Warangal District News
-
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు
జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. ఔట్కమ్స్, లెర్నింగ్ ఔట్కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ, ఎఫెక్టివ్ క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్, లెర్నింగ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కార్యకలాపాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ విద్య అమలు, గవర్నెన్స్ ప్రాసెస్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్షిప్ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధా వులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో) జిల్లా మార్కులు ర్యాంక్ జనగామ 357 01హనుమకొండ 306 10భూపాలపల్లి 295 20వరంగల్ 286 24ములుగు 266 29మహబూబాబాద్ 259 31 పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్–1 హనుమకొండకు 10వ ర్యాంకు అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్లోని మిగతా నాలుగు జిల్లాలు కేంద్ర మానవ వనరుల శాఖ నివేదికలో వెల్లడి -
జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు..
టెన్త్ విద్యార్థులుఇంటర్ విద్యార్థులు1,8621,1609878697908061,473687611550498భూపాల పల్లిహనుమ కొండమలుగుమానుకోటవరంగల్విద్యార్థులుఉత్తీర్ణత -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
హోర్డింగ్.. హోల్డాన్!
ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అనధికారమే అధికం హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. చర్యల మాటేంటి? అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్లు తొలగిస్తామని తెలిపారు.‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగ్లు గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం! నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండినిబంధనలేం చెబుతున్నాయంటే.. ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి. ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు. -
వేసవి సెలవుల పొడిగింపు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్ ఐదో తేదీవరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శనివారం సర్క్యూలర్ జారీచేశారు. వేసవి సెలవులు ఈనెల 31తో ముగిసి జూన్ ఒకటి నుంచి డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జె.చిన్న, ఇతర బాధ్యులు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎండల నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని కోరగా.. జూన్ 5వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఈసెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు యథావిధిగానే విధులు నిర్వర్తించాలి. జూన్ 6 నుంచి కళాశాలలు రీ ఓపెన్ చేస్తారు. హన్మకొండ చౌరస్తా: మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బకాయిలను ప్రభుత్వం నిన్న జీపీఎఫ్ వందశాతం చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు తెలిపారు. శనివారం హనుమకొండలోని అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓస్ భవన్లో టి.రఘువీరు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తోందని, జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా తాము నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ జిల్లాలకు ఇన్చార్జ్ లను నియమించినట్లు తెలిపారు. హనుమకొండకు ఎం.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్కు టి.రఘువీర్ను నియమించినట్లు దేవదాసు తెలిపారు. కార్యక్రమంలో ఎ.సురేందర్, ఎం.పాపయ్య, పెద్ది ఆంజనేయులు, కామేశ్వర్, పి.సాంబయ్య, మీసా రాజమల్లయ్య, డాక్టర్ బి.కృష్ణమూర్తి, సాల్మన్, ప్రభుదాస్, వేణుగోపాల్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. భువనేశ్వరి బదిలీ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ)గా ఎ.మధుసూదన్రావు హైదరాబాద్ డీఈఓ కార్యాలయం నుంచి బదిలీపై వస్తున్నారు. ఈమేరకు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏసీజీఈగా విధులు నిర్వర్తిస్తున్న భువనేశ్వరి ఇక్కడి నుంచి హైదరాబాద్లోని ఎస్సెస్సీ బోర్డులో ఏసీజీగా బదిలీ అయ్యారు. కాగా, మధుసూదన్రావు సోమవారం విధుల్లో చేరుతారని సమాచారం. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు (ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ ఆిసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 10, 12, 15, 17, 19, 20 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణత ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు టెన్త్లో 83.17 శాతం, ఇంటర్లో 78.78 శాతం ఉత్తీర్ణత -
వరంగల్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరిఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●725 కొనుగోలు కేంద్రాలు @ 4 మిల్లులుఅన్నదాతలకు ధాన్యం విక్రయ కష్టాలు తప్పడం లేదు. ఖానాపురం మండల పరిధిలో 25 కొనుగోలు కేంద్రాలు ఉండగా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి కేవలం నాలుగు మిల్లులు మాత్రమే కేటాయించడంతో తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి కోసం ఖానాపురం మండల కేంద్రంలోని శ్రీనివాస రైస్మిల్లుకు ధాన్యం లోడ్ వాహనాలు శనివారం బారులుదీరాయి. – ఖానాపురంరావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు మైనార్టీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.తెలంగాణఈపాస్.సీజీజీ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 93988 60995 నంబర్లో లేదా సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కారు లక్ష్యం నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని రేలకుంట, ముచ్చింపుల, అర్షనపల్లి, కొండాపూర్, ఒల్లె నర్సయ్యపల్లి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేలకుంట, ముచ్చింపుల, కొండాపూర్ గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున గ్రామైక్య మహిళా సంఘాల భవనాలు, అర్షనపల్లి, బుచ్చిరెడ్డిపల్లి, అర్వయ్యపల్లి గ్రామాల్లో రూ.12 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణా పనులకు శంకుస్థాపన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ ముప్పు కృష్ణ, పీఆర్ డీఈ శ్రీకాంత్ రెడ్డి, ఏఈ అమీర్, అంగన్వాడీ సూపర్వైజర్ హేమలత, ఏపీఓ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అతివల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం గీసుకొండ: అతివల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని, పొదుపు సంఘాల మహిళా సభ్యులను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, చంద్రయ్యపల్లి, ఊకల్, గంగదేవిపల్లి, కొనాయమాకుల, విశ్వనాథపురం, మరియపురం, శాయంపేట గ్రామాల ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దారు రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ అనిల్, ఎంపీఓ పాక శ్రీనివాస్, సెర్ప్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
హోర్డింగ్.. హోల్డాన్!
ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అనధికారమే అధికం హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. చర్యల మాటేంటి? అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్లు తొలగిస్తామని తెలిపారు.‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగులు గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం! నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండినిబంధనలేం చెబుతున్నాయంటే.. ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి. ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు. -
పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు
జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు గాను 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు.అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ, ఎఫెక్టివ్ క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్, లెర్నింగ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కార్యకలాపా, ఇనన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ విద్య అమలు, గవర్నెన్స్ ప్రాసెస్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్షిప్ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో) జిల్లా మార్కులు ర్యాంక్ జనగామ 357 01హనుమకొండ 306 10భూపాలపల్లి 295 20వరంగల్ 286 24ములుగు 266 29మహబూబాబాద్ 259 31 పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్–1 హనుమకొండకు 10వ ర్యాంక్ అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్లోని మిగతా నాలుగు జిల్లాలు కేంద్ర మానవ వనరుల శాఖ నివేదికలో వెల్లడి -
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
న్యూశాయంపేట: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఖిలా వరంగల్లోని ఖుష్ మహల్లో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి జిల్లాలో బాలబాలికలు విద్యకు దూరంగా కాకుండా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట –2026 సమావేశాన్ని జిల్లాస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్పై సమీక్ష అటవీశాఖ ల్యాండ్స్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్)పై సంబంధిత అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద, డీఎఫ్ఓ నిఖిత కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్, నీటి పారుదల, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీసీఓ నీరజ, అధికారులు పాల్గొన్నారు. వరంగల్కు మంత్రి కొండా సురేఖ.. సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్కు అటవీ, పర్యావరణం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కేటాయించింది. -
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
● వరంగల్ ఆర్వోఆర్ సర్వేకు రూ.10 కోట్లు ● కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ.0.43 కోట్లు కేటాయింపు ● రైల్వే పింక్బుక్ 2026–27లో వెల్లడికాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్లకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను రూ.4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ.గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ.గాను రూ.75 కోట్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. -
ఇక.. ఇండోర్ సబ్స్టేషన్లు
పట్టణాలు, నగరాల్లో ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ శ్రీకారంహన్మకొండ: ఇంటికి విద్యుత్ కావాలి కానీ, తన ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ పెట్టొద్దు.. ఇలా ప్రతి కాలనీలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు స్థానికుల నుంచి అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. సబ్స్టేషన్ ఏర్పాటుచేయాలంటే విశాలమైన స్థలం అవసరంనగరాలు, పట్టణాల్లో భూములకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంత ఖరీదు పెట్టి యాజమాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తక్కువ స్థలంలో నిర్మించాలనే ఆలోచనకు వచ్చిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మొదటిసారి ఇండోర్ సబ్ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తుండగా, అందులో గ్రేటర్ వరంగల్ పరిధిలో రెండు ఉన్నాయి. స్థలం.. ఖర్చు ఇలా.. ● సాధారణంగా ఒక 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరం. కానీ, స్థల సమస్య కారణంగా ఎకరం స్థలం నుంచి 15 గుంటల స్థలానికి చేరుకున్నారు. ● నగరాలు, పట్టణాల్లో 15 గుంటల భూమి లభ్యత సమస్యగా పరిణమించడంతో తక్కువ స్థలం, సమయంలో సబ్ స్టేషన్ నిర్మించాలనే ఆలోచనలో భాగంగానే ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ● ఇండోర్ సబ్ స్టేషన్కు కనీసం 600 గజాల స్థలం అవసరం కాగా, ఈ స్థలం కూడా లభించకపోవడంతో 400 గజాల్లోనే నిర్మిస్తున్నారు. ● సాధారణ సబ్ స్టేషన్తో చూసుకుంటే ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నది. ● సాధారణ 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల ఖర్చయితే, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.6.50 కో ట్ల నుంచి రూ.7 కోట్లు ఖర్చవుతుంది. ● టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ముందుగా రూ.3,770.43 లక్షల వ్యయంతో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి పూనుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఆరు చోట్ల.. అందులో గ్రేటర్ వరంగల్లో రెండు ఏర్పాటు స్థల సమస్య కారణంగా ఖర్చు ఎక్కువైనా భరించాలని నిర్ణయం -
ప్రైవేట్కు దీటుగా పూర్వ ప్రాథమిక విద్య
● నాలుగేళ్ల చిన్నారుల కోసం ప్రీప్రైమరీ స్కూళ్లు ● 13 మండలాలకు 48 పాఠశాలలు మంజూరు చేసిన ప్రభుత్వందుగ్గొండి: ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయలతో వసతులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారు కోసం జిల్లాకు 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గనుంది. ఒక్కో పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు. ప్రభుత్వం మంజూరు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాల (ప్రీ ప్రైమరీ స్కూల్)లో ఒక టీచర్, ఒక ఆయాను నియమించనున్నారు. టీచర్కు రూ.8వేలు, ఆయాకు 6వేల చొప్పున వేతనం అందిస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 96 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. పిల్లలకు ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, స్నాక్స్ అందిస్తారు. నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.70 లక్షల నిధులు మంజూరు చేసింది... మండలాల వారీగా పాఠశాలల మంజూరు వివరాలు.. జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. వీటిలో చెన్నారావుపేట, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపురం, ఖిలా వరంగల్, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, మండలాలకు నాలుగు పాఠశాలల చొప్పున మంజూరయ్యాయి. కాగా, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట మండలాలకు 3 పాఠశాలల చొప్పున మొత్తం 48 పాఠశాలలు మంజూరయ్యాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 522 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27,729 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రాథమిక విద్య బలోపేతం.. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంలో భాగంగా మండలానికి నాలుగు ప్రీప్రైమరీ స్కూళ్లు మంజూరయ్యాయి. గత సంవత్సరమే అడ్మిషన్లు ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. ప్రీప్రైమరీతో ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడుతుంది. – వెంకటేశ్వర్లు, దుగ్గొండి ఎంఈఓ -
అనాథలు.. ఆగని కన్నీటి ధారలు
దుగ్గొండి: నిరుపేద కుటుంబం.. ఉన్నదాంట్లో కష్టపడి ఇద్దరు కుమార్తెలను చక్కగా చదివిస్తున్నారు. ఇంతలోనే క్యాన్సర్ వారి పాలిట శాపమైంది. ఆ మహమ్మారి దంపతులను పొట్టనపెట్టుకుంది. ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఇప్పుడు వారి చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిర్ర రాజు–కవిత దంపతులది నిరుపేద కుటుంబం. ఇల్లు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం కవిత క్యాన్సర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. రాజు కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు శ్రుతి, సౌమ్య దిక్కులేని వారయ్యారు. గ్రామస్తుల సహకారంతో తండ్రికి అంత్యక్రియలు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రుతి బీటెక్, సౌమ్య పదో తరగతి చదువుతోంది. తమకు తల్లిదండ్రులు దూరమయ్యారు, చదువు ఎలా కొనసాగించాలో తెలియడం లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలో 44 మందికి క్యాన్సర్.. దుగ్గొండి మండలంలోని 34 గ్రామ పంచాయతీల పరిధిలో 44 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 2023లో నలుగురు, 2024లో ముగ్గురు, 2025లో ముగ్గురు, 2026లో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. బాధితులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదిస్తే ఉచితంగా పరీక్షలతో పాటు మందులు అందిస్తామని, తొలిదశ నుంచే మందులు వాడితే ప్రాణాపాయం ఉండదని మండల వైద్యాధికారి కిరణ్రాజు తెలిపారు. కన్నవారిని కాటేసిన క్యాన్సర్ మహమ్మారి 15 ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి కన్నీటిపర్యంతమవుతున్న ఇద్దరు కుమార్తెలు చదువు ఎలా కొనసాగించాలని ఆందోళన -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్టులకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3వ, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను 4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ. రూ.75 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే పింక్బుక్ 2026–27లో కేటాయింపు వరంగల్ ఆర్ఓఆర్ సర్వేకు రూ.10 కోట్లు కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ. 0.43 కోట్లు -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
● పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు నర్సంపేట: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాలను శాసిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం ఇష్టారాజ్యంగా 25 నుంచి 50 శాతం ఫీజులు పెంచుతున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల నరేశ్, సహాయ కార్యదర్శి దండు వినయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు హర్షవర్ధన్, పి.అనూష, నాయకులు రజని, సౌమ్య, రాజు, కల్యాణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తడవకుండా చూడాలి : డీఆర్డీఓ
ఖానాపురం: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని డీఆర్డీఓ నాగపద్మజ ఆదేశించారు. ఈ మేరకు రాగంపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. సేకరించిన ధాన్యం, తూకాలు, గన్నీల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దని, వాతావరణంలో మార్పుల దృష్ట్యా ధాన్యాం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న డీసీఎం, ట్రాక్టర్ల ద్వారా తరలించాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అద్వైత, ఏపీఎం రమాదేవి పాల్గొన్నారు. ఇరువర్గాల ఘర్షణ చెన్నారావుపేట: వరిగడ్డి వాము దగ్ధమైన ఘటనలో లింగాపురం గ్రామ పరిధిలోని మేగ్యానాయక్తండాలో ఇరువర్గాలు శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాయి. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. మేగ్యాతండాకు చెందిన గుగులోత్ రాజేందర్ వరిగడ్డి వాము ఇటీవల దగ్ధమైంది. దీంతో రాజేందర్ మనస్తాపం చెంది తిట్టాడు. ఇది విన్న అజ్మీరా శ్రీను ఎందుకు తిడుతున్నావని అడిగాడు. వరిగడ్డి కాల్చినవాడిని తిడుతుంటే నీకేమైందని రాజేందర్ అనడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా అజ్మీరా శ్రీను కత్తులు, ఇనుపరాడ్లతో నలుగురు వ్యక్తులను తీసుకుని రాజేందర్ ఇంటిపైకి దాడికి వెళ్లాడు. తండావాసులు వెంబడించడంతో ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. గణి అనే వ్యక్తి దొరకడంతో పక్కనే ఉన్న స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాపయ్యపేటలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన కొల్లూరి సతీశ్ (36) తన భార్య పిల్లలతో వరంగల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య అనూషతో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంట్లో భార్య అనూష, అత్త ఐలమ్మ, బామ్మర్ది శివ.. సతీశ్తో గొడవపడి దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన సతీశ్ పాపయ్యపేటకు వచ్చి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఓదెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. ఆయిల్పామ్ తోటలో అగ్నిప్రమాదంవర్ధన్నపేట: ఆయిల్పామ్ తోటలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన ఇల్లంద గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు తక్కళ్లపల్లి లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద గ్రామంలో 8 ఎకరాల్లో మూడు సంవత్సరాలుగా ఆయిల్పామ్ సాగు చేస్తున్నట్లు తెలిపాడు. తోటకు సమీపంలో రైతులు వరి కొయ్యలను తగుల బెట్టారు. మంటలు తోటలోకి విస్తరించి 400 మొక్కలు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నాడు. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, వాల్వ్సిస్టం కాలిపోయినట్లు వాపోయాడు. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. -
పొల్యూటెన్షన్!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య మంచిగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది ఆఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బంతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్థమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగరంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్ష చేసేందుకు వరంగల్ మీసేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవ కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్టు స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు. మరో ఆరు స్టేషన్లు అవసరమే... ● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే అక్కడ నమోదయ్యే ఏక్యూఐ ఎంతమేర ఉంటుందనేది తెలియకపోతే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి. ● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలంలోని చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్డేట్ చేయడం లేదు. గ్రేటర్ వరంగల్లో తగ్గుతున్న గాలి నాణ్యత గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు ఎం10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు డంపింగ్ యార్డ్తోమడికొండ సమీప గ్రామాల్లో ప్రమాదకరస్థితివీటితో సమస్యే లేదు.. పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ కుడా ఆఫీస్లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు. సల్ఫర్ డైయాకై ్సడ్(ఎస్ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) 80 మైక్రోగ్రాం ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల్లోపుగా ఉంది. -
మౌలిక వసతులు కల్పించాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కమలాపూర్, గూడూరు గ్రామాల్లో నిర్మించిన ‘డబుల్’ ఇళ్ల సముదాయాలను, అక్కడి వసతులను శుక్రవారం ఆమె పరిశీలించారు. త్వరగా పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పరిశీలన మండలంలోని ఉప్పల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఫామ్పాండ్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శుక్రవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో వసతులు, ఓర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ డీఆర్డీఓ, ఎంపీడీఓ, ఏపీఓలను అభినందించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. డంపింగ్ యార్డుల నిర్వహణ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని శనిగరంలో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సర్పంచులు వనజకళాధర్, సతీశ్, రమనాగరాజు, రాజు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్ మార్కెట్కు వరుస సెలవులు
ఖిలా వరంగల్: రోహిణి కార్తెలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రైతులు, వ్యాపారులు, గమస్తాలు, దడువాయి, కార్మికులు వడదెబ్బకు గురవకుండా జూన్ 1 నుంచి 7 వరకు సెలవు దినాలుగా ప్రకటించాలని మార్కెట్ కార్మిక సంఘాలు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యవర్గం ప్రతినిధులు కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు వరుస సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న తిరిగి మార్కెట్ యార్డు పునఃప్రారంభం కానుందని స్పష్టం చేశారు. రైతులు తమ సరుకులను సెలవు రోజుల్లో మార్కెట్కు తీసుకురావొద్దని కోరారు. -
‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ !
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత విద్యాసంవత్సరంలో ప్రీప్రైమరీ తరగతులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించుకునేలా గది ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఒక్కో తరగతికి రూ.లక్ష నిధులు హనుమకొండ జిల్లాలో 39, వరంగల్ జిల్లాలో 48 స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్రీ ప్రైమరీ సెక్షన్కు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. చిన్నారులను ఆకర్షించేలా తరగతిగది గోడలపై అక్షరాలు, సంఖ్యలు, వివిధ చిత్రాలు పేయింటింగ్ చేయించనున్నారు. ఆటలతో కూడిన విద్యనందించేందుకు ఆటవస్తువులను కూడా అందిస్తారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రతీ ప్రైమరీ సెక్షన్కు ఒక ఇన్స్ట్రక్టర్ను ఒక ఆయా చొప్పున నియమిస్తారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. అంగన్వాడీ స్కూళ్లకు సమీపంలో ఉండేవారికి అదనంగా స్నాక్స్ కూడా అందించనున్నారు. ఎస్సీఆర్టీఈ పాఠ్యప్రణాళిక ఆధారంగా వారికి విద్యను అందిస్తారు. హనుమకొండలో 39, వరంగల్లో 48 స్కూళ్లలో సెక్షన్ల ఏర్పాటు ఒక్కో ప్రీప్రైమరీకి రూ.లక్ష నిధులు -
‘ఎస్ఐఆర్’పై అవగాహన ఉండాలి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య దామెర: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని దుర్గంపేట సమీపంలోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నియోజకవర్గ స్ధాయి కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడో దశలో భాగంగా జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ బృందం పర్యటించి ఓటరు నమోదు, జాబితా సవరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఏజెంట్లకు సూచించారు. ఈసీఐ, బీజేపీ కుమ్మకై ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని వెల్ల డించారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల హక్కులు కాపాడడం ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అయూబ్, దామెర, ఆత్మకూరు మండలాల అధ్యక్షులు దుబాసి రాజేందర్, రేవూరి జలందర్ రెడ్డి, నాయకులు సుధాకరరెడ్డి, రాజిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్లు బొంకూరి రవియాదవ్, పొలెపాక శ్రీనివాస్, దాసి శ్రీకాంత్, నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట/ ఖిలా వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలలో గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను రేపటిలోగా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా రవాణాధికారి శోభన్బాబు, డీఎంసీఎస్ సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవాలి వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు’పై శుక్రవారం అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ వీడియోలు ప్రదర్శించారు. గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు 1,000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా ఆటబొమ్మలు, అభ్యసన సామగ్రి తయారీని వివరించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మాట్లాడుతూ పిల్లల్లో సహజ సిద్ధమైన సృజనాత్మకతను ప్రోత్సహించాలని, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
పొల్యూటెన్షన్ !
మూడు నెలలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (పీఎం10) ఇలా..గ్రేటర్ వరంగల్లో తగ్గుతున్న గాలి నాణ్యతసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య బాగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది అఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్తమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగ రంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్షించేందుకు వరంగల్ మీ సేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవా కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు. మరో ఆరు స్టేషన్లు అవసరమే.. ● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి. ● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్డేట్ చేయడం లేదు. పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ ‘కుడా’ ఆఫీస్లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవాలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు. సల్ఫర్ డైయాకై ్సడ్ (ఎస్ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) 80 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా.. కానీ ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల లోపు ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి.. ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు ఎం 10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు డంపింగ్ యార్డ్తో మడికొండ చుట్టుపక్కల ప్రమాదకరస్థితి -
పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–27) ప్రవేశాలకు పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న అభ్యర్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ధ్రువీకరణ పత్రాలను అందించారు. జూన్1వ తేదీ వరకు ఈ సర్టిఫికెట్ల ప్రక్రియ కొనసాగనుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ మంగళవారం బదిలీ అయ్యారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధి బీఈడీ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 9, 10, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు. విద్యారణ్యపురి: ‘ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడుదాం’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని ప్రభుత్వ సుబేదారి పాఠశాలలో నిర్వహించిన విద్యారంగ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి, డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు రావుల రమేశ్, అటుకుల శ్రీనివాస్రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, అన్నారెడ్డి, మహేందర్రెడ్డి, కుమారస్వామి, రాంరెడ్డి, సుదర్శనం, శ్రీనివాస్రావు, సుదర్శన్ వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. సంప్రదాయాలు కాపాడాలిహన్మకొండ కల్చరల్/హన్మకొండ: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లిన మహాస్వామి.. తిరుగు ప్రయాణంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు స్వగృహానికి శుక్రవారం వెళ్లారు. స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కెప్టెన్ వొడితల లక్ష్మీకాంత రావు, సరోజనీ దేవి దంపతులు, మనుమడు ఇంద్రనీల్, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారితో భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషుశర్మ, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ, పద్మాక్షి దేవాలయ అర్చకుడు నాగిళ్ల షణ్ముఖ శర్మ తదితరులు ఉన్నారు. -
అన్నారం సబ్స్టేషన్కు మంటలు
● సమీపంలో పంట వ్యర్థాలు కాలుస్తుండగా ఘటన ● ఆర్పివేసిన అగ్నిమాపక, విద్యుత్ సిబ్బంది, సర్పంచ్పర్వతగిరి: రైతులు పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో సబ్స్టేషన్కు మంటలు వ్యాపించిన ఘటన అన్నారం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రైతులు శుక్రవారం పంట వ్యర్థాలను కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న పొలాలు, సబ్స్టేషన్కు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, సర్పంచ్ గాడిపల్లి మహేందర్ మంటలను ఆర్పివేశారు. ఈ మంటల్లో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యే తీగలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా కన్నెబోయిన మల్లయ్య రైతు పొలంలో 30 నీటి పైపలు కాలిపోయి రూ.30 వేల నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా డీఈ దానయ్య మాట్లాడుతూ వ్యవసాయ భూముల నుంచి మంటలు సబ్స్టేషన్ ఆవరణలోకి వ్యాపించాయని తెలిపారు. అందరం అప్రమత్తమై మంటలను ఆర్పివేసి రూ.2 కోట్ల నష్టాన్ని నివారించామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఏడీఈ తిరుపతి, విద్యుత్ సిబ్బంది శ్రావణ్, పూర్ణాచారి, పోలీస్కానిస్టేబుల్ రమేశ్, వీరస్వామి, వినయ్, రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ అర్బన్: జిల్లాలో జూన్ 15 నాటికి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంపై తహసీల్దార్లు, బీఎల్ఓ, సూపర్వైజర్లతో శుక్రవారం కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ శ్రీనివాస్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బహిరంగంగా పొగ తాగితే చర్యలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఏటీసీపీ)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ చట్టం (కోట్పా యాక్ట్) జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 31న నిర్వహించే ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య జిల్లాలో చేపడుతున్న పొగాకు నియంత్రణ కార్యక్రమాలను వెల్లడించారు. సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామకృష్ణ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, డీఐఈఓ గోపాల్, ఏసీడీ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాస్, డీటీఓ వేణుగోపాల్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.‘ఎస్ఐఆర్’ హెల్ప్డెస్క్ల ఏర్పాటు ఎస్ఐఆర్–26 ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సవరణలు, సహాయం కోసం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి హెల్ప్డెస్క్ ఉంటుందని తెలిపారు. టోల్ఫ్రీ 1800–425–1126 /9701777182 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమీక్ష -
విద్యార్థులు అంకితభావంతో చదవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు కాళోజీ సెంటర్: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా సోషల్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సోషల్ ఫోరం నిర్వహించిన కార్యక్రమాలు మిగిలిన ఫోరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఏఎంఓ సుజన్తేజ, డీఎస్ఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఫోరం సేవాభావంతో విద్యార్థులను ప్రోత్సహిస్తోందని, సోషల్ సబ్జెక్టులో 100 శాతం మార్కులు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందని అభినందించారు. సోషల్ ఫోరం గౌరవ అధ్యక్షుడు మంగ రాజన్న, జిల్లా అధ్యక్షుడు తాటిపాముల రమేశ్, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి రవి, ఉపాధ్యక్షులు సాంబమూర్తి, ఉప్పల సతీశ్, అన్న సాంబయ్య, చిట్టిబోతుల సంపత్ , హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లు మరింత భారం
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూమి విలువలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం సూచించిన మార్కెట్ వ్యాల్యూ, మార్కెట్లో భూమి విలువను పోలుస్తూ 25 శాతం నుంచి వందశాతం ప్లాట్లకు, వ్యవసాయానికి మూడింతలు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు మార్కెట్ వ్యాల్యూను అనుసంధానం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పెంచిన మార్కెట్ వ్యాల్యూ ఆచరణలోకి రానున్నట్లు సమచారం. నాలుగేళ్ల తర్వాత పెంపు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో దస్తావేజుల రిజిస్ట్రేషన్కు 1 ఫ్రిబవరి 2022 రిజిస్ట్రేషన్ ఫీజు 0.5, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 స్టాంప్స్ డ్యూటీ 4.5 నుంచి 7.5 స్టాంప్స్ డ్యూటీగా పెంచారు. కాగా, 2024లో ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రతిపాదించినప్పటికీ ధరలు పెరగలేదు. నా లుగేళ్ల తర్వాత భూమి మార్కెట్ విలువలను పెంచేందుకు జీఓ నంబర్ 101ను మే 5న విడుదల చేసి, 2024న ప్రతిపాదించిన మార్కెట్ వ్యాల్యూతో పెంచాలని సూచించింది. దీంతో భూమి మార్కెట్ విలువ 7.5 నుంచి 8.5 వరకు స్టాంప్స్ డ్యూటీ, మ్యూటేషన్ ఫీజు 3 వేల నుంచి 4 వేలకు పెరిగే అవకాశం ఉంది. దీంతో క్రయవిక్రయదారులకు పెంచిన మార్కెట్ విలువతో భారం పడనుంది. భూముల విలువ ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్ల పల్లిలో అత్యల్పంగా 600 మార్కెట్ వ్యాల్యూ ఉండగా, వందశాతం పెంచితే 1,200 అవుతుంది. అత్యధికంగా హనుమకొండ చౌరస్తాలో రూ.46 వేలు ఉండగా 70 నుంచి 85 శాతం పెరిగే అవకాశం ఉంది. అపార్ట్మెంట్లకు స్క్వేర్ ఫీట్కు రూ.2,300 ఉండగా రూ.3 వేలు అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు మూడింతలు పెంచితే ప్రస్తుతం రూ.1.35 కోట్లు విలువ ఉండగా.. రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు వరకు పెరిగే అవకాశం ఉంది. భారం తగ్గించుకునేందుకు.. పెరగనున్న మార్కెట్ వ్యాల్యూతో భారం పడుతుందని, తగ్గించుకునేందుకు ముందే రిజిస్ట్రేషన్లు చేసుకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భూక్రయవిక్రయదారులకు పోటెత్తుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో110 స్లాట్లు ప్రతీ రోజు అందుబాటులో ఉండగా.. సాధారణంగా 60 నుంచి 80 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో 605 రిజిస్ట్రేషన్ల దస్తావేజులు పూర్తి చేసుకున్నాయి. తేదీ రిజిస్ట్రేషన్లు మే 21 105 22 100 23 107 25 92 26 93 27 108మార్కెట్ వ్యాల్యూ సవరణలో భాగంగా రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాల పని వేళలు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రాజీవ్గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 48 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అందుబాటులో ఉంటే 98తో పాటు మరో 10 స్లాట్లు అందుబాటులో ఉండగా.. రిజిస్ట్రేషన్ల అవసరం నిమిత్తం స్లాట్స్ మ రింత పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్ రెండో వారంలో భూమి విలువ పెంపు ఆదాయం పెంచుకునే యోచనలో సర్కారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతున్న భూ క్రయవిక్రయదారులు -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి టీం వర్క్తో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యంగా జరుగుతోందని, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ములుగు కలెక్టర్ హేమంత్ బొర్ఖడే సహదేవ రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్!
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కువశాతం టైటిల్ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. కొన్ని టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. నోట్బుక్స్తోపాటు ఈసారి వర్క్బుక్స్ను కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు. నోట్బుక్స్, వర్క్ బుక్స్ రావాల్సి ఉంది. అయితే వీటిని నేరుగా మండల కేంద్రాలకే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు 2,56,180 పుస్తకాలు రావాల్సి ఉండగా హైదరాబాద్ నుంచి హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోదాంకు ఇప్పటి వరకు 2,29,980 పాఠ్యపుస్తకాలు (89.73శాతం) చేరుకున్నాయి. ఇంకా 26,300 రావాల్సింది. జిల్లాలోని 14 మండలాల్లోని ఎంఈఓలు తమ మండలాల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తీసుకెళ్లాలని, అందుకయ్యే రవాణా వ్యయం తర్వాత అందజేస్తామని డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ ఆదేశించారు. అంతేకాకుండా గత శనివారంనుంచి మండల కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఎంఈఓలు తమ ఎంఆర్సీ కేంద్రాలకు తరలించాక అక్కడినుంచి హెచ్ఎంలు ఆయా స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్ 12లోగానే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 36,839 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థులకు మొత్తం 2,35,750 (పార్ట్–1) పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 1,98,430 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 37,320 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. తగ్గనున్న బ్యాగు భారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘ద్విభాషా విధానం’(ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్) ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ముద్రణతో విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గనుంది. హనుమకొండ జిల్లా గోదాంకు చేరిన 89.73 శాతం పుస్తకాలు వరంగల్ జిల్లా గోదాంకు 1,98,430 పుస్తకాలు.. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు.. ఆయా పాఠశాలలకు పంపిణీ ప్రక్రియ షురూ.. -
ఈద్గాలను సందర్శించిన సీపీ
వరంగల్ క్రైం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని హనుమకొండలోని బొక్కలగడ్డ ఈద్గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గురువారం సందర్శించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ప్రార్థనలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ నర్సింహారావు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాజీపేట: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి, దానమ్మ దంపతులు పుట్టిన గడ్డపై నాలుగున్నర దశాబ్దాల తర్వాత అడుగుపెట్టారు. గురువారం రాత్రి సోమిడికి వచ్చిన ఆ దంపతులకు గ్రామస్తులు, బంధుమిత్రులు కాజీపేట చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. సన్మానించి అభినందనలు తెలిపారు. కాజీపేట వాటర్ ట్యాంక్ నుంచి భారీ ఊరేగింపుగా నరహరి దంపతులను సోమిడి గ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను చూసిన నరహరి భావోద్వేగానికి గురయ్యారు. ఈసందర్భంగా పాత కాలం నాటి జ్ఞాపకాలను ఆనాటి మిత్రులతో నరహరి పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బి.వెంటేశ్, మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, బస్వా యాదగిరితో పాటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలి కాళోజీ సెంటర్: హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్డుల ద్వారా అందించే సేవలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.మహేందర్రెడ్డి అధ్యక్షతన గురువారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కార్డుల ద్వారా అందించే సేవలపై సందేహాలు నెలకొన్నాయని, హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందా తీసుకోవద్దని కోరారు. ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్ఎంఎస్లో పొందుపర్చడానికి గడువు పొడిగించాలని పేర్కొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్త్కార్డులపై సేవలను పొందడం ఐచ్ఛికం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి, టి.సూరయ్య, టి.ఆనందచారి, నర్సింహులు, ఆర్.రాంరెడ్డి, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు. -
రెవెన్యూ ఆఫీసర్స్
తహసీల్దార్ బాధ్యతలు ● భూ భారతి రిజిస్ట్రేషన్లు ● భూ కేటాయింపులు ● లా అండ్ ఆర్డర్ విధులు ● ఎన్నికల నిర్వహణ ● పౌర సరఫరాల పర్యవేక్షణ ● రేషన్ కార్డుల వ్యవహారాలు అదనపు తహసీల్దార్ బాధ్యతలు ● ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ ● సహజ విపత్తుల సహాయక చర్యలు ● రెవెన్యూ రికవరీ కేసుల పర్యవేక్షణ ● భూ ఆక్రమణల తొలగింపు ● రైస్ మిల్లులు, ఫెయిర్ ప్రైస్ షాపుల తనిఖీలు ● ఎన్నికల నిర్వహణలో సహకారం పట్టణ, మండలాలకు అదనపు తహసీల్దార్ల నియామకం సాక్షిప్రతినిధి, వరంగల్: వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు.. పెరుగుతున్న జనాభాతో రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలకు నిరీక్షణ తప్పట్లేదు. వీటితో పాటు భూ వివాదాలు, భూ భారతి దరఖాస్తులతో మండల కార్యాలయాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణ మండలాల్లో అదనపు తహసీల్దార్ పోస్టులను సృష్టిస్తూ సీఎస్ఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలా వరంగల్, కాజీపేట, హనుమకొండ, హసన్పర్తి, మహబూబా బాద్ మండలాలకు కొత్త పోస్టులు మంజూరయ్యా యి. ప్రత్యేకంగా వరంగల్–హనుమకొండ నగర పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరణ, భూ లావాదేవీలు పెరగడంతో రెవెన్యూ శాఖపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అదనపు తహసీల్దార్ పోస్టులు సృష్టించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త పోస్టులు ఎక్కడెక్కడంటే.. నాయబ్ తహసీల్దార్లను అదనపు తహసీల్దార్లుగా జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వం.. వారిని సంబంధిత మండలాల్లో నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. హనుమకొండ జిల్లాకు మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న ఆకుల రవి, గడ్డం రమేశ్, ఎంఎస్ గౌతమ్ను కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా ఉన్న ఎల్.భాస్కర మూర్తి, ఎండీ యూసుఫ్ ఖురేషీలను వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాలోనే నాయబ్ తహసీల్దారుగా ఉన్న ఎం.రంజిత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న శ్రీధర్, వి.శైలజను పెద్దపల్లికి, వరంగల్లో ఉన్న ఎస్.రాజరేణుకను ఖమ్మం, ఐ.పవన్కుమార్ను భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ చేశారు. ఒత్తిడి తగ్గేనా? పట్టణ మండలాల్లో రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. ఒకే అధికారిపై అధిక భారం ఉండడంతో ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తోందనే విమర్శలున్నాయి. కొత్త పోస్టులతో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు కేటాయింపు మూడు జిల్లాల్లో ఆరు మండలాలకు కొత్త పోస్టులు భూ భారతి నుంచి ధ్రువపత్రాల సేవలకు వినియోగం -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
● రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ● నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష ● హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులుహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డీఓలు, సివిల్ సప్లయీస్, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యంగా జరుగుతోందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ములుగు కలెక్టర్ హేమంత్ బొర్ఖడే సహదేవరావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
సాక్షి నెట్వర్క్ : బక్రీద్ను త్యాగానికి ప్రతీకగా ముస్లిం మత గురువులు అభివర్ణించారు. జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల్లోని ఈద్గాల్లో మస్జిద్ కమిటీల ఆధ్వర్యంలో మత గురువులు ప్రత్యేక నమాజ్ చదివి వినించారు. పండుగ విశిష్టత, మానవుల ఆలోచనలపై చైతన్యవంతం చేశారు. తప్పుడు ఆలోచనలు, మోసాలు, మోసపూరిత వాగ్ధానాలను వీడాలని సూచించారు. నీతి, నిజాయితీతో జీవిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. ముస్లింలు కబ్రస్తాన్లకు వెళ్లి మృతి చెందిన వారి బంధువులకు పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభా కాంక్షలు తెలుపుకుంటూ అలింగం చేసుకున్నారు. -
క్షీరాభిషేకం
పర్వతగిరి : మండలంలోని అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం చిత్రపటానికి పంచాయతీ సిబ్బంది గురువారం క్షీరాభిషేకం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను ప్రతినెలా 1వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంతం, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడుగు రమేశ్, యూత్ మండల అధ్యక్షుడ గొడుగు వినయ్, నాయకులు గొడుగు భిక్షపతి, సారంగపాణి, జక్కుల దర్గయ్య, చెడ్డపాక కుమారస్వామి, కన్నెబోయిన మల్లయ్య, గొడుగు వీరస్వామి, పంచాయతీ సిబ్బంది రాంచందర్, ఒగ్గు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నూతన కార్య వర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకులు వీరాచారి, సారయ్య, రాంమోహన్ తెలిపారు. చైర్మన్గా ధన్రాజ్, అధ్యక్షుడిగా విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శిగా బండారి సంతోష్, కోశాధికారిగా డాక్టర్ నన్నపునేని భరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా సంపత్, సలీం, విజయ్, అన్వర్, యాకూబ్, వినయ్, మహిళా ఉపాధ్యక్షులుగా నర్మద, వైష్ణవి, సీహెచ్.సుప్రియ, ఎండి.ఆసియా, సంయుక్త కార్యదర్శులుగా కోటేశ్వర్, తిరుపతి, దినేష్ తేజ్, గణేష్, వెంకటేష్, కె.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా జి.రాజు, పి.దేవదాస్, ఎం.హేమంత్, టి.తిరుమల, రణదీప్, రూపేష్, ఏ.సాయితేజ, టి.హరి మధన్, శివాత్మిక, బి.సాన్విమోహన్ ఎన్నికై నట్టు వివరించారు. -
గ్రీన్ నెట్తో మొక్కలకు జీవం
● వేసవిలో నర్సరీల సంరక్షణకు చర్యలునెక్కొండ : పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో భాగంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో వన సంరక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చలువ పందిళ్లు (గ్రీన్ నెట్) వేసి నర్సరీలోని మొక్కలకు ప్రాణవాయువును అందిస్తోంది. కాగా మొక్కలు ఎదిగిన అనంతరం వర్షాలు కురిశాక ఏటా వనమహోత్సవం పేరిట రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటిస్తారు. ఇళ్ల ఆవరణల్లో, వ్యవసాయ బావుల వద్ద పచ్చదనం పెంచాలని సూచిస్తూ ప్రజలకు పలు రకాల మొక్కలు పంపిణీ చేస్తోంది. ఎండల నేపథ్యంలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నర్సరీల్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి నీటితో తడుపుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు అందిస్తూ మొక్కలను రక్షిస్తున్నారు. 39 నర్సరీలు.. 2.70 లక్షల మొక్కలు మండలంలోని మొత్తం 39 గ్రామ పంచాయతీల్లో అధికారులు ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతేడాది సుమారు 2.50 లక్షల మొక్కలు పెంచారు. ఈసారి వర్షాలు మొదలవగానే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 2.70 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఆ దిశగా జిల్లాస్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది మొక్కల సంరక్షణ చర్యల్లో క్రియాశీలకంగా భాగస్వాములవుతున్నారు. నర్సరీల్లోని మొక్కల రక్షణకు శద్ధ తీసుకుంటున్నాం. ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రీన్ నెట్ ఏర్పాటు చేశాం. మొక్కలకు నీడ కల్పిస్తున్నాం. నర్సరీల్లోని అన్ని మొక్కలను కాపాడతాం. – యాసం లావణ్య, ఎంపీడీఓ -
నేటి నుంచి సాంస్కృతిక సేవా కార్యక్రమాలు
● మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుకాశిబుగ్గ : ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) జిల్లా ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లి లోని ఏవీఎస్ హైస్కూల్లో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు తెలిపారు. వరంగల్ ఓ సిటీలోని క్యాంపు కార్యాలయంలో రచయితల వర్క్షాపు వాల్పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులకు కొదవ లేదన్నారు. ప్రతి ఇంట్లోనూ కళ ఉందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో కళాకారులకు ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా పాటలు, పల్లె సుద్దులు, వీధి నాటకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, టీపీసీసీ సాంస్కృతిక సేవా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సుధాకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలెపాక రమేశ్, జన్ను శివకృష్ణ, గీకురు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ ఆఫీసర్స్
సాక్షిప్రతినిధి, వరంగల్: వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు.. పెరుగుతున్న జనాభాతో రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలకు నిరీక్షణ తప్పట్లేదు. వీటితో పాటు భూ వివాదాలు, భూ భారతి దరఖాస్తులతో మండల కార్యాలయాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణ మండలాల్లో అదనపు తహసీల్దార్ పోస్టులను సృష్టిస్తూ సీఎస్ఎల్ఏ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలా వరంగల్, కాజీపేట, హనుమకొండ, హసన్పర్తి, మహబూబాబాద్ మండలాలకు కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ప్రత్యేకంగా వరంగల్–హనుమకొండ నగర పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరణ, భూ లావాదేవీలు పెరగడంతో రెవెన్యూ శాఖపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అదనపు తహసీల్దార్ పోస్టులు సృష్టించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త పోస్టులు ఎక్కడెక్కడంటే.. నాయబ్ తహసీల్దార్లను అదనపు తహసీల్దార్లుగా జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వం.. వారిని సంబంధిత మండలాల్లో నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. హనుమకొండ జిల్లాకు మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న ఆకుల రవి, గడ్డం రమేశ్, ఎంఎస్ గౌతమ్ను కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా ఉన్న ఎల్.భాస్కర మూర్తి, ఎండీ యూసుఫ్ ఖురేషీలను వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాలోనే నాయబ్ తహసీల్దారుగా ఉన్న ఎం.రంజిత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. అలాగే హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న దుర్శెట్టి శ్రీధర్, వి.శైలజను పెద్దపల్లికి, వరంగల్లో ఉన్న ఎస్.రాజరేణుకను ఖమ్మం, ఐ.పవన్కుమార్ను భద్రాద్రి కొత్తగూడేనికి బదిలీ చేశారు. ఒత్తిడి తగ్గేనా? పట్టణ మండలాల్లో రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. ఒకే అధికారిపై అధిక భారం ఉండడంతో ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తోందనే విమర్శలున్నాయి. కొత్త పోస్టులతో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదనపు తహసీల్దార్ బాధ్యతలు ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ సహజ విపత్తుల సహాయక చర్యలు రెవెన్యూ రికవరీ కేసుల పర్యవేక్షణ భూ ఆక్రమణల తొలగింపు రైస్ మిల్లులు, ఫెయిర్ ప్రైస్ షాపుల తనిఖీలు ఎన్నికల నిర్వహణలో సహకారం తహసీల్దార్ బాధ్యతలు భూ భారతి రిజిస్ట్రేషన్లు భూ కేటాయింపులు లా అండ్ ఆర్డర్ విధులు ఎన్నికల నిర్వహణ పౌర సరఫరాల పర్యవేక్షణ రేషన్ కార్డుల వ్యవహారాలుపట్టణ మండలాలకు అదనపు తహసీల్దార్ల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు కేటాయింపు మూడు జిల్లాల్లో ఆరు మండలాలకు కొత్త పోస్టులు భూ భారతి నుంచి ధ్రువపత్రాల సేవలకు వినియోగం -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
ఖిలా వరంగల్: జిల్లాలో బక్రీద్ వేడుకలను ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖిలా వరంగల్ పెట్రోల్ బంకు జంక్షన్లోని ఈద్గా మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ, పర్యాటక, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరై మాట్లాడుతూ బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. -
పెద్దచెరువులో యథేచ్ఛగా మట్టిదందా?
చెన్నారావుపేట : మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండేళ్లుగా అక్రమార్కులు దందాకు పాల్పడుతున్నా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు పొలాల్లో నల్లమట్టి పోసుకోవడానికి అనుమతి అధికారులు ఇవ్వడం లేదని, మొరం తరలింపును ఎలా అనుమతిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువులో మొరం తీసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ చింతకింది వంశీ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఐబీ, మైనింగ్ అధికారులకు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. -
‘బాల్క సుమన్ వ్యాఖ్యలు సరికాదు’
నర్సంపేట : ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయాలని, ప్రజలందరూ జైలుకు వెళ్లాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బొజ్జా తారకం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వరపు రమేశ్ అన్నారు. పట్టణంలో ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల పైడి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో సాంబయ్య, రమేశ్ మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కించపర్చేలా సుమన్ వ్యాఖ్యలు చేశారన్నారు. సుమన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్ల రవి, మధుకర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి సహిదా, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, రుద్రారపు హేమలత, బుర్రి సాంబలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్యపుస్తకాలొచ్చేశాయ్..
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే 100 శాతం పుస్తకాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 36,839 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ సకాలంలో పుస్తకాలు అందజేయడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లా గౌడౌన్కు చేరుకున్న 1,98,430 పుస్తకాలను మొదటి విడత ఆయా మండల కేంద్రాలకు విద్యాశాఖ అధికారులు రవాణా చేస్తున్నారు. ద్విభాషా పుస్తకాల ముద్రణతో తగ్గనున్న బ్యాగు భారం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘ద్విభాషా విధానం’ (ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్) ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ముద్రణతో విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గనుంది. జూన్ 12న పార్ట్–1 పుస్తకాల పంపిణీ.. విద్యార్థుల బ్యాగుల బరువును (బ్యాగు వెయిట్) తగ్గించేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను రెండు భాగాలుగా (పార్ట్–1, పార్ట్–2) ముద్రించారు. జూన్ 12న బడి తెరిచిన వెంటనే విద్యార్థులకు పార్ట్–1 పుస్తకాలను అందజేస్తారు. పార్ట్–2 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నాణ్యతకు ప్రాధాన్యం.. కాగితం నాణ్యతను కాపాడుతూనే బరువు తగ్గించే సాంకేతిక ప్రమాణాలను (70 జీఎస్ఎం పేపర్, 200 జీఎస్ఎం కవర్ పేజీ) ఈ విద్యాసంవత్సరం పుస్తకాల్లోనూ ఉపయోగించారు. రెండు విడతల్లో పంపిణీ.. మండల కేంద్రాలకు చేరిన స్టాక్ ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థులకు మొత్తం 2,35,750 (పార్ట్–1) పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 1,98,430 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 37,320 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్ పంపిణీకి సర్వం సిద్ధం జిల్లాలో 36,839 మంది విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు తొలి విడత మండల కేంద్రాలకు 1.98 లక్షల పుస్తకాలుతరగతి విద్యార్థుల రావాల్సిన మొత్తం సంఖ్య పుస్తకాలు (పార్ట్–1) 1 2,322 7,550 2 2,328 7,560 3 2,205 9,760 4 2,430 10,510 5 3,825 17,170 6 4,860 31,970 7 4,144 27,700 8 4,778 36,920 9 5,175 45,160 10 4,772 41,450 మొత్తం 36,839 2,35,750 తరగతుల వారీగా విద్యార్థుల ఎన్రోల్మెంట్, పుస్తకాల వివరాలు.. ఈవిద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ తరగతుల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, వారికి రావాల్సిన పార్ట్–1 పుస్తకాల కోటా వివరాలు..ప్రతి విద్యార్థికి పుస్తకాల పంపిణీ.. పాఠ్యపుస్తకాల రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగిస్తున్నాం. ప్రతి పాఠశాలకు చేరే పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల నిరంతర నిఘా ఉంటుంది. జూన్ 12వ తేదీ లోపు జిల్లాలోని ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. బడి తెరిచిన మొదటి రోజే ‘పుస్తకాల పండుగ’ నిర్వహించి విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – రంగయ్యనాయుడు, డీఈఓమొదటి విడత రవాణా పూర్తి..ప్రస్తుతం జిల్లా గౌడౌనుకు చేరుకున్న 1,98,430 పుస్తకాలను మొదటి విడత కింద ఆయా మండల కేంద్రాలకు (ఎంఈఓ కార్యాలయాలకు) రవాణా చేస్తున్నాం. ఇంకా మిగిలిన పుస్తకాలు వచ్చిన వెంటనే రెండో విడత కూడా మండలాల వారీగా పంపించి సమకూరుస్తాం. – గారె కృష్ణమూర్తి, డీసీఈబీ కార్యదర్శి -
జీవితంలో కౌమారదశ కీలకం
చెన్నారావుపేట : జీవితంలో కౌమారదశ కీలకమని ప్రభుత్వ వైద్యాధికారి సరోజ తెలిపారు. స్థానిక పీహెచ్సీలో, మండలంలోని హెల్త్ సబ్సెంటర్లలో గురువారం వరల్డ్ మెనుస్ట్రువల్ హైజీన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో డాక్టర్ సరోజ మాట్లాడారు. ఆడవాళ్లకు నెలసరి సహజమని స్పష్టం చేశారు. నెలసరి ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సూచించారు. కౌమారదశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులపై అవగాహన పెంచుకుని చైతన్యవంతం కావాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ఓ భద్రయ్య, ఏఎన్ఎంలు రమ, కవిత, శ్వేత, రాజకుమారి, పుష్పలత, సుధారాణి, లలిత, కాంతి, తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలి
కాళోజీ సెంటర్: హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్డుల ద్వారా అందించే సేవలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.మహేందర్రెడ్డి అధ్యక్షతన గురువారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కార్డుల ద్వారా అందించే సేవలపై సందేహాలు నెలకొన్నాయని, హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందా తీసుకోవద్దని కోరారు. ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్ఎంఎస్లో పొందుపరచడానికి గడువు పొడగించాలని పేర్కొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్త్కార్డులపై సేవలను పొందడం ఐశ్చికం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి,టి.సూరయ్య, టి.ఆనందచారి, నర్సింహులు, ఆర్.రాంరెడ్డి, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు. పారదర్శకంగా కార్యదర్శుల బదిలీ పర్వతగిరి: జీఓ 38 ప్రకారం పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా చేపట్టినట్లు జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు జి.యాకూబ్నాయక్, డి.కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి డి.సదానందం, బి.మధు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు వాస్తవాలకు విరుద్ధమని, బదిలీల ప్రక్రియ మొత్తం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను సానుభూతితో పరిశీలించి కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఓకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యుటేషన్పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు వారు కోరుకున్న స్థానాలకు కేటా యించే దిశగా అధికారులు సానుకూల నిర్ణ యం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ)పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేసినట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీలో రైల్వే మంత్రి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. కాజీపేట రైల్వే యూనిట్ నిర్మాణం పూర్తి కావొచ్చిందని, యూనిట్లో త్వరలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లు కాజీపేట యూనిట్ నుంచి తయారు చేయనున్నట్లు తెలిపారు. కాజీపేట మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్పై కేంద్ర సహాయ మంత్రి రవనీత్సింగ్ బిట్టు, సీనియర్ ఆఫీసర్లతో కలిసి రైల్వే మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
సురవరం రచనలు మార్గదర్శకం
కేయూ క్యాంపస్ : నవయుగ వైతాళికుడు, చరిత్రకారుడు, తెలంగాణ సాహిత్యాభివృద్ధికి విశిష్టసేవలు అందించిన మహనీయుడు సురవరం ప్రతాప్రెడ్డి అని కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు కొనియాడారు. సురవరం ప్రతాప్రెడ్డి జయంతి వేడుకలను కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో గురువారం నిర్వహించారు. తొలుత ప్రతాప్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం ప్రతాప్రెడ్డి రచనలు నేటి తరానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు సమాజ చైతన్యానికి దోహదపడతాయని చెప్పారు. తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడిగా సురవరం అని అన్నారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ బానోతు స్వామి, డాక్టర్ నాగరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. -
ఇక బాల్య వివాహాల కట్టడి!
సాక్షి, వరంగల్: బాల్య వివాహాలను క్షేత్రస్థాయిలో కట్టడి చేసేందుకు వరంగల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) సరికొత్త పంథాతో ముందుకెళ్తోంది. విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల నియామకాలు ఓవైపు చేపడుతూనే.. మరోవైపు సర్పంచ్ల నుంచి డిక్లరేషన్ తీసుకుంటూ బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్గదర్శనంలో జిల్లా సంక్షేమ విభాగాధికారి, ఇన్చార్జ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పర్వతగిరి, నెక్కొండ, ఖానాపురం మండలాల్లో ఇప్పటివరకు 50 మంది సర్పంచ్ల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. మిగిలిన గ్రామసర్పంచ్ల నుంచి కూడా సాధ్యమైనంత తొందరగా తీసుకోనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాల్యవివాహాలు కాకుండా ఉండేందుకు సర్పంచ్లనే బాధ్యులనే చేయడం ద్వారా ‘జీరో చైల్డ్ మ్యారేజ్’ చేయాలని ముందుకెళ్తున్నారు. చాలా బాల్యవివాహాల సమాచారం అందిన సందర్భాల్లో ఆ ఊరి పెద్దలు, కొందరు సర్పంచ్ల ప్రమేయం ఉందని తెలియడంతో.. వారికే బాధ్యత ఇవ్వడం ద్వారా బాల్యవివాహ రహిత గ్రామాలుగా మార్చవచ్చని డీసీపీయూ విభాగాధికారులు అంచనా వేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం దిశగా అడుగులు... జిల్లాలో 392 వీసీపీసీ (విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ)లు, అర్బన్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే 214 వీసీపీసీలు, ఐదు మండలాల (గీసుకొండ, నర్సంపేట, దుగ్గొండి, సంగెం, ఖానాపురం)కు బాలల పరిరక్షణ కమిటీలను నియమించింది. అలాగే, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇంకోవైపు గ్రామస్థాయిలో కార్యదర్శి, సెక్టార్ లెవల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్, మండలస్థాయిలో తహసీల్దార్, ప్రాజెక్టు లెవల్లో సీడీపీఓలు, డిజినల్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ ‘చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్’గా వ్యవహరిస్తారు. బాల్యవివాహం ఘటనపై అంగన్వాడీ సూపర్వైజర్లే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. జీరో చైల్డ్ మ్యారేజ్ కోసం సర్పంచ్ల నుంచి డీసీపీయూ డిక్లరేషన్ మూడు మండలాల్లో ఇప్పటికే 50 మంది నుంచి లిఖితపూర్వక హామీలు కలెక్టర్ సత్యశారద పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ముందుకు.. స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా.. పాఠశాలల స్థాయిలో ఉన్న స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ’ (బాల్యవివాహం...బతుకు ఆగం ట్యాగ్లైన్)తో బాల్యవివాహం నిరోధక చట్టం–2016పైనే కలెక్టర్తో సహా సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. 2025 నుంచి ఇప్పటివరకు 35 బాల్యవివాహాల కేసులు నమోదయ్యాయి. సీరియస్గా తీసుకున్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద బాల్య వివాహాలను పూర్తిగా కట్టడి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. బాల్యవివాహ నిషేధ చట్టం 2016 ప్రకారం.. 18 ఏళ్లలోపు అమ్మాయి, 21 ఏళ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయడం నేరం. తల్లిదండ్రులు, బంధువులు, మధ్యవర్తులు, పురోహితులు...ఇలా ఎవరైనా సరే బాల్యవివాహం జరిపించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు విధించే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులో పెళ్లి ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది’ అని స్నేహ గ్రూపులను జాగృతం చేయనున్నారు. -
పచ్చిరొట్ట.. పంటల దిగుబడిలో దిట్ట
ఖిలా వరంగల్ : పంటల సాగులో రసాయన ఎరువులు వాడితే రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. భూసారం కూడా తగ్గుతోంది. దీనికి పచ్చిరొట్ట ఎరువు ఒక్కటే ప్రత్యామ్నాయమని వ్యవసాయాధికారులు తెలిపారు. పచ్చిరొట్టతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో 4 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయగా.. ఈసారి 3,500 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు రైతులకు పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్ట, పచ్చిఆకు ఎరువులు.. నేలకు సత్తువ పెంచే వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లి పెసర, అవిశ, వెంపలి ముఖ్యమైనవి. పచ్చి రొట్ట పైరు పెంచడానికి వీలులేనప్పుడు, ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు పచ్చిరొట్ట పైరు ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించాలి. గానుగ, నేల తంగేడు, జిల్లేడు, తూటాకు తదితర చెట్ల ఆకులు పచ్చిఆకు ఎరువుకు అనుకూలమైనవి. పచ్చిరొట్ట సాగు సూచనలు.. విత్తన మోతాదు ఎకరాకు జనుము 20 నుంచి 25 కిలోలు, పిల్లి పెసర 5 నుంచి 6 కిలోలు, జీలుగ 12 నుంచి 15 కిలోలు, పెసర, మినుములు 6 నుంచి 8 కిలోలు అవసరమవుతాయి. తొలకరి వర్షాలు ప్రారంభమైనప్పుడు ఖరీఫ్ సీజన్కు ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవచ్చు. నత్రజని వృథాగా పోకుండా ఉండడానికి కనీసం 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో నీరు చేరిన వెంటనే కాలయాపన లేకుండా కలియదున్నాలి. ప్రయోజనాలు ఇలా.. ప్రధానంగా భూసార పరిరక్షణకు తోడ్పడతాయి. నేలలోని హ్యూమన్ పదార్థం వృద్ధి చెంది పోషకాల వృథాను అరికడుతుంది. నేలగుల్ల బారేలా చేసి, గాలి ప్రసరణ, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పచ్చిరొట్ట ఎరువు భూమిలో కుళ్లినప్పుడు రసాయన ప్రక్రియ జరిగి పోషక పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. పచ్చిరొట్ట ఎరువులో సేంద్రియ పదార్థం ఉంటుంది. దీంతో సూక్ష్మ పోషకాలు విస్తారంగా వృద్ధి చెందుతాయి. చౌడునేలను నివారిస్తాయి. పచ్చిరొట్ట ఎరువు వేసి పండించిన పంటలో దిగుబడి 15 నుంచి 20 శాతం అధికంగా ఉంటుంది. 30 శాతం రైతులు పచ్చిరొట్ట సాగుపై ఆసక్తి.. ప్రభుత్వం జీలుగ విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తోంది. 30 కిలోల బస్తా ధర రూ.4,905.. రాయితీ 50 శాతం పోను బస్తా ధర రూ.2,452గా నిర్ణయించారు. ఈసారి జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరిని పండించనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 30 శాతం రైతులు పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వరి నాటుకు 45 రోజుల ముందుగా వేస్తే పంట ఏపుగా పెరుగుతుంది. పొలం కలియ దున్నితే కంపోస్టు ఎరువుగా మారుతుంది.మండలాల వారీగా అందుబాటులో ఉన్న జీలుగ విత్తనాలు ((క్వింటాళ్లలో) పెరగనున్న భూసారం.. తగ్గనున్న పెట్టుబడి జిల్లాలో 3,500 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనామండలాలు జీలుగ విత్తనాలు చెన్నారావుపేట 150 దుగ్గొండి 250 గీసుకొండ 120 ఖానాపురం 150 ఖిలా వరంగల్ 80 నల్లబెల్లి 200 నర్సంపేట 150 నెక్కొండ 380 వరంగల్ 20 పర్వతగిరి 550 రాయపర్తి 550 సంగెం 200 వర్ధన్నపేట 700 -
‘కార్పొరేట్ స్కూళ్లకు అండగా అధికారులు’
ఖిలా వరంగల్ : విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజుల పేరిట దోచుకుంటున్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొందరు అధికారులే అండగా నిలుస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ విమర్శించారు. వరంగల్ నగరంలోని శివనగర్లోని సీపీఐ కార్యాలయ ఆవరణలోని తమ్మెర భవనంలోని ఆ సంఘం కార్యాలయంలో అభిరామ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో శరత్ మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టెక్నో, డీజీ స్కూళ్ల పేర్లతో ఫ్లెక్సీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపించారు. పలు రకాలుగా విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మీషనన్లు పెంచుకోవడమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సూర్య, వంశీ, శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాలిస్తే క్రిమినల్ కేసులే...
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం భూవిస్తీర్ణాన్ని బట్టి రూ.2,500ల నుంచి రూ.15,000ల వరకు, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981 ప్రకారం గాలిని కలుషితం చేస్తే మూడు నెలల జైలు లేదంటే రూ.పది వేలు జరిమానా, ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి, రహదారి భద్రతకు హాని తలపెడితే భారతీయ న్యాయసంహిత 2023 ప్రకారం ఒకటి నుంచి ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది. పంట వ్యర్థాలను కాలబెడితే ఎటువంటి నోటీసులు లేకుండా రెవెన్యూ, పోలీసుశాఖ వారు కేసులు నమోదు చేస్తారు. రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను నిలిపివేయడానికి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి● -
కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి
సంగెం: ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. బుధవారం మండలంలోని నల్లబెల్లి గ్రామంలో కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీలకు ఎండలో సేదతీరేందుకు షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని, సాధారణ తాగునీరు కాకుండా కూల్ వాటర్ ఏర్పాటు చేయాలన్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టేంట్ గణేష్ కూలీలు పాల్గొన్నారు. నెక్కొండ: ఉపాధి పనుల్లో వేగం పెంచాలని, కూలీలందరికీ పనులు కల్పించాలని డీఆర్డీఏ పీడీ నాగపద్మజ అన్నారు. మండలంలోని దీక్షకుంట, చంద్రుగొండ గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ పనులతోపాటు ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లు జరపాలన్నారు. అలాగే చంద్రుగొండలో మునగ తోటలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ లావణ్యను విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రంమలో ఏపీఓ జాకబ్, చంద్రుగొండ సర్పంచ్ బక్కి కవిత, కార్యదర్శులు భానుప్రకాశ్, సుమన్, రైతులు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ నాగపద్మజ -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా? రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వ చ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక ఎంఈఓ కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించ డం సాధ్యం కాకపోవచ్చని హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులు -
మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలి
న్యూశాయంపేట: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతీ సంస్థ బాధ్యతని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రఽణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ హాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (పోష్ యాక్ట్–2013)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం పరస్పర గౌరవం నేర్పించాలన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ ఎక్కడైన వేధింపులు జరిగినట్లయితే 8712685142 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, డీఆర్డీఏ శాఖల అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా తరలించాలిప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా తరలించాలని, ఇందుకోసం జిల్లాల్లో ఉన్న లారీలు, ఇతర వాహనాలతో పాటు, ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు సైతం వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతుల నుంచి 1,21,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. వీసీలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. అర్హులందరికీ పట్టాలు చెన్నారావుపేట: మండలపరిధిలోని జల్లి, ఎల్లాయిగూడెం, తిమ్మరాయినిపహడ్ గ్రామాల పరిధిలోని ఫార్మింగ్ సొసైటీ పరిధిలోని భూములకు సంబంధించిన భూములకు అర్హత కలిగిన అందరికీ పట్టాలు అందిస్తామని కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం మండలపరిధిలోని ఎల్లాయిగూడెం శివారులోని మాధవనగర్లోని భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారి నికిత, సర్పంచి జినుల కనుకమల్లు, ఉపసర్పంచి కొంరయ్య, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, నాయకులు ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బక్రీద్ శాంతియుతంగా జరుపుకోవాలి
● వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ నర్సంపేట రూరల్: బక్రీద్ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్స్టేషన్లో ముస్లిం పెద్దలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ శ్రీనివాస్, దుగ్గొండి సీఐ సాయిరామన్న, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, బస్తాలను త్వరగా తరలించాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే సంతాపం
వర్ధన్నపేట: ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు, పట్టణ కేంద్రానికి చెందిన శ్రీరాం రమేశ్(63) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ నెల 11న చార్ధామ్ యాత్రకు వెళ్లిన రమేశ్ కుటుంబం యాత్రను ముగించుకుని సోమవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోవాల్సి ఉంది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయలుదేరే సమయంలో అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ స భ్యులు ఢిల్లీలోనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రమేష్ ఆ కస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంంతికి గురిచేసిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు, కాటారంలో పర్యటన -
స్వయం ఉపాధిలో రాణించాలి
ఖానాపురం : మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని ఎంపీడీఓ అద్వైత, మహిళా సాధికారిత జెండర్ స్పెషలిస్ట్ నల్లా హర్షితలు అన్నారు. మండలంలోని అశోక్నగర్ గ్రామపంచాయతీ ఆవరణలో రెండు వారాలుగా చేపట్టిన మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూట్బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జూ ట్బ్యాగులను వినియోగించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో జూట్బ్యాగుల వినియోగం ఉపయోగపడుతుందన్నారు. వ్యాపారంగా మలుచుకొని అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుందన్నారు. 15 రకాల జూట్బ్యాగుల తయారీలో 26 మంది మహిళలు శిక్షణ పొందారు. కార్యక్రమంలో సీడీపీఓ మధురిమ, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ, మహిళా సాధికారిత కేంద్రం బాధ్యురాలు హర్షిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
గీసుకొండ : బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని స్థానిక సీఐ విశ్వేశ్వర్ సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో మత పె ద్దలతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, వదంతులను ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా వ్యవహరించాలని, చట్టాలకు, నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. కాగా పండుగ సహృద్భావ వాతావరణంలో జరిగేలా తమ సహకారం ఉంటుందని మత పెద్దలు ఈ సందర్బంగా పోలీసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సైలు కుమార్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. సీఐ విశ్వేశ్వర్ -
లైంగిక వేధింపులను అరికట్టాలి
నర్సంపేట : మహిళలు పని చేసే చోట లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వాటిని అరికట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రో జు ల యాక్షన్ ప్లాన్లో భాగంగా మహిళా శిశుసంక్షేమ శాఖ వరంగల్, మెపా, డీఆర్డీఏ నర్సంపేట ఆధ్వర్యంలో బుధవారం పోష్ యాక్టు–2013పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పని చేసే చోట ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాలు, సమస్యలపై పని చేసే కమిటీల గురించి వివరించారు. సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శోభారాణి మాట్లాడుతూ సఖి సెంటర్ అందిస్తున్న సేవలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, టోల్ ఫ్రీ నంబర్ 181, చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ మధురిమ, ఏసీడీపీఓ జ్యోతి, ఏపీఎం ఝాన్సీ, మెప్మా డీఎంసీ రేణుక, అంగన్వాడీ సూపర్వైజర్లు అరుణ, పారిజాతం, కేస్ వర్కర్ తిరుమల, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ -
దరఖాస్తుదారుల సందడి
ఖానాపురం : పెన్షన్ల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు పరుగులు మొదలు పెట్టారు. ఏళ్ల తరబడి నుంచి పెన్షన్ల మంజూరీ లేకపోవడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని దరఖాస్తులు చేసుకోవడానికి ఆన్లైన్సెంటర్లు మీసేవ కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం కుస్తీలు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో దివ్యాంగ, వితంతు, వృద్ధాప్యతో పాటు పలు రకాల పెన్షన్లు 5025 మంది పెన్షన్ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి నూతన పింఛన్ల మంజూరీ ఆగిపోయింది. దీంతో నాటి నుంచి అనేక మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మ హిళలతో పాటు గౌడ కులస్తులకు పింఛన్ల కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. దీంతో అనేక సంవత్సరాలుగా నూతన పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్న వారిలో ఆశలు రేకెత్తాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో కావాల్సిన పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర పత్రాల కోసం అధికారుల వద్దకు చేరుతున్నారు. దీంతో గ్రామాల్లో పింఛన్ల సందడి నెలకొంది. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు పలు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. వృద్ధాప్యకు ఆధార్, ఓటరు, రేషన్కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, వితంతుకు భర్త మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు గుర్తింపు కార్డులు, బీడీ కార్మికులకు కార్మిక గుర్తింపు కార్డు, దివ్యాంగులకు యూడీఐడీ, 40 శాతానికి పైగా కలిగిన సదరం సర్టిఫికెట్లను తప్పకుండా కలిగి ఉండాలి. సంబంధిత పత్రాలతో దరఖాస్తులను ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అర్హులను అధికారులు గుర్తించనున్నారు. మీ సేవల వద్ద బారులు తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని ఆశలు -
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి
చెన్నారావుపేట: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చెన్నారావుపేట సర్పంచ్ శ్వేత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేడు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దుతుందని, అందుకు అనుగుణంగా తల్లితండ్రులు ప్రభుత్వానికి అండగా నిలబడాలని సూచించారు. మండల కేంద్రంలోని నంబర్ 1 కాలనీ, ఇతర కాలనీల నుంచి విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు పంపిస్తే తాము ఆటో ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచి దొంతి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
సంగెం : ఆరుగాలం శ్రమకోర్చి పండించిన ధాన్యంను తరుగుపెరుతో మిల్లర్లు దోచుకోవడాన్ని అరికట్టాలని అఖిల భారత కిసాన్ పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఎల్గూర్రంగంపేటలో సొసైటీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బస్తాకు 43 కిలోల చొప్పున కాంటాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిల్లర్లతో సెంటర్ నిర్వహకులు కుమ్మకై ్క బస్తాకు 41 కిలోలు కాంటా వేయాల్సి ఉండగా రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సెంటర్ల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రైతులు సొంత ఖర్చులు వెచ్చించి రైస్ మిల్లులకు తరలిస్తున్నారని ట్రాన్స్పోర్టు చార్జీలను రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కన్వీనర్ గోనే రాంచందర్, శ్రీనివాస్, అశోక్, రవి, రామారావు, ఐలయ్య, కొమురయ్య, పాల్గొన్నారు. ధాన్యం తడవకుండా చూసుకోవాలి దుగ్గొండి : వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నదాతలు తాము పండించిన మొక్కజొన్న, ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలి న్ కప్పుకుని రక్షించుకోవాలని మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా రైతులు పంటలు కోయకుండా ఉంటే వాయిదా వేసుకోవాలన్నారు. వర్షం తగ్గిన తర్వాత కోతలు ప్రారంభించాలని పేర్కొన్నారు. కనులపండువగా పెద్దమ్మ బోనాలు చెన్నారావుపేట : ముదిరాజుజ్ కులస్తుల ఆరాధ్యవం పెద్దమ్మ తల్లికి బుధవారం ఆ కులస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. గత ఏడాది వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి పెద్ద పండుగ చేసిన విషయం తెల్సిందే. వా 0ర్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలోని కులస్తులు బోనాలు చేసి డప్పువాయిద్యాలతో అమ్మవారికి నైవేధ్యం సమర్చించారు. కార్యక్రమంలో కుల పెద్దలు మహేందర్, నరేష్, వీరభద్రయ్య, మాజీ సర్పంచి విజయరామరాజు,విజయ్, నరేందర్, భాస్కర్, సంతోష్,తదితరులు పాల్గొన్నారు. -
హజ్రత్ సయ్యద్ జమాలే బహార్ బాబా ఉర్సు
నర్సంపేట: పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లోని హజ్రత్ సయ్యద్ జమాలే బహార బాబా ఉర్సు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలో బుధవారం ఉత్సవాల పోస్టర్ను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు(గురువారం) సంధల్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, రాత్రి 7.30గంటలకు సంధల్ జమా మస్జీద్ నర్సంపేట నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటలకు దర్గా చేరుకుంటుందన్నారు. ఫాతిహా కార్యక్రమం నిర్వహించి సంధల్ ముగించడం జరుగుతుందన్నారు. 29న ఉర్సు కార్యక్రమం దర్గా వద్ద రాత్రి 7.30 గంటలకు ఫాతిహా ఖానీ కార్యక్రమం, 8 గంటలకు అన్నదానం, 8.30 గంటలకు బయాన్, 9గంటలకు ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించడం జ రుగుతుందని తెలిపారు. ఖంధిల్ రాత్రి 9 గంటలకు జామా మస్జిద్ నర్సంపేట వద్ద ప్రారంభమై 11 గంటలకు దర్గా చేరుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో దర్గా గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అప్జల్, ము ర్షద్, హాజీపాషా, అధ్యక్షులు మహమ్మద్ అ హ్మద్, రబ్బాని, వజీర్, జలీల్, రషీద్, యాకుబ్, అ ఖిల్, తాజ్, జాహిద్, సమీర్, సోను, మీర్జా మ సూద్, అలీబేగ్, ఖాదర్, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుదారులకు స్క్రీనింగ్
పర్వతగిరి: ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ 2025–26 సంవత్సరానికి గాను మండలానికి కేటాయించిన టార్గెట్ను అనుసరించి అర్హత గల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి టీఎస్ఓబీఎంఎంఎస్ అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు కన్వీనర్, మండల కమిటీ చైర్మన్ ఎంపీడీఓ శంకర్నాయక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ఐఓబీ, పీఎన్బీ, ఎస్బీఐ నెక్కొండ బ్యాంకు, కెనరా బ్యాంకు అన్నారం బ్యాంకు అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ రిప్రజేంటివ్ నబీ, పంచాయతీ కార్యదర్శి శేషాంజన్స్వామి, తహసీల్దార్ వెంకటస్వావి పాల్గొన్నారు. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ పర్వతగిరి: మండలంలోని గోరుగుట్టతండా సర్పంచ్ విజయలక్ష్మిభాస్కర్ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, ఐకేపీ సెంటర్ హమాలీలు, రైతులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంటాలు, ఉపాధి కూలీల హాజరు జాబితాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఎండలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దేవేందర్, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వాగ్యనాయక్, యూత్ నాయకులు నెహ్రూసుమన్, సంతోష్, వీరకుమార్, రాజు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. రేపు పాలకుర్తిలో జాబ్మేళా రాయపర్తి : పాలకుర్తి మండలకేంద్రంలోని సోమేశ్వర కల్యాణ మండపం వ ద్ద హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే ఫ్రీ జాబ్మేళాను సద్వి నియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోస్టర్లో ఉన్న క్యూ ఆర్కోడ్ను స్కాన్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాటివనం తగులబెట్టిన వారిపై చర్య తీసుకోవాలి చెన్నారావుపేట : మండలంలోని లింగగిరి గ్రామంలో తాటి వనం తగులబెట్టిన వారిపై చర్య తీసుకోవాలని లింగగిరి గౌడ సంఘం అధ్యక్షుడు పులి రమేశ్ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన కడగండ్ల పెద్ద యాకయ్య ఇష్టారాజ్యంగా తాటి చెట్లను తగులబెట్టాడని ఆయన తప్పిదంతో వనంలో తాటి చెట్లు ఎక్కువమొత్తంలో తగలబడి పోయాయన్నారు. గీత కార్మికులకు జీవనోపాధి కల్పించే తాటి చెట్లను తగులబెట్టడం వల్ల వారి కుటుంబ పోషణకు నష్టం కలిగినట్లు తెలిపారు. ధాన్యం బస్తాలు మాయం నర్సంపేట రూరల్ : మండలంలోని భాంజీపేటకు చెందిన రైతు కుమారస్వామి నర్సంపేట వ్యవసాయ మార్కెట్కు నెలరోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొనుగోలు కేంద్రాల్లో మక్కల ధాన్యం నిల్వలు పేరుకపోవడంతో కొనుగోళ్లలో జా ప్యం జరుగుతూ వచ్చింది. ఈనెల 18న కు మారస్వామి తెచ్చిన 168 బస్తాల మక్కలలో 41 మంచి బస్తాలు మాయం అయ్యాయి. వెంటనే అధికారులకు, పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రైతు కుమారస్వామి రోదిస్తూ తెలిపారు. ఈ విషయమై ఎస్సై గూడ అరుణ్ను వివరణ కోరగా మక్కల ధాన్యం బ స్తాలు దొంగతనం జరిగినట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు న మోదు చేసుకొని విచారణ చేపడుతామన్నారు. మాయం వెనకాల ఎవరి హస్తం...? మార్కెట్లో నెలరోజులు మక్కజొన్న బస్తాలు కొనుగోలు జరుగక అలాగే ఉంటున్నాయి. కొనుగోలు జరిగినప్పటికీ వాటిని లిఫ్ట్ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. బస్తాలను మా యం చేయడంలో స్థానికులు ఎవరైనా చేశారా... లేకపోతే దళారీలు చేసిన పనా తెలియాల్సి ఉంది. -
మొరం తరలింపుపై కలెక్టర్కు ఫిర్యాదు
పర్వతగిరి : మండలంలోని కల్లెడ గ్రామంలో అక్రమంగా మొరం తరలింపుపై జిల్లా కలెక్టర్ సత్యశారదకు కల్లెడకు చెందిన కొంత మంది రైతులు అక్రమ మొరం తరలింపును అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. పది రోజులుగా గ్రామ శివారు ఆవకుంట నుంచి జేసీబీ సాయంతో 15 ట్రాక్టర్ల ద్వారా మొరం అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే స్పందించి అక్రమ మొరం అడ్డుకోవాలని రైతులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ స ర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్, రైతులు ఎర్రబెల్లి ప్రకాశ్రావు, ఎర్రబెల్లి కిషన్రావు, కొత్తపల్లి యశోద, కారుపోతుల శ్రీనివాస్, మేడి రామకృష్ణ, జీవన్జీ యాదగిరి, నక్క రాములు, తక్కళ్లపల్లి దే వేందర్రావు, పూర్ణచందర్రావు, తదితరులు ఉన్నారు. -
సబ్సిడీలో జీలుగ విత్తనాలు పంపిణీ
సంగెం : సబ్సిడీపై పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తీగరాజుపల్లిలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. భూమి సారాన్ని పెంపొందించేందుకు, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంట దిగుబడులు అధికం చేయడానికి ప చ్చిరొట్ట సాగు చేసుకోవాలన్నారు. రసాయనిక ఎ రువుల వాడకం తగ్గించడం వల్ల పెట్టుబడి తగ్గుతుందన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ప ట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ తీసుకుని సంబంధిత క్లస్టర్ వ్యవసాయవిస్తరణాఽధికారి వద్ద పర్మిట్ పొందాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలి గీసుకొండ : ప్రభుత్వం సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఊకల్ సొసైటీ చైర్మన్ బొమ్మల రమేశ్ అన్నారు. బుధవారం సొసైటీ వద్ద రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల రైతులకు పెట్టుబడి బారం ఎక్కువ అవడంతో పాటుగా భూములు నిస్సారం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్నంగి జనార్ధన్, సీఈఓ రమేష్, రైతులు పాల్గొన్నారు. -
పంట పొలాలకు వ్యాపిస్తున్న మంటలు
దుగ్గొండి : ప్రమాదవశాత్తు పంట పొలాలకు మంటలు వ్యాపిస్తున్న సంఘటన మండలంలోని నాచి నపల్లిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రా మానికి చెందిన ఓ రైతు తన మొక్కజొన్న సొప్పను తగులబెట్టాడు. ఇదే సమయంలో ఒక్కసారిగా భా రీ గాలులు రావడంతో మంటలు పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పరిసర రైతులంతా కలిసి ఉమ్మడిగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ వేణు, హోంగార్డు ప్రభాకర్లు రైతులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించలేదు. అలాగే రేబల్లె గ్రామంలో ఓ రైతు తన పంట వ్యర్థాలను తగులబెట్టిన క్రమంలో మంటలు భారీగా వచ్చి చుట్టు పక్కలకు వ్యాపించాయి. అప్రమత్తమైన సర్పంచ్ జరుపుల భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శివ గ్రామపంచాయతీ ట్యాంకర్ను తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా ఎస్సై రావుల రణధీర్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవరూ పంట వ్యర్థాలను తగులబెట్టవద్దన్నారు. నేలలోనే దున్నుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్లలో నీరు నింపి ఉంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే సత్వరమే ఆర్పుకునే అవకాశం కలుగుతుందని సర్పంచ్లను సూచించారు. అదుపులోకి తెచ్చిన రైతులు, పోలీసులు -
‘సమాఖ్య’ ప్రగతి పథంలో నడవాలి
గీసుకొండ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఆధ్వర్యంలోని స్థానిక ప్రగతి మండల సమాఖ్య ఐక్యతతో ఆర్థికంగా ప్రగతిపథంలో నడవాలని సె ర్ఫ్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్ అన్నారు. బుధవారం కొనాయమాకులలో సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలను రూ.150 కోట్ల మేర అందించాలన్నారు. సమైఖ్య ఆర్థికంగా బ లో పేతం అవుతూనే పేదల సంక్షేమం కోసం కృషి చే యాలన్నారు. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు రు ణాలను అందించడం, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ తీసుకోవడం లాంటి విషయాలపై సమావేశంలో తీర్మానించారు. గత ఏడాది ఆర్థికలావాదేవీలను కోశాధికారి శిల్ప చదివి వినిపించారు.వీఓలు పద్మావతి, వాణి, స్వర్ణలత, ఉష పాల్గొన్నారు. సంఘాల బలోపేతానికి కృషి ఖానాపురం : మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఎంపీడీఓ అద్వైత సూచించారు. మండల కేంద్రంలోని చైతన్య మండల సమాఖ్య కార్యాలయంలో వార్షిక మహాసభను బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళా సంఘాలు దో హదపడతాయన్నారు. అనంతరం ఉత్తమ వీఓ అధ్యక్షులను సన్మానించారు. ఏపీఎం రమాదేవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి శిరీష, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా మట్టి తరలించొద్దు
ఖానాపురం : అనుమతులు లేకుండా మట్టి తరలించొద్దని మైనింగ్ ఏడీ రవిశంకర్, తహసీల్దార్ నంగునూరి రమేశ్ అన్నారు. మండలంలోని బుధరావుపేట శివారులో మట్టితరలింపు చేపట్టిన ప్రదేశాలను బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టితీసిన భూమిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై ఎఫ్లైన్ పిటిషన్ దరఖాస్తు చేసుకోవాలని భూ యజమానికి సూచన చేశారు. ఫారెస్ట్ భూమిలో మట్టి తరలించిన ప్రదేశాన్ని పరిశీలించి గతంలోనే జరిమానాలు విధించినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమంగా మట్టితరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్వో సుధాకర్, ఆర్ఐ స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా? రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులు -
కొత్త బాస్.. కొత్త రూల్స్!
హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్షెడ్డుకు కొత్తగా వచ్చిన బాస్.. తనకు నచ్చిన రూల్స్ను అమలు చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఏ జిల్లాలో అమలులో లేని నిబంధనలు కొత్తగా తెరమీదకు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలమైన రూల్స్ను రూపొందించిన సదరు బాస్.. డెయిరీ ఉన్నతాధికారులు, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆ ఫైల్ కాస్త పెండింగ్లో ఉన్నట్లు డెయిరీలో చెప్పుకుంటున్నారు. విజయ డెయిరీ వరంగల్ మిల్క్షెడ్ పరిధిలోని ఆరు జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసేందుకు ఇటీవల డిస్ట్రిబ్యూటర్లను ఆహ్వానించారు. గతంలో విద్యా సంస్థలకు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు రెండు రోజులు మహా అయితే వారం రోజులకు సంబందించిన పాల మొత్తాన్ని ముందుగా డెయిరీలో డిపాజిట్ చేసేవారు. అనంతరం ఏ రోజుకు ఆరోజు సరిపడా మొత్తాన్ని చెల్లించి పాలను తీసుకెళ్లేవారు. కొత్త రూల్స్.. ఈ నెల 4న విజయ డెయిరీ వరంగల్ మిల్క్షెడ్ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ధన్రాజ్, గతంలో ఉన్న నిబంధనలు పక్కనపెట్టి సరికొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు సుమారు 1 నుంచి 3 నెలల మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీ ద్వారా డెయిరీకి బాండ్ ఇవ్వాలని మెలిక పెట్టారు. అంతేకాకుండా పాలు సరఫరా చేసే కేంద్రాల్లో డిస్ట్రిబ్యూటర్లే స్వయంగా కోల్డ్స్టోరేజీలను ఏర్పాటు చేసుకోవాలని, పాలు సరఫరా చేసేందుకు పఫ్ వాహనాలను ఉపయోగించాలని తాను కొత్తంగా రూపొందించిన రూల్స్ను డిస్టిబ్యూటర్ల ముందుంచారు. గతంలోనూ, ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ఏ ఇతర జిల్లాల్లో లేని కొత్త రూల్స్ను తెరమీదకు తీసుకురావడంతో డిస్టిబ్యూటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ.. డెయిరీ డిస్టిబ్యూటర్లకు లీటరుకు రూ.55 అందిస్తోంది. రూ.7 లాభం కలుపుకుని రూ.62కు లీటర్ పాలను విద్యా సంస్థలకు అందజేస్తోంది. అందులో వాహన రవాణా చార్జీ, డ్రైవర్ జీత భత్యాలు, నిర్వహణ ఖర్చులు తీసేస్తే డిస్టిబ్యూటర్కు మిగిలేది అంతంతమాత్రమే. అతి తక్కువ కమీషన్తో సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన తమకు లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఎలా సాధ్యం అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా అభివృద్ధి, ఇతర పనులను మూడో వ్యక్తికి అప్పగించేముందు బహిరంగంగా టెండర్లను ఆహ్వానించడం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా విజయ డెయిరీలో ప్రభుత్వ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విశే షం. డెయిరీతో పరిచయం ఉన్న వ్యక్తులకు సమాచారం ద్వారా కొందరిని తన ఆఫీసుకు పిలిచి దరఖాస్తులను ఆహ్వానించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు లేనివిధంగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న డీడీ, బహిరంగంగా టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారు. నష్టం జరగొద్దనే బ్యాంకు గ్యారంటీ గతంలో పాలు సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్లు, డెయిరీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే బ్యాంకు గ్యారంటీలను కోరుతున్నాం. గతంలో ఎప్పుడూ డిస్ట్రిబ్యూటర్ల కోసం టెండర్లను ఆహ్వానించలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఆఫీసుకు ఆహ్వానించి దరఖాస్తులను ఆహ్వానించాం. ఆ ఫైల్ ప్రస్తుతం డెయిరీ చైర్మన్, ఎండీల వద్ద ఉంది. వారు తీసుకున్న నిర్ణయం మేరకు డిస్ట్రిబ్యూటర్లను నియమించడం జరుగుతుంది. – ధన్రాజ్, డిప్యూటీ డైరెక్టర్, వరంగల్ మిల్క్షెడ్ డిస్ట్రిబ్యూటర్లకు బ్యాంక్ గ్యారంటీ మెలిక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు విజయ డెయిరీ డీడీ తీరుపై విమర్శలు -
కలెక్టర్ను కలిసిన ఆర్డీఓ వెంకటేశ్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ములుగు ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకటేశ్ బదిలీపై హనుమకొండ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్కు కార్యాలయ ఉద్యోగులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, వరంగల్, హసన్పర్తి, కమలాపూర్, కాజీపేట మండలాల ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో హెపటైటిస్–బీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందక పేషెంట్లకు ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించి కొనుగోలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ను ఎంజీఎంలోని పిల్లల వార్డు వద్ద పంపిణీ చేస్తుంటారు. ఇక్కడ పిల్లలతో పాటు పెద్దలకు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాక్సిన్ కొరతపై జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాశ్ను వివరణ కోరగా.. పిల్లలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, పెద్ద వాళ్లకు మాత్రం వ్యాక్సిన్ లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ సరఫరా చేసినప్పుడు ఇస్తామని పేర్కొన్నారు. అయితే డయాలసిస్ రోగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్ ఇస్తుంటామని వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ అభ్యర్థులకు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ పార్సీ) సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను, వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సీఈటీ.సీజీజీ. జీఓవీ.ఇన్/టెమ్రిస్ లింక్లో ఈనెల 31వరకు దరఖాస్తులు అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయండి
● హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్● నగరంలో ఆకస్మిక తనిఖీలు.. వరంగల్ అర్బన్/హసన్పర్తి: ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో నిర్లక్ష్యంపై హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గోపాల్పూర్ ఊర చెరువును, ‘వేస్ట్ టు ఆర్ట్’ ప్రాంతాన్ని, హనుమకొండ బాలసముద్రం, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డోర్ టు డోర్ చెత్త సేకరణలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ తగిన స్థాయిలో జరగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56వ డివిజనన్లోని గోపాల్పూర్ ఊర చెరువు సమీపంలో ‘వేస్ట్ టు ఆర్ట్’ కార్యక్రమంలో భాగంగా చెత్త వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. గోపాల్పూర్ ఊర చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించారు. 53వ డివిజన్ ఆదర్శ్ నగర్లో విండో కంపోస్టింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్కుమార్, డీఈ హర్షవర్ధన్, సూపర్వైజర్ నరేందర్, ఎస్సై బాషానాయక్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు వేదికవ్వాలి.. విద్యారణ్యపురి: ఉద్యోగ సాధనలో నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్ వేదికగా నిలవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా అధికారి బి.నిర్మల, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్, వార్డెన్ కృష్ణ, కనకరాజు, బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చట్టంపై విస్తృత అవగాహన కల్పించండి హన్మకొండ అర్బన్: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం–2013 (పోష్ యాక్ట్) పై విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం రూపొందించిన పోష్ యాక్ట్ వాల్పోస్టర్ను కలెక్టర్ చాహత్ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, డాక్టర్ కె.అనితా రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి జిల్లాలో రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తహసీల్దార్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో భూభారతి పోర్టల్, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా దరఖాస్తులు తదితర రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరకాల ఆర్డీఓ డీఎస్.వెంకన్న, వివిధ మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు, కాటారంలో పర్యటన -
జోరుగా జూదం!
● వరుసగా పట్టుబడుతున్న పేకాటరాయుళ్లు ● దృష్టిసారించని లోకల్ పోలీస్! వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పేకాట మూడు ముక్కలు.. ఆరు జోకర్ల మాదిరిగా విరజిల్లుతోంది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసినా జోరుగా సాగుతోంది. స్థానిక పోలీసులకు చిక్కని పేకాటరాయుళ్లు కమిషనరేట్ కేంద్రంలో ఉండే టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడుతున్నారు. స్థానిక పోలీసులు నో ఇన్ఫర్మేషన్ పేరిట చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ట్రైసీటి పరిధిలో పట్టుబడిన పేకాట రాయుళ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారే. విలాసవంతమైన హోటళ్లను బుక్ చేసుకుని పేకాడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీఐపీలు నివాసించే కాలనీల్లో పేకాడుతూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ? ప్రతిసారి పేకాట రాయుళ్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు మాత్రమే చిక్కుతున్నారు. లోకల్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రజల మధ్య విజి బుల్ పోలీసింగ్ చేస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి పేకాట సమాచారం ఎందుకు రావట్లేదో అర్థం కానీ పరిస్థితి. ముఖ్యంగా బ్లూకోల్ట్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లోనే తిరుగుతూ విధులు ముగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజిబుల్ పోలీసింగ్ సరిగ్గా లేక ట్రైసిటీలో వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నాయని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. పేకాట శిబిరాల్లో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న బడాబాబులు చిక్కుతున్నారు. ఇటీవలి కొన్ని ఘటనలు.. ● ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పేకాట శిబిరంపై దాడి చేసి పేకాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73,860 నగదు, 9 సెల్ఫోన్లు 8 ద్విచక్రవాహనాలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ● సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 17న పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేయగా.. పేకాడుతూ 10 పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,91 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10న జరిగిన టాస్క్ఫోర్స్ అధికారుల దాడిలో 9 మంది పట్టుబడగా.. వారి నుంచి రూ.1.32 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 8న పేకాట శిబిరంపై దాడి చేయగా 8 మంది పట్టుబడ్డారు. వారి నుంచి రూ.11,700 నగదు, 6 సెల్ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నారు. ● మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 7న టాస్క్ఫోర్స్ అధికారులు పేకాట శిబిరంపై దాడి చేయగా.. 10మంది పట్టుబడ్డారు. వారి నుంచి రూ.30,250 నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 27న టాస్క్ఫోర్స్ అధికారులు పేకాట శిబిరంపై దాడి చేయగా.. 11 మంది పేకాట పట్టుబడ్డారు. రూ.59,340 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతీ సంస్థ బాధ్యత అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రఽణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ హాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (పోష్ యాక్ట్–2013)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం, పరస్పర గౌరవం నేర్పించాలన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ ఎక్కడైనా వేధింపులు జరిగితే 87126 85142 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ.. ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం విద్యాశాఖ అధికారులతో కలిసి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. డీఈఓ రంగయ్యనాయుడు, తహసీల్దార్ ఇక్బాల్, స్థానిక నాయకులు దామోదర్యాదవ్, తీగల జీవన్గౌడ్, శ్యామ్, శివాజీ పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా తరలించాలి.. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా తరలించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వరంగల్ కలెక్టరేట్ నుంచి సత్యశారద పాల్గొన్నారు. -
ప్రారంభానికి ముందే పగుళ్లు
కమలాపూర్: మండలంలోని ఉప్పల్లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్ఓబీపై ప్రారంభానికి ముందే పగుళ్లు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్ రైల్వే గేట్పై నిర్మాణం పూర్తయిన ఆర్ఓబీపై కొద్ది నెలల క్రితం అనధికారికంగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, నాసిరకం కట్టడం, బొగ్గు, గ్రానైట్ లారీల అధిక లోడ్ ప్రభావంతో ఆర్ఓబీపై పగుళ్లు తేలి దెబ్బతిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్ఓబీతో తమకు రైల్వే గేట్ కష్టాలు తప్పాయని, ఉప్పల్లో ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే దశాబ్దాల కల సాకారమైందని సంతోషించాలో, లేక అనతి కాలంలోనే పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరుతోందని బాధపడాలో తెలియట్లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్ఓబీ పైనుంచి గ్రానైట్, బొగ్గు లా రీలు ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో రాకపోకలు సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ను అరికట్టి, ఆర్ఓబీకి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
బక్రీద్కు ఈద్గా మైదానం ముస్తాబు
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఈద్గా మైదానం బక్రీద్కు ముస్తాబైంది. గురువారం ఉదయం 9 గంటలకు జరగనున్న ఈద్–ఉల్–జుహా సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముస్లిం, మైనార్టీ నేతలతో కలిసి ఈద్గా బక్రీద్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్ తన్వీర్ (ముతవల్లి) మైదానాన్ని బుధవారం పరిశీలించారు. ఈద్గాలో మత గురువు మౌలానా హఫీజ్మహ్మద్ నోమాన్ రజా ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలకు 30 వేల మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట షఫీయొద్దీన్, మహిమూద్పాషా, సయ్యద్ మోహిజ్, శౌకత్అలీ, ఎండీ యూసుఫ్ ఉన్నారు. -
‘గో టు విలేజ్’ ను విజయవంతం చేయాలి
రాయపర్తి: గ్రామాల్లో చేపట్టనున్న ఎమ్మార్పీఎస్ గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్పీ జాతీయ నాయకుడు వేల్పుల సూరన్నమాదిగ పిలుపునిచ్చారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన గో టూ విలేజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మే 25 నుంచి జూలై 05 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీయాలన్నారు. గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొని చదువు మానేసిన మాదిగ విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు వశపాక కుమార్, వశపాక మహేందర్, వశపాక విజయ్, కొమురయ్య, వశపాక జస్విత్, వశపాక సన్ని, వశపాక అన్వేష్, బరిగెల దుర్గన్న, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి శాయంపేట : రానున్న బక్రిద్ పండుగను మండలంలోని ముస్లింలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ సుధాకర్రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై జక్కుల పరమేశ్తో కలిసి ఆయన పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బక్రిద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పరస్పర సహకారంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. మత, వర్గ బేధాలు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముళ్ల కలిసి మెలసి ఉండాలని ఆయన సూచించారు. -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. చిరుద్యోగులైన జూనియర్ లైన్మెన్ల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1,119 ఉన్నాయి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదోన్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు భర్తీచేసే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలా మంది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని మేనేజ్మెంట్ -
బక్రీద్కు బందోబస్తు ఏర్పాటు చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హసన్పర్తి: బక్రీద్ పండుగ వేళ ప్రార్థనా స్థలాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని వరంగల్ పోలీస్కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. బక్రీద్ను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ ప్రశాంతంగా నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గోవుల పరిరక్షణకు చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సంతల్లో మూగజీవాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో మత ఘర్షణలో పాల్గొన్న పాతనేరస్తులను బైండోవర్ చేయడంతో పాటు సోషల్మీడియాపై ప్రత్యేక నజర్ పెట్టాలన్నారు. రైతులు నష్టపోకుండా చూడాలి.. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాల పనితీరుపై మంగళవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీసీపీలు అంకిత్కుమార్, దార కవిత, ఏసీపీలు జీతేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డేవిడ్రాజు, ఇన్స్పెక్టర్లు, సంజీవ, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు నాకాబందీ నేరాల నియంత్రణకు నాకాబందీ నిర్వహించిన్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నాకాబందీ నిర్వహించి మాట్లాడారు. మొత్తం 11,286 వాహనాలు తనిఖీ చేసి, వివిధ కారణాలతో 275 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. శాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, దామెర పోలీస్ స్టేషన్పరిధిలో మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్పరిధిలో ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
సౌరవిద్యుత్తో రైతులకు ఆదాయం
● టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రాజేందర్ నర్సంపేట: పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ సూచించారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్లో మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అధ్యక్షతన మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబం తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ సోలార్ వ్యవస్థల వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ అరుణ, పారిజాతం, కౌన్సిలర్స్ బాణాల ప్రసన్న, రజిత, నల్ల భారతి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ ఏ గ్రూప్లో ఇతర కులాలను కలపొద్దు
నర్సంపేట: బీసీ ఏ గ్రూప్లో ఇతర కులాలను కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా యత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రజక కుల ప్రతినిధి ఐలోని శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సంతపూర్తి రవి తెలిపారు. బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆచార్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ ఏ గ్రూప్లోని కులాలకు న్యాయం చేయకుండా ఇతర కులాలు కలపడం సరికాదన్నారు. గంగపుత్ర సంఘ ప్రతినిధి జీజుల సాగర్ మాట్లాడుతూ.. బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ముదిరాజ్లను 7శాతం ఉన్న బీసీ ఏ లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేదర కుల అధ్యక్షుడు షేర్ల శ్రీనివాస్, తడిగొప్పుల మల్లేషం, సాంబరాజు మల్లేషం, తడిగొప్పుల రవి, రవికాంత్, కాపరబోయిన రమేష్, శ్రావణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయడంలో విఫలం
నల్లబెల్లి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్మా విమర్శించారు. అర్హులైన వారందరికీ తక్షణమే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ అబిత్ అలీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన పింఛన్లు, మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి తదితర పథకాలను లబ్ధిదారులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య, నాయకులు కనకం సాల్మన్, పరికి కోర్నేల్, కోపెల శ్రీకాంత్, మామిండ్ల పెద్ద ఐలయ్య, సరిత, శ్రీలత, జ్యోతి పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
● టీపీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డినెక్కొండ: ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి తెలిపారు. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో డ్రెయినేజీ పనులను మంగళవారం నెక్కొండ ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డితో కలిసి రంజిత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలువాల స్వామి ఇంటి నుంచి ఎండీ రాజ్మహ్మద్ ఇంటి వరకు సుమారు రూ.12 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, ఉప సర్పంచ్ సింగం శ్రావణి, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్రెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, నాయకులు బండి శివకుమార్, సింగం ప్రశాంత్, ఈదునూరి ప్రభాకర్, మౌటం కష్పంరాజు, బొమ్మెరబోయిన రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
దేవాదుల కెనాల్ పనులపై చర్చ
నల్లబెల్లి: మండలంలోని గొల్లపల్లిలో దేవాదుల మె యిన్ కెనాల్కు నీటిని మళ్లించే పనులకు సంబంధించి నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి మంగళవారం రైతులతో చర్చించారు. కెనాల్ పనుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో దే వాదుల ప్రాజెక్టు కాల్వల కోసం భూములు కోల్పోయిన తమకు, ఇప్పటివరకు కొందరికి రావాల్సిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరా రు. ఆమె వెంట తహసీల్దార్ ముప్పు కృష్ణ, నీటి పారుదల శాఖ డీఈ యశ్వంత్, ఏఈ స్టీపెన్, నాయకులు నారాయణ, రైతులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలించాలి
● కలెక్టర్ సత్యశారద పర్వతగిరి: బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు మహిళా వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహ రహిత తెలంగాణ కార్యక్రమం మంగళవారం ఎంపీడీఓ కా ర్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో బాల్య వివా హాలు జరగకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఉమా, ఎంపీడీఓ శంకర్నాయక్, తహసీల్దార్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మగుడి నిర్మాణానికి విరాళం
రాయపర్తి: మండలంలోని ఊకల్ గ్రామ పరిధిలోని టేకులతండాలో నిర్మిస్తున్న దుర్గమ్మగుడి నిర్మాణానికి తండావాసుల విజ్ఞప్తి మేరకు రూ.10వేలు అందించినట్లు లేతాకుల రంగా రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీని వాస్రెడ్డి పంపించిన నగదును తండావాసులకు మంగళవారం అందించినట్లు తెలిపారు. అలాగే కొండూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన శాస్త్రబోయిన ముత్తమ్మ, పూస భారతమ్మ కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యంతోపాటు ఆయిల్, ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఫౌండేషన్ ప్రతినిధులు, నాయకులు పూస మధు, కర్ర రవీందర్రెడ్డి, ప్రసాద్, పుల్ల ఎల్లగౌడ్, దేశబోయిన ఉపేందర్, సోమన్న, ఆజ్మీరా నాగేందర్, కిషన్, హరిసింగ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి ఖానాపురం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు. మండల కేంద్రంలో పలురోడ్ల మరమ్మతు పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరమ్మతు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరుచూరి సుబ్బారావు, ఉపసర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు అజహర్, మల్లికార్జున్, శ్రీనివాస్రెడ్డి, గులాంబాబ, బోడ దేవ, నూర్ మహ్మద్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. మక్కల డబ్బులు జమచేయాలి చెన్నారావుపేట: మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కల డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమచేయాలని ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి జన్ను రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుకాలం కష్టపడి, అప్పులు చేసి పంట పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రలో విక్రయిస్తే నేటికీ డబ్బులు జమ చేయకపోవడం సరికాదన్నారు. మక్కలు కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు జమ చేయాల్సిన అధికారులు నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనన్నారు. ఎన్నిక రాయపర్తి: మండలకేంద్రానికి చెందిన ఎనగందుల శ్రావణ్కుమార్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ గతంలో ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నందున ఈ పదవి అప్పగించినట్లు తెలిపారు. గొర్ల కొట్టం దగ్ధం నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు మర్రినర్సయ్యపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న చేనుకు నిప్పంటించడంతో ఆ చేనును ఆనుకుని ఉన్న గాదెం సూరయ్య గొర్లకొట్టం పూర్తిగా దగ్ధమైంది. ఈప్రమాదంలో రూ. 20వేల నగదు, 2 గొర్రెలు, ఇతర సామగ్రి మొత్తం కలిపి రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. బాధితుడు సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం శాయంపేట : 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుణ్యావతి, సునితారెడ్డి అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయొద్దని అన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే టోల్ఫ్రీ నంబర్ 1098 లేదా 100కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం జౌట్రీచ్ వర్కర్ విజయ్కుమార్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
సూర్య ప్రతాపం!
సాక్షి, వరంగల్: 45..45..45.. ఇవేవో ఇంటర్.. ఎంసెట్ ర్యాంక్ ఫలితాలు అనుకునేరు.. కాదు కాదు జిల్లాలో సూరీడు సుర్రుమంటుండడంతో టెంపరేచర్ గడియారంలో ముల్లులాగా గిర్రుమంటోంది. మార్చి నెలలో 38 డిగ్రీల నుంచి మొదలెడితే ఏప్రిల్లో 42 డిగ్రీల వరకు.. ఇక మే నెల వచ్చేసరికి ఏకంగా 45కుపైగా సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగెం మండలంలో 45.7 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ సోమవారం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. వడగాలుల దెబ్బకు గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులతో పాటు పిల్ల లపైనా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఫలితంగా జ్వరాలు, విరేచనాలు, వాంతులు అవుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్ తొలివారం వరకు రోహిణి కార్తె ఉండడంతో అప్పటివరకు మండుటెండలు ఎక్కువగానే ఉండొచ్చు. వరంగల్ న‘గరమే’ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్ 50 నగరాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయని వాతావరణాన్ని అధ్యయనం చేసే వెబ్సైట్ ఏక్యూఐ.ఇన్ స్పష్టం చేస్తోంది. ఇందులో వరంగల్ నగరం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 12 లక్షలకుపైగా జనాభా ఉన్న వరంగల్ నగరం దినదినాభివృద్ధి చెందుతుండడంతో రహదారులకు ఇరువైపులా చెట్లు నాటేందుకు స్థలం ఉండడం లేదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 3,000 చదరపు కిలోమీటర్ల రోడ్డు వ్యవస్థ ఉంటే 50 శాతం సీసీ రహదారులు వేశారు. నగరంలో వాహనాల సంఖ్య పెరగడం కూడా వాతావరణంపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు నగరంలోని కుంటలు, చెరువులు కబ్జా అవుతుండడం కూడా వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయని సిటీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికై నా బల్దియా మేల్కొని చారిత్రక నగరమైన వరంగల్లో చెట్లు, మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకునేలా చూడాలని కోరుతున్నారు. అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యంరోహిణి కార్తె కావడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడూ అలర్ట్లు జారీ చేస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని అత్యవసరముంటే తప్ప బయటకు రావొద్దు. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అలాగే వైద్యులు అందుబాటులో ఉంటారు. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారి జిల్లాలో సుర్రుమంటున్న సూరీడు రోహిణి కార్తె కావడంతో తీవ్ర ప్రభావం 45 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు ఇంట్లో ఉన్నా.. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి ఇప్పటికే వడదెబ్బతో పలువురి మృతి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉక్కిరిబిక్కిరి సూర్యప్రతాపంతో పల్లెల్లో రైతులు, హమాలీలు, ఉపాధి కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడిమితో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అష్టకష్టాలు పడుతూ ఆగమాగం అవుతున్నారు. చెరువుల తవ్వకాలకు వెళ్లిన ఉపాధి కూలీలకు సైతం చెమటలు పడుతున్నాయి. గత మూడురోజులుగా నమోదువుతున్న ఉష్ణోగ్రతలు అందరినీ ఆగమాగం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎం సేవలను అందుబాటులో ఉంచాలని రైతులు, హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యం కొనేవరకూ పోరాటం
ఆత్మకూరు: చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసే వరకూ బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే రైతులు నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడు తూ సీఎం రేవంత్రెడ్డి బుకాయించుడు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పరకాల ఇన్చార్జ్ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్రెడ్డి, రావు పద్మ, విజయ్చందర్రెడ్డి, దశమంతరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పుగల్ల శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల -
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించాలి
హన్మకొండ అర్బన్: డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో డ్రగ్స్ నిర్మూలనపై వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. అనంతరం డీఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, వెంకన్న, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్రెడ్డి, సతీశ్బాబు, అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: పోస్టల్ సర్వీసుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జూన్ 17న ప్రాంతీయ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలాశాఖ వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించుచున్నట్లు ఆయన పేర్కొన్నారు. హనుకొండ, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల పరిధిలోని వరంగల్ డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులు తమ ఫిర్యాదులను పోస్టల్ ఎనవలప్/కవర్పై 54వ ప్రాంతీయ డాక్ అదాలత్, కె.శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ (స్టాఫ్ అండ్ విజిలెన్స్), పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్–500001 చిరునామా రాసి వచ్చే నెల ఐదో తేదీలోగా చేరేటట్లు పంపించాలని ఆయన కోరారు. హసన్పర్తి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్పర్తి, వేలేరు, వంగర, కొడకండ్ల బండారుపల్లి గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖా ళీగా ఉన్న వివిధ సబ్జెక్టులు బో ధించేందుకు అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కన్వీనర్ రామారావు తెలిపారు. పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ బోధించేందుకు ఉపాధ్యాయులు, ఇంటర్లో మ్యాఽథ్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ బోధించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సమీపంలోని గురుకుల విద్యాల యం, హసన్పర్తిలోని తెలంగాణ బాలికల వి ద్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జూన్ 3న ఎర్రగట్టుగుట్ట సమీ పంలోని తెలంగాణ బాలిక పాఠశాల, కళాశాలలో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. హన్మకొండ అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టారు. హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, డీఆర్వో శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. హనుమకొండ జిల్లాలోని నలుగురు నాయబ్ తహసీల్దార్లు, 13 మంది సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 12 మంది ఆఫీస్ సబార్డినేట్లకు స్థానచలనం కల్పించారు. వీరందరికీ బుధవారం బదిలీ ఉత్తర్వులు అందజేయనున్నారు. కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్కు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో 24 మంది గైర్హాజరు అయినట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కోర్సులో 78 మంది విద్యార్థులకు 19 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొ న్నారు. ద్వితీయ సంవత్సరంలో 39 మందికి ఐదుగురు గైర్హాజరు అయినట్లు తెలిపారు. -
బాధిత కుటుంబానికి పరామర్శ
నర్సంపేట: నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ మామ గుండం రాజేందర్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ నాయకులతో కలిసి వెళ్లి రాజేందర్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్గుప్తా, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బీరం భరత్రెడ్డి, భూక్య మాతృరాథోడ్, ఎలకంటి విజయ్, పొన్నాల మనీషప్రకాశ్ పాల్గొన్నారు. వర్ధన్నపేట: పట్టణ కేంద్రంలోని 8వ వార్డుకు ఆడెపు సోమక్క(100) మృతిచెందింది. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చైర్మన్తోపాటు 12వ వార్డు కౌన్సిలర్ తిరుపెల్లి వాణి కుమారస్వామి, నాయకులు బచ్చు గంగాధర్రావు, పూజారి శ్రీనివాస్, తిరుపతి సారయ్య, మార్త సారంగపాణి, బక్కతట్ల రాజు, ఆడెపు ప్రకాశ్, చిదురాల కేదారి, కోల అశోక్, మహేష్ తదితరులు సోమక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
రౌడీ.. మారకపోతే ‘పీడీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: రౌడీషీటర్ల ఆగడాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ పెరుగుతుండటంతో పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్తో పాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు.ఐ దారు రోజులుగా వరంగల్ పోలీసు కమిషనరేట్తో పాటు అన్ని జిల్లాల్లో రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిచి మళ్లీ కౌన్సిలింగ్ చేస్తున్నారు. ‘స్టేషన్’ల వారీగా సమీక్ష.. కౌన్సెలింగ్ ఇటీవల ప్రజావాణి కార్యక్రమాలు, కలెక్టరేట్లు, పోలీస్స్టేషన్లు, కమిషనరేట్కు అందుతున్న ఫిర్యాదుల్లో భూవివాదాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల కేసులే అధికంగా ఉండటం పోలీసుశాఖను అప్రమత్తం చేసింది. రియల్ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి కొందరు రౌడీషీటర్లు ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రౌడీషీటర్ల లిస్టుపై పోలీసుస్టేషన్ల వారీగా సమీక్ష చేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం సుమారు 752 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి రౌడీషీట్లు ఎత్తివేయాలనే ఆలోచనతోపాటు.. నేర ప్రవృత్థిని కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గతంలో చేపట్టినట్లే ఈసారి కూడా ముందుగా కౌన్సెలింగ్ల ద్వారా మార్పు తీసుకురావాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ప్రతీ పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లను పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్లు నిర్వహిస్తున్నారు. నేరాలకు దూరంగా ఉండాలని, సాధారణ జీవితం గడపాలని, లేకపోతే కఠిన చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు సార్లు హెచ్చరించినా మారని వారిపై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించేందుకు ఫైళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక నిఘా.. సీక్రెట్ రిపోర్టులు పోలీస్స్టేషన్ల వారీగా ‘హిస్టరీ షీటర్లు’, ‘రౌడీషీటర్లు’, ‘గూండాలు’, ‘సస్పెక్టెడ్ ఆఫెండర్స్’జాబితాలను నవీకరిస్తున్నారు. వీరి కదలికలపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి నిఘా ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు, సెలబ్రేషన్ల పేరుతో మారణాయుధాలను ప్రదర్శించడం, రీల్స్ ద్వారా భయాందోళనలు సష్టించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు.. ప్రజల్లో భద్రతాభావం పెంచడం, ట్రైసిటీస్లో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్లతో మారిన వారికి సహకరిస్తామని.. కానీ అదే పద్ధతి కొనసాగిస్తే పీడీ యాక్టు, నగర బహిష్కరణ, బైండోవర్, నిరంతర పర్యవేక్షణ తప్పదని స్పష్టం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 752 మంది రౌడీషీటర్లు మళ్లీ మొదలైన కౌన్సెలింగ్ రౌడీల కట్టడికి మరోసారి పోలీసుల ముందస్తు చర్యలు -
ధాన్యం కొనేవరకూ పోరాటం
ఆత్మకూరు: చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి బుకాయించుడు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అప్పుల కుప్పలు, ఆత్మహత్యలు మిగిలాయని, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పరకాల ఇన్చార్జ్ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ విజయ్చందర్రెడ్డి, దశమంతరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పుగల్ల శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల -
మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు..!
సాక్షిప్రతినిధి, వరంగల్: రౌడీషీటర్ల ఆగడాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ పెరుగుతుండటంతో పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్తో పాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఐదారు రోజులుగా వరంగల్ పోలీసు కమిషనరేట్తో పాటు అన్ని జిల్లాల్లో రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిచి మళ్లీ కౌన్సెలింగ్ చేస్తున్నారు.స్టేషన్ల వారీగా సమీక్ష.. కౌన్సెలింగ్..ఇటీవల ప్రజావాణి కార్యక్రమాలు, కలెక్టరేట్లు, పోలీస్స్టేషన్లు, కమిషనరేట్కు అందుతున్న ఫిర్యాదుల్లో భూవివాదాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల కేసులే అధికంగా ఉండటం పోలీసుశాఖను అప్రమత్తం చేసింది. రియల్ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి కొందరు రౌడీషీటర్లు ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో మళ్లీ రౌడీషీటర్ల లిస్టుపై పోలీసుస్టేషన్ల వారీగా సమీక్ష చేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం సుమారు 752 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి రౌడీషీట్లు ఎత్తివేయాలనే ఆలోచనతోపాటు.. నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గతంలో చేపట్టినట్లే ఈసారి కూడా ముందుగా కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకురావాలని పోలీసుశాఖ నిర్ణయించింది.ప్రతీ పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లను పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నేరాలకు దూరంగా ఉండాలని, సాధారణ జీవితం గడపాలని, లేకపోతే కఠిన చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు సార్లు హెచ్చరించినా మారని వారిపై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించేందుకు ఫైళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక నిఘా.. సీక్రెట్ రిపోర్టులుపోలీస్స్టేషన్ల వారీగా ‘హిస్టరీ షీటర్లు’, ‘రౌడీషీటర్లు’, ‘గూండాలు’, ‘సస్పెక్టెడ్ ఆఫెండర్స్’జాబితాలను నవీకరిస్తున్నారు. వీరి కదలికలపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి నిఘా ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు, సెలబ్రేషన్ల పేరుతో మారణాయుధాలను ప్రదర్శించడం, రీల్స్ ద్వారా భయాందోళనలు సష్టించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు..ప్రజల్లో భద్రతాభావం పెంచడం, ట్రైసిటీస్లో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్తో మారిన వారికి సహకరిస్తామని.. కానీ అదే పద్ధతి కొనసాగిస్తే పీడీ యాక్టు, నగర బహిష్కరణ, బైండోవర్, నిరంతర పర్యవేక్షణ తప్పదని స్పష్టం చేస్తున్నారు. -
ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలిలోని ప్రసిద్ధ నాగ సుభ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్షలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మల్లెపూలతో స్వామివారిని ‘పూజడ’ రూపంలో అలంకరించి భక్తులకు అభిషేకాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్రావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, భక్తులు పాల్గొన్నారు. 24 మంది గైర్హాజరుకాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో మొత్తం 24 మంది గైర్హాజరు అయినట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కోర్సులో 78 మంది విద్యార్థులకు 19 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 39 మందికి ఐదుగురు గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలిన్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి సంబంధిత అధికారులు, రైస్మిల్లర్స్తో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ధాన్యం దిగుమతిని వేగవంతం చేయడానికి తగిన సంఖ్యలో హమాలీలను నియమించాలని మిల్లర్లకు సూచించారు. అంతకుముందు జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంట అవశేషాలు కాల్చొద్దుదుగ్గొండి: రైతులు పంట పూర్తైన తర్వాత పంట అవశేషాలు కాల్చొద్దని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి, ఆత్మపీడీ విజయనిర్మల అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో సూక్ష్మ పోషకాలు నశించి భూమి వేడెక్కుతుందన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే భవిష్యత్ తరాలను మనుగడ ఉంటుందన్నారు. అనంతరం రైతులకు జనుము, జీలుగ విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అఽధికారి శ్రీనివాసరావు, నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్, డివిజన్ ఉద్యానశాఖ అఽధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్, ఏఈఓలు హన్మంతు, విజయ్నాయక్, రాజేష్, రైతులు పాల్గొన్నారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలి రాయపర్తి: రౌడీషీటర్లు గ్రామాల్లో పంచాయితీలకు వెళ్తూ బెదిరింపులకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో నడుచుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రౌడీషీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని, ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కొమ్మూరి శ్రీనివాస్, వర్ధన్నపేట, జఫర్గఢ్, రాయపర్తి ఎస్సైలు సాయిబాబా, రా మారావు, ముత్యం రాజేందర్, బండి సుధాకర్, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు. -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూనియర్ లైన్మెన్ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1119 ఉన్నాయి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదోన్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని మేనేజ్మెంట్ -
ప్రకృతి విపత్తు.. మానవ తప్పిదం!
జిల్లాలో ఒకవైపు ప్రకృతి విపత్తు.. మరోవైపు మానవ తప్పిదం.. వెరసి రైతులకు నష్టం వాటిల్లుతోంది. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. కొందరు రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో గాలి వేగం.. భగ్గుమంటున్న ఎండ తోడు కావడంతో సమీప పొలాలకు మంటలు వ్యాపించాయి. దాచుకున్న పశుగ్రాసం, పొలాల్లోని పైపులు, మోటార్లు కాలిపోయాయి. శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామ శివారులోని బీరన్న గుడి ప్రాంగణంలో మంగళవారం పంట పొలాలనుంచి మంటలు ఎగిసిపడి గ్రామంలోని ఇల్లు, గడ్డివాము, వ్యవసాయ పనిముట్లు, ద్విక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పెద్దకోడెపాక గ్రామంలోని బీరన్న గుడి సమీపంలోని పొలాల్లో వరికొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాప్తించి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆరణలో ఉన్న చెత్తకు అంటుకున్నాయి. పాఠశాలలోని రెండు గదుల్లో ఫర్నిచర్, పిల్లల స్టేషనరీ కాలిపోయింది. అలాగే గ్రామానికి చెందిన అబ్బు భగవాన్రెడ్డికి ఇల్లు, వ్యవసాయ పనిముట్లు దగ్ధమయ్యాయి. అదే విధంగా అబ్బు జనార్దన్రెడ్డికి సంబంధించిన రెండు ద్విచక్రవాహనాలు, ఇంటి ఫర్నిచర్తోపాటు 20 ధాన్యం బస్తాలు, వ్యవసాయ పని ముట్లు, అబ్బు రఘుపతిరెడ్డికి చెందిన 60 సైపాన్ బ్లాక్ పైపులు, అబ్బు రాజిరెడ్డికి చెందిన 400 కట్టల గడ్డివాము దగ్ధమైంది. దీంతో యువకులు ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ఫైరింజన్ సమయానికి రాకపోవడంతో గ్రామస్తులు, యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గంట తర్వాత ఫైరింజన్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్సై పరమేశ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చర్లపల్లి, కంఠాత్మకూరులో.. నడికూడ: ఈదురు గాలులతో కురిసిన వర్షం మంగళవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. చర్లపల్లి గ్రామానికి చెందిన దూడే రాజయ్య ఇంటి రేకులు ఎగిరిపోవడంతోపాటు మిర్చి పంట తడిసి ముద్దయ్యింది. సల్మాన్ఖాన్కు చెందిన హోటల్ పైకప్పు రేకులతోపాటు గోడ కూలిపోయింది. కంఠాత్మకూరులో చెట్టు పడిపోయింది. సర్పంచ్ తిరుపతి జేసీబీ సాయంతో తొలగించారు. కమలాపూర్లో..కమలాపూర్: ఈదురు గాలులకు మండలంలో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. కమలాపూర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా సిబ్బంది పునరుద్ధరించారు. గడ్డి కట్టలు దగ్ధం వేలేరు: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని సుమారు వెయ్యి గడ్డి కట్టలు, 20 గుంటల మిర్చి పంట, పైపులతోపాటు రెండు బర్రెలకు గాయాలైన ఘటన గొల్లకిష్టంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పొలంలోని మొక్కజొన్న కొయ్యలు కాల్చాడు. మంటలు ఆరిపోయాయని ఇంటికి వెళ్లగా గాలికి తిరిగి మంటలు చెలరేగి పక్కనున్న ఎండిపోయిన చెట్టుకు అంటుకున్నాయి. అక్కడి నుంచి కరెంట్ తీగలపై పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ట్రాన్స్ఫార్మర్తో పాటు రైతులు బత్తుల రాజు, సంజీవరెడ్డి, జినుకల శంకర్కు చెందిన మిర్చి పంట, గడ్డి కట్టలు, పైపులు దగ్ధమయ్యాయి. మంటలతో రెండు బర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. నేలకొరిగిన వందేళ్ల ఊడల మర్రి చెట్టు.. శాయంపేట: ఈదురుగాలులకు అప్పయ్యపల్లె గ్రామ శివారులో ఉన్న వందేళ్లకు పైబడిన ఊడల మర్రి చెట్టు నేలకొరిగింది. గత వేసవిలో గుర్తుతెలియని వ్యక్తులు చెట్టు మొదట నిప్పు పెట్టగా స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పివేశారు. అప్పటి నుంచి చెట్టు కాలిపోయిన భాగం తొర్రలా మారింది. ఈదురు గాలుల కు నేలకొరడంతో ప్రగతిసింగారం నుంచి కటాక్షపూర్కు వాహనాల రాకపోకలకు అంతరాయం కలి గింది. అప్పయ్యపల్లె సర్పంచ్ రాంపురి సుప్రియ జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలుల బీభత్సం నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పంట వ్యర్థాలకు మంట పెడుతున్న రైతులు పెద్దకోడెపాకలో పాఠశాలలోకి వ్యాపించిన మంటలు -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి సంగెం: మహిళల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి అన్నారు. మహిళశక్తి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని గుంటూరుపల్లిలో అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కాపులకనిపర్తి, ఆశాలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్, గవిచర్ల, సోమ్లాతండా, పెద్దతండా, తీగరాజుపల్లి గ్రామాల్లో నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆశాలపల్లిలో ప్రేమ్ స్వరూప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, పీఆర్డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ అభిరామ్, మహిళ సమైక్య అధ్యక్షురాలు ఉమాదేవి, సర్పంచ్లు శ్రీకాంత్, చంద్రమౌళి, శ్రావణి, శ్రీనివాస్, సదయ్య, గోపాల్, వినోద, సంధ్య, మల్ల మ్మ, మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్, నాయకులు మాదవరెడ్డి, రమేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన మహిళ హత్య కేసు.. నిందితుడి అరెస్ట్!
దుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఓ మహిళను గొంతుకోసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రియుడే హంతుకుడని తేల్చారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవీందర్రెడ్డి వివరాలు వెల్లడించారు.లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత భర్త మహేందర్ నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పాండవుల సురేశ్తో సుమలత సన్నిహిత సంబంధం కొనసాగిస్తుంది. వీరికి సన్నిహిత్యాన్ని గ్రామస్తులు, కాలనీ వాసులు ప్రశ్నించి హెచ్చరించడంతో అప్పటి నుంచి సురేశ్ను సుమలత దూరం పెట్టింది. ఇదే క్రమంలో మూడు నెలల క్రితం నుంచి సుమలత మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది.తరచూ వీరిద్దరూ కలుసుకోవడాన్ని అనుమానిస్తూ సురేశ్ వారిని గమనిస్తూ హనుమకొండ వరకు వెళ్లాడు. బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జి వద్ద వారు ఇద్దరూ కనిపించడంతో వారిద్దరితో సురేశ్ గొడవ పడి కొట్టాడు. దీంతో అప్పటి నుంచి సుమలత.. సురేశ్ను పూర్తిగా దూరం పెట్టింది. దీనిని సురేశ్ తట్టుకోలేక పోయాడు.పక్కా ప్రణాళికతో దారుణంగా గొంతు కోసి..ఎలాగైనా సుమలతను కడతేర్చాలని నిర్ణయించుకున్న సురేశ్ ఈనెల 20న హనుమకొండకు రావాలని ఫోన్చేసి బతిమిలాడాడు. దీంతో కరిగిపోయిన సుమలత హనుమకొండకు వెళ్లింది. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆటోలో బస్టాండ్ వచ్చారు. బస్టాండ్లో సుమలతను ఉండమని చెప్పి బైక్ తెచ్చుకోవడానికి వెళ్లిన సురేశ్ అక్కడే మద్యం సేవించాడు.అనంతరం కాశిబుగ్గలో కత్తిని కొనుగోలు చేసి హనుమకొండ బస్టాండ్కు వచ్చి సుమలతను ఎక్కించుకుని లక్ష్మీపురం బయల్దేరాడు. ఎలుకుర్తి(హవేలీ) దాటగానే రాత్రి సమయంలో ఎస్సారెస్పీ చిన్న కాల్వ దగ్గర కాసేపు మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసిన అనంతరం అనుమానం రాకుండా ప్రేమగా మాట్లాడుతూనే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు.మృతదేహాన్ని పక్కన ఉన్న కాల్వలోకి తోసేశాడు. దీనిపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సురేశ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా, కేసు చేధనలో ప్రతిభ కనబరిచిన సీఐ సాయిరమణ, ఎస్సై రణధీర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ రంజిత్కుమార్ను ఏసీపీ రవీందర్రెడ్డి అభినందించారు. -
రోడ్డెప్పుడేస్తారు?
మూడేళ్లుగా నిలిచిన గోపాలపురం– గొల్లపల్లి రహదారి పనులు దుగ్గొండి: మండలంలోని గోపాలపురం– గొల్లపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనులు మూడేళ్ల క్రితం ప్రారంభమైనా.. నేటికీ పూర్తికాకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1.8 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 2023 జనవరిలో ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం అదే సంవత్సరం మార్చిలో కాంటాక్టర్ పనులు ప్రారంభించినా.. నేటికీ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ప్రమాదకరంగా కంకర రోడ్డు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టులు పూర్తి చేసి కంకర పరిచారు. అనంతరం మూడు సంవత్సరాలుగా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రోడ్డంతా కంకరతో ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వా హనాలు, సైకిళ్లు తరచూ పంచర్లు అవుతున్నాయి. దుక్కిటెద్దులు కంకరపై నడవలేక అనారోగ్యం భారి న పడుతున్నాయి. రోడ్డుపైన ప్రయాణిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయి మూడేళ్ల కాలంలో నలుగురు గాయాలపాలయ్యా రు. రోడ్డుపైన ప్రయాణం ప్రాణాంతకంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైన దుమ్ము దూళీ కారణంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోసం ఈఈ ఇజ్జగిరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కంకర పరిచి.. బీటీ మరిచిన కాంట్రాక్టర్ ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు వానలు పడేలోగా బీటీ వేయాలి గోపాలపురం నుంచి గొల్లపల్లి వరకు కంకర వేసి వదిలివేయడం వల్ల మూడేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇదే రోడ్డు వెంట పంట పొలాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎద్దుల బండితో పంట ఉత్పత్తులను ఇంటికి తీసుకొద్దామంటే ఎడ్లు నడవలేకపోతున్నాయి. ట్రాక్టర్ల యజమానులు పంచర్లు అవుతాయని రావడం లేదు. వర్షాలు ప్రారంభమయ్యేలోగా బీటీ వేసి కష్టాలు తీర్చాలి. – కట్కూరి కోమల, సర్పంచ్ గోపాలపురం -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
సంగెం: ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరంగల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి ఎన్.తిరుపతి అన్నారు. మండలంలోని గవిచర్లలో కడ్డూరి చంద్రయ్య ఆయిల్పామ్ తోటలో పంట సాగు, యాజమాన్య పద్ధతులపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్లో నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం క్రమం తప్పకుండా పాటించాలని తెలిపారు. ఎకరానికి ప్రతీ నెల 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 3 కిలోల పోటాష్, 1.25 కిలోల మెగ్నీషియం, పావుకిలో బోరాక్స్ డ్రిప్లో ఫెర్టిగేషన్ ద్వారా అందించాలన్నారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ.. పూర్తిగా నారింజరంగులోకి వచ్చిన తర్వాతనే గెలలు కోయాలని తెలిపారు. ఆయిల్ పామ్ 30 నెలల వయస్సు వరకు ప్రతీ 15 రోజులకు ఒకసారి పూలగుత్తులను తొలగించాలని తెలిపారు. ఇలా తొలగించడం వల్ల చెట్టు కై వారం పెరిగి ఎక్కువ గెలలు వస్తాయని వివరించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. కార్యక్రమంలో రైతులు ఉద్యాన విస్తరణాధికారి వేణు, రైతులు గూడ సుదర్శన్రెడ్డి, చంద్రయ్య, దేవిసింద్, కూస రాజీరు, దొనికెల శ్రీనివాస్, గడ్డం బుచ్చయ్య తదతరులు పాల్గొన్నారు. ఉద్యానశాఖ అధికారి తిరుపతి -
ధాన్యం బస్తాలకు దుండగుల నిప్పు
కొప్పుల గ్రామంలో ఘటన శాయంపేట: మండలంలోని కొప్పుల గ్రామ శివారులో ధాన్యం బస్తాలకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కొప్పుల గ్రామానికి చెందిన గండి హనుమంతు గ్రామ శివారులోని 3 ఎకరాల్లో వరిపంట సాగుచేయగా 110 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్ కోసం రైతు వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాప్తించి 110 వడ్ల బస్తాలు, పైపులు మోటార్లు కాలిపోయాయి. తమకు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని హనుమంతు కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
నీటి సమస్యకు పరిష్కారం
వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధి లోని రెండో వార్డులో గత నాలుగు నెలలుగా నీటి సరఫరా లేక ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. దీంతో ప్రజల విన్నపం మేర కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బానోతు జ్యోతి నవీన్, గుజ్జ వీరన్న, సిలువేరు కుమారస్వామి, తిరుపతి, సురేష్ వెంటనే స్పందించారు. సంబంధిత మున్సిపల్ ఏఈతో మాట్లాడి సమన్వయంతో వాటర్ ట్యాంక్ వద్ద పాడైన గేట్ వాల్వ్ మార్పించడంతోపాటు ఇతర సాంకేతిక లోపాలను సరిచేయించారు. దీంతో ఆదివారం నీటి సమస్యను పరిష్కారమైంది. కార్యక్రమంలో తుమ్మల శ్రీధర్, సింగరబోయిన రాజశేఖర్, వార్డు ప్రజలు పాల్గొని అధికారులు, కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 23 సంవత్సరాల అనంతరం మళ్లీ కలుసుకోవడంతో ఒకరినొకరు ఆనందంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి గురువులు సోమదాసు, రమేష్బాబు, రాములు, రవీందర్, రమాదేవి, దేవకర్ణను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నాగరబోయిన రాజుకుమార్, స్వామి, ప్రశాంత్, వినయ్, రాజు, జే.స్వామి, బి.ఐలయ్య, అక్కెల్లి ప్రవీణ్, నల్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. లక్నెపల్లిలో.. నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని లక్నెపల్లి జిల్లా పరిషత్ సెంకడరీ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2008–09 పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఖలీల్పాష, బాలకృష్ణ, రామకృష్ణ, సంతోష్, రాజ్కుమార్, ప్రవీణ్, లింగయ్య, నవీన్, కుమారస్వామి, ప్రశాంత్, ప్రసాద్, రాజేశ్వర్, అనిల్, మహేష్, కిరణ్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. నెక్కొండ: మండల కేంద్రంలో హైస్కూల్లో హెడ్మాస్టర్ శ్రీదేవి అధ్యక్షతన 2010–2011 పదోతరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. స్నేహితులతో ఆటపాటలతో సందడి చేశారు. విద్యాబుద్దులు నేర్పిన గురువుల సేవలను స్మరించుకుంటూ...వారి మార్గదర్శకత్వం ఎంతగానో దోహదపడిందని వారు పేర్కొన్నారు. నాటి గురువులైన మెట్టు నర్సింహరెడ్డి, బుర్ర రవీందర్, బూరుగుపల్లి శ్రవణ్కుమార్, తంగళ్లపల్లి రవీంద్రనాథ్, రవీందర్రెడ్డి, పి.సాంబయ్య, ఎండీ.నజీరుద్దీన్, బి.బాలశివారెడ్డి, పూర్వ విద్యార్థులు ఈదునూరి మహేష్, రామారపు శిరీష, నగేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సెలవుల్లో పెరుగుతున్న దొంగతనాలు
నర్సంపేట: వేసవి సెలవులు కావడంతో పలువురు ఇళ్లకు తాళాలు వేసి పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదనుగా భావించిన దుంగడులు ఇళ్లకు తాళం వేసి ఉన్న చోట దొంగతనాలకు పాల్పడుతున్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులో గజ్జి రవిసునీత నివాసముంటున్నారు. ఈక్రమంలో ఆదివారం వారు చర్చిలో ప్రార్థనలకు వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మూడున్నర తులాల బంగారం, రూ.40వేల నగదు అపహరించారు. విషయం తెలిసిన పట్టణ సీఐ ముస్కు శ్రీనివాస్ టీం అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెలవులకు ఊరెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో దొంగతనాల విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దొంగలు రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సీఐ తెలిపారు. పోలీసుల సూచనలు ఇవి... ● దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు కానీ, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచకూడదు. ● అవకాశం ఉంటే బ్యాంకులో భద్రపర్చుకోవాలి. ● రాత్రి వేళ ఇంటి ముందు విద్యుత్ దీపాలు వెలిగేలా చూసుకోవాలి. ● ఇంటికి వేసే తాళం కనిపించకుండా కర్టన్ను అడ్డుగా ఉంచుకోవాలి. ● ఇంటిని విడిచి వెళ్లే ముందు సమీప బంధువులు, నమ్మకమైన పొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ● పూలకుండీలు, షూ ర్యాకులు, డోర్ మ్యాట్ల కింద ఇంటి తాళం చెవులు పెట్టవద్దు. ● ఊరికి వెళ్లే ముందు వాట్సాప్లో కానీ, ఇతర సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని అనుసరించి దొంగలు పసిగట్టి చోరీ చేసే అవకాశం ఉన్నది. ● ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేసేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ● ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. ● కుటుంబ సమేతంగా ఊరు వెళ్లే వారు సమీప పోలీస్స్టేషన్కు తెలియజేస్తే రాత్రి వేళ పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచుతారు. నిఘా పెంచుతున్నాం.. వేసవి సెలవుల్లో ఊరెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో నిఘా పెంచడానికి వీలుంటుంది. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు జరుగుతున్న చోరీలను పసిగట్టాం. ప్రజలు తప్పనిసరిగా పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. – ముస్కు శ్రీనివాస్, సీఐ, నర్సంపేట టౌన్ నర్సంపేటలో మూడున్నర తులాల బంగారం, రూ.40వేల నగదు అపహరణ -
ఇటుక బట్టీలకు తరలుతున్న చెరువు మట్టి
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని కోపాకుల చెరువులో నల్లమట్టిని కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. వ్యవసాయ అవసరాల పేరిట నీటి పారుదల శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఇటుకబట్టీలకు మట్టిని తరలిస్తున్నా రు. మట్టితరలింపును అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పో లీసు, ఐబీ అధికారులు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో చెన్నారావుపేట గ్రామస్తులే అర్ధరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి మట్టితరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. అసలేం జరిగింది..! చెన్నారావుపేట మండల పరిధిలోని చెన్నారావుపేట, కోనాపురం, అక్కల్చెడ, జోజిపేట, ఖాదర్పే ట, పాతమగ్దుంపురం, గొల్లపల్లి తదితర గ్రామాల రైతులకు కోపాకుల చెరువువే ఆధారం. ఈ చెరువు నీటితోనే వ్యవసాయం చేస్తారు. అలాంటి చెరువు మట్టిపై కొంతమంది కన్నేశారు. నర్సంపేటకు చెందిన అధికార పార్టీ నాయకుడు ఓర్సు తిరుపతి అధికారుల అండతో వ్యవసాయ పేరుతో కోసమని 250 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపునకు ఐబీ అధి కారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ఆ అనుమతి సాకుతో శనివారం మధ్యాహ్నం కోపాకుల చెరువుతో జేసీబీలు, ఇటాచీలు, టిప్పర్లతో మట్టి తరలింపు ప్రారంభించాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు విషయం తెలుసుకుని రెవెన్యూ, పోలీ సు అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన రాలేదు. దీంతో 100 డయల్ చేశారు. ఐనప్పటికీ అధికారులు రాకపోవడంతో గ్రామస్తులే మట్టితరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ తతంగం మొత్తం దాదాపు తెల్లవారుజాము 2 గంటల వరకు సాగింది. గ్రామస్తులు ఇళ్లకు వెళ్లిన వెంటనే మళ్లీ మ ట్టి తరలింపు ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే మాధవరెడ్డికి ఫోన్ చేస్తే కానీ అధికారులు రంగంలోకి దిగని తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోపాకుల చెరువు కింద అధికారికంగా 500 ఎకరాలు, అనధికారికంగా మరో 300 ఎకరాలు సాగు అవుతుంది. అర్ధరాత్రి వరకు నడుస్తున్న టిప్పర్లు అడ్డుకున్న గ్రామస్తులు -
మొరం దోపిడీని నియంత్రించాలి
● కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చరణ్ సింగ్ నల్లబెల్లి: ఏజెన్సీ ప్రాంతంలోని రంగయ్యచెరువులో బీఆర్ఎస్ నాయకుల మొరం దోపిడీని అధికారులు నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్టీ నాయకులు ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్ మోహన్తో కలిసి రంగయ్య చెరువులో చేపడుతున్న మొరం తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, అడ్డుకోవాల్సిన నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మామూళ్లకు అలవాటుపడిన సదరు అధికారి కనుసన్నల్లోనే ఈ మొరం దోపిడీ సాగుతోందని విమర్శించారు. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి పర్యావరణాన్ని గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహరంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందిస్తూ సమగ్ర విచారణ జరపాలన్నారు. -
జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపిక
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్ విద్యార్థిని ఏ.చందన సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు జిల్లా బేస్ బాల్ కార్యదర్శి అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈనెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ.. చందన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొనడం గర్వకారణం అన్నారు. ఈసందర్భంగా చందన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా చందన, కోచ్ అన్వేష్ను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ప్రశాంత్కుమార్, రియాజ్, రాజేష్, మధు, పృథ్వి అభినందించారు. -
వ్యర్థాలకు నిప్పు.. పర్యావరణానికి ముప్పు
సంగెం : పంటలు చేతికొచ్చాక వ్యవసాయ భూముల్లో మిగిలిన వ్యవసాయ వ్యర్థాలను రైతులు కాల్చుతున్నారు. దీంతో భూసారం తగ్గిపోవడంతోపాటు సమీపంలోని పచ్చని చెట్లు మంటల్లో కాలిపోయి దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పంటపొలాల గట్లకు నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పెద్దగా అయ్యాయి. ప్రస్తుతం రైతులు పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో పంటలు ఆ చెట్లకు అంటుకుని చనిపోతున్నాయి. దీంతోపాటు పంటలకు మేలు చేసే పలురకాల కీటకాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. చెట్ల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇంత చేస్తున్నప్పటికీ మొక్కల సంరక్షణపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో హరితహారం లక్ష్యం నెరవేరడం లేదు. రైతులకు అవగాహన కల్పించాలి హరితహారంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యాయి. వాటిపై అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలి. కానీ, వారు విధులు నిర్వర్తించడంతో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, గ్రామాల అంతర్గత, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తగులుతున్నాయని విద్యుత్ శాఖ వారు నరికి వేస్తుండగా అవి మోడువారి పోతున్నాయి. ఇక మిగిలిన చోట్ల మండలంలోని కుంటపల్లి, సంగెం, తిమ్మాపూర్, పల్లారుగూడ, నల్లబెల్లి, మొండ్రాయి, గవిచర్ల, తీగరాజుపల్లి, కాట్రపల్లి, ఆశాలపల్లి, వెంకటాపూర్ తదితర గ్రామాల్లోని రైతులు తమ పంట పొలాల్లోని మొక్కజొన్న, వరి కొయ్యల వ్యర్థాలకు నిప్పంటిస్తున్నారు. గాలివాటానికి పక్కనే ఉన్న హరితహారం చెట్లు కాలిబుడిదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారులకు రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రైతులకు మొక్కల సంరక్షణ బాధ్యతలు అప్పంగించడం ద్వారా ఈ నష్టాన్ని తగ్గించవచ్చని పర్యావరణప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి విలువైన పచ్చని వృక్షసంపద అగ్నికి ఆహుతి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. తిమ్మాపూర్లో కాలిపోయిన బృహత్ పల్లె ప్రకృతి వనం గాంధీనగర్ వద్ద కాలిపోయిన హరితహారం చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్న హరితహారం చెట్లు పంట వ్యర్థాలను కాల్చొద్దంటున్న నిపుణులు -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ వేముల ఇంద్రదేవ్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు తాము పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించుకుని నష్ట పోకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆనందం, ప్రతిభ గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు రజిత, వీఓఏ నరిగె బాబు, వార్డు సభ్యులు ఇటుకాల రవి, విజయలత, రైతులు ఈర కుమారస్వామి, జంపయ్య, మహేందర్, మోహన్, వేణు, రమేష్, సారయ్య, శ్రీను, కృష్ణాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం గీసుకొండ : మండలంలోని రాంపూర్లో గ్రామ పంచాయతీ నిధులు రూ.6 లక్షలతో చేపట్టిన 140 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులు సర్పంచ్ రడం భరత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి సూరయ్య, మాజీ సర్పంచ్ గాజర్ల గోపి, మాజీ ఉపసర్పంచ్ దర్శనాల కుమారస్వామి, గుడి చైర్మన్ తాబేటి వెంకటేశ్వర్లు, గజ్జి రవి, మర్రెరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నియామకం వర్ధన్నపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హనుమకొండ జిల్లా కన్వీనర్గా మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన బెల్లం కార్తీక్ నియమితులయ్యారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ ప్రాంత అభ్యాస వర్గాలో రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ.. కార్తీక్ నియామకాన్ని ప్రకటించారు. కార్తీక్ గతంలో వరంగల్ మహానగర సంయుక్త కార్యదర్శిగా, వరంగల్ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్గా, రెండు సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, వరంగల్ మహానగర కార్యదర్శిగా పనిచేశారు. గడ్డి వాము దగ్ధం దుగ్గొండి: ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి వరిగడ్డి వాము అంటుకున్న ఘటన మండలంలోని కేశవాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రా మానికి చెందిన దుర్గునాల సురేష్కు చెందిన వరిగడ్డి వాముపైనుంచి ఉన్న విద్యుత్ తీగలు గాలిదూమారానికి ఒకదానికొకటి తగిలి మిరుగులు లేచి గడ్డిపై పడ్డాయి. దీంతో గడ్డివాము అంటుకుంది. మంటలు పక్కనే ఇళ్లకు అంటుకోకుండా గ్రామ యువకులు గ్రామపంచాయ తీ ట్యాంకర్ సాయంతో మంటలు ఆర్పి వేశా రు. దీంతో పెనుప్రమాదం తప్పింది. కార్యక్రమంలో సర్పంచ్ బాదరగాని రమరమేష్, గ్రా మ యువకులు దిలీప్, ప్రశాంత్, సురేష్, సందీప్, కరుణాకర్, నరేష్, కిరణ్ పాల్గొన్నారు. పరిశోధనలను వెలుగులోకి తీసుకురావాలి హన్మకొండ కల్చరల్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో గత మూడు దశాబ్దాలుగా సేకరించిన పరిశోధనలను పుస్తకరూపంలో ముద్రించి వెలుగులోకి తీసుకురావాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నా రు. ఇటీవల అకాడమీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనను హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో వరంగల్ జానప ద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో పీఠం అధ్యాపకులు, సిబ్బంది ఆదివారం మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ, ఇతర పోటీ పరీక్షల కోసం విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నాణ్యమైన పుస్తకాలను అకాడమీ ముద్రిస్తుందని చెప్పారు. కేయూ దూరవిద్య కేంద్రం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొట్టె భాస్కర్, పీఠం అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధిత కుటుంబానికి పరామర్శ
నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్ నానమ్మ బిట్ల వెంకటమ్మ ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మృతదేహంపై టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్కుమార్, బీరం భరత్రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, లక్కార్స్ రమేష్, మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమలసదానందం, చిప్ప నాగ, నాయకులు కోల చరణ్గౌడ్, శంకరబత్తుల శివ, గొర్రె నవీన్, వేల్పుల కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవోజు హేమంత్, శ్రీను పాల్గొన్నారు. రాయపర్తి: ఇటీవల మృతిచెందిన మండలంలోని కొత్తరాయపర్తికి చెందిన గారె వెంకన్న కుటుంబ సభ్యులను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, మాజీ సర్పంచ్ గారె నర్సయ్య ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్రెడ్డి చేకూర్చిన బియ్యంతోపాటు ఆయిల్క్యాన్ను బాధిత కుటుంబానికి అందించినట్లు నర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గారె కల్యాణివిష్ణు, గారె యాకూబ్, నాయకులు గారె భిక్షపతి, గారె ఎల్లయ్య, గారె మల్లయ్య, గారె వెంకన్న, గారె బాబు, గారె కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పిట్టల్లా రాలుతున్నారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22 మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చని పోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, అలసట, జ్వరం, తలనొప్పి, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్, బీపీ బాధితులు, రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు.. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాతభూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాజీపేటకు చెందిన వి.వెంకటేశ్ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు. 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఎండలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘటనలు -
ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలి
కాశిబుగ్గ: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు సూచించారు. వైద్యరంగంలో వరంగల్ జిల్లాను అన్ని విభాగాల్లో ముందుంచాలని, ప్రత్యేకంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం కింద క్షేత్రస్థాయిలో ఎక్స్రే క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. వరంగల్ ఐఎంఏ హాల్లో వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమం కింద క్షేత్రస్థాయిలో గర్భిణులను గుర్తించి నమోదు చేయాలని, జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ ఇక్తాదర్ అహ్మద్, డాక్టర్ అరుణ్ జోషి, డాక్టర్ విజయ్కుమార్, జిల్లా మలేరియా విభాగం అధికారి రజిని, డిప్యూటీ డెమో అనిల్కుమార్ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు -
ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం
సంగెం : ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న మండలంలోని గుంటూరుపల్లి ఉపసర్పంచ్ దండా నరేశ్ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో శనివారం శాలువా కప్పి సన్మానించారు. తొలుత ఎమ్మెల్యేను నరేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేశ్ను ఎమ్మెల్యే అభినందించాఉ. ప్రజాసమస్యలకే పరిమితం కాకుండా ఉపసర్పంచ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి నాయకులు మాధవరెడ్డి, హరిబాబు, కేశవులు, సంపత్, సదయ్య, రమేశ్, సర్పంచ్ బాషిపాక సదయ్య, ఉపసర్పంచ్లు ఆగపాటి రాజు, సోలగుడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శికి.. రాయపర్తి : మండలంలోని మహబూబ్నగర్ ఉపసర్పంచ్ చెన్నబోయిన రవి ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉపసర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
బాధిత కుటుంబానికి పలువురి చేయూత
ఖానాపురం : మండలంలోని ధర్మరావుపేటకు చెందిన పీసరి రంజిత్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి గ్రామస్తులు, నేతాజీ యువజన సంఘం బాధ్యులు, రంజిత్ పదో తరగతి నాటి స్నేహితులు శనివారం చేయూత అందించారు. గ్రామస్తులు రూ.42 వేలు విరాళాలు సేకరించగా నేతాజీ యువజన సంఘం బాధ్యులు రూ.20 వేలు సమకూర్చారు. అలాగే రంజిత్ స్నేహితులు రూ.20 వేలు అందించారు. మొత్తం డబ్బులను రంజిత్ కుమార్తె హయంషి పేరిట పోస్టాఫీసులో డిపాజిట్ చేసి బాండ్ పత్రాలను సర్పంచ్ మాడ్రాజు వెంకన్న చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కూస కుమారస్వామి, సోమన్న, కుమారస్వామి, మోహన్, వల్లె శ్రీనివాస్, సురేశ్, రాంబాబు, అనిల్, రమేశ్, తోట రవి, పంచాయతీ కార్యదర్శి అనిత, తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలోనే అభివృద్ధి మామునూరు : ప్రజాపాలన ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో రూ.60లక్షల వ్యయంతో చేపడుతున్న కూడలి అభివృద్ధి, సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనగ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతి కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను శాలువాలతో సన్మానించి కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ కీర్తన్, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు తోడ్పాటు
రాయపర్తి : మండలంలోని జేతురాంతండాలో దుర్గమ్మ ఉత్సవాల నిర్వహణకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్రెడ్డి చేయూత అందించారు. ఆయన పంపించిన రూ.10 వేల నగదును నిర్వాహకులకు ఫౌండేషన్ ప్రతినిధులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, నాయకులు యూసుఫ్, నేతావత్ మన్సూర్, నేతావత్ శ్రీధర్, గుగులోతు బోజ్యానాయక్, వార్డు మెంబర్లు గుగులోతు బద్రి, నేతావత్ రమేశ్, మోతీలాల్, శ్రీనివాస్, రాజు, యాకూబ్, గుడి పూజారి సూక్య తదితరులు పాల్గొన్నారు. నివాళిపర్వతగిరి : మండల కేంద్రానికి చెందిన గుడ్ల యాకాంబ్రం శనివారం అనారోగ్యంతో మృతి చెందగా అతడి మృతదేహానికి అతడి 1988–89 బ్యాచ్ పదో తరగతి స్నేహితులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి యాకాంబ్రం స్నేహితులు రంగు జనార్ధన్ ఆధ్వర్యంలో రూ.7,500 సాయం అందజేశారు. కార్యక్రమంలో యాకాంబ్రం స్నేహితులు బరిగల వెంకటేశ్వర్లు, బాసాని సత్యం, చీదురు తిరుపతి, గుడ్ల శ్రీధర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగురాలికి.. ఖానాపురం : మండలంలోని మనుబోతులగడ్డకు చెందిన దివ్యాంగురాలు ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతదేహానికి ఏపీజే అబ్దుల్ కలాం దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు నివాళు లర్పించారు. అనంతరం పరామర్శించి రూ.6 వేల సాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు ఏశబోయిన కుమార్, గాడుదుల జగ్గయ్య, యాకూబ్, ముత్తిలింగం, తదితరులు పాల్గొన్నారు. పరామర్శగీసుకొండ : మండలంలోని శాయంపేట హవేలీలో బీఆర్ఎస్ నాయకుడు, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు అక్తర్ పాషా తండ్రి యాకూబ్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. తొలుత యాకూబ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మచ్చాపూర్ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, నాయకులు ముంత రాజయ్య, గుర్రం రఘు, నిమ్మగడ్డ వెంకన్న, సిరిసె శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, అజర్ మున్నా తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలువురికి.. సంగెం : మండలంలోని కాట్రపల్లికి చెందిన గాయపు నారాయణరెడ్డి, అనుముల నర్సమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం కాట్రపల్లి, నల్లబెల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మేకల దూడయ్య, గుగులోత్ రెడ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, నాయకులు గూడ సుదర్శన్రెడ్డి, సాగర్రెడ్డి, బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, మేరుగు వీరేశం, కొనకటి మొగిలి తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్త కుటుంబానికి.. గీసుకొండ : మండలంలోని కొమ్మాల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, మాజీ ఈఓ కమలాదేవి శనివారం పరామర్శించారు. తొలుత శ్రీనివాసాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసా చార్యులు కుమారులు వెంకటాచార్యులు, దామోదరాచార్యులు, కోడలు అనురాధ, భార్య పద్మావతిలను ఓదార్చారు. శివరామపురంలో..రాయపర్తి : మండలంలోని శివరామపురం గ్రామానికి చెందిన నాగపురి ఐలమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శీల హేమలత రత్నాకర్రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి బియ్యం సాయంగా అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూక్య లచ్చునాయక్, వార్డు మెంబర్ చెడుపాక భరత్కుమార్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాయితోజు ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శులు నాగపురి శ్రీని వాస్, చెడుపాక యాకయ్య, నాయకులు పెందోట వెంకటేశ్వర్లు, నాగపురి భిక్షపతి, పసునూరి ప్రభాకర్రెడ్డి, నాగపురి యాకయ్య, రాజి రెడ్డి, నాగపురి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామికి అభిషేకం
కాశిబుగ్గ : వరంగల్ కాశిబుగ్గలోని రంగనాథ స్వామి ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శనివారం సప్తమి కావడంతో నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన చైర్మన్ గోషికొండ శకుంతల సుధాకర్, ధర్మకర్తలు నీలం అరుణ శ్రీనివాస్, పల్లకొండ రాజమణి రమేష్, మెడికుర్తి లోకేష్, పిట్టల కోటేశ్వర్, అలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు అభిషేకాలు, పూజలు చేయించారు. లక్కిరెడ్డి పూర్ణేందర్రెడ్డి, సీతారామాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ దాసరి రాజేష్లు శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. -
ఉచిత వైద్యశిబిరం
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ పరిధి 15వ డివిజన్లోని గొర్రెకుంటలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రం వద్ద శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పలువురికి చెస్ట్ ఎక్స్రే, బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు శౌర్య శరణ్య, నేహ, ఏఎన్ఎంలు శంకుతల, భవానీ, మాధవి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ కిరణ్కుమార్, ఆపరేటర్ రంజిత్, ఎల్టీ కల్పన, కాంగ్రెస్ నాయకుడు ఎలగొండ ప్రవీణ్, ఆశ కార్యకర్తలు ఇసంపెల్లి వజ్ర, ల్యాదల్ల నిర్మల, కొట్టె అపరంజి, బందెల రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లారీలు ఢీ.. డ్రైవర్లకు గాయాలురాయపర్తి : రెండు లారీలు ఒకదాన్ని మరొకటి ఢీకొనగా వాటిని నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటన రాయపర్తి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సమీపంలోని ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వరంగల్ దిశగా వెళ్తున్న రెండు లారీలు ఒకదానికి మరొకటి తగలడంతో డ్రైవర్లకు గాయాలయ్యాయి. అతివేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వ్యాఖ్యానించారు. నేడు స్కాలర్షిప్ పరీక్షనర్సంపేట : పట్టణంలోని గీతాంజలి డీజీ పాఠశాలలో నేడు (ఆదివారం) ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు పొందే విద్యార్థులకు స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తామని గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించి ప్రతిభ చాటిన మొదటి ఐదుగురు విద్యార్థులకు ఫీజులో 50, 30, 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతిభావంతులకు వెంటనే రాయితీ ప్రకటిస్తామన్నారు. రైలు నుంచి పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్–చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని చీరాల నుంచి మంచిర్యాల వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్పై మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్టు తెలిపారు. సమాచారం తెలిస్తే 9849749220, 8712658627 నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. వృద్ధురాలి ఆత్మహత్య వరంగల్ కరీమాబాద్కు చెందిన దొనికెల కమలమ్మ (71) తన కుమారుడికి భారం కావొద్దనే ఉద్ధేశ్యంతో వరంగల్–కాజీపేట రైల్వేస్టేషన్ల నడుమ ౖరైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. కమలమ్మ మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కుమారుడు రాజుకు అప్పగించినట్లు వివరించారు. -
యూరియా వాడకం తగ్గించాలి
● ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త విశ్వతేజదుగ్గొండి : పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) శాస్త్రవేత్త విశ్వతేజ సూచించారు. మండలంలోని నాచినపల్లిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి పెరుగుతుందని తెలిపారు. యూరియాను విచ్చలవిడిగా వాడితే భూసారం దెబ్బతింటుందని, నైట్రోజన్ ప్రభావంతో రైతులు కేన్సర్ బారిన పడతారని చెప్పారు. వీలైనంత తక్కువ యూరియా వినియోగించాలని, సేంద్రీయ ఎరువులు వేయాలని తెలిపారు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయాలని చెప్పారు. తద్వారా భూమి సారవంతం అవుతుందని తెలిపారు. మిరప పంటలో మందుల వాడకం తగ్గింకునేలా సాధ్యమైనంత ఎక్కువగా జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రాబోయే ఖరీఫ్లో ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలు సాగు చేసిన వారికే బోనస్ లభిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఓ గాజుల శ్యామ్, ఇఫ్కో జిల్లా మేనేజర్ విశాల్, సర్పంచ్ పెండ్యాల రాజు, సింగిల్ విండో డైరెక్టర్ నల్ల శ్యాంసుందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏరువాక సాగుబడితో అధిక దిగుబడులు నల్లబెల్లి : ఏరువాక సాగుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ బన్న రజిత తెలిపారు. మండలంలోని దస్తగిరిపల్లిలో సర్పంచ్ పులి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఏరువాక రైతు సాగుబడి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొక్కజొన్న, వరి పంటల కోత అనంతరం మిగిలే అవశేషాలను కాల్చొదని కోరారు. వరికొయ్యలను రోటోవేటర్ సాయంతో సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా వేస్ట్ డికంపోజర్ను వినియోగించి భూమిలో కలియదున్నాలని సూచించారు. తద్వారా భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గకపోగా భూసారం పెరుగుతందని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి
సంగెం : మండలంలోని గవిచకు చెందిన రైతు గుండు వెంకటనర్సు ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన క్రమంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన ఆధ్వర్యంలోని బృందం శనివారం పరామర్శించింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. వెంకటనర్సు ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి, అనంతరం కాపుల కనపర్తిలోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కాంటా వేయించుకోవడానికి ఎండలోనే వేచి ఉన్నాడని తెలిపారు. తదనంతరం ఇంటికి చేరుకున్నాక అస్వస్థతకు గురై మృతి చెందినట్టు వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఉపాధ్యక్షుడు ఊరటి హంసారెడ్డి, నాయకులు కృష్ణ, తిరుపతి, ఐలయ్య, శ్రీనివాస్, రమేశ్, వార్డు సభ్యుడు బాషిపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సుందరీకరణ పనులు వేగిరం చేయండి
కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద వరంగల్ అర్బన్ : ఉర్సుగుట్ట, రంగ సముద్రం సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ హెల్త్శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉర్సుగుట్ట – రంగసముద్రం చెరువు బండ్ సుందరీకరణ పనులను శనివారం వారు తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. అదేవిధంగా చెరువు బండ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచనలు చేశారు. తనిఖీలో బల్దియా ఈఈ సంతోష్ బాబు, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. భూముల మార్కెట్ విలువల సవరణ పూర్తి చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ పురోగతిపై శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణ గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. -
కొనుగోలు కేంద్రం వద్ద మంటలు
● చైర్మన్ చొరవతో నష్టనివారణవర్ధన్నపేట : పట్టణంలోని కోనాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు శనివారం మధ్యాహ్నం మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో 12వ డివిజన్ కౌన్సిలర్ తిరుపెల్లి వాణికుమార్ స్వామి వెంటనే మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణికి సమాచారం అందించగా వ్యక్తిగత పనులపై హనుమకొండలో ఉన్నప్పటికీ ఆయన సత్వరమే స్పందించి రైతులకు నష్టం జరగకుండా నివారించారు. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని వర్ధన్నపేట ఫైర్ సిబ్బందికి తెలియజేయగా అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వరంగల్లోని ఫైర్స్టేషన్ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో వరంగల్ను ఫైర్ ఇంజన్ కోనాపురం కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. సిబ్బంది వెంకన్న, కుమారస్వామి, ప్రసాద్, కరుణాకర్, వాజిత్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రంలోకి మంటలు వ్యాపించకముందే చైర్మన్, వరంగల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించడం పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కొనుగోలు కేంద్రానికి మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగేదని రైతులు తెలిపారు. కాగా వరికొయ్యలకు నిప్పు పెట్టడం వల్లే మంటలు క్రమంగా కొనుగోలు కేంద్రం పరిసరాల్లోకి చేరినట్టు తెలిసింది. గడ్డివాము దగ్ధంనర్సంపేట రూరల్ : ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన నర్సంపేట మండలంలోని రామవరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైరి మాధవరెడ్డి ఏర్పాటు చేసుకున్న 5 ఎకరాల గడ్డికట్టలు శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకున్నాయి. గడ్డితోపాటు పొలంలో ఉన్న డ్రిప్, పీవీసీ పైపులు సైతం కాలిపోయాయి. బాధిత రైతుకు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. సర్పంచ్ ఎర్రం అనిత మోహన్ స్పందించి జేసీబీతో గడ్డికట్టలను దూరం చేయించి పైర్ సిబ్బందితో మంటలను అర్పించారు. -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. భూముల మార్కెట్ విలువ పెంపు, భూ భారతి దరఖాస్తులు, హౌసింగ్, హీట్ వేవ్స్ వంటి పలు అంశాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని సూచించారు. పలు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. బక్రీద్ పండుగ నిర్వహణపై సమీక్ష ఈనెల 28న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆరోగ్య, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలకు సూచించారు. జంతు అవశేషాలను సక్రమంగా సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా సమీక్ష సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్ (లోకల్ బాడీ), డీఎఫ్ఓ నిఖిత, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డీపీఓ కల్పన, డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, డీఎండబ్ల్యూఓ రమేష్, జీడబ్ల్యూఎంసీ హెల్త్ ఆఫీసర్ రాజేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రణాళికలను ఆన్లైన్ చేయాలి● డీఎల్పీఓ వేదవతి గీసుకొండ: పంచాయతీ కార్యదర్శులు, ఈ – పంచాయతీ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ ప్రణాళికలను (జీపీడీపీ) ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎల్పీఓ వేదవతి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ – గ్రామ్ స్వరాజ్ పోర్టల్, ఆన్లైన్ చెల్లింపులు, డిజిటల్ సంతకాలు, తదితర విషయాలపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపీడీపీ రూపకల్పన, నిధుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పారదర్శకంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అంశాలపై జిల్లా ప్రోగ్రాం మేనేజర్ దివ్య అవగాహన కలిగించారు. సదస్సులో ఎంపీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
దుగ్గొండి : మండలంలోని దుగ్గొండి, మైసంపల్లి గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు ఆయా గ్రామాల సర్పంచ్లు కామిశెట్టి ప్రశాంత్, వేముల ఇంద్రదేవ్ శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపశమనం కలిగించేలా మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. కూలీలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు బొంపెల్లి ఆనందం, పల్లె వైష్ణవి శ్యామ్, ఫీల్డ్ అసిస్టెంట్లు జన్ను నర్సయ్య, కవిత, తదితరులు పాల్గొన్నారు. అంగడిలో ‘ఏబీఆర్’ ఆధ్వర్యంలో.. గీసుకొండ : మండలంలోని కొమ్మాల అంగడిలో కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్రెడ్డి, స్వప్నదేవి (ఏబీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులు, వ్యాపారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని సర్పంచ్ వీరగోని రాజ్కుమార్, జిల్లా నాయకుడు అల్లం మర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కొమ్మాల, దస్రుతండా సర్పంచ్లు కన్నెబోయిన యమున ప్రవీణ్, కేతోతు అమృత భిక్షపతి, నాయకులు స్వామి, మాదాసి రాంబాబు, పొగాకు భిక్షపతి, ఓదెల సురేశ్, పాకనాటి మధు, వాంకుడోతు తిరుపతి, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష –2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9–30నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా 10 సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. నిమిషం నిబంధన.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సి. కేంద్రాలవద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట యూపీఎస్సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, రూట్ అధికారి భావ్సింగ్ ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీలో రెండు సెంటర్లు, కాజీపేట ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్ హైస్కూల్, హంటర్రోడ్డులోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, హనుమకొండ అశోకా జంక్షన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీవరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సెంటర్లనుంచి 500 మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎన్ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 10 కేంద్రాలు.. 4,075మంది అభ్యర్థులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
యువత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ స్పోర్ట్స్: యువత సంక్షేమం, అభివృద్ధే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువజన, క్రీడల వారోత్సవాలు శనివారం ముగిశాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ సాధన – కనెక్టింగ్ టాలెంట్ విత్ అపార్చునిటీస్’ కార్యక్రమంలో విజేతలకు పతకాలను అందజేశారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన జాబ్మేళాలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, తెలుగు అకాడమీ చైర్మన్ వెంకట నారాయణ, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నగర అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి హన్మకొండ: వరంగల్ నగర అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,674 కోట్లు, ఏఐ ఆధారిత ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిన క్రమంలో శనివారం హనుమకొండలోని అమరవీరుల స్తూపం కూడలిలో ప్రధాని మోదీ కటౌట్కు ఆయన పాలాభిషేకం చేశారు. అనంతరం సంతోష్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.5681 కోట్లకు తుది ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, దొంతి దేవేందర్రెడ్డి, గుజ్జుల వసంత, గుజ్జుల మహేందర్రెడ్డి, రావుల కోమల, రావుల కిషన్, సండ్ర మధు, బైరి శ్రావణ్, రాధారపు శివకుమార్, నర్మెట శ్రీనివాస్, అరణ్య రెడ్డి, బొమ్మసాని అనిల్, పిట్టల ధనలక్ష్మి, ఎండీ జరీనా, సుంకరి శ్రీరామ్, మూల రాము, సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026● తమ్ముళ్లను పెంచి ప్రయోజకులను చేసిన అన్నలు.. ● అన్నను చదివించిన తమ్ముడు.. ● నేడు జాతీయ బ్రదర్స్ డే అన్నంటే నాన్నంత పెద్దరికం.. తమ్ముడంటే కొడుకంతటి అనురాగం.. బాల్యంలో ఇల్లంతా గోల చేసే అన్నాదమ్ముళ్లు..పెరిగి పెద్దయ్యాక బాధ్యతల భారం తమపై వేసుకుంటారు. తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలనే అన్న తపన.. అన్న భారం తగ్గించాలనే తమ్ముడి తాపత్రయం.. అలాంటి వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మంది కనిపించారు. నేడు జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా అలాంటివారిపై ప్రత్యేక కథనాలు.. -
పాలిసెట్లో ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రతిభ
వరంగల్ విద్యార్థికి స్టేట్ ఫస్ట్ర్యాంక్ ఖిలా వరంగల్: పాలిసెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు–రజిత దంపతుల కుమారుడు లోకేశ్ ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీలో 120 మార్కులకు 90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు శనివారం గోల్డెన్ ఓక్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థి లోకేశ్ను ఆ స్కూల్ చైర్మన్ గంట రవికుమార్, తదితరులు శాలువా కప్పి అభినందించారు. అన్నదమ్ములకు ర్యాంకులు నర్సంపేట/మహబూబాబాద్ అర్బన్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ ఫర్మాన్షా ఎంబైపీసీలో రాష్ట్రస్థాయిలో 120 మార్కులకు 119 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించాడు. తండ్రి డాక్టర్ షేక్ఖాసీంషా మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫర్మాన్షా సోదరుడు షేక్అమాన్షా ఎంబైపీసీలో 120 మార్కులకు 116 మార్కులతో రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు సాధించాడు. ఉత్తమ మార్కులు సాధించిన వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. షేక్ఫర్మాన్షా, షేక్అమాన్షా కవలలు. సివిల్స్ సాధించడమే లక్ష్యం.. కంప్యూటర్ ఇంజనీరింగ్లో రాణించి భవిష్యత్తులో సివిల్స్కు ప్రిపేర్ అవుతా. ఐఏఎస్ కావడం నా లక్ష్యం. నా విజయానికి నిరంతరం కృషి చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన వారందరికి కృతజ్ఞతలు. – ఫర్మాన్ షా, పాలిసెట్ స్టేట్ 4వ ర్యాంకు షేక్ ఫర్మాన్షా, షేక్అమాన్షా -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష –2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9–30నుంచి 11–30గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 4–30గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు కలెక్టర్ వివరించారు. నిమిషం నిబంధన.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది. నిర్దేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సింటుంది. కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట యూపీఎస్సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, రూట్ అధికారి భావ్సింగ్ ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీలో రెండు సెంటర్లు, కాజీపేట ఫాతిమానగర్లోని సెయింట్ గాబ్రియల్ హైస్కూల్, హంటర్రోడ్డులోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, హనుమకొండ అశోకా జంక్షన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పది పరీక్ష కేంద్రాలు.. 4,075 మంది అభ్యర్థులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ బాజ్పాయ్పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీవరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సెంటర్లనుంచి 500మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎన్ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
రైతువేదికల్లో సమస్యల తిష్ట
● వసతుల కల్పనలో నిర్లక్ష్యంనెక్కొండ : మండలంలోని రైతువేదిక భవనాల్లో సమస్యలు తిష్ట వేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస వసతుల కల్పనలోనూ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యాఖ్యలున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి భవనాలు నిర్మించి సామగ్రి సమకూర్చిన ప్రభుత్వం కొన్నిటికి ప్రహరీలు నిర్మించలేదు. దీంతో అకతాయిలకు అడ్డాగా సైతం మారాయి. భవనాల్లోని విలువైన సామగ్రికి రక్షణ సైతం కరువైంది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ ఆధునిక, శాస్త్ర సాంకేతిన పరిజ్ఞానాన్ని చేరువ చేసే పేరుతో గత ప్రభుత్వం మండలంలోని పెద్దకొర్పోలు, నెక్కొండ, నాగారం, రెడ్లవాడ, దీక్షకుంట, అలంకానిపేట, తోపనపల్లి గ్రామాలను క్లస్టర్లుగా ప్రకటించి రైతువేదిక భవనాలు నిర్మింపజేసింది. భవనాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ప్రతి మంగళవారం రైతులకు శాస్త్రవేత్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి సస్యరక్షణ చర్యలపై సూచనలు అందిస్తున్నారు. వసతులు నామమాత్రం రైతువేదిక భవనాల్లో మౌలిక వసతులు నామమాత్రంగా కల్పించారు. పలు భవనాల్లో తాగునీటి, ఇతర సౌకర్యాలు కల్పించలేదు. ప్రహరీ నిర్మించలేదు. భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో వేదికల్లోని సామగ్రిని ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలు రైతువేదికల ఆవరణల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని చోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. నీటి వసతి లేకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి. గతంలో పంట వివరాలు నమోదు చేసేందుకు ఏఓలు, ఏఈఓలు రైతువేదికలకు వచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోనే పంటలు నమోదు చేస్తుండడంతో ఏఓలు, ఏఈఓలు రైతువేదికల వైపు వెళ్లడం లేదు. -
పిట్టల్లా రాలుతున్నారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22 మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్, బీపీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు.. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాతభూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. కాజీపేటకు చెందిన వి.వెంకటేశ్ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఎండలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘటనలు -
కమలాపూర్లో అగ్నిప్రమాదం
వెయ్యి తాటి చెట్లు దగ్ధం : ఆదుకోవాలని గీతకార్మికుల విజ్ఞప్తి కమలాపూర్: మండల కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు వెయ్యి తాటి చెట్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం కన్నూరు శివారు నుంచి చెలరేగిన మంటలు పంట పొలాల మీదుగా కమలాపూర్ తాటి వనం వైపు వ్యాపించి 200 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. శనివారం పెద్దమ్మ దేవాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పంట వ్యర్థాలకు నిప్పంటించడంతో మరోసారి మంటలు చెలరేగాయి. ఆ మంటలు తాటి వనంపై వైపు వ్యాపించి సుమారు వెయ్యి తాటిచెట్లు అగ్నికి ఆహుతి అయ్యా యి. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పివేశారు. కల్లు పారే చెట్లు సుమారు వంద వరకు ఉన్నాయని, తాటి చెట్లు దగ్ధమవడంతో తాము జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు. -
ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి
సంగెం : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు నడక తప్పనిసరి అని ఇంటరేషనల్ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడిన వాకర్స్ అసోసియేషన్కు సలహాదారు దశరథ్రామ్రెడ్డితో కలిసి శనివారం రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసి కమిటీని ప్రకటించారు. ప్రెసిడెంట్గా బిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గుండేటి కుమారస్వామి, ట్రెజరర్గా పులి వీరస్వామి, జిల్లా వాకర్స్ అసోసియేషన్ డైరెక్టర్లు పేర్ల రమేష్, గుండేటి బాబు, ఇప్పకాయల మనోహర్, ఎలుకుర్తి బుచ్చిరెడ్డిలను నియమించి నియామక పత్రాలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. అసోసియేషన్ సభ్యులందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా అరగంటపాటు నడక సాగించాలని, వ్యాయామం చేయాలని, ఇతరులను చైతన్యవంతం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయాలని సూచించారు. నడకతో శారీరక వికాసానికి బాటలు పడతాయని చెప్పారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుపల్లి కుమారస్వామి, విజయ ప్రకాశ్, గురుమూర్తి, రామకృష్ణ, రాజు, సత్యదేవ్, మహేందర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్లో ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రతిభ
వరంగల్ విద్యార్థికి స్టేట్ ఫస్ట్ర్యాంకు ఖిలా వరంగల్: పాలిసెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు–రజిత దంపతుల కుమారుడు లోకేశ్ ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీలో 120 మార్కులకు 90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు శనివారం గోల్డెన్ ఓక్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థి లోకేశ్ను ఆ స్కూల్ చైర్మన్ గంట రవికుమార్ శాలువా కప్పి శనివారం అభినందించారు. అన్నాదమ్ములకు ర్యాంకులు నర్సంపేట/మహబూబాబాద్ అర్బన్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ ఫర్మాన్షా ఎంబైపీసీలో రాష్ట్రస్థాయిలో 120 మార్కులకు 119 మార్కులతో నాలుగో ర్యాంకు సాధించాడు. తండ్రి డాక్టర్ షేక్ఖాసీంషా మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫర్మాన్షా సోదరుడు షేక్అమాన్షా ఎంబైపీసీలో 120 మార్కులకు 116 మార్కులతో రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు సాధించాడు. ఉత్తమ మార్కులు సాధించిన వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. షేక్ఫర్మాన్షా, షేక్అమాన్షా కవలలు. సివిల్స్ సాధించడమే లక్ష్యం.. పాలిసెట్ రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించా. కంప్యూటర్ ఇంజనీరింగ్లో రాణించి భవిష్యత్లో సివిల్స్కు ప్రిపేర్ అవుతా. ఐఏఎస్ కావడం నా లక్ష్యం. – షేక్ ఫర్మాన్షా -
వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగుచేయాలి
● వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం ఎల్కతుర్తి: రైతులు వరిసాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసి భూమిలో కలియదున్నడం వల్ల పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం అన్నారు. శుక్రవారం మండలంలోని కోతులనడుమలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పించారు. ముందుగా రైతులకు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం మాట్లాడుతూ రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడాలన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయం పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల లింగయ్య, శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రాజ్కుమార్, సారంగం, ఏఈఓ తిరుపతి, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026ఓపీ విధులకు ఆలస్యంగా ఈసీజీ టెక్నీషియన్లు ● ఎంజీఎంలో పరీక్షల కోసం పేషెంట్ల పడిగాపులుకాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లు ఓపీ విధులకు ఆలస్యంగా రావడంతో పేషెంట్లకు ఎదురుచూపులు తప్పలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రావాల్సిన సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో వారి కోసం పేషెంట్లు గంటల తరబడి ఎదురుచూశారు. అసలే వేసవి కావడంతో గంటల తరబడి ఉక్కపోతలో ఎదురుచూడాల్సి వచ్చిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నీషియన్లు రాలేదన్న విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన టెక్నీషియన్ల ను పిలిపించి ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని మందలించారు. తర్వాత పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఈసీజీ పరీక్షలు చేయించారు. -
ప్రజలకు మెరుగైన సేవలు
జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హన్మకొండ అర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యచరణపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేలా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 2న భారీగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, రైతులకు స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు అందజేశారు. ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి హనుమకొండ కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీడీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ● డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి హన్మకొండ చౌరస్తా: ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదని ‘కుడా’ చైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యూశాయంపేటలోని హనుమాన్ ఆలయ వ్యవహారంలో ఎమ్మెల్యే నాయినికి సంబంధం లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా అందులోకి లాగడం రాజకీయ కుట్రలో భాగమన్నారు. అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, జక్కుల రవీందర్, భద్రకాళి ఆలయ ధర్మకర్త గాండ్ల స్రవంతి, మంద రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల విస్తరణకు సహకరించాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ: నెక్కొండలో రోడ్ల విస్తరణకు అధికారులు సహరించాచాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో ఆర్అండ్బీ, రైల్వే రోడ్లను రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దొంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లను విస్తరించి ప్రజలకు సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆర్అండ్బీ రోడ్డు గోడలను తొలగించి, విస్తరణ పనులు చేపట్టాలని, రైల్వే గోడలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. రైల్వే ఆర్చీల ఏర్పాటు, మూడో ప్లాట్ఫారం వైపు ఫుట్ఓవర్ బ్రిడ్జి పెంపు, వీఐపీ విశ్రాంతి హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై అంజిరెడ్డి సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్కుమార్, నెక్కొండ ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, జీపీ కార్యదర్శి సదానందం, ఉప సర్పంచ్ సింగం శ్రావణి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మండల అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదాటి శ్రీనివాస్, కొణిజేటి భిక్షపతి, ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బుచ్చిరెడ్డిపల్లిలో తెగిపడిన 11 కేవీ తీగ
● మంటలు అంటుకుని ఐరన్ ఓర్ రాళ్లకు రంధ్రాలు ● ఆర్పివేసిన విద్యుత్శాఖ అధికారులు ● రెండు గ్రామాల్లో తప్పిన పెను ప్రమాదం నల్లబెల్లి: మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి శివారులో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి, ములుగు జిల్లా రాంచంద్రా పురం గ్రామాల మధ్య 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. విద్యుత్ తీగలు తెగి బీడు భూముల్లో ఉన్న ఐరన్ఓర్ ఖనిజ రాళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఖనిజ రాళ్లకు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవ్వరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ తీగలను తొలగించి స్థానికుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం లైన్కు అత్యవసర మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యవరంగల్ చౌరస్తా: పాప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా వరంగల్ హంటర్రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాల్లో శుక్రవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, రైతుభరోసా వంటి పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల హాజరుశాతం పెంపు కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా 10 కీలక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల నివేదికను విడుదల చేశారు. డీఆర్వో విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, విద్యుత్శాఖ ఎస్ఈ ఆనందం, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు. -
జీవవైవిధ్యంతోనే మానవ మనుగడ
● ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్నర్సంపేట : జీవవైవిధ్యంతో మానవ మనుగడ సాధ్యమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ తెలిపారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించిన వాల్పోస్టర్లను రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. నానాటికీ వాతావరణ కాలుష్యం పెరుగుతుండడంతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్థల సమాఖ్య అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల మేలు చేసే కీటకాలు నశిస్తున్నాయని చెప్పారు. ఏఎస్ఆర్ సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి జీవజాతులను రక్షించాలని కోరారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ భూమిపై కనీసం 33 శాతం అడవులు ఉండాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, వలంటీర్ కాసుల వెంకటాచారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సోమ్లానాయక్, ధర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పత్తి.. సరికొత్తగా సాగు
● అధిక సాంద్రత పద్ధతిపై ఆసక్తి చూపుతున్న రైతులు ● తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి ● ఖరీఫ్లో 1,10,200 ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా ● ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తనాలు అవసరందుగ్గొండి: రోహిణి కార్తె త్వరలో ప్రారంభం కానుంది. రైతులు వానాకాలం పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా పత్తి పంట సాగు చేసేందుకు దుక్కులను పొతం చేస్తున్నారు. అయితే, సాధారణ పద్ధతిలో దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు. కొంతమంది వానాకాలంలో పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి వదిలేస్తున్నారు. కాగా, ఈ ఖరీఫ్లో 1,10,200 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ తరుణంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుచేసి మంచి దిగుబడి సాధించవచ్చని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం అధికారులు తెలిపారు. సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. ఎకరాకు 25 వేల మొక్కలు అవసరం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి, తక్కువ సమయంలో అధిక దిగుబడిని సాధించే పద్ధతినే అధిక సాంద్రత పద్దతి (హెచ్డీపీఎస్) అంటారు. తేలిక నేలలు, ఎర్ర నేలలు, వాన ఆధారిత సాగుకు ఇది అనుకూలంగా ఉంటుంది. చిన్నగా గుబురుగా నిటారుగా పెరిగే విత్తన రకాలను ఎంచుకుని సాగు చేసుకోవాలి. సాధారణంగా వరుస వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో రైతులు పత్తి విత్తనాలు నాటుతుంటారు. ఈ పద్ధతిలో ఎకరాకు 7,407 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతిలో రైతులు వరుస వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడంతో నాటుకుంటే ఎకరాకు 22 వేల నుంచి 25వేల మొక్కలు వస్తాయి. ఈ విధానం ద్వారా ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఒక్కో మొక్కకు 8 నుంచి 10 కాయలు వచ్చినా ఎకరాకు 10–12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పెరుగుదల నియంత్రణ కీలకం.. అధిక సాంద్రత పద్ధతిలో వర్షాలు ఎక్కువగా కురిస్తే మొక్క పెరగకుండా మందులు పిచికారీ చేయాలి. మొక్కల పెరుగుదలను నియంత్రిస్తే కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకేసారి కాతకు వచ్చి కాయలు కాస్తాయి. ఒకేసారి పత్తి తీసుకునే అవకాశం కలుగుతుంది. పత్తి పెరుగుదల నియంత్రణ కోసం మెపిక్వాట్ క్లోరైడ్ మందును పంట వేసిన 40–45 రోజుల మధ్య, 60–65 రోజుల మధ్య లీటరు నీటికి 0.8 మిల్లీలీటర్ల మందు కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం.. ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కిస్తే ఎకరాకు 100 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్పాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేసుకుని భూమిలో కలియదున్నాలి. -
‘స్వచ్ఛత’లో కలెక్టర్
కాజీపేట: 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి పాలనలో భాగంగా వడ్డేపల్లి ట్యాంక్బండ్పై శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్వయంగా చెత్తాచెదారం తొలగించారు. జిల్లా పర్యాటక అధికారి శివాజీ, ఎంసీహెచ్ఓ రాజారెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లెపల్లి రాజేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు జిల్లాల చైర్మన్లు వీరే.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిని నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో? అనే చర్చ మొదలైంది. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లు ఓపీ విధులకు ఆలస్యంగా రావడంతో పేషెంట్లకు ఎదురుచూపులు తప్పలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రావాల్సిన సిబ్బంది 10 దాటినా విధులకు హాజరు కాకపోవడంతో వారి కోసం పేషెంట్లు గంటల తరబడి ఎదురుచూశారు. అసలే వేసవి కావడంతో గంటల తరబడి ఉక్కపోతలో ఎదురుచూడాల్సి వచ్చిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నీషియన్లు రాలేదన్న విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన టెక్నీషియన్లను పిలిపించి, ఆలస్యానికి కారణాలు తెలుసుకుని మందలించారు. తర్వాత పేషెంట్లకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఈసీజీ పరీక్షలు చేయించారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : రాష్ట్ర రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) రాథోడ్ రమేశ్ నిర్మల్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎన్..నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అదనపు కలెక్టర్గా కిశోర్కుమార్ వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.కిశోర్కుమార్ నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను జిల్లాకు బదిలీ చేసి ఆ స్థానానికి వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ కాలపరిమితి పూర్తయిన 15 మంది ఏఎస్ఐలు, 160 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47 మంది కానిస్టేబుళ్లకు శుక్రవారం అధికారులు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యవరంగల్ చౌరస్తా: ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా వరంగల్ హంటర్రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాల్లో శుక్రవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, రైతుభరోసా వంటి పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల హాజరుశాతం పెంపు కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా 10 కీలక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల నివేదికను విడుదల చేశారు. డీఆర్వో విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, విద్యుత్శాఖ ఎస్ఈ ఆనందం, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు.


