దక్షిత్తో మల్లికాంబతో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబీకులు నిర్ణయించారు. మల్లికాంబ అంతిమయాత్ర చేపడుతుండగా మార్గమధ్యలో రవి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం రావడంతో కొందరు బంధువులు ఇంటికి చేరుకోగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందినట్లు అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నానమ్మ మల్లికాంబ అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న దక్షిత్.. తండ్రి రవి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం తండ్రివి కూడా అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, తల్లి, కుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మల్లికాంబ గతంలో, రవి ప్రస్తుతం గ్రామ పంచాయతీ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోస్టింగ్ అక్కడే!
మినరల్స్ ఎక్కడో.. గనులశాఖలో కొందరు అధికారుల తీరిది సాక్షి ప్రతినిధి, వరంగల్: మైనింగ్ అంటేనే కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద. ఇసుక, క్వారీలు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్.. ఇలా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టేవి. వీటికి అనుమతులు ఇవ్వడం, లీజులను పర్యవేక్షించడం, రాయల్టీ వసూలు చేయడం, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అడ్డుకోవడం మైన్స్ అండ్ జియాలజీ శాఖ పరిధిలోని కీలక బాధ్యతలు. అలాంటి శాఖలో జిల్లాస్థాయి అధికారుల పోస్టింగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వనరులు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు, రాజకీయ పలుకుబడి, లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్కు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ సోదాలు జరగడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. 12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్.. భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్చార్జ్గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్గా ఇన్చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్ల తీరును అర్థం చేసుకోవచ్చు. ‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి? ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్లో ఇనుప ఖనిజం, లేటరైట్తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధికారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సంధర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. కాగా ఇటీవల ఏసీబీ దాడులు, అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వస్తుండటంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, వారి పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు.. ఏడీలకు డీడీ బాధ్యతలు ఆదాయానికి మించిన ఆస్తులు.. అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్ ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్ల దందాఆరు జిల్లాల్లో.. మూడుచోట్ల ఇన్చార్జ్లే.. ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది. హనుమకొండలో ఏడీ బాధ్యతలు ఇన్చార్జ్కి ఉండగా ఇటీవల రెగ్యులర్ ఏడీని నియమించారు. వరంగల్లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియోలజిస్టు(ఏజీ)నే ఇన్చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది. మహబూబాబాద్లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు. భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్లు ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరక్టర్లుగా పోస్టింగ్లు తెచ్చుకున్నారు. ములుగులో ఇన్చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియోలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు. -
సైంటిస్ట్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కాశిబుగ్గ: హనుమకొండ జిల్లా కాకతీయ వైద్యకళాశాల కార్యాలయంలోని వీఆర్డీఎల్ పథకం కింద ఆరోగ్య పరిశోధన శాఖలో ఒక సైంటిస్ట్–బీ (మెడికల్) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాసు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 31 నుంచి www.kmcwgl.com వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి కేఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 9వరకు సమర్పించాలని పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ పోస్టు 11 నెలల కాలానికి గాని, అభ్యర్థి సంతృప్తికరమైన పనితీరు, ప్రాజెక్టు కొనసాగింపును బట్టి పొడిగించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. 31 నుంచి కేయూలో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటాయన్నారు. టీఎస్ఐసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావొచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఫీజు తీసుకురావాలని ఆయన సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్ అధికారిక వెబ్సైట్తో పాటు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల నోటీస్ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్ నర్సింహాచారి వివరించారు. స్కూల్ ఆఫ్ లెర్నింగ్లోనూ.. కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రంలోని స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (కేయూ ఎస్ఎల్)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి.సురేశ్లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్–2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమతమ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. నిట్లో తెలుగు భాషా దినోత్సవం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ.. నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. తీజ్ వేడుకల్లో విషాదంబైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం రాయపర్తి: తీజ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం గోరుగుట్టతండాకు చెందిన బానోత్ రవి (48) తన అత్తగారి గ్రామం ఏకేతండాలో ఈనెల 27న నిర్వహించిన తీజ్ వేడుకలకు హాజరయ్యాడు. తీజ్ ఊరేగింపులో భాగంగా దుర్గమ్మ ఆలయం వద్ద నిల్చున్నాడు. ఏకేతండాకు చెందిన హలావత్ నితిన్ తన బైక్తో అజాగ్రత్తగా అతివేగంగా ఢీకొట్టడంతో రవికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవపంచనామా నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. -
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రాఖీ కానుకగా హెల్త్ ఇన్సూరెన్స్ ● చెల్లెలి కుటుంబానికి బాండ్ అందించిన అన్న వేలేరు : సాధారణంగా రాఖీ పండుగకు చెల్లెలికి బహుమతులు, నగదు అందించడం ఆనవాయితీ. కానీ, తనకు రాఖీ కట్టిన చెల్లికి ఓ అన్న.. వినూత్న కానుక ఇచ్చారు. చెల్లి కుటుంబానికి మొత్తం ఆరోగ్య బీమా చేయించి బాండ్ అందించాడు. వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన జక్కుల సంపత్ తన చెల్లెలి కుటుంబానికి ఆరోగ్య భద్రతే ముఖ్యమని భావించి గత నాలుగేళ్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రాఖీ కానుకగా అందజేస్తున్నారు. శుక్రవారం కూడా తనకు రాఖీ కట్టిన చెల్లెలు బేతి మౌనిక కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల విలువ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి అందించారు. ఈ సందర్భంగా జక్కుల సంపత్ మాట్లాడుతూ.. తన చెల్లెలు, బావతోపాటు కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్యఖర్చుల విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతీ సంవత్సరం రాఖీ పండుగ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తున్నట్లు తెలిపారు. అన్న ఇచ్చిన రాఖీ కానుక తమకు ఎంతో విలువైనదని చెల్లెలు మౌనిక పేర్కొంది.రాఖీతో ప్రేమ.. హెల్మెట్తో భద్రత ● సోదరులకు కానుకగా ఇచ్చిన సోదరి భీమదేవరపల్లి : రాఖీ పౌర్ణమి వేళ ఓ సోదరి తన అనుబంధాన్ని చాటడంతోపాటు సమాజానికి ఆదర్శంగా నిలిచే సందేశాన్ని ఇచ్చారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన దిడ్డి విజయ శుక్రవారం తన సోదరులు గౌడ బాలాజీ, గౌడ చంద్రబాబులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ హెల్మెట్లను కానుకగా అందించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ తన సోదరులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. రాఖీ పండుగ కేవలం అనుబంధాలకే కాకుండా పరస్పర బాధ్యతను తెలియజేస్తుందని, సోదరుల రక్షణే అక్కాచెల్లెళ్లకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భద్రతా సందేశాన్ని చాటిన సోదరి విజయ ఆలోచనను పలువురు అభినందించారు. -
ఘనంగా రక్షాబంధన్
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి కానుకలు స్వీకరించారు. హారతి ఇచ్చి ఆశీర్వదించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటింటా సందడి నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మిఠాయి, రాఖీ దుకాణాలు కిటకిటలాడాయి. – సాక్షి, నెట్వర్క్– మరిన్ని ఫొటోలు 8లో -
వరద రాకుండా పనులు చేపట్టాలి
న్యూశాయంపేట: భద్రకాళి చెరువు వరద నివారణ పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చెరువు నీటి ప్రవాహం, వరద పరిస్థితులు, కాల్వలు, నీటి విడుదల మార్గాలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్, డీఈ మధుసూదన్రెడ్డి, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి కాళోజీ సెంటర్: సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. డీఆర్డీఓ నాగపద్మజ, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కొత్త పింఛన్ల పోస్టర్ను శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, పెన్షన్ డీపీఎం రేవతి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
ఒక్క ఐడీ.. అన్ని రికార్డులు
కాళోజీ సెంటర్: విద్యార్థి విద్యాప్రస్థానం ఒకే డిజి టల్ ప్లాట్ఫాం కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అపార్ ఐడీ నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ప్రతి విద్యార్థికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా కేటాయించాలని జిల్లా విద్యాశాఖ అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఆదేశించింది. అపార్ ఐడీ కేటాయింపులో ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని, 100 శాతం నమోదు పూర్తి చేయాలని డీఈఓ సూచించారు. జిల్లాలో 872 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. యూడైస్ ప్రకారం 1,27,149 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థుల డేటాను ఏకీకృతం చేసేందుకు.. దేశవ్యాప్తంగా విద్యార్థుల డేటాను ఏకీకృతం చేసేందుకు కేంద్రం అపార్ను ప్రవేశపెట్టింది. డిజిటల్ లాకర్ పద్ధతిన ఆరో తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు మార్కులు, గ్రేడ్లు, స్కాలర్షిప్లు, క్రీడా ప్రావీణ్య పత్రాలన్నీ ఒకే చోట భద్రపరిచేందుకు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ప్రక్రియ ప్రారంభించింది. నమోదు ప్రక్రియ ఇలా.. ఆధార్కార్డు, తల్లిదండ్రుల సమ్మతి అవసరం. డీజిలాకర్ లేదా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) పోర్టల్ ద్వారా ఉచిత సేవలు పొందవచ్చు. పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులందరికీ ఐడీ జనరేట్ అయ్యేలా బాధ్యత తీసుకోవాలి. ప్రతి విద్యార్థి ప్రొఫైల్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ద్వారా 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 12 అంకెల గల అపార్ ఐడీ సిద్ధం చేస్తే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందడానికి సులువు అవుతుంది. పాఠశాలలు విద్యార్థులు ఐడీ పొందిన విద్యార్థులు ప్రభుత్వ 593 46,048 31,185 ప్రైవేట్ 279 81,101 51,508 మొత్తం 872 1,27,149 82,693సులువైన అడ్మిషన్లు, ఒక పాఠశాల, కళాశాల నుంచి మరోదానికి మారినప్పుడు ఫిజికల్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ శ్రమ తగ్గుతుంది. నకిలీలకు, దొంగ సర్టిఫికెట్లతో సాగే అక్రమాలకు చెక్పెట్టవచ్చు. స్కాలర్షిప్లు, విద్యార్థి అర్హతను సులభంగా నిర్ధారించి సంక్షేమ పథకాలు వేగంగా అందించవచ్చు. వన్ నేషన్–వన్ స్టూడెంట్ కింద 12 అంకెల ప్రత్యేక గుర్తింపు జిల్లాలో 100 శాతం నమోదుకు విద్యాశాఖ ఆదేశాలు -
మినరల్స్ ఎక్కడో.. పోస్టింగ్ అక్కడే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. 12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్.. భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్చార్జ్గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్గా ఇన్చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్ల తీరును అర్థం చేసుకోవచ్చు. ‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి? ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్లో ఇనుప ఖనిజం, లేటరైట్తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధికారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సందర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. కాగా, ఇటీవల ఏసీబీ దాడులు, అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వస్తుండడంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, వారి పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. గనులశాఖలో కొందరు అధికారుల తీరిది పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు.. ఏడీలకు డీడీ బాధ్యతలు ఆదాయానికి మించిన ఆస్తులు.. అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్ ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్ల దందాఆరు జిల్లాల్లో.. మూడుచోట్ల ఇన్చార్జ్లే.. ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది. హనుమకొండ జిల్లాలో ఏడీ బాధ్యతలు ఇన్చార్జ్కి ఉండగా ఇటీవల రెగ్యులర్ ఏడీని నియమించారు. వరంగల్లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియాలజిస్టు(ఏజీ)నే ఇన్చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది. మహబూబాబాద్లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు. భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్లు ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా పోస్టింగ్లు తెచ్చుకున్నారు. ములుగులో ఇన్చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియాలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు. -
పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడొద్దు
హన్మకొండ అర్బన్ : భవన నిర్మాణ అనుమతుల ప్రకారం కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. నగరంలోని స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీలోని మెప్సన్, న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్లను పరిశీలించారు. మెప్సన్లో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ గదులను తనిఖీ చేసి పరీక్షల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్కు తాళం వేసి ఉండటంతో సెల్లార్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు కేంద్రాల్లోనూ భవన నిర్మాణ అనుమతుల ప్రకారం పార్కింగ్కు కేటాయించిన స్థలాలను డయాగ్నొస్టిక్ సేవలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.అప్పయ్యను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య కాకతీయ కిడ్నీ సెంటర్, సిద్ధార్థ కార్డియాక్ సెంటర్, వినోద డెంటల్, మల్లిక చిల్డ్రన్స్ ఆస్పత్రులను కూడా తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రదేశాలను మెడికల్ షాపులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది సందీప్, రంజిత్ . తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ పలు డయాగ్నొస్టిక్ సెంటర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం -
శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలి
నల్లబెల్లి: పట్టు సాగులో రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తూ, అధిక దిగుబడి సాధించాలని పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు తిరుపతిరెడ్డి సూచించారు. కేంద్ర పట్టు బోర్డు (సీఎస్బీ) మండలంలోని మేడపల్లిలో రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించింది. మల్బరీ సాగులో నూతన సాంకేతికత, శాసీ్త్రయ పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మల్బరీ సాగుచేసే రైతులు నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని, తగిన యాజమాన్య పద్దతులు పాటించాలని సూచించారు. పట్టు పురుగుల పెంపకంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. శాస్త్రవేత్త భువన, సెరికల్చర్ అధికారి మల్లయ్య, ఏఓ బన్న రజిత, ఏఈఓలు రాకేశ్ పాల్గొన్నారు. పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు తిరుపతిరెడ్డి -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రతినిధుల డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రెండో పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, ఎన్ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు. జేఏసీ చైర్మన్ గాజే వేణుగోపాల్, టీఎన్జీవోస్ జిల్లా గౌరవాధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, కార్యదర్శి సుజన ప్రసాద్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష,, కార్యదర్శులు మహేందర్రెడ్డి, గోవిందరావు, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి మహేందర్రెడ్డి, హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్, డీటీహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం, కోశాధికారి కిరణ్, టీఆర్టీఎఫ్ అధ్యక్షులు కిషన్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్జీపీటీ సంఘం అధ్యక్షు డు సదానందం, పెన్షనర్ల సంఘం బాధ్యులు సార య్య, బాలరాజు, ధర్మరాజు సోమయ్య, టీజీఓ రాష్ట్ర కార్యదర్శి కోలా రాజేశ్, కిరణ్గౌడ్, టీజీఓ సెక్రటరీ రాజీవ్రెడ్డి, సారంగపాణి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాంబయ్య, భానుప్రకాష్, సిటీ అధ్యక్షుడు రాజేశ్, ఎస్టీయూ అధ్యక్షుడు మధు లీమియా ఉన్నారు. కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాలో జేఏసీ ప్రతినిధుల డిమాండ్ -
పార్సిల్ వస్తువుల వేలం
హన్మకొండ : ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా వచ్చి.. ఎవరూ తీసుకెళ్లని వస్తువులను ఈనెల 29న మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేయనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరమ్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ హనుమకొండ డిపోలో నిర్వహించే ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు నేరుగా పాల్గొనవచ్చని సూచించారు. కేయూ క్యాంపస్: హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈవిద్యాసంవత్సరం (2026–27)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు స్పాట్ అడ్మిషన్లకు ఆయా తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సంప్రదించి అడ్మిషన్లు పొందాలని కోరారు. కాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్చార్జ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ పేషెంట్ల సేవలు, ట్రునాట్ ల్యాబ్ గురించి తెలిపారు. కార్యక్రమంలో టీబీ, కల్చర్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ కొనసాగుతోందని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇప్పటివరకు 15,574 మందికి నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్ఐఆర్ పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఈఆర్ఓ/ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, రాజకీయ పార్టీల ప్ర తినిధులు ఎండీ.నేహాల్, కె.సంపత్రెడ్డి, కె.శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీజీఎస్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టు సభ్యులు, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు దేవరకొండ సైదులు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సదస్సులో వివిధ జిల్లాల అధ్యక్షులు దిల్షాద్, గుండ యాదగిరి, షేక్ మన్సూర్, మంగ నర్సింహులు, సునీల్కుమార్, రవి, వృత్తి విద్య కాంట్రాక్టు అధ్యాపకులు, టీజీఎస్టీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఎం.చైతన్యకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజీపేట, ఫాతిమానగర్, మచిలీబజార్, సుధానగర్, యాదవనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈలు రవీందర్, కిషన్ నాయక్, విష్ణువర్ధన్, ఏఈలు, సీఎల్టీ సీలు, మేనేజర్లు పాల్గొన్నారు. -
నోటీలిస్తున్నారు ‘సర్’
గ్రామ, వార్డు సభల్లో వేలాది మందికి జారీఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వైనాల శ్రీనివాస్ నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన దివ్యాంగుడు. వీరి కుటుంబ సభ్యులు మూడు తరాలుగా ఇదే గ్రామంలో నివసిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సర్ ప్రక్రియలో వివరాలు నమోదు చేసినప్పుడు 2002 ఓటరు జాబితాలో శ్రీనివాస్, వారి వారసుల వివరాలు లభించలేదు. దీంతో అధికారులు నోమ్యాపింగ్లో చేర్చారు. ఈనెల 25న అధికారులు నోటీసు ఇవ్వడంతో ఆధార్కార్డు, నివాసం సర్టిఫికెట్, జిరాక్స్ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులకు వివరాలు సమర్పించారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్లోని విద్యానగర్కు చెందిన గొల్లపల్లి రజినీకాంత్. ఇతడు నింపిన ఎన్యూమరేషన్ పత్రంలో తల్లిదండ్రులకు సంబంధించి 2002 ఓటరు జాబితా వివరాలు సరిగా లేవు. అయినా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు వచ్చింది. నోలింకేజీ కింద వివరాలు సరిపోలవడం లేదని నోటీసు ఇచ్చారు. ఫోర్ట్రోడ్డు విద్యానగర్ కాలనీ 126 పోలింగ్ బూత్ పరిధిలోనే నివాసముంటున్న ఇతడు పాత, ప్రస్తుతం సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి ఓటు ఉండేలా చూడాలంటున్నాడు.సాక్షి, వరంగల్: జిల్లాలో గురువారం జరిగిన సర్ వార్డు, గ్రామ సభల్లో నోటీసుల పరంపర కొనసాగింది. అడ్రస్లు సరిగా లేనివారు, పొలింగ్ స్టేషన్లు సరిగా చెప్పనివారు, పేర్ల అక్షరాల్లో తప్పులుండడం, ఇంటి పేరులో తప్పిదాలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు 2002 నాటి ఓటరు జాబితా సరిగా తెలియని వారు.. తదితర కారణాలున్నవారికి నోలింకేజీ పేరుతో నోటీసులు ఇచ్చారు. గ్రామసభ, వార్డు సభలకు వచ్చినవారికి నోటీసులిస్తూనే రానివారికి కూడా దశలవారీగా నోటీసుల ప్రక్రియ పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా 1,94,399 మందికి సర్లో తప్పిదాలు ఉన్నాయంటూ నోటీసులు ఇస్తున్నారు. నోటీసుల్లో పొందుపరిచిన తేదీ ప్రకారం కేటాయించిన పొలింగ్ కేంద్రానికి వచ్చి బీఎల్ఓలకు ధ్రువీకరణ పత్రాలు అందిస్తే ఓటు ఉండే అవకాశముంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోనుంది. అందుకే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓటర్లను మార్గదర్శనం చేస్తూ ఓటరు జాబితాలో ఉండేలా దృష్టి కేంద్రీకరించాయి. సిటీలో రెంటర్స్కే ఎక్కువ నోటీసులు.. వరంగల్ సిటీలో చాలావరకు నోలింకేజీ కింద ఎక్కువ నోటీసులు అద్దెదారులకు వచ్చినట్లు తెలుస్తోంది. 2002లో ఎక్కడో నివసించారో అనే వివరాలు, అప్పటిఓటరు జాబితాలో అడ్రస్ ఎక్కడుందో తెలియక చాలా మంది ఎన్యూమరేషన్ పత్రంలో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయలేదు. వీరిలో చాలా మంది ఇప్పుడూ సొంతిళ్లు కట్టుకున్నారు. 2002 నాటి ఓటరు జాబితా వివరాలు లేకపోవడంతో అత్యధిక మంది రెంటర్స్కు నోటీసులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తే ఓటు పదిలంగా ఉండనుంది. ఇతర ప్రాంతాల్లో ఇన్నాళ్లు ఉద్యోగం చేసి కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడా శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నవారు సైతం 2002 ఓటరు జాబితా వివరాలు తెలియనివారు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారని నగరంలోని ఓ బీఎల్ఓ శశికళ తెలిపారు. ఆంధ్రావాళ్లు సైతం ఏపీలో తల్లిదండ్రులు, ఇక్కడా పిల్లలు సర్లో పేరు నమోదు చేసున్నవారు సైతం ఉన్నారు. పట్టణాలు, గ్రామాల్లో సైతం 2002 ఓటరు జాబితాలో కుటుంబ వివరాలు సరిగా నమోదు చేయనివారు, వాటితో వివరాలు అనుసంధానం కానివారే ఎక్కువగా ఉండడం గమనార్హం. 2002 నాటి ఓటరు జాబితా ప్రకారం లేనివారే ఎక్కువ కుటుంబ సభ్యుల వివరాలు లేక అయోమయం అడ్రస్లు, ఇంటిపేర్లు, పీఎస్ల తప్పులు సైతం -
దద్దరిల్లిన కలెక్టరేట్
ఉద్యోగుల ఆందోళన..హన్మకొండ అర్బన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ధర్నాలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాసంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. అధికార పార్టీ నేతలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. భారీగా ఉద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు జనసందోహంగా మారాయి. హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ ఆరు డీఏలు విడుదల చేయడం, మెరుగైన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఆలస్యం చేయకుండా అందించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారని తెలిపారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఎమ్మెల్యే నాయిని ధర్నాకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఇప్పటికే చర్చించానన్నారు. రెండో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ విధానం, హెల్త్కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉండడం సిగ్గుచేటన్నారు. ఈహెచ్ఎస్ పేరుతో ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నా ఆస్పత్రులతో ఒప్పందాలు లేక సేవలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతోపాటు మెరుగైన పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. హాజరైన అన్ని ఉద్యోగ సంఘాలు.. సంఘీభావం తెలిపిన ప్రజాసంఘాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాధర్నా.. అక్కడే భోజనాలు అధికార, ప్రతిపక్ష నేతల హామీలు.. విమర్శలతో వేడెక్కిన వేదిక మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. స్టేషన్కు తరలింపు -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సంగెం: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి నవీన, రవీందర్ దంపతులకు కుమారుడు శ్రీకాంత్ (26), ఒక కూతురు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం రవీందర్ అనారోగ్యంతో మృతి చెందాడు. నవీన కూతురు వివాహం జరిపించగా కుమారుడు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా మంచిర్యాల జిల్లా హాజిపూర్కు చెందిన గౌరిశెట్టి సాహితి, శ్రీకాంత్ ప్రేమించుకుంటున్నారు. ఆమె తల్లిదండ్రులకు శ్రీకాంత్ చాలా సార్లు డబ్బులు పంపించాడు. ఇటీవల సాహితి తల్లిదండ్రులు కొత్తపల్లికి వచ్చి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె పోన్ లిఫ్ట్ చేయడం లేదు. తనపై కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రేమ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారని శ్రీకాంత్ తల్లితో చెప్పి ఆవేదన చెందుతుండేవాడు. మనస్తాపం చెందిన ఆయన మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని, ఈ నెల 26న ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి తల్లికి చెప్పాడు. వెంటనే నర్సంపేటలోని ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున శ్రీకాంత్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. శ్రీకాంత్ మృతితో కొత్తపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూసైడ్ నోట్లో శ్రీకాంత్ రాసుకున్న వివరాలు.. ‘ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలోకి ప్రేమ పేరుతో ఒక బంధం వచ్చింది. మంచిర్యాల జిల్లా హాజిపూర్కు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆమె తల్లిదండ్రులను ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం చేశా. కానీ, చివరికి ఆమె కుటుంబ సభ్యులు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. పెళ్లి కోసం 25 తులాల బంగారం పెట్టాలని ఒత్తిడి చేశారు. హైదరాబాద్లో ప్లాట్ తీసుకోవాలని చెప్పగా ప్లాట్ తీసుకున్నా. బావమరిది కూడా కట్నం పేరుతో 10 తులాల బంగారం కావాలని ఒత్తిడి చేశాడు. నాదగ్గర ఉన్నదంతా పెట్టడానికి ఒప్పుకున్నా. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తీసుకుని వాటిని అమ్మాయి పేరుపై మార్చాలని చెప్పారు. చివరికి సాహితి కుటుంబం నన్ను మోసం చేసింది. నా మీద కేసు నమోదు చేయిస్తాను అని బెదిరించింది. నేను భరించిన బాధకు ముగింపు ఇవ్వు. మరో జన్మ ఉంటే ఈ బాధలు లేని జన్మ ఇవ్వు దేవుడా ఇక సెలవు’ అని శ్రీకాంత్ సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. సంగెం మండలం కొత్తపల్లిలో విషాదం మరో జన్మ ఉంటే బాధలు లేని జీవితం ఇవ్వు అని దేవుడిని ప్రార్థిస్తూ సూసైడ్ నోట్.. వాట్సాప్లో స్టేటస్ -
ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్యాబోధన
ఖానాపురం: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ విద్యాబోధన చేస్తారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీధర్సుమన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం నోట్బుక్స్, బ్యాగులు, షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వి నియోగం చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ఉత్తమ ఫలితాల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం వృక్ష రక్షాబంధన్, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాగి రవికుమార్, ఎన్ఎస్ఎస్ పీఓ పరాచికపు సదానందం, అధ్యాపకులు శోభ, విజయ్కుమార్; తిరుపతమ్మ, రమాదేవి, సంజీవ, రాజేశ్, కేశవరెడ్డి, అనిల్, పాల్గొన్నారు. గుట్కాలు స్వాధీనంనర్సంపేట: నర్సంపేట పట్టణంలోని నవదుర్గ ఎంటర్ ప్రైజెస్ షాపులో గురువారం పోలీసులు దాడులు చేశారు. రూ.2.20 లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని పరమార్ పూరన్సింగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. దొంగ అరెస్ట్గీసుకొండ: డీసీఎం వాహనంలోని నగదును దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన తాటికంటి భాస్కర్ నాలుగు సంవత్సరాలుగా స్థానిక బెల్బ్రాండ్ కంపెనీలో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 21న డ్రైవర్ కుళ్ల సురేశ్, వరంగల్ కొత్తవాడకు చెందిన హెల్పర్ యాద గణేశ్తో కలిసి ఆయన డీసీఎం వాహనంలో స్వీట్లు, బేకరీ తినుబండారాలు విక్రయించేందుకు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్లాడు. అమ్మకాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు జాన్పాక వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్పంపు వద్ద డీజిల్ పోయించడానికి డీసీఎం ఆపాడు. వాహనంలోని నగదు ఉన్న బ్యాగుకు తాళం వేసి కిందికి దిగాడు. బిల్లు తీసుకుని తిరిగి వాహనం వద్దకు రాగా అందులో హెల్పర్ గణేశ్ కనిపించలేదు. నగదు బ్యాగును కోసి రూ.1.50 లక్షల నగదును గణేశ్ దొంగిలించి పరారైనట్లు గుర్తించాడు. ఈ విషయమై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం గణేశ్ను అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.20 వేల నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రైతు మృతిగీసుకొండ: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన వరంగల్–నర్సంపేట రహదారిపై గురువారం చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. సంగెం మండలం వంజరుపల్లి గ్రామానికి చెందిన గోనె సమ్మయ్య (70) మధ్యాహ్నం 3 గంటలకు తన మోపెడ్పై వ్యవసాయ పనిముట్ల వెల్డింగ్ కోసం వరంగల్–నర్సంపేట రహదారిలో కొమ్మాల వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న కారు కొమ్మాల స్టేజీ సమీపంలో వేగంగా వచ్చి సమ్మయ్య వెళ్తున్న మోపెడ్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సమ్మయ్యతోపాటు మోపెడ్ను కారు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈఘటనలో అతడు అక్కడే మృతి చెందాడు. కారును అజాగ్రత్తగా నడిపిన గంగారం మండలం కోమట్లగూడేనికి చెందిన డ్రైవర్ వనం ప్రమోద్కుమార్పై మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ‘కేఎంసీ’ సందర్శనకాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్చార్జ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ సేవలు, ట్రునాట్ ల్యాబ్ గురించి తెలిపారు. -
ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి
ఖిలా వరంగల్: జిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,39,997 ఎకరాల్లో గత సంవత్సరం వరి సాగు చేయగా.. ఈఏడాది ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వివరించారు. వరిసాగు చేయాల్సిన మిగిలిన 75,704 ఎకరాల్లో 33,438 ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేసినట్లు తెలిపారు. పాకాల సరస్సు ఆయకట్టు కింద వరిసాగు చేయవద్దని రైతులకు సూచించినా కొందరు సాగుచేసినట్లు తెలిపారు. ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఫార్మర్ రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఉద్యానశాఖ ఆధికారి శ్రీనివాస్రావు పాల్గొన్నారు. భూసర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టాలి భూసర్వేను క్షేత్రస్తాయిలో సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఖిలా వరంగల్ మండలం అల్లీపురం గ్రామంలో భూరీసర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీ సర్వే అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. ‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి కాశిబుగ్గ: వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గురువారం ఆమె పరిశీలించారు. భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విన్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వరంగల్
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. ఆ ‘ఉత్తమ’అధికారి.. అవినీతి ‘గని’!? ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో గనులశాఖ ఏడీ జయరాజు కార్యాలయంతో పాటు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇంటి స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నక్కపల్లి ప్రసాద్ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించాడు. అతడి చెల్లెళ్లు రాజేశ్వరి, అరుణ పెళ్లి చేశాడు. అమ్మానాన్న లోటు లేకుండా పెంచి పెద్ద చేసిన అన్న ప్రసాద్ అంటే వారికి ఎనలేని ప్రేమ. ఎక్కడున్నా అన్నకు ప్రతీ ఏడాది రాఖీ కడతారు. చెల్లెళ్లకు సైతం ప్రసాద్ తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.అమ్మానాన్న అన్నీ అన్నయ్యే..దుగ్గొండి: చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అమ్మానాన్న లేని లోటు ఉండొద్దని అన్నీ తానై చెల్లికి అండగా నిలిచాడు అన్నయ్య. నాచినపల్లి గ్రామానికి చెందిన నంగునూరి చేరాలు– స్వరూప దంపతులు అనారోగ్యంతో 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. అప్పటికి వారికి 8 సంవత్సరాల కుమారుడు హరీశ్, ఐదు సంవత్సరాల కుమార్తె, ప్రత్యూష ఉన్నారు. ఎలాంటి ఇల్లు, ఆస్తిపాస్తులు, లేవు. చేరాలు అన్నదమ్ములు వారిని కొంతకాలం ఆదరించారు. హరీశ్ గుండె ధైర్యంతో ముందుకు సాగాడు. స్వచ్ఛంద సంస్థ బడిలో చేరి చదివాడు. దాతల సహకారంతో చెల్లిని ఢిల్లీలోని నేషనల్ కాలేజీలో ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చదివించాడు. హరీశ్ బెంగళూరులో న్యాయవిద్యను పూర్తిచేశాడు. వీరు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీపాద వెంకటేశ్వర్లు, సరోజ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు శ్రీపాద సురేశ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ప్రతీ సంవత్సరం పర్వతగిరికి వస్తుంటాడు. మిగిలిన నలుగురు అన్నదమ్ములు సతీశ్, రఘు, రవి, రాము పర్వతగిరికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఐదుగురు అన్నదమ్ములంటే తనకు ప్రాణమని ఏటా వారికి రాఖీ కడతానని ప్రియాంక చెబుతోంది. డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంకు స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెల్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి -
వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
● వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ఘటన.. మహిళ మృతి భీమదేవరపల్లి: ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భీమదేవరపల్లి మండలం రాంనగర్ (మంగళపల్లి) శివారులో గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన ఏలూరి రవీందర్రెడ్డి, వీరారెడ్డి, కిరణ్, రాధ హుస్నాబాద్ మండలం పోతారాంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా.. రాంనగర్ శివారులో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
గిరాఖీ
చలో.. రాఖీరాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు గురువారం వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో హనుమకొండ, వరంగల్ బస్టాండ్లు, కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. హనుమకొండ బస్స్టేషన్లో బస్సులు ఎక్కేందుకు పోటీలు పడడంతో కొంత తోపులాట జరిగింది. కాజీపేట స్టేషన్ ఎంట్రెన్స్ వద్ద ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్, జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద బారులుదీరారు. ప్లాట్ఫామ్ సందడిగా మారింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ హనుమకొండ/కాజీపేట రూరల్ గురువారం వరంగల్ రామన్నపేట, బట్టలబజార్, పిన్నావారి వీధి, హనుమకొండ చౌరస్తా, టైలర్ స్ట్రీట్, కాజీపేట చౌరస్తా తదితర ప్రాంతాలు రాఖీలు, స్వీట్స్ కొనుగోళ్లతో రద్దీ ఏర్పడింది. – హన్మకొండ కల్చరల్ -
ఎంజీఎంలో వైద్యసేవలపై డీఎంఈ ఆరా
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బంది తీరు, ఆస్పత్రి సమస్యలపై డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ వాణి ఆరా తీశారు. అలాగే, కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఎంజీఎం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహాత్మా’.. మారేదెప్పుడు? శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న మందలించారు. అలాగే, ఓపీ విభాగాలు, వార్డుల్లో రౌండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ వాణి మాట్లాడుతూ ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేషంట్లకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అదనపు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 30న పీజీ సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులను ఆస్పత్రిలో నియమిస్తామని పేర్కొన్నారు. అలాగే, ఆర్ఎంఓలు పూర్తిగా ఉండేవిధంగా చూస్తామని, వైద్యసేవలను మె రుగుపరిచేందుకు అదనపు ఆర్ఎంఓల నియామకానికి ఆదేశాలు ఇస్తామని వివరించారు. స్టెచర్లు, వీల్చైర్లు అందుబాటులో ఉండేవిధంగా చూస్తామని, త్వరలో తాను ఎంజీఎంను సందర్శించి అధికారులతో సమీక్ష చేస్తామని ఆమె వెల్లడించారు. -
అర్హుల పేర్లు జాబితాలో ఉండాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆత్మకూరు: అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలని, సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సర్ గ్రామసభకు హాజరై ఓటర్ల డాక్యుమెంట్ల సమర్పణ, అప్ లోడింగ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నోటీసు అందుకున్న వారు తగిన డాక్యుమెంట్ సమర్పించి ఓటు హక్కు పొందాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. మండలంలోని కొత్తగట్టులో నర్సరీ, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, డ్రెయినేజీ సోక్పిట్, ఇంకుడు గుంతలను పరిశీలించారు. మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను నిర్మాణాన్ని పరిశీలించారు. కొత్తగట్టులో వీఓ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, పీఆర్ డీఈ యుగంధర్, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి, బీఎల్ఓలు సాజీదాబేగం, సారంగం, అశోక్, దేవమ్మ, శ్రీవిద్య, బీఎల్ఏలు పరికిరాల వాసు, రేవూరి జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం.. పింఛన్ ఆత్మకూరు: మండలంలోని అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన మాదాసి అశోక్, మాదాసి నవిత తమకు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని మండల కేంద్రంలో కలెక్టర్ను వేడుకున్నారు. పరిశీలించా లని ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానాస్పద ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశం నిర్వహించారు. గత మూడు నెలల్లో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల వివరాలను డీఎంహెచ్ఓ అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల నివేదికలను పరిశీలించడంతో పాటు కొత్త అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ సమాచారం అందించిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, బన్ను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నీతా, డెమో వి.అశోక్రెడ్డి, పద్మజ ఉన్నారు. -
తల్లీతండ్రి అన్నీ.. అన్నే!
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దుబ్బాక శ్రీనివాస్కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. -
ఏటా ఒకచోట వేడుకలు
డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంక్ స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు. -
వరంగల్
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026సమస్యలపై సమరభేరి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. నిట్తో ఎంఓయూ..ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
మరణంలోనూ వెలుగులు నింపిన లక్ష్మి
భీమదేవరపల్లి: కటుంబ సభ్యురాలు మరణంతో తీవ్ర వేదనలో ఉన్నా సమాజహితం కోరి ఆ కుటుంబం నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచింది. మండలంలోని కొత్తకొండకు చెందిన లక్ష్మి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జాతీయ నేత్ర దాన వారోత్సవాల ప్రారంభం రోజే ఆమె మరణించింది. ఆమె కుమార్తె లక్ష్మీదేవి మిగతా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి కుమారుడు బుర్ర సమ్మయ్య, కోడలు సరళ కలిసి లక్ష్మీ కళ్లను దానం చేసేందుకు మందుకొచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్కుమార్, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ మంగళవారం రాత్రి కళ్లను సేకరించారు. మరణంలోనూ అంధుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు లక్ష్మీ కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శులు కుమారస్వామి, లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు శంకర్ రావు, వేణుమాధవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ దళపతి తదితరులున్నారు. -
బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్
హసన్పర్తి: బంజారాల సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక తీజ్ అని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. గోపాలపురంలోని బంజారా సేవాసమితి ఆధ్వర్యంలో బాలాజీనగర్లో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, పండుగలు ప్రత్యేకతను చాటుతాయన్నారు. సేవా లాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీని సత్కరించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, పీఆర్టీయూ నాయకులు తిరుపతిరెడ్డి, ఈదునూరి రవీందర్రెడ్డి, పి.శ్రీహరి, మహేందర్, కామిడి సతీ శ్రెడ్డి, పరిపూర్ణచారి, బిల్లా రఘునాథ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సుధాకర్, సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రామెల్ నాయక్, రాజారామ్ నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
ప్రయోగశాలలను సద్వినియోగం చేసుకోవాలి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సూచించారు. ఖిలా వరంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునీకరించిన ప్రయోగశాలను డీఐఈఓ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల కళాశాలల్లో ప్రయోగశాలల నవీకరణకు నిధులు మంజూరు చేసిందని, ల్యాబ్లను వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పుష్పలత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంకుమార్, అడ్వకేట్ జీవన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’.. మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పోలీస్ పోస్టింగుల్లో తీవ్ర చర్చ మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలుఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టిజోన్–1 పరిధిలోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. -
పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించండి
సంగెం: పరిహారం అందించిన తర్వాతనే విజయవాడ–నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు ప్రారంభించాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన రైతులు నాల్లం సూరయ్య, నాల్లం సాంబయ్య, ఫారం కుమారస్వామి తదితర రైతులు మాట్లాడుతూ పనులు అడ్డుకుంటే తమపైనే కేసులు పెడతామని అధికారులు బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాదాబైనామాలో ఉన్నామని, పట్టాలున్న రైతులకే పరిహారం చెల్లించారని పేర్కొన్నారు. పట్టా ఉంటేనే పరిహారం చెల్లిస్తామని తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి భూమి తక్కువగా పోగా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించారని, ఎక్కువ భూమి పోయినవారికి తక్కువగా చెల్లించారని తెలిపారు. ఒక్కో రైతుకు వాస్తవంగా పోతున్న భూమి ఎంత, పరిహారం అందింది ఎంత అనేది బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. పట్టాలు లేవనే కారణంతో తాతాల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములకు పైసా చెల్లించలేదని, పరిహారం ఇవ్వకుండా పనులు చేయవద్దని కోరారు. భూములు కోల్పోయిన రైతులకు కాకుండా బినామీలకు పరిహారం చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి గ్రీన్ఫీల్డ్ హైవేలో కోల్పోతున్న భూముల లెక్కలు తేల్చాలని, అర్హులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూనిర్వాసిత రైతుల డిమాండ్ సంగెం మండల కేంద్రంలో నిలిచిపోయిన నిర్మాణం -
జనవరిలో పనులకు శ్రీకారం
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ‘మామునూరు ఎయిర్పోర్ట్’కు ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడనుంది. ఇప్పటికే కార్యాలయం, అభివృద్ధి పనుల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.496.86 కోట్లతో అంచనాలు వేసింది. విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.203.49 కోట్లతో పిలిచిన టెండర్ పనులు జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఏఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కేంద్రం కీలకపాత్రపై చర్చ జరిగేలా చేసి, అనుకూలంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతోందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా పీఎం మిత్ర కింద ఎంపిక చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు దశల వారీగా విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రధాని మోదీ స్పీచ్లో చర్చకు వచ్చేలా చూసి, వరంగల్ నగర ఓటరు నాడిని పట్టుకోవాలనుకుంటోంది. స్మార్ట్సిటీ నిధుల విషయమై కూడా చర్చ పెట్టడం ద్వారా వరంగల్ నగర అభివృద్ధిలో కేంద్రం మార్క్ ఉందనడం ద్వారా పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరం వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే సమయంలోనే తమకు లాభించే అవకాశముందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఏదిఏమైనా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ ప్రభావాన్ని చూపాలనుకుంటోంది. విమానాశ్రయ నిర్మాణం కోసం భూమి సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓన్ చేసుకోవడంలో విఫలమవుతుండడం కూడా బీజేపీకి ప్లస్గా మారిందనే చర్చ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్లో కుమ్ములాటలు లాభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏఏఐ ఏం చేయనుందంటే.. ఈనెల 18న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్లు ఇప్పటికే జూన్లో పిలిచిన టెండర్ నోట్లో పేర్కొన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సాగుతోంది. జనవరిలో ఈ నిర్మాణ పనులు మొదలై 15 నెలల్లో పూర్తి చేసే అవకాశముంది. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ భూమి పూజకు ఏఏఐ సన్నాహాలు గ్రేటర్ ఎన్నికల వేళ భూమిపూజతో వరంగల్లో చర్చ పీఎంమిత్ర టెక్స్టైల్ పార్కు, స్మార్ట్సిటీ అభివృద్ధిపై కూడా ప్రచారం -
ఇక లెక్క పక్కా!
హన్మకొండ: సన్న రకం వరి వంగడాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సన్నరకాలు సాగు చేసిన రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంది. ఈక్రమంలో వానాకాలం సాగు నుంచి విత్తనాల కొనుగోలు, నారు పోసుకునే, నాటు వేస్తున్న సమయంలో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి సాగు చేసే రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తోంది. ఈక్రమంలో ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రాధాన్య సన్న రకాలను సాగు చేయాలని, ఆ వివరాలను వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఆన్లైన్ లేదా ఈ–క్రాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది. విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం వివరాలను ఆనన్లైన్లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. నమోదు తప్పనిసరి.. విత్తనాలు విక్రయించిన క్రమంలో సంబంధిత డీలర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం డీలర్లకు లాగిన్ సౌకర్యం కల్పించింది. సొంతగా విత్తనోత్పత్తి చేసి సాగు చేసిన రైతులు, తెలిసిన వారి నుంచి సేకరించి సాగు చేసిన వారు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ఇతర మార్గాల్లో సన్న రకాల వరి వంగడాలు సేకరించి వరి సాగు చేస్తున్న రైతులకు ఆన్లైన్లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కల్పించింది. సన్న రకాల వరి సాగు చేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ)ని కలిసి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, సాగు వివరాలు అందించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువు విధించింది. ఆన్లైన్తో వివరాలు సరిపోలితేనే బోనస్ చెల్లిస్తారు. ఆన్లైన్ నమోదు ద్వారా దుర్వినియోగం కాకుండా రైతులు బోనస్ పొందడానికి మార్గం సులువవుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక సన్నరకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలి. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్ఎం 7715, కెఎన్ఎం 1638, డబ్ల్యుజిఎల్44 వరి విత్తనాలు సాగు చేసుకున్న రైతులు వివరాలు నమోదు చేసుకుంటే బోనస్ పొందడానికి అర్హులవుతారు. పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం అమ్ముకునే సమయంలో ఆన్లైన్లో ఏ విత్తనం సాగు చేశాలో సరి చూసుచూస్తారు.సన్నాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి విత్తన కొనుగోలు నుంచే ఆన్లైన్లో నమోదు సొంత విత్తనాలు సాగు చేసిన రైతుల వివరాల నమోదుకు అవకాశం వచ్చేనెల 10లోపు ఆన్లైన్ చేయించుకోవాలి నమోదు కాని రైతులకు బోనస్ లేనట్లే! వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వంసన్న రకం వరి వంగడాలు సాగు చేసిన రైతులు తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. డీలర్ల వద్ద కాకుండా ఇతర మార్గాల్లో సన్న రకం విత్తనాలు సేకరించి వరి సాగు చేసిన ప్రతీ రైతులు వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి త్వరగా.. వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం రైతు వారీగా వివరాలు సేకరిస్తోంది. వచ్చే నెల 10వ తేదీలోపు నమోదు పూర్తి చేయాలి. ఈఅవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – వి.విజయ్ చంద్ర, జిల్లా వ్యవసాయాధికారి -
పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
రాయపర్తి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానాలో చిన్నారుల వ్యాక్సినేషన్, మందుల నిల్వలు, సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు. వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్చార్జ్ని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, సర్పంచ్ గారె సహేంద్ర భిక్షపతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.అంబులెన్స్లో ప్రసవం చెన్నారావుపేట: అంబులెన్స్లో ఓ మహిళ సుఖప్రసవం అయ్యింది. 108 సిబ్బంది పైలట్ నాగరాజు కథనం ప్రకారం.. పాపయ్యపేట గ్రామానికి చెందిన పుప్పాల లావణ్య బుధవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. పైలట్ నాగరాజు, ఏటీఎం ప్రవీణ్ గ్రామానికి చేరుకున్నారు. లావణ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఏటీఎం ప్రవీణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేయించారు. లావణ్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సైతం 108 సిబ్బందిని అభినందించారు. ఇల్లందలో షార్ట్సర్క్యూట్ వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలో షార్ట్సర్క్యూట్తో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. సుమారు 50 ఇళ్లలో విద్యుత్ మీటర్లు, వైరింగ్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ప్రమాదంలో ప్రాణనష్టం నష్టం లేకున్నా ఆస్తి నష్టం జరిగి నట్లు తెలుస్తోంది. రహదారిపై అధిక లోడ్తో ప్రయాణించే వాహనాలు 11 కేవీ తీగలకు తగలడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. హన్మకొండ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ హనుమకొండ ఆధ్వర్యంలో మన గుడి శ్రావణ మాసోత్సవాల ప్రచార బ్యానర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు బుధవారం సాయంత్రం హనుమకొండలోని రెడ్డి కాలనీ లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బత్తిని వెంకటయ్య, అర్చకుడు కొండపాక శ్రీనివాసాచారి, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమ నిర్వాహకుడు రామిరెడ్డి కృష్ణమూర్తి ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 28న హనుమకొండ రెడ్డికాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో విదూషిమణి గుదిమెళ్ల హారావళి, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బి.శ్రీనివాసులురెడ్డిచే ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పాము నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బుధవారం రాత్రి పాము కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాల వద్ద ఒక గేటు, ఐపీ బ్లాక్ వద్ద మరో గేటు ఉంది. ఆ గేటు మూసివేయడంతో రోగులు వైద్య కళాశాల గేట్ నుంచి వస్తున్నారు. ఐపీ బ్లాక్ ఎదుట ఉన్న గేటు పక్కనే ఉన్న ప్రహరీకి నల్లాలను ఏర్పాటుచేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగి బంధువులు భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు నల్లాల వద్దకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పామును చంపేశారు. -
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. నిట్తో ఎంఓయూ..ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
‘మహాత్మా’.. మారేదెప్పుడు?
కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన వరంగల్ మహాత్మాగాంధీ ఆస్పత్రి (ఎంజీఎం)లో రోగులకు తిప్పలు తప్పట్లేదు. వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సరైన వైద్యం అందట్లేదని వాపోతున్నారు. ఆస్పత్రిలోని పలు వార్డులను బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా.. అనేక సమస్యలు వెలుగుచూశాయి. బుధవారం పిల్లల వార్డులో సైలెన్ బాటిల్ను గోడకు వేలాడదీసి చికిత్స అందించారు. మరోవైపు ఓ చిన్నారికి పెట్టిన సైలెన్ బాటిల్ను తల్లి చేత్తో పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్ని కష్టాలకోర్చినా వార్డు సిబ్బందికి అంతో ఇంతో ముట్టజెప్పక తప్పట్లేదని వాపోతున్నారు. ఆర్థో, కార్డియాలజీ, డయాలసిస్ వార్డుతోపాటు సీఓటీలో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. ఆర్థ్ధోపెడిక్ విభాగంతోపాటు న్యూరో సర్జరీ విభాగంలో ప్రధాన శస్త్ర చికిత్సలను ఎప్పుడో నిలిపివేసినట్లు తెలుస్తోంది. రోగుల వెతలు ఇలా.. పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన ఓ రోగి రెండో అంతస్తులోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎక్స్రే అవసరం ఉందని వైద్యులు చెప్పారు. నర్సింగ్ సిబ్బంది సూచన మేరకు సదరు బాధితుడిని కింద ఉన్న రేడియాలజీ విభాగంలో ఎక్స్రే విభాగానికి తీసుకెళ్లాలి. 92వ నంబర్ గదిలో ఎక్స్రే తీయించడానికి స్ట్రెచర్పై పేషెంట్ను కుటుంబ సభ్యులే తీసుకెళ్లి తిరిగి వార్డుకు తీసుకొచ్చారు. ఈ విషయమై రోగి అటెండెంట్తో మాట్లాడగా.. ‘ఏం చేయాలి సార్, ఎక్స్రే కోసం తీసుకెళ్లడానికి ఎవరూ రావట్లేదు. మేమే కష్టాలు పడుతూ తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాం’ అంటూ వాపోయారు. పేషెంట్ను రోడ్డుపై వదిలేశారు.. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రోగుల అవసరాన్ని బట్టి టుడీ ఇకో కోసం ఆస్పత్రి అంబులెన్స్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురావాలి. బుధవారం శివనగర్కు చెందిన ఓ రోగికి సూపర్ ఆస్పత్రిలో టుడీ ఇకో చేయించి, ఎంజీఎం వద్ద రోడ్డుపై వదలేసి వెళ్లారు. దీంతో పేషెంట్ అటెండెంట్ గత్యంతరం లేక ఎండలో స్ట్రెచర్పై పడుకోబెట్టిన పేషెంట్ను తానే నెట్టుకుంటూ వార్డుకు తీసుకెళ్లాడు. దీనిపై అటెండెంట్ మాట్లాడుతూ.. ‘సర్కార్ దవాఖానలో ఇట్లా ఉంది. అంబులెన్స్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ రూ.50 తీసుకున్నారు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదని రోడ్డుపై వదిలేశారు’ అని తెలిపారు. రోగిని ఆర్థో వార్డుకు తీసుకెళ్తున్న అటెండెంట్ఎంజీఎంలో అడుగడుగునా రోగులకు కష్టాలు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల పట్టింపు కరువు ‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి..ఆపదలో ఆదుకునే 108 అంబులెన్స్లో తరచూ పేషెంట్లను అత్యవసర చికిత్స కోసం క్యాజువాలిటికి తీసుకొస్తారు. వాహనం నుంచి ఆస్పత్రిలో చేర్పించేందుకు ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పేషెంట్ కేర్, వార్డుబాయ్లు సహాయం చేయడానికి రారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఏ వార్డులో చూసినా సమస్యలు తాండవిస్తున్నట్లు రోగులే చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు నిత్యం ఓపీ సమయాల్లో రౌండ్లు వేయాలని, ప్రతీ వార్డుపై పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు. నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.. ఎంజీంఎం ఆస్పత్రి పేషంట్ల సేవల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటాం. అయితే క్యాజువాలిటీతో పాటు వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే వారి గురించి భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయాలి. 108 అంబులెన్స్లో చికిత్స కోసం తీసుకొచ్చే సిబ్బందితో పాటు ఎంజీఎం సిబ్బంది కూడా సహకరించి, సేవలందించాలి. పేషెంట్ల వద్ద నుంచి ఎవరు డబ్బులడిగినా సహించేది లేదు. పేషెంట్ల సేవలు మెరుగుపర్చడం, అసంపూర్తి పనులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తాం. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
మత సామరస్యం పెంపొందించాలి
ఖిలా వరంగల్: మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కుల, మత సామర్యాన్ని పెంపొందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతం, ఉర్సు కరీమాబాద్లోని హజరత్ మాషూక్ ఏ రబ్బానీ దర్గాలో పీఠాధిపతులు ఉబేద్బాబా, నవీద్బాబా ఆధ్వర్యంలో వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హాజరై మాషూక్ రబ్బానీ దర్గాను దర్శించుకునే భక్తులకు కోసం నిర్మించిన విశ్రాంతి గదులను ప్రారంభించారు. అనంతరం దర్గాను దర్శించుకుని ఖీర్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రజలందరిలో ప్రేమ, సోదరభావం, మానవతా దృక్పథాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నేత గోపాల నవీన్రాజు, ఎంఏ జబ్బార్, మహమ్మద్ ముక్దుమ్, నాగపూరి కల్పన, సంజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
జనవరిలో శ్రీకారం
ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు భూమి పూజకు ఏఏఐ సన్నాహాలుసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ మామునూరు ఎయిర్పోర్ట్కు ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడనుంది. ఇప్పటికే కార్యాలయం, అభివృద్ధి పనుల కోసం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.496.86 కోట్లతో అంచనాలు వేసింది. విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.203.49 కోట్లతో పిలిచిన టెండర్ పనులు జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఏఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కేంద్రం కీలకపాత్రపై చర్చ జరిగేలా చేసి, అనుకూలంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతోందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా పీఎంమిత్ర కింద ఎంపిక చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు దశల వారీగా విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రధాని మోదీ స్పీచ్లో చర్చకు వచ్చేలా చూసి, వరంగల్ నగర ఓటరు నాడీని పట్టుకోవాలనుకుంటోంది. స్మార్ట్సిటీ నిధుల విషయమై కూడా చర్చ పెట్టడం ద్వారా వరంగల్ నగర అభివృద్ధిలో కేంద్రం మార్క్ ఉందనడం ద్వారా పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగర వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే సమయంలోనే తమకు లాభించే అవకాశముందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఏదిఏమైనా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ ప్రభావాన్ని చూపాలనుకుంటోంది. విమానాశ్రయ నిర్మాణం కోసం భూమి సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీ దీనిని ఓన్ చేసుకోవడంలో విఫలమవుతుండడం కూడా బీజేపీకి ప్లస్గా మారిందనే చర్చ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్లో కుమ్మలాటలు లాభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏఏఐ ఏం చేయనుందంటే.. ఈనెల 18న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్లు ఇప్పటికే జూన్లో పిలిచిన టెండర్ నోట్లో పేర్కొన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సాగుతోంది. జనవరిలో ఈ నిర్మాణ పనులు మొదలై 15 నెలల్లో పూర్తి చేసే అవకాశముంది. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ భూమిపూజ.. వరంగల్లో చర్చ పీఎంమిత్ర టెక్స్టైల్ పార్కు, స్మార్ట్సిటీ అభివృద్ధిపై కూడా ప్రచారం -
మొక్కలు నాటి సంరక్షించాలి
కాళోజీ సెంటర్: ప్రతీఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం నగరంలోని రంగశాయిపేట, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా షూ, బ్యాగులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత నోట్ బుక్స్తో పాటు బ్యాగ్స్, షూస్ తదితర అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ అనే కార్యక్రమం కింద ప్రతిఒక్కరూ మొక్క నాటి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంపత్ కుమార్, సుజా త, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్ -
‘జలసిరి’ పనుల పరిశీలన
గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో జలసిరి కింద చేపడుతున్న పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గణేశ్ మంగళవారం పరిశీలించారు. కొమ్మాల, నందనాయక్తండా, విశ్వనాథపురం, గంగదేవిపల్లి గ్రామాల్లోని కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రూప్టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలను, కొత్తగా ముగ్గు పోసే పనులను పరిశీలించారు. ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దారు ఎండీ రియాజుద్దీన్, స్పెషల్ ఆఫీసర్ సురేశ్, ఈజీఎస్ ఏపీఓ చంద్రకాంత్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. టీబీఎస్ఎఫ్ బ్లాగ్ ఆవిష్కరణ కాళోజీ సెంటర్: తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం (టీబీఎస్ఎఫ్) జిల్లా శాఖ రూపొందించిన ఆన్లైన్ బ్లాగ్ను మంగళవారం డీఈఓ రంగయ్యనాయుడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పోర్టల్లో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఉన్నతమైన డిజిటల్ రిసోర్స్ సెంటర్గా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. బ్లాగ్ రూపకర్త గుమ్మడి రాజుతో పాటు ఫోరం చొరవను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి పి.సురేష్ బాబు, ఫోరం జిల్లా అధ్యక్షుడు చిప్ప పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి గోనెల రమేశ్, కోశాధికారి గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ముసాయిదా జాబితా విడుదల అనంతరం వివరాల్లో వ్యత్యాసాలు (అనామలీస్, అన్మ్యాపింగ్) విభాగాల కింద గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తంగా 1,94,399 మంది ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారులు నోటీసులు జనరేట్ చేశారు. ఇందులో 1,71,207 మంది ఓటర్లకు నోటీసులు అందించేందుకు ప్రింట్ తీసి సిద్ధం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో 51,880 ఓటర్లు, వరంగల్ తూర్పులో 75,755, వర్ధన్నపేటలో 66,764 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. ఇందులో మంగళవారం వరకు నర్సంపేటలో 207, వరంగల్ తూర్పులో 42, వర్ధన్నపేట నియోజకవర్గంలో 14 మంది ఓటర్లకు ఇప్పటికే నోటీసులు అందించారు. కాగా బీఎల్ఓల ద్వారా నోటీసులు అందుకున్న వారు గుర్తింపు పొందిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శిపై దాడి ఖానాపురం: పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ దాడి చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని బోటిమీదితండా పంచాయతీ కార్యదర్శిగా ఆవుల రవి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం విధులకు వెళ్తుండగా సర్పంచ్ భానుప్రసాద్ అకారణంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో సర్పంచ్ భానుప్రసాద్పై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్సై రామ్మోహన్, ఎంపీడీఓ అద్వైతలకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిరపసాగుపై అవగాహన దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామంలో జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మిరప పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త రాజుకుమార్ మాట్లాడారు. మిరప సాగులో మెళకువలు, నల్లతామర నివారణ పద్ధతులు, సేంద్రియ ఎరువుల వాడకంపై వివరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటల సాగువైపు రైతులు కదలాలని సూచించారు. కేవీకే మల్యాల శాస్త్రవేత్త మిరప పంటలో చీడపీడలు, తెగుళ్లు నివారణ పద్ధతులు, చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరించారు. అనంతరం 50 మంది రైతులకు అర్క తేజస్వి మిరప విత్తనాలు అందించారు. సర్పంచ్ మోడెం శ్రీలత, డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, పీఏసీ ఎస్ చైర్మన్ చెన్నూరి కిరణ్రెడ్డి, ఏఓ శ్యామ్, రైతులు పాల్గొన్నారు. -
వివాదంలో భూ వినియోగ మార్పు!
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో భూముల వినియోగ మార్పు (ల్యాండ్ యూజ్ చేంజ్) వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది. పట్టణ పరిధిలోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు 16,438 చదరపు గజాల భూ వినియోగాన్ని మార్చాలని మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన తేవడంపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అక్రమమా..సక్రమమా! పూర్తి వివరాలు తెలియజేసే వరకు ఆమోదించొద్దని బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కమిషనర్కు డీసెంట్ నోటీసు అందించారు. దీంతో సందిగ్ధత నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన ఐలుప్ మ్యాప్ ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఈ మార్పు ఉందని, ఇది పట్టణ భవిష్యత్ ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుతో భవిష్యత్లో రోడ్లు, పార్కులు, డ్రెయినేజీలు, ఓపెన్ స్పేస్లకు కేటాయించాల్సిన స్థలాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. సమీప ప్రాంత ప్రజలపై, ట్రాఫిక్, తాగునీరు, మౌలిక వసతులపై పడే భారం గురించి ఎలాంటి నివేదికను కౌన్సిల్ సమావేశంలో పేర్కొనలేదన్నారు. దీనికి సంబంధించిన మ్యాపులు, టెక్నికల్ రిపోర్టులు, అధికారుల అభిప్రాయాలు కౌన్సిలర్లకు ఇవ్వకుండా హడావుడిగా తీర్మానం చేయాలని చూడడం వెనుక అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజా ప్రయోజనాల కోసమా.. లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అనే అనుమానాలు కమిషనర్కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. ఇప్పటికై నా ఈ భూ వినియోగ మార్పుపై టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల నుంచి పూర్తి సాంకేతిక నివేదిక తెప్పించి, పారదర్శకంగా వ్యవహారించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతర పత్రాన్ని అందించారు. ఈ విషయంపై అధికార పార్టీ కౌన్సిలర్లు, అధికారులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే. సర్వే నంబర్లు ఇవే..కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కోసం ప్రవేశపెట్టిన సర్వే నంబర్లు 719/1, 722/1, 722/2, 722/1/3, 738/1, 738/2,/1/2, 738/2/2, 739/1/2, 739/2/1/1/2, 739/2/2లో ఉన్న భూములను ఐలుప్ మ్యాప్లో ఉన్న ప్రస్తుత కేటగిరీ నుంచి వేరే కేటగిరీకి మార్చేందుకు ప్రవేశపెట్టారు. నర్సంపేట కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం కమిషనర్కు డీసెంట్ నోటీసు అందజేత -
టీపీసీసీ చీఫ్కు చేరిన క్రమశిక్షణ సంఘం నివేదిక మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక.. ‘కొండా’ శిబిరంలో కలకలం.. కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయడం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు ఒకే సమయంలో.. రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.అసలు టార్గెట్ ఎవరు? ఓరుగల్లులో ఉత్కంఠ ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివాదానికి ఫుల్స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం వరంగల్కు వచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు. డ్రైవర్ సహా నలుగురు అరెస్టు.. నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు.. హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు -
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
వరంగల్ లీగల్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ వి.బి నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదనం బిల్డింగ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 12న (శనివారం) జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, భూ తగాదాలు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, వివాహ, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్, చెక్ బౌన్స్, విద్యుత్, చిట్ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తదితర కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ న్యాయవాదులతో కలిసి కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సెప్టెంబర్ 12న లోక్ అదాలత్ -
రేపు గ్రామ, వార్డు సభలు
న్యూశాయంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామ, వార్డుల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో బీఎల్ఓలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలను ప్రజల ముందు ప్రదర్శించి తప్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారన్నారు. ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించి అర్హతలేని పేర్లు జాబితాలో ఉంటే బీఎల్ఓలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కరించాలి పెండింగ్ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పరకాల: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా వెల్లంపల్లి గ్రామం, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రజలు విద్యార్థులు, అధ్యాపకులు వనమహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, తహసీల్దార్ టి.విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంతోష్కుమార్, ఇన్చార్జ్ కమిషనర్ సీహెచ్ గిరిబాబు, టీఓ డి.రాము, శానిటేషన్ అధికారి జి.వెంకట్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె దశరథం, పసుల లావణ్య, గూడెల్లి సదన్కుమార్, బండి శ్రీధర్, బొచ్చు సుభద్ర, పాలకుర్తి శ్రీనివాస్, సుదమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వనమహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
టీపీసీసీ చీఫ్కు చేరిన క్రమశిక్షణ సంఘం నివేదిక మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక.. ‘కొండా’ శిబిరంలో కలకలం.. కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయ డం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు ఒకే సమయంలో.. రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.అసలు టార్గెట్ ఎవరు? ఓరుగల్లులో ఉత్కంఠ ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివా దానికి ఫుల్స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం వరంగల్కు వచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు. డ్రైవర్ సహా నలుగురి అరెస్టు.. నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు.. హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు -
ఉండేదెవరు.. పోయేదెవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితాలో ఉండేదెవరు? పోయేదెవరు? అన్నది తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా జాబితాలో గుర్తించిన వివిధ కేటగిరీల ఓటర్లపై రేపటి (27వ తేదీ) నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే గుర్తించిన అస్పష్ట వివరాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారి నుంచి వివరణ తీసుకుని, అవసరమైన ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాలో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తొలగించాలి? అనేది అధికారులు నిర్ణయించనున్నారు. జూన్ 10 నాటికి ఉమ్మడి వరంగల్లో 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టు 17 నాటి ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 26,77,498కు తగ్గింది. అంటే 3,75,740 ఓట్లు.. 12.30 శాతం తగ్గాయి. నోటీసులు.. విచారణ.. తేలేదెవరు.. ఓటర్లకు నోటీసులు జారీ చేసి.. వారు అదే చిరునామాలో నివసిస్తున్నారా? ఓటరుగా కొనసాగేందుకు అర్హత ఉందా? ఇప్పటికే మరోచోట ఓటరుగా నమోదయ్యారా? అని అధికారులు ఈనెల 27 నుంచి విచారణ చేయనున్నారు. శాశ్వతంగా తరలివెళ్లినట్లు గుర్తించిన వారి విషయంలో చిరునామా, ప్రస్తుత నివాసం తదితర వివరాలను పరిశీలించనున్నారు. చనిపోయినవారి వివరా లను సంబంధిత రికార్డులతో సరిపోల్చనున్నారు. ఆన్ ట్రెసబుల్/ఆబ్సెంట్ కేటగిరీలో ఉన్నవారి విషయంలో క్షేత్రస్థాయి విచారణ కీలకం కానుంది. మరోవైపు జాబితాలో కొనసాగుతున్నప్పటికీ అనామలీస్ ఉన్నట్లు గుర్తించిన ఓటర్లపైనా విచారణ జరగనుంది. ఉమ్మడి వరంగల్లో ఇలాంటి వారు 4,83,803 మంది ఉన్నారు. అలాగే 1,61,935 మంది ఓటర్లకు నో మ్యాపింగ్ ఉన్నట్లు గుర్తించారు. మరోచోట ఇప్పటికే ఓటరుగా నమోదైన 47,177 మంది కూడా కీలక కేటగిరీలో ఉన్నారు. సంబంధిత ఆధారాలు, చిరునామా, ఓటరు వివరాలు పరిశీలించిన తర్వాతే వీరిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అప్పీల్కు ప్రత్యేక సెల్.. సెప్టెంబర్ 20 నాటికి ప్రక్రియ పూర్తి.. తమ పేరు తొలగించే అవకాశం ఉందని భావించే వారు, అధికారుల నిర్ణయంపై అభ్యంతరం ఉన్నవారు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లు వినియోగించుకోవచ్చు. కాగా, నోటీసులు, విచారణ, అభ్యంతరాలు, అప్పీళ్ల ప్రక్రియను సెప్టెంబర్ 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం తుది జాబితా రూపకల్పన దిశగా ముందుకు వెళ్లనున్నారు. తుది జాబితాతోనే అసలు లెక్క ప్రస్తుతం ఉన్నవి ముసాయిదా జాబితా గణాంకాలు మాత్రమే. విచారణలో అర్హత నిర్ధారణ అయితే కొందరు ఓటర్లు తుది జాబితాలో తిరిగి చేరవచ్చు. సరైన ఆధారాలు లేకపోవడం, మర ణం, శాశ్వత వలస, డూప్లికేట్ నమోదు తదితరాలు నిర్ధారణ అయితే మరికొందరి పేర్లు తొలగిపోవచ్చు. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న 3.75 లక్షల తగ్గింపు తుది సంఖ్య కాదు. విచారణ, నోటీసులు, క్లెయిమ్లు–అభ్యంతరాలు, అప్పీళ్ల తర్వాతే ఉమ్మడి వరంగల్లో తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈనెల 27 నుంచి జరిగే విచారణతో ఈ ప్రశ్నకు సమాధానం మొదలు కానుంది. సెప్టెంబర్ 20 నాటికి పూర్తయ్యే ప్రక్రియతో వివిధ కేటగిరీల్లోని ఓటర్లలో ఎవరు జాబితాలో ఉంటారు? ఎవరి పేర్లు తొలగుతాయి? అన్నదానిపై స్పష్టత రానుంది. చనిపోయింది 79,275తగ్గిన ఓటర్లు 3,75,740వలసవెళ్లింది 2,34,122ఆన్ట్రెసబుల్ 14,362ఇతర కేటగిరీ 804మరోచోట నమోదు 47,177 అనామలీస్, డూప్లికేట్, వలస ఓటర్లు, ఆన్ట్రెసబుల్కు నోటీసులు రేపటి నుంచి అధికారుల విచారణ -
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్పర్సన్ వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదనం బిల్డింగ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 12న (శనివారం) జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ న్యాయవాదులతో కలిసి కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న హన్మకొండ కల్చరల్: జానపద సాహిత్య అధ్యయనానికి ప్రత్యేక గౌరవం లభించిందని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆచార్య గడ్డం వెంకన్న అన్నారు. 2025 సంవత్సరానికి జానపద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు ప్రదానం చేసే జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారానికి జిల్లాలోని తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాసని సురేశ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హంటర్రోడ్డులోని విజ్ఞానపీఠంలో జరిగిన కార్యక్రమంలో పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది సురేశ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, డాక్టర్ గంపా సతీశ్, పరిశోధకుడు సోనబోయిన సతీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒకరి నేత్రదానం.. ఇద్దరికి కంటి చూపు
కాశిబుగ్గ: మనిషి మరణించాక నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు వస్తుందని ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవిశేఖర్ అన్నారు. వరంగల్లోని కంటి దవాఖానలో మంగళవారం 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే మరో ఇద్దరికి కంటి వెలుగు వస్తుందని తెలిపారు. రెండు వారాల పాటు నేత్రదానంపై అవగాహన కల్పించనున్టన్లు పేర్కొన్నారు. వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలో నేత్రదానం ఆవశ్యకతపై పలు కార్యక్రమాలు చేపడుతామని ఆయన వివరించారు. వైద్యులు హరిదేవ్, చంద్రభాను, అర్చన, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట/కాశిబుగ్గ/హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాజీపేట, ములుగురోడ్డులోని హనుమకొండ ఐటీఐల ప్రిన్సిపాళ్లు పొన్నాల వేణు, సురేందర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. విద్యార్థులు iti. telangana.gov.inలో సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంబంధిత కళాశాలలకు హాజరై ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాళ్లు కోరారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీగా బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రిని నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన వై.వెంకయ్య నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శాస్త్రి బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా, బీఓఎస్గా, ఫారిన్రిలేషన్స్ ఆఫీసర్గా, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెల్లోగా కొనసాగుతున్నారు. వీసీ ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఆయన ఉత్తర్వుల కాపీ అందుకున్నారు. హన్మకొండ అర్బన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ డీఆర్డీఓ రిసోర్స్పర్సన్ సంగ సంతోష్కు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలశాఖ అవార్డు లభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. శ్రీప్రియకు సేవానంది పురస్కారంఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్త శ్రీప్రియకు నందిసేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన గ్లోబల్ కల్చరల్, యోగా, విద్యా ఫౌండేషన్ బాధ్యులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఎస్ఏ1, ఎస్ఏ2, ప్రీఫైనల్ పరీక్షల కోసం 9, 10 తరగతుల విద్యార్థుల నుంచి రూ.110కి బదులు రూ.150 ఫీజు వసూలు వసూలు చేశారని టీయూటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నూతనకంటి బాబు మంగళవారం డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ను సాక్షి వివరణ కోరగా విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాలి
నెక్కొండ: డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయభాస్కర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో నిర్వహిస్తున్న డిజటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి మొదలైన సర్వేలో నమోదైన పంటల సాగు వివరాల ఆధారంగా కొనుగోలుకు వివరాలు ఉపయోగపడుతాయన్నారు. ఎల్నీనో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించారు. రాబోయే రోజు ల్లో సోయాబీన్ పంట విస్తీర్ణం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఏఈఓలు వసంత, అఖిల్, అరుణ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని డీఏఓ, మండల ప్రత్యేక అధికారి విజయభా స్కర్ అన్నారు. మండలంలోని నెక్కొండ తండా ప రిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఆవరణలో మంగళవారం వన మహోత్సవంలో భాగంగా పలువురితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నెక్కొ ండ పీఏసీఎస్ చైర్మన్ చల్లా శ్రీపాల్రెడ్డి, స్థానిక ఏ ఎంసీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, ఎంపీడీఓ యాసం లావణ్య, ఏపీఓ జాకబ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఏఓ విజయభాస్కర్ -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
సీపీ శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్న్.శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీలను రంగలీల మైదానం, హయగ్రీవాచారి మైదానాల్లో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ హసన్పర్తి చెరువు కట్ట వద్ద రోడ్డు విస్తరణ పూర్తయినందున డివైడర్లు ఏర్పాటు చేయాలని, పోతననగర్లో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సూచించారు. మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్లు ఎన్..రవి, శేషాద్రి, గ్రేటర్ కమిషనర్ వెంకన్న, ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కుడా సీపీఓ అజిత్రెడ్డి ఉన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పలు శాఖల అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇంకా మొదలుకాని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీఓ భవనాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. మళ్లీ వారం రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్చార్జ్) శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రావు, డీఈలు శ్రీనివాసరావు, రాజ గోపాల్, శిరీష, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాధాన్యతా క్రమంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
న్యూశాయంపేట: రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట బిట్స్ కాలేజీలో నీట్ పీజీ పరీక్ష కేంద్రంలో 132 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకు సంబంధిత అధికా రులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. వీసీలో కలెక్టర్తో పాటు డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఇన్చార్జ్ పర్యాటక శాఖా ధికారి విజయభాస్కర్, జిల్లా పరిశ్రమల అధి కారి నరసింహామూర్తి, తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు -
ఆరు లేన్లతో... మరింత వేగం!
సాక్షి, వరంగల్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి... రెండు నగరాల మధ్య రాకపోకలకు కీలకమైన కారిడార్. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. నగరాల చుట్టూ జనా భా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మార్గంపై రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు లేన్లుగా ఉన్న రహదారిని భ విష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా వి స్తరించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు నిర్ణయించారు. ప్రస్తు తం హైదరాబాద్–యాదగిరిగుట్ట సెక్షన్లో 35.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెన్సీ టెండర్ పిలిచింది. ఇదీ వరంగల్కు పరోక్ష ప్రయోజనం.. నాలుగు లేన్ల రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఓవర్ టేకింగ్, లేన్ మార్పులు, జంక్షన్ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరు లేన్లుగా విస్తరిస్తే వాహనాలకు అదనపు లేన్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా రద్దీని మెరుగ్గా ని ర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలనుంచి యాదగిరిగుట్ట, జనగామ, వరంగల్ వైపు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయోజనం కలగవచ్చు. హైదరాబాద్– యాదగిరి భాగం ఆరు లేన్లుగా అభివృద్ధి చెందితే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వచ్చే మొత్తం కారిడార్ సామర్థ్యం పెంచే దిశలో ఇది ఒక ముఖ్యమైన కీలక అడుగుగా మారనుంది. పారిశ్రామిక ప్రాంతాలకు సరకు రవాణా, వ్యాపార వాహనాల రాకపోకలు, అంతర్నగర ప్రయాణా లకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడానికి దోహదపడే అవకాశం ఉంది. హైదరాబాద్–వరంగల్ కారిడార్కు పెరగనున్న సామర్థ్యం హైదరాబాద్–యాదగిరిగుట్ట వరకు 35.65 కి.మీ. విస్తరణకు డీపీఆర్ టెండర్ రాబోయే రోజుల్లో యాదగిరిగుట్టనుంచి వరంగల్ రహదారి విస్తరణకు చాన్స్ -
ఆరు లేన్లతో... మరింత వేగం!
సాక్షి, వరంగల్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి... రెండు నగరాల మధ్య రాకపోకలకు కీలకమైన కారిడార్. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. నగరాల చుట్టూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మార్గంపై రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు లేన్లుగా ఉన్న రహదారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా విస్తరించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్–యాదగిరిగుట్ట సెక్షన్లో 35.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెన్సీ టెండర్ పిలిచింది. ఇదీ వరంగల్కు పరోక్ష ప్రయోజనం.. నాలుగు లేన్ల రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఓవర్ టేకింగ్, లేన్ మార్పులు, జంక్షన్ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరు లేన్లుగా విస్తరిస్తే వాహనాలకు అదనపు లేన్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా రద్దీని మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలనుంచి యాదగిరిగుట్ట, జనగామ, వరంగల్ వైపు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయోజనం కలగవచ్చు. హైదరాబాద్– యాదగిరి భాగం ఆరు లేన్లుగా అభివృద్ధి చెందితే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వచ్చే మొత్తం కారిడార్ సామర్థ్యం పెంచే దిశలో ఇది ఒక ముఖ్యమైన కీలక అడుగుగా మారనుంది. పారిశ్రామిక ప్రాంతాలకు సరకు రవాణా, వ్యాపార వాహనాల రాకపోకలు, అంతర్నగర ప్రయాణాలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడానికి దోహదపడే అవకాశం ఉంది. భవిష్యత్లోనూ యాదగిరి నుంచి వరంగల్ రహదారి కూడా ఆరు లేన్ల విస్తరణకు అవకాశముంది. హైదరాబాద్–వరంగల్ కారిడార్కు పెరగనున్న సామర్థ్యం హైదరాబాద్–యాదగిరిగుట్ట వరకు 35.65 కి.మీ. విస్తరణకు డీపీఆర్ టెండర్ రాబోయే రోజుల్లో యాదగిరిగుట్టనుంచి వరంగల్ రహదారి విస్తరణకు చాన్స్ -
చక్కెర చేదు!
● కిలో రూ.40 నుంచి ఏకంగా రూ.75కు పెరిగిన ధర ● ఆందోళనలో వినియోగదారులు సాక్షి, వరంగల్: తీపిని పంచే చక్కెర ధర ఇప్పుడు చేదు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో రూ.40కి లభించిన పంచదార.. ప్రస్తుతం కొన్ని స్థానిక కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.75 వరకు ధర పలుకుతోంది. ఒక్కసారిగా అమాంతం పెరిగిన ధరతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్లు, పిండి వంటల్లో నిత్యావసరంగా మారిన చక్కెర ధర పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. వరంగల్ జిల్లాలో నెలకు దాదాపు 1,500 టన్నుల విక్రయాలు జరుగుతుండడంతో ఇప్పటివరకు రూ.6 కోట్లు హోల్సేల్ వ్యాపారం జరిగితే ఇప్పుడు పెరిగిన ధరలతో ఏకంగా రూ.11.25 కోట్లు అవుతోంది. సంవత్సరానికి ఏకంగా రూ.135 కోట్లవుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ ధర రూ.60 దాటగా.. మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో రూ.75 నుంచి 80 వరకు చేరాయి. వరంగల్ నగరంలో డెలివరీకి అందుబాటులో ఉన్న కొన్ని ఆన్లైన్ లిస్టింగ్లో కిలో చక్కెర రూ.60 నుంచి 72 మధ్య ఉంటోంది. స్థానిక దుకాణాల్లో రూ.70 నుంచి 75కు విక్రయిస్తుండగా.. ఆన్లైన్లో ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.60 నుంచి రూ.66లోనే లభిస్తుండడంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి బడ్జెట్పై ప్రభావం చక్కెర వినియోగం ప్రతి ఇంట్లో తప్పనిసరి కావడంతో ధర పెరుగుదల నేరుగా కుటుంబ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా టీ, కాఫీ ఎక్కువగా తీసుకునే కుటుంబాలతో పాటు స్వీట్లు, బేకరీ పదార్థాల తయారీదారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగితే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ధరలపైనా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలి – రమ, గృహిణి, వరంగల్ -
ఆవరణంతా.. అడుగుకో గుంత!
● అధ్వానంగా హనుమకొండ బస్స్టేషన్ ● నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందులుహైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల తర్వాత అంతే రద్దీ హనుమకొండ బస్స్టేషన్లో ఉంటుంది. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వందల బస్సులు వివిధ రూట్లలో ప్రయాణిస్తాయి. కానీ, ఈ బస్ స్టేషన్లో అడుగుపెట్టాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. బస్స్టేషన్ ఆవరణ గుంతలమయంగా మారింది. చిన్న వర్షం పడినా గుంతల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమలు ముసురుతున్నాయి. బస్సు ఎక్కాలన్నా.. దిగాలన్నా ప్రయాణికుల నరకం చూస్తున్నారు. అడుగుకో గుంతతో బస్సులు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
బావిలో పడిన నక్క
● కాపాడిన వన్యప్రాణుల సంరక్షణ బృందం ● జూపార్కుకు తరలింపు భీమదేవరపల్లి: మండలంలోని రాంనగర్లో ప్రమాదవశాత్తు నీళ్లు లేని వ్యవసాయ బావిలో పడిన ఓ నక్కను అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. స్థానిక రైతు కనకం వెంకటేశ్ సోమవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా.. అందులో నక్క కనిపించింది. రాత్రి సమయంలో ఆహారం కోసం తిరుగుతూ అది ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటుందని గుర్తించిన రైతు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్కతుర్తి బీట్ ఆఫీసర్ సురేశ్తో పాటు వన్యప్రాణుల సంరక్షణ బృంద సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బావిలోకి దిగి చాకచక్యంగా నక్కను సురక్షితంగా బయటకు తీశారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం దాన్ని ప్రత్యేక వాహనంలో హనుమకొండ జూపార్క్కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో సమాచారం అందించిన రైతును అధికారులు అభినందించారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయవాదులు, కక్షిదారులకు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత పిలుపునిచ్చారు. రాజీపడదగు క్రిమి నల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్పై ఎలాంటి సలహాలు, సందేహాలు, సూచనలకు హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలని కోరారు. లోక్ అదాలత్లో భాగంగా హనుమకొండ కోర్టులో 9, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. జిల్లాలో మోస్తరు వర్షం హన్మకొండ: హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు జిల్లాలో సగటున 13.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ధర్మసాగర్లో 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐనవోలులో 40.1 మిల్లీమీటర్లు, కాజీపేటలో 24.6, హనుమకొండలో 13.5, దామెరలో 11.8, వేలేరులో 10.6, భీమదేవరపల్లిలో 9.6, ఎల్కతుర్తిలో 7.1, కమలాపూర్లో 1.6, హసన్పర్తిలో 4.2, పరకాలలో 6, ఆత్మకూరులో 6.1, శాయంపేటలో 5, నడికూడలో 3.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూలిన పాఠశాల ప్రహరీధర్మసాగర్: మండల కేంద్రంలోని(పెద్దబడి) బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ వర్షాల ధాటికి కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నానుతూ బలహీనపడడంతో ఒక భాగం పూర్తిగా నేలమట్టమైంది. గోడ కూలిపోవడంతో పాఠశాల ఆవరణకు రక్షణ కరువై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనతో పాఠశాల భద్రత ప్రమాదంలో పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా మారిన మిగిలిన గోడలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, కూలిన స్థానంలో కొత్త కాంపౌండ్ గోడను అత్యవసరంగా నిర్మించాలని కోరుతున్నారు. వరంగల్ స్పోర్ట్స్: మరమ్మతుల కారణంగా సుమారు ఏడాది పాటు మూతపడిన హనుమకొండలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియాన్ని ఈనెల 29న పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ ప్రశాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదు హసన్పర్తి: హాస్టల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్పై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో విధులు నిర్విహిస్తున్న వార్డెన్ కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చిన నిలదీశారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖిలా వరంగల్: మద్యం మత్తులో ఉన్న టీజీఎస్సీ కానిస్టేబుల్ను చితకబాదిన మిల్స్కాలనీ బీట్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు మరింత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. -
నామిలేట్ పదవులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరి కొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొ చ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. 47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణి మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు మా పేర్లు పరిశీలించండి..ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. -
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన
పరకాల: పాలిటెక్నిక్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పరకాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు అంబేడ్కర్ కూడలిలో మహాధర్నా నిర్వహించారు. ఈధర్నాతో గంటసేపు వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ధర్నా విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఏబీవీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈధర్నాను ఉద్దేశించి ఏబీవీపీ పరకాల కార్యదర్శి బాల్సుకూరి కార్తీక్ మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులకు న్యాయం జరిగే వరకు ఏబీవీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మంగళవారం (నేడు) నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త పాలిటెక్నిక్ కళాశాలల బంద్ను విజయవంతం చేయలని పిలుపునిచ్చారు. ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు ఆకుతోట భానుప్రసాద్రావు, భాషబోయిన జశ్వంత్, భరణి, గౌతమ్, అభి, అజయ్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ–26 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీసీపీ దారా కవిత, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి చర్యలు జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్) మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్పాయ్ తెలిపారు. సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... జిల్లాలో ఎస్ఐఆర్లో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న 1.32 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి అధికారులు సమయానికి హాజరు కావాలని, కారుణ్య నియామకాల భర్తీకి శాఖల వారీగా వివరాలు అందించాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి వన మహోత్సవం ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
తండ్రే.. కూతుర్ని కడతేర్చమన్నాడు..
● మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ● తండ్రి సూచనతోనే కూతురు మానసను చంపిన వినోద్కుమార్ ● వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డిఎల్కతుర్తి : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద ఇటీవల కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు తన మోచెయ్యితో సదరు మహిళను గొంతు నొక్కిపట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడెల్లి వినోద్కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తండ్రి సమ్మిరెడ్డి ఉద్యోగ రీత్యా గోదావరిఖనిలో ఉండడంతో వినోద్కుమార్ అక్కడే ఉంటున్నాడు. గోదావరిఖనికి చెందిన అంకతి మానస(35) తనకు చిన్నప్పటినుంచే స్నేహితురాలు కావడంతో ఆమెతో స్నేహంగా ఉంటున్నాడు. కాగా, మానసకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులయ్యాయి. అప్పటినుంచి మానసను తమవద్దే ఉండమని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకపోయేది. పైగా వారినే ఇబ్బందులకు గురిచేసేది. దీంతో మానస తండ్రి రాజేశం.. నిందితుడు వినోద్కుమార్తో కలిసి మానసను ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఈక్రమంలో మానస ఈనెల 16న అరుణాచలం వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. తర్వా తి రోజు తల్లిదండ్రులకు ఫోన్చేసి తాను వినోద్కుమార్తో కరీంనగర్లోని తన రూమ్లో ఉన్నానని చెప్పింది. 18వ తేదీ తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు వినోద్కుమార్ను అడిగింది. దీనికి పెళ్లి అవసరం ఏమొచ్చిందని వినోద్ కుమార్ పే ర్కొనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం వినోద్కుమార్ మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో రాజేశం ‘అది (కూతురు) భూమి మీద బతికి ఉంటే మమ్మల్ని, నిన్ను ఇబ్బందులకు గురిచేస్తది. దాన్ని ఏదో ఒకటి చేసి.. మాకు బాధలేకుండా చెయ్యి’ అని చెప్పడంతో నిందితుడు వినోద్కుమార్.. మానసను మోచెయ్యితో గొంతు నొక్కిపట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి ఎల్కతుర్తి మండల కేంద్రానికి వచ్చి వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ క్రమంలో కారు నుంచి దుర్వాసన వస్తోందనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు డిక్కీ తెరవగా మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈనెల 21న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 23న ఎల్కతుర్తి గ్రామ శివారులోని నాగార్జున సీడ్స్ ప్లాంట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ హత్య కరీంనగర్లో జరిగిన నేపథ్యంలో మానస తండ్రిని మరో నిందితుడిగా భావిస్తూ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్స్టేషన్కు కేసు అప్పగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన సీఐ పులి రమేశ్, ఎస్సై నర్సింహారావు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సీఐ, ఎస్సై, సిబ్బంది విఠల్రావు, భాస్కర్రెడ్డి, బక్కయ్య, సుమన్, నిరంజన్, మోహన్బాబు, రాంలాల్, నీరజ్ పాల్గొన్నారు. -
‘మీ ప్రమాణం’ యాప్ షురూ
కాశిబుగ్గ: ఇకపై వేళాపాళా లేకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి చెక్ పడనుంది. కొందరు అధికారులతో పాటు సిబ్బంది సైతం ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఇక రావు. ఆన్లైన్ పర్యవేక్షణ ద్వారా సిబ్బంది వివరాలు తక్షణమే తెలిసిపోనుంది. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రమాణం యాప్ ఉపయోగపడనుంది. ఎంజీఎంలో సోమవారం నుంచి ‘మీ ప్రమాణం యాప్’ అమల్లోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది దాదాపు 1200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వీరంతా తమకు కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్లో ఫేస్ రికగ్నేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్స్ కావాలన్నా ఈ యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా, సెలవులు పెట్టినా నిబంధనల ప్రకారం సాలరీ కట్ చేయనున్నట్లు సమాచారం. ఎంజీఎం సిబ్బంది ఆలస్యానికి చెక్ పారదర్శకంగా విధులు -
అభివృద్ధికి సహకరించండి
● సీఎంను కలిసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం ధర్మసాగర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కాగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారని వారు తెలిపారు. -
61 ప్యాకెట్లు.. రూ.64 లక్షలు
సాక్షి, వరంగల్: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో గంజాయి తరలిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను వరంగల్ – ఖమ్మం హైవేలోని వర్ధన్నపేటలో వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ (ఈగల్ ఫోర్స్) పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో సుమారు రూ.64.66 లక్షల విలువ చేసే 129.334 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వరంగల్ నార్కొటిక్ పోలీసు స్టేషన్ డీఎస్పీ పి.రమేష్ కుమార్ మీడియాకు సోమవారం వెల్లడించారు. కేరళకు చెందిన సాయుజ్ సీఎస్, బెసలెల్ సి. మాథ్యూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కేరళలో ఓనం పండుగ ఉందని వెళ్లేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కావాలనడంతో వారి స్నేహితుడు కారు బుక్ చేశాడు. వారు బెంగళూరు నుంచి సెల్ఫ్డ్రైవ్ కారులో బయలుదేరి రాజమండ్రి మీదుగా ఒడిశాలోని చిత్రకొండ, దారకొండ ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ విక్కీ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి, వరంగల్ మీదుగా బెంగళూరుకు తరలించి, అక్కడి నుంచి కేరళకు తీసుకెళ్లి సూత్రధారి అజిత్ కుమార్కు ఇచ్చేందుకు వారు ట్రాన్స్పోర్టర్లుగా ఈ రవాణా మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక్క ట్రిప్పుకే రూ.40 నుంచి రూ.50 వేలు వస్తాయని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కారు వెనుక సీట్ల కింద 61 ప్యాకెట్లు గంజాయి అక్రమ రవాణాపై ఆదివారం అందిన విశ్వసనీయ సమాచారంతో ఈగల్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ కె.కుమారస్వామి నేతృత్వంలోని వర్ధన్నపేటలో వాహన తనిఖీలను సిబ్బంది చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న టీఆర్ 05 జీ 0275 నంబర్ గల మారుతి కారును ఆపి తనిఖీ చేశారు. కారు వెనుక భాగంలోని సీట్ల కింద దాచిన 61 ప్యాకెట్లను గుర్తించి, వాటిలో మొత్తం 129.334 కిలోల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన విక్కీ గంజాయి సరఫరా చేయగా, సూత్రధారి అజిత్ కుమార్ రవాణా వ్యవహారాన్ని సమన్వయం చేశాడు. వారిద్దరు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. గతంలోనూ కేసులు అరెస్టయిన ఇద్దరు నిందితులపై గతంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ గంజాయి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.11/2026గా ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్లు 8(సీ) రెడ్విత్ 20(బీ)(టూ)(సీ), 27(బీ), 27ఏ, 29 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన ఇద్దరిని రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న అజిత్, విక్కీతో పాటు గంజాయి సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. వర్ధన్నపేటలో 129.334 కిలోల గంజాయి స్వాధీనం సెల్ఫ్ డ్రైవింగ్ కారులో తరలిస్తుండగా పట్టివేత ఇద్దరు కేరళ డ్రైవర్ల అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన వరంగల్ నార్కొటిక్ డీఎస్పీ రమేష్ కుమార్ -
నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించండి
ధర్మసాగర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కాగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారని వారు తెలిపారు. పాకాలలో కనిపించిన గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ ఖానాపురం: మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ పక్షి దర్శనమిచ్చింది. అనేక రకాల పక్షులకు నిలయమైన పాకాలలో చాలాకాలం తర్వాత ఈ గద్దజాతి పక్షి కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రధానంగా సరస్సులు, రిజర్వాయర్లు, నదులు, చిత్తడి నేలల సమీపంలో నివసిస్తుంది. దీని ప్రధాన ఆహారం చేపలు. నీటి ఉపరితలంపై ఈదుతున్న లేదా తేలుతున్న చేపలను గమనించి నీటి మీదికి వేగంగా దూసుకువచ్చి తన కాళ్లతో బలంగా ఒడిసిపడుతుంది. అప్పుడప్పుడు ఉభయచరాలు, జంతు కళేబరాలను కూడా తింటుంది. నీటి ఒడ్డున ఉండే పెద్ద చెట్లకొమ్మలపై గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చొని వేట కోసం నిరీక్షిస్తుంది. దీనిని బేస్క్యాంప్ సిబ్బంది ప్రకాశ్ తన కెమెరాలో బంధించారు. ‘మీ ప్రమాణం’ యాప్ షురూ కాశిబుగ్గ: ఇకపై వేళాపాళా లేకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి చెక్ పడనుంది. కొందరు అధికారులతో పాటు సిబ్బంది సైతం ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఇక రావు. ఆన్లైన్ పర్యవేక్షణ ద్వారా సిబ్బంది వివరాలు తక్షణమే తెలిసిపోనుంది. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రమాణం యాప్ ఉపయోగపడనుంది. ఎంజీఎంలో సోమవారం నుంచి ‘మీ ప్రమాణం యాప్’ అమల్లోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది దాదాపు 1200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వీరంతా తమకు కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్లో ఫేస్ రికగ్నేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్స్ కావాలన్నా ఈ యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా, సెలవులు పెట్టినా నిబంధనల ప్రకారం సాలరీ కట్ చేయనున్నట్లు సమాచారం. విద్యావకాశాలు కల్పించేందుకు చర్యలు కాళోజీ సెంటర్: ‘టాస్’ అడ్మిషన్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తిచేసి అర్హత గల ప్రతీ అభ్యర్థికి విద్యావకాశాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం సూచించారు. టాస్ అడ్మిషన్ల ప్రక్రియపై మండల సమాఖ్య డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిషన్, ఆన్లైన్ నమోదు విధానం, అవసరమైన పత్రాల అప్లోడ్, అడ్మిషన్లు సమర్థవంతంగా పూర్తిచేసే విధానంపై సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఏపీఎం రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల టాస్ / ఉల్లాస్ కోఆర్డినేటర్లు నాగేశ్వర్రావు, చల్లా రాజిరెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026●ఇల్లు: నలుగురున్న కుటుంబం నెలకు 4 కిలోల చక్కెర వినియోగిస్తే రూ.300. పాత ధర రూ.40 అయితే రూ.160. నెలకు రూ.140 అదనపు భారం ●టీ దుకాణం: రోజుకు 5 కిలోలు వాడితే నెలకు 150 కిలోలు. రూ.75 ధరతో రూ.11,250. రూ.40 వద్ద రూ.6 వేలు. నెలకు రూ.5,250 అదనపు ఖర్చు ●స్వీట్ షాప్: రోజుకు 20 కిలోలు వాడితే నెలకు 600 కిలోలు. రూ.75 వద్ద రూ.45 వేలు పాత ధరతో రూ.24 వేలు. నెలకు రూ.21 వేల అదనపు భారం వాతావరణం జిల్లాలో ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సాధారణ వర్షం కురవనుంది. సాయంత్రం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. వరంగల్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ మీదుగా అమృత్భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాక్షి, వరంగల్: తీపిని పంచే చక్కెర ధర ఇప్పుడు చేదు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో రూ.40కి లభించిన పంచదార.. ప్రస్తుతం కొన్ని స్థానిక కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.75 వరకు ధర పలుకుతోంది. ఒక్కసారిగా అమాంతం పెరిగిన ధరతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్లు, పిండి వంటల్లో నిత్యావసరంగా మారిన చక్కెర ధర పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. జిల్లాలో నెలకు దాదాపు 1,500 టన్నుల విక్రయాలు జరుగుతుండడంతో ఇప్పటివరకు రూ.6 కోట్లు హోల్సేల్ వ్యాపారం జరిగితే ఇప్పుడు పెరిగిన ధరలతో ఏకంగా రూ.11.25 కోట్లు అవుతోంది. సంవత్సరానికి ఏకంగా రూ.135 కోట్లవుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పంట తగ్గుదల.. నిల్వల ప్రభావం పంచదార ధరల పెరుగుదల వరంగల్కే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా ధరలు గణనీయంగా పెరిగాయి. జూలైలో కిలోకు సుమారు రూ.48 వద్ద ఉన్న ధర ఆగస్టు 20 నాటికి సగటున రూ.55.70కు చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ ధర రూ.60 దాటగా.. మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో రూ.75 నుంచి 80 వరకు చేరాయి. చెరుకు పంటపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం, ఉత్పత్తి అంచనాలు తగ్గడం, రాబోయే పండుగల నేపథ్యంలో డిమాండ్ పెరగడం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికి తోడు మార్కెట్లో ఊహాగానాలు, నిల్వలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దేశంలో చక్కెర కొరత లేదని భారత చక్కెర మిల్లుల సంఘం స్పష్టం చేస్తున్నా ఒక్కసారిగా పెరిగిన ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో కాస్త తక్కువే.. ఈ సమయంలో ఆన్లైన్ మార్కెట్లో బ్రాండ్, ప్యాక్ పరిమాణాన్ని బట్టి ధరల్లో తేడా కనిపిస్తోంది. వరంగల్ డెలివరీకి అందుబాటులో ఉన్న కొన్ని ఆన్లైన్ లిస్టింగ్లో కిలో చక్కెర రూ.60 నుంచి 72 మధ్య ఉంటోంది. స్థానిక దుకాణాల్లో రూ.70 నుంచి 75కు విక్రయిస్తుండగా.. ఆన్లైన్లో ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.60 నుంచి రూ.66లోనే లభిస్తుండడంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. చక్కెర చేదు!ఇదీ లెక్క..కిలో రూ.40 నుంచి ఏకంగా రూ.75కు పెరిగిన ధర ఆందోళనలో వినియోగదారులు నిత్యావసరాల్లో ఒకటి కావడంతో తప్పని భారం జిల్లాలో నెలకు 1,500 టన్నులకుపైగా వినియోగం -
భూమిని ఆక్రమించి వేధిస్తున్నాడు
నాకు ఇద్దరు కుమారులు. నాకున్న 4.15 గుంటల వ్యవసాయ భూమిని నా పెద్ద కుమారుడు ఆక్రమించాడు. నాకు మంద బుద్ధి గల కుమార్తె కూడా ఉంది. మా బాగోగులను వారు చూడడం లేదు. ఈ క్రమంలో బతకడం కష్టంగా ఉంది. ఈ విషయమై ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చినా న్యాయం జరగడం లేదు. – ఏ.రాజమ్మ, మహ్మదాపురం, దుగ్గొండి నా ఉద్యోగం ఇచ్చా.. బాగోగులు చూడడం లేదు నాకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు. నేను ముప్పై ఏళ్ల క్రితం వలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నా కుమారుడికి ఉద్యోగం పెట్టించా. ఆయన మా బాగోగులు చూడడం లేదు. ఇదేంటని అడిగితే గొడవకు దిగుతున్నాడు. మాకు ఇంకా పెళ్లికాని కుమార్తె కూడా ఉంది. – ఎస్.లక్ష్మయ్య, పర్వతగిరి -
విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు
● డీఐఈఓ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. నగరంలోని కృష్ణాకాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా షూ, బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అనూహ్యమైన సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఉచిత నోట్ బుక్స్తో పాటు బ్యాగులు, షూస్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని మొత్తం 2,704 విద్యార్థులకు త్వరలో యూనిఫాం కూడా అందుబాటులోకి రానుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నామి‘లేట్’ పదవులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరి కొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొ చ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. 47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణిమా పేర్లు పరిశీలించండి..ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు -
ప్రజావాణికి ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్కు 145 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 42, జీడబ్ల్యూఎంసీ 26, హౌసింగ్ 14, డీఆర్డీఓ 14, ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థ్య కలెక్టరేట్లో ప్రతి సోమవారం అరగంట ముందు (ఉదయం 10గంటలు) ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాతో పాటు మండలాల పరిధిలో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల పరిధిలో ప్రజావాణి నిర్వహిస్తుండంతో జిల్లాలో నిర్వహించే గ్రీవెన్స్ వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
మధ్యాహ్న భోజనంలో ప్రమాణాలు పాటించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నగరంలోని మట్టెవాడలో ప్రభుత్వ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం రుచి, శుచిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ భోజన తయారీ నుంచి విద్యార్థులకు వడ్డించే వరకు ప్రతి దశలోనూ పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. భోజన పథకం నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వన మహోత్సవ లక్ష్యాలను పూర్తిచేయాలి న్యూశాయంపేట: వన మహోత్సవ లక్ష్యాలను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. మంగళవారం అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్, డీఎఫ్ఓ నిఖిత, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘టోసా–ఓయాసిస్కా’
హన్మకొండ అర్బన్: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్కాన్(తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్న్స్ అసోసియేషన్–ఆర్థోపెడిక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్న్స్)–2026 ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్న్అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అల్వాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. -
లలితాదేవికి ప్రత్యేక అలంకరణ
శ్రావణ మాసం, మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆదివారం వరంగల్ శివనగర్లోని శ్రీసీరామచంద్రస్వామి దేవాలయంలో శ్రీలలితాదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వెంకటేశ్వర్లచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 160 చీరలతో శ్రీలలితాదేవిని అలంకరించి పూజలు నిర్వహించారు. చీరలతో అలంకరణలో ఉన్న శ్రీలలితాదేవిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంచాల కృష్ణమూర్తి, శ్రీరాం రాజేశ్, అడెపు శ్యామ్, కుడికాల సుధాకర్, వీరస్వామి, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. – ఖిలా వరంగల్ -
సాధారణ వర్షపాతమే..
న్యూశాయంపేట: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాధారణ వర్షపాతం నమోదైంది. సగటున 9.6 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. జిల్లాలోని వరంగల్ నగరంలో 38.0 మిల్లీ మీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కాగా, ఖిలా వరంగల్ మండలంలో 19.6 మి.మీ, నర్సంపేట (3.4), ఖానాపురం (7.2), చెన్నారావుపేట (11.4), సంగెం (6.8), వర్ధన్నపేట (3.8), రాయపర్తి (4.6), పర్వతగిరి (3.8), నెక్కొండ (8.2), గీసుకొండ (14.2), దుగ్గొండి (2.4), నల్లబెల్లిలో 1.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండల ధాటికి ఎండిపోతున్న పత్తి, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణవాయువులా పనిచేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
పత్తిదే పైచేయి
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు.. ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనా లను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. పెరిగిన పప్పుధాన్యాల సాగు.. పప్పుధాన్యాల సాగు భారీగా పెరగడం ఈసారి మరో ఆసక్తికర పరిణామం. సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే 387.29 శాతం ఎక్కువగా సాగైంది. మహబూబాబాద్లో సాధారణ అంచనా 4,696 ఎకరాలు కాగా.. 23,815 ఎకరాల్లో సాగు చేశారు. వరంగల్లో 1,355 ఎకరాల అంచనాకు 11,742 ఎకరాల్లో, భూపాలపల్లిలో 352 ఎకరాల అంచనాకు గాను 9,670 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. జనగామలో 7,777 ఎకరాల అంచనాకు 11,059 ఎకరాల్లో సాగు నమోదైంది. తక్కువ నీటితో సాగు, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతులు పప్పుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరిసాగు 66.88 శాతం మాత్రమే సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. అధిక నీటి అవసరం ఉండే వరి సాగు.. వర్షపాతం లోటు నెలకొన్న ప్రాంతాల్లో కొంత మందగించింది. మానుకోట ముందంజ.. భూపాలపల్లి టాప్ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు ఉంది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గువర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 430.1 మిల్లీమీటర్లు కాగా.. నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు నమోదైంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 547.8 మిల్లీమీటర్లకు 298.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 45.5 శాతం లోటు నమోదైంది. వరంగల్లో 43.1 శాతం, జనగామలో 43.2 శాతం, మహబూబాబాద్లో 30.8 శాతం లోటు ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరుసగా 8.5, 7.9 శాతం స్వల్ప లోటు ఉన్నా.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. మహబూబాబాద్లో 6.02 మీటర్లు, వరంగల్లో 6.65, ములుగులో 7.11, హనుమకొండలో 7.71, జనగామలో 9.14 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూపాలపల్లిలో మాత్రం భూగర్భజల మట్టం 11.98 మీటర్ల లోతున చేరడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. అవగాహనతో పంటల మార్పువర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ -
పత్తిదే పైచేయి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. వరి సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. మానుకోట ముందంజ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు నిలిచింది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు -
‘సూపర్’లో నెలకొకరు!
కాశిబుగ్గ: హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నెలకొకరు చొప్పున ఇన్చార్జ్ అధికారి (హెచ్ఓడీ) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ కలిసి హాస్పిటల్ వైద్యసేవలు, పాలనను పర్యవేక్షించేవారు. ఇంతవరకు పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు బదిలీపై వెళ్లిపోవడంతో రెండు నెలల నుంచి ఈ బాధ్యత తీసుకోవడానికి సీనియర్ వైద్యులు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి సూపర్ హాస్పిటల్లో సీనియర్గా ఉన్న ప్రొఫెసర్ను డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించే అధికారం ఎంజీఎం సూపరింటెండెంట్కు ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్గా ఉన్న రాంకుమార్రెడ్డి సూపర్ స్పెషాలిటీలో సీనియర్ వైద్యులు డిప్యూటీగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ వైద్యులెవరూ.. ముందుకు రాకపోవడంతో రొటేషన్ పద్ధతిపై పరిపాలనా బాధ్యతలు తీసుకునేందుకు వారి సీనియార్టీ ప్రకారం నెలకు ఒకరు చొప్పున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ విభాగాల హెచ్ఓడీలు తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు సూపర్ హాస్పిటల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవాలని ఆదేశించారు. పాలన గాడిన పడేనా? ఇప్పటికే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్లో వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందించే హాస్పిటల్లో పరిపాలనా బాధ్యత చూడడం కత్తిమీద సాములా ఉంటుందనే విమర్శలున్నాయి. ఇందులో రోగుల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం భారమైనప్పటికీ గతంలో రెగ్యులర్ డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ ఉంటూ నెట్టుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ లేకపోవడంతో భారమంతా ఆర్ఎంఓపై పడుతోంది. ఇక నూతన ఉత్వర్వుల ప్రకారం నెలకు ఒకరు చొప్పున సీనియర్ వైద్యులు ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకుంటే పరిపాలన గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల తిరిగే సరికి బాధ్యత తీసుకున్న హెచ్ఓడీ గడువు కాలం ముగస్తుంది. మళ్లీ కొత్త డాక్టర్ వచ్చి బాధ్యత తీసుకుంటే వారికి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. శాశ్వతంగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తేనే రోగుల సేవలు, అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది. న్యూరాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ ఎన్.మాధవరావు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు. కార్డియాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ సి.మమతారెడ్డి అక్టోబర్ 1 నుంచి 31 వరకు. సీటీవీఎస్ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ బి.సర్తాజ్ హుస్సేన్ నవంబర్ 1 నుంచి 30 వరకు. యూరాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సంతోశ్ డిసెంబర్ 1 నుంచి 31 వరకు. నెఫ్రాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ చాడ రమేశ్ జనవరి 1, 2027 నుంచి 31 వరకు. పిడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఇన్చార్జ్ అధికారిగా విధులు రోగులకు మెరుగైన వైద్యం, అడ్మినిస్ట్రేషన్ బాగు పడేదెలా? -
రైతు బీమాను రెన్యువల్ చేయాలి
రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచే రైతు బీమాను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలి. బీమా గడువు ముగియడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. రైతుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే బీమా రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హులైన ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కొనసాగించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. సోమిడి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రైతు సంఘం రైతుబీమా పునరుద్ధరణ, దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో ఆగస్టు 13 నాటికి దరఖాస్తుల స్వీకరించి, పాతవాటిని పునరుద్ధరణ చేశాం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే రైతుబీమా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
హన్మకొండ: విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ విమర్శించారు. హనుమకొండ నయీంనగర్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ధర్మ టీచర్స్ యూనిట్ రాష్ట్ర విద్యాసదస్సు బ్రోచర్ను వడ్లకొండ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ టీచర్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మ టీచర్ యూనిట్ రాష్ట్ర కోకన్వీనర్ దామెర ఉపేందర్ మాట్లాడుతూ ఈసదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలు విద్యారంగానికి తమ బడ్జెట్లో అధిక కేటాయింపులు జరుపుతుంటే, మన ప్రభుత్వాలు విద్యారంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో సమాజం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మేధావులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ -
కల్లెడలో చదరంగ పోటీలు
పర్వతగిరి: మండలంలోని కల్లెడలోని వనిత అచ్యుతపాయి జూనియర్ కళాశాలలో చెస్ నెట్వర్క్, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కల్లెడ చదరంగం పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 220 మంది 7నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన పోటీలు ఆరు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చదరంగంపై ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన టోర్నమెంట్ విజేతలకు ఆర్డీఎఫ్ వ్యవస్థాపకుడు కల్లెడ రామ్మోహన్రావు రూ.72 వేల విలువగల బహుమతులను అందించారు. చెస్ నెట్వర్క్ అధ్యక్షుడు సంజయ్, జనరల్ సెక్రటరీ హరితో పాటు ప్రతినిధులు రాజన్న, ఐతా శ్రీనివాస్, అశోక్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనిత అచ్యుతపాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్ధన్, పీఈటీలు, పీడీలు పోటీల నిర్వహణలో పాల్గొని క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి డాక్టర్ పొన్నాల రామయ్య, డాక్టర్ సోమన్న ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. చీఫ్ ఆర్బిటర్గా రజనీకాంత్ వ్యవహరించారు. -
ముగిసిన ‘టోసా–ఓయాసిస్కా’
హన్మకొండ అర్బన్: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్కాన్(తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్–ఆర్థోపెడిక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్)–2026 ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అల్వాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయం, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేవెన్స్లో అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గేటర్ గ్రీవెన్స్.. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూజీఎం) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హనుమకొండ కలెక్టరేట్లో..హన్మకొండ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సౌత్జోన్ పారా త్రోబాల్లో రమాదేవికి స్వర్ణం పర్వతగిరి: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈనెల 22న జరిగిన సౌత్ జోన్ పారా త్రోబాల్ ఛాంపియన్ పోటీల్లో పోకల రమాదేవి పాల్గొని ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన రమాదేవి పుట్టుకతో వచ్చిన వైకల్యం తన లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపించింది. తన భర్త పోకల శ్రీశైలం సహకారంతో పారా త్రోబాల్లో క్రమం తప్పకుండా సాధన చేస్తూ కోచ్ సింగారపు బాబు శిక్షణలో తన ప్రతిభను రమాదేవి మెరుగుపర్చుకుంది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. కాజీపేట రైల్వే సీసీసీగా మౌలాషరీఫ్ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం చీఫ్ క్రూ కంట్రోలర్ (సీసీసీ)గా ఎండీ మౌలాషరీఫ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కాజీపేట సీసీసీగా పనిచేస్తున్న సాంబశివుడిని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఆన్లైన్ విధులకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కాజీపేట రైల్వే డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మౌలాషరీఫ్ను అధికారులు కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి సీసీసీగా బదిలీ చేశారు. కాగా, మౌలాషరీఫ్ గతంలో కాజీపేట, డోర్నకల్ సీసీసీ పనిచేశారు. బోటు షికారు గోవిందరావుపేట: లక్నవరం సరస్సు ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. సరస్సు అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు బోటు షికారుతో పాటు జిప్లైన్ పై సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ ఉన్న పచ్చని కొండలు, నీటి అందాలను ఆస్వాదిస్తూ బోటులో షికారు చేశారు. లక్నవరం సరస్సు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందడంతో పాటు బోటింగ్, సస్పెన్షన్ బ్రిడ్జి, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి చూస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు. రామప్పలో సండే సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్లోని అటవీశాఖలో శిక్షణ పొందుతున్న బీట్ ఆఫీసర్లు దేవాలయానికి చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతజీ గైడ్ వెంకటేశ్ వివరించగా శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. -
జిల్లాలో సాధారణ వర్షపాతం
న్యూశాయంపేట: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాధారణ వర్షపాతం నమోదైంది. సగటున 9.6 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. జిల్లాలోని వరంగల్ నగరంలో 38.0 మిల్లీ మీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కాగా, ఖిలా వరంగల్ మండలంలో 19.6 మి.మీ, నర్సంపేట (3.4), ఖానాపురం (7.2), చెన్నారావుపేట (11.4), సంగెం (6.8), వర్ధన్నపేట (3.8), రాయపర్తి (4.6), పర్వతగిరి (3.8), నెక్కొండ (8.2), గీసుకొండ (14.2), దుగ్గొండి (2.4), నల్లబెల్లిలో 1.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండల ధాటికి ఎండిపోతున్న పత్తి, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణవాయువులా పనిచేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. -
వరంగల్
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించని ప్రభుత్వం●● ఈనెల 13న ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువుఖిలా వరంగల్: రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకొని రైతుబీమా పథకం (ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం)ను ప్రారంభించింది. నాటి నుంచి రైతులు ఏ కారణంతోనైనా మరణించినా బీమా సంస్థ క్లెయిమ్ను పరిష్కరించి, రూ.5 లక్షల బీమా మొత్తాన్ని నామినీ ఖాతాలో జమ చేసే బాధ్యతను అప్పగించింది. ఈ పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారికి వర్తింపజేసింది. ప్రతి ఆగస్టు నెలలో ప్రభుత్వం అర్హులైన రైతుల బీమా ప్రీమియం సొమ్మును చెల్లించి పాలసీని పునరుద్ధరింపజేస్తూ వచ్చింది. ఏటా ఆగస్టులో కొత్త దరఖాస్తుల స్వీకరణ, పాత వాటి పునరుద్ధరణ చేపట్టింది. కానీ, ఈసారి ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.5 లక్షల ఆర్థిక సాయం.. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న రైతులు బీమా కలిగి మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఈ పథకం కింద అందజేస్తారు. రైతులకు కనీసం గుంట భూమి, పట్టాపాసు పుస్తకం ఉండాలి. సర్కారు ఒక్కో రైతుకు ఏటా రూ. 2,271 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పునరుద్ధరణపై కరువైన స్పష్టత.. ప్రభుత్వం గతేడాది పాలసీ ప్రీమియంను ఆగస్టు 14న చెల్లించింది. ఆ గడువు ఈనెల 13 అర్ధరాత్రితో ముగిసింది. బీమా పునరుద్ధరణకు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం సొమ్ము చెల్లించలేదు. దీంతో బీమా పునరుద్ధరణ, పథకం కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మరణించిన కొంతమంది రైతుల కుటుంబాలకూ పాలసీ మొత్తం సొమ్ము అందలేదు. ఈనేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈపథకాన్ని రద్దు చేసినా, లేదా మార్పులు చేర్పులు చేసినా తమ డబ్బులు వస్తాయోలేదోనని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు. కరువు వేళ ‘ఆయిల్పామ్’ జోరు ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిపడా కురవక కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయిల్పామ్ సాగు జోరందుకుంది. -
‘సూపర్’లో నెలకొకరు!
కాశిబుగ్గ: హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నెలకొకరు చొప్పున ఇన్చార్జ్ అధికారి (హెచ్ఓడీ) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ కలిసి హాస్పిటల్ వైద్యసేవలు, పాలనను పర్యవేక్షించేవారు. ఇంతవరకు పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు బదిలీపై వెళ్లిపోవడంతో రెండు నెలల నుంచి ఈ బాధ్యత తీసుకోవడానికి సీనియర్ వైద్యులు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి సూపర్ హాస్పిటల్లో సీనియర్గా ఉన్న ప్రొఫెసర్ను డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించే అధికారం ఎంజీఎం సూపరింటెండెంట్కు ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్గా ఉన్న రాంకుమార్రెడ్డి సూపర్ స్పెషాలిటీలో సీనియర్ వైద్యులు డిప్యూటీగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ వైద్యులెవరూ.. ముందుకు రాకపోవడంతో రొటేషన్ పద్ధతిపై పరిపాలనా బాధ్యతలు తీసుకునేందుకు వారి సీనియార్టీ ప్రకారం నెలకు ఒకరు చొప్పున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ విభాగాల హెచ్ఓడీలు తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు సూపర్ హాస్పిటల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవాలని ఆదేశించారు. పాలన గాడిన పడేనా? ఇప్పటికే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్లో వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందించే హాస్పిటల్లో పరిపాలనా బాధ్యత చూడడం కత్తిమీద సాములా ఉంటుందనే విమర్శలున్నాయి. ఇందులో రోగుల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం భారమైనప్పటికీ గతంలో రెగ్యులర్ డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ ఉంటూ నెట్టుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ లేకపోవడంతో భారమంతా ఆర్ఎంఓపై పడుతోంది. ఇక నూతన ఉత్వర్వుల ప్రకారం నెలకు ఒకరు చొప్పున సీనియర్ వైద్యులు ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకుంటే పరిపాలన గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల తిరిగే సరికి బాధ్యత తీసుకున్న హెచ్ఓడీ గడువు కాలం ముగస్తుంది. మళ్లీ కొత్త డాక్టర్ వచ్చి బాధ్యత తీసుకుంటే వారికి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. శాశ్వతంగా ఉండేలా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తేనే రోగులకు సేవలు, అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది. న్యూరాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ ఎన్.మాధవరావు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు. కార్డియాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ సి.మమతారెడ్డి అక్టోబర్ 1 నుంచి 31 వరకు. సీటీవీఎస్ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ బి.సర్తాజ్ హుస్సేన్ నవంబర్ 1 నుంచి 30 వరకు. యూరాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సంతోశ్ డిసెంబర్ 1 నుంచి 31 వరకు. నెఫ్రాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ చాడ రమేశ్ జనవరి 1, 2027 నుంచి 31 వరకు. పిడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఇన్చార్జ్ అధికారిగా విధులు రోగులకు మెరుగైన వైద్యం, అడ్మినిస్ట్రేషన్ బాగు పడేదెలా? -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణ చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురవనున్నాయి. లలితాదేవికి ప్రత్యేక అలంకరణశ్రావణ మాసం, మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆదివారం వరంగల్ శివనగర్లోని శ్రీసీరామచంద్రస్వామి దేవా లయంలో శ్రీలలితాదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వెంకటేశ్వర్లచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 160 చీరలతో శ్రీలలితాదేవిని అలంకరించి పూజలు నిర్వహించారు. చీరలతో అలంకరణలో ఉన్న శ్రీలలితాదేవిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంచాల కృష్ణమూర్తి, శ్రీరాం రాజేశ్, అడెపు శ్యామ్, కుడికాల సుధాకర్, వీరస్వామి, సాంబయ్య పాల్గొన్నారు. – ఖిలా వరంగల్ -
పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్
విద్యారణ్యపురి: విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫామ్ అందలేదు. దీంతో హనుమకొండ జిల్లాలోని చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం యూనిఫామ్తో, లేనివారు సాధారణ దుస్తులతో పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈసారి యూనిఫామ్ మార్చడంతో ఆలస్యంగా జిల్లాకు క్లాత్ వచ్చింది. సెర్ప్–డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కుట్టు బాధ్యతలను అప్పగించారు. 332 పాఠశాలల్లో 14,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెప్మా ద్వారా 136 పాఠశాలల్లోని 13,487 మంది విద్యార్థుల కోసం సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు క్లాత్ అందించారు. ఈనెల 13 వరకు 5,787 మంది విద్యార్థులకు మొదటి జత స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21 వరకు మరికొన్ని పాఠశాలలకు పంపిణీ చేసినట్లు సమాచారం. కాజీపేట మండలంలో 35 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలకు కూడా మొదటి జత స్కూల్ యూనిఫామ్ రాలేదని ఎంఈఓ మనోజ్ తెలిపారు. ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయం పక్కనే ఉండే సుబేదారి ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్కు కూడా ఒక స్కూల్ యూనిఫామ్ అందించలేదు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ విద్యార్థులకు కూడా సరిపడా ఒక జత యూనిఫామ్ రాలేదు. ఆ స్కూల్లో 656 మంది విద్యార్థులు ఉన్నారు. 185 మంది బాలికల్లో 162 మందికి బాటమ్స్ వచ్చాయి. టాప్స్ రాలేదు. బాలురు 471 మంది ఉండగా, కొందరికి ఒక జత స్కూల్ యూనిఫామ్ రాలేదు. యూనిఫామ్ వచ్చిన తర్వాతే యూడైస్ ప్రకారం మిగిలిన విద్యార్థులకు అందజేస్తామని హెచ్ఎం పేర్కొంటున్నారు. నాణ్యత లేని క్లాత్ విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ క్లాత్ నాణ్యత లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతకాలం మన్నికగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కొలతల ప్రకారం స్టిచ్చింగ్ చేయగా.. అక్కడక్కడా ర్యాండమ్గా విద్యార్థుల సైజ్ను బట్టి స్టిచ్చింగ్ చేశారని సమాచారం. జిల్లాకు వచ్చిన షర్ట్స్ క్లాత్, బాలికల టాప్ క్లాత్ నాణ్యత విషయంపై తొలుత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. క్లాత్ సరఫరా చేసిన సంస్థ నుంచి ఒకరు వచ్చి పరిశీలించి ఒకటి అర మార్చారని తెలుస్తోంది. గతేడాది యూడైస్ ప్రకారమే క్లాత్ పంపిణీ.. గత విద్యాసంవత్సరం యూడైస్ ప్రకారమే పాఠశాలలకు యూనిఫామ్ క్లాత్ పంపిణీ చేశారు. దీంతో ఈవిద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెరిగింది. కొత్తగా వచ్చిన ఆయా విద్యార్థులకు ఇప్పట్లో స్కూల్ యూనిఫామ్ అందే పరిస్థితి లేదు. దీనిపైన రాష్ట్ర ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో రెండో జత యూనిఫామ్ క్లాత్ ఇటీవల రాగా, ఆయా సెల్ఫ్ హెల్ప్గ్రూపులకు అందించారు. అది స్టిచ్చింగ్ దశలోనే ఉంది. సాధారణ, గత సంవత్సరం దుస్తులతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు -
16 నుంచి బొజ్జా తారకం వర్ధంతి సభలు
● శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్నర్సంపేట: సెప్టెంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బొజ్జా తారకం పదో వర్ధంతి సభలను జయప్రదం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ముద్రించిన కరపత్రాలను ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు, మధ్య తరగతి పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజా ఉద్యమ నాయకుడిగా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రజల కోసం, ప్రజా హక్కుల సాధన కోసం అంకితం చేసిన గొప్ప ప్రజా నాయకుడని బొజ్జా తారకమని కొనియాడారు. ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 1995నుంచి 2010వరకు జరిగిన అక్రమాలపై ఆనాటి పాలక ప్రభుత్వాలను ప్రశ్నించారని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను బహిర్గతం చేయాలని, ఆ భూములను ప్రజలకు పంపిణీ చేయాలని ఆనాటి ముఖ్యమంత్రులను బొజ్జా తారకం నిలదీశారని గుర్తుచేశారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన తారకం ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వర రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల రవి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల పైడి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేష్ పాల్గొన్నారు. -
పిల్లకాకి మాటలు పట్టించుకోను..
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: పిల్లకాకి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని నడికూడ, ఆత్మకూరు, దామెర, పరకాల మండలాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదన్నారు. పరకాల నియోజకవర్గంలో 88,384 స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరకాల సభలో ప్రజలు చూపించిన అపూర్వమైన స్పందనను చూసి కొందరు ఓర్వలేక తన మీద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన పనితనం చూసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని కొందరు జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మరింత పట్టుదలతో పనిచేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక రాజిపేటలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతతోపాటు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. ప్రజలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్లు, కేసుల దర్యాప్తు, ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, దారా కవిత, రాజమహేందర్ నాయక్, కిషన్సింగ్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత -
90మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మర్నాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైర్హాజరుకు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈవిషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశాను.. నేను శుక్రవారం రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశా. మర్నాడు డ్యూటీకి రమ్మని అధికారులు చెప్పారు. తెల్లారేసరికి నన్ను తొలగించారని తెలిసింది. నా భర్తకు ప్రమాదం జరిగి ఇంటి వద్దనే ఉంటున్నాడు. నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితులున్నాయి. – అనూష, ఔట్సోర్సింగ్ కండక్టర్, హనుమకొండ డిపో ఏడాది కాలంగా చేస్తున్నా.. హైదరాబాద్లో హోమ్ లోన్స్లో పనిచేసే నేను.. ఆర్టీసీ ప్రభుత్వానిది కావడంతో రెగ్యులర్ అవుతుందని కండక్టర్ ఉద్యోగంలో చేరా. కాంట్రాక్టర్కు కొంత సొమ్ము కూడా ముట్టజెప్పా. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. మధ్యలోనే తొలగించడంతో మేం వీధిన పడే పరిస్థితి నెలకొంది. – ఐలయ్య, ఔట్సోర్సింగ్ కండక్టర్, నర్సంపేట డిపో వెట్టి చాకిరి చేయించుకున్నారు.. ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యో గం కోసం ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు కాంట్రాక్టర్కు చెల్లించారు. వీరికి నెలకు రూ.18వేల వేతనం ఇచ్చారు. ఏడాది పని చేస్తే వీరికి రూ.2,16,000 వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడినా భవిష్యత్లో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉద్యోగంలో చేరితే మధ్యలోనే తొలగించి అన్యాయం చేశారు. – గాదె మహేందర్, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్లో మొత్తం 274 మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేద్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
పనులు పూర్తవకపోతే ఓట్లడగను
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేలేరు: అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండల కేంద్రంలోని రైతువేదికలో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న గండి రిజర్వాయర్ పైప్లైన్ పనులు పూర్తిచేసి వచ్చే యాసంగి నాటికి మండలంలోని రైతులకు సాగునీరిస్తానని, నెలరోజుల్లో మండల కాంప్లెక్స్ల నిర్మాణం ప్రారంభించి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తానన్నారు. వేలేరు నుంచి కొమ్ముగుట్ట వరకు పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల పథకం ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయని, దసరా తర్వాత పనులు ప్రారంభించి వచ్చే మార్చి, ఏప్రిల్ వరకు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోమి, సర్పంచ్లు బిల్లా యాదగిరి, అశోక్, కిరణ్, మనోజ్, శ్రీనివాస్, అనిత, మానస, మౌనిక, రమాదేవి, సాంబయ్య, రాజు, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్: గౌరవెల్లి కాలువ, గ్రీన్న్ ఫీల్డ్ జాతీయ రహదారి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, సాగు నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులతో భూసేకరణ, పరిహారం చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో గౌరవెల్లి కాలువకు సేకరిస్తున్న భూముల్లో పెగ్ మార్కింగ్ పనులు సర్వేయర్లతో త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరకాల నియోజకవర్గంలోని గ్రీనన్ ఫీల్డ్ జాతీయ రహదారి, ఆర్ఓబీలకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వేను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయిలో విద్యాబోధనలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉత్తమ బోధనా పద్ధతులు అవలంబిస్తూ, విద్యార్థుల ప్రతిభావృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నవారు, సమాజంలో విద్యా చైతన్యానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 25 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండి తమ సేవలకు సంబంధించి ఆధారాలతో కూడిన ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా హెచ్ఎంల ద్వారా పంపాలని సూచించారు. ఎంఈఓలు, హెచ్ఎంలు పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాల్సిన గడువు ఈనెల 29 వరకు ఉందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5న అవార్డులు అందజేస్తామని తెలిపారు. కేయూ క్యాంపస్: నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులను, పరిశోధకులను కోరారు. కేయూలోని కంప్యూటర్ సెంటర్లో యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్ ఆధ్వర్యంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాప్ శనివారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న వారికి రిజిస్ట్రార్ రాంచంద్రం సర్టిఫికెట్లు అందించారు. వర్క్షాప్ డైరెక్టర్, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, అదనపు సంచాలకులు డాక్టర్ శాస్త్రి, పూణేకు చెందిన అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్ బాధ్యులు డాక్టర్ దీపక్ శర్మ, డాక్టర్ సచికేత్ జోషి, డాక్టర్ షంషేర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు వికసిత్ భారత్లో భాగస్వామ్యమే లక్ష్యంగా విద్యనభ్యసించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. క్యాంపస్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శనివారం 68వ బ్యాచ్ యూజీ విద్యార్థులకు ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై నూతన విద్యార్థులకు స్వాగతం పలికి మాట్లాడారు. క్యాంపస్లో అందుతున్న విద్య, వసతులు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీన్లు వెంకయ్యచౌదరి, కిరణ్కుమార్, ప్రొఫెసర్లు వాసు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ ఎన్ఐటీలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ‘శారీరక విద్య, క్రీడా విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు, బహుళ విభాగాల విధానాలు’ అంశంపై స్వల్పకాలిక శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్ఐటీ వరంగల్ వ్యాయామ విద్యా విభాగ ప్రొఫెసర్ రవికుమార్ చేతుల మీదుగా స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు అశోక్ కుమార్ ప్రశంసపత్రం అందుకున్నారు. అశోక్కుమార్ను సాట్ ఎండీ సోనీ బాలాదేవి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు. వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.పూజ పదోన్నతిపై శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ వరంగల్కు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా కార్యదర్శి పూజకు న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి ఎ.ప్రదీప్, సూపరింటెండెంట్ మోహన్రావు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హైమ పూజిత సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న హైమ పూజితను పదోన్నతిపై హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టునుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేద్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లుంది : రేవూరి
గీసుకొండ: ‘ఏనుగు పోతుంటే వెనుక కుక్కలు మొరిగినట్లు ఉంది కొందరి తీరు.. నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు.. నా వయసేంటో పనిలో చూపిస్తా.. 25 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తా’ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మరియపురం సమీపంలోని ఎస్ఎస్ గార్డెన్లో శనివారం స్మార్ట్రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి తన పనితీరును మెచ్చుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ తననే ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరడంలో తప్పేముందని అన్నారు. పరకాలలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గీసుకొండ, సంగెం మండలాలతో పాటు 15,16,17 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు స్మార్ట్కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్కుమార్, ఇక్బాల్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, భీమగాని సౌజన్య, దాడి శివ, తుమ్మనపల్లి శ్రీనివాస్, ఆకుల రుద్రప్రసాద్, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడాలినెక్కొండ: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, విధుల్లో నిర్లక్ష్యం వీడాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం గ్రామ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆమె సూచించారు. చెత్తాచెదారాన్ని డంపింగ్ వార్డుకు తరలించేందుకు అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, కార్యాలయ రికార్డులను అప్డేట్ చేయాలని ఆమె కోరారు. సమావేశంలో ఎంపీఓ శ్రీధర్, జీపీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మట్టెవాడ ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్పై వేటు కాళోజీ సెంటర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏప్రిల్–2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అభ్యాసకుల ఫీజు చెల్లింపులో ‘ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల మాయజాలం’ శీర్షికన సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు స్పందించి మట్టెవాడ సెంటర్ కోఆర్డినేటర్ వి.అజయ్బాబును బాధ్యతల నుంచి తప్పించారు. మరో టీచర్ కె.రాజుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు పాఠశాల హెచ్ఎం ఓదెల శ్రీనివాస్ తెలిపారు. రాజు సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నట్లు చెప్పారు. విచారణ చేపట్టి నివేదికను విద్యాశాఖ అధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. రాయపర్తి: నష్కల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని ఆర్డీఓ సుమ సూచించారు. కొలన్పల్లి, కేశవాపురం, బురహాన్పల్లి గ్రామాల్లో నష్కల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సేకరణపై శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుమ మాట్లాడారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ త్రినాథ్, సర్పంచ్లు వంగాల ఎల్లమ్మయాకయ్య, గుజే సుధాకర్, ఉమాదేవి, ఆర్ఐ కొయ్యడ చంద్రమోహన్, ఉపసర్పంచ్ చెదలు భిక్షపతి, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
మరణంలోనూ వీడని బంధం
పర్వతగిరి : జీవితాంతం అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకరి నొ కరు వీడలేదు. 24గంటల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన పర్వతగిరి మండలం తురకల సోమవారం గ్రామంలో చోటు చేసుకుంది. సోమారం గ్రామానికి చెందిన గిద్దమారి భారతమ్మ(60) అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెకు భర్త గిద్దమారి భిక్షపతి(65) సపర్యలు చేశాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆమె శుక్రవారం మృతి చెందింది. భార్య మృతి తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన భిక్షపతి శనివారం కన్నుమూశాడు. భారతమ్మ, భిక్షపతి దంపతులు మరణంలోనూ విడిపోలేదని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. వారి మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది. 24గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి తురుకల సోమారం గ్రామంలో విషాదం -
ఏజీ మిల్లు మాజీ కార్మికులతో సమావేశం
న్యూశాయంపేట: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆజంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్య పరిష్కారానికి కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు, పిటిషనర్లు, మాజీ కార్మికులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా వైస్ చైర్పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి, ప్రత్యామ్నాయాలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు కార్మికులు సమయం కోరినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆజంజాహి మిల్లు మాజీ కార్మికులు పాల్గొన్నారు. ఫిజికల్ లిటరసీపై వీడియో కాన్ఫరెన్స్ యంగ్ ఇండియా స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ లిటరసీపై శనివారం హైదరాబాద్ నుంచి స్పోర్ట్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ కిశోర్ గోపినాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ వ్యాయామం, క్రీడలపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు, యువజన క్రీడల అధికారి బి.అఖిల్, డీబీసీడీఓ పుష్పలత, డీఎండబ్ల్యూఓ రమేష్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. ప్రజలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్లు, కేసుల దర్యాప్తు, ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, దారా కవిత, రాజమహేందర్ నాయక్, కిషన్సింగ్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత కమిషనరేట్లో నెలవారీ నేరసమీక్ష -
90 మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన తెలుపుతూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మర్నాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరో పించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైర్హాజరుకు రూ.600కు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈవిషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశాను.. నేను శుక్రవారం రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశా. మర్నాడు డ్యూటీకి రమ్మని అధికారులు చెప్పారు. తెల్లారేసరికి నన్ను తొలగించారని తెలిసింది. నా భర్తకు ప్రమాదం జరిగి ఇంటి వద్దనే ఉంటున్నాడు. నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితులున్నాయి. – అనూష, ఔట్సోర్సింగ్ కండక్టర్, హనుమకొండ డిపో ఏడాది కాలంగా చేస్తున్నా.. హైదరాబాద్లో హోమ్ లోన్స్లో పనిచేసే నేను.. ఆర్టీసీ ప్రభుత్వానిది కావడంతో రెగ్యులర్ అవుతుందని కండక్టర్ ఉద్యోగంలో చేరా. కాంట్రాక్టర్కు కొంత సొమ్ము కూడా ముట్టజెప్పా. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. మధ్యలోనే తొలగించడంతో మేం వీధిన పడే పరిస్థితి నెలకొంది. – ఐలయ్య, ఔట్సోర్సింగ్ కండక్టర్, నర్సంపేట డిపో వెట్టి చాకిరి చేయించుకున్నారు.. ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యో గం కోసం ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు కాంట్రాక్టర్కు చెల్లించారు. వీరికి నెలకు రూ.18వేల వేతనం ఇచ్చారు. ఏడాది పని చేస్తే వీరికి రూ.2,16,000 వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడినా భవిష్యత్లో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉద్యోగంలో చేరితే మధ్యలోనే తొలగించి అన్యాయం చేశారు. – గాదె మహేందర్, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
అభివృద్ధి పనులకు నిధులు
గీసుకొండ: మండలంలోని పలు గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.7.01 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచిఘోష్ పేరుతో శనివారం ఉత్తర్వులు వెలవడ్డాయి. దస్రుతండా గ్రామపంచాయతీ పరిధిలోని సింగ్యా తండాలో రూ.15 లక్షలతో ఎస్టీ కమ్యూనిటీహాల్, దస్రుతండాలో 10 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.54 కోట్లు, నాలుగు సైడ్ కాల్వల నిర్మాణానికి రూ.23.30 లక్షల నిధులు కేటాయించారు. హర్జ్యాతండాలో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు, నాలుగు సీసీరోడ్ల నిర్మాణానికి రూ.33.70 లక్షలు, 6 సైడ్ కాల్వల నిర్మాణానికి రూ.46 లక్షలు, సూర్యతండాలో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు, 22 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.86 కోట్లు, రెండు సైడ్ కాల్వలకు రూ.13 లక్షల నిధులు మంజూరయ్యా యని రాంపురం, వంచనగిరి, దస్రుతండా, సూర్యతండా, మనుగొండ సర్పంచ్లు తెలిపారు. -
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
● మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా, మల్లారం, రసూల్పల్లి, గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న– పల్లె పల్లెలో ప్రజాపాలన’ వినూత్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తూ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా గ్రామ పంచాయతీల వద్ద ప్రజల సమక్షంలో అధికారులతో సంక్షేమ, అభివృద్ధి పనులపై సమీక్షించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మల్లారంలో పశువులకు టీకాలు వేశారు. అనంతరం రసూల్పల్లి నుంచి వీర్లగడ్డ తండాకు వెళ్లే మార్గంలో లో–లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.54 కోట్లు, రసూల్పల్లి గ్రామ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. రసూల్పల్లి–మల్లారం రహదారి అభివృద్ధికి రూ.86 లక్షలు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈపనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్థులు కోరగా, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి పునఃప్రారంభిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో రసూల్పల్లి సర్పంచ్ బోయిని మహేశ్, వీర్లగడ్డ తండా సర్పంచ్ గూగులోతు పూర్ణిమ–రాజు, మల్లారం సర్పంచ్ గూడెల్లి కల్పన, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోచంపల్లి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ, కొలుగూరిరాజు, డబ్బా శంకర్, ప్రమోద్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ఆదరి రవి జిల్లా, మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఎంఈఓ సునీతరాణి, వ్యవసాయ అధికారి పద్మ, ఎస్సైలు రాజు, దివ్య రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవెల్లి పూర్తి కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనుగౌరవెల్లి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసే పూర్తి బాధ్యత తనదేనని, గడువులోగా పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం తేల్చిచెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి న్యాయపరంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని, ఇకపై ఎవరు ఎన్ని రాజకీయ లేదా ఇతర అడ్డంకులు సృష్టించినా పనులు ఆగేది లేదన్నారు. భీమదేవరపల్లి మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే నూటికి నూరు శాతం పూర్తయిందని, మిగతా మండలాల రైతులు కూడా ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ. 250 కోట్ల పరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాలువల తవ్వకం పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. -
ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల మాయాజాలం!
కాళోజీ సెంటర్: పలు కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్షర వెలుగులు నింపుతోంది. చదువుకోవాలని ఆసక్తి ఉన్నవారు అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొంది సకాలంలో పరీక్ష ఫీజు చెల్లిస్తున్నారు. అయితే, కొన్ని సెంటర్ల కోఆర్డినేటర్లు అధిక ఫీజు వసూలు చేస్తూ బోర్డుకు ఫీజు చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ మట్టెవాడ ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో పరీక్ష ఫీజు చెల్లించకపోవడంతో కొంతమంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాము ఫీజు చెల్లించినా సెంటర్ బాధ్యులు పరీక్ష ఫీజు బోర్డుకు చెల్లించకపోవడంతో పరీక్ష రాయలేదని, దీంతో ఒక సంవత్సరం వృథా అయ్యిందని పేరు చెప్పడానికి ముందుకు రాని 16 మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మట్టెవాడ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ను వివరణ కోరగా పొరపాటు జరిగినట్లు అంగీకరించడం కొసమెరుపు. ఉమ్మడి జిల్లాలో 142 స్టడీసెంటర్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 142 స్టడీసెంటర్లు ఉన్నాయి. కొంతమంది కోఆర్డినేటర్లు విద్యార్థుల నుంచి రూ.1,500 బదులు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బయట చెబితే మీరు ఉత్తీర్ణత కారు అని విద్యార్థులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఎవరికి ఫిర్యాదు చేయలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మధ్యలో చదువు ఆపేసిన వారి అసరాలను ఆసరాగా చేసుకొని అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, తెలంగాణ ఓపెన్ స్కూల్ బోర్డుకు చెల్లించని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లపై చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ముద్రించిన బుక్లెట్లో పూర్తి సమాచారం పొందుపరిచారు. అందులో ఉన్న ఫీజు కంటే ఎవరు ఎక్కువ వసూలు చేసినట్లు సమాచారం ఇస్తే డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. మట్టెవాడ సెంటర్ కోఆర్డినేటర్ విషయంలో గతంలోనే చెప్పాము. ఎవరైతే ఫీజు కట్టి హాల్టికెట్ రాకుండా పరీక్షకు హాజరుకాలేదో వారు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా స్టడీ సెంటర్ల వివరాలు.. – సదానందం, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా వరంగల్ కోఆర్డినేటర్ హనుమకొండవరంగల్ ములుగు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకొని బోర్డుకు చెల్లించని కొంతమంది రూ.1,500కు బదులు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు హాల్టికెట్ రాక పరీక్ష రాయకపోవడంతో ఒక సంవత్సరం వృథా మట్టెవాడ ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో ఘటన వెలుగులోకి 2826252018 -
నీటిని పొదుపుగా వాడాలి
ఖానాపురం: పంటలకు నీటిని పొదుపుగా వాడాలని ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, సొసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ కోరారు. మండలంలోని పాకాల సరస్సు నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నీటిని వృథా చేసుకోవద్దన్నారు. వరి పంట వేయని రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే ఇబ్బందులు తలెత్తవన్నారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్రెడ్డి, నర్సంపేట ఆత్మ చైర్మన్ ఎడ్ల భిక్షంరెడ్డి, ఐబీ డీఈ రమేశ్, సర్పంచ్ అచ్యుతం, నాయకులు లింగిడి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్రావు, ముస్తఫా, ఉపేందర్, శ్రీను, ఎల్లగౌడ్, లాల్సాహెబ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : డీఎంహెచ్ఓనర్సంపేట రూరల్: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రాజారెడ్డి హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ హబ్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. హబ్లో పనిచేసే ముగ్గురు సిబ్బంది గైర్హాజరు కావడంతోపాటు సెలవుపత్రాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మీ వత్రం కావడంతో వారికి సంబంధించి సెలవుపత్రాలు వేరే రిజిస్టర్లలో దొరికాయి. మరోసారి ఇలా కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎక్స్రే మిషన్ను పరిశీలించి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పాతబ్లాక్లోని పీపీ యూనిట్ను సందర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ దామోదరబాయి, ఆర్ఎంఓ నవీన్ ఉన్నారు. నిబంధనలు పాటించాలి.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్ఓ రాజారెడ్డి ఆదేశించారు. నర్సంపేటలోని ప్రైవే ట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులతో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2011, సంబంధిత రూల్స్–2022 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, వాటికి సంబంధించిన టారిఫ్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించే బోర్డులను రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రశాంత జీవనం గడపాలి వరంగల్ లీగల్: వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడపాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రదీప్ సూచించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదనం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రదీప్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉందని తెలిపారు. నూనె మిల్లు సీజ్నల్లబెల్లి: అనుమతి, ట్రేడ్ లైసెన్స్ లేకుండా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నగేశ్ నూనె మిల్లును సర్పంచ్ నాగెల్లి జ్యోతిప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్ శుక్రవారం సీజ్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కుల నగేశ్ నిర్వహిస్తున్న నూనె మిల్లులకు ట్రేడ్ లైసెన్స్, సేఫ్టీ గార్డులు లేవని తెలిపారు. ఇటీవల రాంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత పల్లీలు పట్టించేందుకు మిల్లుకు వచ్చింది. ప్రమాదవశాత్తు మిల్లులో ఆమె కుడి చేయి ఇరుక్కొని జబ్బ వరకు కోల్పోయిందని తెలిపారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ స్పందించి నిర్వాహకుడికి 24 గంటల గడువుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి వివరణ రాకపోవడంతో మిల్లును సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, ప్రజాభద్రతను విస్మరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
బాలలకు ఆపదొస్తే ఎలా?
రాత్రివేళ చైల్డ్ హెల్ప్లైన్–1098 కార్యాలయానికి తాళం● ఆపదలో అండగా ఉండాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా ● భద్రత పేరుతో ‘ఫార్వర్డ్ కాలింగ్’ వైపు మొగ్గు ● కలెక్టర్ ఆదేశాలున్నా నిరంతర సేవలకు బ్రేక్ సాక్షి, వరంగల్: చైల్డ్ హెల్ప్లైన్–1098కు వచ్చే ప్రతి కాల్ సాధారణ ఫోన్కాల్ కాదు.. అవతలి వైపు ఏడుస్తున్న బాలుడు, వేధింపులకు గురవుతున్న చిన్నారి, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లవాడు, బాలకార్మికుడు అయి ఉండొచ్చు. తక్షణ వైద్యం లేదా రక్షణ అవసరమైన వారు కావొచ్చు. అలాంటి సమయంలో కాల్ చేసిన వెంటనే స్పందన రాకపోతే ఆ నిమిషాల ఆలస్యం కూడా ప్రమాదకరమే. నిరంతరం సేవలు అందించాల్సిన 1098 ఆఫీస్కు తాళం పడితే బాలల రక్షణ వ్యవస్థకు అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరచుగా ఫార్వర్డ్ కాల్ ఆప్షన్తో తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లకు కాల్స్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ రాత్రివేళ ఇంట్లో ఉంటున్నారని సమాచారం. దీనికి ఇక్కడ అధికారి ఒకరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హెల్ప్లైన్కు సంబంధించిన వివరాలు అడిగితే గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్ ఆదేశాలు ఏమైనట్టు..? బాలల సంరక్షణ కోసం 2015 జేజే యాక్ట్ నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం చైల్డ్ హెల్ప్లైన్ నిరంతరం అందుబాటులో ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. 6 నెలల క్రితం బాలసముద్రంలోని బాలరక్షాభవన్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించిన సందర్శించారు. ఎస్ఓపీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చైల్డ్లైన్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవి పాటించడంలో సిబ్బంది వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్ ఆదేశాలనే అమలు చేయలేని పరిస్థితి ఉంటే.. బాలల రక్షణ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న యంత్రాంగం ఏం చేస్తోంది? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. భద్రతాపరంగా సీసీ కెమెరాలు, వాచ్మన్ ఉన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మూడో అంతస్తుకు తరలించినా సాయంత్రం, రాత్రివేళ హెల్ప్లైన్ సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిందే.. బాలల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. అధికారులున్నారు. నిబంధనలున్నాయి. నిరంతర సేవలంటున్నారు. భద్రతా ఏర్పాట్లు చేశామంటున్నారు. కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోతే ఆ వ్యవస్థ ఎవరి కోసం? కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా పరిస్థితి ఎందుకు మారలేదు? 1098 కార్యాలయం రాత్రివేళ తప్పనిసరిగా పనిచేస్తోందా? ప్రతి షిఫ్ట్లో సిబ్బంది హాజరు, విధి నిర్వహణపై పర్యవేక్షణ ఉందా? సమస్య ఉంటే ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదు? 1098కు వచ్చిన అత్యవసర కాల్స్కు స్పందనలో ఆలస్యమైతే బాధ్యత ఎవరిది? కలెక్టర్ స్వయంగా ఇచ్చిన ఎస్ఓపీ అమలు ఆదేశాలను పర్యవేక్షిస్తున్నది ఎవరు? ఇవి కేవలం అధికారులపై ప్రశ్నలు కాదు.. ఆపదలో ఉన్న ప్రతి బాలుడి తరఫున అడగాల్సిన ప్రశ్నలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. బాలల రక్షణ వ్యవస్థలో చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే 1098 ఆఫీస్కు తాళం పడకుండా చూడడం కంటే.. ఆపదలో ఉన్న బాలుడికి తక్షణం తలుపు తెరిచే వ్యవస్థను బలోపేతం చేయడమే జిల్లా యంత్రాంగం ముందున్న అసలు బాధ్యత అంటున్నారు.. కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతాయా? 1098 మళ్లీ నిజమైన 24X7 బాలల ఆపన్నహస్తంగా మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే చైల్డ్ హెల్ప్లైన్ సేవలు, 1098 కార్యాలయానికి తాళంపై జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఇంటి అనుమతుల వివరాలు ఇవ్వాలినర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఏడాదిగా మంజూరైన ఇంటి అనుమతుల వివరాలు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డుల వారీగా ఎన్ని అనుమతులు ఇచ్చారో వివరాలు అందించాలని పేర్కొన్నారు. -
సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ (ఎస్ఐఆర్)ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఎస్ఐఆర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన పోలీంగ్ స్టేషన్లలో బీఎల్ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. నోమ్యాపింగ్, అనామలీస్లో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీచేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లాలో ఎస్ఐఆర్పై పీపీటీ ద్వారా వివరించారు. అంతకుముందు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియ, బూత్ లెవల్ అధికారులు నిర్వర్తిస్తున్న విధులను కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ -
మహాలక్ష్మి నమోస్తుతే..
ఆలయాల్లో కుంకుమార్చనభక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలుప్రత్యేక పూజలు చేసిన మహిళలుజిల్లాలో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేశారు. పండ్లు, పూలు, పలు రకాల నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించారు. ఆలయాలు, ఇళ్లలో మహిళలు ముత్తెయిదువులకు వాయినాలు అందించారు. వరంగల్లోని భద్రకాళి, సంతోషిమాత, ఎంజీఎం ఎదుట ఉన్న రాజరాజేశ్వరి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. – సాక్షి, నెట్వర్క్– మరిన్ని ఫొటోలు 9లో -
ఎన్సీడీని పకడ్బందీగా అమలు చేయాలి
సంగెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్సీడీ (అసంక్రమిత వ్యాధుల)ని సమర్థవంతంగా అమలు చేయాలని పబ్లిక్హెల్త్ అబ్జర్వర్ సెంట్రల్ టీం ప్రాజెక్టు హెల్త్ మేనేజర్ డాక్టర్ సామ్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యాధుల సర్వేలెన్స్ ప్రోగ్రాం పరిధిలో 9 ఆరోగ్య విభాగాల కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, నివేదికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని ఆదేశించారు. రోగుల వివరాలను పక్కాగా నమోదు చేసి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి ఇక్తదార్ అహ్మద్, ఐడీఎస్సీ ప్రోగ్రాం అధికారి అరుణ్జోషి, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, నవీన్, డీపీఎంయూ అర్చన, ఎన్సీడీ సూపర్వైజర్ ప్రకాశ్, సీహెచ్ఓ చిన్నబ్బాయి, హెచ్ఈఓ సాంబయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ
త్వరలో మీడియా ముందుకు సురేఖ?తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్లో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ -
హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ..
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026త్వరలో మీడియా ముందుకు సురేఖ?తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో శుక్రవారం తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.ఇప్పటికే షోకాజ్ నోటీస్, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. -
ప్రతీ వ్యాపారి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి
● వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ: నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యంపై సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్వంలో వరంగల్ మహానగరానికి చెందిన వ్యాపారస్తులకు హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతీ వ్యాపారస్తుడు తప్పనిసరిగా రోడ్డుపై దృశ్యాలు కనిపించేలా నాణ్యమైన ఒకటి, రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను త్వరగా హస్పిటల్కు తరలించి వారి ప్రాణాలు నిలబెట్టెందుకు కృషి చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం రాహవీర్ పథకం ద్వారా రూ.25 వేలు నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింగరావు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వ్యాపారులున్నారు. పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో శిక్షణార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులు, విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆర్ఐ సింహాచలం, శ్రీనివాస్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మడికొండ పోలీస్ స్టేషన్ను శుక్రవారం సీపీ శ్వేత పరిశీలించారు. పీఎస్లోని పలు రికార్డులు, అధికారుల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ప్రతీ ఫిర్యాదుకు రశీదు అందించాలని సూచించారు. -
కరీంనగర్లో హత్య.. ఎల్కతుర్తిలో మృతదేహం
ఎల్కతుర్తి: ఓ మహిళను కరీంనగర్లో హత్యచేసి కారు డిక్కీలో తీసుకునివచ్చి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రం సమీపంలో వదిలేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిగా గుర్తించారు. శుక్రవారం ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై నరసింహారావు తెలిపిన కథనం మేరకు.. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీప ప్రాంతంలోని కాలనీలో (టీఎస్03 ఎఫ్ఎఫ్ 8034) అనే నంబర్ గల కారు అనుమానాస్పదంగా పార్కు చేసి ఉందని, అందులోనుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కారువద్దకు చేరుకొని కారు ఎవరిదని వాకబు చేయగా స్థానిక మండల కేంద్రానికి చెందిన తంగెళ్లపల్లి సదానందంది అని తేలడంతో ఆయనను రప్పించారు. తన కారును ఎడెల్లి భాస్కర్రెడ్డికి కుదువపెట్టినట్లు తెలిపాడు. కాగా, కారును ఎల్కతుర్తికి చెందిన భాస్కర్రెడ్డి సోదరుడు వినోద్రెడ్డి వాడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఓనరైన సదానందం వద్ద ఉన్న మరో తాళం చెవితో కారు డిక్కీ తెరిచి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. స్థానిక కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కారులో దొరికిన ఆధార్కార్డు ఆధారంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస(33)గా గుర్తించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని తమ కూతురు మానస, వినోద్రెడ్డి స్నేహితులని తెలిపారు. కాగా, వారిద్దరూ కరీంనగర్లో కలుసుకున్నారని, అక్కడే మానసను హత్యచేసి కారులో ఎల్కతుర్తికి తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక కారులోనే ఉంచినట్లు సమాచారం. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితుడిగా భావిస్తున్న వినోద్రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని డీసీపీ తెలిపారు. కారు డిక్కీలోని మహిళ మానసగా గుర్తింపు మృతురాలిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఘటనాస్థలిని పరిశీలించిన సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత పోలీసుల అదుపులో నిందితుడు.. -
రాకాసి సమాధుల పరిశీలన
● క్షేత్రస్థాయిలో పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి విచారణ ● ఇనుపరాతి యుగం నాటి ఆవాసాలుగా గుర్తింపుభీమదేవరపల్లి: మండలంలోని గట్ల నర్సింగాపూర్లో ప్రాచీన కాలం నాటి రాకాసి సమాధులు (మెగాలిథిక్ బరియల్స్) ‘సాక్షి’ దినపత్రికలో జూలై 29న ప్రచురితమైన కథనానికి పురావస్తు శాఖ స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి గురువారం క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఏడీ గంగాదేవి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాల ప్రకారం ఇనుపరాతి యుగంలోనే ఆదిమ మానవులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకుని జీవించి ఉంటారని తెలిపారు. స్థానిక కొండల్లోని సాధారణ బండరాళ్లతో కాకుండా, సమాధులకు ఉపయోగించిన మండే రాయి భిన్నంగా ఉండడాన్ని బట్టి కొండను తొలచి ఈ సమాధులను ప్రత్యేకంగా నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ సమాధులను పరిరక్షించేందుకు చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటీవల బ యల్పడిన వేల సంవత్సరాల నాటి కళ్యాణి చాళుక్యుల ముల్కనూరు శాసనం, గట్ల నర్సింగాపూర్ రాకాసి సమాధులు, గొల్లపల్లి సమీపంలోని కాలభైరవ విగ్రహంతో పాటు ముత్తారంలోని కాకతీయుల నాటి ప్రాచీన త్రికూటేశ్వరాలయాన్ని ఏడీ పరిశీలించారు. ఈపరిశీలనలో పురావస్తు శాఖ సిబ్బంది బాబు, గ్రామ ఉప సర్పంచ్ బొడిగే శ్రీనివాస్, కొత్త చరిత్రకారుల బృందం సభ్యులు కిషోర్ జీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామిని మధుర మీనాక్షి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠ అవధాని, అర్చకుడు ప్రణవ్ ఉదయం నుంచి సుప్రభాత సేవ, గణపతిపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. 3న జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ వరంగల్ స్పోర్ట్స్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026–27 కోసం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 3న జేఎన్ఎస్లో ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, ప్రస్తుత సర్వీస్ సర్టిఫికెట్తో హాజరుకావాని సూచించారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, షటిల్ బాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో మొదలైన క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శ్రీమన్నారాయణ అథ్లెటిక్స్ కోచ్ 94410 86556ను సంప్రదించవచ్చని సూచించారు. వయోవృద్ధులతో బాధ్యతగా వ్యవహరించాలి హన్మకొండ: వయోవృద్ధులపై కుటుంబ సభ్యులు, సమాజం బాధ్యతగా వ్యవహరించి, వారికి గౌరవం, సంరక్షణ అందించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని వయో వృద్ధుల డే కేర్ సెంటర్లో హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధుల హక్కులు, న్యాయపరమైన రక్షణ, సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి జి.రామలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టపరంగా కల్పించిన రక్షణలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సీనియర్ సిటిజెన్స్ ట్రిబ్యునల్ కోర్టు సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కులు, చట్టపరమైన అంశాలు, సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న వేదికల గురించి వివరించారు. హనుమకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.నరేందర్ న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ ప్రభుత్వం అమలు చేస్తున్న వయోవృద్ధుల సంక్షేమ పథకాలు, సేవలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ విధానంపై అవగాహన పెంచుకోవాలి ఖిలా వరంగల్: వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్స్ (డిజిటల్) విధానాలపై అవగాహన పెంచుకోవాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి సూచించారు. శుక్రవారం వరంగల్ చాంబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ మార్కెంట్ రంగంలో డబ్ల్యూడీఆర్ఏ, ఈ–ఎన్డబ్ల్యూఆర్ రశీదుల విధానం రైతులకు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
వర్ధన్నపేట: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేయనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. రూ.3.14 కోట్లతో చేపట్టిన వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులకు గురువారం ఆయన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేసి పంటలకు కాల్వల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించారు. రాజీవ్గాంఽధీకి నివాళి.. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షీభారాణి రాజేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, కౌన్సిలర్లు పాపారావు, వాణి కుమారస్వామి, కీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
బాధితులకు న్యాయం చేయాలి
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన ఫలాలను అందించడానికి కమిషన్ కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. కమిషన్ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. భూ వివాదాలు, అట్రాసిటి కేసుల నమోదు విచారణ, పురోగతి, ప్రభుత్వశాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల పకడ్బందీ అమలుపై చర్చించారు. కేసుల పురోగతిపై పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమీక్షకు సీపీ రాకపోవడంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు వేగంగా న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధితులు నేరుగా కమిషన్ను సంప్రదించి సమస్యలను తెలపవచ్చని ఆయన చెప్పారు. కేసుల పురోగతిని పరిశీలించి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం చివరలో పాల్గొన్న సీపీ శ్వేతకు చైర్మన్ సూచించారు. ప్రతినెల గ్రామస్థాయిలో సివిల్ రైట్స్డేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు పునరావాసం కల్పించాలి.. బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతో వదిలేయకుండా పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, గృహవసతి కల్పించాలని సూచించారు. దేశంలో రోల్మోడల్గా తెలంగాణ నిలుస్తోందని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ సివిల్ రైట్స్ డే సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా అధికారులకు దిశానిర్దేశనం చేస్తామని చెప్పారు. అనంతరం చైర్మన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్, కుసుమ నీలాదేవితోపాటు డీసీపీ అంకిత్కుమార్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


