breaking news
Warangal District News
-
పోలీసులు పట్టించుకోవట్లేదని రాస్తారోకో
ఎల్కతుర్తి: భూ తగాదాలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలని వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన పలువురు బాధితులు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా–రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. తమకు న్యాయం జరిగేవరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు, పలువురు నాయకుల జోక్యంతో ధర్నాను విరమించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి ప్రమీల భర్త సారయ్య. వారు నలుగురు అన్నదమ్ములు. కాగా, 532 సర్వేనంబర్లో 35 గుంటలు ఉమ్మడి ఆస్తి ఉంది. కొమురయ్య (వరుసకు బావ) అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా పట్టా చేసుకున్నాడు. దీనిపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మార్చి 1న (ఆదివారం) నాడు పంచాయితీ పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు 568, 569 సర్వే నంబర్లో వారసత్వ భూమి గురించి చర్చిస్తే వారి తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో కావాలనే గొడవ తయారు చేసి కొమురయ్య, వారి కుటుంబ సభ్యులు కలిసి మూకుమ్మడిగా ఈనెల 27న తమ ఇంట్లోకి అక్రమంగా చోరబడి కట్టెలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తమ కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా మూడు తులాల వెండి, తులం పుస్తెలు, పాకెట్లో ఉన్న రూ.20 వేలు పోయినట్లు తెలిపారు. అదేవిధంగా ఇంట్లో దాచిన రూ.4.80 లక్షలు పోయినట్లు పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వస్తే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు రహదారిపై ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాదాపు సుమారు 20 మంది బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భూ తగాదాలో పలువురికి గాయాలు హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం -
కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలి
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు అన్నారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ‘కోలువుల కోసం కోట్లాట’ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోరాటం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు 50 ఏళ్ల కృషి ఫలితంగానే కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతోందని, కానీ, కోచ్ఫ్యాక్టరీలో అసలు కోచ్లు తయారవుతాయా? వ్యాగన్లు తయారవుతాయా? అసలు ఎంత మందికి ఉద్యోగాలిస్తారు? భూమి ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులకు ఎన్ని ఉద్యోగాలు, స్థానికులకు ఎన్ని ఇస్తున్నారో తేల్చి కేంద్రం గెజిట్ ఇవ్వాలి’ అని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలి.. కేంద్రం లాతూర్, అస్సాం కోచ్ ఫ్యాక్టరీలో మాదిరి ఇక్కడ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ప్రారంభోత్సవానికి వచ్చే బీజేపీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలన్నారు. ఏపీలో విశాఖ రైల్వే జోన్ చేసినట్లు, కాజీపేట డివిజన్గా చేయాలని అందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఎంపీలు ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కాజీపేట నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేసేవరకు పోరాడుతాం స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ఉద్యమం ఉధృతం.. ‘కొలువుల కోసం కొట్లాట’లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు -
ఉపాధ్యాయులకు మంచి రోజులు
● ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి గీసుకొండ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంచి రోజులు రానున్నాయని, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్కార్డుల జారీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు తీరనున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. గంగదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అరుకాల స్వరూపారాణి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. స్వరూపారాణి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, విద్యార్థులకు మంచి బోధనచేసి నడవడిక నేర్పారని పేర్కొన్నారు. అనంతరం స్వరూపారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు అబ్దుల్ రజాక్, ప్రముఖ సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్రెడ్డి, సర్పంచ్ కూసం స్వరూప, ఏఏపీసీ చైర్మన్ నాగిరెడ్డి లావణ్య, ఎంఈఓ రవీందర్, అల్లం బాలిరెడ్డి, పీఎస్ హెచ్ఎం జెసింత, పీఆర్టీయూ జల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్, నాయకులు ఎడ్ల ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ స్టంట్స్.. ప్రో షో అదుర్స్
● రణీనా రెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండో రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కో నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైమ్ సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్ వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనా రెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల బైక్ విన్యాసాలు -
మాల సంఘాల జేఏసీ కన్వీనర్గా లక్ష్మీనారాయణ
కాళోజీ సెంటర్: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసి రాహుల్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మాలు, వంగేటి రాజ మౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్, వంగేటి ప్రభాకర్ నియమితులయ్యారు. బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరంకాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షకు 139 మంది గైర్హాజరుకాళోజీ సెంటర్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 139 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. 4,716 మంది జనరల్ విద్యార్థులకు 4,608 మంది, 744 మంది ఒకేషనల్ విద్యార్థులకు 713 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాలిదుగ్గొండి: చట్టసభల్లో ఆరె కులస్తులకు ప్రాతినిథ్యం ఉండాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. మండలంలోని గిర్నిబావిలోని ఓ ఫంక్షన్హాల్లో ఆరె కుల సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరెకులస్తులు రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. 22 జిల్లాల్లో కులస్తులు సర్పంచ్లుగా పోటీచేసి చాలా మంది గెలుపొందారని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంగ్లీ శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్వర్రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్రావు, నాయకులు కౌడగాని నర్సింహారావు, గుండెకారి రంగారావు, భుజంగరావు, సుకినె రాజేశ్వర్రావు, గుండెకారి రవికుమార్, ఒలిగె నర్సింగరావు, కుసుంభ బాబురావు, ఎడ్డె రఘుపతిరావు, సర్పంచ్లు నాగరాజు, ప్రభు, సుజాత పాల్గొన్నారు. ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రేకంపల్లి గ్రామానికి చెందిన ఒలిగె నర్సింగరావు ఎన్నికయ్యారు. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ శనివారం నియామకపత్రం అందించారు. అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గుండెకారి రవీందర్రావును నియమించారు. -
అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్ గుర్తుకురాలేదా?
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావు శనివారం కాజీపేట పర్యటనపై ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించారన్నారు. వరంగల్ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, పర్యటనల పేరుతో పదేళ్లు పబ్బం గడిపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీలంతా కాజీపేటకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు కాజీపేట పర్యటన.. స్వామి కార్యం, స్వకార్యంగా ఉందని హేళన చేశారు. సీఎం రేవంత్ను కలిసిన నాయిని సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఇటీవల కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. సొంతగడ్డపై మమకారంతో వైద్య రంగానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సుజిత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, విష్ణురెడ్డి ఉన్నారు. -
జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, జాతర విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ అన్నారు. హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్లోని తన కార్యాలయంలో గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో శనివారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్–నర్సంపేట రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, ప్రభబండ్లతో వచ్చే వారు సంయమనం పాటించి గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలకు పాల్పడవద్దని నోటీసులు జారీ చేయగా.. తాము జాతర ప్రశాంతంగా జురగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డీసీపీకి మాట ఇచ్చారు. మామునూరు, నర్సంపేట ఏసీపీలు వెంకటేశ్, రవీందర్రెడ్డి, గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్, సాయిరమణ, శ్రీనివాస్, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రాజ కీయ నాయకులు అల్లం బాలకిశోర్రెడ్డి వీరగోని రాజ్కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, కన్నెబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి సమీక్షలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
నెక్కొండ: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తునట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతంరెడ్డి అన్నారు. నెక్కొండ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గౌతంరెడ్డి ఆదేశించారు. నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఏ శ్రీధర్, ఏఈలు చిరంజీవి, సంపత్, సబ్ ఇంజనీర్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మోడల్ రాకెట్ విఫలం
ప్రయోగం తుస్.. వీక్షకుల నిరాశ నయీంనగర్: సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి చెరువులోని ఐలాండ్పై ఏర్పాటుచేసిన రుద్రమ–1 మోడల్ రాకెట్ లాంచ్ తుస్మంది. పట్టుమని వంద అడుగులు కూడా ఎగరలేదు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ‘కుడా’ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి తొలుత చిన్న రాకెట్ను లాంచ్ చేయగా.. కొన్ని అడుగుల ఎత్తులోకి వెళ్లి కొంత దూరంలో నేల కూలింది. కొంత సమయం తర్వాత మరో రాకెట్ను ప్రయోగించగా అది కూడా తుస్మంటూ చెరువులో పడింది. మోడల్ రాకెట్ విఫలం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన స్కూల్ విద్యార్థులు, యువత, సైన్స్, ఖగోళప్రియులు, నగర ప్రజలు నిరాశ చెందారు. మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ‘కుడా’, పోలీస్, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ధరలు బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే అల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. – అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
వర్ధన్నపేట: ప్రతి విద్యార్థి హక్కులు, కర్తవ్యంపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ సూచించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్ధన్నపేట మైనారిటీ బాలుర గురుకులంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి అభినందించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ సైన్స్పై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకత, ఆలోచనతో ముందుకుసాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులను వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పస్కుల రాజు మాట్లాడుతూ విద్యార్థుల సమష్టికృషితో సైన్స్ ఫెయిర్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్కుమార్, ఎంపీడీఓ రమణ, సైక్రియాట్రిస్ట్ భరత్, సీఐ శ్రీనివాసరావు, చీఫ్లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సురేశ్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ -
బైక్ స్టంట్స్.. ప్రోషో అదుర్స్
● రణీనారెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండవ రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కొ నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైం సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనారెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. -
ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలి
గీసుకొండ: ఎంచుకున్న లక్ష్యాలను సాధించే విషయంలో ఎదురుగా ఉప్పెన వచ్చినా ఎదురొడ్డి నిలవాలని, ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు సాగాలని కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాల, వంచనగిరి కేజీబీవీలో శనివారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రెండు మోటివేషనల్ వీడియోలను విద్యార్థులకు చూపించి ఆత్మన్యూనతను వీడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులు భయాందోళన వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి ఈ వీడియోలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంతకుముందు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజనం, తరగతులు, పాఠశాలల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంఈఓ రవీందర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, హెచ్ఎం సాంబయ్య పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూపంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకునే పైలట్ ప్రాజెక్టును కలెక్టర్ అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. కలెక్టరేట్లో ఆర్సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. డీబీసీడీఓ పుష్పలత, డీఎస్డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, టెమ్రిస్ ఆర్ఎల్సీ జంగా సతీశ్ ఉన్నారు. కలెక్టర్ను కలిసిన ఆడిట్ టీం.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెంట్రల్ ఆడిట్ టీం శనివారం కలెక్టర్ సత్యశారదను కలిసింది. సంగెం, పర్వతగిరి మండలాల్లో ఎంపికై న గ్రామాల్లో జరుగుతున్న, పూర్తిఅయిన ఉపాధిహామీ పథకం పనుల వివరాలను బృందం కలెక్టర్కు వివరించింది. కేంద్ర బృందంలో అమిత్ శ్రీవాత్సవ్, (టీంలీడర్) పరాష్శర్మ, మోహిత్కుమార్, మధుసూదన్, పీఆర్ కమిషనర్ కార్యాలయం నుంచి మురళి, రఘువీర్ ఉన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి పాల్గొన్నారు. విద్యార్థులకు కలెక్టర్ సత్యశారద పిలుపు రెండు పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం కల్చరల్ఫెస్ట్ కలర్పుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. ‘వారేవా ఏమీ ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పెయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలలపై డైనోసార్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. -
ఆ.. ముగ్గురే సూత్రధారులు
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందాపై సుబేదారి పోలీసుల చార్జ్షీట్సాక్షి, వరంగల్: వరంగల్ బాలరక్ష భవన్ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్ 13న సాక్షిలో దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ప్రచురితమైతే, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పుడలా.. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరారు. ఇప్పుడిలా.. పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏ3 గా మంద ప్రణయ్, సోషల్ వర్కర్తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా పర్వతగిరి మండలం ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది. నిబంధనలు ఎలా ‘క్యాష్’ చేసుకున్నారంటే.. వాస్తవానికి ఇద్దరు భార్యాభర్తల వయస్సు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వస్తారు. ఇలా నకిలీ సర్టిఫికెట్ల దందాతో తక్కువ వయస్సున్న పిల్లలు అనర్హత కలిగిన దంపతులకు దత్తత వచ్చేలా చేస్తున్నారు. అసలు దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఇవేమీ చెప్పకుండానే దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకువచ్చి వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది. వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటపడుతుండడం రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలోనే పెద్ద చర్చకు దారి తీస్తోంది. గతేడాది జూన్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు, నిందితులుగా తేల్చిన పోలీసులు -
బ్లాక్స్పాట్స్ను గుర్తించాలి
న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో శుక్రవారం నిర్వహించిన రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎన్హెచ్ పరిధిలో ఉన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేయాలని సూచించారు. రోడ్లలో లోపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరంగల్ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మున్సిపల్ అధికారులకు తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఆర్అండ్బీ ఈఈ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలి న్యూశాయంపేట: మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం జరిగిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులకు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించాలని సూచించారు. అదేవిధంగా స్ఫూర్తి కార్యక్రమంలో నార్కోటిక్ అధికారులను భాగస్వామ్యం చేసి విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు. రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ సత్యశారద -
టెండర్ నిలిపివేయాలి
గుట్టపై మైనింగ్ చేయడానికి రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఎన్ఓసీని వెంటనే రద్దు చేయాలి. మైనింగ్ ఽశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలి. ఈ గుట్ట చుట్టూ రైతుల వ్యవసాయ భూములు, బావులు ఉన్నాయి. క్రషర్ ఏర్పాటుతో భూములు బీడుగా మారతాయి. బావులు కూలిపోతాయి. ముఖ్యంగా గ్రామంలోని పశువులు మేత లేక మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గుట్ట ప్రాంతాన్ని గొర్రెల మేత కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ సైతం జారీ చేసింది. ఇదే గుట్టపై వేంకటేశ్వరస్వామి దేవాలయం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. – కుసుమ సతీశ్, బోజెర్వు సర్పంచ్ -
బోజెర్వు గుట్టలో క్రషర్ !
చెన్నారావుపేట: మండలంలోని బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేయవద్దని ప్రజలు పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం టెండరు ప్రక్రియ చేపట్టడంతో పంట పొలాలు దెబ్బతింటాయని, జీవనోపాధికి విఘాతం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాలు రెండుసార్లు మైనింగ్ ఆలోచనను విరమించుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ క్రషర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని బోజెర్వు సర్వే నంబర్ 133/1లో సుమారు 50 ఎకరాల్లో రాతిగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్ట మీద సుమారు 11 ఎకరాల్లో మైనింగ్కు అనుమతి ఇవ్వొచ్చంటూ రెవెన్యూ శాఖ ఇటీవల నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చింది. దీంతో గుట్ట మీద 11 ఎకరాల్లో మైనింగ్ చేసి కంకర విక్రయించడానికి క్రషర్ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వ్యాపారుల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మార్చి 2వ తేదీ వరకు గడువు ఉండగా శుక్రవారం వరకు ఐదు టెండర్లు దాఖలైనట్లు అధికారుల ద్వారా తెలిసింది. రైతుల ఆందోళనతో రెండుసార్లు ఎన్ఓసీ రద్దు బోజెర్వు గుట్టకు మైనింగ్ చేయడానికి గతంలో రెండుసార్లు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. ఓ కాంట్రాక్టర్ క్రషర్ ఏర్పాటుకు ముందుకు రాగా.. పంట పొలాలు నాశనం కావడమే కాకుండా గ్రామంలోని నాలుగు వేల గొర్రెలకు మేత కరువయ్యే ప్రమాదం ఉందంటూ రైతులు, గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళనలు చేపట్టారు. దీంతో తొలుత 2013లో నాటి ప్రభుత్వం క్రషర్ ఏర్పాటుపై ఎన్ఓసీ రద్దు చేసింది. అనంతరం 2021లో మళ్లీ క్రషర్ ఏర్పాటుకు టెండరు ప్రక్రియ చేపట్టగా ఓ కాంట్రాక్టర్ దరఖాస్తు చేశాడు. తహసీల్దార్ ఎన్ఓసీ ఇచ్చినా గ్రామసభలో ప్రజలు వ్యతిరేకించడంతో నాటి ప్రభుత్వం రద్దు చేసింది. క్రషర్ ఏర్పాటు చేస్తే భారీ నష్టం బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేస్తే తమకు భారీ నష్టం తప్పదని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ నుంచి వచ్చే దుమ్మూధూళికి పంట పొలాలు దెబ్బతింటాయని, వాపోతున్నారు. బాంబుల మోతతో వ్యవసాయ బావులు పూర్తిగా ధ్వంసమవుతాయని పేర్కొంటున్నారు. వాయుకాలుష్యం ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు.. క్రషర్ ఏర్పాటు చేస్తే గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ధ్వంసం ఖాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. ఆలయ పరిరక్షణ కోసం సైతం వెంటనే మైనింగ్ ఎన్ఓసీ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్ఓసీ రద్దు చేయాలని వినతి.. బోజెర్వు గుట్టపై క్రషర్ ఏర్పాటు చేయకుండా ఎన్ఓసీ రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. బోజెర్వు గ్రామంలోని గుట్టటెండర్ పిలిచిన అధికారులు మైనింగ్కు 11 ఎకరాల భూమి కేటాయింపు పొలాలు దెబ్బతింటాయని రైతుల ఆందోళన ఎన్ఓసీ రద్దు చేయాలని డీఆర్వో, ఎమ్మెల్యేకు వినతి -
ఆ.. ముగ్గురే సూత్రధారులు
● దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా సిబ్బంది కీలకపాత్ర ● చార్జ్షీట్లో పేర్కొన్న సుబేదారి పోలీసులు ● దందాను గతేడాది జూన్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి సాక్షి, వరంగల్: వరంగల్ బాలరక్ష భవన్ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్ 13న దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ‘సాక్షి’లో ప్రచురితంకాగా, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది. అప్పుడలా.. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరారు. ఇప్పుడిలా.. పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏ3 గా మంద ప్రణయ్, సోషల్ వర్కర్తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సి పాల్ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది. -
నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వేడుకకు హాజరైన సినీ హీరోయిన్లు నభా నటేష్, సంయుక్త మీనన్● ఆకట్టుకున్న ‘స్వయంభు’ సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో ‘వారెవ్వ ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పేయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలపై డైనోసార్, కమెడియన్, హలోవేషన్, బటర్ఫ్లై, డేంజరస్ మ్యాన్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్ ఫెస్ట్) కలర్ఫుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీ సంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రో షోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. తొలిరోజు ఇలా... స్ప్రింగ్స్ప్రీ–26 తొలిరోజు శుక్రవారం లిటరరీ అండ్ డిబేటింగ్ క్లబ్ సౌజన్యంతో ఓపెన్ మైక్, కవిత్వం, కథనాలు, వ్యంగ్య ప్రదర్శనలు, మిస్టరీ ఆధారిత గేమ్ ఆన్సాల్వ్డ్, సమాజాన్ని మేల్కోలిపే నుక్కడ్ నాటక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తక్కువ సమయంలో కథను రూపొందించి ప్రదర్శించే డైరెక్టర్ స్కిట్, నువ్వా నేనా? అనేలా పోటీపడిన ట్రెజర్ హంట్ గేమ్, వారెవ్వ ఏమి ఫేసు అంటూ ఫేస్ పెయింటింగ్, నా చేతుల్లో హరివిల్లు అంటూ హ్యాండ్ పెయింటింగ్లతో వసంతోత్సవం అలరించింది.విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 52 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 18,803 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,397 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. తనిఖీ చేసిన కలెక్టర్.. హనుమకొండలోని కో–ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తనిఖీ చేశారు. ఈవార్షిక పరీక్షల్లో ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని డీఐఈఓ గోపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో కల్పించిన సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల ప్రశ్నపత్రాలను తెరిచే గదిని సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కు పలు సూచనలిచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్ తదితరులున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈ నెల 28న ఆర్టీసీ హనుమకొండ డిపో నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖిలా వరంగల్ మండల పరిధి ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఖిలా వరంగల్: మార్చి 25న పోస్టల్ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధి డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్/కవర్పై 53 డాక్ అదాలత్ అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్ అండ్ విజిలెన్స్) పోస్ట్మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్ హైదరాబాద్–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు. విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల్లో కేవలం 10 నుంచి 20 శాతం వరకే ఇస్తున్నారని, ఇలా చెల్లిస్తే మరో 3, 4 ఏళ్లు పడుతుందన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడతున్నామన్నారు. ఈసభలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎండీ అలీ, బాధ్యులు అబ్దుల్ గఫార్, మేకిరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, రఘవీర్, విశ్వనాథం, సారయ్య, శ్యామ్, సమ్మయ్య ఉన్నారు.మరిన్ని ఫొటోలు: 8లో‘నాతో పెట్టుకుంటే రంగు పడుతుంది’ అంటూ విద్యార్థులు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల్లో ఉత్సాహంగా హ్యాండ్ పెయింటింగ్లో పాల్గొన్నారు. ప్లేట్లో రంగును ఏర్పాటు చేసుకుని, దాన్ని అరచేతిలోకి తీసుకుని నా హ్యాండ్ చూడూ అంటూ వాల్పోస్టర్లను రూపొందించారు.కాలేజ్ డేస్.. హ్యాపీ మూమెంట్స్‘వావ్ నిట్ వరంగల్ క్యాంపస్ సూపర్గా ఉంది. కాలేజీ డేస్.. హ్యాపీ డేస్. విద్యార్థి జీవితం మరిచిపోలేని అనుభూతి’ అని సినీహీరో నిఖిల్ సిద్ధార్థ్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై మాట్లాడారు. భారతీయ సినిమాకు గ్లోబల్స్థాయి గుర్తింపు రావడం మనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. స్వయంభు సినిమాతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉందని, నేను చేస్తున్న ప్రతి సినిమాను డిఫరెంట్గా అందజేయాలని ఇలా స్వయంభుతో మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు.థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక ఆదరణసినిమాలు ఎన్ని వచ్చినా కూడా సైలెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుందని డైరెక్టర్స్ కట్లో డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపారు. ‘నాకు హిట్ ప్రాంఛైజ్, ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్లతోనే గుర్తింపు లభించింది. ఎవరికి వారు తమ అభిరుచులకు అనుగుణంగా జీవన ప్రయాణం సాగించాలి. సస్పెన్స్ థ్రిల్లర్లోనూ క్రియేటివిటీ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా అభిమానిస్తారు.. ఆదరిస్తారు’ అని డైరెక్టర్ శైలేష్ కొలను చెబుతున్నారు.నేను చేసే కుండ చూడు.. పాట్ మేకింగ్.. ‘నేను తయారు చేసే కుండ చూడు.. దిసిస్ మై పాట్ మేకింగ్’ అని కుమ్మరులు చేసే మట్టిని సారైపె లయబద్ధంగా తిప్పుతూ వివిధ రూపాల్లో పాత్రలను విద్యార్థులు తయారు చేశారు. వేసవిలో తాగునీటిని చల్లగా ఉంచేందుకు పల్లెల్లో ఇప్పటికీ ఇవే ప్రధానం అంటూ మట్టికుండలను రూపొందించారు. రోజులో 30నిమిషాలకు మించి అంతరాయం కలిగితే అధికారిదే బాధ్యతహన్మకొండ: విద్యుత్ అంతరాయాలపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సీరియస్గా దృష్టి సారించింది. వేసవిలో కోతలు లేని విద్యుత్ అందించడమే లక్ష్యంగా.. యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా లేకుండా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. ప్రధానంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లో పరిమితికి మించి విద్యుత్ అంతరాయాలు జరిగితే సంబంధిత సెక్షన్ అధికారి బాధ్యత వహించాల్సిందే. ప్రతీ రోజు రాత్రి 12 గంటల నుంచి మరునాడు రాత్రి 12 గంటల్లోపు నాలుగుసార్లు పైగా.. విద్యుత్ అంతరాయం జరిగినా, 30 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరాలో కోత విధించడాన్ని యాజమాన్యం సీరియస్గా తీసుకుంటోంది. నాలుగు పర్యాయాల్లో 30 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదు. అలాగని, ఒకేసారి 30 నిమిషాలకుపైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే సంబంధిత సెక్షన్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కటి నిక్షిప్తం.. ప్రతీ సబ్ స్టేషన్కు స్కాడా సాంకేతికతను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వినియోగిస్తోంది. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో విద్యుత్ అంతరాయం కలిగితే టీజీ ఎన్పీడీసీఎల్లో ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో నమోదవుతుంది. దీంతో రోజుకు ఎన్ని పర్యాయాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీని ఆధారంగా ప్రతీ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లు సమీక్షిస్తారు. టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి, ఆపరేషన్ డైరక్టర్ టి.మధుసూదన్ సమక్షంలో డివిజనల్ ఇంజనీర్లతో ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లు సమీక్షించి కారణాలు తెలుసుకుంటారు. ప్రతీ రోజు ఉదయం 9.45 నుంచి 10.30 వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల్లోపు ప్రతీ రోజు ఏ సబ్ స్టేషన్ పరిధిలో ఏఏ ఫీడర్లలో ఎన్ని పర్యాయాలు అంతరాయం కలిగిందనే వివరాలను కార్పొరేట్ కార్యాలయం నుంచి డివిజనల్ ఇంజనీర్లకు చేరుతుంది. డివిజనల్ ఇంజనీర్లో సంబందిత సెక్షన్ ఆఫీసర్లు అయిన ఏఈల నుంచి సమాచారం సేకరిస్తారు. అనంతరం జరిగే వీడియో కాన్ఫరెన్స్లో కారణాలను సీఎండీ, ఆపరేషన్ డైరక్టర్, ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్లకు వివరిస్తారు. తద్వారా అంతరాయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు.వేసవిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా వేసవి కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 1,524 ఉన్నాయి. 33 కేవీ ఫీడర్లు 691, 11 కేవీ ఫీడర్లు 6,636 ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 11 కేవీ ఫీడర్లు 590 ఉన్నాయి. సబ్ స్టేషన్లను రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కార్పొరేట్ కార్యాలయానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే కచ్చితమైన సమాచారం కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డులో నమోదవుతుంది. తద్వారా ప్రతీ రోజు ఎన్ని సార్లు విద్యుత్ అంతరాయాలు జరిగాయో తెలుస్తోంది. ● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదించిన స్థలం, నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించారు. హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధి అంశంపై ఆర్టీసీ, ‘కుడా’ అధికారులతో చర్చించారు. కాజీపేటలో బస్టాండ్ నిర్మాణంపై సమీక్షించారు. డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్, మధు, ఆ ర్డీఓ రాథోడ్ రమేశ్, ఆర్టీసీ డీఎం ధరమ్సింగ్, తహసీల్దార్ రాజు, అధికారులున్నారు. చట్టం సమర్థంగా అమలు కావాలి జిల్లాలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలు కావాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు బియ్యం పంపిణీ అంశాలపై అధికారులతో సమీక్షించారు. రేషన్ డీలర్ల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సిబ్బంది వివరాలు, పీడీఎస్ రైస్ పంపిణీలో అక్రమాలపై నమోదైన కేసుల స్థితిగతులను జిల్లా పౌర సరఫరాల అధికారి వాజీద్ వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఈఓ గిరిరాజు గౌడ్, ఎన్జీఓ ప్రతినిధి అనితా రెడ్డి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. కార్యాచరణతో.. వేసవిలో విద్యుత్ కోతలు లేని సరఫరానే లక్ష్యం ప్రతీ రోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానించి, భేరీ పూజ తర్వాత స్వామి వారిని అశ్వవాహనంపై గుట్టకిందికి తోడ్కొని వెవెళ్లారు. అనంతరం స్వామివారిని గుట్టచుట్టూ తిప్పారు. అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని పల్లకీలో గుట్టపై నుంచి కిందికి తోడ్కొని వెవెళ్లి గుట్ట దిగువన ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణాన్ని అమ్మవార్లతో వేదపండితులు వైభవంగా నిర్వహించారు. గతం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం కొమ్మాల గ్రామంలోని కొమ్మిడి వంశస్తులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను తమ ఇంటి నుంచి సర్పంచ్ కన్నెబోయిన యమున ఇంటికి, సర్పంచ్ తన ఇంటి నుంచి కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించి దేవతామూర్తులకు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణి, పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రేవూరి -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రాయపర్తి: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ.38,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎంపీడీఓ కార్యాలయంలో 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్చైర్మన్ కృష్ణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, సర్పంచ్ గారె సహేంద్ర, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని గురువారం సినీనటుడు అడవి శేషు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. శేషు అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు https:///tgss.telangana.gov. inలో రిజి స్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మూడో తరగతి పూర్తి చేసుకుని 1 సెప్టెంబర్ 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు, 610 మీటర్ల షటిల్రన్, మెడిసిన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి బోనోఫైడ్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, తహసీల్దార్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన, కులధ్రువీకరణ పత్రాలు, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్, ఒరిజినల్ పత్రాలు వెంట తీసుకురావాలని కోరారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండలస్థాయి, మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాస్థాయి, ఏప్రిల్ 27 నుంచి మే1 వరకు రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● నాభర్త ప్రాణాలు కాపాడండి ● ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఏఎస్సై భార్య వేడుకోలు వరంగల్ క్రైం: పోలీస్ శాఖలో సుమారు 40 ఏళ్లు పనిచేసి రిటైర్మెంట్ అయిన నా భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి భార్య విజయలక్ష్మి ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. వాట్సాప్లో ఆమె అభ్యర్థన వైరల్గా మారింది. గతేడాది రిటైర్డ్ అయిన మూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందలేదు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు తెచ్చిన అప్పులు భారంగా మారడంతోపాటు భర్త తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొంది. ఇంటి కిరాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ విషయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేరే విధంగా అధికారులు సహకరించాలని విజయలక్ష్మి కోరుతోంది. -
మార్కెట్లో సదుపాయాల కల్పనకు కృషి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులకు మౌలిక సదుపాయాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఐదువేల మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, గోదాం చుట్టు సీసీ రోడ్డు నిర్మాణంలో హమాలీలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో వసంతోత్సవం సందడి
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా 1978లో ప్రారంభమైన స్ప్రింగ్ స్ప్రీ (వసంతోత్సవం) దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. ఈనెల 27, 28 తేదీల్లో స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలను నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను పంచుకునే వేదికగా వసంతోత్సవం నిలువనుంది. రెండు రోజుల పాటు 40కుపైగా ఈవెంట్స్, డైరెక్టర్స్ కట్లో కై లాశ్ కొలను, స్వయంభూ మూవీ టీం ఇంటరాక్షన్, ప్రోషోలో జోనితా గాంధీ, రాణీనారెడ్డి మ్యూజిక్ ప్రదర్శనలు అలరించనున్నాయి. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని నిట్ క్యాంపస్ను గోల్డెన్ లైట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. ఎంజాయ్ కల్చరల్ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 అంటూ సినీహీరో, దర్శకుడు అడవి శేషు సందడి చేశారు. నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్ప్రింగ్ స్ప్రీ–26ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడారు. డెకాయిట్ మూవీ షూటింగ్ యూరప్లో జరుగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు యూరప్ నుంచి నిట్కు వచ్చానని తెలిపారు. డెకాయిట్ మూవీలోని రూబరు సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సాంగ్కు విద్యార్థులు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. స్ప్రింగ్ స్ప్రీ–26 ప్రారంభోత్సవంలో సందడిగా గడిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రారంభించిన సినీహీరో అడవి శేషు రూబరు సాంగ్కు విద్యార్థుల స్టెప్పులు నేడు, రేపు స్ప్రింగ్ స్ప్రీ–2026 వేడుకలు -
నేడు రాకెట్ ట్రయల్ రన్
నయీంనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా భద్రకాళి బండ్ ప్రామినాడ్ వద్ద నిర్వహించనున్న రుద్రమ–1 రాకెట్ ప్రయోగానికి ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కుడా కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, విద్య, కుడా, మున్సిపల్ శాఖల అధికారులు, రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి, నిట్ ప్రొఫెసర్ అంజన్కుమార్తో కలెక్టర్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ప్రజల రాకపోకలు, సమన్వయ విధానాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5:30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ లాంచింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు వెల్లంకి రాకెట్ ప్రయోగంపై ప్రసంగిస్తారని తెలిపారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ప్రజలకు సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత ప్రవేశం ఉందని తెలిపారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్గౌడ్, ఎంఆర్ఓ రవీందర్రెడ్డి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
జాతీయస్థాయి అవార్డు రావడం గర్వకారణం
ముల్కనూరు మహిళా సహకార డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ భీమదేవరపల్లి: మండలంలోని ముల్కనూరు మహిళా సహకార డెయిరీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) వారి రీజినల్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డు–2025 లభించడం గర్వకారణమని డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అన్నారు. హైదరాబాద్లో గురువారం ఆమె అందుకుని మాట్లాడారు. సహకార రంగంలో విశిష్ట సేవలు, పారదర్శక నిర్వహణ, మహిళా సాధికారతలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు తెలిపారు. పాలసేకరణ పెరుగుదల, సభ్యుల సంఖ్య విస్తరణ, ఆధునిక సాంకేతిక పద్ధతుల అమలు, మహిళా రైతులకు సమయానికి చెల్లింపుల వంటి అంశాల్లో డెయిరీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. డైయిరీ ప్రతినిధులు రవీందర్, మహిళలు పాల్గొన్నారు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 52 కేంద్రాల్లో తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ కలిపి 18,768మందికి, 18,375 మంది (98శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు డీబార్.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు 4,705 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ తెలిపారు. 98 శాతం మంది విద్యార్థుల హాజరు -
చాహత్ బాజ్పాయ్ వివరాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ప్రభుత్వం నియమించింది. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఐటీడీఏ పీఓ టు కరీంనగర్ కలెక్టర్.. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. పూర్తి పేరు: పి.స్నేహ శబరీష్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2017 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: కేరళ రాష్ట్రం కుటుంబం: ఆమె భర్త డాక్టర్ శబరీష్, ఐపీఎస్ (2017 బ్యాచ్). ఆయన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: ప్రాథమిక, ఉన్నత విద్య కేరళలో పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో (యూపీఎస్సీ 2016) జాతీయస్థాయిలో 47వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా, జోనల్ కమిషనర్గా సేవలందించారు. 2025 జూన్ 12న హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గురువారం జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్గా నియమితులు కాగా.. ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీగా పనిచేసే అరుదైన అవకాశం కలిగింది.పూర్తి పేరు: చాహత్ బాజ్పాయ్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2019 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: ఢిల్లీ సివిల్స్ ర్యాంకు: యూపీఎస్సీ, 2018 పరీక్షలో జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించారు. విద్యార్హతలు : ప్రాథమిక విద్య ఢిల్లీలో సాగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. కాగా, తెలంగాణలో యువ ఐఏఎస్ అధికారిగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) పనిచేశారు. అక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కషి చేశారు. 2025 జూన్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా నియమితులైన బాజ్పాయ్.. స్నేహ శబరీష్ బదిలీ తర్వాత ప్రభుత్వం ఆమెను హనుమకొండ కలెక్టర్గా గురువారం నియమించింది. చాహత్ బాజ్పాయ్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. సందీప్కుమార్ ఝా వివరాలు..సందీప్ కుమార్ ఝా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పంత్నగర్లోని జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుంచి అగ్రికల్చర్లో డిగ్రీ, ఆనంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి పీజీ డిప్లొమా పొందారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా, టీఎస్ ట్రాన్స్కో జేఎండీగా సందీప్కుమార్ పనిచేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులను పట్టించుకోలేదని, ప్రజాపాలన దినోత్సవానికి ఆలస్యంగా వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. విధుల పరంగా గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించారన్న పేరున్నా.. 2025 అక్టోబర్లో ఆయనను హైదరాబాద్కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న సందీకుమార్ ఝాకు ప్రభుత్వం జనగామ కలెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్బాజ్పాయ్.. ‘గ్రేటర్’ కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీగ్రేటర్ వరంగల్ ఇన్ ? అవుట్ చాహత్ బాజ్పాయ్ హనుమకొండ ఇన్ చాహత్ బాజ్పాయ్ అవుట్ స్నేహ శబరీష్ జనగామ ఇన్ సందీప్కుమార్ ఝా అవుట్ షేక్ రిజ్వాన్ బాషా మహబూబాబాద్ ఇన్ స్నేహ శబరీష్ అవుట్ అద్వైత్సింగ్ ఏటూరునాగారం ఐటీడీఏ ఇన్ ? అవుట్ చిత్రామిశ్రాస్నేహ శబరీష్ వివరాలు.. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు ముగ్గురు డీబార్ ● గైర్హాజరైన 147 మంది విద్యార్థులు కాళోజీ సెంటర్/పర్వతగిరి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు గాను 4,705 మంది హాజరు కాగా 116 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి గాను 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను సమీక్షించారని తెలిపారు. -
ఈజీఎస్ రిజిస్టర్లను సమగ్రంగా నిర్వహించాలి
● సెంట్రల్ ఆడిట్ బృందం సభ్యులుసంగెం: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో చేపట్టుతున్న పనుల రిజిస్టర్లు, మస్టర్లను సమగ్రంగా నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సెంట్రల్ ఆడిట్ బృందం టీం లీడర్ అమిత్ శ్రీవాస్తవ్ సూచించారు. మండలంలోని మొండ్రాయి, నర్సానగర్, బీకోజీనాయక్ తండాలను గురువారం ఆడిట్ బృందం సందర్శించింది. మొండ్రాయిలో 2025–26 కాలనికి సంబంధించి రికార్డులు, నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, నర్సానగర్లో కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మొండ్రాయిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సానగర్లో కూలీల హాజరు, మస్టర్ల నిర్వహణలో మహిళా కూలీలు, పురుష కూలీలను వాస్తవ హాజరు వేయడాన్ని పరిశీలించి సంసతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు పని ప్రారంభించినపుడు, 4 గంటల పని అనంతరం ముగింపు సమయంలో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని అలా చేస్తే హాజరు పడి కూలీలకు డబ్బులు వస్తాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో పనుల నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్ బృందం సభ్యులు పారాస్ శర్మ, మోహిత్ కుమార్, డీఆర్డీఓ రాంరెడ్డి, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, ఎంపీడీఓ రవీందర్, పీఆర్ఏఈ అభిరామ్, ఏపీఓ గణేష్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు మెరుగుపర్చాలి
ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతీరు మెరుగుపర్చాలని జిల్లా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బృందం నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. మండలంలోని బుధరావుపేట ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. బృందం సభ్యులు కుమారస్వామి, రఘు, హెచ్ఎం భద్రు, ఉపాధ్యాయులు రవీంద్రచారి, స్వర్ణలత, సంపూర్ణ, రాజ్కుమార్, సీఆర్పీ భాస్కర్ పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ గీసుకొండ: వంచనగిరి కేజీబీవీని జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు గురువారం సందర్శించారు. టీం–2 నోడల్ అధికారి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఉ పాధ్యాయినుల పనితీరు, రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యాబోధన కార్యక్రమాలను తెలుసుకున్నారు. బృందం సభ్యులు రామా సంతోష్, ఆనందమోహన్రావు, శ్రీనివాసరావు, డాక్టర్ భాస్కర్, మంద రాజు , చక్రవర్తుల నాగార్జునరావు, సంపత్, కేజీబీవీ ఎస్ఓ హిమబిందు, టీచర్లు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
వర్ధన్నపేట: మేలైన యాజమాన్య పద్ధతులతో ఆ యిల్ పామ్లో అధిక దిగుబడి సాధించవచ్చని జి ల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఇల్లందలో గురువారం తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు ఆయిల్ పామ్ క్షేత్రంలో ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగులో రైతు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయిల్ పామ్లో నీటి, ఇరుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యల ద్వారా అధిక ఆదాయం పొందడానికి ఆచరించాల్సిన పద్ధతలను శ్రీనివాసరావు వివరించారు. పశువుల ఎరువు, సహజ ఎరువులు వాడాలని సూచించారు. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో సాగవుతున్న పంట కొనుగోలు విధానం ఫ్యాక్టరీ నిర్మాణం తదితర విషయాలను రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ అధినే త సతీష్నారాయణ వివరించారు. మండల ఉద్యా న అధికారి రాకేష్ రాయితీ వివరాలు యూరియా వాడకంపై వివరించారు. భవాని ప్రసాద్, సర్పంచ్ సాంబయ్య, జ్యోతి, కృష్ణారెడ్డి, కల్యాణ్ ఉన్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ జాన్పాకలో 15, 16, 17 డివిజన్లు, సంగెం మండలానికి చెందిన మొత్తం 50 మంది ముస్లిం మహిళలకు కలెక్టర్ సత్యశారదతో కలిసి గురువా రం ఆయన కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కుట్టులో శిక్షణ పొందితే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఆర్డీఓ సుమ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్, తహసీల్దార్ ఎండీ.రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు కొమురారెడ్డి, చిన్న, మాధవరెడ్డి, సంతోష్, ప్రవీణ్, సాల్మన్, మహ్మద్ జానీ ఉన్నారు. -
కేఎంటీపీ పనుల్లో వేగం పెంచాలి
● పూర్తి చేస్తే మరిన్ని పరిశ్రమలకు అవకాశం ● కలెక్టర్ సత్యశారదగీసుకొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కేఎంటీపీలో జరుగుతున్న పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణం, ఆర్ఓబీ, గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కేఎంటీపీకి రహదారి, విద్యుత్, తాగునీటి వసతుల పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తయితే మరిన్ని పరిశ్రమల వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్టీఓ సుమ, జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శన మండలంలోని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ సత్యశారద సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలను, పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధన చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్తేజ, ఎంఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టాలి న్యూశాయంపేట: జిల్లాలో చేపట్టనున్న జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణానికి అవసరైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులు సకాలంతో పూర్తయితే రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖలు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు : సీపీ
వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిరంతర చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మత్తుపదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.శేషాద్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఫారిన్ డిప్యుటేషన్పై రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన శేషాద్రి మాతృ సంస్థ పంచాయతీరాజ్ శాఖకు తిరిగి వెళ్లగా హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నయీంనగర్: భూసేకరణ కోసం కుడా డిప్యూటీ కలెక్టర్గా అడ్ల రవీందర్రెడ్డిని బుధవారం ప్రభుత్వం నియమించింది. ఆర్డీఓ నుంచి పదోన్నతి పొందిన ఆయన డిప్యూటీ కలెక్టర్గా డిప్యుటేషన్పై కుడాకు వచ్చారు. -
‘ఈ–నామ్’తో ఇబ్బందులు
వరంగల్: డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈ– నామ్లో 1.0 సాఫ్ట్వేర్ను అమలు చేస్తోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్లో పసుపుతోపాటు అపరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా అమలు చేయాలని మార్కెటింగ్ అధికారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం వరంగల్ మార్కెట్లో 2.0 వెర్షన్లో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మార్కెట్లో మధ్యాహ్నం 12గంటల వరకు ఈ–నామ్ పోర్టల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను రాష్ట్ర అధికారులకు వివరించగా వారం రోజులపాటు పాతవెర్షన్ (పద్ధతి)లో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. ఈ–నామ్ పేరుతో గంటల తరబడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయడంతో పసుపు, అపరాల యార్డుల్లోని రైతులు ఆందోళన చెందారు. కొత్త సాఫ్ట్వేర్తో తిప్పలు పాత పద్ధతిలోనే కొనుగోళ్లు -
పార్కు స్థలం కబ్జాకు యత్నం!
● నగరం నడిబొడ్డున విలువైన 450 గజాల భూమి ● డాక్యుమెంట్లు పట్టుకుని ఈ స్థలం చుట్టూ తిరుగుతున్న నలుగురైదుగురు ● కబ్జాలో భాగంగా బోరు వేసిన ఆక్రమణదారులు.. అడ్డుకున్న స్థానికులుహన్మకొండ: హనుమకొండ 59వ డివిజన్ పరిధి ఎకై ్సజ్ కాలనీలో విలువైన కార్పొరేషన్ పార్కు స్థలం కబ్జాకు కొందరు వ్యక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. రూ.కోట్ల విలువ చేసే ఈ స్థలం కబ్జాకు నలుగురైదురు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ నెల 24న కొందరు వ్యక్తులు ఆ స్థలంలో బోరు తవ్విస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత.. సుబేదారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతి ఉంటేనే బోరు వేయాలని, అనుమతి పత్రాలు చూపించాలని వారు కోరగా త్వరలో పర్మిషన్ వస్తుందని కబ్జాదారులు బదులిచ్చారు. పర్మిషన్ వచ్చిన తర్వాతనే బోరు తవ్వాలని పోలీసులు, కార్పొరేటర్ ఆదేశించడంతో కబ్జాదారులు వెళ్లిపోయారు. ఇప్పటికే కొంతభాగం ఆక్రమణ.. పార్కు స్థలం దాదాపు 450 గజాలుంటుందని, దీని విలువ రూ.2కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. స్థలంలో కొంతభాగం ఇప్పటికే కొందరు ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నారని, ఇందులో ఒకరు ఓ భవనాన్ని అమ్మకానికి పెట్టారని స్థానికులు తెలిపారు. -
ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్ సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
5 వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ అర్బన్/హన్మకొండ చౌరస్తా: ఖాళీ స్థలాలు కలిగి ఉండి, అర్హులైనవారు ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కోరారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తులను హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేస్తే బహుమానం ఇస్తామని తెలిపారు. ఫ్లోర్లీడర్ ఆఫీస్లో ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే నాయిని కోరారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. ఫిర్యాదు చేస్తే బహుమానం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వరి, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. కాజీపేట అర్బన్: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. కాజీపేట మండలం రాంపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదో తరగతి, ఏడో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి జయించి, విజయం సాధించాలని కోరారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ రాజు, ఎంఈఓ మనోజ్కుమార్, హెచ్ఎం వేణుఆనంద్ పాల్గొన్నారు. -
ఇటు కుడాకు.. అటు రైతుకు లాభం
సాక్షి, వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూముల కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే రైతుల పరోక్ష పాత్ర.. కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడాను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉనికిచర్ల లేఅవుట్ సక్సెస్తో ముందుకొస్తున్న రైతులు ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయించడం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికివచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది. ల్యాండ్ పూలింగ్లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో) గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు ఆత్మకూరు 30 84,000 42,000 42,000 చింతగట్టు 25 70,000 35,000 35,000 ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000 చింతలపల్లి 50 1,40,000 70,000 70,000 -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాల్లో మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ల పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి 19,638 మంది విద్యార్థులకు 19,099 మంది (97 శాతం) హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐఈఓ, చీఫ్ సూపరింటెండెంట్ సునీత, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లో 262 మంది గైర్హాజరు.. కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం 5,680 మంది విద్యార్థులకు 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. ఇదిలాఉండగా.. నేటి(గురువారం) నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హనుమకొండ జిల్లాలో 97 శాతం విద్యార్థుల హాజరు -
దివ్యాంగులను అధ్యాపకులుగా నియమించాలి
రాయపర్తి: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం అధ్యాపకుల నియామకాల్లో దివ్యాంగులకు రోస్టర్ పాయింట్ల విధానం అమలు చేయాలని వీసీ ప్రతాప్రెడ్డిని కోరినట్లు డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్పాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగులకు అధ్యాపకులుగా అవకాశం కల్పింఆచలని వీసీతోపాటు రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబు, శ్రీశైలం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో కాపరి మృతి నెక్కొండ: ఓ రైతు తన పొ లం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఎర్త్ తగిలి మేకల కాపరి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై మహేందర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దకోర్పోలుకు చెందిన చెందిన మట్టె ఏలియా (50) రోజూ మాది రిగానే మేకలను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులోని లోట్లవాగు సమీపంలో గోదాం వద్ద కోతులు బెడద ఉంది. దీంతో ఓ రైతుల తన పొలం చుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మేకలు పొలం వద్దకు వెళ్లగా ఏలియా వాటిన అడ్డుకునే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ ఎర్త్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఏలియాకు కూతురు, భార్య ఉంది. భార్య సుభద్ర ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
● ప్రథమ సంవత్సరం పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరు ● నేడు రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభంవిద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్న సిబ్బందిహంటర్ రోడ్డులోని షైన్ జూనియర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం విద్యార్థులు 5,680 మందికి గాను 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు గాను 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించినట్లు తెలి పారు. డీఈసీ సభ్యులు కె.మాధవరావు, విజయనిర్మల పూర్తిస్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. కాగా నేటి(గురువారం) నుంచి ఇంటర్మీ డియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
తూము నిర్మాణానికి స్థలపరిశీలన
దుగ్గొండి: మండలంలోని కంచర్లచెరువులోకి ఎస్సారెస్పీ నీటిని తరలించడానికి సాగునీటిశాఖ అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. కంచర్లచెరువు కింద భూములు కలిగిఉన్న మల్లంపల్లి, చంద్రయ్యపల్లి, బల్వంతాపురం, బొబ్బరోనిపల్లి గ్రామాల రైతులు నీరు లేక భూములు సాగుచేసుకోలేకపోతున్నారు. ఈసారి రైతులు వరిసాగు చేయగా నీరుసరిపడా లేక ఎండిపోయే ప్రమాదం వచ్చింది. దీంతో రైతులంతా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విషయం తెలియజేశారు. స్పందించిన ఆయన పరిశీలన చేయాలని సాగునీటిశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఎస్ఈ స్వామి ఎస్సారెస్పీ డీబీఎం –38 కాల్వకు చెందిన 14ఎల్ ఉపకాల్వకు తూము ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తూము ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ నీరు కంచర్ల చెరువులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సాగునీటిశాఖ ఈఈ సుదర్శన్, డీఈ రామకృష్ణ, ఏఈ పవిత్ర, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, సర్పంచ్ బూర రాధిక–చందుగౌడ్, రైతులు ఎర్ర ఆదిరెడ్డి, ఎండీ సర్వర్, కక్కెర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
నర్సంపేట: వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగించకుండా పోరాటాలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆరోపించారు. ఏఐకేఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్టం బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఆమోదం పొందితే రైతులు విత్తన ఉత్పత్తి చేసే హక్కును కోల్పోతారని, బహుళజాతి కారొపరేట్ సంస్థలు తయారు చేసిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరమవుతుందన్నారు. విద్యుత్ మీటర్లకు రీచార్జ్ చేసుకునే విధానం తీసుకొస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిర్వహించే ఆందోళనల్లో పాల్గొనాలని తెలిపారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టి కృష్ణ, బొమ్మెడ సాంబయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కుల తిరుపతి, సారంగపాణి, శ్యామల రమేష్, బీమగాని మల్లన్న, మాచర్ల విజయ్, కొంపెల్లి సాంబయ్య పాల్గొన్నారు. -
లింగగిరిలో ఎలుగుబంటి ప్రత్యక్షం
చెన్నారావుపేట: మండలంలోని లింగగిరి గ్రామం చెన్నకేశవస్వామి దేవాలయం సమీపంలోని గుట్టల్లో బుధవారం ఉదయం ఎలుగుబంటి రైతుల కంటపడింది. గుట్టల వైపు నుంచి పలువురు రైతుల పంట పొలాల్లో గత రెండు రోజులుగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంటితోపాటు రెండు పిల్లలు సైతం ఉన్నట్లు రైతులు తెలిపారు. దీంతో సర్పంచ్ రజితకుమారస్వామి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నర్సంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి సరిత, బీట్ అధికారి యోగేష్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్రెడ్డి ఆధ్వర్యంలో ఎలుగుబంటి కోసం రెష్కూ టీమ్ పంటపొలాల్లో అన్వేషించింది. ఎంత వెతికినా ఎలుగుబంటి ఆచూకీ లభించలేదు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు పలుసూచనలు చేశారు. రాత్రిపూట ఎవరూ పొలాల వద్దకు వెళ్లొద్దని, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత మాత్రమే వెళ్లాలని సూచించారు. పొలాల వద్దకు వెళ్లేటప్పుడు అగ్గిపెట్టే తప్పకుండా వెంట తీసుకెళ్లాలని, ఎలుగుబంటి కనిపిస్తే నిప్పు పెట్టాలని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు పట్టుకోవడానికి ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు -
‘ఈ–నామ్’లో ఇబ్బందులు
వరంగల్: డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–నామ్లో 1.0 సాఫ్ట్వేర్ను అమలు చేస్తోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్లో పసుపుతోపాటు అపరాలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా అమలు చేయాలని మార్కెటింగ్ అధికారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం వరంగల్ మార్కెట్లో 2.0 వెర్షన్లో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మార్కెట్లో మధ్యాహ్నం 12గంటల వరకు ఈ–నామ్ పోర్టల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సమస్యను రాష్ట్ర అధికారులకు వివరించగా వారం రోజులపాటు పాతవెర్షన్ (పద్ధతి)లో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. రైతుల ఆందోళన.. ఈ–నామ్ పేరుతో గంటల తరబడి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయడంతో పసుపు, అపరాల యార్డుల్లోని రైతులు ఆందోళన చెందారు. సులువైన పద్ధతిలో పంట విక్రయాలు జరిగేలా చూడాలని, సంక్లిష్టమైన నిబంధనలతో తమను వేధించవద్దని వారు డిమాండ్ చేశారు.● కొత్త సాఫ్ట్వేర్తో తిప్పలు ● పాత పద్ధతిలోనే కొనుగోళ్లు -
పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి
● వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి వర్ధన్నపేట: అధికారులు, సిబ్బంది వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేసి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ము న్సిపల్ కమిషనర్ సుధీర్కుమార్, అధికారులు, సిబ్బంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం, దోమల నివారణకు ఫాగింగ్, వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం తదితర అంశాల పై చర్చించారు. ఏమైనా సమస్యలు ఉన్నపుడు తన దృష్టికి తీసుకురావాలని, వార్డు కౌన్సి లర్లు అందరూ సమన్వయంతో ముందుకు సాగుతామని వారిచ్చే సలహాలను సూచనలను తప్పనిసరిగా స్వీకరిస్తామన్నారు. అనంతరం ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందచేశారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ నేనావత్ షీభారాణి, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, బానోతు జ్యోతి, గుజ్జ వీరన్న, నూనావత్ కమిలి, మాలోతు దేవేందర్, తిరుపతి సురేష్, సిలువేరు రమ, అరుణ, కుమారస్వామి, వాణి, తదితరులు పాల్గొన్నారు. చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి● గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: ఇంటింటా చెత్త సేకరణలో సమయపాలన పాటించాలని, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు నిర్ణీత సమయంలో వాహనాలు చేరుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండ బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ షెడ్కు చేరే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు తడి, పొడి చెత్తను వేరు గా తీసుకొస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. -
వరంగల్
చీఫ్ ఇంజనీర్ అక్రమాలు? ఓ చీఫ్ ఇంజనీర్ అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం టీజీ ఎన్పీడీసీఎల్లో కలకలం సృష్టించింది.గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూములు కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతులనుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే రైతుల పరోక్ష పాత్ర... కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడా ను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచెర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉనికిచెర్ల లేఅవుట్ సక్సెస్తో ముందుకొస్తున్న రైతులు ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ ఇటు కుడాకు...అటు రైతుకు లాభం..ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులకు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికి వచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది. ల్యాండ్ పూలింగ్లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో) గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు ఆత్మకూరు 30 84,000 42,000 42,000 చింతగట్టు 25 70,000 35,000 35,000 ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000 చింతలపల్లి 50 1,40,000 70,000 70,000 -
పాలకులకు మాలలపై కక్ష తగదు
హన్మకొండ: పాలకులకు మాలలపై కక్ష తగదని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని మాల భవన్లో జాతీయ మాలమహానాడు హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగలను వర్గీకరణ పేరుతో విడగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో నష్టపోతున్నామని మాలలు గొంతెత్తడంతో రోస్టర్ విధానాన్ని జీఓ 99 ద్వారా తీసుకువచ్చి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయానికి ప్రభుత్వం గురి చేసిందన్నారు. మాలల గొంతుకగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అసెంబ్లీలో మాట్లాడడం హర్షణీయమన్నారు. నాగర్కర్నూలు జిల్లాలో అగ్రవర్ణ వర్గాల కుల అహంకారానికి బలైన చిన్నారికి నివాళులర్పించారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నాయకులు నీరకి రాము, బన్ను సాంబయ్య, బొల్లం రాంకుమార్, పనికల శ్రీనివాస్, సంపతి రఘు, పాడుగుల నర్సయ్య, గొర్రె రమేష్, మల్లం రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ -
డెస్క్ జర్నలిస్టులందరికీ
అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలిహనుమకొండ అర్బన్: డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే–143, జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 252 జీఓను సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్లుగానే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీఓలో పేర్కొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, ఐజేయూ రాష్ట్ర నాయకులు గాడిపల్లి మధు, గడ్డం కేశవమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కోశాధికారి బొల్ల అమర్, బాధ్యులు బొడిగె శ్రీను, అల్లం రాజేశ్వర్మ డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన మద్దతు తెలిపిన జర్నలిస్టు యూనియన్లు -
పది శాతం పనులు కూడా చేయలె..
ఎంజీఎం : రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పదిశాతం కూడా పూర్తి చేయలేదని, కేసీఆర్పై కక్షతో సీఎం రేవంత్రెడ్డి.. పనులు ఆలస్యం చేస్తూ పేదల ప్రాణాలను బలిగొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. ఏ పనులు ఎంత వరకు వచ్చాయో కలియతిరిగి చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 24 అంతస్తుల స్లాబ్ పూర్తయిందని, ఇప్పుడు ఏ పనీ జరగకపోవడంతో ఆస్పత్రిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. 2024 దసరాకే ఆస్పత్రి ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద చూపెడుతున్న శ్రద్ధలో కేసీఆర్ పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన హెల్త్ సిటీపై పదిశాతం శ్రద్ధ చూపితే ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించిందన్నారు. అదేవిధంగా రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వర్క్ వంటివి చాలా తగ్గించేశారని ఆరోపించారు. జూన్ 2వ తేదీన ఆస్పత్రి ప్రారంభిస్తామని చెబుతున్నారని, 2వేల పడకల ఆస్పత్రికి 2వేల మంది నర్సులు, 1,500 మంది వైద్యులు, వెయ్యిమంది పారామెడికల్ సిబ్బంది అవసరమనే విషయాన్ని కనీసం గుర్తించలేదన్నారు. ఆస్పత్రి సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైందా..? అంటూ మండిపడ్డారు. పేపర్లలో చేస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తామని అని పేర్కొంటున్నారని, ఇది సూపర్స్పెషాలిటీ ఆస్పత్రా..? బస్తీ దవాఖానా..? అని మండిపడ్డారు. ఓపీ చూడడానికి ఈ ఆస్పత్రి ఎందుకు..? బీఆర్ఎస్ హయాంలో వరంగల్లో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామని, కానీ ఇప్పుడు ఆస్పత్రిలో ఏసీలో నీళ్లు కారుతున్నాయనే సాంకేతిక లోపంతో థియేటర్లు మూసివేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ఎంజీఎంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అవి పనిచేయని దుస్థితిలో కొనసాగుతున్నాయంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. గతంలోని ధర్మశాల, ఎలివేషన్ వర్క్స్ తొలగించారు రేవంత్రెడ్డిది ఫ్యూచర్ సిటీ ఆలోచన.. కేసీఆర్ది హెల్త్సిటీ ఆలోచన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలనజర్నలిస్టులపై పగ పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్రావు అన్నారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇన్సూరెన్సుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు ఒక్క శాతం కాంట్రిబ్యూషన్తో, జర్నలిస్టులకు ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని గుర్తు చేశారు .కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి
పలు కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులుఎస్ఎస్తాడ్వాయి : కాల్వపల్లి.. మావోయిస్టుల కంచుకోట. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఓ కుగ్రామం. ఇక్కడి నుంచి పలు కారణాలతో పలువురు గ్రామస్తులు మావోయిస్టు ఉద్యమ బాట పట్టారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. దామోదర్.. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో 1996లో పీపుల్స్వార్ పార్టీలో చేరి దళ సభ్యుడిగా మొదలు.. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టెది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుతోపాటు ప్రస్తుత పరిణామాల కారణంగా దామోదర్ 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వీడి పో లీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అజ్ఙాతం వీడి న దామోదర్ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారంలో ముందుడాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎన్కౌంటర్లో ఏడుగురి మృతి ఉద్యమానికి ఉపిరిగా నిలిచిన కాల్వపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఎన్కౌంటర్లో మృతి చెందారు. బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్, బడే మురళి, సిద్ధబోయిన సారక్క, కొప్పుల పాపారావు, రొక్కలి అశోక్, సిద్ధబోయిన అశోక్, గౌరబోయిన ఉర్మిళ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న దామోదర్ ప్రస్తుతం లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమంలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. కాల్వపల్లి గ్రామం గతంలో వివిధ ఎన్కౌంటర్లలో ఏడుగురి మృతి గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి.. ఆయన లొంగుబాటుతో గ్రామంలో హర్షాతిరేకాలు -
డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు పదోన్నతి లభించింది. నలుగురు డిప్యూటీ సీఈఓలు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా, ఐదుగురు ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, జనగామ డీఆర్డీఓ ఎన్.వసంత, జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సరిత, హనుమకొండ జిల్లా హసన్ పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్ కౌసల్యదేవికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి లభించింది. అదే విధంగా హనుమకొండ జిల్లా పరకాల ఎంపీడీఓ బి.రవీందర్, వేలేరు ఎంపీడీఓ ఆర్.లక్ష్మి ప్రసన్న, జనగామ జిల్లా కొడకండ్ల ఎంపీడీఓ పి.నాగశేషాద్రి, జనగామ డీఆర్డీఏ ఏపీడీ జి.చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ డి.శ్రీనివాస రావుకు డిప్యూటీ సీఈఓగా పదోన్నతి లభించింది. బాలికల ధర్నా ఘటనపై విచారణ పాలకుర్తి టౌన్ : మండలంలోని గూడూరు బా లికల గురుకుల పాఠశాల, కళాశాలలో నాణ్య మైన భోజనం అందించడం లేదని ఈనెల 23న బాలికలు ధర్నా చేపట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డీఎస్ వెంకన్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాత, కొత్త బియ్యం తేడాతో భోజనం తయారీలో జాప్యం జరిగిందని విచారణలో తేలిందన్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్ తన చాంబర్లో వేడుకలు నిర్వహించిందని తెలిపారు. క్షుద్ర పూజల పేరుతో వస్తున్న అపోహలను బాలికలు నమ్మొద్దన్నారు. విచారణ నివేదికను గురుకుల సెక్రటరీతోపాటు కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపా రు. వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సిద్ధాపురంలో వృద్ధుడి హత్య
● మరదలిపై అనుమానం ● పోలీసులకు ఫిర్యాదుహసన్పర్తి: ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హసన్పర్తి మండలం సిద్ధాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె మొగిలి(70)కి కుమారుడు రాజ్కుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొగిలి, రాజ్కుమార్ నగరంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. దీంతో మొగిలి మరదలు ఇందిర(ఒంటరి మహిళ) సిద్ధాపురంలోని అతడి ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భార్య సరోజన మృతి చెందడంతో మొగిలి తిరిగి స్వగ్రామం వచ్చాడు. అప్పటి నుంచి నుంచి ఇందిర అతడితో నిత్యం గొడవ పడుతోంది. ఈవిషయమై ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాజ్కుమార్ ఇంటికొచ్చాడు. ఇదిలా ఉండగా, మంగళవారం మొగిలి ఇంటి ఆవరణలో శవమై కనిపించాడు. ఈవిషయాన్ని గమనించిన బంధువులు కుమారుడు రాజ్కుమార్కు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై రవి, దేవేందర్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానికంగా విచారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందిరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. -
సబ్స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ: స్టేషన్ ఘన్పూర్లో చేపడుతున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డి అధ్యక్షతన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపడుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుతో రిజ ర్వాయర్లలోకి నీరు రావడంతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగరం, కొండాపూర్, కుర్చపల్లి సబ్ స్టేషన్లు మార్చి నెలాఖరు వరకు చార్జీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వినూ త్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ప్రమాదకరంగా ఉన్న లొకేషన్లు గుర్తించి వాటిని మార్చుతున్నామని చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ఈలు రాజు చౌహాన్, సురేందర్, ట్రాన్సో కో వరంగల్ జోన్ సి.ఈ శ్రీరామ్ కుమార్, జనగా మ, హనుమకొండ ఎస్ఈలు సంపత్ రెడ్డి, పి.మధు సూదన్ రావు, డి.ఈలు లక్ష్మీనారాయణ రెడ్డి, సార య్య, విజేందర్ రెడ్డి, మల్లికార్జున్, విజయ కుమార్, అనిల్ కుమార్, సంపత్ రావు, ఏడీఈ రణధీర్ రెడ్డి, సుధాకర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం
హన్మకొండ చౌరస్తా: కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హనుమకొండ యాదవనగర్లోని 4వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్యాదవ్ ఇంటికి వెళ్లారు. యువకుడిపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న బొంగు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ భార్య అనిత, కుమారుడు అఖిల్.. హరీశ్రావు ఎదుట బోరున విలపించారు. స్థానిక యువకులు రఘు, లక్ష్మణ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అశోక్యాదవ్ ప్రశ్నించారని, ఆ విషయం మనసులో ఉంచుకుని టార్గెట్ చేశారని వెల్లడించారు. నాన్న పై దాడి చేస్తే తాము పిటిషన్ ఇవ్వగా పోలీసులు తీసుకోలేదని అఖిల్ తెలిపారు. దీనిపై హరీశ్రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెడుతోందని, బాల్క సుమన్, బొంగు అశోక్ది అక్రమ అరెస్ట్ అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్కుమార్, స్థానిక నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
ఎన్ఆర్ఐల సేవాభావం గొప్పది
హన్మకొండ చౌరస్తా : మాతృభూమిపై ప్రేమతో తాను చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు సేవ చేయాలని తలచిన ఎన్ఆర్ఐల సేవాభావం గొప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఎన్ఆర్ఐల బృందంలో ఒకరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్రెడ్డిని మంగళవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ఆర్ఐల బృందం హనుమకొండలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు 20 కంప్యూటర్లు అందించిందన్నారు. చదువుకున్న బడి, కాలేజీలకు సేవచేయాలని ప్రతీ పూర్వ విద్యార్థి సంకల్పించాలని కోరారు. కేఎంసీ భవనంతోపాటు ప్రహరీ నిర్మాణం కోసం మార్చిలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి రూ.5 కోట్ల నిధులు కోరనున్నట్లు తెలిపారు. ఎన్ఆర్ఐ సుజిత్రెడ్డి మాట్లాడుతూ 1960 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో స్థిరపడిన వైద్యులు దాదాపు 200 మంది ఉన్నారన్నారు. వారందరి సహకారంతోనే రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా ఎన్ఆర్ఐల బృందం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం, లైబ్రరీ ఏర్పాటు లాంటి అనేక కార్యక్రమాలు నిర్విరామంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ కేఎంసీ నూతన భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్రెడ్డి బృందం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల చైర్మన్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కేఎంసీ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు -
సగర్వంగా స్వాగతం పలుకుతాం
చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు సంతోషం కలిగించింది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లిమావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి ● వివిధ కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులు ● గతంలో వివిధ ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి ● గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ● 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చిన నేత – ఎస్ఎస్తాడ్వాయి -
జనంబాట!
వరంగల్బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అడవి వదిలి డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి లభించింది. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉద్యమ ప్రస్థానం ముగిసింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) నుంచి విప్లవోద్యమం వైపు అడుగులేసి మూడు దశాబ్దాల పాటు పనిచేసిన మావోయిస్టు కీలక నేత దామోదర్ మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశారు. దళసభ్యుడినుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వరకు ఎదిగిన ఆయన.. ఆపరేషన్ కగార్, పెరిగిన నిర్బంధాల కారణంగా లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్లతోపాటు దామోదర్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. సుమారు మూడు దశాబ్దాలపాటు ప్రజల కోసం అజ్ఞాతవాసం గడిపిన ఆయన ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, కాల్వపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఆర్ఎస్యూ నేత నుంచి అడవి వైపు... ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బయ్యారం గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. రాయనిగూడెం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ కార్యకలాపాల్లో రాటుదేలిన ఆయన 1998 డిసెంబర్లో తన బంధువు అయిన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ ప్రేరణతో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు... ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరి 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ● ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. ● 2006లో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకేడబ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు పొంది, 2007లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ● 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం)గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ● మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్, యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ● అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాల్వపల్లి గ్రామం వ్యూ పేరు: బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ) ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం, గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు. -
ఆధునిక శతావధానిగా చేపూరి శ్రీరాం
కేయూ క్యాంపస్: లెక్కల మాస్టారు చేపూరి శ్రీరాం తెలుగుభాషపై వచన పద్యకవిత్వం, సాహిత్యంపై మక్కువ పెంచుకుని ప్రవృత్తిగా అవధానాలు చేస్తూ వచ్చిన ఆయన శతావధానం ప్రక్రియను మంగళ వారం విజయవంతంగా పూర్తిచేశారు. కేయూ సెనేట్హాల్లో శతావధానం ప్రక్రియలో మూడో రోజు ఽ75 చందోబద్ధ పద్యాలను ధారణ చేశారు. కంది శంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో మొదటిరోజు 25 సమస్యాపూరణలు, 25 దత్తపదులు, రెండో రోజు 25 వర్ణణలు, 25 ఆశువులు కూడా పూర్తిచేశారు. దీంతో ఇప్పటినుంచి శ్రీరాంను ‘శతావధాని చేశ్రీగా’ పిలుస్తారని నిర్వాహకులు, పృచ్చకులు (ప్రాశ్నికులు)ప్రకటించారు. ఈ సందర్భంగా వీసీ కె.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బహువిద్యలో సమాహారం నైపుణ్యాల సమ్మేళనమే శతావధానమని పేర్కొన్నారు. తెలుగు ప్రాచీన, సజీవ భాష అని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. అనంతరం అతిథులు, నిర్వాహకులు.. చేపూరి శ్రీరాం, విజయ దంపతులను సత్కరించారు. కాకతీయ పద్యకవితావేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య, అవధాన పద్యవికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ,కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, తెలుగు విభాగం అధిపతి మామిడి లింగయ్య, అధ్యాపకుడు కర్రె సదాశివ్, ఉదయమని కృష్ణయ్య,దర్శనం వెంకట్రమణశర్మ పృచ్చకులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా శతావధానం 75 చందోబద్ధపద్యాలనుధారణ ఇక నుంచి‘చేశ్రీగా’ పిలవాలని నిర్ణయం -
సేంద్రియ వ్యవసాయం మేలు
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ నర్సంపేట రూరల్: రైతులు రసాయన మందులు వాడడం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మొ గ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామ రైతువేదికలో సర్పంచ్ చందర్రావు అధ్యక్షతన రైతులకు కేన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ రోజురోజుకూ రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతుందని, దీంతో భూమిలోని సారవంతం దెబ్బతింటుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపాలన్నారు. గురిజాల గ్రామంలో కేన్సర్ బారిన పడి గత సంవత్సరం కాలంలో 19 మంది మృతి చెందారన్నారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట వైద్యాధికారి సరోజన, ఏటీఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చ ర్ దామోదర్రెడ్డి, మండల వ్యవసాయాధికారి కృష్ణకుమార్, ఏఈఓలు అశోక్, సంధ్య, గుంటూరుపల్లి సర్పంచ్ బానోత్ కవిత, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యాప్ ద్వారానే యూరియా అందించాలి ఖానాపురం: యాప్ ద్వారానే రైతులకు యూరియా అందించాలని డీఏఓ అనురాధ సూచించారు. ఈ మేరకు మండలంలోని మనుబోతులగడ్డ, కొత్తూరు గ్రామాల్లోని ఎరువుల షాపులను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఓ భోగ శ్రీనివాస్, ఏఈఓ ఉన్నారు. -
సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ: సురక్షిత ప్రయాణానికి తప్పనిసరిగా హె ల్మెట్ ధరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు భద్రతపై నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. ఎస్సై మహేందర్ మాట్లాడుతూ వరంగల్ సీపీ ఆదేశాల మేరకు వాహనదారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, మా ర్కెట్ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్లు లావుడ్యా తిరుమల్చౌహాన్, మాదాటి శ్రీనివాస్, కోశాధికారి కేవీ. సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ సింగం శ్రావణిప్రశాంత్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్రెడ్డి, పోలీసులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మండలంలోని మూడు తండా సర్పంచ్ బోడ బాలునాయక్, ఉప సర్పంచ్ కేలోతు మమత నరేశ్, వార్డు సభ్యులతోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్టీలో చేరిన వారిని కండువా కప్పి స్వాగతించారు. మూడు తండా జీపీ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
పారాత్రోబాల్ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్మెడల్
కేయూ క్యాంపస్: ఇండోనేషియాలోని సురకర్ణా నగరంలో ఉన్న గోర్ ఎఫ్కోర్ యూనివర్సిటీలో ఈనెల 15న నిర్వహించిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ మ్యాచ్ సిరీస్లో కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి గోల్డ్మెడల్ సాధించింది. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం కృష్ణవేణిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డిఫెరెంట్లీఏబుల్డ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రాజు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో వాయిదావేసిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ను మంగళవారం పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, లైబ్రరీ సైన్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. హన్మకొండ: యుద్ధప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధసూదన్రావు తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 392 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి విద్యుత్శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతమైందని ఎస్ఈ తెలిపారు. ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో టీబీ నియంత్రణకు కృషిచేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, క్షయ వ్యాధి నివారణ సిబ్బంది సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీ మరణాలు తగ్గించడానికి ఇలాంటి శిక్షణ ఉపయోగకరంమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ బ్లెస్సి మాట్లాడుతూ క్షయ నియంత్రణలో భాగంగా హైరిస్క్ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి వారి వివరాలను పోర్టల్లో నమోదు చేసి అవసరమైన మందులు అందించాలని అన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ కోసం 1,93,935 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. 73,711 మందికి ఎక్స్రేలు తీశామని, వీరిలో 1,104 మందికి టీబీ గుర్తించినట్లు తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు ఏమైన సందేశాలు ఉంటే 9240205555 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్స్ మూసివేయాలన్నారు. ఫస్టియర్ జనరల్ కోర్సులో 5,210 మంది, ఒకేషనల్ కోర్సులో 793 మంది, సెకండియర్ జనరల్ కోర్సులో 5,356 మంది, ఒకేషనల్ కోర్సులో 807 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు డీఐఈఓ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వ ద్ద బీఎన్ఎస్ఎస్ 163 (144 )సెక్షన్ అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ తెలి పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హనుమకొండ 52, వరంగల్ 24, జనగామ 16) ఈనెల 24 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయ ని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు. -
ఉత్తమ పాలన అందించాలి
● సర్పంచ్లకు కలెక్టర్ సత్యశారద హితవు ● గంగదేవిపల్లిలో మూడో విడత శిక్షణ గీసుకొండ: గ్రామాల్లో సర్పంచ్లు ఉత్తమ పాలన అందించి మంచి గుర్తింపు పొందాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ, పర్వతగిరి మండలాలకు చెందిన 117 మంది సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందస్తు ప్రణాళికలు వేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలు మరచిపోలేని రీతిలో జనరంజక పాలన సాగించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కటకం కల్పన, డీఎల్పీఓ కుంట రాజీవ్కుమార్, ఎంపీడీఓ అరుంధతి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓలు పాక శ్రీనివాస్, కూచన ప్రకాశ్, అంబటి సునీల్కుమార్రాజు, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఆర్ఐ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి రమ్య కుమారి, జీపీఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి వర్ధన్నపేట మండలం కట్య్రాల సర్పంచ్ రాయపురం రమ్య తన 25 రోజుల చిన్నారి పాపతో హాజరయ్యారు. -
పదేళ్లలో ఏంచేశారో చెప్పండి?
హన్మకొండ చౌరస్తా: అధికారంలో ఉన్న పదేళ్లలో ఏంచేశారో ఒక్కటి చెప్పాలని, రెండేళ్లలో తాను చేసిన పనులు చెబుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఉనికిని చాటుకోవడానికి బావబామ్మర్దులు దిగజారి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారం పోయినా కేటీఆర్లో అహంకారం తగ్గలేదని, స్థాయిని మించి సీఎంను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. వరంగల్లోని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని బయటి నుంచి కాదని లోపలికి వెళ్లి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్మాణంలో దోచుకుతిన్న సొమ్మును త్వరలోనే కక్కిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు డెడ్లైన్ విధించామని చెప్పారు. ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలు చేసి నాశనం చేసినప్పుడు జిల్లా బీఆర్ఎస్ నాయకులు నోరు మూసుకున్నారని, పదేళ్లలో నిధుల కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఏనాడైనా కేసీఆర్ను కలిసే ధైర్యం చేశారా అని ప్రశ్నించారు. బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడే కేసీఆర్.. మాజీ సీఎం కేసీఆర్ బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడని, హరీశ్రావు, కేటీఆర్, వినయ్భాస్కర్ సభ్యులని విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. నాలుగో డివిజన్లోని యాదవనగర్లో యువకుడిపై కత్తితో దాడి చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్ను పరీక్షించగా 86 శాతం ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. మేధావులు ఓటుకు దూరంగా ఉండడంతోనే ఇలాంటి రౌడీలు, గూండాలు ప్రజాప్రతినిధులు అవుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, కొండా నాగరాజు, నలుబోలు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసినా నోరు మెదపలే.. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఫైర్ -
మెరుగైన వైద్యసేవలందించాలి
వర్ధన్నపేట: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వైద్యులు తమ విధులపై నిర్లక్ష్యం వహించడం సరికాదని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రిని వైస్ చైర్పర్సన్ షిభారాణి, వార్డు కౌన్సిలర్లు పాపారావు, కమిలితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లో వైద్యులు హాజరైనట్లు ఉండగా ఆరుగురు వైద్యులు గైర్హాజరైనట్లు గుర్తించి సూపరింటెండెంట్ స్వామిని అడిగారు. దీంతో ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఓ బాలుడిని వైద్యచికిత్సకు తీసుకువస్తే వైద్యం అందించకుండా ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆస్పత్రిని సందర్శించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని సూపరింటెండెంట్ తెలపగా ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాకాల సందర్శన ఖానాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని సర్కిల్కు చెందిన ఫారెస్ట్ అధికారులు మంగళవారం పాకాల ఎకోటూరిజాన్ని సందర్శించారు. స్టడీటూర్లో భాగంగా పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎకోటూరిజంపై జరుగుతున్న అభివృద్ధిని ఎఫ్ఆర్వో పుప్పాల రవికిరణ్ వివరించారు. ఎఫ్ఆర్వోలు, డీఆర్వోలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు సుమారు 40 మంది పాకాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుహన్మకొండ: త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా గరిష్టస్థాయిలో వ్యవసాయ విద్యుత్ సర్వీస్లు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 355 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవంతమైందని ఎస్ఈ తెలిపారు. 27న అవగాహన సదస్సు కాళోజీ సెంటర్: టామ్కామ్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈనెల 27న ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను tomcom.resume@gmail.comకు ఈమెయిల్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 944 004 9520, 944 0052 2081 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
● వీసీలో సీఎస్ రామకృష్ణారావు కాళోజీ సెంటర్: టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్, డీఈఓ బి.రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల కోసం విద్య, వైద్య, పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మాస్ కాపీయింగ్, చీటింగ్, మాల్ ప్రాక్టీస్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు కూర్చోవడానికి డ్యుయల్ డెస్క్ టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి బీఎన్ఎస్ సెక్షన్ 163, సీఆర్పీ సెక్షన్ 144 అమలు చేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మాత్రమే సీసీటీవీ నిఘాలో తెరవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ డీఎం అర్పిత, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఇంటర్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు న్యూశాయంపేట: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశహాల్లో కలెక్టర్ అధ్యక్షతన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్, ఆరోగ్య, రెవె న్యూ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ తదితర శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పౌరసంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి
జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్గౌడ్ దామెర: పదో తరగతి విధ్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్గౌడ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈఓ సందర్శించి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఫ్రీఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు కీలకమని అన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యం చేరేవిధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు. ఆందోళన చెందకుండా శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, సాయంత్రం వేళ స్నాక్స్ పంపిణీ చేయడంతోపాటు ప్రత్యేక టైంటేబుల్ ప్రకారం విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ లకావత్ రాజేశ్కుమార్, ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి, విద్యార్థులు ఉన్నారు. -
సౌరవిద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఆత్మకూరు: సౌరవిద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వరుణ్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆత్మకూరు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ందని తెలిపారు. ఇందులో భాగంగా 761 గృహ సముదాయాలకు 2కిలోవాట్స్, 468 వ్యవసాయ కనెక్షన్లకు 7.5 కిలోవాట్స్ చొప్పున టీజీ రెడ్కో సహకారంతో సుమారు రూ.48 కోట్లు 100 శాతం సబ్సిడీపై సోలార్ ప్యానల్స్ అందిస్తామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల నూతన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు. సోలార్ ప్యానల్స్తో పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని, ఉత్పత్తి చేసిన విద్యుత్కు డబ్బులు చెల్లించనున్నట్లు వివరించారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సదస్సులో హనుమకొండ ఎస్ఈ మధుసూదన్, సీఎండీ ఆఫీస్ టెక్నికల్ డీఈ భాస్కరాచారి, హనుమకొండ రూరల్ డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున్, పరకాల అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ దేవేందర్, ఆత్మకూరు ఏఈ టి.వెంకటేశ్వర్లు, దామెర, పరకాల ఏఈలు రమేశ్, రాజు, సబ్ ఇంజనీర్లు చొక్కారావు, రాహుల్, విద్యుత్ సిబ్బంది దామోదర్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో అక్రమార్కులు!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో కొంతమంది అందినకాడికి దోచుకుంటూ సంస్థ పరువు తీస్తున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యున్నతస్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడితే సంస్థకు రక్షణ ఎక్కడుందని విద్యుత్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అత్యున్నత స్థాయి అధికారి సొమ్ము రీయింబర్స్మెంట్ చేసుకున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి నెల రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు సొంత సంస్థకు కన్నం వేస్తున్నారని సమాచారం. కిందిస్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే నియంత్రించాల్సిన అధికారే అక్రమాలకు పాల్పడితే సంస్థను కాపాడే వారు ఎవరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా ఎవరేమనుకుంటే నాకేంటి తన జేబులు నిండితే చాలు అన్నట్లు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సదరు అధికారి ఇలాంటి నకిలీ బిల్లులతో రీయింబర్స్మెంట్ చేసుకోవడం ఇదే మొదటి సారా? గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభా గం విచారణ చేపట్టినట్లు తెలిసింది. విజిలెన్స్ విచా రణ నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా జరిగాయా అనే కోణంలో యాజమాన్యం దృష్టి సారించింది. మెడికల్ బిల్లులపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి రీయింబర్స్మెంట్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు బిల్లులు తయారు చేశారని ఆరోపణలు అత్యున్నత స్థాయిలో ఉండి ఓ అధికారి సొంత సంస్థకే కన్నం -
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 (144 )సెక్షన్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హనుమకొండ 52, వరంగల్ 24, జనగామ 16) ఈనెల 24 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు. -
దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..
ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరిన దామోదర్, 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. 2006లో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ (కేకేడ బ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు, 2007లో డివి జనల్కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్.. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం..
పేరు: బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి. తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ). ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు.సగర్వంగా స్వాగతం పలుకుతాం.. చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లి ● -
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ హన్మకొండ: పార్టీ విధానాలు, సిద్ధాతాలపై ప్రతీ కార్యకర్తకు అవగాహన ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్గౌడ్ అన్నారు. సోమవారం హనుమకొండ దీన్దయాళ్ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అధ్యక్షతన బీజేపీ హనుమకొండ జిల్లా ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తూళ్ల వీరేందర్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 2028లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి శిక్షణ శిబిరాలు మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ఐదు వారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బూత్ కమిటీలను మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు డాక్టర్ విజయ్ చందర్రెడ్డి, సండ్ర మధు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్ ఆగ్రహం
వరంగల్ అర్బన్: ఖాళీ ప్రదేశాల్లో, కుండీల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా పరిశీలించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆగ్రహానికి లోనయ్యారు. జవాన్ల తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరికి రూ.2 చొప్పున జరిమానాలు విధించి వసూలు చేయాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. సోమవారం ఉదయం కమిషనర్ 4, 8 డివిజన్లలోని కాకతీయ కాలనీ, అక్షర కాలనీ. కేయూసీ రోడ్డు, ఓల్డ్ రాయపుర ప్రాంతాల్లో కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలో గార్బేజీ బిన్లను శుభ్రం చేయకపోవడం, ఓపెన్ డంప్ గార్బేజీ ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల సీరియస్ అయ్యారు. జవాన్లకు కేటాయించిన రిజిస్టర్లో ఆ రోజు చేసిన శానిటేషన్ కార్యక్రమాలను నమోదు చేయాలన్నారు. పెద్దమ్మ గడ్డ వద్ద ఉన్న కల్వర్టు వద్ద ఉన్న ఓపెన్ డంప్ను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సీఎం హెచ్ఓ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. ఇద్దరు జవాన్లకు పెనాల్టీ ఆకస్మిక తనిఖీలు -
స్కావెంజరే ఇక్కడ టీచర్
శాయంపేట: స్కావెంజర్ పాఠాలు బోధిస్తున్న పరిస్థితి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి ప్రాథమిక పాఠశాలలో 10మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలు, ఒక సీఆర్పీ ఉన్నారు. సోమవారం సదరు ఉపాధ్యాయురాలు సెలవు పెట్టడం.. సీఆర్పీ అందుబాటులో లేకపోవడంతో స్కావెంజర్ టీచర్గా మారి పిల్లలకు బోధించింది. ఈ విషయమై కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సారయ్యను వివరణ కోరగా ఉపాధ్యాయురాలు ముందస్తుగా సెలవు తీసుకున్నారని, సీఆర్పీ భోజనానికి వెళ్లి ఉండవచ్చని తెలిపారు. కాగా, పాఠశాలకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యార్థుల హాల్ టికెట్లపై తొలిసారిగా క్యూ ఆర్ కోడ్లు
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 38,600 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 7, టీఎస్సోషల్వెల్ఫేర్ జూనియర్కాలేజిలు 1, మోడల్ జూనియర్ కాలేజీలు 2, ప్రయివేటు అన్ఎయిడెడ్ కళాశాలలు 42 ఉన్నాయి. 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 42 మందిని నియమించారు. 52 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లును నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు.ప్రైవేట్ కళాశాలలు ఫీజుల పేరిట హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. సీసీ కెమెరాల నిఘాలో.. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో ప్రతీ పరీక్ష కేంద్రంలో 2 లేదా మూడు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు తీసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్లకూడదు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. హనుమకొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సీఎస్లకు, డీఓలకు ఇప్పటికే పలు సూచనలిచ్చాం. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సదుపాయాలు కల్పించనున్నాం. మాల్ ప్రాక్టీస్కు ఎవరైనా పాల్ప డితే చర్యలు తప్పవు. ఏమైనా ఫిర్యాదులు, సందేహాలకు డీఐఈఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ 93816 72094, 95027 43435లో సంప్రదించవచ్చు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. – గోపాల్, డీఐఈఓ, హనుమకొండ జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ.. ఫస్ట్ ఇయర్లో 18,596 మంది, సెకండియర్లో 20,004 మంది విద్యార్థులు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు -
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జిల్లాలో ఇలా..ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 18,596సెకండియర్.. 20,004పరీక్ష కేంద్రాలు 52 (ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 7, టీఎస్ సోషల్ వెల్ఫేర్ కాలేజీలు 1, మోడల్ జూనియర్ కాలేజీలు 2, ప్రయివేటు అన్ఎయిడెడ్ కళాశాలలు 42 ఉన్నాయి) సిబ్బంది ఎంతమందంటే..చీఫ్ సూపరింటెండెంట్లు: 52 మంది, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 42. డిపార్టుమెంటల్ ఆఫీసర్లు 52. ఫ్లయింగ్ స్క్వా డ్లు: 3, సిట్టింగ్ స్క్వాడ్లు: 4 -
సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
హన్మకొండ: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు 90శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 10శాతం పనులు రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీశ్రావు దేవన్నపేట పర్యటనతోనే సీఎం రేవంత్రెడ్డిలో కదలిక వచ్చిందని, గాలిలో దేవాదులకు వచ్చి గాలి మాటలు మాట్లాడి వెళ్లారని తూర్పారబట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసం మాత్రమే దేవాదుల నిర్మాణంపై ఈ సమీక్షిస్తున్నారని, దేవాదుల మూడో ఫేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.17వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. పెంచిన రూ.7వేలకోట్లతో కాంట్రాక్టర్నుంచి కాంగ్రెస్ రూ.వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, నాయకులు నాగూర్ల్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, జోరిక రమేష్, పులి రజనీకాంత్, జానకి రాములు, చందర్, అఫ్జల్, మటపెల్లి రమేష్, నార్లగిరి రమేష్, జనార్దన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్ తదితరులున్నారు. మాజీ మంత్రి హరీశ్ రాకతో సీఎం రేవంత్లో కదలిక బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
గడువులోగా పనులు పూర్తి చేయండి
● తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి ● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులు మార్చి నెలఖారులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో జనరల్ ఫండ్ పనులు వేగంగా పూర్తి కావాలన్నారు. వేసవి దష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నగరంలోని అన్ని ఫిల్టర్ బెడ్లలో కెమికల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నగరంలోని సుందరయ్య నగర్ పార్క్, కీర్తి నగర్ పార్క్, చిల్డ్రన్ పార్క్, ఉర్సు బండ్ నిమజ్జనం పాయింట్ వద్ద గల స్ట్రెచ్తో పాటు హనుమకొండ జంక్షన్ పునరుద్ధరణ పనులు సమీక్షించి వేగంగా పూర్తి చేసేందుకు సూచనలిచ్చారు. గత కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదం పొంది టెండర్ పూర్తయిన ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు పురోగతి పనులు సమీక్షించారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మాధవీలత, మహేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కాశిబుగ్గ: చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు వై.శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లను వారి వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 2025 డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్లు పైబడి ఉండాలని, పదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలని తెలిపారు. చేనేత డిజైనర్లకు ఐదేళ్ల అనుభవం తగ్గకుండా ఉండాలని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని శ్రీకాంత్రెడ్డి కోరారు. -
రోడ్డు ప్రమాదాల్లో భవితను కోల్పోతున్నాం..
సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో దేశ భవిష్యతైన ఎంతో మంది యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రతీ నెల చివరి వారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్ ’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపడం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారని సూచించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడడం చాలా బాధాకరమని, ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకతను వివరించాలని సీపీ సూచించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలె..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కిటకిటలాడింది. వివిధ సమస్యలపై అధిక సంఖ్యలో వినతులు అందించారు. అనేక రకాల సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించి ఆయా విభాగాలకు సిఫార్సు చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. వ్యక్తిగత సమస్యల నుంచి కనీస సదుపాయాలు కల్పించాలనే ఇక్కట్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ గ్రీవెన్ సెల్లోని వివిధ సమస్యలపై సమీక్షించి, అధికారులకు సిబ్బందికి సూచించారు. మొత్తం 114 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 54, ఇంజనీరింగ్ విభాగానికి 32, రెవెన్యూ సెక్షన్కు 8, హెల్త్ – శానిటేషన్ 12, తాగునీటి సరఫరా 7, విపత్తు నిర్వహణ 1 అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 32వ డివిజన్ పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరించడం లేదని, డివిజన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కార్పొరేటర్ పల్లం పద్మరవి కోరారు. ● రామన్నపేటలో 12–8–171 ఇంటి డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని సత్యనారాయణ ఫిర్యాదు అందించారు. ● గొర్రెకుంటలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ల్యాదల్ల సుప్రియ విన్నవించారు. ● దేశాయిపేట అంబేడ్కర్ వీధిని విస్తరించి, సెంట్రల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండలోని చాకలి ఐలమ్మ కమ్యూనిటీ హాల్, విద్యా భవన్ నిర్మాణానికి అదనంగా నిధులు కేటాయించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేఖను కమిషనర్కు సంఘం నాయకులు అందించారు. ● నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసి 20 రోజులు గడిచినా మంజూరు చేయడం లేదని తిమ్మాపురానికి చెందిన బీరం లత ఫిర్యాదు చేశారు. ● 57వ డివిజన్ పలు అభివృద్ధి పనులకు టెండర్లు జరిగాయని, పనులు మొదలు పెట్టడం లేదని కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ● 2వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని, డ్రెయినేజీలు నిర్మించాలని పలుమార్లు దరఖాస్తు చేసినా స్పందించడం లేదని సీపీఎం నాయకులు వినతి పత్రం అందించారు.కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ కార్యాలయం గ్రీవెన్స్కు 114 వినతులు తక్షణమే అర్జీలకు పరిష్కారం చూపండి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గ్రీవెన్స్లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 150 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు సంబంధించినవి 56, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 30 ఏళ్లుగా డ్రెయినేజీ లేదుమేము వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాం. మా కాలనీలో రోడ్డు వేశారు కానీ డ్రెయినేజీలు నిర్మించలేదు. దాంతో రోడ్లపై మురుగు పారుతోంది. మురుగునీటి కాల్వ లు నిర్మించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్కు విన్నవించినా ఫలితం లేదు. – అమ్జద్ పాషా, వరంగల్, కాశిబుగ్గ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండిమాకు ఇల్లు లేదు. ఉండడానికి సొంతిల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి. – ముదిగిరి రాజేష్, చెన్నారావుపేట ‘సర్’పై సమీక్ష ప్రజావాణి అనంతరం జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ ప్రక్రియపై తహసీల్దారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత రికార్డుల కచ్చితత్వం కోసం చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి,, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, హౌసింగ్ పీడీ శ్రీవాణిలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలిమా గ్రామంలో ఉపాధి హామీ చట్టం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులు చేయకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – స్వర్ణమేరీ, తిమ్మరాయ పహాడ్ -
కొమ్మాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. తొలిరోజు రాత్రి అధ్యయనోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధాన్ని అధ్యయనోత్సవంలో అర్చకులు పఠించడం ఆనవాయితీగా వస్తోంది. వేదాలకు సమానమైన నాలాయిర ద్రవిడ దివ్య ప్రబంధ పారాయణం అధ్యయనోత్సవంతో ప్రారంభమవుతుందని అర్చకులు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు విష్ణు, ఫణితో పాటు పలువురు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈనెల 27న రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు కోరారు. డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలిదేశాయిపేట: నగర ప్రజలు డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా విభాగం అధికారి కె.రజనీ సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నజ్రేతుపురంలో నమోదైన డెంగీ బాధితుడి ఇంటిని రజనీతో పాటు జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు సదానందం, విజయేంద్రకుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్వైజర్ మధుకర్, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు. నియామకంపర్వతగిరి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని సోమారం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయనకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆసక్తికరంగా శతావధానం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనేట్హాల్లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేశారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు. -
డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: ఖానాపురం మండలం అశోక్నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరించి పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీరుస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అశోక్నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్డ్ డిపార్ట్మెంట్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు అవసరమయ్యే సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.25 కోట్ల నిధుల మంజూరుప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. ప్రాజెక్టుకు కేటాయించిన భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. డీఫ్లోరైడ్ ప్రాజెక్టు సందర్శన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును అధికారులతో కలిసి మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ గతంలో అనేక ఏళ్లుగా నర్సంపేట పట్టణంతో పాటు వివిధ మండలాలకు నిత్యం తాగునీటిని అందించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పట్టింపులేనితనం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. డీఫ్లోరైడ్ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపించారని వివరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేందర్, మిషన్ భగీరథ డీఈ అజార్సయ్యద్, మిషన్ భగీరథ డీటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్రెడ్డి, ఏఈఈ వంశీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్నాథ్, అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలపై సర్వే
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు – లెక్కల (ఎఫ్ఎల్ఎన్) సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎస్సీఈఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు తెలిపారు. ఈ సర్వే నిర్వహణలో భాగంగా డీఈడీ, బీఈఎడ్ విద్యార్థులకు రంగశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 53 ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కేటాయించిన పాఠశాలలకు 25, 26, 27వ తేదీల్లో ఉదయం వెళ్లి 2వ తరగతి తెలుగు, ఉర్దూ, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్లకు సంబంధించిన టాస్క్షీట్ల ద్వారా విద్యార్థుల రెస్పాన్స్ను టాంగరిన్ యాప్లో అప్లోడ్ చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, డీఆర్పీలు శ్రీధర్గౌడ్, సుజాత, సెంటర్ ఇన్చార్జ్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఆస్తుల లెక్క పక్కా
భూముల సర్వేకు నక్ష ప్రాజెక్టువర్ధన్నపేట: భూ సంబంధిత ఆస్తులకు కచ్చితమైన సరిహద్దులు, యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నక్ష ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష (నేషనల్ జియోస్పెషియల్ నాలెడ్జ్ – బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 157 మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 10 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో వర్ధన్నపేట ఉంది. ఇప్పటికి పట్టణంలో 12 వార్డులను 158 బ్లాక్లుగా విభజించి సర్వే చేపట్టారు. గతంలో ఇంటి విస్తీర్ణంపై డ్రోన్లు, ఏరియల్ సర్వే చేసిన అధికారులు.. ఇప్పుడు ఇంటింటికి నేరుగా వెళ్లి కొలతలు వేస్తున్నారు. ఖాళీ స్థలాలు, ఇళ్లు, కమర్షియల్ భవనాలు, వ్యవసాయ భూముల్లో ప్రతీ అంగుళాన్ని నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని ఇళ్ల సర్వే పూర్తి మున్సిపాలిటీలో మొత్తం 3,500 ఇళ్లు ఉండగా, వాటితో పాటు 2వేల ఎకరాల్లో సర్వే పూర్తయింది. దీంతో పాటు పట్టణ పరిధిలో 10 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, సర్వే నిర్వహిస్తున్నారు. గతనెల 23 నుంచి 13 బృందాలతో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సర్వే బృందాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. అనేక ప్రయోజనాలు డిజిటల్ సర్వే వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూ రికార్డులను నవీకరించడం, డిజిటలైజేషన్ చేయడం పట్టణ ప్రణాళిక మెరుగైన పౌరసేవల కోసం కచ్చితమైన జీఐఎస్ ఆధారిత మ్యాపులను అధికారులు తయారు చేశారు. ఆస్తి యజమానులకు స్పష్టమైన హక్కుల ధ్రువీకరణ ఇవ్వనున్నారు. ఆస్తికి ఇచ్చే డిజిటల్ కార్డు.. ఆధార్ కార్డుగా ఉపయోగపడుతుంది. యజమాని ఆస్తికి ఒక యూనిక్ నంబరు కేటాయిస్తారు. సర్వే తర్వాత ఇచ్చే పత్రం పక్కాగా ఉంటుంది. ఒకసారి పత్రం ఇస్తే కబ్జాల భయమే ఉండదు. సరిహద్దు తగాదాలు పూర్తిగా తగ్గనున్నాయి. ఆస్తి పన్ను చెల్లించడం నుంచి మ్యూటేషన్ వరకు అంతా ఆన్లైన్లోనే నిక్షిప్తం అవుతుంది. డిజిటల్ కార్డు నంబర్ నమోదు చేస్తే ఇంటి యజమాని ఆస్తుల వివరాలు తెలిసేలా ఆన్లైన్లో పొందుపరుస్తారు. డిజిటల్ కార్డుతో ప్రాపర్టీ విలువ పెరగడంతో పాటు బ్యాంకుల్లో కూడా రుణాలు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆన్లైన్లో డేటా నమోదైతే భవిష్యత్లో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తాంనక్ష సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపడతాం. వారి అపోహలను తొలగించి ఆస్తుల భద్రత కోసమే అని ప్రచారం చేయిస్తాం. డిజిటల్ మ్యాపింగ్కు పట్టణ ప్రజలు సహకరించాలి. ఇంటికి అధికారులు వచ్చినప్పుడు ఖాళీ స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూముల వివరాలన్నింటిని ప్రజలు పక్కాగా తెలపాలి. – పాలకుర్తి సారంగపాణి, చైర్మన్, వర్ధన్నపేట నెలలో సర్వే పూర్తిచేస్తాంఇప్పటికే ఇళ్ల సర్వే దాదాపు పూర్తయింది. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ పనులు కొనసాగిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేస్తాం. ఇప్పటికే 2 వేల ఎకరాల వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేశాం. నెలరోజుల్లో సర్వే పూర్తిచేస్తాం. అందుకు ప్రజలు సహకరించాలి. – బి.నాగభూషణం, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ భూమి, ఇళ్ల రికార్డుల ఆధునికీకరణ పకడ్బందీగా కొలతలు, యాజమాన్య హక్కులు యూనిక్ నంబర్ కేటాయింపు వర్ధన్నపేటలో కొనసాగుతున్న నక్ష డిజిటల్ సర్వేప్రజల్లో అపోహలు డిజిటల్ సర్వే కోసం అధికారుల బృందం ఇంటికి వెళ్తే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచుతారేమోనని, ఖాళీ ప్రదేశాలను ప్రభుత్వం తీసుకుంటుందేమోనని ప్రజల్లో అపోహలు వెంటాడుతున్నాయి. వివరాలు చెప్పేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, ఇదిపూర్తిగా ఆస్తుల భద్రత కోసమేనని వారికి అధికారులు వివరిస్తున్నారు. డిజిటల్ సర్వేపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంటి పన్నులు పెంచారని గగ్గోలు పెడుతున్న ప్రజలు.. ఖరీదైన ఖాళీ స్థలాల వివరాలు చెప్పేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నాటికి తమ లక్ష్యం పూర్తయ్యేలా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. -
అటు పాలన.. ఇటు బోధన
● ఉచితంగా ట్యూషన్ చెబుతున్న సర్పంచ్ అర్పిత గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం సర్పంచ్గా ఇటీవల ఎన్నికైన తిరుమల్రెడ్డి అర్పిత.. ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తారు. సుమారు 40 మంది విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచితంగా ట్యూషన్ చెబుతున్నారు. విద్యార్ధులతో హోంవర్క్ చేయించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, పాఠాలు చదివించడం, రాయించడం చేయిస్తున్నారు. బీకాం, బీఈడీ చదివిన అర్పితకు.. టీచర్గా ఆరేళ్ల పాటు బోధనలో అనుభవం ఉంది. విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెబుతున్నారు. -
విద్యార్థులు కష్టపడి చదవాలి
ఖిలా వరంగల్: లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బోధన తీరు, ప్రత్యేక తరగతులు, అందిస్తున్న స్నాక్స్ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగయ్య నాయుడు, ఎంఈఓ ప్రసాద్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ టెక్నాలజీ ఎంటర్ !
సాక్షి, వరంగల్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ముఖచిత్రం మారిపోతోంది. ఈసారి సరికొత్తగా హాల్టికెట్ మీద ముద్రించిన క్యూఆర్ కోడ్తో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం సులభంగా మారింది. ఒకవేళ పొరపాటున ప్రశ్నాపత్రం లీకేజీ అయినా అది ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చిందో తెలుసుకునేందుకు వీలుగా ప్రశ్నపత్రం మీద క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే ఎక్కడి నుంచి జరిగిందనేది క్షణాల్లో గుర్తించే సౌలభ్యం వచ్చింది. ఇలా ఆధునిక సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఇంటర్మీడియట్ అధికారులు.. పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఇలా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూనే క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయనున్నాయి. కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులు మూడు గంటల పాటు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలంటున్న ఇంటర్మీడియట్ అధికారులు.. నిమిషం నిబంధన విషయంలో కాస్త మానవత ధృక్పథంతో వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకం హాల్ టికెట్లపై లేకున్నా పరీక్షలకు అనుమతించనున్నారు. 16 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే.. జిల్లాలోని పది ప్రభుత్వ కళాశాలల్లో 160 సీసీటీవీ కెమెరాలున్నాయి. ఒక్కో ప్రభుత్వ కళాశాలలో 16 సీసీటీవీ కెమెరాలున్నాయి. అయితే, 16 ఎయిడెడ్, సెక్టార్, ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం ఒక్కో కాలేజీలో ఐదు సీసీటీవీ కెమెరాలే ఉండడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ప్రశ్నపత్రం తెరిచే గదితో పాటు ఎంట్రెన్స్, వరండాలో మాత్రమే సీసీటీవీ కెమెరాలున్నాయి. తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఆ పాఠశాలలపై ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్ వస్తోంది. స్కాన్ చేస్తే దారి చూపిస్తుంది గతంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న సెంటర్ లొకేటర్ యాప్లో సెంటర్ కోడ్ టైప్ చేస్తే ఆయా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేది. ఇది వాడే క్రమంలో చాలా మందికి గతేడాది ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయా కేంద్రాల గూగుల్ జియో కోఆర్డినేట్స్ తీసుకొని హాల్ టికెట్పైనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్ను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే నేరుగా సదరు కేంద్రానికి తీసుకెళ్లనుంది. ఉదాహరణకు వరంగల్లోని ఎల్బీ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ క్యాంపస్లు ఉంటాయి. క్యూఆర్ కోడ్ను ఉపయోగిస్తే నేరుగా పరీక్ష కేంద్రమైన ఇంటర్మీడియట్ క్యాంపస్కు మాత్రమే తీసుకొని వెళ్లనుంది. ఈసారి సెంటర్ పేరును హాల్టికెట్లపై గోల్డ్ ఫేజ్ లెటర్లలో ముద్రించారు. ఒకవేళ ప్రశ్నాపత్రం లీకై తే దానిమీద ఉండే క్యూఆర్ కోడ్ను గూగుల్ లెన్స్తో స్కాన్ చేస్తే ఏ సెంటరనేది తెలుస్తుంది. గతంలో ఏ సెంటర్ నుంచి లీకైందనేది తెలుసుకునేందుకు ఇబ్బందిగా ఉండేది.పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఇలా.. సంవత్సరం జనరల్ ఒకేషనల్ మొత్తం ఫస్ట్ ఇయర్ 5,210 793 6,003 సెకండ్ ఇయర్ 5,356 807 6,163 మొత్తం 10,566 1,600 12,166హాల్టికెట్లపై తొలిసారిగా క్యూఆర్ కోడ్లు గూగుల్ లెన్స్తో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి దారి ప్రశ్నాపత్రం లీకై తే తెలిసేలా క్యూఆర్ కోడ్ ముద్రణ 240 సీసీటీవీ కెమెరాల నిఘాలోజిల్లాలో వార్షిక పరీక్షలు రేపటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి -
భద్రకాళికి సంగీత దర్శకుడు తమన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఎస్ఎస్ ఽతమన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, వరంగల్ జోన్ డీసీ రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆయనను ఘనంగా స్వాగతించారు. తమన్ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కురి మయూరి, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జబర్దస్త్ ఫేం రాకేష్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించి, అక్కడి అక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్సెల్ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ జిల్లా కలెక్టరేట్లో నేడు (సోమవారం) గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని కోరారు. మేడారంలో భక్తుల రద్దీ ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. యువకుడిపై కార్పొరేటర్ దాడి హసన్పర్తి: రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కార్పొరేటర్ దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని నాలుగో డివిజన్ కమ్యూనిటీహాల్లో ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం సమావేశం నిర్వహించారు. యాదవ కులసంఘం పెద్ద మనిషి నేతుల రఘుయాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్ అక్కడికి చేరుకున్నారు. కార్పొరేటర్ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని గొడవకు దిగారు. కుల పెద్ద మనిసి రఘును చంపుతానని కార్పొరేటర్ బెదిరింపులకు గురిచేశారు. ఎమ్మెల్యేతో తిరుగుతావురా.. ఈ డివిజన్లో లీడర్ అంటే ఉంటే నేనే ఉండాలి రా.. అని బెదిరించినట్లు రఘు తెలిపారు పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో నేతుల రఘు, అతడి తమ్ముడు నేతుల లక్ష్మణ్ బైక్పై రెడ్డిపురం సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్, అతడి అనుచరుడు లింగంపల్లి కుమార్ వారిని అడ్డగించారు. కత్తితో రఘుపై దాడికి యత్నించగా, లక్ష్మణ్ అడ్డుకోవడంతో అతడి అరచేతికి తీవ్ర గాయమైంది. మళ్లీ అదేకత్తితో రఘు, లక్ష్మణ్పై దాడికి యత్నించగా వారు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుదీశారు. క్షతగాత్రుడు లక్ష్మణ్ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితుడి సోదరుడు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
వ్యవసాయాధికారి శ్రీప్రియకు ఉత్తమ అవార్డు
హన్మకొండ: హనుమకొండ సుబేదారిలోని వరంగల్ ఎరువులు నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయాధికారి కొత్త శ్రీప్రియ ఉత్తమ ప్లాంట్ పాథోలజిస్ట్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ నెల 21న చండీఘడ్లో గ్లోబల్ అగ్రిమీట్ సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో గతంలో సేంద్రియ ఎరువుల వాడకంపై సమర్పించిన పరిశోధన గ్రంథంపై వివరించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు అధిక పంట దిగుబడులు పొందడానికి అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించినందుకు ఈ అవార్డు వచ్చినట్లు ఆమె పేర్కన్నారు. జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, జాతీయ డైరీ పరిశోధన సంస్థ, పంజాబ్లోని గురు కాశీ విశ్వ విద్యాలయం, రష్యాకు చెందిన సదరన్ సంస్థలు సంయుక్తంగా ఈ అగ్రి మీట్ను నిర్వహించాయి. అగ్రి మీట్ ఫౌండర్ అంకుర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
నేటి దీక్షలు విజయవంతం చేయాలి
● ఎస్జీపీఏటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డివిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ నెల 23న హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ఎస్జీపీఏటీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖలు సంయుక్తంగా ఆదివారం హనుమకొండలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మార్చి 2024నుంచి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిరాహరదీక్షలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో అసోసియేపన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సమ్మారెడ్డి, జిల్లా కమిటీ బాధ్యులు సింగారెడ్డి రత్నాకర్, హనుమకొండ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, బాధ్యులు గొవిందరెడ్డి, సక్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, జలందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వీరభద్రస్వామి వసంతోత్సవం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవం కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు స్థానిక శివాలయం ఎదుట దోపోత్సవ పూజను పూజారి అభిలాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో పూజల అనంతరం భధ్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ప్రత్యేకంగా అలంకరించిన శావలో వసంతోత్సవానికి గ్రామసేవకు బయలెల్లాడు. అర్చకులు రంగులను భక్తులపై చల్లుకుంటు వసంతోత్సవం జరిపారు. కురవి పెద్ద చెరువులో త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వలంటీర్లతో డిజిటల్ క్రాప్ సర్వే
● జిల్లాలో 162 రెవెన్యూ గ్రామాలు ● 150 గ్రామాల్లో వివరాలు సేకరించనున్న వలంటీర్లుహన్మకొండ: యాసంగి సీజన్ పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ వలంటీర్ల నియామకం చేపట్టింది. పంటల కచ్చితత్వాన్ని నమోదు చేసేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా డిజిటల్ సర్వే చేపట్టింది. గతంలో వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఈ సర్వే నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రైతులు, సర్వే నంబర్లవారీగా సర్వే చేయడానికి ఇప్పుడున్న వ్యవసాయ విస్తరణాధికారులు సరిపోరు. ఈక్రమంలో సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈమేరకు హనుమకొండ జిల్లాలో వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వీరికి ఈ నెల 23న శిక్షణ ఇవ్వనున్నారు. వీరు క్షేత్ర స్థాయిలో పంటల ఫొటోలు తీసి డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. శిక్షణ ఇచ్చిన వెంటనే వీరు సర్వే మొదలు పెట్టేలా అధికారులు కార్యాచరణను రూపొందించారు. రెవెన్యూ గ్రామానికో వలంటీర్ తాత్కాలిక వలంటీర్లుగా గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవకాశాన్ని కల్పించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామంలోని భూములు, యాప్పై అవగాహన కలిగి ఉన్న వారికి, వ్యవసాయ డిప్లమో చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నియమితులైన తాత్కాలిక వలంటీర్లకు ఒక్క ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికాన్ని అందిస్తారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున నియమిస్తున్నారు. ఈ వలంటీర్లు పొలాల్లోకి వెళ్లి పంటల ఫొటోలు తీసి ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి పంట దిగుబడిపై కచ్చితమైన అంచనా రావడమే కాకుండా, రైతులకు సకాలంలో పథకాలు అందుతాయి. 45 రోజుల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక వలంటీర్లు కేవలం 45 రోజులు మాత్రమే పని చేస్తారు. వీరు రైతుల కమతాల వద్దకు వెళ్లి సర్వే నంబర్, రైతుల వారీగా పంట ఫొటో తీసి వివరాలు నమోదు చేస్తారు. గ్రామాల్లో ఉంటూ ఖాళీ సమయంలో ఆదాయం పొందాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. జిల్లాలో ఇలా.. హనుమకొండ జిల్లాలో మొత్తం 162 గ్రామాలున్నాయి. ఇందులో 150 గ్రామాలు శాటిలైట్ మ్యాపింగ్ కలిగినవి ఉన్నాయి. రెండు రెవెన్యూ శివారు గ్రామాలు నగరంలో ఉండి పంటల సాగు చేయడం లేదు. శాటిలైట్ మ్యాపింగ్ సిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఎంపిక చేసిన తాత్కాలిక వలంటీర్లు డిజిటల్ పద్ధతిలో పంటలను నమోదు చేస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని 8 గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పంటలు నమోదు చేస్తారు. హనుమకొండ జిల్లాలో అన్ని పంటలు కలిపి ఇప్పటి వరకు 1,77,735 ఎకరాల్లో సాగు చేశారు. వరి 1,11,380 ఎకరాలు, మొక్కజొన్న 65,700 ఎకరాలు, జొన్న 485 ఎకరాలు, పెసర 11 ఎకరాలు, మినుములు 12 ఎకరాలు, వేరు శనగ 145, నువ్వు 157 ఎకరాల్లో సాగు చేశారు. ప్రక్రియ వేగవంతానికి వలంటీర్లు యాసంగిలో సాగు చేసిన పంటలను వేగంగా డిజిటల్ సర్వే చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. వీరు శిక్షణ అనంతరం వెంటనే పంటల నమోదు ప్రక్రియ చేపడతారు. మొక్కజొన్న 65,700 ఎకరాలువరి 1,11,380 ఎకరాలు -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
సామర్థ్యాల పెంపే లక్ష్యం
కాళోజీ సెంటర్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల ప్రాథమిక విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) తెలంగాణ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డీఎడ్, బీఎడ్ విద్యార్థులకు సోమ, మంగళవారాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం రంగశాయిపేటలోని ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం 9 నుంచి 4.30 గంటల వరకు రిస్సోర్స్ పర్సన్స్ ఇవ్వనున్నారు. ఎస్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేయబడిన మొత్తం 53 పాఠశాలలకు వెళ్లి 2వ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణితశాస్త్రం విషయాల్లో సామర్థ్యాలను పరిశీలిస్తారు. 25వ తేదీ నుంచి సర్వే.. జిల్లాలో ఎంపిక చేయబడిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో సర్వే చేపట్టనున్నారు. విద్యార్థుల పనితీరును టన్జెరిన్యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లుగా 53 మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులను నియమించారు. ఎఫ్ఎల్ఎన్ ఉద్దేశం ఇదే.. ఎన్ఈపీ 2020 ప్రకారం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఉద్దేశం వయసుకు తగ్గట్టుగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పొందేలా లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 నాటికి అందరు విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించేలా చూడటం. ఇది పిల్లల భవిష్యత్ విద్యా విజయానికి, అభిజ్ఞ వికాసానికి పునాదిగా నిలవనుంది. అందుకు తగ్గట్టుగా జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ పనితీరుపై అంచనా వేయడానికి శిక్షణ ప్రారంభిస్తున్నారు. శిక్షణలో పాల్గొనాలి..ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత శాస్త్రం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరిసీ (ఎఫ్ఎల్ఎన్) విషయాల్లో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఎస్సీఈఆర్టీ దృష్టి సారించింది. జిల్లాలో శిక్షణ ప్రారంభించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి నివేదిక అందిస్తారు. ఎంపిక చేసిన వారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి. – బి.రంగయ్యనాయుడు, వరంగల్ డీఈఓ రెండో తరగతి చదివే విద్యార్థుల ప్రాథమిక చదువుపై సర్వే వరంగల్ జిల్లాలో 53 పాఠశాలల ఎంపిక.. సర్వే చేయనున్న డీఎడ్, బీఎడ్ విద్యార్థులు -
ఆరెపల్లిలో బాలల గ్రామసభ
గీసుకొండ: మండలంలోని ఆరెపల్లి గ్రామంలో ఆది వారం నిర్వహించిన బాలల గ్రామసభలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. గ్రామం రాష్ట్రస్థాయిలో బాలల స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికై కేంద్రానికి నామినెట్ అయిన సందర్భంగా బాలసభ నిర్వహించారు. ఇందులో గ్రామంలో బడికి వెళ్తున్న బాలలు, అంగన్వాడీలోని పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బాలలు పాల్గొని పాఠశాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయించాలని కోరారు. బాల్యవివాహా లు, విద్యాహక్కు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర విషయాల గురించి అధికారులు వివరించారు. అనంతరం బాలల హక్కుల పోస్టర్లను ప్రదర్శించారు. బాలల ఆలోచనలకు వేదికగా నిర్వహించిన బాలల గ్రామసభలో సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న పాల్గొని బాలల అభిప్రాయాలను గౌరవించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నా రు. సీడీపీఓ డెబోరా, డీసీపీఓ ఉమ, ఎంపీఓ శ్రీని వాస్, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేవతి, టీచర్ సంధ్య, ఆశ కార్యకర్త శ్రీదేవి, ఎన్జీఓ కోఆర్డినేటర్ శిరీష, చైల్డ్ కోఆర్డినేటర్ కల్పన, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని తెలిపారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించి, అక్కడి అక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్సెల్ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మేడారంలో భక్తుల రద్దీ ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. భద్రకాళికి సంగీత దర్శకుడు తమన్ పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఎస్ఎస్ ఽతమన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, వరంగల్ జోన్ డీసీ రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆయనను ఘనంగా స్వాగతించారు. తమన్ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కురి మయూరి, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జబర్దస్త్ ఫేం రాకేష్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయంలో భక్తులు పోటెత్తారు. -
ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం
నెక్కొండ: యువ వైద్యుడు ప్రజల ఆరోగ్యానికి ఎంతోప్రాధాన్యం ఇస్తూ.. ఆధ్యాత్మిక సేవలోనూ పాలు పంచుకుంటురన్నారని టీపీసీసీ సభ్యుడు సొంటిరె డ్డి రంజిత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వట్టె వాగు సమీపంలోని పంచముఖాంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు ఆదివారం రంజిత్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నెక్కొండకు చెందిన మల్లంపాటి కనకమ్మ–నర్సింహారెడ్డి దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమడు నర్సింహారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక వికాసం, సమాజ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మానసిక స్వాతంన, మనోవికాసం కలుగుతుందన్నారు. కుటుంబ సభ్యులు సంజీవరెడ్డి, నవీన్రెడ్డి, భాస్కర్రెడ్డి సహకారంతో సు మా రు రూ.8లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చామన్నారు. రావుల హరీశ్రెడ్డి, స ర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, సంపత్రావు, న ర్సింహారెడ్డి, గోపాలకష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి పంచముఖాంజనేయ ఆలయానికి వైద్యుడు నర్సింహారెడ్డి రూ. 8 లక్షలు విరాళం -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య దేవాలయ పునఃనిర్మాణం, నూతన విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. గుండ బ్రహ్మయ్య స్వామి నూతన దేవాలయంలో శ్రీ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, శివలింగ, పార్వతిదేవి, నందీశ్వర, ధ్వజస్తంభ, శిఖర, నవగ్రహా, అభయాంజనేయస్వామి, గ్రామ శ్రీలక్ష్మి శిలా విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవాలను దేవగిరి సంతోష శివాచార్య, శ్యామ్ శివాచార్య, పిల్లలమర్రి కార్తీకేయశాస్రిల ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఉదయం గవ్వాంత పూజలు, గర్తన్యాసము, రత్నన్యాసము, యంత్రస్థాపన, మూర్తిస్థాపన, మహాపూర్ణాహుతి, అగ్ని ఉద్వాసన, ప్రాణ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం, దృష్టికుంభం, ప్రథమ దర్శనము, మహాదాశీర్వచన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గ్రామాల్లో దేవాలయాలను నిర్మించుకోవడంతోనే గ్రామస్తులు ఆధ్యాత్మికత అలవర్చుకొని సరైన మార్గంలో జీవనం కొనసాగిస్తారన్నారు. అనంతరం ధ్వజస్తంభం, విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కొంతం యాదగిరి, సర్పంచ్ బాషిపాక సదయ్య, భక్తులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ధర లేక దిగాలు
నర్సంపేట: జిల్లాలో టమాట సాగు చేసిన రైతు కన్నీరు పెడుతున్నాడు. పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న టమాట పంట దిగుబడి సమయంలో ధర అమాంతం పడిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో టమాట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. మార్కెట్లో కిలో టమాట రూ.2 నుంచి రూ.ఐదు వరకు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. దీంతో చేలల్లోనే టమాటలను వదిలేస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రైతుల నుంచి కొనుగోలు చేసిన కొంతమంది దళారులు మాత్రం వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అప్పులు తెచ్చి.. పంట సాగుచేసి జిల్లాలోని 13 మండలాల్లో 1,278 మంది రైతులు 1,016.36 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మొదటి నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. టమాట ధర అమాంతం పడిపోవడంతో అప్పులు చేసి పంట సాగుచేసిన రైతులు నిరాశకు గురవుతున్నారు. పలు మండలాల్లో 20 వేల పైన ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల కూరగాయల పంటలు రైతులు సాగు చేస్తున్నారు. కూలీల ఖర్చు రావడం లేదు.. నాకు ఉన్న ఎకరంన్నరలో టమాట పంట సాగు చేశా. మార్కెట్లో కిలో టమాట రూ.2కే అంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒ క్కో మొక్కకు రూ.1.25తో వెచ్చించి 16 వేల మొక్కలు కొనుగోలు చేశా. మల్చింగ్ పేపర్కు రూ.15 వేలు, నారుకు రూ.20 వేలు, మందుల పిచికారీకి రూ.10 వేలు, కూలీలతో కలిపి మొత్తం రూ.70 వేల ఖర్చు అయ్యింది. కూలీల ఖర్చు భరించలేక చేనులోనే పంట వదలాల్సి వస్తోంది. – నల్లపు యతిన్, అప్పల్రావుపేట, నెక్కొండ మార్కెట్లో కిలో టమాట రూ.రెండే చేలల్లోనే పంటను వదిలేస్తున్న రైతులు జిల్లాలో 1,278 మంది రైతులు.. 1,016.38 ఎకరాల్లో సాగు -
పిల్లల సామర్థ్యాలపై సర్వే
రెండో తరగతి చదివే విద్యార్థుల ప్రాథమిక చదువు అంచనాకాళోజీ సెంటర్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డీఎడ్, బీఎడ్ విద్యార్థులకు నేటి నుంచి (23, 24వ తేదీలు) రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం రంగశాయిపేటలోని ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం 9 నుంచి 4.30 గంటల వరకు రిస్సోర్స్ పర్సన్స్ ఇవ్వనున్నారు. ఎస్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేయబడిన మొత్తం 53 పాఠశాలలకు వెళ్లి 2వ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణితశాస్త్రం విషయాల్లో సామర్థ్యాలను పరిశీలిస్తారు. 25వ తేదీ నుంచి సర్వే.. జిల్లాలో ఎంపిక చేయబడిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో సర్వే చేపట్టనున్నారు. విద్యార్థుల పనితీరును టన్జెరిన్యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లుగా 53 మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులను నియమించారు. ఎఫ్ఎల్ఎన్ ఉద్దేశం ఇదే.. ఎన్ఈపీ 2020 ప్రకారం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఉద్దేశం వయసుకు తగ్గట్టుగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పొందేలా లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 నాటికి అందరు విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధి ంచేలా చూడటం. ఇది పిల్లల భవిష్యత్ విద్యా విజ యానికి, అభిజ్ఞ వికాసానికి పునాదిగా నిలవనుంది. అందుకు తగ్గట్టుగా జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ పనితీరుపై అంచనా వేయడానికి శిక్షణ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత శాస్త్రం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరిసీ (ఎఫ్ఎల్ఎన్) విషయాల్లో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఎస్సీఈఆర్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో శిక్షణ ప్రారంభించి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి నివేదిక అందిస్తారు. ఎంపిక చేసిన వారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ జిల్లాలో 53 పాఠశాలల ఎంపిక సర్వే చేయనున్న డీఎడ్, బీఎడ్ విద్యార్థులు -
మోతాదులోనే ఎరువులు వాడాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నల్లబెల్లి: మిరప పంటలో తగిన మోతాదులోనే రసాయన ఎరువులను వాడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మిరపకోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొండాయిల్పల్లిలో శనివారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిరపకోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. మిరప సాగులో కూలీల సమస్యను అధిగమించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, మార్కెట్లో దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతింటుందని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మార్కెట్లో మిర్చికి మంచి ధర లభిస్తుందని తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్ల్రవేత్త డాక్టర్ రాజకుమార్ విదేశీ ఎగుమతులకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలు, మిర్చి ఆరబెట్టెటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి కోసం పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, సర్పంచ్ ఎరుకల స్వప్న, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ సురేఖ, చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రవీందర్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏడీఏ దామోదర్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి, మండల వ్యవసాయాధికారి బన్న రజిత, ఉద్యాన టెక్నికల్ అధికారి రాకేశ్, పంచాయతీ కార్యదర్శి రజిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సంగెం: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. కొత్తగూడెం గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ప్రాధాన్యతా క్రమంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ గాలి చేరాలు, పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నాయకులు ఎనబోతుల సదయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు గురుకుల ప్రవేశ పరీక్షపర్వతగిరి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతి, ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీసీఓ అపర్ణ తెలిపారు. ఈమేరకు శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో మొత్తం 3,933 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లతో సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణహన్మకొండ అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో లోపాలున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు నాణ్య మైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ, వరంగల్ డీఈఓ లను ఆదేశించారు. కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందనగౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేశ్, ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేశ్, ఎస్.ప్రవీణ్కుమార్, ఉమ, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, జి.తిరుపతి, అధికారులు పాల్గొన్నారు. మరో మైలురాయిని అధిగమించిన కేఎంసీ ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 100కు పైగా వైద్యసీట్లతో పాటు ఏటా సూపర్స్పెషాలిటీ సాధించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేఎంసీకి 10 సూపర్స్పెషాలిటీ సీట్లను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ పేర్కొన్నారు. 20 రోజుల క్రితం సూపర్స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్టర్లు ఎంజీఎంతో పాటు కేఎంసీలో తనిఖీలు నిర్వహించి నివేదికలు కౌన్సిల్కు అప్పగించారు. ఈ నివేదికల ప్రకారం ఆస్పత్రి, కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో గమనించి కార్డియాలజీ, కార్డియోథెరాసిక్, వాస్క్యులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీలో రెండు సీట్ల చొప్పున మంజూరు చేసింది. 15కు చేరిన సూపర్స్పెషాలిటీ పీజీ సీట్లు నెఫ్రాలజీ విభాగంలో 2023 నుంచి ఐదు సూపర్స్పెషాలిటీ సీట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన 10 సీట్లతో కేఎంసీలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఎం వంటి ఆస్పత్రిలో పీజీ సీట్ల మంజూరు వల్ల పేదలకు లక్షలాది రూపాయలు విలువ చేస్తే సూపర్స్పెషాలిటీ సేవలు మెరుగుపడనున్నాయి. -
హాట్టాపిక్గా ‘దేవాదుల’
సాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ఈ ప్రాజెక్టులో పంపుహౌజ్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటిన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటార్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటినీ ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్లో అధికారులు శని వారం మోటార్ను ఆన్చేశారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. గోదావరి ఇంటెక్ వెల్కు నేడు సీఎం రేవంత్ దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండడంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయల్దేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించం
నల్లబెల్లి: రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ సత్యశారద హెచ్చరించారు. మండలంలోని మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. డాక్టర్ జ్యోతి, పలువురు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈవిషయమై డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది గైర్హాజరుపై చర్యల నిమిత్తం రెండు రోజుల్లో విచారణ నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరురికార్డు, ఫార్మసీ విభాగంలోని మందుల నిల్వలను పరిశీలించారు. అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలోని రాంపూర్ సబ్ సెంటర్ను పందర్శించారు. మౌలిక సదుపాయాలు, సబ్ సెంటర్లో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, తల్లిబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సుచించారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రయోజనాలు గ్రామీణ ప్రజలకు సమర్థవంతంగా చేరేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలి.. న్యూశాయంపేట: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. తాగునీరు, వేసవి ప్రణాళికపై కలెక్టరేట్ సమావేశహాల్లో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 698 హాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 902 తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, చేతిపంపులు, బోరుమోటార్ల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా నీటి సరఫరా వ్యవస్థలు నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, మిషన్ భగీరథ ఈఈ నిర్మల, ఈఈ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మేడపల్లిలో పీహెచ్సీ తనిఖీ -
సంగీతం శ్యాసకు వ్యాయామం
నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతున్నా. సంగీతం శ్వాసకు వ్యాయామం వంటిది. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం సంగీతం క్లాస్కు వెళ్తాను. సంగీతం మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. పనిఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కుటుంబ బంధాలు మెరుగుపడుతాయి. విశ్వాసం, శాంతి పెరుగుతుంది. – డాక్టర్ జ్యోతి హరికీర్తి, మెడికల్ ఆఫీసర్ అనంతలక్ష్మి వైద్య కళాశాల, వరంగల్ అలసటను పారదోలే మార్గం.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అలసట నివారణకు సంగీతం సహాయపడుతుంది. ప్రశాంత సంగీతం కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్మాత్మికత, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. కచేరీలు, ప్రదర్శనల ద్వారా సమాజం పరిచయమవుతుంది. – గాట్ల భార్గవి, మెడికో, కాకతీయ వైద్య కళాశాల ● -
– హన్మకొండ కల్చరల్
సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. – ఇటీవల హనుమకొండలో జరిగిన సంగీతోత్సవంలో కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వయోలిన్ ప్రదర్శన ఇచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు. వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్, సితార్, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్ యన్.సుధీర్కుమార్.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం. సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల -
రేపటి నుంచి కొమ్మాలలో బ్రహ్మోత్సవాలు
● 27న లక్ష్మీనృసింహస్వామి కల్యాణం ● మార్చి 3వ తేదీ రాత్రి నుంచి జాతర, 7న రథోత్సవం గీసుకొండ: జిల్లాలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవం ప్రారంభం, 24న సాయంత్రం ప్రబంధ సేవాకాలం, 25న రాత్రి పరమపదోత్సవం, 26న అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. 27న రాత్రి 10 గంటలకు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 28 నుంచి మార్చి 2 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసి వేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత జాతర, బండ్లు తిరగడం, దర్శనాలు ఉంటాయని వివరించారు. మార్చి 7న స్వామివారి రథోత్సవం, ఉగాది వరకు జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు.. ● గుట్టచుట్టూ మూడు చోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలతో పనులు పూర్తి. ● రూ.25 లక్షల నిధులతో గుట్టవద్ద సైడ్ కాల్వలు, రోడ్లకు మొరం పోసి చదును చేసే పనులు చేపట్టారు. ● ప్రస్తుతం రూ.1.45 కోట్ల నిధులతో 800 మీటర్ల పొడవులో ప్రధాన రహదారి విస్తరణ, నిర్మాణం. ● రూ.10 లక్షలతో గుట్ట చుట్టూ ప్రభబండ్లు తిరగడానికి 30 అడుగుల వెడల్పుతో సుమారు 350 మీటర్ల మేర మొరం పోసే పనులు కొనసాగుతున్నాయి. ● రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆలయ ప్రధాన మండపం విస్తరణ, నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశారు. మంజూరు ఉత్తర్వులు గత సెప్టెంబర్ 28న వెలువడగా పనులు చేపట్టాల్సి ఉంది. ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు.. ● గుట్టచుట్టూ మాడవీధుల తరహాలో రూ.2 కోట్ల నియోజకవర్గ రూరల్ రోడ్స్(సీఆర్ఆర్) నిధులతో రింగ్రోడ్డు నిర్మాణం. ● గుట్ట నుంచి నాచినపల్లి రోడ్డును 600 మీటర్ల మేర నిర్మించడానికి రూ.కోటి నిధుల మంజూరుకు ప్రతిపాదన. ● భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్లు, వసతిగృహాల నిర్మాణం, కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలి. ఆలయ అభివృద్ధి కోసం మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. నిధుల దుర్వినియోగంపై డీపీఓకు ఫిర్యాదుదుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారని సర్పంచ్ పెండ్యాల రాజు డీపీఓ కల్ప నకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ముక్కెర ఆనంద్ రూ.3.90 లక్షల నిధులను పంచాయతీ సాధారణ నిధికి జమ చేయలేదని పేర్కొన్నారు. 4 సెప్టెంబర్ 2025 వరకు నాచినపల్లి కార్యదర్శిగా పనిచేసి డిప్యుటేషన్పై చింతలపల్లికి వెళ్లాడన్నారు. ఇప్పటివరకు నిధులు జమచేయలేదని, అతడిపై చర్య తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో కోరారు. -
ఇష్టంగా నేర్చుకోవాలి..
యువతకు, పెద్దవారికి సంగీతం, నృత్య కళలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు చేస్తూ.. సాయంత్రం వేళలో హాజరవుతున్నారు. కళల్లో రాణించాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. మా నాన్న నౌడ్గడ హనుమంతరావు ఇక్కడ అధ్యాపకులుగా బోధించారు. నేను ఇక్కడే వయోలిన్ వాయిద్యం కోర్సులో శిక్షణ పొందాను. ప్రస్తుతం నేను కళాశాలకు 11వ ప్రిన్సిపాల్ని కావడం సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాల్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరికొందరు గురుకులాల్లో ఉద్యోగాలు పొందారు. – నౌడ్గడ సుధీర్కుమార్, విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ -
గుడిసెల తొలగింపు వినయ్భాస్కర్ పనే..
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ చౌరస్తా: భద్రకాళి ఆలయ మాడవీధుల అభివృద్ధిలో భాగంగా.. ఆలయ ప్రాంగణంలో ఉన్న దళితుల గుడిసెలను తొలగించేందుకు ఆజ్యం పోసిందే మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని 4వ డివిజన్ యాదవనగర్లోని కమ్యూనిటీహాల్లో శుక్రవారం ఆయన స్థానికులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గుడిసెలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వినయ్భాస్కర్ చేస్తున్న ఆరోపణలు, రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఆదేశాలతో ఫిబ్రవరి 14, 2023న దళితుల గుడిసెలను తొలగించాలని తీర్మానం చేశారన్నారు. దళితులను మోసం చేసి వారి గుడిసెల తొలగింపునకు పూనుకున్నది మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కరేనని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గుడిసెవాసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి న్యాయం చేస్తోందన్నారు. -
సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు
● అదనపు కలెక్టర్ రవి వేలేరు: తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్స్ జారీలో జ్యాపం చేయొద్దని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, కేజీబీవీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి, పలు సర్టిఫికెట్ల పెండింగ్ వివరాలు, సాదాబైనామా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ మొదలైన వాటి వివరాల స్టేటస్లు తహసీల్దార్ కోమిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో భోజనం, స్టాక్ రిజిస్టర్, కంప్లైంట్ బాక్స్లను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్ట్రర్, మందులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, పీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ నవీన్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జ్ఞాపకం మిగిలింది
వరంగల్ జూపార్కులో జీవిడిచిన తెల్లపులిన్యూశాయంపేట: గర్జనలతో పర్యాటకుల మది దోచిన శరణ్ (తెల్లపులి) మరణంతో జూపార్కులో వెలితి కనిపిస్తోంది. గంభీరమైన చూపులతో కట్టిపడేసే పులిని చూసేందుకు కాకతీయ జూ పార్కుకు పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు పులి లేదని తెలిసి సందర్శకులు అనాసక్తి చూపుతున్నారు. పార్కులోని ఎన్క్లోజర్ బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. పులి లేక పోవడంపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యమిదే.. వరంగల్ జూపార్కుకు గతేడాది జూలైలో హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న తెల్లపులి(శరణ్)ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూలో పులి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ధాప్యంతో పాటు అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్య సమస్యల కారణంగా.. ఈనెల 3న తెల్లవారుజామున మరణించిందని జూ అధికారులు చెబుతున్నారు. పులి మరణం కేవలం వృద్ధాప్యం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సరైన అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ లేకనే పులి మరణించిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.పులి లేకపోవడంతో జూ పార్క్ ఆదాయంపై ప్రభావం పడుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి వచ్చే జూ పార్క్ సందర్శకులు టికెట్ కౌంటర్ వద్దే పులి ఉందా? అని అడిగి లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. పులి లేదనడంతో పెదవి విరుస్తున్నారు. కేంద్ర జూ అథారిటీ నిబంధనలు ఇతర సాంకేతిక కారణాల వల్ల కొత్తగా పులిని తీసుకురావడంలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇతర జూ పార్కుల నుంచైనా పులిని తెచ్చే ప్రయత్నాలు వేగవంతం చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. జూపార్క్లో గడ్డి తింటున్న దుప్పులు, నీటిలో తేలియాడుతున్న మొసళ్లు, వివిధ రకాల పక్షులు, జంతువులు సందడి చేస్తున్నా... పార్క్కు అసలైన అందం తెచ్చే పులి లేని జూ కళ తప్పిన బొమ్మలా కనిపిస్తుందని పర్యాటకులు వాపోతున్నారు. ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు వెంటనే పులులను తీసుకొచ్చి జూ కి పూర్వ వైభవం తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్న సందర్శకులు పర్యవేక్షణ లేకనే మరణించిందని విమర్శలు -
తిరిగి పంపించారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇన్చార్జ్ ఎఫ్ఏఓగా బదిలీపై వచ్చిన మధుసూదన్ను భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ తిరిగి పంపించారు. ‘అవినీతి అధికారికి అందలం’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయాలని మధుసూదన్ను కలెక్టర్ ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్ అయిన ఎఫ్ఏఓను జిల్లాకు బదిలీ చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనిని జిల్లాలో జాయిన్ చేసుకోకుండా తిరిగి పంపించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. దీంతో డీఈఓ రాజేందర్ సదరు ఎఫ్ఏఓను రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఎస్ఓ, అకౌంటెంట్స్, పలువురు అధికారులు, సిబ్బంది అనందం వ్యక్తంచేశారు. కలెక్టర్ ఇదే విధంగా స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఎఫ్ఏఓ వ్యవహారంపై కలెక్టర్ మండిపాటు -
అవినీతి.. వ్యవస్థీకృతం
హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో ఈ భవనాన్ని 2002 సంవత్సరంలో నిర్మించారు. జీప్లస్ 1కు అనుమతి తీసుకున్నారు. అదనంగా మరో అంతస్తు నిర్మించారు. ఇప్పటి వరకు రివైజ్డ్ చేయలేదు.. ఇలా నగరంలో వేలాది భవనాలు రివైజ్డ్ చేయకపోవడంతో వరంగల్ మహానగర పాలకసంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వరంగల్ అర్బన్: కంచె చేను మేసిన చందంగా వరంగల్ మహానగర పాలకసంస్థ పన్నుల విభాగం సిబ్బంది ఖజానాకు చేరాల్సిన సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. నిబంధనలు విస్మరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అనుమతులు ఉంటే ఒక రేటు.. లేకుంటే మరో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. టౌన్ప్లానింగ్, పన్నుల విభాగం, ఇంజనీరింగ్ సెక్షన్ ఇలా అన్నింట్లో అవినీతి వ్యవస్థీకృతమైంది. బల్దియాలోని అన్ని విభాగాల్లో కాకిలెక్కలే ఆధారమవుతున్నాయి. విధానపరమైన వాస్తవాలు దూరంగా ఉన్నాయి. నగరంలోని ఇళ్లు, వాణిజ్య భవనాల అసెస్మెంట్లు 2 లక్షల పైచిలుకు ఉన్నాయి. కానీ, 60 శాతం ఇళ్లకు మాత్రమే అనుమతులున్నాయి. అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే కోట్ల రూపాయల అదాయం వస్తుంది. పర్సంటేజీలతో పన్నుల విభాగం.. కనిపించిన నిర్మాణం నుంచే ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటి అనుమతి ఉన్నా, లేకున్నా పన్ను మదింపు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. అనుమతి ఉంటే సరాసరి పన్ను విధిస్తున్నారు. లేకుంటే 100 శాతం అదనపు పన్ను బాదుతున్నారు. కొత్తగా ఇంటినంబర్ కావాలంటే అనుమతి ఉంటే రూ.2 వేలు, లేకపోతే రూ.వేలల్లో ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు పేర్కొంటున్నారు. లేదంటే అనుమతులు, వాణిజ్యపరమైన అంశాలను ప్రస్తావిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా వరంగల్ మహానగర పాలకసంస్థ ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పందించి అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టేబుల్ టెన్నిస్లో సీపీకి కాంస్య పతకం
వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు జితేందర్రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించారు. కమిషనరేట్ హాకీ జట్టుకు కాంస్య పతకంరామన్నపేట: హైదరాబాద్లో జరుగుతున్న రాష్ట్ర పోలీసుల తెలంగాణ స్టేట్ నాలుగో మీట్లో కమిషనరేట్కు చెందిన హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఆర్ఐ ఉదయభాస్కర్ నాయకత్వంతో పాల్గొన్న ఈ జట్టు కాంస్య పతకం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. రామన్నపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులు 31 డిసెంబర్ 2025 నాటికి 30 సంవత్సరాల వయస్సు, 10 సంవత్సరాల అనుభవం, చేనేత డిజైనర్లు 31 డిసెంబర్ 2025 నాటికి 25 సంవత్సరాల వయస్సు, 5 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల చేనేత కార్మికులు 31 మార్చి 2026 లోగా ఆయా జిల్లాల చేనేత, ఔళి శాఖ సహాయ సంచాలకులకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎంపికై న వారికి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు http://handtex.telangana. gov.in సంప్రదించాలని సూచించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ సెనేట్హాల్లో ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ వార్షిక సెషన్ నిర్వహించనున్నారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, విశిష్ట అతిథిగా కేయూవీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సోషల్ సైన్స్ డీన్ సురేశ్లాల్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వెంకటరాజం తదితరులు హాజరుకానున్నారు. దివంగత ప్రొఫెసర్ బొబ్బిలి, సరోజనీ రేగాని, దీపక్ కుమార్ స్మారకోపన్యాసాలు ఉంటాయని లోకల్ సెక్రటరీ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన డీసీఓ, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కంచర్ల వందనగౌడ్ తెలిపారు. మూడు బృందాలు శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ చర్యల తీరును పరిశీలించాయి. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థినులతో మాట్లాడారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, శ్రీనివాసనగర్లోని అంగన్వాడీ కేంద్రం, మల్లికాంబ మనోవికాస కేంద్రం, కంచర కుంటలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అధికారులు తదితరులున్నారు. -
బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి
వరంగల్ లీగల్: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనపై తల్లిదండ్రులు, ప్రజలు, పిల్లలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ షేర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి పార్రంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అపర్ణదేవి మాట్లాడుతూ చిన్నారులకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్ను అందించడం మనందరి బాధ్యతని, బాల్య వివాహాలు చేసిన వారికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. హనుమకొండ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ఇన్చార్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం, షేర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ శిరీష, కమ్యూనిటీ మొబిలైజర్స్ జ్ఞానేశ్వరి, జమున చామంతి, జగన్, కల్పన, ప్రశాంతి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ న్యాయమూర్తి అపర్ణదేవి -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను బోర్డు నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,210 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో 793 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,356 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 807 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 92402 05555కు ఫోన్ చేయాలని సూచించారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల పాల్గొన్నారు. -
చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
పదవీ బాధ్యతలు స్వీకరించిన నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ నర్సంపేట: నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్పర్సన్గా ఎన్నికై న పాలకుర్తి సారంగపాణి, నేనావత్ షీబారాణితో మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు శుక్రవారం పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకోలేదన్నారు. ఎమ్మెల్యే సహకారంతో సుపరిపాలన అందిస్తామని చెప్పారు. ఆకేరు వాగు చెక్డ్యాం పనుల పరిశీలన ఆకేరు వాగుపై రూ.65 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడంతో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్కుమార్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఉద్యాన పంటలకుఅమ్ముకోలేక.. పారబోయలేక మార్కెట్లో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఓ రైతు కొత్తగూడ మండలకేంద్రంలో ఉచితంగా పంచిపెట్టారు. ఖిలా వరంగల్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఉద్యాన పంటలు సాగు చేసేలా పలు రకాల వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రాయితీపై అందజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమం సాగుతోంది. వరి, పత్తి సోయాబిన్ వంటి పంటలే కాకుండా కూరగాయలు, పండ్లు, పూల సాగుపై కర్షకులకు ఆసక్తి కలిగించేందుకు ప్రభుత్వం రాయితీ యూనిట్లను మంజూరు చేసిందని వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ఆర్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50శాతం, ఇతరులకు 40శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. సబ్సిడీపై యంత్ర పనిముట్లు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు వ్యవసాయ యాంత్రీకరణ పరిధిని పెంచడం కోసం, హైటెక్, అధిక విలువ గల వ్యవసాయ పరికరాల కోసం కేంద్రాలను సృష్టించడం, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను కొనుగోలు చేయడానికి రైతులకు ఆర్థిక సాయాన్ని ఉద్యానశాఖ అందిస్తోంది. ప్రధానంగా యూనిట్ ధర మొత్తం రూ.4.90 లక్షల విలువైన మినీ ట్రాక్టర్లు, రూ.2 లక్షల విలువైన పవర్ టిల్లర్లు, రూ.1.50 లక్షల విలువైన కలుపు తీసేయంత్రం (పవర్ వీడర్), రూ.5 వేల విలువైన గడ్డి కోత యంత్రాలు (బ్రష్ కట్టర్ (ఎలక్ట్రిక్, ఇంజిన్ పవర్డ్), మొక్కల సంరక్షణ పరికరాలు రూ.2 వేల విలువైన తైవాన్ స్ప్రేయర్లు (పవర్డ్ నాఫ్శాక్ స్ప్రేయర్, ఆపరేటెడ్ స్ప్రెయర్), కూరగాయలు పెట్టుకునే ప్లాస్టిక్ బుట్టలు వంటి పరికరాలను సంబంధిత అధికారులు అందజేస్తారు. నేరుగా రైతు ఖాతాలోకి సబ్సిడీ దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపికై న రైతు తొలుత తన సొంత డబ్బులు పెట్టి వ్యవసాయ పరికరం లేదా యంత్రం కొనుగోలు చేయాలి. వాటి జీఎస్టీ సహిత బిల్లును జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ కార్యాలయంలో ఈనెల 28లోగా సమర్పించాలి. రైతు కొనుగోలు చేసిన రాయితీ యూనిట్ను పరిశీలించి ప్రభుత్వ ఖజానా నుంచి రాయితీ డబ్బులు నేరుగా సదరు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సమగ్ర ఉద్యాన మిషన్ పథకం, రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోలు వివరాల కోసం జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు 89777 14055 నంబర్లో సంప్రదించాలి. అలాగే, డివిజన్ పరిధి అధికారులు వరంగల్ 89777 14060, వర్ధన్నపేట 89777 14059, నర్సంపేట 89777 14061, నెక్కొండ 89777 14053 నంబర్లలోనైనా సంప్రదించవచ్చు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి రాయితీపై పరికరాలు కోసం రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా పాస్బుక్ జిరాక్స్ ప్రతులు జతచేసి ఈనెల 28లోపు వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ కల్పించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకున్న రైతులకు మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, స్ప్రేయర్లను సబ్సిడీపై అందించనున్నాం. ఆసక్తి గల రైతులు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం రాయితీపై యంత్రాలు, పరికరాలు 28లోపు దరఖాస్తు చేసుకోవాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు పంటలు విస్తీర్ణం (ఎకరాల్లో) పూలు 80 అరటి 470 మామిడి 5,750 ఆయిల్పామ్ 6,200 మల్బరీ 148 మిర్చి 2,000 పసుపు 800 కూరగాయలు 1,065 -
ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి
దుగ్గొండి: పాఠశాలలోని ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించేలా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రతీ చెట్టుకు పేరుపెట్టి క్యూఆర్ కోడ్ లేబుల్ వేయాలని చెప్పారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, నూతన వంటశాల, భోజనశాల, ల్యాబ్, గ్రంథాలయం, క్రీడా పరికరాలు, మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన వంటశాలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రస్తుత వంటశాలను అంగన్వాడీ సెంటర్కు అప్పగించాలని సూచించారు. పాఠశాల నిర్వహణలో వెలుగులోకి వచ్చిన లోపాలను వెంటనే సరిచేసి వారం రోజుల వ్యవధిలో ఫొటోలతో కూడిన నివేదికను అందించాలని హెచ్ఎం ఎలగొండ రామస్వామిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
● పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి ● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులుగీసుకొండ: పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత సూచించారు. మండలంలోని గొర్రెకుంట జెడ్పీ ఉన్నత, అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల, పోతరాజుపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలను వారు శుక్రవారం సందర్శించారు. అనంతరం ధర్మారం జెడ్పీ పాఠశాల కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, బడికి రాని పిల్లలను బడిలో చేర్పించాలని, బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. కాగా, తమకు నెలల తరబడి బిల్లులు రావడం లేదని కమిషన్ సభ్యుల ఎదుట వంట ఏజెన్సీ నిర్వాహకులు వాపోయారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, బాలల సంక్షేమ సమితి సభ్యులు షాహిదాబేగం, సంపత్, సుజాత, మధు, సీడీపీఓ విద్య, డీసీపీఓ ఉప, ఎంఈఓ రవీందర్, కాంప్లెక్స్ హెచ్ఎం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్మారావుపేటలో మధ్యాహ్న భోజనం తనిఖీ ఖానాపురం: మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోని హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్న భోజన రాష్ట్రస్థాయి బృందం సభ్యులు శ్రుతి, ఏసుబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ, భోజన అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటోంది.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. కాగా, తమకు వేతనాలు పెంచాలని మధ్యాహ్న వంట కార్మికులు తనిఖీ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చరణ్సింగ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ సత్యశారదవరంగల్: మిర్చి సీజన్ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్కు వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మార్కెట్ను ఆమె శుక్రవారం సందర్శించి మిర్చి యార్డులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో నేరుగా మాట్లాడుతూ 49 కిలోల లోపు మిర్చి బస్తాలను మాత్రమే తీసుకురావాలని సూచించారు. 49 కిలోల కంటే ఎక్కువ ఉంటే కాయలో నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున ధరల్లో వ్యత్యాసం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయమై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటూ మార్కెట్లో కరపత్రాలతో పాటు ఇతర మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని మార్కెట్ కార్యదర్శికి సూచించారు. రైతులకు ఇతర మార్కెట్లలో ధరలు తెలిసే విధంగా డిస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రైతుల కోసం ఏనుమాముల మిర్చి యార్డులో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ధాన్యం – అపరాల యార్డులో కమీషన్ వ్యాపారస్తుల కోసం నిర్మిస్తున్న షాపుల నిర్మాణ పనులు, ఏనుమాముల మార్కెట్లో చైల్డ్ లేబర్ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి కోరారు. కార్యక్రమంలో డీఎంఓ కె.సురేఖ, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేషం, గ్రేడ్ –2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్రావు, తహసీల్దార్ శ్రీకాంత్, చాంబర్ ప్రతినిధులు సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, లింగారెడ్డి, రాజేష్ డి కరాణి, వెల్ది సాంబయ్య పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్తో కలిసి అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్రోడ్డుకు భూసేకరణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ఫేస్–1లో పూర్తైన పనుల పురోగతిని పరిశీలించి ఫేస్ –2లో రోడ్ల నిర్మాణానికి భూ సేకరణను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కుడా సీపీఓ అజిత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన బాలల పరిరక్షణ సభ్యులు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, గోగుల సరిత, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, సభ్యులు సుజాత, రామలీల, డీవీపీఓ ఉమ, తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ హనుమకొండ, వరంగల్ జంట నగరాల్లో అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగానికి చెందిన నిర్వాహకులు ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్ను స్థాపించారు. ఈ మేరకు అసోసియేషన్ లోగోను వరంగల్ కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా కలెక్టరేట్లో శుక్రవారం ఆవిష్కరించారు. విదేశీ విద్య, ఇమిగ్రేషన్ సేవలను మరింత పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సంఘం స్థాపించినట్లు బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడెపు మధుసూదన్, మనోజ్, నితీష్, శివ, వినయ్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లు పాలనపై అవగాహన పెంచుకోవాలి
● చట్టాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి ● అదనపు కలెక్టర్ సంధ్యారాణి గీసుకొండ: సర్పంచ్లు గ్రామపంచాయతీల పాలనపై అవగాహన కలిగి ఉండాలని, పంచాయతీరాజ్ చట్టం –2018కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మండలంలోని గంగదేవిపల్లిలో దుగ్గొండి, రాయపర్తి, ఖానాపూర్, నర్సంపేట మండలాల సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె శుక్రవారం పాల్గొని మాట్లాడారు. సర్పంచ్లు తమ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఎల్పీఓ రాజీవ్కుమార్, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓలు పాక శ్రీనివాస్, కూచన ప్రకాశ్, సునీల్కుమార్ రాజు, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరెపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారులు ఆరెపల్లి గ్రామం రాష్ట్రస్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికై జాతీయ అవార్డు కోసం కేంద్రానికి నామినేట్ అయిన విషయం తెలిసిందే. త్వరలో కేంద్ర బృందం ఈ గ్రామాన్ని సందర్శించనుంది. ఈ మేరకు గ్రామాన్ని ఆరెపల్లిని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన శుక్రవారం సందర్శించారు. -
బంజారాలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: బంజారాలకు రిజర్వేషన్ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ సత్యశారద ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ బంజారా బిడ్డలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి జీవితాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వెలుగులు నింపారని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లుగాక ఎస్టీలకు ప్రత్యేకంగా మరో 250 ఇళ్లు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణ రెడ్డి, సేవాలాల్ ఉత్సవ సమితి చైర్మన్ గోపాల్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
కొమ్మాల ఆలయాభివృద్ధికి కృషి
● రూ.2 కోట్లతో గుట్ట చుట్టూ రింగ్రోడ్డు ● శాశ్వత కమిటీ ఏర్పాటుపై దృష్టి ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిగీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఈనెల 23 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమ్మాల ఆలయం వద్ద అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.కోటి నిధులతో ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు. గుట్ట చుట్టూ బండ్లు తిరగడానికి రింగ్ రోడ్డు కోసం రూ.2 కోట్లు, నాచినపల్లి రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం రూ.కోటి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. కాగా, ఆలయ ఈఓ ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున తీసుకొచ్చారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య, తహసీల్దారు రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, సీఐ విశ్వేశ్వర్, ఈఓ ప్రసాద్, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, ఫణి, విష్ణు, నందనాయక్ తండా సర్పంచ్ వీరేందర్, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ కొమురారెడ్డి, మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, నాయకులు వీరాటి రవీందర్రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు
సమకూరిన ఆదాయం రూ.1.49 కోట్లు ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజనల్ పరిశీలకుడు డి.అనిల్కుమార్ పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. 20 జనవరి 2026 నుంచి 19 ఫిబ్రవరి 2026 వరకు 30 రోజులకు హుండీల్లో రూ.38,73,858, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 రాగా, మొత్తం రూ.1,49,28,081 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ధర్మకర్తలు, కానిస్టేబుళ్లు రమేశ్, యస్మిన్, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
సెల్లార్.. బేజార్
పొంచి ఉన్న అగ్ని ప్రమాదాలు షాపింగ్ కాంప్లెక్స్ల్లోని సెల్లార్లను కొందరు తమ వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారు. మరికొందరు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వరంగల్ స్టేషన్రోడ్డు, చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్, జేపీఎన్ రోడ్డు, బట్టలబజార్ రోడ్డు, ఎంజీఎం రోడ్డు, అలంకార్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్, కాకాజీ కాలనీ, బస్స్టేషన్ రోడ్డు, విజయ టాకీస్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి క్రాస్ రోడ్డు, బాలసముద్రం రోడ్డు, పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ మీదుగా కాజీపేట తదితర ప్రాంతాల్లో వేలాదిగా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ల్లో నిర్మించిన సెల్లార్లు దుర్వినియోగమవుతున్నాయి. కనీసం ఫైర్ నిబంధనలు పాటించడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే పరిణామాలను పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. సంఘటన జరిగితే నోటీసులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఫైర్ సర్టిఫికెట్ రెన్యువల్ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారం అంతా బల్దియా టౌన్ప్లానింగ్, ఫైర్ అధికారులు, సిబ్బందికి తెలుసు. కానీ, కాసుల కోసం కుక్కర్తి పడి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్ చొరవ చూపించి నగరంలో జఠిలంగా మారిన ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సిటీప్లానర్ రవీందర్వాడేకర్ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. వరంగల్ అర్బన్: కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు ఉంది నగరం పరిస్థితి. నాలాలు, చెరువులు, ఖాళీ స్థలాలే కాదు.. చివరకు ప్రధాన రహదారుల్లోని ఫుట్పాత్లు, సెల్లార్లను ఆక్రమిస్తున్నారు. ఫుట్పాత్లపై ర్యాంపులు నిర్మించి బడాబాబులు ఆక్రమించి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను అద్దెకిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గత్యంతరం లేక రోడ్లపైనే ప్రజలు తమ వాహనాలను నిలుపుతున్నారు. మహా నగరంలో జనాభా తోపాటు వాహనాల రద్దీ పెరగడం, ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి జనం అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యే జఠిలం వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ప్రధాన రహదారుల్లో రద్దీ ఎక్కువైంది. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కాంప్లెక్స్ల్లోకి వచ్చే వారు సె ల్లార్లలో వాహనాలను పార్కింగ్ చేయాలి. అయితే పార్కింగ్ కోసం వదిలిన సెల్లార్లు మూతపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వెలిసిన దుకా ణాలు తొలగించాల్సిన నగరపాలక సంస్థ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీ పేట ప్రాంతాల్లో మొత్తం 430 వరకు సెల్లార్లు ఉన్నా యి. ఇందులో సగానికి పైగా కాంప్లెక్స్ల్లోని పార్కింగ్ ప్రదేశాలు వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నారు. 2009, 2013 సంవత్సరాల్లో అధికారులు అడపాదడపా కూల్చివేతలు చేసి వదిలేశారు. తిరిగి యఽథాస్థానాల్లో వెలిశాయి. దీంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సెట్బ్యాక్లు పట్టించుకోరు? ప్రధాన రహదారుల్లో వాణిజ్య నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపే ట ప్రాంతాల్లో సెట్ బ్యాక్ నిబంధలను 90 శాతాని కిపైగా ఉల్లంఘిస్తున్నారు. వాణిజ్య భవనాల కోసం ముందుకు బ్లూ ప్రింట్లో సెల్లార్లను చూపిస్తూ అనుమతి పొంది ఆతర్వాత ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 2 వరకు సెల్లార్ నిర్మించకపోయినా 2 మీటర్ల వరకు సెట్బ్యాక్ ఉండాలి. అడుగు స్థలం వదలకుండా రోడ్డు పైకి నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్ బ్యాక్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. రెండంతస్తుల నుంచి నాలుగైదు అనధికారిక అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. నగరంలోని షాపింగ్ కాంప్లెక్స్ల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు వ్యాపార కేంద్రాలుగా బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలాలు రహదారులపై వాహనాల నిలిపివేత పట్టించుకోని అధికారులు, పోలీసులు -
సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలి
ఆత్మకూరు: సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విద్యుత్ గ్రామంగా ఎంపిక చేసి గురువారం‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు గ్రామాన్ని పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగ గ్రామంగా రూపొందించుకుంటున్నామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లబ్ధిదారులు ఉచితంగా విద్యుత్ వినియోగించడంతోపాటు మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికే కొనుగోలు చేసి ఆదాయం పొందవచ్చన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. మోడల్ గ్రామంగా ఆత్మకూరును ఎంచుకోవడం సంతోషకరం అన్నారు. గ్రామ ప్రజలు సోలార్ విద్యుత్ను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ అందేలా అధికారులు పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, రూరల్ డీఈ మల్లికార్జున్, డీఎం మహేందర్రెడ్డి, ఏడీఈ దేవేందర్నాయక్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మోడల్ గ్రామం ఆత్మకూరులో ప్రారంభం -
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో విద్యార్థుల ప్రతిభ
కాళోజీ సెంటర్ : హైదరాబాద్ దోమలగూడలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో వరంగల్ జిల్లా నుంచి 24 మంది వివిధ రకాల స్పోర్ట్స్లో పాల్గొన్నారు. గేమ్స్ మీట్లో వరంగల్ ఎల్బీ నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మాసూమ్ అలి), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (మౌలాలి) ప్రాంగణంలోని భవిత కేంద్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వీరిలో మేడవాక వాగ్దేవి (డిస్కస్ త్రో), చంద్రగిరి రిషికేశ్(షాట్ పుట్) ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మాసూమ్ అలి) ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు కనకయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమలాకర్ శ్రీధరాచార్యులు, కిషన్, దేవేందర్, భాస్కర్, మౌలాలి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జోసెఫ్, ఉపాధ్యాయులు నవ్య, లావణ్య, భవిత సెంటర్ ఉపాధ్యాయులు సువర్ణ, స్వాతి పాల్గొన్నారు. -
పట్టు పురుగుల పెంపకంపై అవగాహన
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో పట్టు పురుగుల పెంపకంపై మహిళా రైతులకు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్డీఏ, సెరికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, దేవరుప్పుల మండలాల రైతులకు పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓ మేన శ్రీను హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో పెంట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, బస్సులు, తదితర ప్రాజెక్టులు మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టుపురుగుల పెంపకం ద్వారా అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో 200ల ఎకరాల్లో సాగు చేయడానికి కావల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకుని మందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంఐబీ దయాకర్, సెరికల్చర్ అధికారి వెంకన్న, సంజీవరెడ్డి, ఏపీఎం కవిత, సీసీలు హైమ, మమత తదితర మహిళా రైతులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు నేరం
● న్యాయమూర్తి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: బాల్య వివాహాలను అంతం చేసేందుకు చేసేందుకు ప్రతీ ఒక్కరు పనిచేయాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. ‘షేర్’స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని’ ప్రధాన న్యాయమూర్తి గురువారం వరంగల్ జిల్లా కోర్ట్ హాల్ ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వరంగల్ జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ‘షేర్’ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ప్రచా ర రథంపై ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేశారు. -
ఐనవోలు మల్లికార్జునుడి హుండీ లెక్కింపు
● సమకూరిన ఆదాయం రూ.1.49 కోట్లు ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజినల్ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. 20 జనవరి 2026 నుంచి 19 ఫిబ్రవరి 2026 వరకు 30 రోజులకు హుండీల్లో రూ.38,73,858, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 రాగా, మొత్తం రూ.1,49,28,081 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ధర్మకర్తలు, కానిస్టేబుళ్లు రమేశ్, యస్మిన్, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్ హౌజ్ తయారుచేసిన కస్టమైజ్డ్ ఆర్ట్ డిజైన్ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్ ఆర్ట్తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి సంస్థ యజమానులు ఓరుగంటి కార్తీక్, మోర రవళి అందజేసిన చీరను అమ్మవారికి అలంకరించారు. వరంగల్ లీగల్: బాల్య వివాహాలను అంతం చేసేందుకు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ జిల్లా కోర్ట్ హాల్ ఎదుట ‘షేర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని’ ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సంస్థ రూపొందించిన అవగాహన కరపత్రాలను వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ‘షేర్’ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ప్రచార రథంపై ఏర్పాటు చేసిన సంతకా ల సేకరణలో భాగంగా సంతకం చేశారు. కార్యక్రమంలో షేర్ ఎన్జీఓ జిల్లా కో–ఆర్డినేటర్ శిరీష, కమ్యూనిటీ మొబిలైజర్స్ జ్ఞానేశ్వరి, జమున, చామంతి, జగన్, కల్పన, ప్రశాంతి, గాయత్రి, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ విద్య ఇన్చార్జ్ ఆర్జేడీ, హనుమకొండ డీఐఈఓ గోపాల్ సీఎస్, డీఓలను ఆదేశించారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హనుమకొండ జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన 52 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై సూచనలిచ్చారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని వరంగల్, హనుమకొండ డీఐఈఓలు గోపాల్, శ్రీధర్ సుమన్ తెలిపారు. సమావేశంలో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు, హైపవర్ కమిటీ సభ్యులు శ్రీధర్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ మెంబర్లు కోటేశ్, సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్ : ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జి.అంజన్రావు జాయింట్ కమిషనర్గా పదోన్నతి పొందారు. కాగా, గురువారం హైదరాబాద్లోని ఎకై ్సజ్శాఖ కమిషనరేట్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో జాయింట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నూతన డీసీ నియమితులయ్యే వరకు ఇన్చార్జ్ డీసీగా అంజన్రావు కొనసాగనున్నారు. -
ఫాస్ట్.. ఫార్మర్ రిజిస్ట్రేషన్
హన్మకొండ: పారదర్శకంగా రైతులకు పథకాలు అందజేసేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని తీసుకొచ్చింది. ప్రతీ రైతు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు 11 అంకెల నంబర్ కేటాయిస్తారు. వ్యవసాయ సంబంధిత ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇది శాశ్వత గుర్తింపు సంఖ్యగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన రైతుల డిజిటల్ డేటాబేస్, ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల ఆధార్ నంబర్, భూమి, ఇతర వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ రిజిస్ట్రేషన్ అయిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఎలాంటి గందరగోళానికి తావు ఉండదు. వేర్వేరు పథకాల కోసం పదేపదే పత్రాలను సమర్పించే బదులు, ఈ ఒక గుర్తింపు నంబర్ సులభమార్గం అవుతుంది. రిజిస్ట్రీ చేసుకోకపోతే పథకాల నిలిపివేత.. ఫార్మర్ రిజిస్ట్రీ మోసాలు, నకిలీ ఎంట్రీల అవకాశాలను నివారిస్తుంది. ముఖ్యంగా చెల్లింపులో మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తాయి. రైతు రిజిస్ట్రీ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు పొందడంలో ఆలస్యం జరిగే అవకాశముంది. పీఎం కిసాన్ పథకం వంటి చెల్లింపుల వాయిదాల్లో ఆలస్యం కావడం లేదా నిలిపేసే అవకాశముంది. ఈ క్రమంలో రైతు రిజిస్ట్రీ తప్పనిసరి. రైతు రిజిస్ట్రీ కోసం ఆధార్కార్డు నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్ అవసరం. ఇప్పటి వరకు రైతు వేదికలు, మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో జరిగిన రైతు రిజిస్ట్రీ ప్రక్రియ ఇప్పుడు గ్రామాల్లోనే చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాలకు చేరుకుని రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈ నెల 28 వరకు రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వేగంగా ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం రైతులు 1,57,057 ఉండగా.. ఇప్పటివరకు 92,591 మంది రైతులు నమోదు చేసుకున్నారు. రైతు రిజిస్ట్రీతో బహుళ ప్రయోజనాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రఽభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చు. రైతు వివరాలు కచ్చితంగా నమోదు చేసుకుంటే పారదర్శకతకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సహాయానికి ఫార్మర్ గుర్తింపు నంబర్ తప్పనిసరి. పంటల బీమా, రుణాలు, ఇతర ప్రభుత్వ ప థకాలు త్వరగా అందుతాయి. నగదు బదిలీ సా యం నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి.. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవడం తప్పనిసరి, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ రిజిస్ట్రీ అవసరం. రైతు కేంద్రీకృత సేవలకు బలమైన డిజిటల్ పునాదిని వేయడానికి ప్రభుత్వం అగ్రిస్టాక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టింది. గ్రామాల్లో వ్యవసాయ విస్తరాణాధికారి ద్వారా రైతు నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ప్రతీ రైతు విధిగా తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ నెలతో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. – రవీందర్సింగ్, జిల్లా వ్యవసాయాధికారి గ్రామాల్లో ఈనెల 28 వరకు ప్రక్రియ పూర్తి జిల్లాలో మొత్తం రైతులు 1,57,057 మంది ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు 92,591 మంది -
వెబ్సైట్లో ఇంటర్ హాల్టికెట్లు
కాళోజీ సెంటర్: ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్టికెట్లను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురువారం వెబ్సైట్లో నమోదు చేసినట్లు వరంగల్ ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ గురువారం తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లు వారి కాలేజీ లాగిన్ ఐడీతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్ టైమ్లో ఇచ్చిన రిజిస్టర్ మొబైల్కి హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఎస్ఎంఎస్ ద్వారా పంపించినట్లు వివరించారు. ఆ లింక్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 15రోజుల వ్యవధిలో తల్లి, కుమారుడి మృతి దుగ్గొండి: 15 రోజుల వ్యవధిలో తల్లి కుమారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నాచినపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కత్తుల లచ్చమ్మ(80) 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. 4 రోజుల క్రితం కర్మకాండలు పూర్తి చేశారు. ఇదే క్రమంలో ఆమె కుమారుడు కత్తుల గట్టుమల్లు(50) తల్లి చనిపోయిన నాటినుంచి తీవ్ర బాధలో ఉండేవాడు. నిరంతరం తనతల్లితో గడిపిన గుర్తులు, కష్టాల్లో అండగా నిలబడ్డ విధానాన్ని తలచుకుంటూ నిత్యం మదనపడ్డాడు. ఈక్రమంలో గురువారం ఉదయం అకస్మాత్తుగా చతికిలబడి మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో తల్లి కుమారుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్పోర్ట్స్ మీట్లో పతకాలు సాధించిన చందులాల్పర్వతగిరి: హైదరాబాద్లో రెండ్రోజులుగా జరుగుతున్న నాల్గో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్లో మండలానికి చెందిన పలువురు పోలీసులు ప్రతిభ చాటారు. సీత్యాతండాకు చెంది న గుగులోతు చందూలాల్ 6 పతకాలు సాధించి మండల కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేశారు. ఆయన ఆర్చరీ పోటీల్లో రికర్వ్ విభాగంలో భాగంగా 70 మీటర్ల పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. అలాగే 50, 30 మీటర్ల పోటీల్లో సిల్వర్ పథకాలు, ఓరల్ విభాగంలో ఓరల్ గోల్డ్, ఎలిమినేషన్ విభాగంలో బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. చందూలాల్ ప్రస్తుతం ఖమ్మంలోని 15వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే తండాకు చెందిన జి.సుమన్, కల్లెడకు చెందిన ముంజాల రాజేశ్ టీం ఎలిమినేషన్ రౌండ్ విభాగంలో సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నారు. రాజేశ్, సుమన్ వరంగల్ మామునూరులోని నాల్గో బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలి ఆత్మకూరు: సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విద్యుత్ గ్రామంగా ఎంపిక చేసి గురువారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూ రు గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగ గ్రామంగా రూపొందించుకుంటున్నామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. మోడల్ గ్రా మంగా ఆత్మకూరును ఎంచుకోవడం సంతోషకరం అన్నారు. గ్రామ ప్రజలు సోలార్ విద్యుత్ ను సక్రమంగా వినియోగించుకోవాలని కోరా రు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ అందేలా అధికారులు పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి, ఎంపీడీఓ శ్రీని వాసరెడ్డి తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎస్ఈ మధుసూదన్, డీఈ మల్లికార్జున్, డీఎం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
● కలెక్టర్ సత్యశారదకాళోజీ సెంటర్ : జిల్లాలో టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సత్యశారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఎఫ్ఆర్ఎస్ తప్పనిసరి అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ రోజువారీగా నివేదికలు స్క్రూటినీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ విద్యసంవత్సరం ఉత్తీర్ణత పెంచేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 288 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వీటిల్లో పదో తరగతి చదువుతున్న 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పీఎం శ్రీ స్కూళ్ల పనులు పూర్తి చేయాలి జిల్లాలోని 16 పీఎంశ్రీ స్కూళ్లలోని విద్యార్థుల అవసరాలకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను ప్రణా ళికబద్దంగా ఖర్చు చేసి స్కూల్స్ను ఆధునికీకరించాలని కలెక్టర్ సత్యశారద ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. ఇంజనీరింగ్ పనులు పెండింగ్ ఉంటే పూర్తి చేయాలని టీడబ్ల్యూఈఐడీసీ ఈఈ అరుణ్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి గారే కృష్ణమూర్తి, ఏఎంఓ ఉండ్రాతి సుజన్తేజ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అరుణ, జీసీడీఓ ప్లోరెన్స్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ కట్ల శ్రీనివాస్, ప్లానింగ్ ఆఫీసర్స్ విజయ్కుమార్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలిన్యూశాయంపేట: మిర్చి నాణ్యతపై రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మిర్చి సీజన్ ప్రారంభ నేపథ్యంలో ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి రాబడులు, నాణ్యత, ధరల పరిస్థితిపై గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధరలు నమోదు అవుతున్నప్పటికీ తేమతో కూడిన మిర్చి తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశీ వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదన్నారు. రైతులు ధర కోల్పోకుండా నాణ్యతపై దృష్టిపెట్టాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో డీఏఓ అనురాధ, హార్టీకల్చర్ అధికారి శ్రీనివాస్రావు, మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేషం, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కొమ్మాల జాతర పోస్టర్ ఆవిష్కరణ
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర పోస్టర్లు, కరపత్రాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో గురువారం రాత్రి ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 9 బ్రహ్మోత్సవాలు వరకు నిర్వహిస్తామని, ఈ నెల 27న స్వామివారి కల్యాణం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ కొమురారెడ్డి, మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు కూసం రమేశ్, దూల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతర నిర్వహణపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడటానికి ఆలయం వద్ద సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ వెల్లడించారు. -
భవితకు ‘ఆదర్శ’మార్గం
సంగెం: ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆదర్శ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆంగ్ల మాద్యమంలో విద్యనందించి ఉత్తమంగా తీర్చిదిద్దుతోంది. దీంతో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి మెరిట్ మార్కుల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద మంది విద్యార్థులకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో గవిచర్ల, వంచనగిరి, అమీనాబాద్, పర్వతగిరి, బుధరావుపేట, నెక్కొండలో 2013లో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. దరఖాస్తులు ఇలా.. ఆరో తరగతితోపాటు ఇతర తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వెట్సైట్ http://telanganams.cgg.gov. in లో విద్యార్థుల ఆధార్కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్, పాస్పోర్టు సైజ్తో దరఖాస్తులు చేసి పత్రాలను సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు అందజేయాల్సి ఉంటుంది. ఓసీలు రూ.200, బీసీ, ఎస్సీ,ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హాల్టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 19వ తేదీన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానం.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అబ్జెక్టివ్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు.. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఐదో తరగతి సిలబస్, మిగతా తరగతుల విద్యార్థులకు ప్రస్తుతం చదువుతున్న తరగతుల నుంచి తెలుగు, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు 50, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 35 మార్కులు సాధిస్తేనే పాస్గా పరిగణిస్తారు. రిజర్వేషన్లు.. ప్రతీ తరగతిలో 15 శాతం ఎస్సీలకు, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, (బీసీ ఏ–7, బీ–10, సీ–1, డీ–7, ఈ–4శాతం), దివ్వాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. ని ర్ధేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేని పక్షంలో ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం ఇతర కులాలకు ఓపెన్ కేటగిరీలో నిర్ధేశించారు. మండలానికే తొలిప్రాధాన్యం 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాం. 7 నుంచి 10వ తరగతిలో ఖాళీ సీట్లు కూడా భర్తీ చేస్తాం. ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం లభిస్తున్నది. ఆంగ్ల మాద్యమంతో విద్యార్థుల భవిష్యత్ బాగుంటుంది. మండల పరిధిలోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత. లోకల్ వారు లేకుంటే ఇతర మండలాల వారికి అవకాశం కల్పిస్తాం. – ప్రసన్నలక్ష్మి, ప్రిన్సిపాల్, గవిచర్ల మోడల్ స్కూల్ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పెరుగుతున్న పోటీ ఈనెల 28వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష 6నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం జిల్లాలో 6 మోడల్ స్కూళ్లుమోడల్ స్కూల్ ప్రత్యేకతలు.. 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమంలో డిజిటల్ బోధన, ఉత్తమ ఫలితాల సాధన పక్కా భవనంలో సరిపడా తరగతి గదులు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అనుభవజ్జులైన ఉపాధ్యాయులతో బోధన విశాలమైన ఆటస్థలం, సెన్స్, కంప్యూటర్ ల్యాబ్తోపాటుగా లైబ్రరీ సదుపాయం అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా రోబోటిక్స్లో ప్రత్యేక శిక్షణ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ నాణ్యమైన పౌష్టికమైన మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్ 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాల కోసం ప్రత్యేక శిక్షణ పదో తరగతి విద్యార్థులకు ఎన్టీఎస్ఏకు ప్రత్యేక శిక్షణ తరగతులు వృత్తివిద్యా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యూటీషన్ కోర్సుల్లో శిక్షణ విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడా, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణ పదో తరగతి, ఇంటర్మీడియట్ అమ్మాయిలకు హాస్టల్ వసతి -
ఎంత ఖర్చు చేసినా గెలవకపాయె!
సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు చేసి ఓడిపోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కక్కలేక మింగలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో పదవులు దక్కించుకోవాలన్న ఆతృతతో ఉన్న ప్లాట్లు, భూములు అమ్మి వచ్చిన డబ్బులతోపాటు అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వెళ్లి అడుగుదామంటే ఓటర్ల దృష్టిలో పరువుపోయే పరిస్థితి. ఓటమితో వచ్చిన బాధ కంటే ఇప్పుడు అప్పులు ఎలా తేర్పాలన్న టెన్షన్ ఓడిపోయిన అభ్యర్థులకు పట్టుకుంది. ఇలాంటి వారు చాలా మంది ఓటమి తర్వాత ఇళ్ల నుంచి బయటకురాలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఓడిన అభ్యర్థులు ఖర్చు చేసింది రూ.20 కోట్లపైనే.. జిల్లాలోని నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. మొత్తం 42 వార్డుల్లో 170 మంది పోటీ చేశారు. వీరిలో 42 మంది గెలవగా, 128 మంది ఓటమి చెందారు. ఇందులో దాదాపు 86 మంది రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్లతోపాటు ప్రధాన పార్టీలకు చెందిన మిగిలిన 81 మంది రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, ఆపైన ఖర్చు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కేవలం గెలవని అభ్యర్థులే రూ.20 కోట్ల వరకు వెచ్చించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పైసలు పోయినా మంచిదే పదవి దక్కితే చాలు అని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలతోపాటు ముగ్గురు స్వతంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. కరపత్రాలు మొదలు మందు, బిర్యానీ ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రణాళిక ప్రకారం డబ్బులు వెచ్చించడం తెలియక, రాజకీయ అనుభవం లేక చాలామంది ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ 170 మందిలో 42 మంది అభ్యర్థులే విజయం చేసిన అప్పులు తీర్చేదెలాగో తెలియక ఆందోళననర్సంపేటలోని ఓ ముఖ్యమైన వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. తెల్లారితే పోలింగ్ అనగా ఒకరిని మించి మరొకరు అక్కడి ఓటర్ల ప్రాధాన్యతను బట్టి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పంపిణీ చేశారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తమ సామర్థ్యానికి మించి రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ ప్రజలకు ఇచ్చారు. అయితే గెలిచిన అభ్యర్థికి సంతోషమున్నా... ఓడిన ఇద్దరికి చేసిన అప్పులు ఎలా తేర్పాలన్న బాధ పట్టుకుంది. వర్ధన్నపేటలోని ఓ వార్డులో పార్టీ టికెట్ దక్కించుకున్న ఓ అభ్యర్థి తనకున్న ప్లాట్ను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులను ప్రచారం, మద్యానికి ఖర్చు పెట్టారు. ఓట్లరకు పంపిణీ చేసే సమయంలో డబ్బులు చాలకపోవడంతో తెలిసినవారి నుంచి రూ.10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. ఇప్పుడు ఓడిపోవడంతో లబోదిబోమంటున్నాడు. -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 18,590 మంది, ద్వితీయ సంవత్సరం 20,004 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 14నుంచి నిర్వహించనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 64 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఇంటర్ విద్యాధికారి గోపాల్, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఈనెల 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఐఈఓ శ్రీధర్సుమన్ మాట్లాడుతూ.. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు.. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,210 మంది, ఒకేషనల్ విద్యార్థులు 793 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5,356 మంది, ఒకేషనల్ 807 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 92402 05555కు ఫోన్ చేయాలని కోరారు. -
చిత్తడి నేలలను పరిరక్షించాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధిలో పరస్పర సమన్వయం అవసరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి అనూజ్ అగర్వాల్ మెంబర్ కన్వీనర్గా పాల్గొన్న గత సమావేశం అనంతరం జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన రెండు వెట్ల్యాండ్స్కు సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్నట్లు డీఎఫ్ఓ వివరించారు. ముసలమ్మకుంట (వరంగల్ రేంజ్), వెంకటాపూర్ పెద్దచెరువు (నర్సంపేట రేంజ్)కు సంబంధించిన రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల నుంచి అవసరమైన నివేదికలు అందాల్సి ఉన్నట్లు తెలిపారు. వెట్ల్యాండ్స్కు సంబంధించి పత్రాలు, సంబంధిత శాఖల సమ్మతి పత్రాలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘సర్’పై సమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్పై కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తహసీల్లార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ ప్రకియను వేగవంతం చేయాలని సూచించారు. సేంద్రియ సాగుపై శిక్షణ ఇవ్వాలిఖిలా వరంగల్: సేంద్రియ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అనురాధతో కలిసి వ్యవసాయ విస్తరణ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, క్రాప్బుకింగ్ యూరియా నిల్వలు, విక్రయాలు, రైతుబీమా, ఇతర పథకాలపై కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ విస్తరణాధికారులు సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని, పెండింగ్ రైతుల వివరాలు సేకరించి ఐడీ క్రియేట్ చేయాలన్నారు.


