breaking news
Warangal District News
-
సమ్మక్క–సారలమ్మ జాతర చరిత్ర పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన సిద్ధోజు శ్రీనివాసాచారి రాసిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర చరిత్ర పుస్తకాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ మేరకు మంగళవారం రాంనగర్లో మంత్రి సురేఖ పుస్తకావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ఆరుట్ల వెంకట రామకృష్ణమాచార్యులు, కామధేను వేదవిద్యాపీఠం ట్రస్టు చైర్మన్ చిలుకూరి నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. 29న పద్యనాటక ప్రదర్శనతెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, సంగీత నాటక అకాడమీ సౌజన్యం, వరంగల్ తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాటక సమాజాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం తెలిపారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ రాంనగర్లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఓడపల్లి చక్రపాణి, గూడూరు బాలాజీ, కార్పొరేటర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ) ఎక్స్ సైన్స్ కోర్సుల ఫస్ట్, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, 31 తేదీల్లో ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు యూనివర్సిటీ విద్యా కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని వారు తెలిపారు. వివరాలకు కేయూ దూరవిద్య వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. విద్యారణ్యపురి: డీఈఐఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మొదటి సంవత్సరం పరీక్షలు గత ఏడాది డిసెంబర్లో నిర్వహించారు. విద్యార్థుల మెమోలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖాధికారులు కోరారు. రీకౌంటింగ్కు ఈనెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాత్రి కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా పనిచేస్తున్న రాజుకు కాజీపేట తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. కాజీపేట తహసీల్దార్ భావుసింగ్ను పరకాల డీఏఓగా బదిలీ చేశారు. ఉత్తర్వులు అందగానే వెంటనే ఇద్దరు కొత్తస్థానాల్లో బాధ్యతలు కూడా స్వీకరించారు. దామెర: రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ–అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అతివేగంతో వాహనం నడిపి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి, సురక్షితంగా గమ్యస్ధానాలు చేరుకోవాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పెండిగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. సదస్సులో పరకాల ఏసీపీ సతీశ్బాబు, శాయంపేట సీఐ రంజిత్రావు, దామెర ఎస్సై కొంక అశోక్, సర్పంచ్లు గరిగె కల్పనకృష్ణమూర్తి, పంచగిరి రాజు, చందు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్లో నిజాం కాలం నుంచి విక్రయాలుఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు. 2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం.. 2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం.. వరంగల్ ఎల్లంబజార్లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది. –చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్మా షాపునకు వందేళ్ల చరిత్ర.. సురాజ్ మాల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్సేల్, రిటైల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్చంద్, వ్యాపారి పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి. నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి. చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి. పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు. -
కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి మంగళవారం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి గుమ్మడికాయ, కోరమీసాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సంవత్సరం వీరభద్రస్వామిని దర్శించుకోవడం, బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతీఒక్కరు మోదీకి అండగా ఉండాలని కోరారు. అలాగే, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణారావు దేవాలయాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆలయ ఈఓ కిషన్రావు, సర్పంచ్ సిద్ధమల్ల రమారమేశ్, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, కంచెర్ల రాజయ్య, సందీప్, జిల్లా నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్, రామోజ్ శ్రీనివాస్, దొంగల కొమురయ్య, తీగల రాజు, కుడితాటి చిరంజీవి పాల్గొన్నారు. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
నల్లబెల్లి: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
జానపదుల జాతర షురూ
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ప్రాతఃకాలంలో ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలికారు. స్వామివారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, ఈఓ, ఆలయ చైర్మన్, కమిటీ ధ్వజానికి ఏర్పాటు చేసిన కాషాయ పతాకాన్ని చేతబూని వేదమంత్రాలతో ఆలయం చుట్టూ మంగళవాయిద్యాలతో మూడు ప్రదక్షిణలు చేశారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతర సజావుగా జరగాలని మల్లన్న పరివార దేవుళ్లకు ఆవాహన చేశారు. ఆ కాషాయ పతాకాన్ని ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయంపై, స్వామి ఆలయంపైన ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. తర్వాత మహాన్యాస రుద్రాభిషేకం చేసి నీరాజన మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉపప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్జోషి, అర్చకులు భానుప్రసాద్, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ధర్మకర్తల మండలి సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. బోనాలు, పట్నాలతో భక్తుల మొక్కులు భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శివసత్తుల విన్యాసాలు, నృత్యాలతో బోనం నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఎల్లమ్మకు సమర్పించారు. కొందరు భక్తులు వరం పట్టగా, మరికొందరు టెంకాయ బంధనం, ముడుపులు కట్టారు. నేడు భోగి ఉత్సవాలు బుధవారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మంత్ర పుష్పం, దర్శనాలు ఉంటాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు.ప్రారంభమైన ఐనవోలు మల్లన్న ఉత్సవాలు -
కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
నేను కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలు అయ్యింది. అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తగిన విచారణ జరిపి కులం సర్టిఫికెట్ ఇప్పించాలి. – డి.శ్రీధర్, అప్పల్రావుపేట, నెక్కొండ నా భూమి ఇప్పించండి..నా పేరున ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు ఆక్రమించుకున్నారు. నన్నూ నా భార్యను పోషించడం లేదు. అనారోగ్యాల కారణంగా అప్పులు అయ్యాయి. నా భూమిని ఇప్పించండి. అప్పులు తీర్చేందుకు నా కొడుకులకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – బి.రాంకోటి, పిట్టలకాడిబోడు తండా -
భూ సమస్యలు పెండింగ్ ఉండొద్దు
న్యూశాయంపేట: భూ సమస్యలు ఎట్టి పరిస్థితిలో పెండింగ్ ఉండొద్దని, పింఛన్లు, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులు పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీడబ్ల్యూఓ రాజమణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో 129 ఫిర్యాదులు -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఖిలా వరంగల్: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఓరుగల్లు ఖ్యాతిని మరింతగా చాటాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రభుత్వం యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కప్–2026 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుషిమహాల్ వద్ద సీఎం కప్–2026 ర్యాలీని అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ నుంచి గ్లోబల్ చాంపియన్ నినాదంతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం కోసమే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత, విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31వ తేదీ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయన్నారు. క్రీడాకారులు అధిక సంఖ్య లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీ మధ్యకోట ఖుషిమహాల్ నుంచి జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్ధార్ ఇక్బాల్, ఎంప్లాయీమెంట్ అధికారి కల్పన, కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ దామోదర్యాదవ్, క్రీడాకోచ్ కై లాస్ యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లున్యూశాయంపేట: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వాహణపై కలెక్టరేట్ చాంబర్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్స్, 25వ తేదీ నుంచి జరిగే వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాక్టికల్స్ ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించబడతాయన్నారు. 28 కేంద్రాల్లో ప్రాక్టికల్స్, 26 కేంద్రాల్లో థియరీ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్వ్కాడ్, రెండు సిట్టింగ్ స్వ్కాడ్, 26 మంది చీఫ్ సూ పరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామన్నారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్ లో సంప్రదించాలన్నారు. జిల్లా పరీక్షల కమిటీ కన్వీ నర్ శ్రీధర్సుమన్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్రీడాజ్యోతి ర్యాలీ ప్రారంభంఇంటిగ్రేటెడ్ స్కూల్స్ త్వరగా పూర్తి చేయాలియంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వాహణకు తగు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. అధికారుల శిక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఈఓ రంగయ్యనాయుడు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
కొలిచిన వారికి కొంగు బంగారమై..
నర్సంపేట రూరల్: కొలిచిన వారికి కొంగు బంగా రంగా నిలుస్తున్న జాతర శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర. ప్రతీ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జాతర వైభవంగా నిర్వహించడం ఆనవా యితీ. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట డివిజన్లో ని చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ప్రతీ సంవత్సరం నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. డిసెంబర్ మార్గశిర మాసం నుంచి జనవరి కృష్ణమాసం వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయని ప్రధాన అర్చకుడు సుదర్శనాచార్యులు తెలిపారు. ఈనెల 13న శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనము, అభిషేక మహోత్సవం, 14న ఏకాదశి భోగి పండుగ గోదా రంగనాథ స్వామి కల్యాణం, 15న ద్వాదశి సంక్రాంతి మహాజాతర, ప్రభ బండ్లు తిరుగుట, నృత్య ప్రదర్శనలు, కోలాటములు, భక్తులు దర్శనం, 16న కనుమ రోజు మహాజాతర, శోభాయాత్ర జరుగుతుందన్నారు. కాగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ చైర్పర్సన్, సర్పంచ్ మెడబోయిన రజిత తెలిపారు. నేటి నుంచి లింగగిరిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర భారీగా తరలిరానున్న భక్తులు -
పల్లె దవాఖానాలో మెరుగైన సేవలు
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రాయపర్తి: పల్లెదవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు మండలంలోని ఊకల్ గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధుల ద్వారా రెండు గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున పల్లె దవాఖానాలను నిర్మించగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయపర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా క ల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నా రు. అనంతరం రైతువేదికలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు. -
తుది ఓటరు జాబితా విడుదల
నర్సంపేట: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగను న్న నేపథ్యంలో సోమవారం అధికారులు తుది ఓట రు జాబితాను ప్రదర్శించారు. జిల్లాలోని నర్సంపే ట, వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాల్లోని నో టీసు బోర్డులపై ఓటరు జాబితాను ఏర్పాటు చేశా రు. నర్సంపేటలోని 30 వార్డుల్లో గతంలో 41,101 ఉండగా తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో 40,960 ఓటర్లు ఉన్నాయి. మహిళా ఓటర్లు 21,323, పురుష ఓటర్లు 19,642, ఇతరులు 3 ఓటర్లు ఉన్నారు. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులకు గాను వార్డుల వారీగా ఎన్నికల తుది జాబితా అధికారులు విడుదల చేశారు. మొత్తం 10,526 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 5,109, మహిళలు 5,416, ఇతరులు 1 ఉన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో జాబితాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేటలో 40,960, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 10,526 ఓటర్లు -
టెన్త్ ప్రీఫైనల్ టైంటేబుల్ విడుదల
విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు ఈఏడాది ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. ప్రీ–ఫైనల్ పరీక్షల టైంటేబుల్ను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 19న థర్డ్ లాంగ్వేజ్, 20న మేథమెటిక్స్, 21న ఫిజికల్ సైన్స్, 23న బయాలాజికల్ సైన్స్, 24న సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. ఈమేరకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
గంగదేవిపల్లిని సందర్శించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎన్.శృతి హర్షిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్ కుసం స్వరూప, ఉప సర్పంచ్ మేడిద ప్రశాంత్, వార్డు మెంబర్లు ఏర్పాటు చేసుకున్న సాధారణ గ్రామసభలో పాల్గొని గ్రామసభ ఉద్దేశాన్ని, జరిగేటువంటి విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వివేకానంద జయంతిని పురస్కరించుకొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ వారం రోజుల ట్రైనింగ్లో భాగంగా గంగదేవిపల్లి గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను నేర్చుకోవడానికి వచ్చినట్లు వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు ట్రైనీ ఐఏఎస్ శృతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కడగండ్ల కన్యాకుమారి, ఏపిఎం.ఈశ్వర్, సీసీ బొజ్జ సురేశ్, వెటర్నరీ డాక్టర్ చిరంజీవి, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ వెంకన్న, పీఆర్ఏ నిమ్మల శేఖర్, డీటీఎం కుసం రాజమౌళి, మంచినీటి కమిటీ అధ్యక్షుడు రాము, వీఓఏ జనార్దన్, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేతల్లో పండుగ జోష్
నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం సాక్షి, వరంగల్: రాజకీయ నాయకులకు ‘పండుగ’ వాతావరణం బాగా కలిసొస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు ముందు అప్పుడు బరిలో ఉండే నాయకులు దసరా పండుగను అనుకూలంగా మలచుకొని మద్దతు కూడగట్టుకుంటే.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు సంక్రాంతి పండుగ రా వడంతో పోటీ పడాలనుకుంటున్న నేతలు తమకు వేదికగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగే నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రాజకీయ నేతల పండుగ వాతావరణం కనబడుతోంది. ఓవైపు ఓటర్ల తుది జాబితా పూర్తవడం, త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో ఇప్పటికే తమ కులానికే రిజర్వేషన్ వస్తుందని లెక్కలేసుకున్న నాయకులు ఇప్పటినుంచే జనాలను త మ వైపునకు తిప్పుకునేలా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగకు పట్టణాల్లో ఉంటున్న వారితో పాటు వివిధ నగరా లు, పట్టణాల్లో ఉపాధి కోసం వెళ్లిన కుటుంబాలు రానుండడంతో నేరుగా వారిని కలిసి మద్దతు కూడగట్టుకునేలా రాజకీయ చతురతను ప్రదర్శించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాత గారూ బాగున్నారా.. అక్క ఎట్లా ఉన్నారు.. అన్న పట్టణంలో అంతా బాగానే ఉందానే.. మిమ్ముల్ని చూసి చాలా రో జులువుతోంది ఎలాగున్నారూ.. అంటూ ఆత్మీయ పలకరింపులు చేస్తున్నారు. ఇక వివిధ కులాల్లో ముఖ్యులు, యువతను తమ దారికి తెచ్చుకునేందుకు పండుగ పేరిట పార్టీలు ఇచ్చేలా ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించారు. భారీగా మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఓవైపు మున్సిపల్లో పోటీ చేసేందుకు ముఖ్యులను చక్కబెడుతూనే.. స్థానికంగా పట్టు పెంచుకునేందుకు సంక్రాంతి పండుగ కలిసి రావడంతో ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. అన్ని పార్టీల్లోనూ నేతలు ఇదే పొకడతో పండుగ వాతావరణం నెలకొంది. రిజర్వేషన్లపై అంచనా వేసి.. నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 40,960 మంది ఓటర్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 10,526 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా తుది జాబితా సిద్ధమవడంతో ఆయా స్థానిక రాజకీయ నేతలు రిజర్వేషన్లపై ఓ అంచనాకు వచ్చారు. నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉండడంతో కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్న నాయకులు ఒకే పార్టీ నుంచే ముగ్గురికి పైగా ఉంటున్నారు. ము ఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఈ పరిస్థితి కనబడుతోంది. అందుకే సంక్రాంతి పండుగను వేదికగా చేసుకొని తమ బలబలాలను ఆయా డివిజన్లో పెంచుకునే పనిలో నేతలు బిజీఅయ్యారు. దీన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి టికెట్ దక్కించుకోవాలని తహతహలాడుతుండడంతో పేటల్లో పండుగ వాతావరణం కనబడుతోంది. ఒకవేళ పార్టీ నుంచి టికెట్ దక్కని పక్షంలో రెబల్గా పోటీ చేస్తామని తమ డివిజన్ ప్ర జల వద్ద మట్లాడుతూ మద్దతు ఉండేలా ఆశీర్వా దం పొందుతున్నారు. ఇలా సంక్రాంతి రాజకీయ నే తల సందడితో పండుగ జోష్ పెరిగినట్లయింది. తుది ఓటరు జాబితా ఆధారంగానే రిజర్వేషన్లపై అంచనాలు ఇప్పటినుంచే ఆత్మీయ పలకరింపులు ఓవైపు పార్టీ ముఖ్యులను కలుపుకొని, ఇంకోవైపు జనాల మద్దతుండేలా.. ‘సంక్రాంతి’ని అనుకూలంగా మలచుకునేలా ప్రణాళిక -
బీజే పీ జిల్లా కమిటీ నియామకం
గీసుకొండ: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి జీ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా పదాధికారుల నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గడల కుమార్, బైరి నాగరాజు, పి.యాకాంతం గౌడ్, కందిమల్ల మహేష్, రేసు శ్రీనివాస్, అజ్మీరా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా బాకం హరిశంకర్, గోగుల రాణాప్రతాప్రెడ్డి, బన్న ప్రభాకర్, కార్యదర్శులుగా గోకె వెంకటేశ్, మిట్టపల్లి కపిల్కుమార్, దువ్వ నవీన్, గుడిపుడి రాధాకృష్ణ, రాయబారపు కుమారస్వామి, మంద శ్రీనివాస్, కోశాధికారిగా గుర్రాల సరితచంద్రమౌళి, ఆఫీస్ సెక్రటరీగా కంది రజిత క్రాంతికుమార్, సోషల్ మీడియా ఇన్చార్జ్గా నోముల రతన్, మీడియా కన్వీనర్గా అనకాల జనార్దన్, ఐటీ ఇన్చార్జ్గా ఆడెపు సృజన వెంకటేష్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఒకే జిల్లాగా చేయాలి హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒకే జిల్లాగా చేయాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్లోని టీఎన్జీఓస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లాల విభజన అశాసీ్త్రయంగా జరిగిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా, ప్రమోషన్లలో సీనియార్టీ కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాల విభజన ఆధారంగా చేసిన జోనల్ విధానం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు వివిధ జిల్లాలకు మరియు జోన్లకు కేటాయించడం వల్ల వారి సర్వీస్లో పరిష్కారం కాని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు భౌతికంగా కలిసే ఉన్నాయని ఈ రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రజలకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపడాన్ని టీఎన్జీఓస్ యూనియన్ స్వాగతిస్తొందని పేర్కొన్నారు. గంజాయి స్వాధీనం నర్సంపేట రూరల్: పోలీసులు మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం ఏసీపీ రవీందర్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. చెన్నారావుపేట మండలంలోని అక్కల్చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్ ఛత్తీస్గఢ్లో తక్కువ ధరకు ఎండు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధర అమ్మేందుకు తీసుకొన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కల్చెడ క్రాస్ రోడ్డు వద్ద ప్రదీప్ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 3 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
లో ఓల్టేజీ సమస్య ఉంది..
లోఓల్టేజీ ట్రాన్స్ఫారంతో వ్యవసాయ మోటార్లు నడవడం లేదు. దీంతో తరుచూ మోటార్లు కాలిపోతున్నాయి. విద్యుత్ అధికారులను కలిసి సమస్యను వివరించినా.. పట్టించుకోవడం లేదు. అధిక ఓల్టేజీ ట్రాన్స్ఫారంను బిగించాలి. – కోనాపురం గ్రామస్తులు నన్ను పట్టించుకోవడం లేదునాకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు లేకపోతే బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్న. నా భర్త ఉద్యోగం కుమారుడికి ఇప్పించాను. నా యోగక్షేమాలు చూడకుండా నన్ను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న. న్యాయం చేయాలి. – ఏ.సమ్మక్క, పైడిపల్లి, వరంగల్ -
పోటాపోటీగా చేరికలు
నర్సంపేట: జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఆయా వార్డుల్లో పలుకుబడి ఉన్న వారిని తమ పార్టీలో చేర్పించుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 9న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్ కుటుంబం బండి భారతిరమేష్, సందీప్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి దొంతి మాధవరెడ్డి అనుచరుడిగా కొనసాగిన మాజీ ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు తన పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీలో కూడా కొందరు గోగుల రాణాప్రతాప్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడంతో మున్సిపల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించి నట్లు అయింది. మరికొంత మంది ప్రధాన నాయకులను తమ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నట్లు తెలుస్తుంది. -
ఇంటింటికీ విద్యుత్ ఉద్యోగులు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా విద్యుత్ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు వినియోగదారులను కలువనున్నారు. గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులను కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభా కాంక్షల లేఖలు అందించేందుకు రంగం సిద్ధం చేశా రు. ఈ నెల 13 నుంచి పంపిణీ చేసేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను టీజీఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది స్వయంగా వినియోగదారు ల గృహాలను సందర్శించి అందజేయనున్నారు. ప్రత్యేక చొరవ.. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి మొత్తం 52,82,498 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నేరుగా లేఖలు అందివ్వనున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు హనుమకొండ సర్కిల్లో 1,30,199 మంది. వరంగల్లో 1,31,726, జేఎస్ భూపాలపల్లి సర్కిల్లో 57,016, ములుగులో 40,859, జనగామలో 94,372, మహబూబాబాద్లో 1,08,466 మంది లబ్ధిదారులున్నారు. వినియోగదారులు, అధికా రుల మధ్య సత్సంబంధాలను మెరుగుపర్చడం, భవిష్యత్లో మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం తమపై చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ, ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా వినియోగదారులు భావిస్తున్నారు. వినియోగదారులతో సత్సంబంధాలు.. సంక్రాంతి శుభాకాంక్షల లేఖల ద్వారా వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడుతాయి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తో వినియోగదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అధికారులు, ఉద్యోగులు వినియోగదారులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండ వినూత్న కార్యక్రమం.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం ద్వారా ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. వినియోగదారులపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. సంస్థకు వినియోగదారుడే ముఖ్యం. వినియోగదారుడికి మెరుగైన సేవలందించడం అధికారులు, ఉద్యోగుల బాధ్యత. – కె.గౌతంరెడ్డి, ఎస్ఈ, వరంగల్ టీజీ ఎన్పీడీసీఎల్ వినూత్న కార్యక్రమం గృహజ్యోతి వినియోగదారులకు లేఖల పంపిణీ ఎమ్మెల్యే నాయినికి శుభాకాంక్షల లేఖవిద్యుత్ శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాసిన సంక్రాంతి శుభాకాంక్షల లేఖను టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి అందించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్రావు, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీఈలు ఇంద్రసేనారెడ్డి, మల్లయ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించి సంక్రాంతి శుభాకాంక్షల లేఖను అందజేశారు. -
డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
వరంగల్ లీగల్: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ‘బాలికల హక్కుల రక్షణ, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అంతమొందించడం’ అంశంపై సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ తెలిపారు. ఈవ్యాసరచన పోటీలో ఆదర్శ లా కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కళాశాల నుంచి 40 మంది న్యాయ విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రఽథమ, ద్వితీయ బహుమతులు గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్, తదితరులున్నారు. విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు ఈఏడాది ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. ప్రీ–ఫైనల్ పరీక్షల టైంటేబుల్ను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న థర్డ్ లాంగ్వేజ్, 20న మేథమెటిక్స్, 21న ఫిజికల్ సైన్స్, 23న బయాలాజికల్ సైన్స్, 24న సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. ఈమేరకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ టీఎస్) వరంగల్ జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఆర్యూపీపీటీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కక్కెర్ల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సూరం ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం వీరికి నియామక పత్రాన్ని ఆర్యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి భత్తిరాజు శశియాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బెజ్జం సునీల్కుమార్ అందజేశారు. వరంగల్ క్రైం: స్వామి వివేకానందుడి మాటలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని అదనపు డీసీపీ సురేశ్కుమార్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ సురేశ్కుమార్ మాట్లాడుతూ.. దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానందుడని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో అదనపు డీసీపీలు ప్రభాకర్రావు, శ్రీనివాస్, ఏసీపీలు డేవిడ్ రాజు, జాన్ నర్సింహులు, నాగయ్య, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, శ్రీధర్, సతీశ్, చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ మల్లయ్య, ఆర్ఎస్ఐ శ్రవణ్కుమార్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఈనెల 13 నుంచి 18వరకు సెలవుపై వెళ్తున్నారు. కేరళలోని అయ్యప్పస్వామి దర్శనానికి సెలవుపెట్టి అధికారికంగా అనుమతి పొందారు. గిరిరాజ్గౌడ్ సెలవులో ఉన్న సమయంలో విద్యాశాఖకు సంబంఽధించిన బాధ్యతలను డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ) బి.భువనేశ్వరి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకు వీరిరువురు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. -
మెరుగైన వైద్యం అందించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య కమలాపూర్: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని అంబాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయుష్మాన్ మందిరంలోని రికార్డులు, అక్కడ జరుగుతున్న విద్యుద్ధీకరణ పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయుష్మాన్ మందిరంలో కరెంట్ లేక పోవడంతో సేవల నిమిత్తం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, చిన్నారులు, వృద్ధులతో పాటు వ్యాక్సిన్లు నిల్వ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది, ప్రజల ద్వారా తెలుసుకుని ఆ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ అనుమతితో విద్యుత్ సరఫరా నిమిత్తం తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య మందిరం చుట్టూ ప్రహరీ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య సిబ్బంది డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి నాగరాజు, డాక్టర్ మానస, డెమో అశోక్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె నేరుగా వినతులు స్వీకరించి వారు చెప్పిన అంశాలను ఓపిగ్గా విన్నారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో పలు మండలాల తహసీల్దార్లతోనూ ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 110 అర్జీలను స్వీకరించినట్లు, అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి గణేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, అధికారులు పాల్గొన్నారు. భూసమస్యలు పెండింగ్ ఉండొద్దువరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: భూ సమస్యలు ఎట్టి పరిస్థితిలో పెండింగ్లలో ఉంచొద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతులు స్వీకరించారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీడబ్ల్యూఓ రాజమణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నన్ను పట్టించుకోవడం లేదు.. నాకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు లేకపోతే బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్న. నా భర్త ఉద్యోగం కుమారుడికి ఇప్పించా. ప్రస్తుతం నా యోగక్షేమాలు చూసుకోవట్లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. న్యాయం చేయాలి. – ఎ.సమ్మక్క, పైడిపల్లి, వరంగల్ -
ఒకే జిల్లాగా చేయాలి
టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒకే జిల్లాగా చేయాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్లోని టీఎన్జీఓస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లాల విభజన అశాసీ్త్రయంగా జరిగిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా, ప్రమోషన్లలో సీనియార్టీ కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాల విభజన ఆధారంగా చేసిన జోనల్ విధానం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు వివిధ జిల్లాలకు మరియు జోన్లకు కేటాయించడం వల్ల వారి సర్వీస్లో పరిష్కారం కాని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు భౌతికంగా కలిసే ఉన్నాయని ఈ రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రజలకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపడాన్ని టీఎన్జీఓస్ యూనియన్ స్వాగతిస్తొందని పేర్కొన్నారు. -
నగరంలో ‘అనగనగా ఒక రాజు’
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో సోమవారం రాత్రి అనగనగా ఒక రాజు సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. చిత్ర దర్శకుడు మారి, హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, బాలనటుడు బుట్టిరాజు, చమ్మక్చంద్ర అనంత్, కాదంబరి కిరణ్ హాస్యనటులు అభిమానులు పాల్గొని అలరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రారంభించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చక్కని సందేశంతోపాటు వినోదం, హాస్యం మేళవించి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని దర్శకుడు కోరారు. – విద్యారణ్యపురి -
‘ప్రణామ్’లో వృద్ధులకు ఆహ్లాద వాతావరణం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు ఉచిత వైద్య సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటలతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపే సౌకర్యాలన్నీ ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో కల్పిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి వర్చువల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్ను కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ హనుమకొండలో ఈ కేంద్రం ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణరెడ్డి, బొద్దిరెడ్డి సతీశ్రెడ్డి, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె.జయంతి పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం ఉండాలి
● వినియోగదారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచెర్ల సుదర్శన్ ఖిలా వరంగల్: ప్రజాప్రతినిధులు లాభాపేక్షలేకుండా ప్రజలకు సేవ చేయాలని వినియోగదారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య జనరల్ సెక్రటరీ మొగిలిచెర్ల సుదర్శన్ అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్లోని సమాఖ్య జిల్లా కార్యాలయంలో వినియోగదారుల సమాఖ్య జిల్లా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య నిర్వచనం, ప్రజల బాధ్యతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుత ఓటు వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల్ని, జరిగిన విధ్వంసాన్ని, జరగబోయే ప్రమాదాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. న్యాయవాదులు యశ్వంత్కుమార్, రంగరాజు ఆనందరావు, రాయబారపు భిక్షపతి, బండి అనిల్కుమార్, బాలాజీ, ఏఐసీడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేరు ప్రవీణ్, మాజీ ఉద్యోగులు దిడ్డి లక్ష్మీనారాయణ, తిరునగరి లక్ష్మీనరసింహస్వామి, యం.ఉపేందర్, సమాఖ్య సభ్యులు కార్తీక్ మహేశ్, మధుకర్, ఫజల్ తదితరులున్నారు. -
సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్కుమార్, శ్రీనివాస్ రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మవారికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాసరావు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయమర్యాదలతో స్వాగతించారు. శ్రీనివాసరావు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారుల సమక్షంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపా. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కటి కార్యక్రమం అని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. హన్మకొండ అర్బన్: బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం 35వ వార్షికో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నృత్యస్రవంతి విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ కె.చంద్రశేఖర్ ప్రసంగించారు. కూచిపూడికి ఉన్న సంప్రదాయం, సాధన విలువను ఆ యన వివరించారు. అనంతరం నృత్య స్రవంతి కళాక్షేత్రంలో శిక్షణ పొందిన విద్యార్థులు చేసిన శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. లయ, భావ, అభినయాలతో సాగిన ప్రదర్శనలు కనులపండువగగా నిలిచాయి. సంప్రదాయ శాసీ్త్రయ నృత్యాన్ని సజీవంగా ఆవిష్కరించిన తీరు వీక్షకులను కట్టిపడేసింది. నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించగా, అధ్యక్షురాలు తాడూరి రేణుక పాల్గొన్నారు. హన్మకొండ: హనుమకొండ మండలం పలివేల్పుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెనిశెట్టి రవికుమార్ శాంతిసేవా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. విద్య, సామాజిక, సాంస్కృతిక సేవా రంగాల్లో విశేష సేవలందించిన వారికి గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ యోగా ఎడ్యుకేషన్ అవార్డులు ప్రదానం చేసింది. ఈరంగంలో సేవలందిస్తున్న వెనిశెట్టి రవికుమార్ను శాంతిసేవా పురస్కారానికి ఎంపిక చేసింది. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మల్కాజ్గిరి కోర్టు జడ్జి మధుసూదన్, గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ యోగా ఎడ్యుకేషన్ సంస్థ వ్యవస్థాపకుడు పల్లెపూల వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
విస్తరణ.. విస్మరణ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని కీలక కూడళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విస్తరణకు నోచుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న కూడళ్లను వదిలేసి అన్ని క్లియరెన్స్ ఉన్న జంక్షన్లను మాత్రమే అభివృద్ధి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. జనం రద్దీతో కిక్కిరిసిపోతున్న కూడళ్లపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయా కీలక జంక్షన్లలో అడుగడుగునా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), రహదారులు, భవనాల శాఖల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారు అభివృద్ధి పనులు వదిలేయడం పరిపాటిగా మారింది. జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణపై దృష్టి సారించాల్సిన శాఖలు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని ఐదు ప్రధాన కూడళ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కాజీపేట జంక్షన్.. వరంగల్ నగరంలో ప్రధానమైన కాజీపేట జంక్షన్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. ఇక హనుమకొండ వైపు రహదారిలో రైల్వే స్టేడియం వైపు విస్తరించాల్సి ఉంది. భారతదేశ దక్షిణ, ఉత్తర ప్రాంతాలను కాజీపేట రైల్వే స్టేషన్ అనుసంధానం చేస్తుంది. కీలకమైన ప్రాంతంలోని కాజీపేట కూడలి విస్తరణ, అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్లూ ప్రింట్కే హనుమకొండ చౌరస్తా.. మహా నగర నడిబొడ్డున ఉన్న హనుమకొండ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. నిత్యం ఇక్కడి నుంచి మంత్రులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రాకపోలకు సాగిస్తుంటారు. 20 ఏళ్లనాటి జంక్షన్ ప్రతిపాదనలు మూలనపడ్డాయి. పదేళ్ల క్రితం అప్పటి పాలకవర్గం పెద్దలు హనుమకొండ చౌరస్తాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని బ్లూ ప్రింట్ చూపించి తర్వాత పట్టించుకోలేదు. 1954లో హనుమకొండ సగర వీధికి చెందిన తైలం యాదగిరి చౌరస్తాలో సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పార్కు నిర్మించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఖ్యాతి మసకబారిపోయింది. హనుమకొండ చౌరస్తా అభివృద్ధికి నోచుకోక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్లో ట్రాఫిక్ పద్మవ్యూహం నగరంలో అభివృద్ధికి నోచుకోని ప్రధాన కూడళ్లు వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు -
మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బంగారం సమర్పించారు. చీర, సారె సమర్పించి తల్లులకు మొక్కులు చెల్లించారు. భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. కాగా, ఆదివారం ఒక్క రోజే సుమారు 5 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
‘నన్ను మన్నించండి.. మీకు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వలేకపోతున్నా.. ఓ ఈశాన్యభూమి కన్నీటి గాథ
‘చివరి మజిలీకి కేరాఫ్ నేను. అలసి జీవిడిసిన దేహాలకు సాంత్వన నేను. శాశ్వత నిద్రకు ఉపక్రమించిన వారికి మట్టి పొరల్లోని పాన్పును నేను. కాలం కాదన్న ఎందరినో అక్కున చేర్చుకున్న నాకు.. నాపైనే విరక్తి పుడుతోంది. కన్నీళ్లను నింపుకుని వచ్చే వారికి కనీస వసతులు కూడా ఇవ్వలేకపోతున్నాను’ అని కాజీపేట దర్గా గ్రామ శివారున, బంధం చెరువు కట్టను ఆనుకుని ఉన్న హిందూ శ్మశాన వాటిక తన గోడును వెల్లబోసుకుంది. బంధం చెరువు పక్కనే ఉన్నందున నీటి సౌకర్యం బాగుంటుందని ఒకప్పుడు నన్ను(శ్మశానం) ఇక్కడ ఎంచుకున్నారు. గడిచిన 20 ఏళ్లుగా నేను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాను. చుట్టూ రక్షణ గోడ లేదు. దాంతో కుక్కలు, పందులు నా ఆవాసంలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఇక్కడ అంతిమ సంస్కారం జరుగుతుంటే పక్కనే జంతువులు తిరుగుతుండడం, కాకులకోసం ముద్ద పెడితే వాటిని కుక్కలు, పందులు దొర్లించడం కలచివేస్తోంది. పుట్టెడు దుఖఃంలో ఉన్న వారు మరోమారు బావురుమంటుంటే బాధేస్తోంది. మీ బాధ.. నా అశక్తత ఆత్మీయులకు వీడ్కోలు పలకడానికి వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి నీడ కూడా లేదు, తలదాచుకోవడానికి గదీ లేదు. అంతిమ సంస్కారం ముగించుకున్నాక స్నానం చేద్దామంటే నీటి సౌకర్యం లేదు. అస్థికలను, బట్టలను భద్రపర్చుకునే వీలే లేదు. పాత ఘోరీలతో నిండిపోయింది నా ఆవరణంతా. బర్నింగ్ ఘాట్లు, ఆధునిక వసతులు ఉంటే ఇబ్బందులు తప్పుతాయని తెలుసు. కానీ, నా మొర ఎవరికీ వినబడట్లేదు. రాజకీయ చదరంగంలో నా ఉనికి.. నాది 49వ డివిజన్ పరిధి. కానీ, నన్ను వాడుకునే వారు 90 శాతం మంది 48వ డివిజన్ వారే. ఇదే నా పాలిట శాపమైంది. ఒకరు అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తే, మరొకరు వెనక్కి లాగుతున్నారు. అధికారుల చిత్తశుద్ధి కేవలం కాగితాలకే పరిమితమైంది. ఏడుసార్లు టెండర్లు పిలిచారట.. కానీ, ఒక్క కాంట్రాక్టర్ కూడా నన్ను బాగు చేయడానికి ముందుకు రాలేదు. స్వయానా, ఎమ్మెల్యే, కలెక్టర్, నగర పాలక కమిషనర్ వచ్చి చూసి వెళ్లినా, నా రాత ఏ మాత్రం మారలేదు. వైరుధ్యాల వేదికను చూడండి.. నా పక్కనే బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి, వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. ఒకవైపు సంబరాలు.. మరోవైపు నేను నిశ్శబ్దంగా రోదిస్తున్నా. గత ప్రభుత్వం ‘అంతిమ యాత్ర–గౌరవప్రదంగా‘ సాగాలని వైకుంఠ ధామాల పేరుతో మాతోటి వారిని అభివృద్ధి చేశారు. కానీ, నా దౌర్భాగ్యం ఏంటో ఎవరూ పట్టించుకోవట్లేదు. కోట్ల నిధులు నా వరకు వచ్చేసరికి ఏమయ్యాయో.. ఏ మాయావి మింగేశాడో తెలియదు. మీకో విన్నపం.. జీవితమంతా కష్టపడి, కడసారి నా దగ్గరకు వచ్చే జీవికి ఆత్మతృప్తితో కూడిన గౌరవ ప్రదమైన అంతిమ వీడ్కోలు లభించాలని నేను కోరుకుంటున్నా. ఓ ప్రజాప్రతినిధులారా! ఓ నాయకులారా! అధికారులారా.. ఇప్పటికై నా నా గోడు వినండి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నాకు కనీస వసతులు కల్పించండి. నేను అడుగుతున్నది నా కోసం కాదు, రేపు నా ఒడికి చేరే మీ ఆత్మీయుల కోసం. – హన్మకొండ అర్బన్ -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
ఇక పురపోరు
రిజర్వేషన్లు తేలకముందే ఆశావహుల బాహాబాహీమున్సిపాలిటీ, వార్డులు, రిజర్వేషన్లు (2020 ఎన్నికల్లో) మున్సిపాలిటీ రిజర్వేషన్ పరకాల ఎస్సీ మహిళ నర్సంపేట బీసీ మహిళ వర్ధన్నపేట ఎస్టీ మహిళ జనగామ జనరల్ మహిళ మహబూబాబాద్ జనరల్ అన్రిజర్వుడ్ డోర్నకల్ ఎస్టీ ఆన్రిజర్వుడ్ మరిపెడ ఎస్టీ మహిళ తొర్రూరు ఎస్సీ అన్రిజర్వుడ్ భూపాలపల్లి ఎస్సీ మహిళ కొత్త మున్సిపాలిటీలు స్టేషన్ఘన్పూర్, కేసముద్రం, ములుగుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల సవరణ ఓ కొలిక్కి వచ్చింది. వార్డుల వారీగా సోమవారం ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వెలువడనుంది. ఈనేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్లో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ పోరు ప్రతిష్టాత్మకం కాగా.. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి సమీకరణలు ప్రారంభించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు తమ సత్తా చాటేలా సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఉంటాయని, ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారం ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ఒక రకంగా ‘అగ్నిపరీక్ష’ అనే చెప్పవచ్చు. ఈనేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముందస్తు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మరుసటి రోజునే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఇదే తరహాలో ముఖ్యనేతలు పర్యటిస్తూ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తూ మంతనాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 30కి పైగా స్థానాలు గెలిచిన బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఇటీవల పర్యటించారు. వామపక్షపార్టీలు సైతం ఎన్నికలకు ఏ తరహాలో ముందడుగు వేయాలనే విషయమై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆశావహుల్లో టెన్షన్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగితే రాజకీయ పార్టీల దృష్టి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లపై పడనుంది. పాత 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన 3 కలిపి 12 చోట్ల ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రిజర్వేషన్లపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఏ మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో.. వార్డుల్లో తమకు రిజర్వేషన్ కలిసి వస్తుందో.. రాదోనన్న అనుమానాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. రిజర్వేషన్ల తంతు పూర్తయితే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టొచ్చన్న భావన ఆశావహుల్లో నెలకొంది. కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇంకా రిజర్వేషన్లను తేల్చలేదు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు సవరణతో పాటే వార్డుల వారీగా కులగణన చేపట్టింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకు రాష్ట్రం యూనిట్గా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 మున్సిపాలిటీల వార్డులు, చైర్మన్ పీఠాలకు జనవరి 5న రిజర్వేషన్లు వెల్ల డించింది. ఈసారి 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేస్తుండగా, 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై మరికొంత సమయం తీసుకుంటారా? లేదా వెంటనే కులగణన ఆధారంగా వార్డులు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. గెలుపే లక్ష్యంగా.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా వెలువడే సమయానికల్లా సర్వసన్నద్ధం కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.. అవసరమైన జోరుని చూపించాలని బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. తుది ఓటరు జాబితా వెలువడిన తర్వాత కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాన్ని నిర్వహించే వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. వరుస విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఓట్లు పొందాలన్న ప్లాన్తో బీఆర్ఎస్, బీజేపీలున్నాయి. గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల కోసం కసరత్తు నేడు వార్డుల వారీగా ఫొటోలతో ఓటర్ల జాబితామున్సిపాలిటీ, వార్డులు, రిజర్వేషన్లు మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ అన్ (జ) రిజర్వ్డ్పరకాల 22 01 05 05 07 04 నర్సంపేట 24 01 03 08 07 05 వర్ధన్నపేట 12 03 02 01 04 02 జనగామ 30 01 05 09 09 06 స్టేషన్ఘన్పూర్ – – – – – – మహబూబాబాద్ 36 07 05 06 10 08 డోర్నకల్ 15 04 03 00 04 04 మరిపెడ 15 06 01 00 04 04 తొర్రూరు 16 02 03 03 05 03 కేసముద్రం – – – – – – జేఎస్ భూపాలపల్లి 30 02 06 07 08 07 ములుగు – – – – – – -
నిరుపయోగం
● సమస్యల మధ్య సమావేశాలు ఎలా? ● మూడేళ్లుగా నిలిచిన నిధులు ● ఏఓలపై నిధుల భారం ● జిల్లాలో 59 రైతు వేదికలురైతు వేదికలునర్సంపేట: పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. నిధుల లేమితో నిర్వహణ భారంగా మారింది. నాలుగేళ్ల క్రితం నిధులు మెయింటెనెన్స్ కింద అందించారు. నాటి నుంచి మళ్లీ ఇవ్వకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించాలంటే ఇబ్బంది కరంగా మారాయి. మొదట్లో నెలకు రూ.3 వేలు అందించినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి రూ.9 వేలుగా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కాగితాలకే పరిమితమైంది. దీంతో రైతులకు, అధికారులకు అసౌకర్యంగా మారాయి. రూ.22లక్షల వ్యయంతో.. గత ప్రభుత్వ హయాంలో మంచి లక్ష్యంతో ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. రైతులంతా ఒకే చోట చేరి సాగుపై చర్చించేందుకు వ్యవసాయానికి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తూ తగు సలహాలు సూచనలు చేసుకునేందుకు రైతు వేదికలను నిర్మించారు. ఐదు నుంచి ఎనిమిది గ్రామాలను ఒక క్లస్టర్గా తీసుకొని జిల్లాలో 59 భవనాలను నిర్మించారు. ఏఈఓను నియమించి దీని నిర్వహణ అప్పగించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ సాగుపై అవగాహన కల్పించే వెసులుబాటును కల్పించారు. నిర్వహణ కరువు.. మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. సమావేశాలు జరిగే సమయంలో శుభ్రం చేయించుకోవడం ఏఈఓలకు ఇబ్బందిగా మారింది. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు నీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. కిటికీలు, ఫ్యాన్లు, మైకులు కొన్ని చోట్ల మాయమై పోయాయి. నిధులు లేకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. భూసార పరీక్షల పరికరాలు, రసాయనాల సరఫరా నిలిచిపోవడంతో మట్టి నమూనాల సేకరణ జరగడం లేదు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇచ్చి వసతి సమకూరిస్తే ఉపయోకరంగా ఉంటుందని పలువురు రైతులు కోరుతున్నారు. నిధులు అందితేనే మెరుగైన సేవలు..రైతు వేదికలకు గత ప్రభుత్వ హయాంలో నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరుగుతున్నప్పటికీ నిర్వహణ కోసం నిధులు అందితే మెరుగైన వసతులు అందుతాయి. –దామోదర్రెడ్డి, ఏడీఏ -
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ప్రయోగ పరీక్షల నిమిత్తం జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ సామగ్రి పంపిణీకి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన జిల్లా ల్యాబ్ సామగ్రి సమీకరణ కమిటీ (డిస్ట్రిక్ట్ ల్యాబ్ ప్రోక్యూర్మెంట్ కమిటీ) ఆధ్వర్యంలో అర్హులైన ప్రయోగ సామగ్రి పంపిణీదారుల నుండి సీల్డ్ టెండర్ దరఖాస్తులు ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు బాక్స్లో వేయాలని సూచించారు. ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు టెండర్ బాక్స్లు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. పంపిణీదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు సంస్థ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయం, వార్షిక టర్నోవర్ తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు ఇంటర్ విద్యా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. సమస్యల సాధనకు కృషి నర్సంపేట: సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడాలని భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్బి.శ్రీనివాసచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నర్సంపేట శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఏజెంట్ల అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు. సంస్థ పరంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూనే ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీహరి, గాదె మోహన్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్, మోహన్రావు, గోపాల్రావు, కృష్ణారావు, వెంకట్నారా యణ, ఎండీ.హుస్సేన్, రాక రాజలింగం, సో మయ్య, సోమయ్య, శ్రీరామ్, రాజా, శ్రీనివాస్, గోపి, కిశోర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మండే కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక పురపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల సవరణ ఓ కొలిక్కి వచ్చింది. వార్డుల వారీగా సోమవారం ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వెలువడనుంది. ఈనేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్లో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ పోరు ప్రతిష్టాత్మకం కాగా.. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి సమీకరణలు ప్రారంభించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు తమ సత్తా చాటేలా సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఉంటాయని, ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారం ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ఒక రకంగా ‘అగ్నిపరీక్ష’ అనే చెప్పవచ్చు. ఈనేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముందస్తు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మరుసటి రోజునే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఇదే తరహాలో ముఖ్యనేతలు పర్యటిస్తూ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తూ మంతనాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 30కి పైగా స్థానాలు గెలిచిన బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఇటీవల పర్యటించారు. వామపక్షపార్టీలు సైతం ఎన్నికలకు ఏ తరహాలో ముందడుగు వేయాలనే విషయమై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆశావహుల్లో టెన్షన్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల దృష్టి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లపై పడింది. పాత 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన 3 కలిపి 12 చోట్ల ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రిజర్వేషన్లపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఏ మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో.. వార్డుల్లో తమకు రిజర్వేషన్ కలిసి వస్తుందో.. రాదోనన్న అనుమానాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. రిజర్వేషన్ల తంతు పూర్తయితే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టొచ్చన్న భావన ఆశావహుల్లో నెలకొంది. కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇంకా రిజర్వేషన్లను తేల్చలేదు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు సవరణతో పాటే వార్డుల వారీగా కులగణన చేపట్టింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకు రాష్ట్రం యూనిట్గా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 మున్సిపాలిటీల వార్డులు, చైర్మన్ పీఠాలకు జనవరి 5న రిజర్వేషన్లు వెల్ల డించింది. ఈసారి 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేస్తుండగా, 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై మరికొంత సమయం తీసుకుంటారా? లేదా వెంటనే కులగణన ఆధారంగా వార్డులు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. గెలుపే లక్ష్యంగా.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా వెలువడే సమయానికల్లా సర్వసన్నద్ధం కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.. అవసరమైన జోరుని చూపించాలని బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వార్డుల విభజన పూర్తవడంతో నాయకులు ఇక ఓటర్ల మీద దృష్టి పెడుతున్నారు. కొత్త ఓటర్లను చేర్పించే విషయంలో పార్టీ శ్రేణులకు ఇదివరకే తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో తుది ఓటరు జాబితా వెలువడిన తర్వాత కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాన్ని నిర్వహించే వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. వరుస విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్తో బీఆర్ఎస్, బీజేపీలున్నాయి. ఈక్రమంలో గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్సైజు చేస్తున్నాయి.కొత్త మున్సిపాలిటీలు స్టేషన్ఘన్పూర్ కేసముద్రం ములుగు మున్సిపాలిటీ రిజర్వేషన్ పరకాల ఎస్సీ మహిళ నర్సంపేట బీసీ మహిళ వర్ధన్నపేట ఎస్టీ మహిళ జనగామ జనరల్ మహిళ మహబూబాబాద్ జనరల్ అన్రిజర్వుడ్ డోర్నకల్ ఎస్టీ ఆన్రిజర్వుడ్ మరిపెడ ఎస్టీ మహిళ తొర్రూరు ఎస్సీ అన్రిజర్వుడ్ భూపాలపల్లి ఎస్సీ మహిళరిజర్వేషన్లు తేలకముందే ఆశావహుల బాహాబాహీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలు 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల కోసం కసరత్తు నేడు వార్డుల వారీగా ఫొటోలతో ఓటర్ల జాబితామున్సిపాలిటీ, వార్డులు, రిజర్వేషన్లు మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ అన్ (జ) రిజర్వ్డ్పరకాల 22 01 05 05 07 04 నర్సంపేట 24 01 03 08 07 05 వర్ధన్నపేట 12 03 02 01 04 02 జనగామ 30 01 05 09 09 06 స్టేషన్ఘన్పూర్ – – – – – – మహబూబాబాద్ 36 07 05 06 10 08 డోర్నకల్ 15 04 03 00 04 04 మరిపెడ 15 06 01 00 04 04 తొర్రూరు 16 02 03 03 05 03 కేసముద్రం – – – – – – జె.ఎస్.భూపాలపల్లి 30 02 06 07 08 07 ములుగు – – – – – – -
వరంగల్
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనంములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
వివేకానందస్వామి స్ఫూర్తితో గ్రామాభివృద్ధి
స్వామి వివేకానంద స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఇటీవల సర్పంచ్లుగా గెలిచిన యువ సర్పంచ్లు చెబుతున్నారు. గ్రామంలోని యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, యువశక్తి సహకారంతో గ్రామాన్ని ప్రగతిపథాన నిలుపుతామని ఆకాంక్షిస్తున్నారు. నేడు (సోమవారం) స్వామి వివేకానంద జయంతి (యువజన దినోత్సవం) సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం –సాక్షి, నెట్వర్క్ కార్మికులందరికీ ఉచిత బీమా గీసుకొండ: నేను రెండు సార్లు సర్పంచ్గా గ్రామానికి సేవలందించా. ప్రస్తుతం తన భార్య మానసను సర్పంచ్గా గెలిపించిన గ్రామస్తుల రుణం తీర్చుకోలేనిది. గ్రామంలోని దళిత కుటుంబాలకు లేబర్ కార్డు కోసం సొంత ఖర్చులతో బీమా చేయిస్తున్నా. అలాగే దళిత కుటుంబాల్లో వివాహం చేసుకున్న నూతన దంపతులకు దుస్తులు పంపిణీ చేస్తా. ఇవే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేవిధంగా కృషి చేస్తా. –బోడకుంట్ల ప్రకాశ్, మచ్చాపూర్ -
ఘనంగా ‘కుడారై’ ఉత్సవం
వర్ధన్నపేట: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ‘కుడారై’ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు కలకోట గోపాలచార్యులు, శ్రవణకుమారచార్యులు, రామాచార్యులు, అచ్చి వెంకట శేషశయనం, వెంకటరమణ ఆధ్వర్యంలో రంగనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడారై ఉత్సవంలో భాగంగా 108 పాయసం గిన్నెలతో స్వామి వారికి నైవేద్యం చేశారు. ధనుర్మాసంలో 27వ రోజైన కుడారై పవిత్ర దినం ఎంతో గొప్పదని వేద పండితులు చెబుతున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. సన్నూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో.. రాయపర్తి: మండలంలోని సన్నూరు వెంకటేశ్వరపల్లిలోని ప్రముఖ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కుడారై ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఈనెల 14న నిర్వహించనున్న గోదారంగనాథస్వామి కల్యాణంలో భాగంగా 108 గంగాలతో కుడారై ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ఆరుట్ల రంగాచార్యులు, రమణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 గంగాలలో క్షీరాన్ననివేదన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ లయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. -
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
దుగ్గొండి: మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తండ్రి సుకినె పెద్ద రాజేశ్వర్రావు 15 ఏళ్ల క్రితం చనిపోయారు. కుటుంబ పరిస్థితుల కారణంగా పదో తరగతి వరకు చదివి మా అమ్మకు అండగా ఉండి వ్యవసాయ చేశా. అయినా గ్రామానికి ఏదైన చేయాలనే తపనతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరా. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపుకోసం మండల వ్యాప్తంగా యువతను ఒక్కతాటిపై తీసుకువచ్చి చేసిన కృషి ఫలిచింది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు రాగానే గ్రామానికి సేవ చేయాలనే తపన ఉన్న తనను సర్పంచ్గా పోటీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించి అధిక మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తా. పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలకు అండగా ఉంటా. – సుకినె నాగరాజు, సర్పంచ్ శివాజీనగర్ -
గాంధీ పేరు తొలగించడం దుర్మార్గం
● డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి ● బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే: నాయిని హన్మకొండ చౌరస్తా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి శనివారం హనుమకొండలోని డీసీసీ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడంపై ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లేలా కార్యాచరణ రూపొందించనున్ననట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ, కాంగ్రెస్ పార్టీల చరిత్రను తుడిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, గాంధీ పేరును తొలగించడమే అందుకు నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఉపాఽధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చడమే కాకుండా, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, విజయశ్రీ, నాయకులు వీసం సురేందర్రెడ్డి, మహ్మద్ జాఫర్, బీమా వినయ్ పాల్గొన్నారు. -
బాలవికాసలో సంక్రాంతి సందడి
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్లో శనివారం భారతీయ సంస్కృతీసంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ 15 మంది కెనడా ప్రతినిధులతో నిర్వహించారు. 12 మంది కెనడా విద్యార్థులు, ముగ్గురు టీచర్లు వారం క్రితం బాలవికాస పథకాలను తెలుసుకోవడానికి ఇక్కడి గ్రామాల పర్యటనకు వచ్చారు. చివరి రోజు జరిగిన సంక్రాంతి సంబురాల్లో అందరూ సంప్రదాయబద్ధంగా పంజాబీ డ్రెస్లు వేసుకుని పాల్గొని ఆడిపాడారు. సంక్రాంతి ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. గంగిరెద్దు నృత్యాలు, ఇక్కడి గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. భారతదేశంలో సంక్రాంతి సంబురాలు ఇంత గొప్పగా జరుగుతాయా? అని ఆనందం వ్యక్తం చేశారు. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు జరుపుకునే పండుగల విశిష్టతను విదేశీ ప్రతినిధులకు బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో శోభ, లత, సునీత, ఐటీ ప్రోగ్రాం మేనేజర్ శివరాం, సిబ్బంది పాల్గొన్నారు. గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసిన కెనడా దేశీయులు గంగిరెద్దు నృత్యాలను చూసి కేరింతలు -
కమనీయం.. వీరభద్రుడి కల్యాణం
● స్వామి నామస్మరణతో మార్మోగిన ఆలయంఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఈఓ కిషన్రావు, తదితర సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను కల్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. ఆగమ పండితులు యాగ్నికుల చేతుల మీదుగా కల్యాణోత్సవాన్ని కనులకు ఇంపుగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. కార్యక్రమంలో ‘కుడా’ డీసీసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఆలయ అర్చకులు రాజయ్య, రాంబాబు, వినయ్శర్మ, రమేశ్, శ్రీకాంత్, సందీప్ తదితరులు ఉన్నారు. -
బ్రహ్మోత్సవాలకు కేటీఆర్కు ఆహ్వానం
ఐనవోలు: ఐనలోలు శ్రీ మల్లికార్జనస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైదరాబాద్లో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేశ్, ఉప సర్పంచ్ అడ్డగూడి సతీశ్, నాయకులు కాటబోయిన అశోక్, తండా వెంకన్న, వార్డు సభ్యులు దుపెల్లి రాజు, కొత్తూరు సరిత, జాన్సన్, బత్తుల ప్రవీణ్, మండల నాయకులు చింత అశోక్, రాజిరెడ్డి, రాజు, పురుషోత్తం, చందు తదితరులు పాల్గొన్నారు. -
ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం
వరంగల్ క్రైం: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజలు ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు శనివారం వరంగల్ సీపీ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు, చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, మధుసూదన్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. కొన్ని సూచనలు.. ● సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి. ● ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం కానీ, డిజిటల్ లాకింగ్ సిస్టం కానీ అమర్చుకోవాలి. బీరువా తాళాలు ఇంట్లో బెడ్ కింద, బట్టల కింద పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి. ● తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదా వెంట తీసుకెళ్లాలి. ● ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి లేదా తెలిసిన వారికి విలువైన వస్తువులు ఇవొద్దు. ● వాహనాలు ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలి. చైన్తో లాక్ చేయడం మంచిది. ● ఇంటి గేటుకు తాళం వేయొద్దు. తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు గుర్తిస్తారు. ● నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్గా నియమించుకోవాలి. ● స్వీయ రక్షణకు 15 రోజుల స్టోరేజ్ కలిగి ఉన్న రక్షణ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ● మొబైల్లో ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలు లైవ్ ప్రత్యక్షంగా చూసుకోవాలి. ● ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ● ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ● ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. ● పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ● ఇంటి ఎదుట చెత్తాచెదారం, న్యూస్ పేపర్లు పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. ● అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. ● ఇంటి తాళం చెవిని తలుపుల దగ్గర, పూల కుండీల్లో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టొద్దు. ● ఇంట్లో పనిచేసే వారి వివరాలు పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కరపత్రం ఆవిష్కరణ -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● అదేవిధంగా తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూ కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక
కేయూ క్యాంపస్: బెంగళూరులోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్లో ఈనెల 10నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య శనివారం తెలిపారు. పురుషుల జట్టులో ఎ.గౌతమ్, బి.రోషన్, డి.వివేక్చంద్ర, ఎస్.గోపీచంద్, సీహెచ్.వినయ్, ఆర్.అభినయ్, ఎం.అఖిల్, వి.గణేశ్ ఉన్నారు. మహిళా జట్టులో ఎ.మైథిలి, బి.శృతి, సీహెచ్.కీర్తన ఉన్నారు. జట్లకు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.సుమన్ మేనేజర్గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, పీఆర్సీ సాధనే ఎజెండాగా త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు రాజేందర్ తెలిపారు. శనివారం హనుమకొండలోని ఆ సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. 51శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ఏజెండాలే ప్రధానంగా కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఆలిండియా జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాను టీచర్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమునూరు రాంబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్.సాంబయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సూర రమేశ్, పూర్వ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఆట సదయ్య, రాష్ట్ర బాధ్యులు ఆర్.సుధాకర్రెడ్డి, మాలోతు గణపతి, వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధులిమాయె, దానం నాగరాజు, హనుమకొండ జిల్లా ఆర్థిక కార్యదర్శి దానం శివకోటి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: పీడీఎస్యూ వరంగల్–హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని శని వారం ఎన్నుకున్నారు. 23మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ శనివారం తెలిపా రు. వరంగల్–హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బి.అజయ్, ప్రధాన కార్యదర్శిగా బి.నర్సింహారావు, ఉపాధ్యక్షులుగా పి.అనూష, బి.బాలకృష్ణ, గణేశ్, సహాయ కార్యదర్శులుగా అలువా ల నరేశ్, వి.కావ్య, వంశీ, సంగీత, కోశాఽధికారిగా షరీఫా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు.అజయ్ అధ్యక్షుడు, నర్సింహారావు ప్రధాన కార్యదర్శి -
మహిళా సంఘాల సభ్యులకు ధీమా
నెక్కొండ: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమాద బీమాను 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రమాద సమయంలో భరోసా కల్పించినట్లయ్యింది. అందులో సభ్యులుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం పొందే సౌలభ్యం కల్పించింది. సీ్త్రనిధి ద్వారా అమలు.. జిల్లాలోని 11,522 స్వయం సహాయక సంఘాల్లో 1,20,402 మంది సభ్యులు ఉన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్స్ (వీఓలు) 421 మంది ఉన్నారు. మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో ఆయా యూనిట్లు నెలకొల్పి, ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలవుతుందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు.. మహిళా సంఘం సభ్యురాలు ఎవరైనా సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10 లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేస్తారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి, రూ.5 లక్షలు అందజేయనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబీకులు, సంఘం సభ్యులు తీసుకునేవారు. బీమాకు అర్హులు వీరే.. జిల్లా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 59 ఏళ్ల వారు స్వయం సహాయక సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకున్న వారు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది.2029 వరకు బీమా పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 11,522 స్వయం సహాయక సంఘాలు.. 1,20,402 మంది సభ్యులు, 421 మంది వీఓలు -
ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం
వరంగల్ క్రైం: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజలు ఇళ్లలో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు శనివారం వరంగల్ సీపీ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు, చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, మధుసూదన్, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. కొన్ని సూచనలు ● సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి. ● ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం కానీ, డిజిటల్ లాకింగ్ సిస్టం కానీ అమర్చుకోవాలి. బీరువా తాళాలు ఇంట్లో బెడ్ కింద, బట్టల కింద పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి. ● తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదా వెంట తీసుకెళ్లాలి. ● ఊరికి వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు పక్కింటి వారికి లేదా తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దు. ● వాహనాలు ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. చైన్తో లాక్ చేయడం మంచిది. ● ఇంటి గేటుకు తాళం వేయొద్దు. తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు గుర్తిస్తారు. ● నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్గా నియమించుకోవాలి. ● స్వీయ రక్షణకు 15 రోజుల స్టోరేజ్ కలిగి ఉన్న రక్షణ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ● మొబైల్లో ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాల లైవ్ ప్రత్యక్షంగా చూసుకోవాలి. ● ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ● ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ● ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. ● పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ● ఇంటి ఎదుట చెత్తాచెదారం, న్యూస్ పేపర్లు పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. ● అనుమానాస్పద ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. ● ఇంటి తాళం చెవిని తలుపుల దగ్గర, పూల కుండీల్లో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టొద్దు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రం ఆవిష్కరణ -
హక్కులను కాలరాస్తున్న కేంద్రం
వరంగల్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు మార్చడం, ఫొటోను తీసివేయడంతోపాటు చట్ట సవరణల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాలరాస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్అయూబ్ అన్నారు. పోచమ్మమైదాన్లోని అబ్నూస్ ఫంక్షన్హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గ్రామ కమిటీ తీర్మానం మేరకు ఉపాధిహామీలో పనులను చేసేవారని, కొత్త చట్టంలో పనులు ప్రభుత్వమే నిర్ణయిస్తోందని పేర్కొన్నారు. 50 రోజులు రాష్ట్రంలోని సర్కారు నిధులు కేటాయించాలని కేంద్రం నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. ఈనెల 20 నుంచి 30 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి, తీర్మానాలు చేస్తామన్నారు. అనంతరం ప్లకార్డులు చేతపట్టి రోడ్డుపై నిరసన తెలిపారు. సమావేశంలో సంగెం, గీసుకొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, ఖిలావరంగల్ మండలాల అధ్యక్షులు మాధవరెడ్డి, శ్రీనివాస్, జాటోత్ శ్రీను, ఎద్దు సత్యం, ప్రకాశ్, నాయకులు జన్ను అనిల్కుమార్, గిన్నారం రాజు, కోదాటి అనిల్, ఆరేళ్ల రవి, మహమూద్ పాషా, ఖుద్దూస్, జావెద్, అయిత క్రాంతి తదితరులు పాల్గొన్నారు.కేయూ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక కేయూ క్యాంపస్: బెంగళూరులోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్లో ఈనెల 10నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొంటున్నాయని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య శనివారం తెలిపారు. పురుషుల జట్టులో ఎ.గౌతమ్, బి.రోషన్, డి.వివేక్చంద్ర, ఎస్.గోపిచంద్, సీహెచ్.వినయ్, ఆర్.అభినయ్, ఎం.అఖిల్, వి.గణేష్ ఉన్నారు. మహిళా జట్టులో ఎ.మైథిలి, బి.శ్రుతి, సీహెచ్. కీర్తన ఉన్నారు. జట్లకు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.సుమన్ మేనేజర్గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. అమీనాబాద్లో చోరీనర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో చోరీ జరిగిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. అమీనాబాద్ గ్రామానికి చెందిన కాట్ల రాములు రేకులతో డబ్బా ఏర్పాటు చేసి కిరాణా షాపు నడిపిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షాపు వెనుక ఉన్న రేకును తొలగించి షాపులోకి వెళ్లి దొంగతానికి పాల్పడ్డారు. రాములు ఉదయం వచ్చి చూసేసరికి రేకు తొలగించి ఉండడాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా రూ.3 వేల నగదు, రూ.3 వేల విలువ చేసే మద్యం బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులు అపహరించుకుపోయినట్లు ఆయన తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చెన్నారావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● అదేవిధంగా తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూ కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
హెచ్పీవీతో క్యాన్సర్కు చెక్
బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సిన్గీసుకొండ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల్లో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ రాకుండా ముందుగానే కట్టడి చేసేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. అందుకోసం జిల్లాలో 14 సంవత్సరాలు నిండిన కిశోర బాలికలకు ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (హెచ్పీపీ) టీకా ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పీహెచ్సీల వైద్యులు, సిబ్బందికి టీకాపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని చాలా ఖరీదైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వనున్నారు. బయట ప్రైవేట్గా కొని వేసుకోవాలంటే ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.10 వేలకు పైగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య మహిళతో క్యాన్సర్ కేసులు వెలుగులోకి.. 2023 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో ఎంపిక చేసిన పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేడానికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో రొమ్ము, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులను గుర్తించి వారికి తగిన రీతిలో చికిత్సలు అందించే విధంగా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. పలు రకాల క్యాన్సర్ కేసులు కొంత మేరకు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యాధికారులు పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా సోకుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల పాటు వృద్ధి చెంది క్యాన్సర్కు కారణం అవుతుంది. ఈ క్యాన్సర్ను మొదటి దశలో గుర్తించలేకపోవడంతో వ్యాధి చివరిదశలో బయటపడి మరణానికి దారి తీసే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు ఉచితంగా వేయాలని నిర్ణయించింది. టీకా జిల్లాకు రాగానే గుర్తించిన బాలికలకు వేయనున్నారు. 14 ఏళ్లు నిండిన వారికి టీకా.. 14 ఏళ్లు నిండిన బాలికలను గుర్తించి హెచ్పీవీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేస్తారు. ఈ టీకా ఇచ్చే విషయంలో ఇప్పటికే వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జిల్లాలో కార్యక్రమాన్ని చేపడతాం. వేరే దేశాల్లో టీకా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు ఉచితంగా టీకా అందించడానికి ముందుకు వచ్చింది. – డాక్టర్ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, డీఐఓ 14 ఏళ్లు నిండిన వారికి త్వరలో ఉచితంగా టీకా జిల్లాలో సుమారు 9 వేల మంది బాలికలు ఉన్నట్లు అంచనా గ్రామాల్లో సర్వే చేస్తున్న ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ఇప్పటికే వైద్యులు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేసిన అధికారులు బాలికల గుర్తింపు కోసం సర్వే జల్లాలో 14 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి 15 ఏళ్ల వయస్సు దాటని కిశోర బాలికలను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధం అవుతోంది. ఇందుకోసం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే బాలికలతోపాటు పనిచేసుకునే వారిని గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. పీహెచ్సీల వారీగా శిక్షణ పొందిన వారు సబ్సెంటర్లు, గ్రామాల్లో ఆశ, ఏఎన్ఎంల ద్వారా సర్వే చేస్తారు. సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన బాలికల లెక్క తేలనుంది. జిల్లాలో సుమారు 9 వేల మంది బాలికలు 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు వారు ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. -
ఉప్పరపల్లి హేమాద్రి కుంటకు బుంగ
వృఽథాగా పోతున్న సాగునీరు కుంటకు పడిన బుంగ నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామ శివారులో ఉన్న హేమాద్రి కుంట చెరువు కట్టకు బుంగపడి సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చెరువు కట్టకు వర్షాకాలంలో బుంగ పడడంతో ఆయకట్టు రైతులు మట్టిని పోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పోసిన మట్టి ప్రస్తుతం కొట్టుకుపోవడంతో చెరువులోని నీరంతా వృథాగా పోతోంది. దీంతో యాసంగి వరి పంటలకు నీరందడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బుంగను పూడ్చి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. పంటలకు అందక వృథాగా సాగునీరు బుంగను పూడ్చాలని రైతుల విజ్ఞప్తి -
పురుగుల అన్నం తినలేం..
సంగెం: తరచూ పురుగుల అన్నం, సమయపాలన లేని టిఫిన్, వంట మనుషులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదుల బాక్స్లో చీటీలు రాసి వేశారు. శుక్రవారం సంగెం మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల వి ద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు, వంటగది, స్టోర్రూం అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. వినియోగంలో లేని మరు గుదొడ్లను మరమ్మతు చేయించకపోవడం, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, వంట సరుకుల స్టో ర్ రూం అపరిశుభ్రంగా ఉండటం, వంట మనుషులు విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం పట్ల ఎస్ఓ నీలిమకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సకాలంలో టిఫిన్ తయారు చేయడం లేదని, టిఫి న్, భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయని వంట మనుషులు తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వంట మనుషులు విజయ, లలిత, స్వరూపలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంట మనుషులు, కొందరు టీచర్లు అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్నారని బాలికలు ఫిర్యాదుల పెట్టెలో చీటీలు రాసి వేశారు. ఇంటర్, 10, 9వ తరగతి విద్యార్థినులతో వేర్వేరుగా కలెక్టర్ మా ట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెస్ ఇన్చార్జ్ సివిక్స్ టీచర్ అనితను సస్పెండ్ చే యాలని డీఈఓను ఆదేశించారు. అకౌంటెంట్ దీపా సెలవు పెట్టకుండా గైర్హాజరు కావడంపై ఎస్ఓ నీలి మను మందలించారు. ఈ సందర్భంగా సెలవులకు తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జిల్లా డీసీహెచ్ఎస్ కె. రామ్మూర్తి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంఈ ఓ నర్సింహచార్యులు, ఎస్ఓ నీలిమ పాల్గొన్నారు. ఎస్హెచ్జీలకు ఉపాధి అవకాశాలు న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయ సంఘాల కుటుంబాలకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 43 మంది ఎస్హెచ్జీ కుటుంబ సభ్యులకు జగిత్యాలలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో ఆరురోజుల పాటు సెంట్రింగ్ యూనిట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు యూనిట్కు రూ.4లక్షల వ్యయంతో పీఎంఈజీపీ పథకం క్రింద 35శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జీఎం ఇండస్ట్రీయల్ నరసింహామూర్తి, పీడీ ఇన్చార్జ్ హౌసింగ్ ఎన్.శ్రీవాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని చైతన్య పరచాలివరంగల్ చౌరస్తా: సమాజాన్ని చైతన్య పర్చడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని కలెక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాల్లో భా గంగా శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూ నియన్ (టీఎస్జేయూ) ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ సత్యశారద మాట్లాడారు. డీటీఓ శోభన్, ట్రా ఫిక్ సీ ఐ సుజాత, పరశురాములు, తహసీల్దార్ శ్రీ కాంత్, సతీష్, టీఎస్జేయూ నేతలు పాల్గొన్నారు.ఫిర్యాదుల పెట్టెలో చీటీలు రాసి వేసిన విద్యార్థినులు హాస్టల్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం ముగ్గురు వంట మనుషుల తొలగింపు మెస్ ఇన్చార్జ్ సస్పెన్షన్ సంగెం కేజీబీవీలో కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీలు -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
నర్సంపేట: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తిభరద్వాజ్ అన్నారు. నర్సంపేట పట్టణంలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు రో డ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. బాయ్స్ హైస్కూల్ నుంచి వరంగల్ రోడ్డు, అమరవీరుల స్తూపం, బస్టాండ్, అంగడిసెంటర్, పోలీస్స్టేషన్ నుంచి శివాలయం మీదుగా నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి, హెచ్ఎం కొర్ర సారయ్య మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నియమాలను పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన శిక్షలకు గురవుతున్నారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందింశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేస్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కేజీబీవీ సందర్శన
గీసుకొండ: మండలంలోని వంచనగిరి కేజీబీవీని అదనపు కలెక్టర్ సంధ్యారాణి శుక్రవారం సందర్శించారు. విద్యాలయం ఆవరణ, పరిసరాలు, వంటగది, వంటలు, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యాలయంలోని వసతిగృహంలో బాలికలకు సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుంధర, మండల ప్రత్యేక అధికారి సురేశ్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంఈఓ ఎస్.రవీందర్, విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ హిమబింధు, సీఆర్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మించేంత వరకు ఉద్యమం వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో వందపడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగుతుందని వందపడకల ఆస్పత్రి సాధన సమితి సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో సాధన సమితి సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వర్ధన్నపేట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వ్యవహారించి పట్టణంలోనే ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ జేఏసీ నాయకుడు తుమ్మల శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు తోటకూరి శ్రీధర్, రాజమణి, మహిళా సంఘాల నాయకురాల్లు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. నేడు రిజిస్ట్రేషన్ మేళాన్యూశాయంపేట: జిల్లా పరిధిలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్) కోసం లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళాను నేడు (శనివారం) నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళా హనుమకొండ సుబేదారి, వరంగల్ పాత డీటీఓ కార్యాలయం ఆవరణలో ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నా రు. తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఆహార భద్రతాధికారి 7330643793, గెజిటెట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ 9985820544 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఇంగ్లిష్ ఒలింపియాడ్లో ప్రతిభనర్సంపేట రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్లో కేజీబీవీ విద్యార్థినులు ప్రతిభకనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా రు. శుక్రవారం వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో జిల్లా స్థాయి కాంపిటేషన్ నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట కస్తూర్భా విద్యార్థినులు శ్రీరామ్శెట్టి రష్మిత మొదటిస్థానం, అక్షిత ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎడ్యుటాక్ అనే అంశంలో గూడెల్లి వైష్ణవి, తేజశ్రీలు ప్రతిభ కనబర్చినట్లు స్పెషలాఫీసర్ మెట్టుపల్లి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ రజినిని, విద్యార్థులను స్పెషలాఫీసర్, ఉపాధ్యాయులు అభినందించారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఈటీఎస్బీ–26 (ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్టక్చరల్ బయోఫిజిక్స్)పై మూడు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకుగాను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డీజీ, ప్రొఫెసర్ శేఖర్.సీ.మండే, బయోటెక్నాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ బి.రామరాజు, కిరణ్కుమార్, సౌమ్య లిప్సా పాల్గొన్నారు. -
కోటను కాపాడితేనే భవిష్యత్!
ఓరుగల్లు చరిత్రను భావితరాలకు తెలియాలికాకతీయ కళా వైభవాన్ని సంరక్షించుకోవాలి ఖిలావరంగల్ కోటను కొంతమంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారంటూ ఏఎస్ఐ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు కోట చరిత్ర కొనసాగాలంటూ ఈ అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేల ఏళ్ల నాటి చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఓరుగల్లు కోట భవిష్యత్లో వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకెళ్లే ప్రతిపాదనలు ఉండటంతో కాకతీయ కళా వైభవాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. – పాండు రంగారావు, ఇన్టాక్ కన్వీనర్ చరిత్రను బతికించాలి కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. కానీ ఖిలావరంగల్ కోటలో అడుగడుగునా ఆక్రమణలు ఉన్నట్టు ఇప్పటికే ఏఎస్ఐ అధికారులు అనేకసార్లు నోటీసులిచ్చారు. అయినా అక్రమ నిర్మాణాలు ఆగలేదు. అధికారులు మేల్కొని వేల ఏళ్ల క్రితం నాటి చరిత్రను బతికించాలి. – మండల భూపాల్, రాష్ట్రీయ హిందూ పరిషత్ ప్రతినిధి ఆక్రమణలు నియంత్రిస్తేనే భావితరాలకు చరిత్ర మా టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) సంస్థ పురాతన ఆలయాలపై పరిశోధన చేస్తుంది. ఈ క్రమంలోనే ఓరుగల్లు కోట చరిత్రపై లోతుగా అధ్యయనం చేశాం. కాకతీయుల పాలనకు వేదికగా నిలిచిన ఈ మాన్యుమెంట్లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ఇక్కడ ఆక్రమణలు పెరిగాయి. మట్టికోట చుట్టూ ఉన్న మట్టిని తరలించి కోటకు బీటలు పడేలా చేస్తున్నారు. వీటిని నియంత్రించడం ద్వారానే భవిష్యత్ తరాలకు కాకతీయ చరిత్రను అందించగలుగుతాం. – ఆరవింద్ ఆర్య, కార్యదర్శి, టార్చ్ ●సాక్షి, వరంగల్: చారిత్రక ఓరుగల్లు కోటాను కబ్జాల నుంచి కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చరిత్రకారులు, ఓరుగల్లు వాసులు అంటున్నారు. మట్టికోట, రాతికోట, స్మారక చిహ్నాల పరిసర ప్రాంతాల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకు వచ్చిన భవనాలు, వ్యాపార సముదాయాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి చారిత్రక సంపదను సంరక్షించాల్సిన అవసరముందని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటకు సంబంధించిన భూములు అర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు చెందినవైనా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడంతో ఈ ఆక్రమణదారుల పాలిట వరమైంది. ఏఎస్ఐ నిర్మాణదారులకు నోటీసులిచ్చినా, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కించడంతో వేల ఏళ్ల నాటి చరిత్ర కళ్ల ముందే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం.. పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓపీ) తీసుకోవాలి. ఈ నిబంధనలు ఆక్రమణదారులు కాలరాస్తున్నారు. అర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఇంటి నంబర్ ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్ మంజూరు నిషిద్ధమైనా ప్రభుత్వ శాఖలు ఇవ్వడంతో దేశమే కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కాకతీయ కట్టడాలు ఇప్పుడూ ప్రమాదంలో పడ్డాయని, ఇప్పటికై నా మేల్కొని ఓరుగల్లు కోటను కబ్జాకోరుల నుంచి కాపాడాలని చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలు లేకుండా చూడాల్సిందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి చారిత్రక సంరక్షణపై చరిత్రకారుల గళం -
నీటిని పొదుపుగా వాడుకోవాలి
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఖానాపురం: యాసంగి సాగులో నీటిని పొదుపుగా వాడుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని పాకాలలో యాసంగి సాగుకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకాలలో ప్రస్తుతం 28.5 ఫీట్ల నీరు ఉందని, నీరు సరిపోకపోతే గోదావరి జలాలు తీసుకువచ్చి రైతుల పంటలకు అందజేస్తామన్నారు. కాల్వల ఆధునీకరణకు రూ.137 కోట్లు ఈఎన్సీ నుంచి ఫైనాన్స్కు వెళ్లాయని, మూడు రోజుల్లో అనుమతులు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుదర్శన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హరిబాబు, యడ్ల జగన్మోహన్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నర్సంపేటను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే నర్సంపేట: నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడంతో పాటు పట్టణంలోని అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే, ఇద్దరు చైర్మన్లు ఉన్నప్పటికీ తట్టడి మట్టి కూడా పోయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో పట్టణంలో 30స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పునరుద్ధరణ రెండోదశ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్ సర్కిల్ భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో వేయిస్తంభాల ఆలయం కల్యాణ మండపం పునరుద్ధరణలో భాగంగా రెండో దశ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలాజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ హెచ్ఆర్ దేశాయ్ పాల్గొని పూజలు నిర్వహించి కళ్యాణ మండపం పైకప్పు వాటర్ ప్రూఫింగ్ పనులు ప్రారంభించారు. ప్రస్తుత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 32 లక్షలు కాగా, 90రోజుల్లోపు పూర్తయ్యేలా వాటర్ ప్రూఫింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం కళ్యాణ మండపం దక్షిణ భాగం రీసెట్టింగ్ పనులను ఏఎస్ఐ చేపట్టనుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, నిట్ విశ్రాంతాత ఆచార్యులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, కన్జర్వేషన్ అసిస్టెంట్లు మల్లేశం, అజిత్, దేవాదాయశాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
వివాదంలో వ్యవసాయ కళాశాల
సాక్షి, వరంగల్: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ ‘వరంగల్’ కేంద్రంగానే జరిగిందని నిర్ధారణ కావడంతో ఈ కళాశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడి కాలేజీకి చెందిన ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేయడంతో పాటు 8 మంది ఇన్సర్వీస్ అభ్యర్థులకు లీకేజీ పత్రాలు అందినట్లు గుర్తించి వారి ప్రవేశాలను రద్దు చేయడం సంచలనంగా మారింది. బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పాథాలజీ సబ్జెక్ట్ పేపర్లో 90 శాతానికిపైగా మార్కులు రావడంతో అనుమానం వచ్చిన వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య జగిత్యాల వర్సిటీలో విద్యార్థులపై ప్రశ్నలు వర్షం కురిపించడంతో తొలుత అశ్వరావుపేట అని, ఆ తర్వాత వరంగల్ నుంచి లీకేజీ పేపర్ వచ్చినట్లుగా తేలింది. ఈమేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ బుధ, గురువారం రెండురోజుల పాటు ఈ వ్యవసాయ కాలేజీలోనే ఉండి విచారణ చేపట్టారు. 23 మంది సిబ్బంది ఉంటే అందరితో మాట్లాడి ముఖ్యంగా ‘ఆఫీస్ ఆఫ్ అకడమిక్ మ్యాటర్స్’ అధి కారులను విచారించారు. అయితే వ్యవసాయ కళా శాలలో పనిచేసే తన తండ్రి గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానంలో ఉద్యోగం పొంది ప్రస్తు తం జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కార్తీక్ నుంచే ఈ ప్రశ్నపత్రం లీకై నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అదేవిధంగా అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలించగా రూ.వేల నుంచి రూ.లక్షలు ఉండడంతో అనుమానం వచ్చి అడగ్గా సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. రూ.వేలల్లో జీతం తీసుకునే వ్యక్తికి రూ.లక్షల్లో విలువ చేసే ఖరీదైన కారు ఎక్కడి నుంచి వచ్చింద ని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఏఓ రమేశ్ వచ్చి ఆరు నెలలు తిరగకముందే విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షన్కు గురైనట్లుగా వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీ ఇచ్చే ని వేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీలో ఇక్కడి సిబ్బంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణ ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సస్పెన్షన్ 8 మంది ఇన్సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలు రద్దు ఉలిక్కిపడిన కాలేజీ సిబ్బంది, విద్యార్థులు -
రూ.2వేల కోట్లతో జిల్లా అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయల్దేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వరంగల్కు ర్యాలీగా బయల్దేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాశ్, డా.పగడాల కాళీప్రసాద్, గుండె గణేశ్, ఒంటేరు జైపాల్, ఎడ్ల అశోక్ రెడ్డి, దిలీప్ నాయక్, చాడ స్వాతి, గుజ్జల వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
పైసలిస్తేనే పోస్టుమార్టం
ఎంజీఎం: సంబంధీకులు చనిపోయారనే బాధ ఒకవైపు. ఆ శవాలపై పైసలు చల్లితే ఏరుకోవాలని చూసే వైద్యులు, సిబ్బంది వేధింపులు మరో వైపు. వెరసి బాధిత కుటుంబీకుల వేదన వర్ణనాతీతం. ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో ఒక్కో మృతదేహం పో స్ట్మార్టం చేయడానికి రూ.4 వేలకుపైగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ డబ్బులివ్వకపోతే పోస్టుమార్టం పరీక్షల కోసం గంటల కొద్ది తాత్సారం చేస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకు ంటున్నప్పటికీ రోగులను జలగల్లా పీక్కుతినడం ఇక్కడి స్వీపర్ నుంచి మొదలు కొంత మంది వైద్యుల వరకు అలవాటుగా మారిందనే ఆరోపణలున్నాయి. వెళ్లిపోయిన వైద్యులు.. ఖిలావరంగల్కు చెందిన లక్కరసు రవి(51) బుధవారం తన ఇంటికి సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మెడికల్ లీగల్ కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం అవసరమని నిర్ధారించారు. అనంతరం కుటుంబీకులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. రవి కుటుంబ సభ్యులు మిల్స్కాలనీ పోలీసులకు సమాచారమిచ్చారు. పంచనామా పూర్తయ్యే వరకు సాయంత్రం 5 అయ్యింది. ఆ సమయం వరకు విధుల్లో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు 4 గంటలకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రూ.4 వేలు ఇవ్వనందుకు నాలుగు గంటల ఆలస్యం రవి మృతదేహం పోస్టుమార్టం కోసం గురువారం ఉదయం మరోసారి మార్చురీకి చేరుకున్న బందుమిత్రులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పంచనామా పత్రాన్ని సమర్పించినా మృతదేహాన్ని సదరు పోలీసులు నిర్ధారించాలని పోస్టుమార్టం సిబ్బంది తెలుపడంతో మరోసారి బంధుమిత్రులు పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులకు ఎంజీఎం మార్చురీ వద్దకు చేరుకుని శవాన్ని నిర్ధారించారు. అనంతరం కింది స్థాయి సిబ్బంది ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం మార్చురీలో విధులు నిర్వర్తిస్తున్న భిక్షపతి అనే వ్యక్తి రూ.4 వేలు డిమాండ్ చేయగా.. మృతుడి బంధుమిత్రులు రూ. 2 వేలు ఉన్నాయి అంతకు మించి ఇవ్వలేమని చెప్పారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధుమిత్రులు తెలిపారు. గురువారం మరో మారు బంధుమిత్రులు సూపరింటెండెంట్ను సంప్రదించి మార్చురీ గదిలోకి వెళ్లగా డబ్బులివ్వలేదనే కారణంతో పోస్టుమార్టం పూర్తయినప్పటికీ మృతదేహాన్ని ఇవ్వకుండా గంట పాటు పక్కకు పెట్టినట్లు ఆవేదనతో బాధిత కుటుంబీకులు వెల్లడించారు. రోజూ 8 నుంచి 10 మృతదేహాలకు శవ పరీక్షలు ఒక్కో మృతదేహానికి రూ.4 వేలకుపైగా వసూళ్లు ఎంజీఎంలో అడుగడుగునా అవినీతి -
సొంత సంస్థకు కన్నం!
హన్మకొండ: విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా చూడాల్సిన ఓ వ్యక్తి కక్కుర్తి పడి సంస్థ ఆదాయానికి కన్నం వేశాడు. టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్లోని ఎమ్మార్టీ డివిజన్కు చెందిన ఓ ఉద్యోగి తన గృహానికి టెస్టింగ్ మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఎన్పీడీసీఎల్ డీపీఈ విభాగం తనిఖీల్లో సర్వీస్ నంబర్కు మంజూరు చేసిన మీటర్ నంబర్ తేడాగా ఉండడంతో మీటర్ మార్చిన బాగోతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హనుమకొండలోని రాయపురలో నివాసముంటున్నాడు. కరెంట్ బిల్లు తక్కువ వచ్చేందుకు అసలు మీటర్ స్థానంలో టెస్టింగ్ మీ టర్లను మారుస్తున్నాడు. డీపీఈ విభాగం అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా రాయపురలోని ఆ ఉద్యోగి ఇంట్లోని మీటర్ను తనిఖీ చేయగా సర్వీస్ నంబర్కు, కేటాయించిన మీటర్ నంబర్ తేడాగా ఉండడం గమనించారు. కూపీలాగితే అసలు మీటర్ మార్చినట్లు వెలుగు చూసింది. అతడికి రూ.1.30 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఉద్యోగి ఏడాదికాలంగా మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అతడిపై టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్ సూపరింటెంటెండ్ ఇంజనీర్, ఎమ్మార్టీ డీఈలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టెస్టర్గా పనిచేస్తుండడంతో సులువుగా మీటర్ మార్పు.. సాధారణంగా గృహ విద్యుత్ వినియోగదారులు తమ మీటర్లలో లోపాలుంటే అందులోని వైఫల్యాన్ని గుర్తించడానికి రూ.200 ఆపరేషన్ డీఈ పేరుతో ఫీజు చెల్లించి సెక్షన్లో దరఖాస్తు చేసుకుంటాడు. ఈ మీటర్ను పరీక్షించేందుకు ఎమ్మార్టీ విభాగం ల్యాబ్కు పంపిస్తారు. ఇక్కడ టెస్టర్గా విధులు నిర్వహించే ఉద్యోగి ఆ మీటర్కు సాంకేతిక పరీక్షలు నిర్వహించి మీటర్ బాగుందా లేదో తేలుస్తాడు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో టెస్టర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి టెస్టింగ్ కోసం వచ్చిన మీటర్లను తన ఇంటికి తీసుకెళ్లి తన మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్ను అమరుస్తూ విద్యుత్ వాడుకుంటున్నాడు. రీడింగ్ తీయడానికి కొన్ని రోజుల ముందు యథావిధిగా పాత మీటర్ను అమర్చుతున్నాడు. ఈ మీటర్లో రీడింగ్ తక్కువ నమోదు అవుతుండడంతో బిల్లు కూడా తక్కువగా వస్తోంది. బిల్లు తగ్గించుకోవడానికి ఎన్పీడీసీఎల్ ఉద్యోగి నిర్వాకం సొంతింటికి టెస్టింగ్ మీటర్ల వినియోగం ఎమ్మార్టీలో పనిచేస్తుండడంతో సులువుగా మీటర్ మార్పు బిల్లు తీసేనాటికి సొంత మీటర్ అమర్చుతున్న ఉద్యోగి డీపీఈ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమం -
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య ఐనవోలు: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా పోత్సహించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీతో పాటు ఐలోని మల్లన్న జాతరలో భాగంగా పీహెచ్సీ నుంచి ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరం ప్రదేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, సమకూర్చాల్సిన మందులు, ఇతర అంశాలపై వైద్యాధికారికి సూచించారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో మాట్లాడుతూ.. సాధారణ, సీ–సెక్షన్ ప్రసవాలపై ఆరా తీశారు. ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మళ్లీ పిల్లలు కావాలని నమోదు చేసుకున్న వారిని నిరంతరం ఫాలో అప్ చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ, అబార్షన్ల గురించి 63000 30940 నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్రావు, డాక్టర్ శ్యామ్ప్రసాద్, డాక్టర్ రాజేశ్, సూపర్వైజర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్, హెచ్ఎస్ కృష్ణమూర్తి, సతీశ్చారి, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెరపైకి ‘పీవీ’ జిల్లా!
సాక్షిప్రతినిధి, వరంగల్: పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. పూర్వ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని మండలాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో జేఏసీ గురువారం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇక్కడ పరకాల.. అక్కడ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కోసం జేఏసీలుగా ఏర్పడి బలంగా ఉద్యమాలు నిర్వహించారు. ఇదే సమయంలో జిల్లాల్లో పర్యటించిన అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం ఎ.రేవంత్రెడ్డిని జేఏసీ నాయకులు కలిశారు. హనుమకొండ జిల్లాలో కలిసిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతో పాటు కరీంనగర్లోనే ఉన్న 10 మండలాలు కలిపి హుజూరాబాద్ కేంద్రంగా ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల సభల్లో మెనిఫెస్టోగా ప్రకటించారు. ఆతర్వాత జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సద్దుమణిగింది. ఇటీవల రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మండలాలు, జిల్లాల ఏర్పాటు అశాసీ్త్రయంగా జరిగాయని, పునఃపరిశీలన చేస్తామని’ ప్రకటించారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒక్క జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. జిల్లాల ఏర్పాటు నుంచే ఉద్యమం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాల విభజన ద్వారానే ప్రజలకు పాలన చేరువవుతుందని అక్టోబర్ 11, 2016న జిల్లాల విభజన చేశారు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 14 మండలాలు కలిపి ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటు చేయాలన్న ఉద్యమం తెరపైకి వచ్చింది. అప్పటికే ఆలస్యం కావడంతో 31 జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ములుగు, నారాయణపేట్ జిల్లాలను ప్రకటించారు. అప్పటి నుంచి పీవీ జయంతోత్సవాల సందర్భంగా కూడా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలంటూ జేఏసీలు బలంగా నినదించాయి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్... తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పీవీ జిల్లాను ప్రకటించనుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో అర్భన్, రూరల్ జిల్లాలను వరంగల్, హనుమకొండ జిల్లాలుగా మార్చడంతో ‘పీవీ హుజూరాబాద్’ జిల్లా ఏర్పాటుకు అడ్డంకిగా మారాయి. వినతులు.. ప్రతిపాదనలు హనుమకొండ జిల్లాలో కలిసిన ఉమ్మడి కరీంనగర్ మండలాలు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ను కలిపి 14 మండలాలతో పీవీ హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని గవర్నర్, ముఖ్యమంత్రులకు జేఏసీలు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించాయి. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, జేఎస్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నంతో పాటు కొత్తగా వంగర, చల్లూరును మండలాలుగా మార్చి జిల్లా చేయాలని అందులో ప్రతిపాదించారు. ఆమేరకు సాధ్యాసాధ్యాలపై సర్వేలు, చర్చలు జరిగాయి. కొన్నేళ్లుగా జిల్లా ఏర్పాటు వాయిదా ప డుతూ వస్తోంది. ఇటీవల అసెంబ్లీలో జిల్లాల ఏర్పాటుపై పునఃపరిశీలన, వరంగల్, హనుమకొండ జి ల్లాల విలీనం అంశాలు తెరమీదకు రావడం.. పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు సీఎం చొరవ తీసుకోవాలని గురువారం నుంచి మళ్లీ ఉద్యమాలు మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది . అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉధృతంగా పోరు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ మండలాలతో జిల్లా మ్యాప్ గతంలో ప్రస్తావించిన సీఎం రేవంత్రెడ్డి మంత్రి పొంగులేటి తాజా ప్రకటనతో మళ్లీ జిల్లా ప్రస్తావన వరంగల్, హనుమకొండ జిల్లాల విలీనంపై చర్చ జేఏసీల ఆధ్వర్యంలో మళ్లీ ఉద్యమాలకు శ్రీకారం -
సర్వే మిషన్పై అవగాహన ఉండాలి
హన్మకొండ అర్బన్: భూమి సర్వేకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన నూతన సర్వే మిషనన్పై లైసెన్స్డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. భూముల కొలతల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలన్నారు. భూమి కొలతల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నూతన సర్వే మిషన్న్తో భూముల కొలతలు ఎలా చేపట్టాలనే అంశంపై సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతోంది. హైదరాబాద్ భూమి కొలతల శాఖ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారం ధర్మసాగర్, హసన్పర్తి మండలాల సర్వేయర్లు ఈ శిక్షణ అందిస్తుస్తుండగా.. కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా భూమి కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సారంగపాణి, రాజనర్సింహ, సంబంధిత మండల సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్ సమీక్ష పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల పురోగతిపై కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం వీడియో కాన్ఫరెన్న్స్లో నేషనల్ హైవేస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసమావేశంలో 163 జి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ని ర్మాణానికి పూర్తయిన భూ సేకరణ, రైతులకు ప రిహారం చెల్లింపు, రహదారి నిర్మాణంలో ఏవైనా ఇ బ్బందులు ఉన్నాయా? అని అధికారులను అడిగా రు. జిల్లా అదనపు కలెక్టర్ రవి, నేషనల్ హైవే వరంగల్ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ, పరకాల ఆర్డీఓ కన్నం నారాయణ, సూపరింటెండెంట్ జగత్సింగ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టరేట్లో సర్వేయర్లకు శిక్షణ -
పరిపాలన విభాగం తక్షణమే స్పందించాలి
సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు, సిబ్బందికి సంబంధించిన శాఖాపరమైన సమస్యలపై పరిపాలన విభాగం తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిపాలన విభాగం కార్యాలయంలో గురువారం తనిఖీలు చేపట్టారు. కార్యాలయానికి చేరుకున్న సీపీకి అధికారులు పుష్పాగుచ్చాలు అందించి స్వాగతం పలుకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సీపీ పరిపాలనా విభాగం కార్యాలయంలోని బడ్జెట్, ఎస్టాబ్లిష్మెంట్, పే, జనరల్ సెక్షన్లతో పాటు ఎంఎస్ సెక్షన్లు, ఇన్న్ వర్డ్, అవుట్ వర్డ్లను సందర్శించి సంబంధిత సెక్షన్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, అలాగే ఆ సెక్షన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధులకు సంబంధించిన పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పరిపాలనా విభాగ అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. అధికారుల మధ్య ఎలాంటి ఆలస్యం లేకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిపోవాలని, పరిపాలన పరంగా ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, పరిపాలన విభాగం ఏఓ సంపత్, సెక్షన్ సూపరింటెండెంట్లు రమేశ్, యాకూబ్ బాబా, సంధ్య, జలజ, రమాదేవి, సురేందర్తో పాటు ఇతర పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. -
అట్టహాసంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ క్రీడాపోటీల టార్చ్ ర్యాలీ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద గురువారం ప్రారంభమైంది. ఈ ర్యాలీ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను చుడుతూ రెండు రోజులపాటు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, డీఎస్ఏ కోచ్లు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాల కొరతను గుర్తించిన సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి ఒక్కొక్కటిగా రోగులకు అందుబాటులోకి తెస్తున్నారు. అత్యవసర సమయంలో అందించే సేవలకు ఉండాల్సిన ఆరు ఈసీజీ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. హృద్రోగులకు మెరుగైన చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవడంతో మరణ ధ్రువీకరణ కూడా తొందరగా జరిగేలా చర్యలు చేపట్టారు. అలాగే ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చే రోగులతో పాటు అత్యవసర వార్డులో అందుబాటులో ఉండే రూ.16 లక్షల విలువైన నాలుగు డిఫిబ్రిలేటర్లు డీఎంఈ నరేంద్రకుమార్ సహకారంతో శుక్రవారం ఎంజీఎంకు చేరుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఖిలా వరంగల్: వార్షిక తనిఖీలో భాగంగా వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ను ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిని తెలుసుకున్నారు. వాటికి సంబంధించి పలు సూచనలిచ్చారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. అంతకుముందు ఏఎస్పీ శుభం, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ వేర్వేరుగా డీసీపీ కవితకు మొక్క అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్: తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్(ఏఈఓ)గా పీఆర్ఓ వి.వాసుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఏఈఓ సెలవులో ఉన్నందున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ డివిజన్కు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు వాసును సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం రన్వే విస్తరణ నేపథ్యంలో గవిచర్ల రోడ్డు మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నెక్కొండ నుంచి వచ్చే దారిలో గుంటూరుపల్లి గ్రామ చివరలో మూసివేయనున్నారు. అదేవిధంగా నక్కలపల్లి గ్రామ మూలమలపు వద్ద మూసివేసి బైపాస్ నక్కలపల్లి చెరువు కట్టమీదుగా.. గాడిపల్లినుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నెక్కొండ నుంచి వరంగల్కు రావాలనుకునే వారు కాపులకనపర్తి గ్రామ జంక్షన్ నుంచి గాడిపెల్లి, దూపకుంట గ్రామంనుంచి శంభునిపేటకు చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి నెక్కొండకు వెళ్లాల్సిన వారు శంభునిపేట జంక్షన్ నుంచి దూపకుంట, గాడిపెల్లి మీదుగా కాపులకనపర్తి గ్రామజంక్షన్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా నెక్కొండకు వెళ్లిపోవచ్చు. గుంటూరుపల్లి గ్రామస్తులు వరంగల్కు రావాలనుకుంటే బొల్లికుంట మీదుగా ఒక దారి, గాడిపెల్లి, దూపకుంటనుంచి శంభునిపేట రావొచ్చు. గాడిపల్లి, నక్కలపల్లి కట్టపై నుంచి రంగశాయిపేట జంక్షన్కు చేరుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ రహదారులను ఆర్అండ్బీ అధికారులు పరిశీలన చేసినట్లు తెలిసింది. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన
● సమగ్ర శిక్ష తెలంగాణ భవిత కేంద్రాల్లో సేవలుకాళోజీ సెంటర్: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం 1986 జాతీయ విద్యావిధానం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా 1995లో దివ్యాంగుల చట్టాన్ని రూపొందించి 7 వైకల్యాలను గుర్తించారు. అంధత్వం, పాక్షిక దృష్టి లోపం, శారీరక వైకల్యం, కుష్ఠు వ్యాధి, వినికిడి లోపం, మానసిక దివ్యాంగులు, మానసిక రుగ్మత కలవారికి ఈ చట్టంలో హక్కులు కల్పించారు. అదేవిధంగా 3 శాతం రిజర్వేషన్లు ఉద్యోగాల్లో, 4 శాతం రిజర్వేషన్లు విద్యాసంస్థల్లో ప్రవేశానికి, 18 సంవత్సరాల వరకు వివక్ష లేని ఉచిత విద్య అందించడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో 14 వైకల్యాలను చేర్చుతూ మొత్తం 21 రకాల వైకల్యాలతో ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల హక్కుల సమావేశం యూఎన్సీఆర్పీడీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం–2016 రూపొందించింది. ప్రత్యేక అవసరాల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థుల కోసం విలీన విద్యావిధానాన్ని కొనసాగిస్తోంది. జిల్లాల్లోని భవిత కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన సేవలు అందించడానికి స్పెషల్ బీఈడీ, డీఈడీ అర్హత గల వారు విలీన విద్య రిసోర్స్పర్సన్లు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.ఉచితంగా ఉపకరణాలు..భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు పలు రకాల సేవలు అందిస్తూ, ప్రధాన స్రవంతిలో తీసుకురావడానికి సమగ్ర శిక్ష తెలంగాణ కృషిచేస్తోంది. ప్రత్యేక విద్య, అవగాహన సదస్సులు, స్పీచ్ థెరపీ, ఇంటి వద్ద విద్య, ఆలింకో క్యాంపు ద్వారా అవసరమైన ఉపకరణాలు ఉచితంగా అందిస్తారు. చిన్న దిద్దుబాటు శస్త్రచికిత్సలు కూడా చేస్తారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా చార్జీలతోపాటు వివిధ సేవలు అందిస్తున్నాం. సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ జిల్లా భవిత సెంటర్లు విద్యార్థులు వరంగల్ 13 2,043 హనుమకొండ 14 1,810 భూపాలపల్లి 12 1,00 జనగామ 12 1,534 ములుగు 9 1,01 మహబూబాబాద్ 19 1,783 -
రూ.2వేల కోట్లతో జిల్లా అభివృద్ధి
● రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఖిలా వరంగల్: రూ.2వేల కోట్లతో జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. వరంగల్ శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్రావు వేర్వేరుగా రామచందర్రావు మెడలో భారీ గజమాల వేసి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునారెడ్డి, వన్నాల వెంకటరమణ, ఎండీ రఫీ పాల్గొన్నారు. -
ధాన్యం బోనస్ కోసం నిరీక్షణ
● రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.54 కోట్లు ● జిల్లాలో 15,311 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరణనర్సంపేట: ధాన్యాగార కేంద్రంగా పేరొందిన జిల్లాలో సన్న ధాన్యం విక్రయించిన అన్నదాతకు బోనస్ డబ్బుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 15,311 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని సేకరించారు. బోనస్ కింద రూ.75.2 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.21.2 కోట్లను మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన పాకాల సరస్సులో నీరు సమృద్ధిగా ఉంది. యాసంగి పంటకు తైబందీ ఖరారు అయింది. సరస్సు కింద 50 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేస్తారు. బోనస్ డబ్బులు జమ కాలేదు నల్లబెల్లి మండలం గోవిందా పురం ఐకేపీ సెంటర్ పరిధిలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సన్నవడ్ల బోనస్ డబ్బులు ఇప్ప టి వరకు జమ కాలేదు. నా పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 266 బస్తాల (106.40 క్వింటాళ్లు) సన్నవడ్లు విక్రయించాను. ఇందుకు రావాల్సిన రూ.53,200 బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. గత యాసంగి సీజన్ బోనస్ కూడా అందలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు విడుదల చేయాలి. – గుగులోత్ మునేందర్, ఎర్రయిచెరువుతండా -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
నల్లబెల్లి: రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కరుణాకర్, డీఈ దేవేందర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వారు మండల కేంద్రంలో నీటి సరఫరాను పరిశీలించారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మిషన్ భగీరథ, తాగునీటి సరఫరా, బోరు బావుల మరమ్మతు రికార్డులను పరిశీలించి నిర్వహణ సక్రమంగా లేనట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకుంటే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. బీట్ ఆఫీసర్పై విచారణ నల్లబెల్లి: మండలంలోని మూడుచెక్కలపల్లి, గోవిందాపూర్ బీట్ ఆఫీసర్ సతీశ్పై పోడు రైతులు నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్, సెక్షన్ ఆఫీసర్ సోమానాయక్ ముడుచెక్కలపల్లి, గోవిందాపూర్, మాన్సింగ్పల్లి గ్రామాలను సందర్శించారు. బీట్ ఆఫీసర్ సతీశ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేశారు. పోడు రైతులతో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. చర్యల నిమిత్తం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని రేంజ్ ఆఫీసర్ తెలిపారు. -
సజావుగా నీట్ నిర్వహించేందుకు చర్యలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో మే 3న నీట్–2026ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ముందస్తు సమావేశం నిర్వహించారు. డీఆర్వో విజయలక్ష్మి, ఎన్టీఏ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ భిక్షపతి, ఎన్ఐసీ అధికారి సృజన్కుమార్, డీఈఓ రంగయ్యనాయుడు, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ హరిచంద్రం పాల్గొన్నారు. లేఅవుట్ల అనుమతి మంజూరు జిల్లాలో లేఅవుట్ల అనుమతి కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన కమిటీ సమావేశం గురువారం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఐదు లేఅవుట్ అనుమతులు ఇచ్చారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, కుడా పీఓ అజిత్రెడ్డి పాల్గొన్నారు. అధికారుల సమన్వయంతోనే భూసేకరణ అధికారుల సమన్వయంతోనే మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ సకాలంలో పూర్తి చేసినందుకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ను అభినందించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ను ఆర్డీఓలు, తహసీల్దార్లు, అధికారులు కలిసి పూలమొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. యూరియాపై సమీక్ష యూరియా సరఫరా, పంపిణీపై గురువారం అధికారులతో కలెక్టరేట్ సమావేశపు హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈవీఎం గోదాంల పరిశీలన వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులోని జిల్లా గోదాంలలో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం పరిశీలించారు. -
కోటకు కబ్జా బీటలు!
సాక్షి, వరంగల్: చారిత్రక ఓరుగల్లు కోటకు ‘ప్రభుత్వ’మే బీటలు పారేలా చేసిందా.. ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్లు, హైదరాబాద్ నవాబుల దాడులు ఎదుర్కొన్న ఈ కోటను భద్రంగా ఉంచాల్సిన అధికారులు పట్టిచుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర పురావస్తు శాఖకు చెందిన ఈ వరంగల్ కోట భూములు రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూములు అని ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖతో తేటతెల్లమెంది. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) విభాగం నోటీసులిస్తున్నా వాటిని కూల్చే విషయంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమణలు రెట్టింపయ్యాయన్న విమర్శలున్నాయి. నాలుగేళ్లలో వరంగల్ కలెక్టర్కు మూడుసార్లు ఏఎస్ఐ అధికారులు లేఖలు రాసినా అక్రమ నిర్మాణాలను తొలగించి కోట భూములను పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తాజాగా పేర్కొనడంతో గమనార్హం. ఇప్పటికై నా ఏఎస్ఐ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఆ భూముల హద్దులను నిర్ణయించి అక్రమ కట్టడాలను కూల్చేస్తే చరిత్ర సజీవంగా ఉండనుంది. నిబంధనలు అతిక్రమించి.. కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం.. పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఈ నిబంధనలు ఆక్రమణదారులు కాలరాస్తున్నారు. ఏఎస్ఐ అనుమతి లేకుండా ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ప్రభుత్వ శాఖలు ఇచ్చాయన్న ఆరోపణలున్నాయి. సమాచారమిచ్చినా చర్యలు లేవు.. వరంగల్ కోటలో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో 2022లోనే ఏఎస్ఐ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఎప్పటికప్పుడూ నోటీసులు జారీ చేసి రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చినా చర్యలు తీసుకోకపోవడంతోనే చారిత్రక సంపద అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఎస్ఐ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపడితేనే కోటలో ఆక్రమణలు ఎన్ని ఉన్నాయనే లెక్క తేలనుంది. ఆ తర్వాత ఆయా భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చడంతో పాటు భూములను రెవెన్యూ రికార్డుల్లో ఏఎస్ఐకి బదిలీ చేస్తేనే ఈ కోట భద్రంగా ఉంటుందని వరంగల్వాసులు అంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూములు అని ఉండడమే కారణం మట్టి గోడలు పగులగొట్టి ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు కేంద్ర పురావస్తు శాఖ నోటీసులిచ్చినా పట్టించుకోని జిల్లా అధికారులు నాలుగేళ్లలో ఏఎస్ఐ మూడుసార్లు కలెక్టర్కు లేఖలు రాసినా చర్యలు శూన్యం సీఎం రేవంత్రెడ్డికి తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖతో మరోసారి చర్చ రాతికోట : 50 ఎకరాల 13 గుంటలు మట్టికోట : 169 ఎకరాల 10 గుంటలు మాన్యుమెంట్లు : 157 ఎకరాల 25 గుంటలు మాన్యుమెంట్లు అంటే స్వయంభూ టెంపుల్ కాంప్లెక్స్, వెంకటేశ్వర్ టెంపుల్, ఖుష్మహల్, శృంగార బావి (ట్యాంక్), ఏకశిల టెంపుల్, శివ టెంపుల్, జంగమయ్య టెంపుల్, నీలసాంబుని గుడి, వరాలమ్మ టెంపుల్, అమ్యూనిషన్ స్టోర్, దీపగడ్డ, మందలమ్మ టెంపుల్, ఎల్పీ గాంధీ టెంపుల్, కొండా మసీద్, హర్స్స్టేబుల్ సముదాయం. కేంద్ర పురావాస్తు శాఖ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి ఏఎస్ఐ ఆధీనంలోని భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో హద్దులు నిర్ణయించాలి. ఈ మొత్తం 377.8 ఎకరాల్లో ఎన్ని అక్రమ కట్టడాలున్నాయో గుర్తించి కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు మూడు విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాకతీయ రాజధాని చుట్టూ పటిష్టంగా నిర్మించిన నీటికోట (అగర్త చెరువు). ఈ చెరువు క్రమక్రమంగా మాయమవుతోంది. 40 శాతం భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండగా.. మిగిలిన 40 శాతం భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన 20 శాతం భూమిలో అక్కడకక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు చెరువు ఆనవాళ్లు కనిపిస్తాయి. మూడుకోటల్లో రాజధాని విస్తరించి ఉంంది. కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో చారిత్రక ఆలయాలు, నిర్మాణాలు ఉన్నాయి. కోట పరిసరాల్లో ఏ మూలన చూసినా చారిత్రక ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయాలకు 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయి. నోటీసులు జారీ చేసినా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. -
గాంధీ పేరు తొలగించడం అన్యాయం
వరంగల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అన్యాయమని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ఖాన్ అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, మరో కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ కేంద్రం ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడుస్తోందని, దీనిపై గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈవిషయంపై పూర్తిస్థాయిలో పార్టీ పరంగా ఉద్యమించేందుకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పాకాలలో మొసలి వదిలివేత ఖానాపురం: మండలంలోని పాకాల సరస్సులో మొసలిని గురువారం ఫారెస్ట్ సిబ్బంది వదిలివేశారు. గూడూరు మండలంలోని సీతానగర్ గ్రామ పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మొసలిని బంధించి పాకాలకు తీసుకువచ్చి వదిలివేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది విజయ్, వెంకటేశ్వర్లు, బోజ్య, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు ఇన్చార్జ్ ఏఈఓగా వాసు వరంగల్: తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్(ఏఈఓ)గా పీఆర్వో వి.వాసుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఏఈఓ సెలవులో ఉన్నందున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ డివిజన్కు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజలు వాసును సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్ : డీసీపీ నర్సంపేట: ఉన్నత విద్యనభ్యసిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సీయు గేట్ ప్రవేశ పరీక్ష–ఉన్నత విద్య అవకాశాలు అనే అంశంపై గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్కుమార్ మాట్లాడుతూ తనకు సివిల్స్పై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే అవగాహన కలిగిందని తెలిపారు. ప్రిన్సిపాల్ మల్లం నవీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల విద్యపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. వైస్ ప్రిన్సిపల్ బైరి సత్యనారాయణ, అకడమిక్ కోఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, స్టాఫ్ సెక్రటరీ ఎంఎంకే రహీముద్దీన్, ఎం.సోమయ్య, ఎం.రాంబాబు, రాజీరు, గాయత్రి, ఎస్.రజిత, సంధ్య, భద్రు భూక్య, పీడీ రమేశ్, పూర్ణచందర్, గ్లోరీ, మాధవి, నిజాం, రాకేశ్, సతీశ్, దివ్య, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు. అదృశ్యమైన వ్యక్తి మృతి పర్వతగిరి: కల్లెడ గ్రామంలో అదృశ్యమైన అకారపు రాములు (50) మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం. రాములు ఈనెల 6వ తేదీన కూలి పనికివెళ్లి ఇంటికి వచ్చాడు. అనంతరం తిరిగి రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో రాములు ఎంతకూ రాకపోవడంతో భార్య కళావతి పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా, గ్రామం మధ్యన ఉన్న వాగులో రాములు మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పాత బ్రిడ్జిపై నుంచి సైకిల్తో సహా వాగులోని పెద్ద బండరాళ్లపై పడడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. -
పైసలిస్తేనే పోస్టుమార్టం
ఎంజీఎం: సంబంధీకులు చనిపోయారనే బాధ ఒకవైపు. ఆ శవాలపై పైసలు చల్లితే ఏరుకోవాలని చూసే వైద్యులు, సిబ్బంది వేధింపులు మరో వైపు. వెరసి బాధిత కుటుంబీకుల వేదన వర్ణనాతీతం. ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో ఒక్కో మృతదేహం పోస్ట్మార్టం చేయడానికి రూ.4 వేలకుపైగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ డబ్బులివ్వకపోతే పోస్టుమార్టం పరీక్షలకు గంటల కొద్ది తాత్సారం చేస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ రోగులను జలగల్లా పీక్కుతినడం ఇక్కడి స్వీపర్ నుంచి మొదలు పెడితే కొంత మంది వైద్యుల వర కు అలవాటుగా మారిందనే ఆరోపణలున్నాయి. సమయాని కంటే ముందే వెళ్లిన వైద్యులు ఖిలావరంగల్కు చెందిన లక్కరసు రవి(51) బుధవారం తన ఇంటికి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మెడికల్ లీగల్ కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం అవసరమని నిర్ధారించారు. అనంతరం కుటుంబీకులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. రవి కుటుంబ సభ్యులు మిల్స్కాలనీ పోలీసులకు సమాచారమిచ్చారు. పంచనామా పూర్తయ్యే వరకు సాయంత్రం 5 అయ్యింది. ఆ సమయం వరకు విధుల్లో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు 4 గంటలకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రూ.4 వేలు ఇవ్వనందుకు 4 గంటల ఆలస్యం రవి మృతదేహం పోస్టుమార్టం కోసం గురువారం ఉదయం మరోసారి మార్చురీకి చేరుకున్న బందుమిత్రులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పంచనామా పత్రాన్ని సమర్పించినా మృతదేహాన్ని సదరు పోలీసులు నిర్ధారించాలని పోస్టుమార్టం సిబ్బంది తెలుపడంతో మరోసారి బంధుమిత్రులు పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు మార్చురీ వద్దకు చేరుకుని శవాన్ని నిర్ధారించారు. అనంతరం కింది స్థాయి సిబ్బంది ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం మార్చురీలో భిక్షపతి అనే వ్యక్తి రూ.4 వేలు డిమాండ్ చేయగా.. మృతుడి బంధుమిత్రులు రూ. 2 వేలు ఉన్నాయి అంతకు మించి ఇవ్వలేమని చెప్పారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధుమిత్రులు తెలిపారు. గురువారం మరో మారు బంధుమిత్రులు సూపరింటెండెంట్ను సంప్రదించి మార్చురీ గదిలోకి వెళ్లగా డబ్బులివ్వలేదనే కారణంతో పోస్టుమార్టం పూర్తయినప్పటికీ మృతదేహాన్ని ఇవ్వకుండా గంట పాటు పక్కకు పెట్టినట్లు ఆవేదనతో బాధిత కుటుంబీకులు వెల్లడించారు. రోజూ 8 నుంచి 10 మృతదేహాలకు శవ పరీక్షలు ఒక్కో మృతదేహానికి రూ.నాలుగు వేలకుపైగా వసూళ్లు ఎంజీఎంలో అడుగడుగునా అవినీతి -
ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని వర్ధన్నపేటలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పట్టణ సమీపంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
ఆకర్షణీయం.. అభివృద్ధి శూన్యం
ధర్మసాగర్: సుందరమైన కొండచరియలు. నిండుకుండలాంటి పెద్ద చెరువు. ఆకాశాన్ని తాకే తాకుతున్నట్లుగా కనిపించే తాటి వనాలు. వేల ఎకరాలకు జీవం పోసే దేవాదుల. లక్షలాది మంది గొంతు తడిపే భగీరథ ప్లాంట్. సమీపంలో ఇనుపరాతి గుట్టలు. పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి పచ్చందాలు. ఇలా ఒక్కటేమిటి అడుగడునా ప్రత్యేకతలే. పర్యాటకులను ఆకర్షిస్తున్న ధర్మసాగర్ ప్రాంతాన్ని అధికారులు పట్టించుకోవట్లేదు. అభివృద్ధి చేస్తామన్న మాటలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. పురాతన ఆలయాలు.. ధర్మసాగర్ ప్రాంతమంతా కాకతీయుల కాలం నాటి ఆలయాలు సంస్కృతిని, శిల్పకళను, ఆధ్యాత్మికతను సంరక్షిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. శిల్పాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధుల వాగ్దానాలు ఎన్నో ఇచ్చినప్పటికీ ఆచరణలో పెట్టడం లేదు.ధర్మసాగర్ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని ప్రజా చైతన్య సదస్సులు, అధికారులకు జన విజ్ఞాన వేదిక తరఫున వినతులిచ్చాం. గతంలో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు ఇనుపరాతి గుట్టలను సందర్శించి హామీలిచ్చారు. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వెంటనే ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – కేబీ.ధర్మప్రకాశ్, జన విజ్ఞాన వేదిక తెలంగాణ పర్యావరణ విభాగం కన్వీనర్ ప్రతిపాదనలకే పరిమితమైన ‘పర్యాటకం’ ఆకట్టుకుంటున్న ధర్మసాగర్ ప్రాంతం దృష్టి సారించాలని స్థానికుల విన్నపం -
కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మల్టిపుల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్ఎంయూ)లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని బుధవారం ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కాజీపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో రైల్వే పెన్షనర్స్ నాయకులు, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రైల్వే ఎలక్ట్రిక్ షెడ్డు క్వార్టర్స్ నుంచి రైల్వే ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్, రైల్వే ఆస్పత్రి మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ స్టీమ్ ఇంజన్ వరకు ర్యాలీ కొనసాగింది. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు ఎస్.ఆర్.వి.రావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు, రైల్వే యాక్ట్ అంప్రెంటీస్ వారికి, రైల్వే రిటైర్ట్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలన్నారు. తెలంగాణ రైల్వే జేఏసీ చేపడుతున్న ఉద్యమాలకు ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుపల్లి రాఘవేందర్, చైర్మన్ కోండ్ర నర్సింగరావు, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ నాయకులు ప్రేమ్కుమార్, ఎస్.సూర్యనారాయణ, వి.భిక్షపతి, రహమత్ అలీ, కె.వెంకటేశ్వర్లు, టి.కృష్ణమూర్తి, ఎం.కట్టయ్య, టి.రాజేశ్వర్, జి.గోపీ, ఎండీ అఫ్జల్, ఎ.ఐలయ్య, టి.సమ్మయ్య, ఎండీ అన్వర్మియా, ఎం.శంకర్, ఎస్.వెంకటస్వామి, ఎం.గట్టయ్య, ఎం.వెంకటేశ్వరరావు,రాజు, ఎం.పెంటయ్య, పి.ఎ.ఎబినేజర్, జాఫర్ పాల్గొన్నారు. రైల్వే పెన్షనర్స్ నాయకుల ర్యాలీ -
నేటి నుంచి క్రితి 3.0
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో క్రితి 3.0 (కాకతీయ రిసెర్చ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనోవేషన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, కేఎంసీ ఎన్ఆర్ఐ సభ్యులు డాక్టర్ వేణు బత్తిని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రితిలో దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 1100కుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రితి 3.0లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల పేపర్–పోస్టర్ ప్రజెంటేషన్లు, హ్యాకథాన్, జెపార్డీ, సింపోజియం, మెడికల్ ఎగ్జిబిషన్, హ్యాండ్స్–ఆన్ సర్జికల్ వర్క్షాపులు, నిపుణుల సీఎంఈ ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ యుగేంధర్ బుధవారం తెలిపారు. ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ ఛాలెంజెస్ అండ్ లావరేజింగ్ అపార్చునిటీస్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు కీలకోపన్యాసం చేస్తారని వారు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. అండర్–08, 10, 12, 14, 20 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 30 మంది క్రీడాకారులను ఈనెల 18న ఆదిలాబాద్లో జరిగే 11వ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పర్యటన వివరాలు విడుదల చేసింది. గురువారం ఉద యం 10 గంటలకు కాజీపేటలో ఘనస్వాగతం అనంతరం ర్యాలీగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని వేద బాంక్వెట్ హాల్కు చేరుకుని ప్రెస్మీట్లో మాట్లాడుతారు. అనంతరం ఇక్కడ జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరునుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి గుడెప్పాడ్లోని ఓ హోటల్లో బస చేస్తారు. 9న ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 10.30కు మేడారం చేరుకుని సమక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. -
పోలీసుల పనితీరు అభినందనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయుధ పోలీసుల పని తీరు అభినందనీయమని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ బుధవారం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ అధికారులు సీపీకి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ను సీపీ తిలకించారు. సిబ్బందికి ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని, యోగా, వ్యాయామం, ఆయుధ పరేడ్ను పరిశీలించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. వీటితోపాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, మోటారు, ఆయుధగారం విభాగాన్ని ీసీపీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఆకట్టుకున్న ఉమెన్ స్పెషల్ ఫోర్స్ విన్యాసాలు అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగాన్ని సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఉమెన్ స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి జోడించడం. ఇతర విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. తనిఖీల్లో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, రవి, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నేహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జూడోతో బాలబాలికలకు ఆత్మరక్షణ
వరంగల్: జూడో క్రీడ శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వరంగల్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి అన్నారు. జూడో ఆత్మరక్షణ క్రీడగా బాలబాలికలకు ఎంతో ఉపయోగకరమని, క్రీడలతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీలోని మినీ స్టేడియంలో అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికలు బుధవారం ముగిశాయి. అనంతరం ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన వరంగల్ జట్టుకు, రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ జిల్లా జట్టుకు ట్రోఫీలను రవీందర్రెడ్డి అందజేశారు. కార్యదర్శి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, జూడో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కై లాశ్యాదవ్, జిల్లా క్రీడా మండలి అధికారి అనిల్కుమార్, డాక్టర్ కోట సతీశ్, డాక్టర్ గోపి, రామయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి -
నేటి నుంచి కేఎంసీలో క్రితి 3.0 ప్రోగ్రాం
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో క్రితి 3.0 (కాకతీయ రీసెర్చ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, కేఎంసీ ఎన్ఆర్ఐ సభ్యులు డాక్టర్ వేణు బత్తిని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రితిలో దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 1100కుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రితి 3.0లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల పేపర్–పోస్టర్ ప్రజంటేషన్లు, హ్యాకథాన్, జెపార్డీ, సింపోజియం, మెడికల్ ఎగ్జిబిషన్, హ్యాండ్స్–ఆన్ సర్జికల్ వర్క్షాపులు, నిపుణుల సీఎంఈ ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
5 గంటలు.. 15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడకల గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15 అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్శర్మ, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆస్పత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతోందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
● డీఈఓ రంగయ్యనాయుడువర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ శారద సోము కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ల్యాబర్తి సర్పంచ్ శారదసోము ప్రభుత్వ పాఠశాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు మెరుగైన విద్యనందిస్తారని, ప్రజలను చైతన్యం చేసే దిశగా క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమన్నారు. పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం ఎంతో అవసరమన్నారు. ఉప సర్పంచ్ గంగరాజు, హెచ్ఎం వేణు, ఉపాధ్యాయులు హరిలాల్, వెంటకస్వామి, నాగరాజు, రఘువీర్, శివకుమార్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. వర్క్సైట్ స్కూల్ ఏర్పాటు చేయాలి గీసుకొండ: శాయంపేట హవేలిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో పనిచేస్తున్న కార్మికులు తమ పిల్లలను బడికి పంపించి చదివించాలని డీఈఓ బి.రంగయ్యనాయుడు సూచించారు. బుధవారం ఆయన కేఎంటీపీని సందర్శించి బడికి వెళ్లకుండా ఉన్న పిల్లలతోపాటు వారి తల్లిదండ్రుతో మాట్లాడారు. కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు, యూనిట్ల యాజమాన్యాలు కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా వర్క్సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బడికి వెళ్లకుండా ఎవరూ ఉండకూడదని, బడిఈడు పిల్లలను గుర్తించి బడికి పంపించేందుకు సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గొర్రెకుంట, ధర్మారం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎంఓ సుజన్తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ రవీందర్, హెచ్ఎంలు సాంబయ్య, సీఆర్పీలు పాల్గొన్నారు. -
పోలీసుల పనితీరు అభినందనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయుధ పోలీసుల పని తీరు అభినందనీయమని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ బుధవారం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ను సీపీ తిలకించి, సిబ్బందికి ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగాన్ని సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఉమెన్ స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి జోడించడం. ఇతర విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. తనిఖీల్లో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, రవి, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
5 గంటలు.. 15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాఢవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వి.పి.గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీల్లోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదులకు అర్హుల ఎంపిక ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగరాభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి –ధనసరి సీతక్క అనసూయ అన్నారు. ఆదివాసీలకే కాకుండా గిరిజనేతరులు, కోట్లాదిమంది ఇలవేల్పులైన మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ పనులకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హౌసింగ్ ఎండీ వీపీ గౌతం, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆస్పత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతోందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ లీగల్: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలన్నారు. గత సంవత్సరం దేశంలో 4.5 కోట్ల ప్రమాదాలు జరిగాయని, కొంత భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఇవి నిర్మూలించగలుగుతామని తెలిపారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ ఫోన్ వాడవొద్దని, అతి వేగం ప్రాణానికి హాని అని తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.రామలింగం, న్యాయమూర్తులు శాంతిసోని, శ్రావణ స్వామి, బి.అనూష, ప్రియాంక సిరిసిల్ల, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి అపర్ణాదేవి -
నేడు హౌసింగ్ బోర్డుఫ్లాట్లకు లాటరీ
వరంగల్ చౌరస్తా: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రాంకీ ఎన్క్లేవ్లో ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ బోర్డు నిర్మించిన ఎల్ఐజీ ఫ్లాట్లకు గురువారం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు పీఆర్ఓ వి.శ్రీను తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన బ్లాక్–ఏ, బ్లాక్–బి, బ్లాక్–సీలో మొత్తం 102 ఫ్లాట్లు ఉండగా..ముగిసిన నిర్ణీత గడువులోగా మొత్తం 387 దరఖాస్తులు నమోదైనట్లు పేర్కొన్నారు. గురువారం 8న ఆవరణలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో లాటరీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మాడవీధుల పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. మాడ వీధుల నిర్మాణ శైలి మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. వారికి ఈఓ రామల సునీత, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. -
కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి
● రైల్వే పెన్షనర్స్ నాయకుల ర్యాలీకాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మల్టిపుల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్ఎంయూ)లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని బుధవారం ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కాజీపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో రైల్వే పెన్షనర్స్ నాయకులు, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రైల్వే ఎలక్ట్రిక్ షెడ్డు క్వార్టర్స్ నుంచి రైల్వే ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్, రైల్వే ఆస్పత్రి మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ స్టీమ్ ఇంజన్ వరకు ర్యాలీ కొనసాగింది. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు ఎస్.ఆర్.వి.రావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు, రైల్వే యాక్ట్ అంప్రెంటీస్ వారికి, రైల్వే రిటైర్ట్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలన్నారు. తెలంగాణ రైల్వే జేఏసీ చేపడుతున్న ఉద్యమాలకు ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుపల్లి రాఘవేందర్, చైర్మన్ కోండ్ర నర్సింగరావు, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ నాయకులు ప్రేమ్కుమార్, ఎస్.సూర్యనారాయణ, వి.భిక్షపతి, రహమత్ అలీ, కె.వెంకటేశ్వర్లు, టి.కృష్ణమూర్తి, ఎం.కట్టయ్య, టి.రాజేశ్వర్, జి.గోపీ, ఎండీ అఫ్జల్, ఎ.ఐలయ్య, టి.సమ్మయ్య, ఎండీ అన్వర్మియా, ఎం.శంకర్, ఎస్.వెంకటస్వామి, ఎం.గట్టయ్య, ఎం.వెంకటేశ్వరరావు,రాజు, ఎం.పెంటయ్య, పి.ఎ.ఎబినేజర్, జాఫర్ పాల్గొన్నారు. -
యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థినులు
వర్ధన్నపేట: దక్షిణ భారతస్థాయి యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్ఎం ఆర్.కృష్ణ తెలిపారు. ఈనెల 3న వరంగల్ యోగా భవన్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు రాధిక, వెన్నెల అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న దక్షిణ భారత స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలి పారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థినులను హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.నేడు నీటి సరఫరా బంద్ వరంగల్ అర్బన్: వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ పరిధిలో గణేశ్నగర్, దేశాయిపేట రోడ్డు ప్రాంతంలో ప్రధాన పైపులైన్కు లీకేజీ కారణంగా వరంగల్ ప్రాంతంలో తాగునీటి సరఫరా బంద్ ఉంటుందని బల్దియా ఎస్ఈ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఫిల్టర్ బెడ్ పరిధిలో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. దీంతో మొగిలిచర్ల, ధర్మారం, గొర్రెకుంట, కీర్తి నగర్, ఆరెపల్లి, పైడిపల్లి, దేశాయిపేట, ఏనుమాముల, పోచమ్మ మైదాన్, ఎల్బీ నగర్, కాశి బుగ్గ, చార్బౌళి, ఎంజీఎం, గోవిందరాజుల గుట్ట, ఓ సిటీ, క్రిస్టియన్ కాలనీ, పోతనరోడ్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు కేయూ మహిళా జట్టు కేయూ క్యాంపస్: విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్సైన్సెస్లో ఈనెల 6న ప్రారంభమై 9వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టులో ఎస్.శ్రినిత, పి.లక్ష్మీరెడ్డి, ఎన్.అశ్విత, కె.దీక్షిత, ఎస్కె.ఆయూషాఖుర్షిద్ ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం సింగరేణి ఉమెన్ డిగ్రీకళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.సావిత్రి కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తారని తెలిపారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర మంగళవారం రాత్రి ముగిశాయి. స్వామి వారిని పల్లకీపై గుట్టకిందికి తోడ్కొని వెళ్లి గీసుకొండలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రవేశం చేయించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి తెలిపారు. సహకరించిన భక్తులు, దాతలు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు టీవీలుకాళోజీ సెంటర్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ఒక్కో కళాశాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ బోధనకు ఉపకరించే సామగ్రి పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఐఐటీ, ఎప్సెట్, నీట్ బోధన సులభతరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ కోసం జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. కడారిగూడెంలో వృద్ధుడి ఆత్మహత్య వర్ధన్నపేట: ఆస్తి తగాదాల్లో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కడారిగూడెంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పింగిళి తిరుపతిరెడ్డి(60) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత మొదటి భార్య మృతి చెందగా రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతుళ్లు కడారిగూడెంలోని ఆయన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. రెండో భార్య, కుమారుడితోపాటు తిరుపతిరెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రామంలో వీరికి ఉన్న 8 గుంటల భూమి, ఇల్లును తనకు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. తాము ఆ భూమి ఇవ్వడం కుదరదని, కూతుళ్లు ఉన్నారని అనడంతో ఈ వివాదం కొనసాగుతోంది. భూమి, ఇల్లు ఇవ్వడం లేదని మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ నుంచి కడారిగూడెం గ్రామానికి వచ్చాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి మృతిచెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. మూడు కిలోల గంజాయి పట్టివేత దుగ్గొండి: భద్రాచలం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న మూడు కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దుగ్గొండి సీఐ సాయిరమణ, ఎస్సై రావుల రణధీర్రెడ్డితో కలిసి బుధవారం వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఎస్సై రణధీర్రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన గొల్ల కృష్ణారెడ్డి, మర్రి సాయితేజ భద్రాచలంలో మూడు కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో ఆటోలో దుగ్గొండి మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద మూడు కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి, ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో.. ఖిలా వరంగల్: భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. వరంగల్ జీఆర్పీ స్టేషన్లో బుధవారం ఆయన కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ రైల్వేస్టేషన్లో బుధవారం జీఆర్పీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడో నంబర్ ప్లాట్ఫారంపై అనుమానాస్పదంగా పశ్చిమ బెంగాల్కు చెందిన గోలక్సర్కారు, ఒడిశాకు చెందిన శేషాదేబ్ గెడాయి కనిపించారు. వారి బ్యాగులను తనిఖీ చేసి రూ.1,19,850 విలువైన 2.397 కిలోల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఎగిరేది గులాబీ జెండే..
జనగామలో నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్, గులాబీ శ్రేణులు ● కడియం ద్రోహం చేశారు..కాంగ్రెస్ అంటే గూండా రాజ్యం ● బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్జనగామ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
రామన్నపేట: ఒక్క క్షణం అజాగ్రత్త, నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమై ప్రాణం తీస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ అధికారుల సమన్వయంతో మంగళవారం పోచమ్మమైదాన్ కూడలిలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశమని, రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడం లాంటివి ట్రాఫిక్ ఉల్లంఘనలేనని తెలిపారు. రోడ్డు నియమాలు మీ ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్ కాపాడేందుకు రూపొందించినట్లు తెలిపారు. వాహనదారులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. అనంతరం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ రూపొంందించిన ట్రాఫిక్ నియమాల పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులు, వాహనదారులతో కలిసి ట్రాఫిక్ నియమాలు పాటించేలా ప్రతిజ్ఞ చేయించారు. పోచమ్మమైదాన్ కూడలి వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏఎస్పీ శుభం, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎంవీఐ జయపాల్రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ -
వరి సాగుకే మొగ్గు
యాసంగిలో సమృద్ధిగా నీరు..అవసరం మేరకు ఎరువులు పంటల అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. నెలవారీగా ఎరువుల అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. వీటిలో కొన్ని యాసంగి పంట కాలానికి సంబంధించి డిసెంబర్ 28వ తేదీ వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. అలాగే యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు మండలాల వారీగా 13 మంది ప్రత్యేక మానిటరింగ్ అధికారులను నియమించారు. వీరి పర్యవేక్షణలో యూరియా టోకెన్లను పంపిణీ చేస్తున్నారు.వరి ఎక్కువగా సాగవుతోంది.. యాసంగి పంటల సాగుకు తగ్గట్టుగా యూరియా నిల్వ లు ఉన్నాయి. చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో యాసంగిలో ఎక్కువగా వరి సాగవుతోంది. రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు. అన్ని మండల కేంద్రాల్లో నిల్వలు ఉన్నాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. – అనురాధ, జిల్లా వ్యవసాయ అఽధికారిఖిలా వరంగల్: జిల్లాలో వానాకాలం సీజన్ పూర్తి అయ్యింది. యాసంగి సాగు ప్రారంభమైంది. ప్రధానంగా మొక్కజొన్న, వేరుశనగ, కంది, వరి పంటలను సాగు చేస్తున్నారు. బావులు, బోర్లు, చెరువుల్లో నీరు ఉండటంతో అన్నదాతలు వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వ్యవసాయ అధికారులు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో చెరువులు, కుంటలు, బావులు, బోర్ల కింద రైతులు యాసంగి పంటలను సాగు చేస్తున్నారు. రైతులు ఎక్కువ శాతం బావులు, బోర్లపైనే సాగు ఆధారపడి ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా కురవడం, విద్యుత్ సమస్య లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు యాసంగి పంటల సాగుకు మొగ్గు చూపారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట 26,510 ఎకరాలు, కూరగాయలు, వరి ఇతర పంటలు మొత్తం 1,11,435 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. ఇప్పటివరకు 3,56,392 యూరియా బస్తాలు అధికారులు రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 1,11,435 ఎకరాల్లో వరి సాగు అందుబాటులో యూరియా నిల్వలు -
రెండోరోజూ దీపారాధన
అన్నారంలో అన్నదానం చేస్తున్న ఎస్సై ప్రవీణ్ ప్రత్యేక పూజలో పాల్గొన్న వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్, ముజావార్లు● కొనసాగుతున్న అన్నారం దర్గా ఉత్సవాలు పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలోని యాకుబ్బాబా దర్గాలో రెండో రోజు ఉత్సవా ల్లో భాగంగా మంగళవారం దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. తెల్లవారు జామున జరిగిన గంధం సమర్పణ అనంతరం వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ముజావార్లు దీపారాధన నిర్వహించిన అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాకుబ్బాబా దర్గాతో పాటు గుంషావళి, బోలేషావళి, మహబూబియా, చిల్లాలను దర్శించుకున్నారు. వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్, ఎస్సై బోగం ప్రవీణ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నారం సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, మోటపోతుల సారంగపాణి, భిక్షపతి, రాపోలు ర వి, బీజేపీ మండల నాయకుడు జలేందర్, వక్ఫ్బో ర్డు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
● ఎస్ఈ గౌతంరెడ్డి సంగెం: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎస్ఈ కె.గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మొండ్రాయిలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి మూడు రోజులు ప్రతీ సెక్షన్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామాలకు అధికారులు వచ్చినపుడు విద్యుత్ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. అరటిసాగుపై అవగాహన సదస్సుదుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో అరటితోటల సాగుపై జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడారు. అరటిసాగులో జాగ్రత్తలు పాటించకపొతే నష్టాల పాలు కావాల్సి వస్తుందన్నారు. మార్కెట్ అంచనాలను బట్టి సాగు సమయాలను ఎంచుకోవాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త వెంకటరాజుకుమార్ మాట్లాడుతూ అరటి మొక్కలు నాటిన మొదటి ఆరునెలలు కీలమమన్నారు. ఎన్పీకే ఎరువులను ఒక్కో అరటి మొక్కకు 200: 50: 200 గ్రాముల చొప్పున ఎరువులు వేయడంతో పాటు లీటరు నీటికి 5 గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్ మాట్లాడుతూ అరటితోటలో వచ్చే చీడపీడలు, తెగుళ్లు నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి అలకొండ జ్యోతి, అనిల్, రైతులు లడె యుగందర్, సురేందర్, దుర్గునాల వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువలో 108 సేవలు ఎంజీఎం: ప్రజలకు 108 సేవలు ఎల్లప్పుడూ చేరువలో ఉంటాయని 108 సర్వీస్ వరంగల్ జిల్లా మేనేజర్ గుర్రపు భరత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పి, ప్రసవనొప్పులు, జ్వరాల వంటి సందర్భాల్లో తమ సిబ్బంది అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 108 సేవల ద్వారా మెడికల్ 37,681, ప్రసవ సంబంధిత కేసులు 3,303, ట్రామా వెహికులర్ 4,259, శ్వాస సంబంధిత సమస్యలు 2,430, గుండె సంబంధిత 2,165 కేసులు నమోదైనట్లు వివరించారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు కాలనీల్లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండ పరిధి 56వ డివిజన్ సురేంద్రపురి కాలనీలో తడి, పొడి చెత్తపై మంగళవారం ఆమె అవగాహహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేవిధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. గోపాల్పూర్ కాలనీలో డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, టీపీఎస్ సతీశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్ పాల్గొన్నారు. సంకటహరచతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం సాయంత్రం సంకటహరచతుర్ధి పూజలు ఘనంగా జరిగాయి. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితులు దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలు, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. -
అభ్యంతరాలు ఉంటే తెలపండి
న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశహాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితా రూపొందించామన్నారు. డిసెంబర్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి అన్ని మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపామన్నారు. వచ్చిన ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ వాటిని పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 8వ తేదీ లోగా తెలపాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 10న తుది ఓటరు జాబితా వెలువరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్లు సుధీర్కుమార్, భాస్కర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, సయ్యద్ ఫైజుల్లా, రజనీకాంత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
రానున్న ఎన్నికల్లో విజయం ఖాయం
● బీజేపీ జిల్లా ఇన్చార్జ్ శ్రీధర్రెడ్డి నర్సంపేట: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి నర్సంపేట మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కొండపల్లి శ్రీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డిలు అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ అధ్యక్షతన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్, కాంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, హరిశంకర్, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల్లో కాషాయజెండా రెపరెపలాడాలని జిల్లా ఇన్చార్జ్ కొడపెల్లి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో కొండేటి శ్రీధర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వర్రావు, మార్తినేని ధర్మారావు, నాయకులు పాల్గొన్నారు. -
ముసాయిదాపై గుస్సా!
మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుసాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కాగా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది. అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని... ● భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్లో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు. ● రెండేళ్ల క్రితం ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి. ● నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి. ● జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో 5, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు. ● తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి. పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండటంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆందోళనలో సీతారాంపూర్ గ్రామ వాసులు.. గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు. తప్పులపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ జాబితాలో స్థానికేతరులు, చనిపోయిన వారి పేర్లు పదో తేదీ నాటికి లిస్ట్ ఫైనల్ అనుమానమేమున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్ఘన్పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తదితర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లడంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. -
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.59 కోట్లు
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం నర్సంపేట: మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.59కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని వరంగల్ రోడ్డు కూడలిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట అభివృద్ధికి రూ.59కోట్లు మంజూరు చేయిస్తూ మున్సిపల్ శాఖ ద్వారా ఉత్తర్వులు తీసుకువచ్చిన ఎమ్మెల్యే మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, మాజీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్కుమార్, వినోదసాంబయ్య, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఐదు లెప్రసీ కేసుల నిర్ధారణ
ఎంజీఎం: జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్లో ఐదు లెప్రసీ కేసులు గుర్తించి చికిత్స ప్రారంభించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. జిల్లాలోని 2,10,861 ఇళ్లను సందర్శించి 8,13,286 మందిని సర్వే చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2,582 మందిని ప్రాథమికంగా అనుమానితులుగా గుర్తించగా.. వీరిలో 5 కేసులను నిర్ధారించి చికిత్స ప్రారంభించినట్లు వివరించారు. ఇంకా అనుమానితులకు పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన వారికి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేను అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎస్.శ్రీనివాస్, డీపీఎంఓలు సతీశ్రెడ్డి, రవీందర్ పర్యవేక్షించగా.. ఏఎన్ఎంలు, ఆశాలు, తదితరులు పాల్గొన్నట్లు వివరించారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 7వ తేదీన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగంధర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9గంటలకు జనన ధ్రువీకరణ పత్రంతో జేఎన్ఎస్ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు 98665 64422 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీలకు ‘రేవంత్ అన్న కా సహారా’ పథకం ద్వారా సహా యం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్హైదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఫకీర్, దూదేకుల, ఇతర దుర్భర ముస్లిం వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మోపెడ్లు, బైకులు, ఈ–బైకులు, మహిళలకు ఇందిరమ్మ మై నార్టీ మహిళా యోజన ద్వారా ఆర్థికసాయం (మహిళలకు మాత్రమే) పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు హనుమకొండ కలెక్టరేట్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో గల కార్యాలయంలో గానీ, 95504 49464 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేకాధికారులు నెలలో రెండుసార్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హాస్టల్స్లో ఫిర్యాదుల పెట్టె (కంప్లైంట్ బాక్స్) తప్పనిసరిగా ఉండాలని, దానికి సంబంధించిన తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలన్నారు. రెగ్యులర్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్యం, శానిటేషన్పైన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీచర్లు లేకుండా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు వినాలని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా.. లేదా? అని పరిశీలించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరంగల్: ప్రభుత్వ ఐటీఐ వరంగల్ ప్రాంగణంలో 2025 వరకు ఐటీఐ వివిధ ట్రేడ్లల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 7వ తేదీ(బుధవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ వరంగల్ ప్రిన్సిపాల్ ఎం.చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల్లో ఫిట్టర్, వెల్డర్ అభ్యర్థులను పర్మనెంట్ పద్ధతిలో నియమించే అవకాశాలున్నాయని, 2025 వరకు ఐటీఐల్లో ఉత్తీర్ణత పొంది 18 ఏ ళ్లకు పైబడి ఉండాలని, వేతనం రూ.1.90 లక్షలు ఏడాదికి చెల్లిస్తారని తెలిపారు. వసతి, భోజనం సబ్సిడీపై కల్పిస్తారని తెలిపారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించండి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. మొత్తం ప్రజావాణికి 153 అర్జీలు అందాయి. అర్జీల పరిష్కార స్థితిని తప్పనిసరిగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, సరైన రిమార్కులు లేకుండా దరఖాస్తులు క్లోజ్ చేయరాదని సూచించారు. ప్రత్యేకంగా తహసీల్దార్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖల వద్ద అధికంగా పెండింగ్లో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవల నాణ్యతను సమీక్షించాలని తెలిపారు. ఓట్ల సవరణ వేగవంతం చేయాలి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఓటర్ల నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బీఎల్ఓలు, ఆర్పీలు డోర్ టు డోర్ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మినీ జాతరపై చిన్నచూపు
ఆత్మకూరు: ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు కొనసాగనున్న అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని భక్తులు వాపోతున్నారు. జాతర గడువు దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు ఇంకా పటిష్ట నిర్మాణాత్మక పనులు మొదలుపెట్టలేదు. మినీ మేడారంగా పిలువబడుతున్న అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. గత జాతరలో భక్తులు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధ్వానంగా జాతర రోడ్లు అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర సమీపంలోని రోడ్లు గుంతలు పడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదకరంగా మారాయి. మండలంలోని కామారం క్రాస్రోడ్ నుంచి చౌళ్లపెల్లి మీదుగా అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే రోడ్డు అడుగడుగునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. ప్రత్యేక నిధులు కరువు సమ్మక్క–సారలమ్మ పుట్టిన తావుగా భావించే అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో సౌకర్యాల కల్పన ఇబ్బందిగా మారింది. ప్రత్యేక నిధులు విడుదల చేస్తేనే జాతరలో పనులు సంపూర్ణంగా జరుగుతాయని, లేకుంటే మొక్కుబడి పనులు జరుగుతాయని భక్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరపై దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. అగ్రంపహాడ్ జాతరకు మిగిలింది 20 రోజులే.. నిర్వహణకు కరువైన నిధులు ప్రభుత్వం స్పందించాలని భక్తుల వేడుకోలు -
ఐలోని మల్లన్న క్షేత్రానికి రండి
జాతర బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఐనవోలు: శతాబ్దాల చరిత్ర కలిగి, ప్రఖ్యాత శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చి సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్రెడ్డిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆహ్వానించారు. సోమవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, అసెంబ్లీలోని సీఎం చాంబర్లో రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఈ నెల 13 నుంచి ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు సీఎం రేవంత్కు వివరించారు. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మతో కూడిన శ్రీమల్లికార్జునస్వామి చిత్రపటాన్ని జాతర ఆహ్వాన పత్రికను రేవంత్రెడ్డికి అందించారు. అర్చకులు పాతర్లపాటి నరేశ్, శ్రీనివాస్ సీఎం రేవంత్కు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఈఓ కందుల సుధాకర్ స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో నందనం సర్పంచ్ రాజు, మహ్మద్ చోటే తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయండి
ఎల్కతుర్తి: కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 9నుంచి 18వ తేదీవరకు జరగనున్న వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్వామివార్లను భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. కనీస వసతులు కల్పించాలన్నారు. పలు శాఖల ఏర్పాట్లను తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత మాట్లాడుతూ.. ఆలయానికి రంగులు వేయించామని, జాతర సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భద్రకాళి సమేత వీరభద్రున్ని కలెక్టర్ దర్శించుకున్నారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ సిద్దమల్ల రమ, విద్యుత్ శాఖ ఏఈ మధుసుదన్, జిల్లా పంచాయితీ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఎమ్హెచ్ఓ అప్పయ్య, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ ఆత్మారాం, ఆర్టీసీ డీఎం అర్పిత, ఆర్ఎన్బీ డీఈ గోపీకృష్ణ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
సమృద్ధిగా జలాలు
జిల్లాలో సగటున 3.10 మీటర్ల లోతుహన్మకొండ: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఈసారి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి సగటున 3.10 మీటర్ల లోతులో ఉండగా, గత వర్షాకాలం చివరలో కురిసిన అతి భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లో నీరు తొణికిసలాడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పాటు జలాశయాల్లో నీరు చేరి అలుగులు పోస్తున్నాయి. భూగర్భ జలాలు చేతికి అందే స్థాయిలో ఉన్నాయి. ధర్మసాగర్లో 0.91 మీటర్ల లోతులోనే ఉన్నాయి. మీటర్ కంటే తక్కువ లోతులో ఉన్నాయంటే భూగర్భ జలాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుస్తోంది. అత్యధికంగా భీమదేవరపల్లిలో.. భీమదేవరపల్లి మండలం వంగరలో జిల్లాలోనే అత్యధికంగా 7.85 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. వర్షాకాలంలో జిల్లాలో సాధారణ వర్షపాతం 924.5 మిల్లీమీటర్లు నమోదుకాగా.. ఈ వర్షాకాలంలో 1204.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వేలేరులో అతి ఎక్కువగా వర్షం (లార్జ్ ఎక్సెస్) వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 776 మిల్లీమీటర్లు కాగా, 1,352.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భీమదేవరపల్లి, ఎల్క తుర్తి, కమలాపూర్, ధర్మసాగర్, కాజీపేట, హనుమకొండ, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో సాధారణానికి మించి ఎక్సెస్ వర్షం కురిసింది. హసన్పర్తి, పరకాల, శాయంపేట, నడికూడ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పది మండలాల్లో ఎక్సెస్.. 10 మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదు కావడంతో ఆ మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో సాగు నీటి కొరత ఉండే అవకాశం లేదు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగి ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,29,500 ఎకరాలు, మొక్కజొన్న 64,100, వేరు శనగ 370, పప్పు దినుసులు 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈసారి అంచనాకు మించి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. భూగర్భ జలాల గణన, సర్వే కోసం జిల్లాలో 25 బోరు బావులు తవ్వి, ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల వివరాలు సేకరిస్తారు. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జలాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు పంపిస్తారు. గట్ల నర్సింగాపూర్ 1.8 జగన్నాథపూర్ 4.2 కొత్తపల్లి 4.56 వంగర 7.85 ధర్మాపూర్ 1.91 ధర్మసాగర్ 0.91 పెద్ద పెండ్యాల 2.72 నారాయణగిరి 1.02 ఎల్కతుర్తి 7.54 హనుమకొండ 2.94 నాగారం 4.85 సీతంపేట 1.06 ఎల్లాపూర్ 1.32 ఐనవోలు 6.23 పున్నేలు 2.06 పంథిని 4.29 శనిగరం 1.19 పీచర 4.56 వేలేరు 1.26 ఆత్మకూరు 1.71 దామెర 1.23 చెర్లపల్లి 5.29 నడికూడ 1.96 పరకాల 2.54 పత్తిపాక 2.38 జిల్లాలో భూగర్భ జలాలు (లోతు మీటర్లలో) -
మిరపలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
గీసుకొండ: మిరప పంటలో నల్లతామర, తెల్లదోమ ఉధృతి కనిపిస్తుందని, రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ సూచించారు. సోమవారం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం మిరప పంటను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ నల్ల తామర పురుగులు, ఆకులపై ముడత కలిగి రసం పీల్చడం జరుగుతుందని, దీని నివారణకు ఎకరానికి 25 నుంచి 30 నీలిరంగు జిగురట్టలు, 10 నుంచి 15 పసుపు రంగు జిగురట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కీటక నాశిని మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలని, తొలి దశలో పురుగు ఉధృతిని గమనించిన వెంటనే వేపనూనె (1500 పీపీఎం) 5 మిల్లీ ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలన్నారు. అలాగే మిరప పంట చుట్టూ రెండు నుంచి మూడు వరుసలు మొక్కజొన్న లేదా జొన్న పంటలను వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త వెంకటరాజకుమార్, ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి, మండల వ్యవసాయాధికారి హరిప్రసాద్, వేణు, రైతులు పాల్గొన్నారు. -
సాస్కీతో వెలుగులు
సాక్షి, వరంగల్: కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న సాస్కీ (స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) ప్రాజెక్టుతో వరంగల్ మరింత వెలుగులీననుంది. ఇప్పటికే 2016లో స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికై రహదారుల అభివృద్ధి, వివిధ చెరువు బండ్ల పనులు, నాలా విస్తరణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు రూ.100 కోట్లతో చేపట్టిన ఈ నగరానికి ఇప్పుడూ సాస్కి (స్కీమ్ ఫర్ స్పెషల్ అ సిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) రూపంలో మరోసారి అదృష్టం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తున్న ఈ స్కీమ్ కింద సుమారు రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులతో పాటు వివిధ పనుల ప్రతిపాదనలు ‘కుడా’ నుంచి కేంద్ర ప్రభు త్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు గతేడాది డిసెంబర్ 24న వెళ్లాయి. డిసెంబర్ 31న కూడా ఈ సాస్కీ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ అడిషనల్ సెక్రటరీ సారాతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనేపథ్యంలో సాస్కీ నిధులు వరంగల్కు వస్తాయని అధికారులు అంటున్నారు. అవి రాగానే.. ఈ ప్రాజెక్టులను దాదాపు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉంది. పురాతన ఆలయాలకు మరిన్ని సౌకర్యాలు.. హిస్టోరికల్ కోర్ ఏరియా డెవలప్మెంట్ విభాగం కింద పురాతన ఆలయాలైన వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని ప్రతిపాదించారు. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న వసతులకు అదనంగా ఆలయాలు ముస్తాబు చేయనున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చేయడంతో పాటు వచ్చే భక్తులకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త లేకుండా చేస్తారు. లైటింగ్ ఉండేలా చూడనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు ఉండేలా ఈ ఆలయాలను అభివృద్ధి చేయనున్నారు. నీరు పీల్చుకునే పార్కు వరంగల్ నగరంలో వరదను నియంత్రించడంతో పాటు భూగర్భ నీటి మట్టం పెంచే దిశగా ఖిలావరంగల్లోని మోట్ను స్పాంజ్ పార్కుగా అభివృద్ధి చేయనున్నారు. రాతిగోడ వెంట ఉన్న కందకాల్లో ఉండే వరద నీటిని పీల్చేసి భూమి లోపలికి పంపించేలా స్పాంజ్ పార్కు నిర్మాణం చేపడతామని ప్రతిపాదించారు. ఇందులో నిర్మించే కుంట 340 చదరపు మీటర్ల నుంచి ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆయా కందకాల్లో వరద ఎక్కువైతే ఆ నీటిని పార్కుకు చేరేలా పైపులు అమర్చుతూ పార్కులోని కుంటకు వచ్చేలా చూడనున్నారు. వీటిలో స్థానికులకు ఆహ్లాదం కలిగించేలా మొక్కలు పెంచనున్నారు. అలాగే వరంగల్లోని కీర్తినగర్, హనుమకొండలోని మడికొండలో నైబర్ హుడ్ డెవలప్మెంట్ కింద ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలు తదితరాలను అభివృద్ధి చేస్తారు.భద్రకాళి, వెయ్యిస్తంభాల ఆలయాల్లో మరిన్ని వసతులు ఖిలా వరంగల్లో స్పాంజ్ పార్కు అభివృద్ధితో జలమట్టం పెంపు కీర్తినగర్, మడికొండలో నైబర్హుడ్ డెవలప్మెంట్ పనులు పచ్చదనం, అడవిని తలపించేలా ఫోర్ట్ పరిసరాలు ల్యాండ్ పూలింగ్తో నగర శివార్లలో అభివృద్ధి కేంద్రానికి పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలుపచ్చదనానికి కేరాఫ్ కోట అర్బన్ ఫారెస్ట్రీ అండ్ గ్రీనరీ అంశం కింద ఫోర్ట్ వరంగల్ ప్రాంతమంతా చెట్లు, మొక్కలతో పచ్చదనం ఉట్టిపడేలా చేయనున్నారు. వీటికి అనుగుణంగా పాత్ వేలు కూడా నిర్మించనున్నారు. పర్యాటక ప్రాంతమైన ఖిలావరంగల్లో ఈ పచ్చదనం అభివృద్ధి మరింత మంది పర్యాటకులు కూడా పెరిగేందుకు అవకాశం ఉండనుంది. అలాగే బావులు, ట్యాంకులను అభివృద్ధి చేయాలంటూ వివిధ ప్రతిపాదనలను ‘సాస్కి’ పథకానికి పంపారు. అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి కోసం టౌన్ ప్లానింగ్ స్కీంను మరింత సమర్థంగా అమలు చేసేలా ఈ సాస్కిలో ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ అభివృద్ధి ద్వారా భూమి ఇచ్చే వారితో పాటు ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా చూడనున్నారు. వీటివల్ల ఆయా ప్రాంతాల భూముల ధరలు పెరగడంతో పాటు అక్కడా మౌలిక వసతుల అభివృద్ధికి ఆస్కారం ఉండనుంది. ముఖ్యమైన పరిశ్రమలు, రహదారులు వచ్చే అవకాశం ఉండనుంది. -
ఆయిల్పామ్ గెలలు ఇప్పుడే కోయొద్దు
● పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి● ఉద్యానవన అధికారి తిరుపతి గీసుకొండ: ఆయిల్పామ్ గెలలు ఇప్పుడే కోయొద్దని, పూర్తిగా నారింజ రంగులోకి మారిన తర్వాతే కోయాలని ఉద్యానవన అధికారి ఎన్.తిరుపతి సూచించారు. సోమవారం తోటలు సాగు చేసిన రైతులు పంట దిగుబడికి సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులపై మండలంలోని అనంతారంలోని రైతు రాంబాబు పంట క్షేత్రాన్ని సందర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా ఎరువుల వేయాలని, ఒక ఎకరానికి నెలకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల పొటాష్, 1.25 కిలోల మెగ్నీషియం, 250 గ్రాములు బోరాక్స్ డ్రిప్లో ఫెర్టిగేషన్ ద్వారా అందించాలన్నారు. గెలలు కోత సమయంలో పూర్తిగా నారింజ రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఉద్యాన విస్తరణ అధికారి వేణు, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఫీల్డ్ ఆఫీసర్స్ జీవన్, దీపక్, రైతులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాను సవరించాలి
● మున్సిపల్ కమిషనర్లకు నాయకుల వినతినర్సంపేట: ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలను సవరించాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ భాస్కర్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా బోగస్ ఓట్లు నమో దు చేశారని, వీటిన్నింటిని పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పంజాల రమేష్, ఎస్కె.జావిద్, మేరుగు శివకోటి, గూడూరు సందీప్, బైరి మురళి, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు బహిష్కరిస్తాం వర్ధన్నపేట: వంద పడకల ఆస్పత్రిని వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మించాలని లేదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రజలు బహిష్కరిస్తారని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్కు వందపడకల ఆస్పత్రి పట్టణంలోనే నిర్మాంచాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణానికి వంద పడకల ఆస్పత్రి అప్గ్రేడ్ అయి మంజూరు కాగా ఆ ఆస్పత్రిని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్దకు మారుస్తామని గతంలో ప్రకటన చేశారని దానిని ఉపసంహరించుకుని వర్ధన్నపేట పట్టణంలోని ఆస్పత్రి స్థలంలోనే నిర్మించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు మైస సురేష్, తుమ్మల యాకయ్య, కొండేటి సత్యం, పెద్దూరి రాజ్కుమార్, సిలువేరు కుమారస్వామి, గోధుమల మధుసూధన్, మైస రాము, కొండేటి శ్రీనివాస్, హన్మకొండ సుధాకర్, తుమ్మల రవీందర్, సిలువేరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి సమస్యలు అక్కడే
న్యూశాయంపేట: రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు ఉన్నప్పుడన్నా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేవి.. జిల్లాల పునర్విభజన అయిన తర్వాత ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని, అధికారులు ముప్పుతుప్పలు పెడుతున్నారని నల్లబెల్లి మండలం మంచుప్పులకు చెందిన రిటైర్డ్ ఎంఈఓ ఏనుగు సుదర్శన్రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. తన భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్య, పట్టాదారు పాస్ బుక్కు కోసం అధికారులు తిప్పించుకుంటున్నారని కలెక్టర్ సత్యశారద, అధికారుల ఎదుట ఆవేదన వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులకు సూచించారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి:కలెక్టర్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించారు. అందులో రెవెన్యూశాఖకు సంబంధించి 59, జీడబ్ల్యూఎంసీ 20, డీఆర్డీఏ, డీపీఓ 11, వివిధ శాఖలకు సంబంధించినవి 50 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. భూ సమస్యలు, ఫించన్లు, గృహలు, ఉపాధి, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● రోల్లకల్లు, నారాయణపురం గ్రామాల్లో శివాలయం పక్కనే పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. దీంతో శివాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, పల్లె ప్రకృతి వనాలను వేరే చోటికి తరలించాలని ఆయా గ్రామాల సర్పంచ్లు కోరారు. ● ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి డబ్బులు రాలేదని గన్నారం గ్రామానికి చెందిన రైతులు విన్నవించారు. నా భూమి నాకు అప్పగించాలి ఏ లాభం లేకుండా పాఠశాలను నడుపుతానంటే తన భూమిని ఇల్లందులోని ఓ వ్యక్తికి దానం చేశాను. ప్రస్తుతం ఆ పాఠశాల నడిపించకుండా మూసి వేసి, ఆయా స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని వెంటనే ఆపాలి. అట్టి భూమిని ప్రభుత్వ అవసరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న. – జి.ఉపేంద్రశాస్త్రి, ఇల్లంద తిండి పెట్టడం లేదు వృద్ధాప్యంలో ఉన్న తనకు తిండి పెట్టడం లేదు. నా కుటుంబ సభ్యులు బాగోగులు పట్టించుకోవడం లేదు. సీనియర్ సిటిజన్ యాక్టు నమోదు చేసి నాకు న్యాయం చేయాలి. ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. – ఎం.సత్యనారాయణ, నెక్కొండ ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడన్నా.. పనులు జరిగేవి.. కలెక్టర్ ఎదుట ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి కలెక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో 151 అర్జీలు -
పేదరికం క్రీడలకు అడ్డుకాదు
● డీఐఈఓ శ్రీధర్సుమన్ వరంగల్: పేదరికం క్రీడలకు అడ్డుకాదని, క్రీడల్లో ప్రతిభ ఉంటే ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డా క్టర్ శ్రీధర్సుమన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు వరంగల్ ఓసిటీలోని మినీస్టేడియంలో జిల్లా అండర్ 19 బాలబాలికల జూడో క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్సుమన్ మాట్లాడు తూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 19 అసోసియేషన్ కార్యదర్శి నల్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షుడు కై లాష్యాదవ్, జిల్లా క్రీడా మండలి అధికారి అనిల్ కుమార్, మాజీ అండర్ 19 కార్యదర్శులు డాక్టర్ కోట సతీష్, డాక్టర్ గోపి, టోర్నమెంట్ అబ్జర్వర్లు రామయ్య, అనిత, జూడో సంఘం బాధ్యులు దుపాకి సంతోష్ కుమార్, ఎన్. నాగరాజు, సిహెచ్.రాము, బి.సాయిరాం యాదవ్, కె. కిరణ్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయానికి తాళం
నెక్కొండ: మండలకేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయానికి తాళం పడింది. దీంతో అధికారులు, సిబ్బంది కార్యాలయం తెరవక ముందే ఇళ్లకు జారుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం అద్దె భవనంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యాలయాన్ని హనుమకొండలోని చింతగట్టుకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న భవనం యజమానురాలు దుబ్బా పార్వతి అద్దె బకాయిలు చెల్లించి కార్యాలయ ఫర్నిచర్, ఇతర రికార్డులు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. తనకు అద్దె రూపేనా 18 నెలలుగా సుమారు రూ.3.60 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కార్యాలయానికి తాళం వేసినట్లు పేర్కొంది. దీంతో కార్యాలయ ఈఈ సురేష్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
యూరియా కోసం బారులు
ఖానాపురం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేవు. వ్యవసాయ అధికారులు కేవలం మొక్కజొన్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు మండలంలోని అశోక్నగర్లో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం యూరియా బస్తాల కోసం రైతులుబారులు తీరారు. కాగా పలువురు రైతులు టోకెన్లు తీసుకొని బస్తాలు తీసుకోగా మరికొందరు వెను తిరిగారు. పలు సొసైటీ గోదాంలోని యూరియా నిల్వలను ఎంపీడీఓ అధ్వైత పరిశీలించి సూచనలు చేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి నర్సంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం అకడమిక్ మార్కులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, స్టాఫ్ స్కిల్స్ కలిగి ఉండడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్టాఫ్ స్కిల్స్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ కోర్సుతో ఇతరులతో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయన్నారు. హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల ఆంగ్ల విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దినకర్ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఎం.సోమయ్య, వైస్ ప్రిన్సిపాల్ బి.సత్యనారాయణ, సత్యనారాయణ, కమలాకర్, భద్రు, గణేష్, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న కేంద్రం నర్సంపేట: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతుందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్ అన్నారు. ఈ మేరకు సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సోమవారం ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి ముగింపు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన పార్టీ సీపీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నర్సంపేట మండల కార్యదర్శి అయితా యాకయ్య, మియాపురం గోవర్ధన్, పాలక కవిత, బానోతు వీరునాయక్, పిట్టల సతీష్, గడ్డం యాకయ్య, గడ్డం నాగరాజు, శ్రీకళ, తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ సర్వేయర్స్ నూతన కార్యవర్గం గీసుకొండ: జిల్లా లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సోమవారం సంఘం కార్యాలయంలో జిల్లా సర్వేయర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గోనె విజయ్రెడ్డి, బర్ల పూర్ణచందర్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవునూరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్కుమార్, జనరల్ సెక్రటరీగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ డివిజన్ కోఆర్డినేటర్గా మామిడాల సాయిరామ్, సెక్రటరీలుగా బొమ్మెర రఘు, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, గౌరవ సలహాదారులుగా ఆవునూరి శివకుమార్, మహిళా కోఆర్డినేటర్గా బలుగురి దీపిక, నర్సంపేట డివిజన్ కో ఆర్డినేటర్గా పెంతల విష్ణుతో పాటు 13 మండలాల కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు రాజు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీసీఓ పి. అపర్ణ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు ఈనెల 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి 1 గంటల వరకు ఉంటుందన్నారు. మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ (బాలుర, బాలికలు), జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్ (బాలికలు), రుక్మాపూర్ సైనిక్ స్కూల్ (బాలుర)లో ప్రవేశాలు రాష్ట్ర స్థాయి మెరిట్ ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. వారెవ్వా.. పంపర పనస! గీసుకొండ: గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగో ని రాజ్కుమార్ ఇంటిలో పంపర పనస చెట్టు విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ చెట్టుకు ప్రస్తుతం సుమారు 50కి పైగా పెద్ద కాయలు(దొమ్మనిమ్మ లాంటివి) ఉన్నాయి. పంపర పనసకు ప్ర త్యేకత ఉందని ఆయన చెబుతున్నారు. తిరుమ ల తిరుపతి దేవస్థానం వారు ప్రతీ శ్రావణ శు క్రవారం పంపర పనన కాయ నుంచి రసం తీ సి, స్వామివారికి పులిహోరను తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తోందన్నారు. ఈ పనస సుమారు 2 నుంచి 3 కిలోల మేర బరువు ఉంటుందని పేర్కొన్నారు. మేడపల్లి చెరువులో మొసలి నల్లబెల్లి: మండలంలోని మేడపల్లి చెరువులో మొసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఆదివారం అదే గ్రామానికి చెందిన రాంచరణ్, సాగర్లు చెరువులో కాళ్లు కడుక్కునేందుకు ప్రయత్నిస్తుండగా మొసలి కనిపించింది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ కిరణ్ చెరువు వద్దకు చేరుకుని పరి శీలించారు. త్వరలోనే పట్టుకుంటామని, గ్రా మస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దివ్యాంగురాలిని గర్భవతిని చేసిన వృద్ధుడు?నర్సంపేట రూరల్: దివ్యాంగురాలిని గర్భవతిని చేసిన సంఘటన నర్సంపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలి(40)ని అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆనోటా..ఈనోటా దావనంగా గ్రామంలో వ్యాప్తి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చకచకా ఏర్పాట్లు
‘పుర‘ పోరుకు అధికార యంత్రాంగం కసరత్తుమున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు.నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే?సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటర్ల జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. వసతులున్న చోటే పోలింగ్ కేంద్రాలు.. మౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు ముసాయిదా జాబితాఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్ఘన్పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
కొత్త సర్పంచ్లకు శిక్షణ!
వరంగల్: రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగగా అదే నెల 22వ తేదీన బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పల్లెపాలనపై అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పల్లె పాలకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్పంచ్లను బ్యాచ్ల వారీగా ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ స్థాయిల్లోని 8 మంది అధికారులను ప్రతీ జిల్లా నుంచి మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్లో శిక్షణ పొందిన అనంతరం జిల్లాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాకు ఒక లైజన్ అధికారిని ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విధులు, బాధ్యతలపై.. నూతన సర్పంచ్లకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పంచాయతీ అధికారాలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే గ్రామసభలు, పంచాయతీ సమావేశాల నిర్వహణను వివరించనున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యంపై అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వినియోగం, చేపట్టనున్న పనులు, పన్నుల వసూళ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి అవకాశాలు ఆర్థికాభివృద్ధిలో పంచాయతీల పాత్ర, వ్యవసాయం, సేంద్రియ సాగు, ఈ అప్లికేషన్, జనన, మరణాల నమోదు వంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పల్లెపాలనపై పట్టు కల్పించనున్న ప్రభుత్వం విధులు, బాధ్యతలపై అవగాహన ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం -
వరంగల్
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026కేయూ క్రికెట్ విజేత వరంగల్ ఖమ్మం నగరంలో నిర్వహించిన కేయూ పరిధి క్రికెట్ టోర్నీలో వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. వాతావరణం జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం నుంచి చలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా! మేడారం జాతరకు ఆదివారం భక్తులు పోటె త్తారు. తిరుగు ప్రయాణంలో మల్లంపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కిక్కిరిసిన మేడారంభక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుసమ్మక్క గద్దె వద్ద భక్తులు..కిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
మహాభాగ్యం.. రుద్రేశ్వరుడి దర్శనం
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం మహాభాగ్యమని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు ఆయన కూతురుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరస్వామివారికి గోత్రనామాలు, మారేడు దళాలతో మహార్చన చేశారు. అనంతరం ఆలయనాట్య మండపంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకున్న ఎంతోమంది న్యాయమూర్తులు రాష్ట్రస్థాయిలో పదోన్నతి పొందారని, సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని తెలిపారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన వెంట హనుమకొండ సీనియర్ సివిల్కోర్టు జడ్జి రామలింగం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు. -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన మేడారంభక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుసమ్మక్క గద్దె వద్ద భక్తులు..కిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
ప్రత్యేక అధికారుల నియామకం
ఖిలా వరంగల్: యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరగకుండా సజావుగా యూరియా పంపిణీ చేసే విధంగా మండలాల వారీగా ప్రత్యేక మానిటరింగ్ అధికారులను నియమించారు. నర్సంపేట మండలానికి బీఎల్. మాధవి, చెన్నారావుపేటకు విజయభాస్కర్, దుగ్గొండి సంపత్రెడ్డి, ఖానాపురం శ్రీనివాస్, నల్లబెల్లి రంజిత్కుమార్, నెక్కొండ కమల, వర్ధన్నపేట గోవర్ధన్రెడ్డి, పర్వతగిరి సుధాకర్, గీసుగొండ శ్రీప్రియ, రాయపర్తి జోత్స్న భవాని, సంగెం హేమలత, వరంగల్ త్రివేణి, ఖిలా వరంగల్ మండలానికి సౌజన్య నియమితులయ్యారు. వీరి పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. కాగా ఆదివారం గీసుకొండ మండలం ఊకల్లు సొసైటీలో జరుగుతున్న యూరియా టోకెన్ల పంపిణీని ప్రత్యేక వ్యవసాయ అధికారి శ్రీప్రియ పరిశీలించారు. -
‘ఎకై ్సజ్’ విభజన ఇంకెన్నాళ్లు..?
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ జిల్లాగా ఏర్పడి నాలుగేళ్లు దాటినా.. ఇంకా ఎకై ్సజ్ (ఆబ్కారీ) శాఖకు మాత్రం ఆ నిబంధన వర్తించడం లేదు. వరంగల్, హనుమకొండ జిల్లాలు ఏర్పడిన క్రమంలో వరంగల్ రూరల్ నుంచి ఐదు మండలాలు హనుమకొండలో, వరంగల్ అర్బన్ నుంచి రెండు మండలాలు వరంగల్ జిల్లాలో కలిసినా ఇంకా పాత పద్ధతిలోనే ఎకై ్సజ్ విభాగం కొనసాగుతోంది. తమ విభాగానికి సంబంధించిన ఏ సమాచారమైనా ఇద్దరు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. తమ ఉన్నతాధికారులకు కూడా మళ్లీ వరంగల్, హనుమకొండ జిల్లాల వారీగా లెక్కలు చెప్పాల్సి ఉండడంతో సమన్వయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు ప్రభుత్వం అధికారికంగా వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ను హనుమకొండ జిల్లాగా మార్చి నాలుగేళ్లు దాటింది. ఆ సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలు హనుమకొండ జిల్లాలో కలిశాయి. వరంగల్ అర్బన్లోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు వరంగల్ జిల్లాలో కలిపారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాలు కూడా ఆయా హద్దుల మేర తమ సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఎకై ్సజ్ విభాగానికి మాత్రం ఇప్పటికీ ఈ కొత్త జిల్లాల వర్తింపు కాలేదు. ఫలితంగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తాము ఏ జిల్లానో పక్కాగా చెప్పుకునే పరిస్థితి లేదు. వరంగల్ రూరల్ 57 వైన్స్లు, ఆరు బార్లు ఉండగా, వరంగల్ అర్బన్లో 65 వైన్స్లు, 108 బార్లు ఉన్నాయి. అధికంగా ఆదాయం సమకూర్చే వరంగల్, ఖిలా వరంగల్ మండలాలను హనుమకొండ (పాత వరంగల్ అర్బన్) విభాగాధికారులు వదులుకునేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పట్టించుకోని ఉన్నతాధికారులు అనుమతి కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినా పరిష్కారం కాలేదని సమాచారం. ఆ దిశగా కృషి చేయాల్సిన ఉమ్మడి వరంగల్ కేంద్రమైన హనుమకొండ విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దనే ఈ ఫైల్ పెండింగ్లో ఉందని చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీ స్థాయిలోనే ఈ విభజన ప్రక్రియ ఉందంటూ అధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం. అన్ని ప్రభుత్వ విభాగాలకు వర్తించిన విభజన.. ఇక్కడా ఎందుకు వర్తించదూ అంటే సమాధానం ఇచ్చేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ఈ కొత్త సంవత్సరంలోనైనా కొత్త జిల్లా ప్రకారం తమ విభాగ సేవలు అందించేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని ఆబ్కారీ అధికారులు కోరుతున్నారు. ఇంకా వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలుగానే ఆబ్కారీ శాఖ వరంగల్, హనుమకొండ జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు గందరగోళం మధ్య విధులు నిర్వర్తిస్తున్న అధికారులు జిల్లాల సరిహద్దుల మేర విభజించాలంటున్న ఎక్సైజ్ సిబ్బంది -
ఓటరు జాబితాను సవరించాలి
వర్ధన్నపేట: ఓటరు జాబితాను సవరించాలని అంబేడ్కరిజం జేఏసీ తుమ్మల శ్రీధర్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఓటరు జాబితా ముసాయిదాలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. మొత్తం 10,539 ఓటర్లు కాగా 12 వార్డుల క్రమపద్ధతిలో కేటాయించలేదన్నారు. ఒక్కో వార్డులో ఎక్కువ ఓటర్లు, మరో వార్డులో తక్కువ ఓటర్లు ఉన్నారన్నారు. దీంతో ఓటర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో వార్డుల్లో ఉన్న ఓటర్లను ఆ వార్డుల్లోనే ఉండే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం కూడా అందించామన్నారు. -
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని, కడియం హన్మకొండ: కాలేజీ రిటైర్డ్ అధ్యాపకుల సమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ డే, అసోషియేషన్ 2026 డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్కార్డులు ఎంతో అవసరమని ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కళాశాల రిటైర్డ్ అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి చెరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా రిటైర్డ్ అధ్యాపకులను సన్మానించారు. రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ డైరీని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్సీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు డి.సత్యనారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి, కార్యదర్శి బి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంధుల జీవితాల్లో బ్రెయిలీ వెలుగుఅంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండ జెడ్పీ హాల్లో తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావ్య.. వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి కేక్ కట్ చేశారు. సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంటి ఆస్పత్రి డాక్టర్ భరత్కుమార్, అంధుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఇన్సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు కృషి విద్యారణ్యపురి: ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ కావ్య అన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రూపొందించిన నూతన సంవత్సరం డైరీని, క్యాలెండర్ను కావ్య ఆవిష్కరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ భీమళ్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, టీపీటీఎఫ్ డైరీ, క్యాలెండర్ను హనుమకొండలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కూడా ఆవిష్కరించారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026ఒగ్గు పదం.. డోలు పాదంవాతావరణం జిల్లాలో ఉదయం పొగమంచు ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ పరిస్థితి ఉంటుంది. రాత్రి సమయంలో చలితోపాటు పొగమంచు కురుస్తుంది. సులువుగా.. వేగంగా మేడారం జాతరకు నడపనున్న ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ నింపుకునేందుకు ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
కార్డులు, చెప్పుల క్యూలైన్
● తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతుల పడిగాపులు గీసుకొండ: మండలంలోని ఊకల్ హవేలి రెవెన్యూ పరిధిలోని రైతులు యూరియా బస్తాల కోసం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద టోకెన్ల కోసం క్యూ కట్టారు. వారు తమ పంట ఆరోగ్య దీపిక కార్డులు, చెప్పులను క్యూలో ఉంచి అధికారుల కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న ఏఓ హరిప్రసాద్ బాబు, తహసీల్దార్ రియాజుద్దీన్.. ఆ గ్రామానికి వెళ్లి వారికి టోకెన్లను పంపిణీ చేశారు. టోకెన్ల ప్రకారం 1,160 యూరియా బస్తాలను ఆది, సోమ వారాల్లో పంపిణీ చేస్తామని ఏఓ పేర్కొన్నారు. -
ముగిసిన సాహితీ–సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్: సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం శ్రీహర్ష కన్వెన్షన్లో గుంజి వెంకటరత్నం కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. పూర్వ తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిభా మూర్తి పురస్కార ప్రధాన సభ నిర్వహించారు. ఈ సభకు నేరెళ్ల శోభావతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సద్గురు శ్రీ శివానంద నృత్యమాల నాట్యాచార్యులు బి.సుధీర్రావు శిష్య బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బన్న ఐలయ్య, గండ్ర లక్ష్మణరావు, మడత భాస్కర్, వల్సపైడి, పాలకుర్తి దినాకర్, దహనం సాంబమూర్తి, ఎమ్మెస్కో హైదరాబాద్ ప్రధాన సంపాదకులు దుర్గంపూడి చంద్రశేఖర్రెడ్డి, ప్రసార భారతి ఉపసంచాలకులు రేవూరి అనంత పద్మనాభరావు, తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎస్పీ రంగరాజు భాస్కర్, సహృదయ పూర్వ అధ్యక్షుడు కేఎల్వీ ప్రసాద్, గన్నమరాజు గిరిజమనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనర్సింహస్వామి జాతర షురూ
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు ‘లక్ష్మీనర్సింహ స్వామి గోవిందా’ అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ జాతరకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సర్పంచ్ వీరగోని రాజ్కుమార్ సొంత ఖర్చుతో జాతరకు వచ్చే భక్తుల కోసం ఉచితంగామినరల్ వాటర్ సరఫరా చేసినట్లు ఉపసర్పంచ్ కోట ప్రమోద్ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, కమిటీ సభ్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించారు. ఎంసీపీఐ కార్యకర్తలు తీసుకువచ్చిన ప్రభబండి ప్రత్యేకతను చాటుకుంది. స్వామివారి జాతర మరో రెండు రోజులు పాటు కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తున్న భక్తులు రాజకీయ ప్రభబండి -
అందుబాటులో సరిపడా యూరియా
ఖిలా వరంగల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగిలో 1,11,435 ఎకరాల్లో పలు పంటలు సాగవుతున్నాయని, ఇప్పటివరకు 3,56,392 యూరియా బస్తాలు రైతులకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, మార్క్ఫెడ్లో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, మోతాదుకు మించి రైతులకు యూరియా అందించినట్లు పేర్కొన్నారు. మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీలకు సహాయం అందించేందుకు వీలుగా రేవంత్ అన్నా కా సహారా పథకం ద్వారా చేయూత అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఫఖీర్, దూదేకుల, ఇతర దుర్భల ముస్లిం వర్గాలకు చెందిన నిరుద్యోగులకు మోపెడ్లు, బైకులు, ఈ–బైకులు, మహిళలకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ద్వారా ఆర్థిక సహాయం పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అర్హులు ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 0870 – 2980533, 93988 60995 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. కొమ్మాల ఆలయ ఆదాయం రూ.3.74 లక్షలు గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీలను శనివారం లెక్కించారు. గడిచిన 64 రోజులకు హుండీ ద్వారా రూ.1,09,990, పలు అర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.2,64,644.. మొత్తం రూ. 3,74,634 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు అనిల్కుమార్, కొమ్మాల సర్పంచ్ యమునప్రవీణ్, సూర్యతండా సర్పంచ్ రాఘవేంద్ర, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, ఫణీంద్ర, గ్రామపెద్దలు లింగారెడ్డి, రవీందర్రెడ్డి, సిబ్బంది ప్రేమ్కుమార్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్ఖిలా వరంగల్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు అన్నారు. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్లో టస్మా, వడుప్సా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వడుప్సా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకతి వీరస్వామి అధ్యక్షతన పదో తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా రంగయ్యనాయుడు హాజరై నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి ఎన్ఐఎస్ఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పరంజ్యోతి, టస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, గౌరవాధ్యక్షుడు ఆడెపు శ్యామ్తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. వడుప్సా పాఠశాలల విద్యార్థులు తమ సందేహలను నివృత్తి చేసుకోవడానికి ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన సబెక్ట్ రిసోర్స్ పర్సన్లు.. పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టస్మా, వడుప్సా ప్రతినిధులు బిల్ల రవి, జ్ఞానేశ్వర్ సింగ్, కోడెం శ్రీధర్, చక్రపాణి, రాజు, వెంకటేశ్వర్లు, కూచన క్రాంతికుమార్, సతీశ్మూర్తి, రవీందర్, వెంకట్రాజం, శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, మోహన్, విశ్వనాథ్, శరత్బాబు, ప్రసాద్ పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మొదలైన ‘మున్సిపాలిటీ’ సందడి
నర్సంపేట: ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపాలిటీ ఎన్నికల సందడి మొదలైంది. గతంలో మాదిరిగా బ్యాలెట్తోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలుండగా ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలోని గోదాంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సుల్లో అవసరమైన వాటిని అధికారులకు అప్పగించనున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా, మొత్తం 41వేల 101మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 21వేల 397మంది ఉండగా, పురుషులు 19వేల 701మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉండగా, మరో ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాలు పెంచాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అదనపు బాక్సుల కోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు అధికారులు విన్నవించగా మరో 12బాక్సులను రిజర్వ్లో ఉంచారు. ఒక్కో వార్డులో 1,100నుంచి 1,500 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అత్యల్పం 25వ వార్డు –1,199, అత్యధికం 13వ వార్డు –1,543 నర్సంపేట పరిధిలో ఉన్న 30వార్డుల్లో 12వ వార్డులో అత్యల్పంగా 1,199మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా 13వ వార్డులో 1,543మంది ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా ఓ ఇద్దరికి రెండు వార్డుల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు మాత్రమే ఫిర్యాదు వచ్చినట్లు మున్సిపల్ కమిషన్ భాస్కర్ వెల్లడించారు. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 72 బ్యాలెట్ బాక్సులు అదనంగా మరో 12 బ్యాలెట్ బాక్సులు నర్సంపేటలో 30 వార్డులు 41,101 మంది ఓటర్లు 19,701 పురుష ఓటర్లు 21,397 మహిళా ఓటర్లువార్డుల వారీగా మహిళా, పురుష ఓటర్లు వార్డు మహిళా పురుష ఇతరులు మొత్తం ఓటర్లు ఓటర్లు1 769 760 0 1,529 2 777 670 1 1,448 3 757 676 0 1,433 4 660 622 0 1,282 5 666 585 0 1,251 6 688 577 0 1,265 7 716 601 0 1,317 8 707 621 0 1,328 9 731 714 0 1,445 10 719 644 1 1,364 11 763 680 0 1,443 12 619 598 0 1,217 13 792 751 0 1,543 14 654 648 0 1,302 15 696 634 0 1,330 16 737 709 0 1,446 17 784 732 0 1,516 18 660 607 0 1,267 19 674 639 0 1,313 20 779 718 0 1,497 21 716 693 0 1,409 22 640 583 1 1,224 23 715 696 0 1,411 24 774 713 0 1,487 25 639 560 0 1,199 26 716 681 0 1,397 27 738 668 0 1,406 28 734 630 0 1,364 29 733 686 0 1,419 30 644 605 0 1,249 మొత్తం 21,397 19,701 3 41,101 -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఏర్పాటు చేసిన పోడియంను ఆదివారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్లు సాధారణంగా టేబుల్ ఏర్పాటు చేసుకుని విధులు కొనసాగించాలని, పోడియం అవసరం లేదనే ఆదేశాల మేరకు తొలగించినట్లు సమాచారం. హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని ఓక్సెన్ యూనివర్సిటీలో ఈనెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు ప్రకటించినట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. టి.మోహన్, టి.కార్తీక్, ఎం.దినేశ్, ఎస్. సుజయ్కుమార్, పి.లిఖిత్, ఎస్.నితిక్రెడ్డి, నాగచైతన్య, కె.సచిన్, ఎస్.మనోజ్కుమార్, రాంలాల్, కె.జ్ఞానేశ్వర్, బి.సాయికుమార్, వి.శ్రావణ్కుమార్, జె.వినయ్కుమార్, జి.అన్వేశ్, జి.శంకర్గౌడ్, టి.సునీల్, కె.విష్ణు, రాజ్కుమార్, జె.సాయికుమార్, ఎం.నాగరాజు, యశ్వంత్, బి.కిరణ్ జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఏటీబీటీ ప్రసాద్ కోచ్గా, స్టే.ఘన్పూర్ విద్యాజ్యోతి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బాలశౌరయ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్కు..పంజాబ్లోని చండీఘర్ వర్సిటీలో ఈనెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు కేయూ రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీపతి కోచ్కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవని కలెక్టర్ సత్యశారద కొనియాడారు. సావిత్రిబాయి జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాబోధనలో ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాకు చెందిన 13 మంది మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. నిర్ధిష్ట గడువులోపు ‘సర్’ పూర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా ఫొటో ఎంట్రీ ప్రక్రియను నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారదతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రతీసారి సంక్రాంతి తర్వాత ఆది, బుధవారాల్లో వారాంతపు జాతరలకు భక్తులు ఎక్కువగా వచ్చేవారు. ఈ నెల చివరలో మేడారం జాతర ఉండడంతో భక్తులు సంక్రాంతి కంటే ముందుగానే మల్లన్న దర్శనానికి బారులు దీరుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పట్నాలు, బోనాలు, ఒడిబియ్యం, సారె సమర్పించి, కోడెలు కట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, అధికారులు తెలిపారు. -
వందశాతం ఇంటి పన్నుల వసూలు
గీసుకొండ: మండలంలోని ఆరెపల్లి గ్రామ ప్రజలు వందశాతం ఇంటి పన్ను చెల్లించి ఆదర్శంగా నిలిచారు. 2025 – 26వ ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను రూ. 94,910, నల్లా పన్ను రూ. 18,240, ఇతర పన్నులు రూ.9 వేలు.. మొత్తం కలిపి రూ.1,22,150 వసూలైనట్లు సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న శనివారం వెల్లడించారు. సాధారణంగా మార్చి నెలాఖరులోపు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, అంతకుముందే జనవరి మొదటి వారంలోనే వందశాతం చెల్లించడం విశేషం. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు ఉప సర్పంచ్ తిప్పారం శ్రీనివాస్, వార్డు సభ్యులు కేపీ రాజు, లకిడె శంకర్రావు, హేమలత, మేకల రాము, మోటె లలిత, స్రవంతి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆరెపల్లెతో పాటు చంద్రయ్యపల్లెలో సుమారు వంద శాతం వసూలు కాగా, మిగతా గ్రామాల్లోనూ ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం కొనసాగుతోందని ఎంపీఓ శ్రీనివాస్ తెలిపారు.● ఆదర్శంగా నిలిచిన ఆరెపల్లి వాసులు -
ఎస్ఐఆర్ను వేగంగా పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చే (మ్యాపింగ్) ప్రక్రియను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అధికారులు, బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి జాబితాను సరిచేయాలని సూచించిన కలెక్టర్, 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను బీఎల్ఓలకు వివరించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
టీబీ నిర్మూలనే లక్ష్యం : డీఎంహెచ్ఓ
కమలాపూర్: టీబీ నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా జూన్ రెండో తేదీ నుంచి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భీంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పరిధి కన్నూరులో హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్తో నిర్వహిస్తున్న స్క్రీనింగ్, ఎక్స్రే పరీక్షలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో టీబీ సోకడానికి అవకాశం ఉన్న 1.98 లక్షల మందికి వల్నరేబుల్ పాపులేషన్ను స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,67,700 (84 శాతం) మందికి స్క్రీనింగ్, 62,250 మందికి ఎక్స్రే పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇటీవల భారత ప్రభుత్వం పోర్టబుల్ ఎక్స్రే మిషన్ను జిల్లాకు అందించిందని, పీహెచ్సీల వారీగా షెడ్యూల్ తయారు చేసి పీహెచ్సీల్లోనే ఎక్స్రే తీస్తున్నట్లు తెలిపారు. డయాబెటిస్, బీపీ, 60 ఏళ్లు పైబడినవారు, టీబీ సోకి ఐదేళ్లు పూర్తయిన వారు, టీబీ కాంటాక్ట్స్, టీబీ లక్షణాలు కనిపించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైపో గ్లసీమియాతో బాధపడుతూ.. 108లో వచ్చిన లింగంపల్లి వరలక్ష్మిని పరిశీలించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనిగరంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. ఉప్పల్ పీహెచ్సీ వైద్యాధికారి పద్మశ్రీ, పల్లె దవాఖాన వైద్యాధికారులు సంయుక్త, రేణుక, రేడియోగ్రాఫర్లు మహేశ్, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ కనకలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు ప్రభాకర్, గోవర్ధన్, శివశంకర్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి
ఉత్తమ టీచర్లకు అవార్డులు హన్మకొండ అర్బన్: సావిత్రిబాయి పూలే జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, విద్యా బోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
● అధికారులకు అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశం ● ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం చేసి పూజారులు శాలువాతో సత్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. తాగునీరు, డ్రెస్సింగ్ రూంలు, పారిశుద్ధ్యం తదితర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ, ఆర్జిత సేవలు, వీఐపీ క్యూలైన్లను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఎంపీడీఓ నర్మద, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి కిరణ్కుమార్, ఆర్ఐ రాణి, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి : డీసీపీ
ఎల్కతుర్తి: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను డీసీపీ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీకి ఎస్సై ప్రవీణ్కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఠాణాలో రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్ను ఆమె ప రిశీలించారు. అనంతరం కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినందుకు సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్ను ఆమె అభినందించారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 20 విభాగాల్లో ఎంపికై న వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రంలో జేఎన్ఎస్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98665 64422 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. విద్యారణ్యపురి: తెలంగాణ టీచర్ ఎలిజిలిటీ టెస్ట్ (టీజీ టెట్) హనుమకొండ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్, రెండు ఫ్లయింగ్స్క్వాడ్లు, 10 మంది అబ్జర్వర్లు పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 11 వరకు ఆతర్వాత 19, 20 తేదీల్లో టెట్ కొనసాగనుంది. హసన్పర్తి: గ్రేటర్ వరంగల్ నగరంలో అర్బన్ మావోయిస్ట్ కార్యకలాపాలు చాప కింద నీరులా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్బన్ మావోయిస్టు కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న దార సారయ్య అలియాస్ శేఖర్ లొంగిపోయినట్లు డీజీపీ శనివారం ప్రకటించారు. సారయ్యది హసన్పర్తి మండలం మునిపల్లి. గతంలో ఈయన మావోయిస్ట్ నేత దామోదర్కు కొరియర్గా వ్యవహరించాడు. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన బుర్ర రాకేశ్.. దార సారయ్యకు మేనల్లుడు. గతంలో సారయ్యను ములుగు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆరునెలలు జైలులో ఉన్న తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. కాగా, సారయ్య జన జీవనంలో సంచరిస్తూనే మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. నిత్యం పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఖాకీలకు ఇన్నాళ్లు చిక్కలేదు. తెల్లవారుజామున, రాత్రి వేళ ప్రయాణించొద్దుపోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్క్రైం: పొగమంచు తీవ్రత అధికంగా ఉన్న కారణంగా తెల్లవారుజామున, రాత్రి ఫ్రయాణం చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చేవాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ఎదురుగా వెళ్లే వాహనాలను అనుసరించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని సీపీ కోరారు. -
మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ
కేయూ క్యాంపస్: కేయూ కామన్మెస్లోని 10 నెలల మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ వేశామని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కామన్మెస్లో శనివారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ వినియోగించని రోజులకు కూడా గ్యాస్ బిల్లులు వేశారని విద్యార్థులు ఆరోపించారు. నాన్ బోర్డర్లు కూడా రాకుండా చూడాలని, కేర్టేకర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. తాము సమస్యలపై అడుగుతుంటే పోలీసులను పిలిపించడం సరికాదని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు అధికంగా ఎందుకు వచ్చాయో పరిశీలన చేయిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. నాన్బోర్డర్లు రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థ్ధులతో కలిసి రిజిస్ట్రార్ రామచంద్రం, డైరెక్టర్ రాజ్కుమార్ తదితరులు భోజనం చేశారు. కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అఽధికారి ఎన్.వాసుదేవరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. -
నగరంపై పొగమంచు దుప్పటి
వరంగల్ మహానగరంపై పొగమంచు దుప్పటేసింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు వీడలేదు. పక్కపక్కనే ఉన్నా మనిషికి మనిషి కనిపించనంత మేర దట్టంగా పొగమంచు కురిసింది. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లలోనూ వెలుతురు సరిగ్గా లేక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. ఖిలావరంగల్ శిల్పాల ప్రాంగణం, ఖుష్మహల్, వేయిస్తంభాల గుడి, శ్రీభద్రకాళి దేవాలయం తదితర ప్రదేశాల్లో పొగమంచు దృశ్యాలను నగరవాసులు ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ/వరంగల్ -
టికెట్ల జారీలో ఆగని అవినీతి !
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి జరగలేదని, సోషల్మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో ప్రసాదాల అమ్మకం ద్వా రా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇ చ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇ చ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డి మాండ్ చేయవద్దని ఆదేశించినట్లు తెలిపారు. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్ ఎక్కడా అవినీతి జరగలేదు: అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత -
‘టెట్’కు సర్వం సిద్ధం
హనుమకొండ జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి: ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏడు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆయాన్ డిజిటల్ జోన్ వడ్డేపల్లి, అయాన్ డిజిటల్ ఎర్రగట్టుగుట్ట, భీమారంలోని మోక్షిత కంప్యూటర్స్, హసన్పర్తి బిసైడ్్ హైవే ప్రాంతంలోని నోబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్, కాజీపేట సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ కళాశాల, హసన్పర్తిలోని భీమారం ప్రాంతంలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఉన్నాయి. ప్రతీ రోజు మొదటి సెషన్, రెండో సెషన్లో టెట్ ఉంటుంది. పరీక్ష రాయనున్న 19,699 మంది.. అన్ని పరీక్ష కేంద్రాలు కలిపి 19,699 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఈ టెట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుంచి ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏడు పరీక్ష కేంద్రాలకు 10 మంది అబ్జర్వర్లను హెచ్ఎంలను నియమించారు. రెండు టీంలు ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించారు. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున హెడ్మాస్టర్లు ఉన్నారు. టెట్ నిర్వహణలో హనుమకొండ జిల్లా ఇన్చార్జ్గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో అబ్జర్వర్లతో, ఫ్లయింగ్స్క్వాడ్ బృందంతో సమావేశం నిర్వహించి టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, టెట్ పరీక్షను కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రాస్తున్నారు. -
ఐనవోలు ఆలయ హుండీ లెక్కింపు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. 2025 అక్టోబర్ 10 నుంచి 1 జనవరి 2026 వరకు రూ.14,98,808, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.90,54,847 రాగా.. మొత్తం రూ.1,05,53,655 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలో వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ లెక్కింపులో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, సర్పంచ్ గడ్డం రఘువంశీ, ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, ధర్మకర్తలు, కానిస్టేబుల్ రమేశ్, గ్రామస్థాయి అధికారులు, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
వరంగల్: వరంగల్ మండలం పైడిపల్లి దర్గాను కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ శుక్రవారం సందర్శించారు. ఉర్సును పురస్కరించుకుని వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ నూరొద్దీన్బాబాను దర్శించుకున్నారు. దర్గా విశిష్టతను మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామా రత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రివిజన్ ఇలా ఉంటుందా? ● ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ అసహనం ● ఎంజేపీ విద్యాలయం సందర్శనహసన్పర్తి: ‘ఉపాధ్యాయులు ఏమీ చెప్పకుండా విద్యార్థులే కూర్చుని చదవడాన్ని రివిజన్ అంటున్నారు.. అసలు రివిజన్ ఇలా ఉంటుందా’ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో కొనసాగుతున్న మహాత్మాజ్యోతి రావు పూలే(కాజీపేట) విద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులు రౌండ్గా కూర్చుని చదువుతుండగా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా రివిజన్ అని చెప్పారు. కలెక్టర్ ఇలా చేస్తే రివిజన్ అవుతుందా? అంటూ అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలిని మందలించారు. ప్రతీ రోజు ఒక్కో చాప్టర్ చొప్పున ఉపాధ్యాయులే రివిజన్ చేయాలని సూచించారు. ప్రతీ తరగతిలో ఇలాగే కొనసాగించాలని చెప్పారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేయగా సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరితో బోర్డుపై పదాలు రాయించారు. సరిగ్గా రాయకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఎంజేపీ ఆర్సీఓ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ ప్రపుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీఏసీఎస్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం ఎంజేపీ నుంచి కలెక్టర్ నేరుగా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వెళ్లారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు అప్డేట్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేనప్పుడు ఇంతమంది సిబ్బంది కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, సొసైటీ ఇన్చార్జ్ అధికారి జగన్మోహన్రావు, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఏఓ అనురాధ పాల్గొన్నారు. -
గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడువు
వరంగల్ అర్బన్: ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్సిటీ ప్రాజెక్టు గడువు గత డిసెంబర్ 31న ముగిసింది. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధి పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కేవలం కొద్ది ఆవిష్కరణలతో సరిపెట్టుకుని సాధారణ పనులకే ప్రాధాన్యం కల్పించి, అధికారులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాకపోవడం, ఆలస్యంగా మొదలు పెట్టడం, అంచనాలు పెరగడం, కాంట్రాక్టర్ల అశ్రద్ధ ఇందుకు కారణమని తెలుస్తోంది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు నగర స్మార్ట్సిటీ పనుల జాప్యానికి ఇలా అనేక కారణాలున్నాయి. ఏదేమైనా కీలకమైన ఈ ప్రాజెక్టులపై గ్రేటర్ వరంగల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం అడగుడునా నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో స్మార్సిటీకి ఎంపిక గ్రేటర్ వరంగల్.. 2016 సప్లిమెంటరీ స్మార్ట్సిటీ పథకంలో ఎంపికైంది. తొలుత రూ.2,376 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. అనంతరం వివిధ ప్రాజెక్టులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. చివరగా రూ. 931 కోట్లతో 97 ప్రాజెక్టులు చేపట్టారు. 2017 నవంబర్ మూడో వారంలో అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదిగో ఇదిగో అంటూ ఇలా సాగదీస్తూ ఐదేళ్ల ప్రాజెక్టులు కాస్త తొమ్మిదిన్నరేళ్లు గడిచినా ఇంకా పెండింగ్లో ఉండడం పాలకులు, అధికారుల చిత్తశుద్ధి స్పష్టమైంది. నగర పరిధిలో 97 పనులను రూ.603.87 కోట్లతో పూర్తి చేశామని, 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.327 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, బల్దియా ఇంజనీరింగ్, స్మార్ట్సిటీ అధికారులు మాత్రం కేవలం రూ.15 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెబుతుండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఇలా.. స్మార్ట్సిటీ ప్రాజెక్టులను ఐదేళ్ల గడువులోగా పూర్తి చేయాలి. అందుకు కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఏడాదికి ఒకమారు నిధులు మంజూరు చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.346 కోట్లు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూ.403 కోట్ల నిధులు విడుదల చేశాయి. మిగిలిన నిధులపై ఆశలు లేనట్టే. కొన్ని స్మార్ట్సిటీ ప్రాజెక్టులను పరిశీలిస్తే నత్తతో పోటీ పడుతున్నట్లు చెప్పవచ్చు. నవ్వితే నాంకేటి అన్నట్లు స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సభ్యులు, ఇంజనీర్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పురోగతిలో ఉన్న స్మార్ట్సిటీ పనులు భద్రకాళి బండ్కు రూ.84.20 కోట్లు కేటాయించగా అందులో 80 శాతం పనులు పూర్తయ్యాయి. వడ్డేపల్లి బండ్ అభివృద్ధికి రూ.34.05 కోట్లు కేటాయించగా అందులో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. భద్రకాళి నాలా చెరువు నుంచి అలంకార్ జంక్షన్ వరకు నాలా విస్తరణ, అభివృద్ధికి రూ.84.20 కోట్లతో ప్రతిపాదించగా కేవలం 70 శాతం పనులు పూర్తయ్యాయి. నగరం నలువైపులా గ్రాండ్ ఎంట్రెన్స్లు, అండర్ రైల్వే గేట్లోని దసరా రోడ్డు, కరీమాబాద్ రోడ్డు, వరంగల్ తూర్పులోని ప్రధాన రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పెండింగ్లో ఉన్నాయి. గ్రేటర్ వరంగల్లో పురోగతిలో ఉన్న పనుల నిలిపివేత నగరంలో కానరాని నూతన ఆవిష్కరణలు పాలకవర్గం, అధికార యంత్రాగం నిర్లక్ష్యమేనన్న విమర్శలువరంగల్ స్మార్ట్సిటీ పథకం డిసెంబర్ 31తో ముగిసింది. ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ పథకాన్ని నిలిపేసి, పురోగతిలో ఉన్న పనులు చేపట్టాలని ఆదేశించింది. మరో 10 ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రూ.15 కోట్లు రావాల్సి ఉంది. – సత్యనారాయణ, ఎస్ఈ, గ్రేటర్ వరంగల్ -
జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026సీఎం రేవంత్కు ఎమ్మెల్యేలు, మేయర్ వినతి హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 66 డివిజన్ల సంఖ్యను జనాభా, విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని సెక్రెటేరియెట్లో వారు సీఎం రేవంత్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డివిజన్ల పెంపు, కాజీపేట బస్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వేశాఖ ద్వారా వేగవంతం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భద్రకాళీ ఆలయ అభివృద్ధి అంశాన్ని వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్కు రావాలని కోరారు. కాగా, వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించినట్లు తెలిపారు.


