breaking news
Warangal District News
-
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి అన్నారు. బుధవారం విద్యుత్ బస్సులు నడుపుతున్న హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–2 డిపోను సందర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ను కలిసి కార్మికులకు ఇబ్బంది లేకుండా డ్యూటీలు వేయాలని సూచించారు. అనంతరం వరంగల్–1 డిపోలో టీఎంయూ వరంగల్–1 డిపో కమిటీని డిపో మేనేజర్ పుప్పాల అర్పితకు పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకుని ఆర్ఎం భవానీప్రసాద్తో సమావేశమయ్యారు. వరంగల్–2 డిపో కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. కార్యక్రమంలో టీఎంయూ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్.కె.వై.పాషా, కార్యదర్శి జితేందర్రెడ్డి, నాయకులు ఆర్వీ.గోపాల్, రాతిపల్లి సాంబయ్య, రంజిత్, యాదగిరి, శివరాత్రి దుర్గయ్య పాల్గొన్నారు. -
ముత్తారంలో శైవుల సమాధి శిల
భీమదేవరపల్లి: మండలంలోని ముత్తారం గ్రామంలో అతి ప్రాచీన శైవుల సమాధిశిల బయటపడింది. శైవుల్లో గురువులుగా ఉన్నవాళ్లకు ఈ విధంగా సమాధిశిల నిర్మిస్తారని చరిత్ర చెబుతోంది. గ్రామంలోని అతి ప్రాచీన త్రికుటాలయం సమీపంలో ఒక వ్యవసాయ బావి వద్ద ఈ శిల ఉంది. ఆలయ సమీపంలో ఉన్న ఈ శిల వరదల్లో కొట్టుకుని వచ్చి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ భూమి యజమాని మోకిడి మోహన్రావు తమ పూర్వీకులదే ఈ శిల అని వెల్లడించారు. తన ముత్తాత మోకిడి రాజన్న సమాధి అని వెల్లడించారు. ఆయన ఒక గొప్ప శైవభక్తుడు కావడంతో అతడి సమాధిని ఇలా నిర్మించారని చెప్పారు. ఇలా సమాధి సిద్దిపేట జిల్లా భోగేశ్వరాలయం వద్ద కూడా ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. -
సాంకేతికతతో నేరాలు నియంత్రించాలి
వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్రెడ్డి, ఆర్ఐ సతీశ్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సై రోహిత్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ ఉన్నారు. వరంగల్ లీగల్: యునైటెడ్ వరంగల్ జిల్లా అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా యు.కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి అజ్మీరా కిరణ్ సింగ్, ఉపాధ్యక్షులుగా చెన్నూరి రమేశ్, కోశాధికారిగా బండారి కవిత ఎన్నికయ్యారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు నూతన కమిటీ బాధ్యులు.. సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ అర్బన్: భారత వైమానిక దళంలో ఎయిర్మెన్ (మెడికల్ అసిస్టెంట్), అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనియామకాలకు సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ జూలై 6, 2026 ఉదయం 11 గంటలకు ప్రారంభమైందని, జూలై 26, 2026 రాత్రి 11:00 గంటలకు ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అర్హులైన యువత ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని భారత వైమానిక దళంలో సేవలందించే అవకాశం పొందాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. కేయూ క్యాంపస్: టీజీసీపీగెట్–26 బుధవారం కూడా రాష్ట్రంలోని 22 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్లో ఎంకామ్, ఎమ్మెస్సీ బాటనీ కోర్సులకు 6,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీసీపీగెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు 3,294 మంది, సాయంత్రం సెషన్లో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండ్ హెచ్ఆర్ఏ కోర్సుకు 376 మంది హాజరైనట్లు రాజేందర్ తెలిపారు. ఈనెల 16న ఉదయం సెషన్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. -
పని చేయని లిఫ్టులతో పరేషాన్!
సూపర్ ఆస్పత్రిలో పేషెంట్లకు తప్పనితిప్పలు కాశిబుగ్గ: హనుమకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లిఫ్టులు పనిచేయక పేషెంట్లకు తిప్పలు తప్పట్లేదు. బుధవారం హాస్పిటల్లోని ఐదో అంతస్తులో ఉన్న డయాలసిస్ కేంద్రానికి వెళ్లాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేస్తున్న ఏకై క లిఫ్ట్ కూడా కదలకపోవడంతో పేషెంట్లు మెట్ల మార్గం ద్వారా అతికష్టమ్మీద డయాలసిస్ సెంటర్కు చేరుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి హాస్పిటల్లో ఉన్న ఆరు అంతస్తులకు ఆరు లిఫ్ట్లు ఉండగా, గతేడాది నుంచి ఒక్క లిఫ్ట్ మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ లిఫ్ట్ కూడా ఆగిపోవడంతో రోగులు ఇక్కట్లకు లోనయ్యారు. ఇకనైనా అధికారులు అన్ని లిఫ్టులకు మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు. -
కేయూ పీజీ, డిగ్రీ కోర్సుల నూతన సిలబస్కు ఆమోదం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల ఆర్ట్స్, సైన్స్, కామర్స్ (నాన్ ప్రొఫెషనల్ ) పీజీ కోర్సుల నూతన సిలబస్ రూపొందించారు. దీన్ని కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. బుధవారం అకడమిక్ కమిటీ హాల్లో నిర్వహించిన స్టాండింగ్ కమిటీలో చర్చించి ఆమోదించారు. అలాగే, రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో యూ జీ కోర్సులు (ఏఈడీపీ) అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కింద పలు నూతన కోర్సులను ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయా కోర్సుల నూతన సిలబస్ను కూడా కేయూ స్టాండింగ్ కమిటీలో చర్చించి ఆమోదించారు. పీహెచ్డీ పూర్తి చేసుకునేందుకు అవకాశం.. కేయూలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీలో కొన్నేళ్ల క్రితం ప్రవేశాలు పొంది ప్రీ పీహెచ్డీ పూర్తి చేసి ఉండి థీసెస్ సబ్మిట్ చేయకుండా ఉండి పీహెచ్డీ పూర్తి చేసే కాలపరిమితి పూర్తయిన వారికి అవకాశం ఇచ్చేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే వారికి ఆరునెలల్లో పీహెచ్డీ పూర్తిచేసుకునేలా అవకాశం ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించి ఆమోదించింది. పార్ట్టైంగా చదువుకునే అవకాశం.. కేయూలో బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో పార్ట్టైంగా పాలిటెక్నిక్, వివిధ ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉండే డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలు పొంది పార్ట్టైంగా చదువుకునే అవకాశం కల్పించాలనే విషయంపై స్టాండింగ్ కమిటీలో చర్చించారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఇలా అవకాశం కల్పించేలా ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఉత్తీర్ణులైన వారికి కేయూలో కూడా బీటెక్, ఎంటెక్లో పార్ట్టైంగా కోర్సులో చేరేలా సాయంత్రం వేళల్లో ఆయా కోర్సులను నడిపాలనేది చర్చించారు. అయితే ఇందుకు ఏఐసీటీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలో అవకాశం వస్తుందా? లేక వచ్చే ఏడాది అమలుచేయాలా అనే యోచనలో ఉన్నారు. ఈ స్టాండింగ్ కమిటీలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, వీసీ, రిజిస్ట్రార్ ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీఎంఆర్పీఎస్, టీబీఎంయూకేఎస్, ఓఎస్ జేఏసీతో పాటు వివిధ మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సీహెచ్ఎంఓ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని భరోసా కల్పించారు. ఐఎన్టీయూసీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పాశం రవియాదవ్, ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు, టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ, జీడబ్ల్యూఎంసీ అధ్యక్షుడు బొట్ల రమేశ్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర రాజుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం
అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి కమలాపూర్: భూ సమస్యలు లేని గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీ సర్వే చేపడుతోందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మండలంలోని మాదన్నపేటలో భూముల రీ సర్వేపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూముల రీ సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, భూముల కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్సింగ్, తహసీల్దార్ సురేశ్కుమార్, సర్పంచ్ కత్తి రమేశ్, ఉపసర్పంచ్ రాజయ్య, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, గిర్దావర్ అమరేందర్, సర్వేయర్ గోపీకృష్ణ, జీపీఓ రాధిక, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్రెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భూ రీసర్వేలో వేగం పెంచండి ధర్మసాగర్ : మండల పరిధి జానకీపురంలో ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ భూముల రీ–సర్వేను వేగంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం సర్వేను పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి భూ సమస్యలు, సర్వేపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ బావుసింగ్, ఏడీ నూర్ సింగ్, సర్పంచ్ భీమ్రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
పార్కింగ్ స్థలాల ఆక్రమణలపై చర్యలు
● నోటీసుల్లేకుండా తొలగింపుపై మాజీ కౌన్సిలర్ జయమ్మ అభ్యంతరం పరకాల: రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న దుకాణాలపై పరకాల మున్సిపల్ అధికారుల చర్యలు చేపట్టారు. రోడ్లపై వ్యాపారాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్ పి.పవన్ ఆదేశాలతో టీపీఎస్ సుమన ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తుతో చర్యలు ప్రారంభించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పార్కింగ్ స్థలాల్లో ఉన్న దుకాణాలను తొలగించారు. నోటీసులు లేకుండా తొలగింపుపై మాజీ కౌన్సిలర్ జయమ్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అధికారులతో గొడవపడడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడి నుంచి మళ్లీ ప్రధాన రహదారిపై గద్దెలు నిర్మించి.. సామగ్రి పెడుతున్న దుకాణాల గద్దెలను జేసీబీ సాయంతో తొలగించారు. మున్సిపల్ అధికారుల చర్యలపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
వరంగల్ ఆర్ఓ: 84,651 భూపాలపల్లి: 17,004 నర్సంపేట: 6,550 భీమదేవరపల్లి: 6,147 కొడకండ్ల: 3,294 స్టేషన్ ఘన్పూర్: 3,754 ములుగు: 18,000 వర్ధన్నపేట: 6,550 డీఐజీ కార్యాలయం: 24,989కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దెలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అద్దెలు (రూ.లో) స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
ఏఐ వినియోగంపై అధికారులకు శిక్షణ
న్యూశాయంపేట: ఏఐ వినియోగంపై కలెక్టరేట్లో బుధవారం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చాట్ జీపీటీ, గుగూల్ నోట్బుక్ కేఎల్ఎం, క్లాడ్తోపాటు మొత్తం 15 అధునాతన ఏఐ ఆధారిత ఉత్పాదక సాధనాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. అధికారిక లేఖల తయారీ, సమావేశాల మినిట్స్ రూపొందించడం, పత్రాల సంక్షిప్తీకరణ, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షకులు వాసుదేవన్ నట రాజన్, రాహుల్, ధీరజ్ తదితరులు అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ అధికారులు తమ విధుల్లో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, వరంగల్, నర్సంపేట ఆర్డీ లు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. -
ఆధునికీకరిస్తే ఆదాయమే
● పాకాలలో నిరుపయోగంగా కాటేజీలు ● ఐదు నెలల నుంచి నిర్వహణ బంద్ ● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు ● పట్టించుకోని అటవీశాఖ అధికారులుఖానాపురం: పాకాల పర్యాటక ప్రాంతంలోని కాటేజీలు మూలనపడ్డాయి.. పర్యాటకశాఖ నుంచి అటవీశాఖ పరిధిలోకి వచ్చినా వాటి పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాత్రి, ఉదయం సమయాల్లో బస చేయడానికి కాటేజీలు అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీశాఖ పరిధిలో ఉన్న కాటేజీలను ఆధునికీకరిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో రావడంతోపాటు పర్యాటకులకు వసతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా సమయంలో రెస్టారెంట్ మూసివేత.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పాకాల ఒకటి. పాకాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఏడు కాటేజీలు, రెస్టారెంట్ నిర్మాణం చేపట్టింది. దీంతో పాకాలకు పర్యాటకుల సంఖ్య పెరిగి కాటేజీల నిర్వహణ సాగింది. ఆ తర్వాత కరోనా సమయంలో రెస్టారెంట్ మూతపడిపోయింది. కాటేజీల నిర్వహణ మాత్రం కొనసాగుతూ వచ్చింది. కాటేజీలు, బోటింగ్ పర్యాటకశాఖ పరిధిలో ఉండగా.. బోటింగ్ అటవీశాఖ పరిధిలోకి వెవెళ్లడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో కాటేజీలను సైతం 2026 ఫిబ్రవరి 17న అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నాటి నుంచి కాటేజీల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. పాకాలకు వచ్చే పర్యాటకులు బసచేయడానికి ఉన్న కాటేజీలు కాస్త అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకాల కాటేజీలు అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చిన విషయం వాస్తవమే. కాటేజీల నిర్వహణ, ఆధునికీకరణకు సంబంధించిన విషయంపై ఎఫ్డీసీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఇటీవల ఎఫ్డీసీ నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి అంచనాలు తీసుకెళ్లారు. ఎఫ్డీసీ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకొవస్తాం. నిర్వహణ కోసం ఇప్పటికే ఆరుగురికి శిక్షణ సైతం ఇప్పించాం – నరేశ్ బసవ, ఎఫ్ఆర్వో, నర్సంపేట -
వానాకాలం.. భానుడి భగభగ
● నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● వర్ధన్నపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి, నెక్కొండలో అధిక తేమసాక్షి, వరంగల్: వర్షాలు కురవాల్సిన సమయంలో జిల్లాలో సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవిని తలపించేలా జూలైలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గిపోవడం, ఆకాశం మేఘావృతమైన పరిస్థితులు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణ విభాగ గణాంకాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలోని చాలా మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ముఖ్యంగా నల్లబెల్లి మండలంలోని మేడపల్లిలో అత్యధికంగా 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగెం మండలంలో 37 డిగ్రీలు, గీసుకొండ, నర్సంపేట, ఖానా పురం, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, దుగ్గొండి మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువ.. జిల్లాలోని చాలా మండలాల్లో గరిష్టంగా తేమ 70 నుంచి 90 శాతం మధ్య నమోదైంది. వర్ధన్నపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి, నెక్కొండలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత తీవ్రంగా ఉంది. బుధవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు తేమ కూడా తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.వానలు కురవక పెరిగిన వేడి జిల్లాలో వారం రోజులుగా విస్తృతంగా వర్షాలు కురవకపోవడం, మేఘాలు చెదిరిపోవడం, సూర్యరశ్మి తీవ్రంగా ఉండడంతో భూమి వేడెక్కుతోంది. ఉద యం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత కూడా అధికమైంది. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి కాటేజీలు...
అటవీశాఖ ఆధీనంలోకి వచ్చిన కాటేజీలను తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధికి వెళ్లనున్నాయి. అటవీశాఖతో కార్పొరేషన్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధికారులు నివేదికలు, అంచనాలు తయారు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. కాటేజీల నిర్వహణ కోసం అశోక్నగర్కు చెందిన పలువురికి శిక్షణ సైతం ఇచ్చినట్లు సమాచారం. కానీ, ప్రస్తుతం కాటేజీలు అందుబాటులోకి తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సుమారు ఐదు నెలలుగా కాటేజీలు నిరుపయోగంగానే ఉంటున్నాయి. పాకాలకు వచ్చే పర్యాటకులు బసచేయడానికి వీలులేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న దుస్థితి సైతం నెలకొంటుంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు త్వరగా ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
హసన్పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పాదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కేసుల్లో నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతీ కాల్పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
మల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణ0యమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
మల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భా గంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్ప డే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రఽ దాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
నెలవారీ నేర సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హసన్పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పాదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కేసుల్లో నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి బాఽధితులకు అందించాలని, డయల్ 100 ద్వారా వచ్చే ప్రతికాల్పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే రౌడీషీట్ తెరవాలని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. -
స్మార్ట్ రోబోటిక్ నేటి సాంకేతిక యుగం
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: పరిస్థితులకు అనుగుణంగా సేవలందించే రోబోటిక్ అనేది నేటి సాంకేతిక యుగం అని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం కేయూలో డిప్లాయిబుల్ రోబోటిక్స్ దట్ లెర్న్ అంశంపై నిర్వహించిన విస్తృతోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల జార్జిమెషన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ల్యాబ్ పరిశోధకులు డాక్టర్ ష్యూనుషియానో, కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ, కేయూ పాలక మండలి సభ్యురాలు బి.రమ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు, కేయూ మాజీ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి తదితరులు మాట్లాడారు. -
అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలి
● డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఈ విద్యాసంవత్సరంలో లక్ష్యం మేరకు ఇంటర్ అడ్మిషన్లు పెంచడానికి కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మంగళవారం రాయపర్తి, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించారు. కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, సిలబస్, పాఠ్య పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్షించారు. ఇంటర్ కమిషన్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా మెరుగైన అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినందున ఇంటర్మీడియట్లో జాయిన్ కానీ విద్యార్థుల వివరాలను వెంటనే ఆన్లైన్లో అడ్మిషన్ నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇప్పటికే 1,040 మంది విద్యార్థులు చేరారని, మరో రెండు వారాల్లో 300 పైగా అడ్మిషన్లు పూర్తి చేసుకొని లక్ష్యం చేరుకోవాలన్నారు. ప్రిన్సిపాల్స్ జయకుమారి, సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గుంతలు.. కుదుపులు!
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026గుంతలో నుంచి కరీంనగర్కు వెళ్తున్న బస్సుహన్మకొండ: హనుమకొండ బస్స్టేషన్ గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గుంతల నుంచి బస్సులు వెళ్తుండడంతో కుదుపులకు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న కరీంనగర్, సిద్దిపేట జిల్లాల ప్రయాణికులకు సేవలందిస్తున్న హనుమకొండ జిల్లా బస్స్టేషన్ ఆవరణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై గుంతలు ఏర్పడి ఇబ్బంది పడే ప్రయాణికులు బస్స్టేషన్లో భారీస్థాయిలో గుంతలు పడడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు రెండు వేలకు పైగా బస్సులు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్కు వచ్చి వెళ్తుంటాయి. దాదాపు 60 వేల మంది ఈ బస్స్టేషన్ నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్తారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన హనుమకొండ జిల్లా ఆర్టీసీ బస్స్టేషన్ నిర్వహణను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరమ్మతులకు గురవుతున్న బస్సులు బస్స్టేషన్లో ఏర్పడిన గుంతలతో బస్సులు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గుంతల్లో నుంచి బస్సులు వచ్చి వెళ్తుండడంతో బస్సుల టైర్లు పగిలిపోవడంతో పాటు మెయిన్లు, కమాన్ పట్టీలు విరిగి సంస్థకు నష్టం కలుగుతోంది. ఒక్కోసారి ఆర్టీసీ అధికారులు టైర్లు పగిలినా, మెయిన్, కమాన్ పట్టీలు విరిగితే నిర్లక్షపు డ్రైవింగ్ అని తమపై పెనాల్టీలు విధిస్తున్నారని డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. పెనాల్టీలను కోత పెట్టడంతో తమకు వచ్చే జీతం సరిపోవడం లేదని వాపోతున్నారు. మరో వైపు అద్దె బస్సు యజమానులు కూడా తమ బస్సుల మెయిన్లు, కమాన్ పట్టీలు విరిగి నష్టం జరుగుతోందని, తమకు వచ్చిన లాభం అంతా మరమ్మతులకే పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ, సౌకర్యాల కల్పనపై లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హనుమకొండ జిల్లా బస్స్టేషన్పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి బస్స్టేషన్ను బాగు చేయాలని, గుంతలు పడుకుండా శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా బస్స్టేషన్ ఆవరణను తీర్చిదిద్దాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం..ప్రయాణికుకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బస్స్టేషన్ ఆవరణ మరమ్మతులకు యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.భవానీప్రసాద్, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం అధ్వానంగా హనుమకొండ ఆర్టీసీ బస్స్టేషన్ బస్సుల కుదుపుతో ప్రయాణికుల అవస్థలు పగులుతున్న టైర్లు, విరుగుతున్న మెయిన్లు, కమాన్ పట్టీలు బస్సులకు మరమ్మతులు వస్తే డ్రైవర్ల వేతనాల్లోంచి కోత -
గోదావరి జలాలు వచ్చేనా?
ఖానాపురం: అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. వరి పంటల సాగుపై మల్లగుల్లాలు పడుతున్నారు. సముద్రం లాంటి పాకాల తలాపున ఉన్నప్పటికీ ఆయకట్టు రైతుల్లో దిగాలు నెలకొంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ద్వారా నీరు వస్తే పంటల సాగుకు సమాయత్తం అవుదామనుకుంటే అధికారులు, పాలకుల నుంచి స్పష్టత లేదు. దీంతో పాకాల ప్రాజెక్ట్ నీటి కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది పాకాల ఆయకట్టు. పాకాల ఆయకట్టు కింద వర్షాకాలంలో 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతుంటాయి. వర్షాధారంతో చెరువు నిండుకుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులో 14 ఫీట్ల నీటిమట్టం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు అనుకున్న మేర వర్షాలు కురవలేదు. ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటికే వేల రూపాయలతో విత్తన బస్తాలను తీసుకువచ్చి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కానీ వర్షాలు పడకపోవడంతో నారుమడులను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో పాటు సమీప వ్యవసాయ బావుల రైతుల సహకారంతో నార్లను కాపాడుకుంటున్నారు. నార్లను కాపాడుకున్నా.. పంటలు సాగు అవుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్పై ఆశలు..పాకాలకు రామప్ప నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చే ప్రాజెక్ట్ను గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయల నిధుల మంజూరి చేయించారు. ప్రాజెక్ట్ను పూర్తి చేయించి రెండో పంటకు సైతం పుష్కలంగా నీరందించారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఆయకట్టు రైతులు అదే ప్రాజెక్ట్పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడుదల చేస్తే పాకాల చెరువు నిండుకోని రైతులు వరి పంటలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాసంగిలో పంటల సాగు కోసం నీటి విడుదల జరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నీరు ఎందుకు చెరువులోకి తీసుకురావడంలేదనే ప్రశ్నలు రైతులు లేవనెత్తుతున్నారు. శ్రీరెండు రోజుల్లో గోదావరి జలాలతో పాకాల చెరువును నింపి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాశ్రీమని ఇరిగేషన్ ఈఈ తెలిపారు. పాకాల ప్రస్తుత నీటిమట్టం 14 ఫీట్లు ప్రాజెక్ట్ నీటి కోసం ఎదురుచూపు ఎండుతున్న నారుమడులు అవస్థలు పడుతున్న అన్నదాతలు పట్టించుకోని అధికారులు -
ఉమ్మడి వరంగల్ జిల్లా వారీగా చూసుకుంటే...
పుట్టుక.. చావులో పురుషులే ఎక్కువ ● సీఆర్ఎస్–24లో నివేదికలో ఉమ్మడి వరంగల్ ముఖచిత్రంమొత్తం జననాలు: 57,156 (మగ శిశువులు: 30,421, ఆడ శిశువులు: 26,735)సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టుకై నా.. చావైనా.. మగవారిదే పైచేయి ఉంటోంది. అదే సమయంలో ఆడబిడ్డల జననాలు తగ్గడం కాస్త ఆందోళన కలిగే అంశంగా ఉంది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) 2024 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైన 57,156 జననాల్లో 30,421 మంది మగ శిశువులు, 26,735 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంటే 3,686 మంది మగ శిశువులు ఎక్కువగా జన్మించారు. ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 879 మంది ఆడ శిశువులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న కుటుంబాలవ్వడం, సంతానోత్పత్తి రేటు క్షీణించడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంశాలు ఆడపిల్లల జననాలపై ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఉమ్మడి జిల్లాలో నమోదైన 28,649 మరణాల్లో 17,441 మంది పురుషులు, 11,208 మంది మహిళలు ఉన్నారు. అంటే 6,233 మంది పురుషులు ఎక్కువగా మరణించారు. మహిళలతో పోలిస్తే పురుషులు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, పరిశ్రమలు వంటి ప్రమాదకర వృత్తుల్లో ఎక్కువగా ఉండడం, రోడ్డు ప్రమాదాలు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, మద్యం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి వల్ల మరణాలు ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జననాలు, మరణాలు హనుమకొండలోనే ఎక్కువ హనుమకొండ జిల్లాలో జననాలు, మరణాలు రెండూ అత్యధికంగా నమోదవగా, వరంగల్లో అత్యల్ప మరణాలు, ములుగులో అత్యల్ప జననాలు నమోదయ్యాయి. జననాల్లో ములుగు జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 991 మంది ఆడ శిశువులు ఉండడం సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ నిష్పత్తి 805కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. జననాల్లో ఆడబిడ్డల నిష్పత్తి పెరగడం, పురుషుల్లో జీవనశైలి వ్యాధులు, ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ఈ సీఆర్ఎస్ గణాంకాలు సూచిస్తున్నాయి. మొత్తం మరణాలు: 28,649 (పురుషులు: 17,441, మహిళలు: 11,208)అత్యధిక జననాలు, మరణాలు: హనుమకొండఅత్యల్ప జననాలు: ములుగుఅత్యల్ప మరణాలు: వరంగల్2024లో జనన, మరణ వివరాలు..హనుమకొండ 13,464 11,920 8032 4,800 జననం మరణం మగ ఆడజయశంకర్ 3,189 2,875 1,198 740మహబూబాబాద్ 6,568 5,286 3185 2139వరంగల్ 2,056 1,822 774 447జనగామ 3,682 3,383 2,896 1,977ములుగు 1,462 1,449 1,356 1,105 -
క్రీడల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ స్పోర్ట్స్: విద్య, క్రీడలు రెండింట్లోనూ రాణించేలా విద్యార్థులు ఎదగాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, అందుతున్న వసతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్కుమార్, యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా శ్రీనివాస్రావు
కేయూ క్యాంపస్: కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభా గాధిపతిగా ఆ విభాగం ప్రొఫెసర్ పి.శ్రీనివాస్రా వును నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.శ్రీనివాసులు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ శ్రీనివాస్రావును నియమించారు. గతంలో శ్రీనివాస్రావు కేయూ డిసేబుల్డ్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్ల డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్, యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, హాస్టళ్ల డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆవిభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ డైరెక్టర్గా రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలువేరు రాజ్కుమార్ ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇకనుంచి రిజిస్ట్రార్ రామచంద్రం అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ధ్రువీకరించారు. విద్యారణ్యపురి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ హైస్కూల్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ సెంటర్ టీచింగ్కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఏఐ టూల్స్ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్, ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ ఎంఈఓ నెహ్రూ, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, రిసోర్స్పర్సన్లు, సోషల్ స్టడీస్ టీచర్లు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికిఅందించనున్న రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఎఫ్ఏసీ అధికారి విశ్వజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు ఆన్లైన్ల్లో awards.gov.in వెబ్సైట్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రామన్నపేట: ఇంటింటి జ్వర సర్వే సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, డ్రై డే నిర్వహణ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. మంగళవారం పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్. టి.మదన్మోహన్రావుతో కలిసి డీఎంహెచ్ఓ పరిశీలించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించి మెప్మా రిసోర్స్పర్సన్లు ఆరోగ్య సిబ్బంది మహిళా క్లినిక్ సేవలపై మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, వైద్యాదికారి హైదర్, సబ్ యూనిట్ అఽధికారి ఖాదర్ అబ్బాస్, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం
అదనపు కలెక్టర్ ఎన్.రవి ఐనవోలు: గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం మండలంలోని పంథినిలో భూముల రీ సర్వే అవగాహన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. తెలంగాణలో 90 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపడుతోందని, రైతులు సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా పారదర్శకంగా సర్వే చేయనున్నట్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రతీ భూమికి భూధార్ కార్డులు అందజేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మండలంలో పంథిని గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాం భూపాల్రావు, తహసీల్దార్ విక్రమ్కుమార్, సర్వే ఏడీ నూర్సింగ్, డీఐ సారంగపాణి, సర్వేయర్ సూరజ్కుమార్, జీపీఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు. 29న శాకంబరీగా అలంకరణ.. ఆషాడ శుద్ధపౌర్ణమి 29న (బుధవారం) ఉదయం నాలుగు గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. -
ఆటపాటలతోనే అభ్యాసానికి బాట
కాళోజీ సెంటర్/ఖిలా వరంగల్: చిన్నారులకు ఆటపాటలు, కథల ద్వారా బోధన అందిస్తేనే నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి సమగ్ర వికాసం సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జీపీఎస్ కరీమాబాద్ పాఠశాలలోని ప్రీప్రైమరీ విభాగంతో పాటు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీమాబాద్ ప్రీప్రైమరీ తరగతి గదిలో చిన్నారులకు శ్రీప్లే వే మెథడ్శ్రీ ద్వారా నిర్వహిస్తున్న బోధన, బోధనా అభ్యాస సామగ్రి వినియోగం, పిల్లల భాగస్వామ్యాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. క్లాస్రూమ్లోకి వెళ్లి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులతో రైమ్స్ చెప్పిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతీ ప్రీప్రైమరీ పాఠశాలలో ఇదే తరహా అభ్యాస వాతావరణాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కరీమబాద్, శంభునిపేట జీహెచ్ఎస్ పాఠశాలల్లోని కొనసాగుతున్న ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణ అమలవుతున్న తీరును, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, ఉల్లాస్ కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, హెచ్ఎం జయప్రకాశ్, డీఆర్పీలు, సీఆర్పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. బీఎల్ఓలకు సహకరించాలి ఖిలా వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని లెనిన్నగర్, రంగశాయిపేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ పరిశీలనలో తహసీల్ధార్ ఇక్బాల్, ఎంసీపీఐ నగర ప్రధాన కార్యదర్శి మాలోతు సాగర్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్గా కృష్ణ
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్గా ఖమ్మం కృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కమిషనర్గా నియమితులైన అశోక్ వారం రోజుల పాటు విధులు నిర్వహించిన అనంతరం బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో పరిపాలన పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఖమ్మం కృష్ణకు ఇన్చార్జ్ కమిషనర్గా అధికారులు బాధ్యతలు అప్పగించారు. కాగా నూతన కమిషనర్ను స్థానిక నాయకులు శాలువాతో సత్కరించగా సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేతావత్ శివారాణి, రాజేందర్, కీమా నాయక్, దేవేందర్, నాయకులు అనిమిరెడ్డి, రామ చంద్రారెడ్డి, మాలోతు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖు వేతనాలు మాకు వర్తించవా?నర్సంపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, చిరు ఉద్యోగులందరికీ ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆదేశించినా.. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు మాత్రం రావడం లేదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఐసీడీఎస్ ప్రారంభమై 50సంవత్సరాలు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత కల్పించకపోగా గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. జాబ్ చార్ట్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆరోగ్యలక్ష్మి సేవలు, ఎన్హెచ్టీఎస్, పోషణ్ ట్రాకెర్ రెండు యాప్లో ఆన్లైన్ సేవలు చేస్తూ చాలీచాలని వేతనాలతో జీవితం సాగిస్తున్నామన్నారు. దీనికి తోడు బీఎల్ఓ డ్యూటీలు, అదనపు పనులతో అంగన్వాడీ సేవలు కుంటుపడుతున్నాయని, పని ఒత్తిళ్లతో అనారోగ్య సమస్యల పాలవుతున్నారని పేర్కొన్నారు. రావాల్సిన గౌరవ వేతనాలు కూడా ప్రతీ నెల అడక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ నెల వేతనాలు ఇవ్వాలని, వచ్చే నెల నుంచి కనీసం 5వ తేదీలోపు అయినా వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. రికార్డుల నిర్వహణపై డీపీఓ ఆగ్రహంనల్లబెల్లి: అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి వద్ద రికార్డులు ఇన్నాళ్లు ఎలా ఉంచారు.. బదిలీపై వెళ్లి బాధ్యతలు అప్పగించకపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎంపీఓ పసరగొండ రవిని జిల్లా పంచాయతీ అధికారి కల్పన మందలించారు. నల్లబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం డీపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డుల నిర్వహణ, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు అప్పగింతలో జాప్యం, గ్రామసభల నిర్వహణ, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్కు ఫోన్ చేసి నల్లబెల్లి నుంచి వెళ్లి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు చార్జ్ ఎందుకు అప్పగించలేదు, జీపీ రికార్డులు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామసభలను నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, జమ, ఖర్చుల వివరాలను ప్రతీ గ్రామసభలో ప్రజల ముందు వెల్లడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాశ్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు
● భద్రకాళి దేవాలయంలో ఏర్పాట్లు చేసిన అధికారులు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో భద్రకాళి అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. ఉదయం, సాయంత్రం కాళీ క్రమాల్లో పూజలు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతి క్రమానికి ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, నిత్యా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా క్రమం, 26న బలాకా క్రమం, విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు. 29న శాకంబరీగా అలంకరణ.. ఆషాడ శుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 29న ఉదయం నాలుగు గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తులతోపా టు పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలన్నారు. మొత్తం 191 దరఖాస్తులు రాగా రెవెన్యూ 65, మున్సిపల్ 10, హౌసింగ్ 44, ఇతర శాఖలకు సంబంధించినవి 72 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో 191 దరఖాస్తులు -
పోలీస్ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సీపీతో పాటు క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ స దయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత -
నులి పురుగుల నివారణకు కృషి
కాశిబుగ్గ: నులి పురుగుల నివారణకు కృషి చే యాలని, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ఆ ల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం సీకేఎం కళాశాల ఆవరణలోని దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రల పంపిణీని కలెక్టర్ డా క్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అంది స్తున్న మాత్రలతో పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రో గ్రాం అధికారి డాక్టర్ సాజితాబేగం, డీఈఓ రంగయ్యనాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్రావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు రాజేష్, ఉష తదితరులు పాల్గొన్నారు. కాగా సోమవారం 1,83,038 మంది పిల్లలకు (93.26 శాతం) ఆల్బెండజోల్ మాత్రలను వేసినట్లు డీఎంహెచ్ఓ ప్రకాశ్ తెలిపారు. మిగిలిన పిల్ల లకు ఈ నెల 20న వేస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ -
మహాశైవాక్షయోగం శుభప్రద కాలం
హన్మకొండ కల్చరల్: జ్యేష్టమాసం బహుళ చతుర్ధశి తిథి, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. శత వసంతాలకు ఒకసారి వచ్చే మహాశైవాక్షయోగం పరమశివుడి అనుగ్రహానికి అత్యంత శుభప్రదమైన కాలమని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. ఈ శుభకాలంలో వేయిమందికిపైగా భక్తులు స్వామివారికి రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పోలీసుల అదుపులో నకిలీ ఆర్గానిక్ ఎరువుల విక్రయదారు!వర్ధన్నపేట: ఆర్గానిక్ ఎరువుల పేరుతో నకిలీ ఎరువులు విక్రయించి రైతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ల్యాబర్తి గ్రామానికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి రైతుల వద్దకు వచ్చి ఆర్గానిక్ ఎరువులు తక్కువ ధరకు ఇస్తామని నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు, వ్యవసాయ అధికారికి సమాచారం అందించగా గుర్తు తెలియని వ్యక్తి పారిపోయాడు. సోమవారం వ్యవసాయశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పట్టణంలో పోలీసులకు చిక్కాడు. అయితే ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి సాయంత్రం వరకు ఆ వ్యక్తిని వదిలేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులకు చిక్కిన వ్యక్తి స్థానిక ఏఓ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నకిలీ ఆర్గానికి ఎరువని స్థానిక మండల వ్యవసాయాధికారి ధ్రువీకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు కేసు నమోదు చేయలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై న సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన బోధనకు డిజిటల్ టెక్నాలజీ కీలకంకాళోజీ సెంటర్: ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధనకు పరిమితం కాకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం శంభునిపేట ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంకు ఆయన హాజరై మాట్లాడారు. బోధనలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచే వినూత్న బోధనా పద్ధతులపై చర్చించారు. తరగతి గది విద్యార్థి కేంద్రంగా ఉండాలని, ఆక్టివిటీ బేస్డ్, ఎక్స్పీరియన్షల్, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ వంటి ఆధునిక బోధనా విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో శ్రీలెర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం(లిప్)ను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, సెంటర్ ఇంచార్జీలు రఫీక్, రాజకుమార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు తాటిపాముల రమేశ్, అశోక్, శ్రీనివాస్, గౌస్ పాషా, మధు, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు విద్యారణ్యపురి: హైదరాబాద్లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు హెచ్టీటీపీ//టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్లో చూడాలన్నారు. -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధి లోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అధికారులతో సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
‘కాసుల’ క్రమబద్ధీకరణ
కామధేనువులా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులుఎల్ఆర్ఎస్ స్కీం ప్రారంభం: 31, అక్టోబర్, 2020దరఖాస్తుల పరిష్కారం: 2024జీడబ్ల్యూఎంసీ పరిధిలో నమోదైన దరఖాస్తులు 1,07 లక్షలుక్లియరెన్స్ దరఖాస్తులు 17,000ఎల్–1 వద్ద పెండింగ్ దరఖాస్తులు: 15వేలు ఎల్–2 అధికారుల వద్ద 22 వేలు వసూలైన మొత్తం: రూ.149 కోట్లు ● వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. నగరంలోని గవిచర్ల క్రాస్ రోడ్డులో పైసాపైసా కూడబెట్టి 200 గజాల ప్లాటు కొన్నాడు. 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2023లో రూ. 25వేలు చెల్లించాడు. మూడేళ్లు గడుస్తున్నా ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేయడం లేదు. స్థలానికి ఇరిగేషన్, రెవెన్యూ నుంచి ఎన్ఓసీ అడుగుతున్నారు. ఎన్ఓసీ అందించని పక్షంలో రూ.30 వేల లంచం డిమాండ్ చేస్తున్నారు.● సోమిడి ప్రాంతానికి చెందిన రవికిరణ్ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాడు. బల్దియా నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. ప్రొసీడింగ్ కాపీ జారీ చేయాలి. కానీ, రెండేళ్ల నుంచి రవికిరణ్ ఎదురు చూస్తూ కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా మామూళ్లు ముట్టజెబితేనే పరిష్కరిస్తామనే ధోరణితో ఆయా శాఖల సిబ్బంది కా చుకుని కూర్చున్నారు. ఇలా అనేక కారణాలు చె బుతూ బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది దరఖాస్తుదారులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్యామ్యాలు ముట్టజెడితేనే ఫైళ్లు క్లియరెన్స్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ అర్బన్: ఇలా.. రవికిరణ్, శ్రీనివాస్ మాత్రమే కాదు. మరెందరో క్రమబద్ధీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ఆర్ఎస్ పరిశీలనలో మూడు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట వరంగల్ మహా నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్లు పరిశీలిస్తుండాలి. రెవెన్యూ ఉద్యోగులు ఆ స్థలం వివాదాస్పదంగా ఉందా? కేసులు ఉన్నాయా? ప్రభుత్వానిదా? ప్రైవేట్దా అని నిర్ధారించాలి. ఇరిగేషన్ ఉద్యోగులు క్రమబద్ధీకరించే స్థలం చెరువులు, కుంటలు, డ్యామ్లు, నీటి పారుదలకు సంబంధించిందా? కాదా చూడాలి. ఇలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిశీలిస్తుండంతో దరఖాస్తులు క్లియరెన్స్కు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దరఖాస్తుదారుల అవస్థలు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన యాజమానులకు అవస్థలు తప్పట్లేదు. ఈ దరఖాస్తులను కేటాయించిన ఉద్యోగులు వచ్చి పరిశీలించి వెళ్లిపోతుండగా, ఆ తర్వాత సమాచారం ఉండడం లేదు. ఫీజు ఎంత మేరకు వేస్తున్నారు? మళ్లీ చేపట్టే ప్రక్రియ ఏమిటనే వివరాలు మాత్రం లభించడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. పైగా కొంత మంది దరఖాస్తుదారులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇవ్వడం లేదు. అత్యధిక శాతం ఽఅర్జీలు నిషేధిత జాబితాలో వెళ్లడంపై ఆందోళన నెలకొంది. ఇళ్ల మధ్య ఉన్న ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పేర్కొనడం ఏంటని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులు ముట్టుకోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 1.07లక్షల ఎల్ఆర్ దరఖాస్తులు నమోదయ్యాయి. 2020లో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) జీఓ 131 విడుదలైంది. దీని ప్రకారం ఆ ఏడాది ఆగస్టు 26 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా అర్హులే అని ప్రకటించారు. న్యాయస్థానాల్లో వివాదంలో ఉండడంతో 2024లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప్రొసీడింగ్ జారీ ప్రక్రియ మొదలైంది. కానీ, బల్దియా టౌన్ ప్లానింగ్ భౌగోళిక ఆధారితం (గూగుల్ మ్యాప్)తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల శాశ్వత స్థలాలను నిర్ధారించుకున్నారు. చెరువులు, కుంటలు తదితర సమస్యలు లేకున్నా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇతర జోన్లకు మారిపోయాయి. ఇదే బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు కాసుల పంట పడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్లను దళారులుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమాకూరుతుంది. తద్వారా దరఖాస్తుదారులకు అనుమతుల జారీతో ఉపశమనం లభిస్తుంది. ఈ విషయమై బల్దియా ఇన్చార్జ్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దరఖాస్తుదారులు ముందుకు రావట్లేదని, పరిష్కరిస్తామని పొంతన లేని సమాధానం చెబుతున్నారు. సమగ్ర సమాచారం రూ.30 వేల నుంచి రూ.లక్ష చెల్లిస్తేనే ఫైళ్లు క్లియర్ దళారులుగా లైసెన్స్డ్ సర్వేయర్లు లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు వివాదాస్పద స్థలాల నిరాకరణ దరఖాస్తులు: 30 వేలు -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో అందిన అర్జీలపై పలువురు తహసీల్దార్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 282 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 191 దరఖాస్తులు అందాయి. కాగా, గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు వరంగల్ గిర్మాజీపేట సర్వే నంబర్ 10లో హజ్హౌస్ నిర్మాణానికి 1800 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిందని, తిరిగి ఆ స్థలంలోనే హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు కోరారు. -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధి గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధి దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కేయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా బయోటెక్నాలజీ విభాగం ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచందం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేయూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, కేయూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వుల కాపీని డాక్టర్ పుల్లా శ్రీనివాస్కు వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి అందజేశారు. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు. -
పోలీస్ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్, తదితరులున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి భరోసా కేంద్రానికి వచ్చే వారికి సత్వర న్యాయం చేయాలని సీపీ శ్వేత అధికారులకు సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న టీజీసీపీగెట్ పరీక్షలు
కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2026–27లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్–26 ఆరో రోజు సోమవారం నిర్వహించినట్లు సీపీ గెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు 2,942, మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సుకు 902, సాయంత్రం సెషన్లో ఎంఈడీ, ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సుకు 1,241 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. కాజీపేట అర్బన్: హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్, హనుమకొండ ఎకై ్స జ్ ఇన్స్పెక్టర్ దుర్గాభవానీ సోమవారం వేర్వేరుగా సీపీ శ్వేతను కలిసి మొక్క అందించారు. హన్మకొండ అర్బన్: జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. జనగణన–27 సన్నద్ధతలో భాగంగా డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) తయారీపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రారంభమైంది. ఈసందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి హ్యాండ్బుక్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే శిక్షణలో గ్రామ, పట్టణ డైరెక్టరీల తయారీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెన్సస్ డైరెక్టరేట్ గణాంకాధికారి సతీశ్ సమాచార సేకరణ, నమోదు విధానం, డేటా కచ్చితత్వంపై వివరించారు. కార్యక్రమ ంలో గణాంకాధికారి రామ్ దయాకర్ రెడ్డి, ఎంపీఎస్ఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్, డాక్టర్ ఎన్వీఎన్ చారి, కె.రమేశ్, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మక్క రైతులకు చెల్లింపుల్లో కోత
కమలాపూర్: తాము విక్రయించిన మొక్కజొన్నలకు సంబంధించి పూర్తి డబ్బులు వెంటనే చెల్లించాలని మండలంలోని మక్క రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు తమకు చెల్లించాల్సిన డబ్బుల చెల్లింపుల్లో కోత విధించారని ఆరోపిస్తూ పలువురు మక్క రైతులు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ నిర్వాహకులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 858 మంది రైతుల నుంచి 32,389 క్వింటాళ్ల మొక్కొజొన్నలు కొనుగోలు చేశారు. మొక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో ఆలస్యంగా (2 నెలల అనంతరం) మొక్కజొన్నల డబ్బులు జమచేశారు. ఆ డబ్బులు ట్రక్ షీట్ ప్రకారం కాకుండా ఒక్కో రైతుకు సుమారు 50 కిలోల నుంచి క్వింటాన్నర వరకు (రూ.1,200 నుంచి 3,600 వరకు) తక్కువ చెల్లించారు. ఇలా ఒక్క కమలాపూర్ మండలంలోనే మొక్కజొన్నలు విక్రయించిన రైతులకు సు మారు రూ.10 లక్షల వరకు తక్కువ చెల్లించారు. రైతులే స్వయంగా గన్నీ సంచులు కొనుగోలు చేసుకోగా, రవాణా కోసం లారీలు రాక ట్రాక్టర్ కిరాయి, హమాలీలకు ఎగుమతి, దిగుమతి ఖర్చులు మొత్తంగా ఒక క్వింటాకు రూ.120 చొప్పున ఖర్చయ్యాయని ఆ ఖర్చులు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దీంతో ఒక్కో రైతుపై రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అదనపు భారం పడిందని మక్క రైతులు ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని మక్క రైతులు కోరుతున్నారు. ఈవిషయమై పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్ను వివరణ కోరగా.. రైతులకు తక్కువ డబ్బులు చెల్లించిన విషయాన్ని, మరో 1,600 క్వింటాళ్లకు సంబంధించి రైతులకు అసలే డ బ్బులు చెల్లించలేదని మార్క్ఫెడ్ డీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై గోదాం ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని త్వరలోనే రైతులకు పూర్తి డబ్బులు చెల్లిస్తామని డీఎం చెప్పినట్లు తెలిపారు. పీఏసీఎస్ ఎదుట మక్క రైతుల ఆందోళన వెంటనే పూర్తి డబ్బులు చెల్లించాలని డిమాండ్ -
ములుకనూరు డెయిరీకి అరుదైన గౌరవం
సకాలంలో జీఎస్టీ చెల్లించినందుకు ప్రశంసపత్రం భీమదేవరపల్లి: ములుకనూరు మహిళా సహకార డెయిరీని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంతో పాటు పన్నులను సక్రమంగా చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రత్యేక ప్రశంసపత్రాన్ని జారీ చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ములుకనూరు మహిళా డెయిరీ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసిస్తూ సీబీఐసీ చైర్మన్ వివేక్ చతుర్వేది సంతకంతో కూడిన ప్రశంసపత్రాన్ని అందజేశారు. అరుదైన గౌరవం పొందిన సందర్భంగా డెయిరీ అధ్యక్షురాలు ధనశ్రీ, జనరల్ మేనేజర్ భాస్కర్రెడ్డి పాలకవర్గం, సిబ్బంది, సభ్యులను అభినందించారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026విద్యారణ్యపురి: హైదరాబాద్లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీ//టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్లో చూడాలని ఆయన కోరారు. -
నులి పురుగుల నిర్మూలనకు కృషి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ కాశిబుగ్గ: నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం సీకేఎం కళాశాల ఆవరణలోని దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రల పంపిణీని కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మాత్రలతో పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజితాబేగం, డీఈఓ రంగయ్యనాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్రావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు రాజేశ్, ఉష పాల్గొన్నారు. కాగా, సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,83,038 మంది పిల్లలకు (93.26 శాతం) ఆల్బెండజోల్ మాత్రలను వేసినట్లు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. -
దండించడం నిషేధం..
కార్పోరేట్ విద్యా సంస్ధలకు పోటిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యబోధన అందిస్తున్నాం. పిల్లలను శారీరకంగా దండించడం పూర్తిగా నిషేధించబడింది. పాఠశాలల్లో భౌతిక, మానసిక భద్రతతో పాటు చిన్నారి రక్షణకు ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడంతో పాటు ప్రతీ చిన్నారికి నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను అందించి, భవిష్యత్లో ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు బలమైన పునాది వేయడమే లక్ష్యం. – ఉండ్రాతి సుజన్ తేజ, అకడమిక్ మానిటరింగ్ అధికారి -
వరంగల్
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026చిరుతపులి కలకలం గూడూరు మండల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోందివాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. చల్లగాలులు వీస్తాయి. ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం (జూలై 13) జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, విద్య, మహిళాశిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర అందజేస్తారని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ పూర్తిగా సురక్షితమైన ఔషధమని, ప్రతి చిన్నారి తప్పనిసరిగా తీసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. నులి పురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చెప్పులు ధరించడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు వినియోగించడం వంటి అలవాట్లు పాటించడం ద్వారా నులిపురుగుల సంక్రమణను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు. వరంగల్ జిల్లాలో 1,96,168 మందికి.. వరంగల్ జిల్లాలో 1–19 ఏళ్ల లోపు వారు 1,96,168 మంది ఉన్నారని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జిల్లాలోని 910 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు 908 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలను బాలబాలికలకు అందేలా చూడాలని వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను కోరారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)●ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
ఈ–గ్రంథాలయం ఏర్పాటుకు కృషి
కాశిబుగ్గ: వరంగల్లోని గ్రంథాలయాన్ని ఈ–గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కాశిబుగ్గ ఓ సిటీలో వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడైన మీసాల ప్రకాశ్కు గౌరవం కల్పిస్తూ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ముందుగా ఈ–లైబ్రేరీగా తయారు చేయాలని ఇందుకు కావాల్సిన కంప్యూటర్లను సీఎస్ఆర్ ద్వారా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటి నుంచే ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, మేయర్ పీఠం కై వసం చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ద్వారా తెలుసుకుంటున్నానని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్రాజు, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, చినబాబు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం -
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్: మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ లు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం నాట్య మండపంలో వేదపండితుడు వెంకటేశ్వరశర్మ, అర్చకులు రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించారు. కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించా రు. కల్యాణోత్సవంలో బీజేపీ సీనియర్ నాయకులు రావు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తామని, గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణలో భాగంగా డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)తో పాటు సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో డైటీషియన్ పోస్టులు భర్తీ కావడం లేదు. ఇక్కడ పనిచేసిన డైటీషియన్లు బదిలీ అయి నెలరోజులు కావొస్తున్నా కొత్తవారు రావడం లేదు. ఎంజీఎంలో డైటీషియన్గా పనిచేసిన రవీందర్రెడ్డి హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి, సీకేఎంలో డైటీషియన్గా పనిచేసిన ఏఈ గ్రేస్ నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. అయితే, వీరి స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ఉన్నతాధికారులు నూతన డైటీషియన్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. విద్యారణ్యపురి: బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 13 (సోమవారం)న అప్రెంటిస్షిప్ జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023–2026 విద్యాసంవత్సరాల మధ్య ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాన్ పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికై న వారికి నెలకు రూ 9,600 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారని, పలు ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్థలు అభ్యర్థుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలని ఆయన సూచించారు. కాశిబుగ్గ/ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు శంభునిపేట, పడమరకోట, కొత్తవాడ, బ్యాంకు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతీఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. -
హెచ్ఎంల పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్ డైరీ తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ఈ విద్యా సంవత్సరంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు ఆటపాటల ఆధారిత అభ్యాసన ప్రధాన ఉద్దేశం. బోధన పద్ధతులను బలోపేతం చేసేందుకు ప్రతీ పాఠశాల హెచ్ఎం లేదా సీనియర్ ఉపాధ్యాయులు ప్రతీ వారం (ముఖ్యంగా శుక్రవారం) ఒక తరగతిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ‘ఫీడ్బ్యాక్ డైరీ’ నిర్వహించి, ఉపాధ్యాయుల ప్లస్ పాయింట్లు, మార్చుకోవాల్సిన అంశాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ -
సమయం లేదు సర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్ల ద్వారా అలర్ట్ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయి. ఫారాల పంపిణీలో భేష్.. జూన్ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారాలను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్లో 40.39 శాతం , మహబూబాబాద్లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది. 53.66 శాతంతో ముందంజలో ములుగు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్పైనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్’ డిజిటలైజేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్టైంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ పంపిణీ శాతం డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం100%50.18%40.39%42.97%7,67,4834,84,93242.62%3,85,1527,67,4842,77,8827,76,95350.36%5,09,0144,84,93553.66%2,36,9703,13,806 2,18,6992,77,8792,06,661 1,39,955 1,27,167 జేఎస్భూపాలపల్లిజనగామహనుమకొండవరంగల్ములుగుఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇంకా 11 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్ ముందున్న ములుగు.. అదే వరుసలో జనగామ, జేఎస్ భూపాలపల్లి 40–43 శాతంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు ఆగుతూ సాగుతున్న డిజిటలైజేషన్... సీరియస్గా కలెక్టర్లు, అధికారుల ఫాలోఅప్ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్)లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. బీఎల్ఓలు, అన్ని శాఖల సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డిజిటలైజేషన్ ఇన్టైంలో పూర్తికి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. – చాహత్ బాజ్పాయ్, హనుమకొండ కలెక్టర్ -
ఈ–గ్రంథాలయం ఏర్పాటుకు కృషి
● దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం కాశిబుగ్గ: వరంగల్లోని గ్రంథాలయాన్ని ఈ–గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కాశిబు గ్గ ఓ సిటీలో వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చై ర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడు మీసాల ప్రకాశ్కు గౌరవం కల్పిస్తూ గ్రంథా లయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ద్వారా తెలుసుకుంటున్నానని, ప్ర జలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్రాజు, బుగ్గారెడ్డి, చినబాబు పాల్గొన్నారు. -
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధి కారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీ జీ ఎ న్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగు ల నుంచి ఆప్షన్లు కోరడంతో ఒక్క టీజీఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంలలోనూ ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపర్చిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎ ల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తయ్యేలా ఖరారు చేసినా ప్రక్రియ నిలిచింది. అనంతరం ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. ఆప్షన్లు ఇచ్చిన 1,252 మంది.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2 వేల మంది ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
నులి పురుగులకు చెక్
గీసుకొండ: నులిపురుగులతో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి రావడమే కాకుండా విద్యార్థులు చ దువులో వెనకబడిపోయే అవకాశం ఉంది. శరీరంలోని పేగుల్లోకి చేరిన నులిపురుగులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్తో చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరి చేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నేడు (సోమవారం) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. నులిపురుగులు వ్యాపించే మార్గాలు ● కలుషిత ఆహార పదార్థాలు, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూలి పడిన పదార్థాలు తినడం వల్ల నోటి నుంచి పొట్ట, పేగుల్లోకి నులిపురుగులు చేరుతాయి. ● బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, కా ళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లను వినియోగించడం ద్వారా ఇవి శరీరంలోకి చేరుతాయి. మాత్రలు ఎవరు వేసుకోవద్దంటే.. సంవత్సరం లోపు వయస్సు ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధ కేన్సర్ ఉన్నవారు, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలను వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాగా నులిపురుగులు పేగుల్లోని రక్తాన్ని తాగి తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. కాగా జిల్లాలోని 910 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు 908 అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు వేసేందుకు అన్ని సిద్ధం చేసినట్లు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. ఒక్క మాత్ర మింగితే చాలు నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జిల్లాలో 1.96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం -
సమయం లేదు సర్
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి.. ( ఆదివారం రాత్రి 8.01 గంటల వరకు) మొత్తం ఓటర్లు ఫారాలు పంపిణీ పంపిణీ శాతం డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం100%50.36%50.18%53.66%సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులు ఆశించిన వేగంతో సా గడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దా దాపు పూర్తయ్యింది. వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్ల ద్వారా అలర్ట్ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయి. ఫారాల పంపిణీలో భేష్.. జూన్ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారా లను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్లో 40.39 శాతం , మహబూబాబాద్లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది. 53.66 శాతంతో ముందంజలో ములుగు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్పైనే ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్’ డిజిటలైజేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్టైంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. ఎస్ఐఆర్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ తో ముందుకెళ్తున్నాం. డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచిస్తున్నాం. – చాహత్ బాజ్పాయ్, కలెక్టర్, హనుమకొండ 40.39%42.97%1,39,955 7,67,4831,27,167 4,84,93242.62%3,85,1522,77,8827,67,4844,84,9355,09,0147,76,9533,13,806 2,18,6992,36,9702,77,8792,06,661 జేఎస్భూపాలపల్లిజనగామహనుమకొండములుగువరంగల్ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇంకా 11 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్ 40–43 శాతంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు ఆగుతూ సాగుతున్న డిజిటలైజేషన్... సీరియస్గా కలెక్టర్లు, అధికారుల ఫాలోఅప్ -
‘సర్’ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కాశిబుగ్గ/ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు శంభునిపేట, పడమరకోట, కొత్తవాడ, బ్యాంకు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతీఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీఓ పష్పలత, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజావాణి న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణలో భాగంగా డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలిపర్వతగిరి: ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ఈ మేరకు పర్వతగిరి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో వర్ధన్నపేట నియోజకవర్గంలోని బీఎల్ఏలు, ఇన్చార్జ్లు, ముఖ్య నాయకులతో ఆదివారం సర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్ఏలు పూర్తి సమయాన్ని కేటాయించి ఓటర్ల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి కచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ప ర్వతగిరి మండల అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికై న ఇస్లావత్ సావిత్రికి ఎమ్మెల్యే నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, సర్పంచ్ చీదురు శంకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాటలకు ప్రాధాన్యం
ఎంపికై న మండలాల పరిధిలో విద్యార్థుల సంఖ్యకాళోజీ సెంటర్: ప్రభుత్వ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ప్రవేశించే నాటికి పిల్లల్లో ఆశించిన పాఠశాల సంసిద్ధత (స్కూల్ రీడీనెస్) నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. జిల్లాలో గతేడాది 34 పాఠశాలల్లో విజయవంతంగా నడిచిన ప్రీప్రైమరీ సెక్షన్లకు అదనంగా, ఈ విద్యా సంవత్సరం (2026–27) మరో 48 పాఠశాలల్లో వీటిని విస్తరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పూర్వ ప్రాథమిక కేంద్రాల సంఖ్య 82కు చేరింది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 1,003 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎన్సీఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్ఎస్ 2022) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ తరగతులు పూర్తిగా ఆనందదాయకమైన, ఆటపాటలతో కూడిన వాతావరణంలో సాగాలి. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక టీచర్స్ హ్యాండ్బుక్ (టీహెచ్బీ), స్టూడెంట్ వర్క్బుక్స్ (ఎస్డబ్ల్యూబీ) ఆధారంగా బోధన జరగాలి. ప్రతీ విద్యార్థికి భాషా నైపుణ్యాలు (లిటరసీ), గణిత నైపుణ్యాల (న్యూమరసీ) కోసం రెండు ప్రత్యేక వర్క్బుక్లు ఉచితంగా అందజేయనున్నారు. వీటిని ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా దిద్ది, పెన్నుతో సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత ఆడియో, వీడియో విజువల్స్ ఉపయోగించి బోధనను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు.చెన్నారావుపేట దుగ్గొండి గీసుగొండ ఖానాపురం ఖిలా వరంగల్ నల్లబెల్లి నర్సంపేట నెక్కొండ పర్వతగిరి రాయపర్తి సంగెం వరంగల్ వర్ధన్నపేట8110110608292611686728349474113536విద్యార్థుల సంఖ్య పాఠశాలలుప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్యా విప్లవం బట్టీల పద్ధతికి స్వస్తి.. పరీక్షలు నిర్వహించడం పూర్తిగా నిషేధం ఎస్సీఈఆర్టీ సమగ్ర విధివిధానాలు విడుదల -
జిల్లాకు వరప్రదాయిని ‘దేవాదుల’
ధర్మసాగర్: తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న నీటి పంపింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా మారిందని కొనియాడారు. ఈనెల రోజుల్లో ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లను నింపేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా రాబోయే 15 రోజుల్లో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తారని, దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని రైతులు ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖ అధికారులకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గోదావరి జలాలకు పూజలు -
‘ఆప్షన్’ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదు అని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంల్లోను ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. బదిలీల కోసం ఎదురుచూపులు..టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2,000 ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
15 రోజుల్లో అఫిలియేషన్స్ అందించాలి
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ వరంగల్ స్పోర్ట్స్: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ తెలిపారు. శనివారం హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్ సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్ యాదవ్ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్, కిక్బాక్సింగ్, నెట్బాల్, బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్ స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో జిల్లా, మండల ఎన్నికలు ఎన్నికలు ఎవరు నిర్వహించినా బైలా ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్చార్జ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్, శ్యామల, పవన్కుమార్ పాల్గొన్నారు. -
15 నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్సుందర్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: ఇటీవల సాక్షిలో ప్రచురితమైన ‘జీతం మహాప్రభో’ కథనానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న స్పందించారు. ఆగమేఘాల మీద ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి, అకౌంట్ ద్వారా వరంగల్ ఔట్సోర్సి ంగ్ కార్మికులకు వేతనాలు ఇప్పించారు. దీంతో కార్మికులకు ఉపశమనం కలిగింది. కేయూ క్యాంపస్: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగినట్లు కన్వీనర్ ప్రొపెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఎల్ఐఎస్సీ/బీఎల్ఐఎస్సీ కోర్సుకుగాను 736 మందికి 600 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మందికి 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను శనివారం నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ చూన్ హీ తన బృందంతో సందర్శించారు. నిట్ వరంగల్ అధ్యాపకులతో కార్బన్ డై ఆకై ్సడ్ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తైవాన్ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లీలా మనోహర్ ఏశాల, రాజేశ్ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రిక్విజిషన్ల లెటర్లు కరవయ్యాయి. దవాఖానకు వచ్చే రోగులకు వివిధ పరీక్షల సూచిస్తూ వైద్యులు రిక్విజిషన్ లెటర్లు రాస్తుంటారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ లెటర్లు లేకపోవడంతో తెల్ల కాగితాల మీదనే వైద్యులు రాయాల్సి వస్తోంది. దీంతో ఈ కాగితాలు కూడా ధర్మ చిట్టీల మాదిరిగా ఉండడంతో ల్యాబ్ సిబ్బంది సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అలాగే పరీక్షల రిపోర్ట్తో పాటు స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్లు ఇస్తున్న తెల్ల కాగితాలు ఏమాత్రం సరిపోకపోవడంతో ల్యాబ్ సిబ్బంది కూడా మరో తెల్ల పేపర్పై వివిధ పరీక్షల వివరాలతో పాటు రిపోర్ట్, స్టాంపింగ్ వేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ల్యాబ్లో వివిధ పరీక్షలకు అవసరమైన కెమికల్స్, కిట్స్ వచ్చాయని చెబుతున్నారు. -
విపత్తు సమయంలో స్వీయరక్షణపై అవగాహన
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విపత్తు సమయంలో స్వీయరక్షణ, ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కార్యక్రమాల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో శనివారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు సంసిద్ధత చర్యలు, ప్రజలకు అవగాహన వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఇన్స్పెక్టర్ దీపక్కుమార్ నేతృత్వంలోని కే.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సతీశ్కుమార్ బృందం సభ్యులు అత్యవసర పరిస్థితులపై స్పందించే విధానంపై ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి అధికారులు పాల్గొన్నారు. భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలి.. భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో భూ రీసర్వే, ఇందిరమ్మ, ఇళ్లు, సాదా బైనామా ద రఖాస్తులు, తదితర అంశాలపై శనివారం స మీక్షించారు. వీసీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కా ర్యదర్శి లోకేశ్కుమార్, అధికారులు పాల్గొనగా జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఏడీఎస్ఎల్ఆర్ నూర్సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలల్లోనే రెట్టింపు ఉమ్మడి వరంగల్లో రోజుకు రూ.35 లక్షల వ్యాపారం
సాక్షి వరంగల్: అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలల్లో వీటి ధరలు సుమారు రెట్టింపవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడం, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాత అల్లం కిలో రూ.240, పాత వెల్లుల్లి రూ.245కు విక్రయిస్తుండగా, మూడు నెలల క్రితం ఇవి రూ.120, రూ.160 మాత్రమే ఉన్నాయి. కొత్త అల్లం ధర రూ.70 నుంచి రూ.220కు, కొత్త వెల్లుల్లి రూ.80 నుంచి రూ.200కు చేరింది. దీంతో హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, గృహిణులు వాటిని కూరల్లో వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాలనుంచే దిగుమతులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పూర్తిగా ఇతర రాష్ట్రాలనుంచే దిగుమతి అవుతోంది. అల్లం ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, అస్సాం రా ష్ట్రాల నుంచి వస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెల్లుల్లి దిగుమతి అవుతోంది. ఈ నిత్యావసర సరుకు ముందుగా వరంగల్ బీట్ బజార్ మార్కెట్కు చేరుకుని, అక్కడినుంచి హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రవాణా అవుతోంది. రోజుకు 130 క్వింటాళ్ల విక్రయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజూ సుమారు 130 క్వింటాళ్ల అల్లం, వెల్లుల్లి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో రోజుకు సుమారు 10 క్వింటాళ్లకు పైగా అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు దాదాపు రూ.35 లక్షల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ధరలు ఇలానే కొనసాగితే దసరా నాటికి వెల్లుల్లి ధర కిలో రూ.400 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. -
వదలం.. కదలం!
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026అల్లం–వెల్లుల్లి ధరలకు రెక్కలుఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపరకాల ప్రభుత్వజనగామ ఏబీవీమహబూబాబాద్ ప్రభుత్వనర్సంపేట ప్రభుత్వపింగిళి మహిళాకాకతీయ బల్దియాలో తాజా మాజీ కార్పొరేటర్ల జబర్దస్తీ.. మళ్లీ తామే అంటూ అధికారులు, సిబ్బందిపై కర్రపెత్తనం నలిగిపోతున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది -
వరంగల్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026ఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాధారణంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లకు అన్ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జ్లను ప్రభుత్వం నియమిస్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని 13 పీఏసీఎస్లకు నియమించింది.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.సర్ ప్రక్రియ పరిశీలన రాయపర్తి: మండలంలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఓటరు ఎన్యూమరేషన్ అబ్జర్వర్, భూమి కొలతల ఏడీ ఎం.శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని రాయపర్తి, మైలారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. బీఎల్ఓలకు పలు సూచనలిచ్చారు. త్వరగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్ల నుంచి సేకరించాలని శ్రీనివాసులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. 18 వరకు జనాభాపై అవగాహన కార్యక్రమాలుగీసుకొండ: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు జనాభా నియంత్రణపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఎంహెచ్ఎ డాక్టర్ ఐ.ప్రకాశ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జనాభా నియత్రణపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘పిల్లలకు సరైన అంతరం ఉంటే.. కుటుంబాలు ఆరోగ్యంగా, నైపుణ్యంతో ఉంటాయి’ అనే థీమ్తో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సయ్యద్ ఇక్తదార్ అహ్మద్ మాట్లాడుతూ దంపతులు తాత్కాలిక జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలన్నారు. వెద్యాధికారి డాక్టర్ హుస్సేన్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సీఓ విఠల్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15నుంచి జూలై 29 వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలతో పాటు జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్సుందర్ పాల్గొన్నారు. 15 రోజుల్లో అఫిలియేషన్స్ అందించాలివరంగల్ స్పోర్ట్స్: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ తెలిపారు. హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్ సంఘం జనరల్ బాడీ సమావేశం శనివారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్ యాదవ్ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్, కిక్బాక్సింగ్, నెట్బాల్, బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్ స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో జిల్లా, మండల ఎన్నికలు ఎన్నికలు ఎవరు నిర్వహించినా బైలా ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్చార్జ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్, శ్యామల, పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపరకాల ప్రభుత్వమహబూబాబాద్ ప్రభుత్వజనగామ ఏబీవీపింగిళి మహిళానర్సంపేట ప్రభుత్వకాకతీయకాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను శనివారం నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ చూన్ హీ తన బృందంతో సందర్శించారు. నిట్ వరంగల్ అధ్యాపకులతో కార్బన్ డై ఆకై ్సడ్ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తైవాన్ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లీలా మనోహర్ ఏశాల, రాజేశ్ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగాయని కన్వీనర్ ప్రొపెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఎల్ఐఎస్సీ/బీఎల్ఐఎస్సీ కోర్సుకుగాను 736 మందికి 600 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మందికి 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
అల్లం – వెల్లుల్లి ధరలకు రెక్కలు
సాక్షి వరంగల్: అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలల్లో వీటి ధరలు సుమారు రెట్టింపవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడం, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాత అల్లం కిలో రూ.240, పాత వెల్లుల్లి రూ.245కు విక్రయిస్తుండగా, మూడు నెలల క్రితం ఇవి రూ.120, రూ.160 మాత్రమే ఉన్నాయి. కొత్త అల్లం ధర రూ.70 నుంచి రూ.220కు, కొత్త వెల్లుల్లి రూ.80 నుంచి రూ.200కు చేరింది. దీంతో హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, గృహిణులు ఉన్నదానితోనే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాలనుంచే దిగుమతులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పూర్తిగా ఇతర రాష్ట్రాలనుంచే దిగుమతి అవుతోంది. అల్లం ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల నుంచి వస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెల్లుల్లి దిగుమతి అవుతోంది. ఈ నిత్యావసర సరుకు ముందుగా వరంగల్ బీట్ బజార్ మార్కెట్కు చేరుకుని, అక్కడినుంచి హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రవాణా అవుతోంది. రోజుకు 130 క్వింటాళ్ల విక్రయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజూ సుమారు 130 క్వింటాళ్ల అల్లం, వెల్లుల్లి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో రోజుకు సుమారు 10 క్వింటాళ్లకు పైగా అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు దాదాపు రూ.35 లక్షల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ధరలు ఇలానే కొనసాగితే దసరా నాటికి వెల్లుల్లి ధర కిలో రూ.400 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. మూడు నెలల్లోనే రెట్టింపు ఉమ్మడి వరంగల్లో రోజుకు రూ.35 లక్షల వ్యాపారం -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ: మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపలు చేశారు. రూ.10 లక్షల చొప్పున నెక్కొండ, వెంకటాపురం, మడిపెల్లి, గొట్లకొండ, సాయిరెడ్డిపల్లిల్లో వీఓ భవనాలు, గుండ్రపల్లి, తోపనపల్లిలో ఒక్కోదానికి రూ.10 లక్షల ఖర్చుతో జీపీ భవనాలు, అలంకానిపేటలో రూ.5 లక్షలతో యూత్ క్లబ్ భవన నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దొంతి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్రెడ్డి సర్కార్ ముందుకు సాగుతోందని వివరించారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు చల్లా శ్రీపాల్రెడ్డి, మాదాటి శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, ఎంపీడీఓ లావణ్య, ఏపీఎం కిరణ్కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, మండల పార్లీ అధ్యక్షుడు లావుడ్య తిరుమల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. -
వదలం.. కదలం!
రెవెన్యూ విభాగంలో అదే పరిస్థితి కొత్త ఇంటి నంబరు ఇచ్చే ముందు, పేరు మార్పిడిలు చేసినా ఏదైనా తమకు సొమ్ము చెల్లించాల్సిందేనంటున్నారు. తమ డివిజన్లో ఏ పనైనా తాము చెప్పినట్లు ముందుకు సాగాల్సిందేనని, తమకు మాత్రం కాసులు సమర్పించుకోవాల్సిందేనని రెవెన్యూ ఇన్స్పెక్టర్లను శాసిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలా అన్ని విభాగాల్లో పెత్తనం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వరంగల్ అర్బన్ : అండర్ రైల్వే గేట్కు చెందిన ఓ తాజా మాజీ కార్పొరేటర్ది ప్రతిపక్షం. పదవిలో ఉన్నంతకాలం ఆయనకు ఎదురేలేదు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా వ్యవహరించారు. అనుకున్న పనులన్నీ చేయించుకున్నాడు. అయితే పదవి కోల్పోయినా అదే జబర్దస్తీగా వ్యవహరిస్తున్నాడు.వరంగల్లో గత పాలక వర్గంలో ఓ పార్టీ నాయకుడి సతీమణి కార్పొరేటర్గా గెలిచారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారూ కండువా మార్చేశారు. పదవిలో ఉన్నంత కాలం అందరిది ఒక ఎత్తయితే ఆయనది మరో ఎత్తు. వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నాడు. దిగిపోయే ముందు భవన నిర్మాణదారుల వద్ద నుంచి పెద్దఎత్తున కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు.హనుమకొండలో ఓ పార్టీ నాయకుడి సతీమణి కార్పొరేటర్గా గెలుపొందారు. నాణేనికి ఒక వైపు, మరో వైపు తనకు అనూకూలంగా ఉండే వర్గాలను కూడగట్టుకొని పదవిని బాగా వినియోగించుకుని అన్నీ విభాగాలను శాసించారు. ఇప్పుడూ అదేతీరు..... ఇలా 70 శాతం పైగా తాజా మాజీ కార్పొరేటర్లు పదవీ కాలం ముగిసినా హల్చల్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ను వదలడం లేదు మాజీలైన కొందరు తాజా కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ను వదలడం లేదు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వారు పదవి కాలం పూర్తయిన ఆ ‘ధన’ దాహం తీరడం లేదన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కొత్త పాలక వర్గం వచ్చే వరకు తామే కార్పొరేటర్ల మంటూ హల్చల్ చేస్తున్నారని,. అన్నీ కార్యకలాపాలు తమ కనుసన్నల్లోనే కొనసాగాలని ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిపై కర్రపెత్తనం చెలాయిస్తున్నట్లు బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే కార్పొరేటర్లుగా గెలుస్తామని, మా మాట ఇప్పుడు వినకపోతే పదవి దక్కిన తర్వాత మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం చర్చనీయాశంగా మారింది. దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది నలిగిపోతున్నారు. నాలుగు శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందే ఇంజినీరింగ్ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతీ పనిలో తమకు 4 శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. లేనిపక్షంలో పనులు నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. పెండింగ్, కొత్త పనులకు లెక్క కట్టి కమీషన్లు ఇవ్వాల్సిందేనని కాంట్రాక్టర్లకు కండీషన్ పెడుతున్నారు. వినకపోతో ఇంజినీర్లపై ఒత్తిడి పెంచి సొమ్ము వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణాలపై రూ.లక్షల్లో వసూళ్లు అక్రమ భవనమైతే తాజా మాజీలైన అనుచరులు వాలిపోయి కార్పొరేటర్కు సొమ్ము చెల్లిస్తేనే నిర్మాణం ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఒకవేళ నిర్మాణ అనుమతి ఉంటే కూడా ఎంతో కొంత మట్టు చెప్పాలని కోరుతున్నారు. వినకపోతే క్షేత్ర స్థాయి లైన్మన్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను టార్చర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా భవన నిర్మాణం చేపడితే గద్దల్లా వాలిపోయి రూ. వేలు, రూ.లక్షలో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలో తాజా మాజీ కార్పొరేటర్ల జబర్దస్తీ మళ్లీ తామే అంటూ అధికారులు, సిబ్బందిపై కర్రపెత్తనం నలిగిపోతున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
గీసుకొండ: గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్లు పాటుపడుతూ ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో గీసుకొండ, సంగెం మండలాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, ప్రణాళికపై శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ దివంగత కూసం రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో పనిచేయాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ శ్రీసర్శ్రీ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి అందించాలని చెప్పారు. వరిలో తక్కువ కాలం, తక్కువ నీటితో పండే రకాలను రైతులు ఎంచుకుని సాగు చేయాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించుకునే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఆర్డీఓ నాగపద్మజ, ఆర్డీఓ సుమ, డీఎల్పీఓ వేదవతి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఇన్చార్జ్ ఎంపీఓ శేషు పాలొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే, అధికారులు జలసిరి ప్రతిజ్ఞ చేయించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గంగదేవిపల్లిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ -
విపత్తు సమయంలో స్వీయరక్షణపై అవగాహన
న్యూశాయంపేట: విపత్తు సమయంలో స్వీయరక్షణ, ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కార్యక్రమాల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన సమాచారం, సహకారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఇన్స్పెక్టర్ దీపక్కుమార్ నేతృత్వంలోని కే.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సతీష్కుమార్ బృందం సభ్యులు అత్యవసర పరిస్థితులపై స్పందించే విధానంపై ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలి భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతాంశంగా, పక్కాగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో భూ రీసర్వే, ఇందిరమ్మ, ఇళ్లు, సాదా బైనామా దరఖాస్తులు, తదితర అంశాలపై సమీక్షించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష -
‘ముల్కనూరు’కు జాతీయ అవార్డు
భీమదేవరపల్లి: ముల్కనూరు సహకార సంఘం ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును కై వసం చేసుకుంది. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇక్రిసాట్ వేదికగా గురు, శుక్రవారాల్లో జరిగిన ‘ఇండియా సీడ్ ట్రేడ్ – ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’లో ముల్కనూరుకు ‘ఫార్మర్–సెంట్రిక్ ఇంపాక్ట్ ఎక్స్లెన్స్’ అవార్డు లభించింది. సుస్థిర వ్యవసాయం, ప్రపంచ విత్తన వాణిజ్యం, ఆవిష్కరణలపై నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వందలాది ప్రముఖ విత్తన కంపెనీలు, వ్యవసాయ సంస్థల ప్రతినిధులు, రంగ నిపుణులు పాల్గొన్నారు. సమగ్ర విత్తన విలువ గొలుసు విధానం ద్వారా రైతుల జీవనోపాధిని మెరుగుపర్చడంలో ముల్కనూరు సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ అవార్డు దక్కింది. అవార్డు ప్రదానం రైతు–కేంద్రీకృత కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి ముల్కనూరు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ చేతుల మీదుగా శుక్రవారం జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ, ‘ఇంతటి ప్రతిష్టాత్మక జాతీయ వేదికపై ముల్కనూరు సహకార సంఘం సేవలకు గుర్తింపు లభించడం యావత్ తెలంగాణకే గర్వకారణం. ఈ అవార్డును సంఘంలోని రైతు–సభ్యులు, ఉద్యోగులు, భాగస్వాములందరికీ అంకితం చేస్తున్నాం’అని అన్నారు. ఫార్మర్–సెంట్రిక్ ఇంపాక్ట్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకున్న జీఎం మారుపాటి రాంరెడ్డి -
వానల కోసం ఎదురు చూస్తున్నా
ఐనవోలు: నాకు చెలుక, పొలం కలిపి 7.5 ఎకరాల వరకు ఉంది. 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పసుపు సాగు చేస్తున్న. వానలు సరిగ్గా కురవక రెండుసార్లు పత్తి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 2 ఎకరాల్లో పల్లికాయ వేశాను. మిగిలిన ఎకరంన్నరలో తిండి గింజల కోసం వరి సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే పెట్టుబడి 60 వేలు దాటింది. సరైన వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతాం. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి. – నిమ్మాని వెంకటేశ్వరరావు, రైతు, కక్కిరాలపల్లినీళ్లు లేక పొలాలు దున్నలేదు.. వేలేరు: వేలేరు మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవక ఇంకా పొలాలు దున్నలేదు. అలాగే నాటేందుకు సిద్ధం చేసిన వరినారు రోజురోజుకూ ముదిరిపోతోంది. ఎక్కువ రోజులు నారు ముదిరిపోతే దిగుబడి కూడా తగ్గుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సంబంధిత అధికారులు స్పందించి త్వరగా గండి రామారం లిఫ్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. – ఆవునూరి శ్యాం, రైతు, పీచర -
బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేయాలి
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్ (వేలి ముద్రలు), ఐరీష్, అడ్రస్ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. -
డీఎంహెచ్ఓగా అప్పయ్య బాధ్యతల స్వీకరణ
రామన్నపేట/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఏ.అప్పయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా.. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓగా బదిలీ అయిన ఆయనను హనుమకొండ డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ఆయనకు సూచించారు. హన్మకొండ అర్బన్: భద్రకాళి మాడవీధుల అభివృద్ధి పనుల కారణంగా ప్రభావితమైన కుటుంబాల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు అర్హులైన 30 మందికి ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ లబ్ధిదారులకు నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సంక్షేమ, గృహ, ఉపాధి పథకాల ప్రయోజనాలు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ అజిత్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లోని రామన్హాల్లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సెయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ.రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్ఎస్.సన్యాసిరాజు, నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, పదోతరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ డే స్కాలర్ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన డే స్కాలర్ విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేలు ఉపకార వేతనం అందుతుందని, ఆన్లైన్లో ఈ–పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి..విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ డీడీ బి.నిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రూ.20 లక్షల స్కాలర్షిప్, వీసా ఫీ, విమాన ప్రయాణ చార్జీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆగష్టు 31లోపు telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
సా(ఆ)గుదామా..!
ఈ ఫొటోలో పత్తి మొలకలకు నీరు పారిస్తున్న రైతు పేరు అంబీర్ శ్రీనివాస్. ఈయనది ఎల్కతుర్తి మండలం చింతలపల్లి. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి గింజలు నాటాడు. ఇప్పటి వరకు వర్షాలు కురువకపోవడంతో భూమిలోనే గింజలు ఎండిపోతాయన్న భయంతో బోరువేయించాడు. బోరు నీళ్ల ద్వారా నీరు పారిస్తున్నాడు. పొద్దుగూకే వరకు నీరు పారిస్తున్నప్పటికి కనీసం రెండు ఎకరాలు కూడా తడవని పరిస్థితి ఉంది. ‘నీళ్లు ఎల్లిన కాడికి పత్తిమొలకలకు పారిస్తున్నా అక్కడక్కడా సరిగ్గా మొలకలు మొలవని పరిస్థితి ఉంది. మొత్తం నాలుగు ఎకరాలకు తొమ్మిది బస్తాలు పత్తిగింజలు కొనుగోలు చేసి నాటినా. ఎకరానికి రూ.15నుంచి రూ.20వేల పెట్టుబడి అయింది. వరుణిడి దయ. లేకపోతే చేసిన కష్టం.. పెట్టిన పెట్టుబడి భూమిలో పోసినట్లే’ అని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షిప్రతినిధి, వరంగల్: వానాకాలం ప్రారంభమై నెల దాటినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగట్లేదు. శుక్రవారం నాటికి 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆతర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులు పడుతున్నారు. వానాకాలం సాగులో ముందుకెళ్లడమా? ఆగిపోవడమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. వానాకాలం సాగు లెక్క ఇలా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన సీజన్ అండ్ క్రాప్ కవరేజ్ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 15.93 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5,00,220 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే మొత్తం లక్ష్యంలో 31.42 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 9.21 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 36,201 ఎకరాల్లో (3.9 శాతం) మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 5,94,102 ఎకరాల లక్ష్యానికిగాను 4,19,605 (70.62 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. వరి నాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. 52 మండలాల్లో లోటు, భారీ లోటు.. 79 మండలాలకు గాను ఈ వానాకాలంలో ఇంకా 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతమే ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, హసన్పర్తి, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, వరంగల్ జిల్లా గీసుకొండ, నర్సంపేట, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో భారీగా లోటు వర్షపాతం ఉంది. అలాగే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్లో 8, జనగామలో 7, మహబూబాబాద్లో 12, జేఎస్ భూపాలపల్లిలో 7 మండలాలు కలిపి 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం సాగు పూర్తయ్యింది.కలిసిరానికాలం.. అన్నదాత అయోమయం ఉమ్మడి జిల్లాలో ములుగు మినహా ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వాన జాడ లేదు, సాగు జోరు లేదు.. ఇప్పటికీ 31.42 శాతమే సాగు -
సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దామెర: గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికతో గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు గుర్తించి ప్రధాన్యతా క్రమంలో దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. డిజిటైజేషన్ వేగవంతం చేయాలి.. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ డిజిటైజేషన్ వేగంగా చేపట్టాలని కలెక్టర్ బీఎల్ఓలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మండలంలోని ఊరుగొండలో చేపడుతున్న డిజిటైజేషన్ పక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.రవి, జిల్లా పరిషత్ సీఈఓ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీకాంత్, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితా నమోదు వేగవంతం చేయాలి హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా దరఖాస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి నిర్వహించిన సమీక్షలో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ, నమోదు పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. వెనుకబడిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శని, ఆదివారాల్లో సీనియర్, జూనియర్ సహాయకులను తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. వారు క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించి, దరఖాస్తుల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పురోగతిని రోజువారీగా పర్యవేక్షిస్తూ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ అమలు వేగిరం చేయండి జిల్లాలో సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ కార్యక్రమాల అమలుతో పాటు ప్రగతి సమాచార వ్యవస్థలో ఆర్థిక, భౌతిక పురోగతి వివరాలను గడువులోగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు మహేశ్, డాక్టర్ మన్మోహన్, సునీత, సుమ, రఘుచంద్రరావు, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉచితం’ ఇక చాలు..!
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి టీజీఎస్ ఆర్టీసీ తూట్లు పొడుస్తోంది. ఉచిత ప్రయాణ సేవలనుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు కనినిపిస్తోంది. ప్రధాన రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్లో హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులను చాలా వరకు తగ్గించింది. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్కు ప్రతీ 5 నుంచి 10 నిమిషాలకు ఒక బస్సు నడిచేది. కానీ, ఇప్పుడు గంట నుంచి గంటన్నర వరకు ఎక్స్ప్రెస్ బస్సులు కనిపించడం లేదు. దీంతో ఉచితంగా ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించాల్సిన మహిళలు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనతోనే.. ఉద్యోగుల జీతాల పెంపు, పశ్చిమ ఆసియాలో యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఈ మేరకు ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనకు ఆర్టీసీ యాజమాన్యం వచ్చింది. హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించాలని గత ఏప్రిల్లో ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులను డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల వైపు మళ్లించి రోజువారీ ఆదాయం పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఎక్స్ప్రెస్ బస్సులను చాలావరకు తగ్గించింది. దీంతో బస్సుల ఫ్రీక్వెన్సీలో చాలా తేడా వచ్చింది. ప్రయాణికులు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్ వరకు నడిపించడంతో ఆర్టీసీ అధికారులు ఆశించిన మేరకు సంస్థకు ఆదాయం పెరిగింది. హైదరాబాద్ రూట్లో వరంగల్ రీజియన్లో రోజుకు రూ.1,00,000 నుంచి రూ.3,00,000 వరకు ఆదాయం పెరిగిందని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. బస్సులు తగ్గించడం దారుణం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం దారుణం. నేను పస్రా నుంచి ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ చేరుకున్నా. 11.30 అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క బస్సు రాలేదు. బస్సులు తగ్గించారని తెలిసింది. పేద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బస్సులను పెంచాలి. – భాగ్యమ్మ, పస్రా గంటలకొద్ది నిరీక్షణ నేను హైదరాబాద్ వెళ్లేందుకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్కు వచ్చా. గంటన్నర నుంచి ఎక్స్ప్రెస్ బస్సు కోసం ఎదురుచూస్తున్నా. పేద, మధ్య తరగతి వారి ప్రయాణానికి అనువుగా ఉండే ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం సమంజసం కాదు. హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలి. – రాజు, వరంగల్ నగదు ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సుల తగ్గింపు 5 –10 నిమిషాల ఫ్రీక్వెన్సీని గంట నుంచి గంటన్నరకు పెంపు ఉచిత బస్సు కోసం మహిళా ప్రయాణికుల ఎదురుచూపు సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రణాళిక -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
విద్యారణ్యపురి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విదత్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల తరగతులు బహిష్కరింపచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగానే బంద్ పాటించాయి. ఈసందర్భంగా వామపక్షాల విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులు కేయూ జంక్షన్ నుంచి ఎస్డీఎల్సీఈ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ రోడ్డులో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి హనుమకొండ పోలీస్టేషన్కు తరలించారు. వామపక్ష విద్యార్థి సంఘాల బాధ్యులు బాషబోయిన సంతోశ్ (ఏఐఎస్ఎఫ్), మంద శ్రీకాంత్ (ఎస్ఎఫ్ఐ), బి.నర్సింహారావు (పీడీఎస్యూ), మాస్ సావిత్రి (ఏఐఎఫ్డీఎస్), మర్రి మహేశ్ (పీడీఎస్యూ), రోహిత్ (ఏఐఎస్బీ), వెంకటేశ్ (ఏఐడీఎస్ఓ), ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు స్టాలిన్, ఉట్కూరి ప్రణీత్, మోహన్, మిస్సా, తాజుద్దీన్, సమీర్, వంశీ, కార్తీక్, మధు, సురేశ్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించిన వామపక్ష విద్యార్థి సంఘాలు -
‘ఎస్ఐఆర్’ను వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జా బితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో గా పూర్తి చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్కుమార్ శర్మ ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవా రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ప్రతీ బీఎల్ఓ రోజుకు కనీసం 15 శాతం డిజిటలైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, అధికారులు పాల్గొన్నారు. సైబర్ మోసం.. సంగెం : సంగెం మండలం లోహిత పెద్దతండాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి గుగులోతు వెంకటేశ్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 94,947 లను డ్రా చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. వెంకటేశ్ మొబైల్కు పలు మార్లు ఓటీపీ వచ్చింది. దీంతో బాధితుడు ఫోన్పే ఓపెన్ చేసి చూడగా అతడి అకౌంట్లోని డబ్బులు పలుమార్లు కట్ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నాడు. అనంతరం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి కాళోజీ సెంటర్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ఈయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిరసిస్తూ ఈనెల 11న భద్రాద్రి జిల్లాలో మొదలు కానున్న జన జాగరణ యాత్ర వాల్ పోస్టర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు జరిగే ర్యాలీ ఈ నెల 29న వరంగల్ జిల్లాకు చేరుకుంటుందని, ర్యాలీలో జిల్లాలోని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, జిల్లా కార్యవర్గ సభ్యులు వివేకానంద, శ్రీనివాస్, రాజ్కుమార్, రఘు, నవీన్ దేవరాజ్, అశోక్ పాల్గొన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయండి వరంగల్ అర్బన్: జంతు వధశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాజీపేట, హనుమకొండలోని జంతు వధశాలలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలిచ్చారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం నక్కలగుట్ట వార్డు కార్యాయాలన్ని తనిఖీ చేశా రు. అనంతరం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటరీ ఇన్న్స్పెక్టర్లు, అర్బన్ మలేరియా విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, నరేందర్, గోల్కొండ శ్రీను, హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అభ్యుదయ సేవా సమితి , స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్లో సెప్టిక్ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్పై అవగాహన పోస్టర్లను కమిషనర్ టి.వెంకన్న ఆవిష్కరించారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం
నర్సంపేట: గ్రామపంచాయతీల్లో సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించినా.. అమలు చేయడంలో సర్పంచ్లు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్లో శుక్రవారం గ్రామపంచాయతీ–సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం సమగ్ర ఓటరు ఇంటింటి సర్వేలో సర్పంచ్లు ముందుగా ఓటరు ఫారం నమోదు చేసి డిజిటలైజేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ట్రైనీ డిప్యూటి కలెక్టర్ శృతిహర్షిత, ఆర్డీఓ ఉమారాణి, డీఆర్డీఓ నాగపద్మజ, అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. ‘సర్’ సకాలంలో పూర్తి చేయాలి నెక్కొండ: ‘సర్’ ప్రక్రియ ముందుకు సాగేలా అధికారులు సమష్టిగా కృషి చేసి, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండ పట్టణంలో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ సందర్శించారు. వెనక బడి ఉన్న పోలింగ్ స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతిహర్షిత, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. రుణాలు సకాలంలో అందించాలి న్యూశాయంపేట: శ్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శ్రీనిధి కార్యక్రమం అమలు, రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి దోహదపడే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, శ్రీనిధి జోనల్ ఆఫీసర్ ఎస్ఎన్. ఆర్ఎం.సైదిరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
మొత్తం విస్తీర్ణం: 407.7చ.కీ
జనాభా : 12లక్షలు (సుమారు) అసెస్మెంట్లు (భవనాలు) 2,27,365ఏడాదికి పన్ను రూపంలో ఆదాయం రూ.170కోట్లుఆదాయం రూ.70.34కోట్లు అంకెల్లో నగరం (బల్దియా అధికారిక గణాంకాల ప్రకారం) వీఎల్టీ ఆదాయం : రూ.6కోట్లు ఖాళీ స్థలాలు (వెకండ్ ల్యాండ్ ట్యాక్స్): 8,600డ్రెయినేజీలు : 4,669 చ.కీ -
సాగుదామా.. ఆగుదామా!
సాక్షిప్రతినిధి, వరంగల్: వానాకాలం ప్రారంభమై నెల దాటినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగట్లేదు. శుక్రవారం నాటికి 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆతర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. వరి రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులు పడుతున్నారు. వానాకాలం సాగులో ముందుకెళ్లడమా? ఆగిపోవడమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. వానాకాలం సాగు లెక్క ఇలా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన సీజన్ అండ్ క్రాప్ కవరేజ్ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 15.93 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5,00,220 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే మొత్తం లక్ష్యంలో 31.42 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 9.21 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 36,201 ఎకరాల్లో (3.9 శాతం) మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 5,94,102 ఎకరాల లక్ష్యానికిగాను 4,19,605 (70.62 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. వరి నాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. 52 మండలాల్లో లోటు, భారీ లోటు.. 79 మండలాలకు గాను ఈ వానాకాలంలో ఇంకా 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతమే ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, హసన్పర్తి, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, వరంగల్ జిల్లా గీసుకొండ, నర్సంపేట, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో భారీగా లోటు వర్షపాతం ఉంది. అలాగే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్లో 8, జనగామలో 7, మహబూబాబాద్లో 12, జేఎస్ భూపాలపల్లిలో 7 మండలాలు కలిపి 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం సాగు పూర్తైంది. జిల్లాల వారీగా వర్షపాతం ఇలా..( మి. మీలలో)194.6 85.855.9హనుమకొండ203.2 113.5వరంగల్44.1 163.9 131.0జనగామ20.1 186.2 161.013.5 262.5 292.511.4 ములుగు217.3 178.6జయశంకర్ భూపాలపల్లి17.8 సాధారణ వర్షపాతం నమోదైన వర్షం (మి. మీలలో) లోటు / అధికంకలిసిరానికాలం అన్నదాత అయోమయం ములుగు మినహా ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వాన జాడ లేదు, సాగు జోరు లేదు.. ఇప్పటికీ 31.42 శాతమే సాగు కాడెత్తేసిన వరి రైతు.. 9,21,445కు 36,201 ఎకరాల్లో సాగు రైతులకు చుక్కలు చూపుతున్న వానాకాలం సాగు -
భూ వివాదాలు లేకుండా సర్వే
నెక్కొండ: నిజాం కాలం నాటి భూ రికార్డులు, హ ద్దుల నేపధ్యంలో కొనసాగుతున్న భూ సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందని, ఇందుకోసం ప్రభుత్వం భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిందని ల్యాండ్ సర్వేయర్, ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అసిస్టెంట్ అ ధికారి ఎం.శ్రీనివాసులు అన్నారు. భూ రీసర్వేలో భాగంగా మొదటి విడతగా మండలంలోని వెంకటాపురంను పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురంలో ఏర్పాటు చేసి న గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సర్వేకు అధునాతన రోవర్స్ మిషన్లు వాడుతామన్నారు. ఉపగ్రహ చానెళ్ల ద్వారా యంత్రాలు పనిచేస్తాయన్నారు. రైతుల సాగు భూములతోపాటు, చె రువులు, కుంటలు, ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఈ నెల 14 నుంచి సర్వే మొదలవుతుందని, అందరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజ్కుమార్, ప్రభాకర్, సర్పంచ్ కవిత పాల్గొన్నారు. ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అసిస్టెంట్ అధికారి శ్రీనివాసులు -
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
నర్సంపేట: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారధి, పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, జిల్లా సహా య కార్యదర్శి అనువాల నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నా యకుడు రవీందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బంద్ శుక్రవారం విజయవంతమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి అక్షయ పాత్ర, ఇస్కాన్, మన్నా సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి జీఓ నంబర్ 7, 8, 9లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, పీడీఎస్యూ రాష్ట్ర కన్వీనర్ అనుష, రాజు, సిద్దు, వంశీ, ప్రశాంత్, కల్యాణ్, శ్యామ్, అక్షయ్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ బంద్ విజయవంతం -
నీళ్లు లేక పొలాలు దున్నలేదు..
వేలేరు: వేలేరు మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవక ఇంకా పొలాలు దున్నలేదు. అలాగే నాటేందుకు సిద్ధం చేసిన వరినారు రోజురోజుకూ ముదిరిపోతోంది. ఎక్కువ రోజులు నారు ముదిరి పోతే దిగుబడి కూడా తగ్గుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సంబంధిత అధికారులు స్పందించి త్వరగా గండి రామారం లిఫ్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. – ఆవునూరి శ్యాం, రైతు, పీచర పత్తి మొలకలు ఎండుతున్నాయి..కొన్ని రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు 3 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటడంతో మొలకెత్తాయి. ప్రస్తుతం సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టి ఆందోళన చెందుతున్నాం. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోతాయి. దీంతో మరింత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. – హింగే మనోహర్, రైతు, పీచర వానల కోసం ఎదురు చూస్తున్నాఐనవోలు: నాకు చెలుక, పొలం కలిపి 7.5 ఎకరాల వరకు ఉంది. 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పసుపు సాగు చేస్తున్న. వానలు సరిగ్గా కురవక రెండుసార్లు పత్తి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 2 ఎకరాల్లో పల్లికాయ వేశాను. మిగిలిన ఎకరంన్నరలో తిండి గింజల కోసం వరి సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే పెట్టుబడి 60 వేలు దాటింది. ఏటా మాదిరిగా వానలు సరిగ్గా కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సరైన వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతాం. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి. – నిమ్మాని వెంకటేశ్వరరావు, రైతు, కక్కిరాలపల్లి● -
బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేయాలి
● డీఐఈఓ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్ (వేలి ముద్రలు), ఐరీష్, అడ్రస్ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరదృతి, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు శర్మ, హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న టీజీసీపీజీఈటీ కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీసీపీజీఈటీ 2026 మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. 44 పీజీ కోర్సుల్లో 22 పరీక్ష కేంద్రాల్లో రోజుకు పలు కోర్సుల ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం సెషన్లో జర్నలిజం అండ్మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు 748 మంది అభ్యర్థులకు 608 మంది హాజరైనట్లు సీపీజీఈటీ కన్వీనర్ ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో ఎంపీఈడీ కోర్సుకు 1,293 మంది అభ్యర్థులకు 1,148 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో ఎంటీఎం, ఎమ్మెస్సీ జియా ఇన్ఫర్మేటిక్స్కు 324 మందికిగాను 263 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. -
అద్దెకిస్తామని చెప్పి.. కార్లు తాకట్టు పెట్టి
ఖిలా వరంగల్: ఐటీ కంపెనీల్లో కార్లు అద్దెకు పెట్టిస్తానని వాటిని తాకట్టు పెట్టి లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తన కారును ఐటీ కంపెనీలో అద్దెకు పెట్టానని, నెలకు రూ.35 వేలు అద్దె వస్తోందని, వరంగల్ కరీమాబాద్కు చెందిన సింగారపు శ్యామ్ కుమార్.. ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన మొహమ్మద్ సోహైల్ను నమ్మించాడు. సోహైల్ తన కారును శ్యామ్కు అప్పగించగా.. శ్యామ్ అడ్వాన్స్ కింద రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం కారును శ్యామ్కుమార్ వేరే వారి దగ్గర తాకట్టు పెట్టి లక్షలు కాజేశాడు. ఈవిషయమై బాధితుడు మొహమ్మద్ సొహైల్ పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ తెలంగాణ జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యామ్కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఎండీ సోహైల్(మరో నిందితుడు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఘరానా మోసం బయటపడింది. వారు ప్రయాణిస్తున్న మారుతి డిజైర్ కారుతోపాటు చింతల్ ప్లైఓవర్ బ్రిడ్జి కింద దాచిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బెలెనో), మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. బురిడీ కొట్టిస్తున్న ఇద్దరి అరెస్ట్ కార్లు, ఫోన్ స్వాధీనం -
భూముల రీసర్వేకు సహకరించాలి
చెన్నారావుపేట: గ్రామాల్లో భూముల రీసర్వేకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, ఈ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా సర్వే ఏడీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు గురువారం తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే ఈ రీసర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా తిమ్మరాయినిపహాడ్, జల్లి, అక్కల్చెడ, లింగాపురం, కోనాపురం గ్రామాలను ఎంపిక చేసినట్లు వివరించారు. అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ అబీద్అలీ, సర్పంచ్ రమేష్, ఆర్ఐ మమత, కార్యదర్శి రాంబాబు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కులాల పేర్లలో మార్పులు గమనించాలి : కలెక్టర్ న్యూశాయంపేట: ప్రభుత్వం సవరించిన బీసీల్లోని కొన్ని కులాల పేర్లను గమనించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–ఏ కేటగిరీ సీరియల్ నంబర్–7లో ఉన్న డొమ్మర పేరును తొలగించి గడవంశీయ, సీరియల్ నంబర్ 18లో ఉన్న పిచ్చిగుంట్లను తొలగించి వంశరాజ్గా సవరించినట్లు ఆమె తెలిపారు. సీరియల్ నంబర్–4లో ఉన్న బుడబుక్కలకు శివక్షత్రియ, 23లో ఉన్న వీరభద్రీయ (వీరముష్టి లేదా నెట్టికోటల)గా సవరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల అభ్యర్థన మేరకు వీరభద్రీయ, వీరముష్టి లేదా నెట్టికోటల పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నట్లు వవరించారు. ఈ మార్పు కులం పేరుకు మాత్రమేనని, సంబంధిత కులాల రిజర్వేషన్ వర్గీకరణ హక్కులు, ప్రయోజనాల్లో ఎటువంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు జల్లి విద్యార్థి ఎంపిక చెన్నారావుపేట: నర్సంపేట మినీ స్టేడియంలో ఈనెల 8న జిల్లాస్థాయి ఆట్యాపాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆట్యాపాట్యా క్రీడా పోటీలు నిర్వహించారు. అండర్–14లో జల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జరుపుల శివ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పెద్ది వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 11,12 తేదీల్లో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శివ పాల్గొంటారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భిక్షపతినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శివను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ ఈర్యా, ఉపాధ్యాయులు అనిత, సుభాష్, అశోక్, శ్రీనివాస్, కుమారస్వామి తదితరులు అభినందించారు. అద్దెకిస్తామని చెప్పి.. కార్లు తాకట్టు ఖిలా వరంగల్: కార్లను తాకట్టు పెట్టి రూ.లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తన కారును ఐటీ కంపెనీలో అద్దెకు పెట్టానని, నెలకు రూ.35 వేలు అద్దె వస్తోందని, వరంగల్ కరీమాబాద్కు చెందిన సింగారపు శ్యాంకుమార్.. ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన మొహమ్మద్ సోహైల్ను నమ్మించాడు. సోహైల్ తన కారును శ్యాంకు అప్పగించగా.. శ్యాం అడ్వాన్స్ కింద రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం కారును శ్యాంకుమార్ వేరే వారి దగ్గర తాకట్టు పెట్టి రూ.లక్షలు కాజేశాడు. ఈవిషయమై బాధితుడు మొహమ్మద్ సొహైల్ పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ తెలంగాణ జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యాంకుమార్, భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన ఎండీ సోహైల్(మరో నిందితుడు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఘరానా మోసం బయటపడింది. వారు ప్రయాణిస్తున్న మారుతి డిజైర్ కారుతోపాటు చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద దాచిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బెలెనో), మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. -
పప్పు సాగుకు ప్రోత్సాహం
హన్మకొండ: ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో పౌష్టికాహార భద్రతను మెరుగుపర్చడానికి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆహార భద్రతా పథకం కింద పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి రైతులకు విత్తనాలు రాయితీపై అందిస్తోంది. స్థానిక రైతులను అపరాల సాగు వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హనుమకొండ జిల్లాలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రైతాంగానికి రాయితీపై కంది, పెసర విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. వర్షాధారంగా నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలల్లో అంతర పంటగా, నేరుగా సాగు చేసుకోవచ్చు. రాయితీపై కంది, పెసర హనుమకొండ జిల్లాలో 550 ఎకరాల్లో కంది సాగుకుగాను 22 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. 150 ఎకరాల్లో పెసర సాగుకు 4 కిలోల చొప్పున 150 కిట్లు వచ్చాయి. కందిలో పీఆర్జీ 176 (పాతది), ఎల్ఆర్జీ–52 (పాతది), ఎల్ఆర్జీ –133/33 (కొత్తవి) రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని రాయితీపై రైతులకు అందిస్తున్నారు. దీంతో పాటు కంది డబ్ల్యూఆర్జీ–255 రకం 100 కిట్లు, పెసరలో ఎంజీజీ–385 రకం అందుబాటులో ఉన్నాయి. కంది ఎల్ఆర్జీ–133/33 రకం ధర రూ.137 కాగా, రాయితీ రూ.60 పోను రైతులు రూ.77 చెల్లించాలి. ఎల్ఆర్జీ–52 రకం ధర రూ.136. ఇందులో రాయితీ రూ.36 పోను రైతులు రూ.100 చెల్లించాలి. అదేవిధంగా కంది డబ్ల్యూఆర్జీ–255 రకం కిట్లు, పెసర డబ్ల్యూజీజీ– 385 రకం కిట్లు రైతులకు ఉచితంగా అందిస్తున్నా రు. స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి రాయితీ ద్వారా కంది, పెసర విత్తనాలను పొందవచ్చు. పప్పుధాన్యాల సాగు.. భూమిలోని నత్రజనిని పెంచి నేల ఆరోగ్యాన్ని సంపన్నం చేస్తుంది. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండానే సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి ఇది అనువైనది. వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. పప్పు దినుసుల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు రాయితీపై కంది, పెసర విత్తనాలు రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. పెసరను ఈనెల 15 వరకు, కందిని ఈ నెలాఖరు వరకు విత్తనాలు వేసుకోవచ్చు. – ఆదిరెడ్డి, సహాయ సంచాలకుడు, వ్యవసాయ శాఖరాయితీపై కంది, పెసర విత్తనాలు -
పార్కింగ్ అడ్డదిడ్డం
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ నుంచి తిరుమల బార్ జంక్షన్ వైపు సాయంత్రం పూట వాహనాలు నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ రోడ్డులోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు ఇష్టారాజ్యంగా వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. గంటల తరబడి వాహనాలు తీయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కనీసం సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ దారిగుండా వెళ్లే స్థానిక పోలీసులకు, ట్రాఫిక్ వారికి రోడ్డుపై నిలిపే వాహనాలు కంట పడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పోలీసులు కలగజేసుకుని ఈ దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
రెడ్క్రాస్ సొసైటీకి విరాళం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి తన ట్రస్ట్ తరఫున ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి రూ.1,00,116 విరాళం అందించారు. ఈమేరకు విరాళం చెక్కును గురువారం రెడ్ క్రాస్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న రెడ్క్రాస్ సొసైటీకి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఉన్నతాధికారులు, ట్రస్ట్ ప్రతినిధులు, రెడ్ క్రాస్ బాధ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 10న జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ గురువారం తెలిపారు. బీటెక్ ఆరో సెమిస్టర్, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ కూడా చేసినట్లు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న, బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18న, బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో చాలా కాలం నుంచి పేరుకుపోయిన స్క్రాప్ను ఎట్టకేలకు తొలగించారు. గత నెలలో ‘పేరుకుపోయిన స్క్రాప్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇనుప స్క్రాప్ను విక్రయించడానికి నిర్ణయించారు. ఈనేపథ్యంలో దీని కోసం టెండర్ పిలిచి, అధికంగా కోట్ చేసిన వారికి విక్రయించారు. దీనికి రూ.2,95,000 టెండర్ పాడినట్లు తెలుస్తోంది. కొనసాగిన టీజీసీపీజీఈటీ కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను నిర్వహిస్తున్న టీజీసీపీజీఈటీ రెండో రోజు గురువారం 22 కేంద్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని సీపీజీఈటీ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ రాజేందర్ తెలిపారు. రెండోరోజు మొదటి సెషన్లో ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకు 1,143 మంది, ఎంఏ తెలుగుకోర్సుకు 2,486మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెసీ డేటాసైన్స్ ప్రవేశ పరీక్షలకు 1,233 మందికి 1048 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ రాజేందర్ తెలిపారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కిలోల గంజాయిని హనుమకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద (ఇన్సినరేషన్ పద్ధతిలో) దహనం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. ఇందులో అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ పి.డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ పెరకవాడలో గురువారం చైన్స్నాచింగ్ జరిగింది. మినుముల వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిరాణా దుకాణానికి నడుస్తూ వెళ్తుండగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి బైక్పై వచ్చి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. -
గూడ్స్ ట్రాలీ ఆటో బోల్తా
నర్సంపేట రూరల్ : మేడారం జాతరకు వెళ్తున్న ఓ గూడ్స్ ట్రాలీ ఆటోటైరు పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. సూర్యాపేట జిల్లా వేములపల్లి మండలం రావులపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్, మంగమ్మ దంపతులు, చీమల అంజయ్య(55) కలిసి సుమారు 25 మందితో గూడ్స్ ట్రాలీలో ములుగు జిల్లా మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో ముత్తోజిపేట గ్రామ శివారు 365 జాతీయ రహదారి వద్దకు రాగానే ట్రాలీ ఆటో టైరు పేలిపోయి అదుపు తప్పి బోల్తా పడిపోయింది. దీంతో ఆటో ఉన్న చీమల అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్, మంగమ్మ దంపతులతోపాటు పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను 108లో నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎం రెఫర్ చేశారు. అంజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంజయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గూడ అరుణ్ తెలిపారు. ఒకరి మృతి.. పలువురికి గాయాలు మేడారం జాతరకు వెళ్తుండగా ఘటన -
రెండోరోజూ టీజీసీపీజీఈటీ
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీజీఈటీ రెండో రోజు గురువారం 22 కేంద్రాల్లో ప్రశాంతంగా కొనసాగిందని సీపీజీఈటీ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. రెండోరోజు మొదటి సెషన్లో ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకు 1,384మంది హాజరుకావాల్సి ఉండగా 1,143 మంది, ఎంఏ తెలుగు కోర్సుకు 2,946 మందికి 2,486 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెసీ డేటాసైన్స్ ప్రవేశ పరీక్షలకు 1,233 మందికి 1048 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ రాజేందర్ పేర్కొన్నారు. నేటి పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 10న జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ గురువారం తెలిపారు. బీటెక్ ఆరో సెమిస్టర్, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ కూడా చేసినట్లు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న, బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18న, బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
862 కిలోల గంజాయి దహనం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కిలోల గంజాయిని హనుమకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం (ఇన్సినరేషన్ పద్ధతి) చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. ఇందులో అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ పి.డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పథకాలు అర్హులకు చేరాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై అధి కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలన్నారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ముందుగా వారు గోవులకు గ్రాసం అందించి ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించుకున్నారు. దీపారాధన చేశారు. అమ్మవారిని దర్శించి కుంకుమార్చన, పూజలు నిర్వహించుకున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో సమీక్ష మహిళల కృషికి ప్రశంస హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. -
నర్సింగ్ విద్యార్థుల వెతలు
● 18 మంది అవసరం ఉండగా.. నలుగురే ట్యూటర్లు ● వార్డెన్లు లేకుండా కొనసాగుతున్న హాస్టల్ నిర్వహణ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆవరణలోని ప్రభుత్వ జనరల్ నర్సింగ్ స్కూల్ నలుగురు ట్యూటర్లతో నడుస్తోంది. వాస్తవానికి 18 మంది ట్యూటర్లు అవసరం ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే జాయిన్ కావడంతో విద్యార్థినుల బోధనకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ స్కూల్లో మూడేళ్ల కోర్సులో 200 మంది చదువుతున్నారు. వీరందరికి చదువుతోపాటు ఎంజీఎంలో నర్సింగ్ సేవలు, హాస్టల్ సదుపాయం ప్రిన్సిపాల్తో పాటు ట్యూటర్లు చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిత్యం విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే విద్యార్థినుల హాస్టల్ చూసుకోవడానికి ఇద్దరు వార్డెన్లు అవసరం ఉండగా.. ఒకరు కూడా లేరు. తక్షణమే ట్యూటర్లను నియమించి, విద్యాబోధనకు ఇక్కట్లు తొలగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బయ్యారంలో ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమం
బయ్యారం: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం బయ్యారం సమీపంలోని ఇనుపరాతిగుట్టను సందర్శించారు. అనంతరం మండలంలోని చర్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బయ్యారం గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి అప్పగించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి ఆంధ్రపాలకుల నుంచి తెలంగాణ సంపదను కాపాడామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్లో ఇనుపరాయి గనులున్నాయని, వీటి ఆధారంగా బయ్యారంలో సింగరేణి సంస్థతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఒకటి రెండుసార్లు విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణిలో 35 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 20 నుంచి అన్నం, నీరు ముట్టకుండా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. లక్షతోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు తదితర మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేదపిల్లలతోపాటు ఆడపిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా తాను తెలంగాణ సేనను ఏర్పాటు చేశానన్నారు. ఆడబిడ్డలకు రాజకీయంగా హక్కు ఉండాలని, ఆదివాసీల అభివృద్ధికి తమ పార్టీ ప్రత్యేకంగా రెండు గిరిజన విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. పార్టీ నాయకులు బోడ జనార్దన్, రామకృష్ణదొర, రియాజ్ అహ్మద్, నవీన్ ఆచారి, వీరన్న ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉక్కు పరిశ్రమపై చిన్నచూపు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత -
జీతాలు మహా ప్రభో!
వరంగల్ అర్బన్: చాలీచాలని జీతాలు. ఆ డబ్బులు కూడా సకాలంలో అందక కార్మికులు ఆర్థిక అవస్థలు పడుతున్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థలోని ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాహనాల డ్రైవర్లు, అర్బన్ మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల అవస్థలు వర్ణనాతీతం. వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అర్బన్ మలేరియా, ట్యాక్స్, జనరల్ విభాగంలో 3,200 మంది కార్మికులు ఔట్సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీ నెల రూ.6.40 కోట్ల సొమ్మును వేతన రూపంలో అందజేస్తుంటారు. ప్రతీ నెల 25వ తేదీలోగా అటెండెన్స్ పరిగణనలో తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాలి. కానీ, 10 రోజులు గడిచినా వేతనాలు అందలేదు. సొమ్ముకు సంబంధించిన చెక్కును సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదని బల్దియా అకౌంటింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో వేతనాలు కార్మికుల ఖాతాల్లో జమవువుతాయని, కమిషనర్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు. కానీ, కార్మికులు మాత్రం ఆరు నెలల నుంచి సకాలంలో జీతాలు రావట్లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులు కావొస్తున్నా అందని వేతనాలు ఔట్సోర్సింగ్ కార్మికుల వెతలు -
త్వరలో గోదావరి జలాలు తీసుకొస్తా
ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేలేరు: గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మండలానికి త్వరలోనే గోదావరి జలాలు తీసుకొస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శాలపల్లి, గొల్లకిష్టంపల్లి గ్రామాల్లో గురువారం ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓవ్యక్తి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఒక్క శాలపల్లిలోనే తాను రెండున్నరేళ్ల కాలంలో రూ.4 కోట్లపై చిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వేలేరు నుంచి పీచర వరకు రూ.6 కోట్లు, మరో రూ.5 కోట్లతో పీచర నుంచి లోక్యాతండా వరకు పీఆర్ రోడ్లు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా గండి రామారం లిఫ్ట్–1 పనులు వేగంగా జరుగుతున్నాయని అతిత్వరలోనే మండలానికి గోదావరి జలాలు తీసుకొచ్చి రెండు పంటలకు సాగునీరు అందిస్తానన్నారు. కేజీబీవీలో రూ.5.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, ఆయా గ్రామాల సర్పంచ్లు బిల్లా యాదగిరి, అశోక్, మనోజ్, శ్రీనివాస్, సాంబయ్య, రాజు, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, ఏఓ పద్మ, పీఆర్ ఏఈ రూపావతి, ఏపీఎం అనిత, ఏపీఓ విజయ, మండల మహిళా స మాఖ్య అధ్యక్షురాలు రేణుక, ఉపసర్పంచ్లు రమేశ్, సూర్యనారాయణ, నాయకులు మ ల్లికార్జున్, ప్రమోద్ రెడ్డి, రాజిరెడ్డి, సద్దాంహుస్సేన్, రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబర్చాలి
మామునూరు: డ్యూటీ మీట్ల ద్వారా వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబర్చాలని, కఠోర సాధన చేస్తే అన్ని రంగాల్లో రాణించడంతోపాటు విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లు అధిగమించొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 గురువారం సాయంత్రం ముగిసింది. ఈ డ్యూటీ మీట్లో జోనల్ పరిధి వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతోపాటు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫొరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లిిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషన్, ఫొటో, వీడియో గ్రాఫిక్ విభాగాల్లో పోటీ పడ్డారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి సీపీ ఎన్.శ్వేత చేతుల మీదుగా పతాకాలు అందజేశారు. కమిషనరేట్ విభాగానికి 13 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 28 పతకాలు వచ్చాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం కమిషనరేట్ టీమ్లు 9 పతకాలు సాధించాయి. ఇందులో రాణించిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజ్గిరి కమిషనరేట్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటారు. సీపీ శ్వేత మాట్లాడుతూ జోనల్ స్థాయిలో కనబర్చిన మాదిరిగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు, సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్ఐ సతీశ్, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, విజయ్కుమార్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి మాదిరిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముగిసిన భద్రాద్రి జోన్ పోలీస్ డ్యూటీ మీట్ –2026 -
పథకాలు అర్హులకు చేరాలి
● గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ● అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆ రోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల కృషిని ప్రశంసించిన గవర్నర్ హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. -
పక్కాగా సన్నాల లెక్క
ఖిలా వరంగల్: రైతులు పండించే సన్నధాన్యానికి సరైన ధర, సకాలంలో బోనస్ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విత్తనం కొనుగోలు చేసినప్పుడే పంటల సాగు లెక్కలు తేల్చేలా చర్యలు చేపట్టింది. సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత అది ఏరకమో తేల్చడం అధికారులకు కష్టంగా మారుతోంది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మార్పులు చేసింది. రైతులు దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే ఆవివరాలను విత్తన డీలర్లు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఈసారి బోనస్ చెల్లించేందుకు ప్రకటించిన ఏడు రకాల సన్నరకాల విత్తనాలను ఆన్లైన్ చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 1,30,000 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా లక్ష ఎకరాలకే వరి పంట పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్లు, బావుల కింద 24 వేల ఎకరాల్లో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సన్నరకాల విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేసినా.. జిల్లాకు చెందిన రైతులు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా ఆవివరాలను సంబంధిత జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్నరకం విత్తనాల సాగు విస్తీర్ణం తెలియనుంది. సన్నరకం విత్తనాల కొనుగోలు నమోదును సక్రమంగా చేస్తున్నారా లేదా అని మండలాల ఏఓలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రైతులు కొనుగోలు చేసిన సన్నరకం విత్తనాలకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను ఏఈఓలు పంటల నమోదు సమయంలో సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేయని రైతులు బోనస్కు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నూతన విధానంతో రైతులకు, అధికారులకు మేలు కలుగుతుందని, విత్తన వ్యాపారులు ప్రతి అమ్మకాన్ని ఆన్లైన్ చేయడంతో సాగు వివరాలు పారదర్శకంగా ఉంటాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. సొంత విత్తనాలు ఉపయోగిస్తే.. ప్రభుత్వం సూచించిన ఏడింటిలో ఏ రకం సొంత విత్తనాలు వాడుతున్నారో సంబంధిత ఏఈఓ వద్దకు వెళ్లి పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేయకుంటే భవిష్యత్లో ప్రభుత్వం బోనస్ చెల్లించడం కష్టమేనని అధికారులు వివరిస్తున్నారు. తప్పనిసరిగా ఏఓలు లేదా ఏఈఓలను కలిసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.24,000 ఎకరాల్లో నాట్లు ఆన్లైన్లో సన్నవడ్ల పంట వివరాలు నమోదు చేస్తున్న అధికారులు వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఈసారి తగ్గనున్న వరిసాగు విస్తీర్ణం ప్రస్తుతం బోర్లు, బావుల కింద నాట్లు వేసేందుకు రైతుల ఏర్పాట్లు -
వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబరచాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● ముగిసిన భద్రాద్రి జోన్ పోలీస్ డ్యూటీ మీట్ –2026మామునూరు: డ్యూటీ మీట్ల ద్వారా వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబరచాలని, కఠోర సాధన చేస్తే అన్ని రంగాల్లో రాణించడంతోపాటు విధి నిర్వహణలోఎదురయ్యే పని ఒత్తిళ్లు అధిగమించొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 గురువారం సాయంత్రం ముగిసింది. ఈ డ్యూటీ మీట్లో జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతోపాటు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫొరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లిప్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషన్, ఫొటో, వీడియో గ్రాఫిక్ విభాగాల్లో పోటీ పడ్డారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ఎన్.శ్వేత పతకాలు అందజేశారు. కమిషనరేట్ విభాగానికి 13 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 28 పతకాలు వచ్చాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం కమిషనరేట్ 9 పతకాలు సాధించాయి. ఇందులో రాణించిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజిగిరి కమిషరేట్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటారు. సీపీ శ్వేత మాట్లాడుతూ జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభనే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలన్నారు. అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు, సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్ఐ సతీశ్, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, విజయ్కుమార్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ ఉన్నారు. -
ఖాళీ స్థలాలు.. మురికి కూపాలు
● ఓపెన్ప్లాట్లలో డ్రెయినేజీ నీరు నిలిచి ప్రజలకు తప్పని ఇబ్బందులు ● పట్టించుకోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల అధికారులునర్సంపేట: మున్సిపాలిటీల్లోని నివాస ప్రాంతాల మధ్య ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆయా స్థలాల్లో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతీ సంవత్సరం కాలనీల ప్రజలు ఖాళీ స్థలాలతో ఎదురవుతున్న సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ, తూతూమంత్రంగా ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నారే తప్ప తిరిగి వాటిపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడం షరా మామూలుగా మారింది. అపరిశుభ్రతకు కారణమవుతూ చిట్టడవిని తలపిస్తున్నాయి. ఏపుగా పిచ్చిమొక్కలు, చెట్లు పెరగడంతో వాటి చుట్టూ నివాసం ఉన్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో డ్రెయినేజీ నీరు, వర్షపు నీరు ఖాళీ ప్లాట్లలో నిలిచి అపరిశుభ్రత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెందడం, పందులు, విష పురుగులకు నిలయంగా మారి దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఏడాది ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా సుమారు 65 వేల జనాభా ఉంటుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సంపేటలో ఖాళీ ప్లాట్లు 10 వేల వరకు ఉంటాయి. నీటి నిల్వపై ప్రతీ ఏడాది 250 నుంచి 300 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 14 ఫిర్యాదులు అందినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 16వేల జనాభా ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న వర్ధన్నపేటలో ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచిన సమస్యలు ఎదురవుతున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఇళ్ల స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ, వాటి నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్ల తరబడి వృథాగా మారి మురికి కూపాలుగా తయారవుతతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్య తీసుకోవాలని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. మునిసిపాలిటీ పరిధిలో ఖాళీ ప్లాట్లు ఉండి అందులో నీరు నిలవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే కొంత మంది సిబ్బందిని ఆ ప్లాట్ల వివరాలను సేకరించేందుకు కేటాయించాం. ఖాళీ ఫ్లాట్ల యజమానులు నీరు నిల్వకుండా లెవల్ చేసుకోవాలి. ఇక నుంచి నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకుంటాం. ఈ వర్షాకాల సీజన్లో సమస్యలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – కాటం భాస్కర్, నర్సంపేట మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల వివరాలు.. మున్సిపాలిటీ వార్డులు జనాభా నర్సంపేట 30 65 వేలు వర్ధన్నపేట 12 16 వేలు -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
భూముల రీసర్వేకు సహకరించాలి
దుగ్గొండి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని భూసర్వే వరంగల్ జిల్లా ఏడీ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మధిర గ్రామంలో భూముల రీసర్వేపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురాతన కాలం నాటి సర్వే ఆధారంగానే నేడు రికార్డులు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతుల భూములను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ భూములు ఎవరికో పోతాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. సర్వే సమయంలో అడిగిన పత్రాలు చూపించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముస్కు సమ్మక్క, సర్పంచ్ పరుపాటి పద్మ, ఉప సర్పంచ్ మడతలపాటి కుమార్, జీపీఓలు, ల్యాండ్ సర్వేయర్లు పాల్గొన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026తాజా వివాదానికి కారణాలివే.. కాజీపేట–హైదరాబాద్ రైళ్లకు వేగం! కాజీపేట నుంచి కాచిగూడ వైపు వెళ్లే పలు సుదూర ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ శాశ్వతంగా కొత్త మార్గాన్ని అమలు చేసింది. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. -
ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయాలి
దుగ్గొండి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని లక్ష్మీపురం, దుగ్గొండి గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారా.. లేదా.. ఎంతమందికి అందించారు. ఇంకా అందించాల్సి ఉందా.. అందించిన ఫారాల నుంచి ఎన్నింటికి తీసుకుని డిజిటలైజ్ చేశారనే వివరాలను పరిశీలించారు. ఫారం పూర్తి చేయడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓలు ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమక్షంలోనే ఫామ్ నింపి డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్రారెడ్డి, సమ్మక్క, డీటీ రఘు, సర్పంచ్లు కామిశెట్టి ప్రశాంత్, కన్నం అలీమాచిరంజీవి, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, బీఎల్ఓలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన నల్లబెల్లి: మండలకేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను కలెక్టర్ సత్యశారద మంగళవారం పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమీక్షించి ఈ నెల 24వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జిల్లా పంచాయతీ అధికారి ప్రేమలత, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, రవిచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. కలెక్టర్ సత్యశారద -
ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు పెంచాలి
కాళోజీ సెంటర్: ఈ విద్యా సంవత్సరంలో లక్ష్యం మేరకు ఇంటర్మీడియేట్లో అడ్మిషన్లు పెంచడానికి కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని నెక్కొండ, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతులు, మైనర్ రిపేర్లు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను సమీక్షించారు. ఆయా కళాశాలల అధ్యాపకులతో మాట్లాడుతూ ఇంటర్ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారీ అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్ధారిత లక్ష్యం 1311కు గాను 957 మంది విద్యార్థులు చేరారని, మరో రెండు వారాల్లో 400 పైగా అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు మాధవరావు, కరుణశ్రీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్ -
వ్యాపారాలతోనే మహిళల ఆర్థికాభివృద్ధి
ఖానాపురం: మహిళలు వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని దబ్బీర్పేట, చిలుకమ్మతండ, అశోక్నగర్, బుధరావుపేట, రాగంపేట, కొత్తూరు, రంగాపురం గ్రామాల్లో రూ.కోటి నిధులతో మహిళా సంఘం భవనాలు, అంగన్వాడీ భవన నిర్మాణాలు, అసంపూర్తి జీపీ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, రావుల హరీష్రెడ్డి, ఆత్మ చైర్మన్ యడ్ల భిక్షంరెడ్డి, సర్పంచ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలగందుల రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాకాల ఆయకట్టుకు నీటి విడుదలపై రెండు రోజుల్లో సమీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ముంపు నివారణకు చర్యలు
ఖిలావరంగల్: శివనగర్లోని మైసయ్యనగర్ వరద నీటి నిల్వ సమస్య నివారణకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలను చేట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వరంగల్ ఆర్డీవో సుమ, జీడబ్ల్యూఎంసీ ఈఈ సంజయ్, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు వర్రీ నే!
సాక్షి, వరంగల్: జిల్లాలో జూలై తొలివారం ముగిసినా కూడా వరుణుడు కరుణించకపోవడంతో ‘వరి’ సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 1,30,000 ఎకరాల్లో వరి సాగు చే స్తారని వ్యవసాయ అధికారులు ఖరీఫ్ సాగు ప్రణా ళిక రూపొందించినా లోటు వర్షపాతంతో అది కాస్త 30,000 ఎకరాలు తగ్గి 1,00,000 ఎకరాలు సాగు అవ్వొచ్చని అంచనా వేశారు. ఇందులో కూడా ఇప్పటివరకు బావులు, చెరువుల కింద కేవలం 24,000 ఎకరాల కోసం మాత్రమే వరి నార్లు పోశారు. ఇంకా 76,000 ఎకరాల్లో వరి నార్లు వేయాల్సి ఉండడంతో అన్నదాతల చూపు ఆకాశం పు మళ్లింది. జూలై రెండో వారంలో కురిసే వానలపైనే వరి సాగు ఆధారపడి ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే 1,30,000 ఎకరాల సాగు నుంచి 1,00, 000 ఎకరాలకు సాగు అంచనా తగ్గడంతో ఆ 30,000 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు నీరు తక్కువగా అవసరమున్న కంది, పెసరు సాగు చేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అలాగే ఇంకా 76,000 ఎకరాల్లో వరి సాగు కోసం నార్లు పోయాల్సి ఉన్నా వరుణుడు కరుణించకపోతే ఇంకా ఎన్ని ఎకరాల్లో వరి సాగు తగ్గుతుందోనని వ్యవసాయ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నీరు తక్కువగా అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో చేతికొచ్చే కంది, పెసర పంటలు రైతులకు కొంత మేర నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 4న జిల్లావ్యాప్తంగా కురిసిన 352.4 మిల్లీమీటర్ల వర్షంతో వరి నార్లు పోయడం ఊరటనిచ్చే అంశంగా మారింది. పూర్తి కాని పత్తి సాగు..జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తిని 1,20,500 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే ఇప్పటివరకు 91,900 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ఇంకా 28, 600 ఎకరాల్లో విత్తనాలు వేయాల్సి ఉంది. ఇటీవల కొన్ని చోట్ల వర్షాలు కురవడంతో విత్తనాల ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటికీ, అన్ని ప్రాంతా ల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. పెసర్లు 360 ఎకరాల లక్ష్యానికి గాను 290 ఎకరాలు, కందులు 254 ఎకరాల లక్ష్యానికి 125 ఎకరాల్లో సాగు పూర్తైంది. లోటు వర్షపాతం ఎక్కడంటే..జూన్ ఒకటి నుంచి జూలై ఏడో తేదీ వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. నర్సంపేటలో అత్యధికంగా 67 శాతం, ఖిలా వరంగల్లో 64 శాతం, గీసుగొండలో 59 శాతం, వరంగల్లో 58 శాతం, ఖానాపురంలో 54 శాతం, చెన్నారావుపేటలో 50 శా తం, పర్వతగిరిలో 49 శాతం, నెక్కొండలో 44 శాతం, సంగెంలో 43 శాతం, నల్లబెల్లిలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాయపర్తి (–18 శాతం), దుగ్గొండి (–14 శాతం), వర్ధన్నపేట (+1 శాతం) మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. జూలై రెండో వారంపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి వరి సాగుపై లోటు వర్షపాతం ఎఫెక్ట్ సాగు అంచనా 1,30,000ల నుంచి 1,00,000 ఎకరాలకు డౌన్ ఇప్పటివరకు వరి నాటేకల వేసింది 24,000 ఎకరాల్లోనే.. పత్తి టార్గెట్ 1,20,500 ఎకరాలున్నా.. ఇప్పటివరకు విత్తింది 91,900 ఎకరాలే.. -
నాగసుబ్రహ్మణ్యుడికి ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలిలోని ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం బౌమ, కృష్టాంగారక సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని తేనెపట్టు రూపంలో ప్రత్యేకంగా అలంకరించి సవరస క్షీరాభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పౌష్టికాహారం తీసుకోవాలి ఖానాపురం: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఎంహెచ్ఎన్ (మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్) ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ సాజీద అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలో ఆశల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంహెచ్ఎన్ మాతా, శిశువు ఆరోగ్యం, పోషణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలన్నారు. బీపీ, రక్తహీనత లాంటి పరీక్షలను ఎప్పటికప్పుడు గర్భిణులకు చేయాలన్నారు. ఐరన్, పోలిక్యాసిడ్ మాత్రలు, టీబీ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలన్నారు. వర్షాకాలంలో ప్రసవాలకు దగ్గరగా ఉన్న మహిళలు ఆస్పత్రులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో టీబీ నివారణ ప్రోగ్రాం ఆఫీసర్ అరుణ్కుమార్ జోషీ, డీపీహెచ్ఎన్ఓ మనోజ, వైద్యులు జ్యోతి, కల్పన, సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ న్యూశాయంపేట: భారత రెడ్క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది సేవా కార్యాక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త రెడ్క్రాస్ సొసైటీ జీవిత కాల సభ్యుడు మండల పరుశరాములు పాల్గొన్నారు. స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో టైలరింగ్ వృత్తిలో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సుగల ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు గీసుకొండ తహసీల్దార్ కార్యాలయం, డీఆర్డీఓ కార్యాలయం లేదా ప్రతీ సో మవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు అందించాలని కోరారు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలినర్సంపేట: మానవ (బాలల) అక్రమ రవాణాను అరికట్టాలని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో ముద్రించిన మానవ (బాలల) అక్రమ రవాణాను అరికడదాం అనే వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో మనుషులే వస్తువులుగా అమ్మకం చెంది మోసపోతున్నారన్నారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలు, ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల ప్రవర్తన పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండి వారి పట్ల ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్ 100, ఆడపిల్లలు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్స్కు కాల్ ద్వారా సమాచారం అందించి రక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ వరంగల్ ఆదర్శం
● ఏడీబీఐ జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో వరంగల్ అర్బన్/కాజీపేట అర్బన్: మలమూత్ర వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధీకరణలో గ్రేటర్ వరంగల్ పనితీరు ప్రశంసనీయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ(ఏడీబీఐ) జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో అన్నారు. మంగళవారం విలీన గ్రామమైన అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మలశుద్ధీకరణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో జపాన్ బృందం.. కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ టి.వెంకన్నతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా అమ్మవారిపేటలో రోజుకు 15 కిలోలీటర్ల సామర్థ్యంతో మలశుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పైరోలసిస్ విధానం ద్వారా మలాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి వ్యవసాయ భూముల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. శుద్ధి చేసిన నీటిని రహదారి మధ్య విభజన ప్రాంతాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. నగర అవసరాలకు అనుగుణంగా ఇటీవల రోజుకు 150 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆధునిక మలశుద్ధీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, మలశుద్ధీకరణ సాంకేతికత, వనరుల పునర్వినియోగ విధానం ఆదర్శప్రాయంగా ఉన్నట్లు డాక్టర్ కజుషి హషిమోటో అభినందించారు. సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, స్పందన, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘జెన్–ఏఐ’
కాళోజీ సెంటర్: ఏఐతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమం ‘శిక్షా కోపైలట్ ఎంపవరింగ్ టీచర్స్ విత్ జెన్–ఏఐ’ని విస్తరిస్తూ పాఠశాల విద్యాపరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాల్లోని 70 ప్రభుత్వ యూపీఎస్లు, 7 మోడల్ స్కూళ్లు, 10 కేజీబీవీల్లో దీనిని వర్తింపజేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం..గతేడాది వికారాబాద్, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని 500 స్కూళ్లలో 1,000 మంది టీచర్లతో ఈ పైలట్ ప్రాజెక్టును ‘శిక్షణ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో నిర్వహించారు. ఎస్ఈఆర్టీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఏఐ టూల్తో ఉపాధ్యాయుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెరిగాయని, పాఠాల తయారీ సులువైందని, విద్యార్థుల్లో భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని, ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చిన సానుకూల నివేదికల ఆధారంగా రాష్ట్రవ్యాప్త విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఉపయోగం ఇలా.. పాఠాల ప్రణాళిక : సిలబస్కు అనుగుణంగా ఆకర్షణీయమైన యాక్టివిటీలతో కూడిన లెస్సన్ ప్లాన్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. కంటెంట్ జనరేషన్ : విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా వ్యక్తిగతీకరించిన క్లాస్రూం కంటెంట్ను సృష్టించవచ్చు. ప్రశ్నల నిధి : విద్యార్థుల ప్రాక్టీస్ కోసం, పరీక్షల కోసం సిలబస్ ఆధారిత కస్టమైజ్డ్ క్వశ్చన్ బ్యాంకులను క్షణాల్లో రూపొందించుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో లభ్యంఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే గణితం, సైన్స్ (ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్), ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మీడియం ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలిఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు శిక్షణ ఫౌండేషన్ ప్రత్యేక మేనేజర్లను నియమించనుంది. వారు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్బోర్డ్ లాగిన్లను అందిస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి శిక్షణ తరగతులు, టీచర్ల ఫీడ్బ్యాక్తో కూడిన త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అర్హత కలిగిన ఉపాద్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఉండ్రాతి సుజన్ తేజ, ఏఎంఓ ఉపాధ్యాయులకు తోడుగా ‘శిక్షా కోపైలట్’ 6 నుంచి 10వ తరగతి బోధించే వారికి ఏఐ సాంకేతికత -
గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే..
ధర్మసాగర్: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన నివాసంలో మండలంలోని ఆరు గ్రామాల్లో రూ.61.24 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల మంజూరు పత్రాలను సర్పంచ్లకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఊ అంటారా.. ఉఉ అంటారా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. గతేడాది జూలై 8న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చాలా మంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం మంగళవారం ముగిసింది. ఆయా కార్పొరేషన్లకు ప్రస్తుతం ఉన్నవారినే తిరిగి చైర్మన్లుగా మరోమారు కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రంగా సాగుతోంది. ఈసమయంలో త్వరలోనే ఖాళీ అయిన నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లు, టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు, సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ముఖ్య నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం. ‘నామినేటెడ్’ పోస్టుల్లో ఎవరెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా నామినేటెడ్ పదవుల్లో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అధిష్టానం నిర్ణయం మేరకు వాటిని త్యాగం చేసిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈక్రమంలో మొట్టమొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత 2024 జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని నియమించిన ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి చాన్స్ ఇచ్చింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లు ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. పరకాల పోటీ నుంచి వైదొలగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్కు ట్రైబల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది. అలాగే, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అందరి పదవీ కాలం ముగియడంతో వారికి మరో చాన్స్ ఇచ్చి కొనసాగిస్తారా? మరికొందరు సీనియర్లకు సామాజిక ప్రాతిపదికన కొత్తగా అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. తిరిగి మరోసారి కొనసాగేందుకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు కొందరు సీఎం, మంత్రుల స్థాయిలో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎవరికీ ప్లస్.. ఎవరికీ మైనస్ అవుతోందన్న ఆందోళన ఆశావహుల్లో ఉంది. ఇప్పటి వరకున్న చైర్మన్లతో పాటు చాలా మంది సీనియర్లు ఉమ్మడి వరంగల్ నుంచి సామాజికవర్గాల వారీగా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిలో ఉన్న సీనియర్లు దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్, పింగిళి వెంకట రాంనర్సింహారెడ్డి పదవులు ఆశిస్తున్నారు. బండి సుధాకర్గౌడ్, వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావుతో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈసారి అధిష్టానం ఎలాంటి ఫార్ములా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వా రికి, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ప్రా ంతీయ సమతుల్యతను పాటిస్తూ పదవులు ఇస్తారా లేక ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే కొనసాగిస్తారా అన్నది సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ.. పదవీకాలం ముగిసిన నేతల్లో టెన్షన్ కొనసాగింపా, కొత్తవారికా.. సీఎం రేవంత్ నిర్ణయమే కీలకం రాజధానికి మారిన ‘నామినేటెడ్’ సీన్.. ఆశావహుల లాబీయింగ్ -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
నూతన హంగులతో లహరి బస్సులు
హన్మకొండ: ప్రయాణికుల సౌకర్యార్థం నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నూతన హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవాని ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇంటి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులకు అందుబాటు చార్జీలతో మెరుగైన సేవలు అందించేందుకు లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. ఇతర ప్రైవేట్ బస్సులకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యున్నత సౌకర్యాలతో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, లహరి బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన బాలుర ధ్రువపత్రాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డీవైఎస్ఓ స్వాగతం పలికారు. అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతి, నాణ్యమైన క్రీడా శిక్షణ, సౌకర్యాల గురించి వివరించారు. ఎంపికై న వారికి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్లు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో వారం రోజులుగా భూక్రయవిక్రయదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సర్వర్, వెబ్సైట్ మంగళవారం స్పీడ్ అందుకుంది. వరంగల్ ఆర్ఓ లో ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం 108 స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. మంగళవారం 67 స్లాట్ బుకింగ్స్ కాగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ను నిర్దేశించిన 15 నిమిషాల్లో పూర్తిచేసినట్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కరుణారెడ్డి తెలిపారు. దీంతో భూక్రయవిక్రయదారులు ఉపశమనం పొందారు. హన్మకొండ అర్బన్: యాక్షన్ ధాన్యానికి సంబంధించిన బకాయిలు, సీఎంఆర్ ధాన్యం బకాయిలను డిఫాల్ట్ రైస్మిల్లర్లు నిర్దేశించిన గడువు (ఆగస్టు 5వ తేదీ)లోగా ప్రభుత్వానికి చెల్లించాలని సివిల్ సప్లయీస్ హెడ్ ఆఫీస్ టాస్క్ఫోర్స్ అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఎన్.రవి చాంబర్లో రైస్ మిల్లర్లు, డిఫాల్ట్ రైస్మిల్లర్లతో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, టాస్క్ఫోర్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీచర్లకు శిక్షణ విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు ఈనెల 8 నుంచి10 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. హిందీ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లకు హనుమకొండలోని ప్రభుత్వ డైట్, ఇంగ్లిష్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ఫిజికల్ సైన్స్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనన్నారు. హనుమకొండ జిల్లాలో సుమారు 270 మంది తరగతులకు హాజరవ్వనున్నారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: ‘ట్రాన్స్ఫార్మేటివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్‘ అంశంపై నేటి (బుధవారం) నుంచి మూడు రోజుల సమీకృత ఉపాధ్యాయ శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మొత్తం 2,922 మంది ఉపాధ్యాయులు హాజరవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్కు జీహెచ్ఎస్ శంభునిపేటలో నిర్వహించనున్నారు. -
‘కుడా’కు 30 ఎకరాల భూమి అప్పగింత
నయీంనగర్: కుడా ల్యాండ్ పూలింగ్ స్కీం ప్రక్రియలో భాగంగా హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంగళవారం భూయజమానుల కమిటీ సభ్యులు బూర విద్యాసాగర్, ఎం.విజయ్కుమార్, డి.స్వరాజ్యలక్ష్మి బి.అశోక్కుమార్, బి.వెంకటయ్య, తిరుపతిరెడ్డి కుడా కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, సీపీఓ అజిత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఎకరాల భూమిని ఎల్పీఎస్ నిబంధనల ప్రకారం కుడా ఆధ్వర్యంలో లేఔట్ చేయడానికి అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక దరఖాస్తులు, భూమి హక్కు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ నగర సుందరీకరణ, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా చేయడానికి రానున్న నాలుగు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
అవినీతి నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ చౌరస్తా: ‘కుడా’ భూముల వేలంలో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, ‘కుడా’ మాజీ చైర్మన్లు హైదరాబాద్లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్లో మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక హైదరాబాద్లో దాక్కుని ప్రెస్మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కుడా భూముల వేలం పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని, వేలంలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హనుమాన్ టెంపుల్ సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, స్టార్ హోటళ్లను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు వివరించారు. పదేళ్ల పాలనలో జరిగిన వందల అక్రమాలను ప్రజల ముందు పెట్టే ధైర్యం తమకు ఉందని, తనపై అవినీతిని ఆధారాలతో ని రూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. -
‘సోషల్ వెల్ఫేర్’కు రూ.28 లక్షలు
కాజీపేట అర్బన్: మడికొండలోని గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.28 లక్షల నిధులతో పాటు తన వేతనం నుంచి రూ.2.50 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలను మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్తో కలిసి పరిశీలించారు. ఇటీవల విద్యార్థిని కుక్క కాటుకు గురైన ఘటనను గోప్యంగా ఉంచిన ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జ్యోతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో లైటింగ్, 20 సీలింగ్ ఫ్యాన్ల ఏర్పాటుకు తన ఒక నెల వేతనం రూ.2.50 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రహరీపై ఫెన్సింగ్ మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చే యనున్నట్లు కలెక్టర్ చాహత్ తెలిపారు. గురుకుల విద్యా సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్ నరేందర్రెడ్డి, ఏసీపీ ప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ రాజు ఉన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ.. మడికొండలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 44, 45, 46, 64 డివిజన్ల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. సీఎస్ను కలిసిన హనుమకొండ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజూను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చారు. ‘సర్’ను పారదర్శకంగా పూర్తిచేయాలి కాజీపేట రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బూత్స్థాయి అఽధికారులను ఆదేశించారు. కాజీపేట పట్టణంలోని డీజిల్కాలనీ, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. వేతనం నుంచి రూ. 2.50 లక్షలు ఇస్తా: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రహరీకి రింగ్ చైన్ ఫెన్సింగ్ : హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
వేలేరు పోలీస్ స్టేషన్ తనిఖీ
వేలేరు: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, శాంతి భద్రతల నిర్వహణపై వారు సమీక్ష నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, రోడ్డు ప్రమాదాల వివరాలు తక్షణమే ఐఆర్ఏడీ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, రౌడీషీటర్ల కదలికపై నిఘా ఉంచాలని, వారి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఎస్సై చొరవ చూపాలని, రాత్రి పూట పెట్రోలింగ్ చేయాలని, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. -
గ్రేటర్ వరంగల్ ఆదర్శం
వరంగల్ అర్బన్/కాజీపేట అర్బన్: మలమూత్ర వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధీకరణలో గ్రేటర్ వరంగల్ పనితీరు ప్రశంసనీయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ(ఏడీబీఐ) జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో అన్నారు. మంగళవారం విలీన గ్రామమైన అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మలశుద్ధీకరణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో జపాన్ బృందం.. కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ టి.వెంకన్నతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మలశుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పైరోలసిస్ విధానం ద్వారా మలాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి వ్యవసాయ భూముల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. నగర అవసరాలకు అనుగుణంగా ఇటీవల రోజుకు 150 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆధునిక మలశుద్ధీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, మలశుద్ధీకరణ సాంకేతికత, వనరుల పునర్వినియోగ విధానం ఆదర్శప్రాయంగా ఉన్నట్లు డాక్టర్ కజుషి హషిమోటో అభినందించారు. ఈతరహా సుస్థిర పారిశుద్ధ్య నమూనాలు ఇతర పట్టణాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, స్పందన, ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ స్నేహలత, రాజ్మోహన్రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మలమూత్ర శుద్ధీకరణ పనితీరు ప్రశంసనీయం ఏడీబీఐ జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో క్షేత్రస్థాయిలో పరిశీలన, ప్రత్యేకాధికారి, కమిషనర్తో భేటీ -
ఆరేళ్లనుంచి ఆపరేషన్లు నిల్
అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఆగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని వెనుకభాగంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఒకటుందని ప్రజలకు తెలియడం లేదు. ఇక్కడ గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఆరేళ్లనుంచి ఆపరేషన్లు చేయడం లేదు. కోవిడ్కు ముందు ఎంజీఎం వెనుకభాగంలో ప్రత్యేకంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అడ్రస్ మార్చారు. ప్రస్తుతం ఓల్డ్ చిల్డ్రన్స్ వార్డు లోపల డ్యూటీ డాక్టర్ రూంను కేటాయించారు. ప్రస్తుతం ఈ వార్డుకు బయట వయోవృద్ధుల చికిత్స వార్డు, జిల్లా క్యాన్సర్ చికిత్స వార్డు అని పేరు రాశారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్రానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదు. బోర్డు అసలే లేదు. ముందు భాగాన ఉన్న ఓ గదిలో మాత్రం పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. నిలిచిపోయిన ఆపరేషన్లు ఈ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విరివిగా చేసేవారు. వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ల చేస్తూ కుటుంబ నియంత్రణలో విధులు నిర్వహించేవారు. కోవిడ్ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోలాగా ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం బంద్ చేశారు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఈ సదుపాయం ఉన్నట్లు ప్రజలకు తెలియట్లేదు. కొనసాగుతున్న ఇమ్యునైజేషన్ ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఇమ్యునైజేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రామన్నపేట, పాపయ్యపేట, పోతననగర్, మట్టెవాడ ప్రాంతాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నాన్ కమ్యూనకేబుల్ డిసీజ్కు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అలాగే 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు సర్వేకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ విధుల్లో ఉంటున్నారు. ఆదివారం తప్ప ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రచారం కొరవడడంతో అందరికీ తెలియడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో మాదిరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవి ధంగా ఈ సెంటర్ ప్రజలకు సులభంగా తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంజీఎంలో ఇలాంటి ఒక సెంటర్ ఉన్నట్లు తెలియని వైనం ప్రస్తుతం ఇమ్యునైజేషన్ విధుల్లో సిబ్బంది -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 211 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, మున్సిపల్ శాఖ 55, హౌసింగ్ 29, ఇతర శాఖలకు సంబంధించినవి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద గ్రీవెన్స్కు 211 ఫిర్యాదులు -
ఆరేళ్లనుంచి ఆపరేషన్లు నిల్
అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఆగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని వెనుకభాగంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఒకటుందని ప్రజలకు తెలియడం లేదు. ఇక్కడ గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఆరేళ్లనుంచి ఆపరేషన్లు చేయడం లేదు. కోవిడ్కు ముందు ఎంజీఎం వెనుకభాగంలో ప్రత్యేకంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అడ్రస్ మార్చారు. ప్రస్తుతం ఓల్డ్ చిల్డ్రన్స్ వార్డు లోపల డ్యూటీ డాక్టర్ రూంను కేటాయించారు. ప్రస్తుతం ఈ వార్డుకు బయట వయోవృద్ధుల చికిత్స వార్డు, జిల్లా క్యాన్సర్ చికిత్స వార్డు అని పేరు రాశారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్రానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదు. బోర్డు అసలే లేదు. ముందు భాగాన ఉన్న ఓ గదిలో మాత్రం పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆగిపోయిన ఆపరేషన్లు.. ఈ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విరివిగా చేసేవారు. వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ల చేస్తూ కుటుంబ నియంత్రణలో విధులు నిర్వహించేవారు. కోవిడ్ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోలాగా ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం బంద్ చేశారు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఈ సదుపాయం ఉన్నట్లు ప్రజలకు తెలియట్లేదు. కొనసాగుతున్న ఇమ్యునైజేషన్ ప్రక్రియ.. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఇమ్యునైజేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రామన్నపేట, పాపయ్యపేట, పోతననగర్, మట్టెవాడ ప్రాంతాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నాన్ కమ్యూనకేబుల్ డిసీజ్కు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అలాగే 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు సర్వేకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ విధుల్లో ఉంటున్నారు. ఆదివారం తప్ప ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రచారం కొరవడడంతో అందరికీ తెలియడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో మాదిరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవి ధంగా ఈ సెంటర్ ప్రజలకు సులభంగా తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంజీఎంలో ఇలాంటి ఒక సెంటర్ ఉన్నట్లు తెలియని వైనం ప్రస్తుతం ఇమ్యునైజేషన్ విధుల్లో సిబ్బంది -
12లో పది ఖాళీలు..
డీసీపీయూ విభాగంలో ఉన్న 12 పోస్టుల్లో 10 ఖాళీగా ఉన్నాయి. దత్తత, అనాథ పిల్లలకు స్పాన్సర్షిప్, బాల్య వివాహాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించే పీఓ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్, తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో చేర్పించడంతో పాటు ఆపరేషన్ ముస్కాన్లో దొరికిన పిల్లలకు ఆశ్రయం కల్పించే బాధ్యత పర్యవేక్షించే పీఓ ఇన్స్టిట్యూషనల్ కేర్, పోక్సో కేసుల నష్టపరిహారం, కోర్టు, పోలీసు సంబంధింత పనులు చూసే ఎల్సీపీఓ ఖాళీగా ఉన్నాయి. అలాగే బాలలకు సంబంధించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించే ఒక కౌన్సిలర్, ఇద్దరు సోషల్ వర్కర్లు, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే, జువెనల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో పాటు డీసీపీయూ యూనిట్లో మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారికే అదనపు పనిభారం పడుతోంది. అలాగే, పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే చైల్డ్ హెల్ప్లైన్ 1098 సిబ్బంది రాత్రి విధులకు దూరంగా ఉంటుండడంతో బాలల సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన విభాగ ఉన్నతాధికారి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా బాలల సంరక్షణ ఆపదలో పడిందనే ఆరోపణలొస్తున్నాయి. -
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా వచ్చే సోమవారం నాటికి పెండింగ్ వినతులు పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థలను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ, హాస్టళ్లలో దోమల నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదును చేపట్టాలని సూచించారు. ఈప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 263 అర్జీలు అందగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు వెంటనే పరిష్కరించాలివరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 211 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, మున్సిపల్ శాఖ 55, హౌసింగ్ 29, ఇతర శాఖలకు సంబంధించినవి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రజావాణిలో 263 అర్జీల స్వీకరణ -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషనన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషనన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలిహసన్పర్తి: హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్తున్న వరంగల్ పోలీస్ క్రీడాకారులకు సోమవారం కమిషనర్ శ్వేత ఆల్ ది బెస్ట్ చెప్పారు. మూడు రోజుల పాటు వివిధ అంశాల్లో జరిగే క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చాలన్నారు. గతంలో మాదిరిగా పతకాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు శ్రీనివాస్, ప్రభాకర్రావు, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా సర్ ?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు. ఈఎఫ్ల పంపిణీలో వేగం.. డిజిటైజేషనే నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం డిజిటైజేషన్ అయ్యింది. ఫీల్డ్లో పనిచేసిన శ్రమ వృథా అవుతోందా? బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. చదువు రాదు.. ఫారం ఎలా నింపాలిఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు. – బొజ్జు ఐలయ్య, జఫర్గడ్ శివారు వడ్డెగూడెం 47,54341,93387,31732,90024,3642,77,882 2,75,46837,8302,36,970 2,33,3697,76,953 7,47,1577,67,484 7,64,7974,84,935 4,82,070 5,09,0144,96,160ములుగుహనుమకొండజనగామజేఎస్భూపాలపల్లివరంగల్మహబూబాబాద్మొత్తం ఓటర్లు ఈఎఫ్లు డిజిటలైజ్ చేసినవి ‘ఫారం’ ఇంటికొచ్చింది.. సిస్టంలోకి చేరలేదు 98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్ మాత్రం 8.91 శాతం పంపిణీలో దూకుడు.. నమోదు మాత్రం నత్తనడక ఫైనల్ పబ్లికేషన్కు మరో 23 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ‘సర్’ పురోగతిజిల్లాలో మొత్తం ఓటర్లు, ఈఎఫ్లు మరియు డిజిటలైజ్ చేసిన ఫారాలు -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషనన్ను సందర్శించారు. పోలీస్ స్టేషనన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషనన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి..హసన్పర్తి: హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్తున్న వరంగల్ పోలీస్ క్రీడాకారులకు సోమవారం కమిషనర్ శ్వేత ఆల్ ది బెస్ట్ చెప్పారు. మూడు రోజుల పాటు వివిధ అంశాల్లో జరిగే క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చాలన్నారు. గతంలో మాదిరిగా పతకాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు శ్రీనివాస్, ప్రభాకర్రావు, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డిజిటలీకరణ వేగవంతం చేయాలి
వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హన్మకొండ అర్బన్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందని తెలిపారు. డిజిటలీకరణ ఈనెల 20లోపు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలీకరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతీ గురువారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వెల్లడించారు. సమీక్షలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా సర్?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు. ఈఎఫ్ల పంపిణీలో వేగం.. డిజిటైజేషనే నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం డిజిటైజేషన్ అయ్యింది. ఫీల్డ్లో పనిచేసిన శ్రమ వృథా అవుతోందా? బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. చదువు రాదు.. ఫారం ఎలా నింపాలి ఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు. – బొజ్జు ఐలయ్య, జఫర్గడ్ శివారు వడ్డెగూడెం మొత్తం ఓటర్లుఈఎఫ్లు పంపిణీడిజిటలైజ్ చేసిన ఈఎఫ్లుహనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి‘ఫారం’ ఇంటికొచ్చింది.. సిస్టంలోకి చేరలేదు 98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్ మాత్రం 8.91 శాతం పంపిణీలో దూకుడు.. నమోదు మాత్రం నత్తనడక ఫైనల్ పబ్లికేషన్కు మరో 23 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ‘సర్’ పురోగతి -
కలెక్టరేట్ నిర్మాణ పనులను పూర్తిచేయాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నిర్మాణంలో ఉన్న సమీకృత వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవన సముదాయాన్ని అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణం తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో భవనంలోని వివిధ విభాగాలు, మౌలిక సదుపాయాల పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బి ఈఈ రవీందర్, కుడా సీపీఓ అజిత్రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, డీబీసీడీఓ పుష్పలత, అధికారులు ఉన్నారు. పురావస్తు, పర్యాటక శాఖలపై సమీక్ష జిల్లాలో పురావస్తు సంపద, పరిరక్షణ, పర్యాటకరంగ అభివృద్ధి పనులపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్షించారు. వరంగల్ కోటలో నూతనంగా నిర్మించిన మ్యూజియంలోకి పాత మ్యూజియంలోని శిల్పాలు, పురావస్తు సంపదను తరలించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మొగిలిచర్ల ఏకవీరాదేవి ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కోటలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, పరిరక్షణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, కుడా సీపీఓ అజిత్రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, కేంద్ర పురావస్తుశాఖ అధికారి వంశీకృష్ణ, రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేసి వెంటనే డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారంలోపు ఫారాల పంపిణీని పూర్తిచేయాలని, ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలు తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించడంలో ఇబ్బంది పడుతున్న బీఎల్ఓలకు సూపర్వైజర్లు సహకరించాలన్నారు. అవసరమైన చోట అనుభవం ఉన్న వలంటీర్లను నియమించి బీఎల్ఓలకు సహకారం అందించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరును ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, తహసీల్దారులు, తదితరులు పాల్గొన్నారు. -
నిట్ దిక్సూచిగా నిలవాలి
కాజీపేట అర్బన్: విద్యార్థుల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి, మానసిక ఆరోగ్య పెంపుదలకు, సానుకూల క్యాంపస్కు నిట్ వరంగల్ క్యాంపస్ దిక్సూచిగా నిలవాలని దక్షిణ మధ్య రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ, సర్టిఫైడ్ మైండ్ ట్రైనర్, లైఫ్ కోచ్ గిరిజా శంకర్దాస్ అన్నారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నిట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ చైర్మన్, ప్రొఫెసర్ జి.అంబాప్రసాద్రావు ఆధ్వర్యంలో ‘విద్యార్థుల మానసిక శ్రేయస్సు, మెంటరింగ్, సానుకూల క్యాంపస్, సంస్కృతి’ అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫ్యాకల్టీ అప్గ్రేడేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ గిరిజా శంకర్దాస్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎఫ్డీపీ ప్రోగ్రాంను ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల్లో డిపార్టుమెంటల్ కమిటీలు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలతోపాటు, డెమోలు కూడా నిర్వహించారు. ఇంగ్లిష్లో రెండు పోస్టులు ఉండగా.. 18 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 13 మంది ఇంటర్వూకు హాజరయ్యారు. కెమిస్ట్రీ విభాగంలో 15 పోస్టులకు 35 మంది దరఖాస్తులు చేసుకుని 25 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. బయోటెక్నాలజీ విభాగంలో రెండు పోస్టులకు ఐదుగురు దరఖాస్తులు చేసుకుని నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వరుసగా 18 పనిదినాలు హాజరు నమోదు చేయకపోవడంతో మొత్తం 46 మందికి హనుమకొండ డీఈఓ ఎల్వీ.గిరిరాజ్ గౌడ్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తగిన వివరణ ఇవ్వకపోతే తదుపరి ఎలాంటి నోటీస్ లేకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసులో హెచ్చరించారు. కాజీపేట రూరల్: హైదరాబాద్ మాసబ్టాంక్లోని పోలీస్మెస్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కరాటే బుడోకాన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు కరాటే మాస్టర్లను ఎన్నుకున్నట్లు కాజీపేటకు చెందిన కరాటే మాస్టర్ నాయిని సదానందం తెలిపారు. హనుమకొండ నుంచి రాష్ట్ర కరాటే వైస్ ప్రెసిడెంట్లుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, నమిండ్ల శ్రీనివాస్, వరంగల్ నుంచి సీనియర్ కరాటే మాస్టర్ పండా దినేశ్, కాజీపేట నుంచి సదానందం, జాయింట్ సెక్రటరీగా హనుమకొండకు చెందిన రేణిగుంట్ల దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా హనుమకొండకు మాస్టర్ డి.శంకర్, కాజీపేటకు చెందిన పాశం దేవయ్యను ఎన్నుకున్నారు. విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా, అక్కా మెంటర్షిప్ను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అమలుకు ఉపక్రమించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలను, కోడింగ్పై అవగాహనను పెంపొందించేందుకు కేడీసీ విద్యార్థులు ఉపక్రమించినట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి అక్కడ ఆయా అంశాలపై డిగ్రీ విద్యార్థులు పాఠశాలల విద్యార్థులకు బోధన చేయనున్నారు. సోమవారం పలవురు విద్యార్థులు ఆకళాశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. అక్కడ ఆయా అంశాలపై బోధన చేసినట్లు ఆయన తెలిపారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026బాలల సంరక్షణపై పురాతన సంపదగా పాలంపేట శివాలయం ములుగు జిల్లాలోని రామప్ప ఉప ఆలయం శివ తారకేశ్వరస్వామి దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నంగా గుర్తించింది.సాక్షి, వరంగల్: బాలల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే వరంగల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) ఖాళీగా దర్శనిమిస్తోంది. ఇన్చార్జ్ డీసీపీఓ కాకుండా మిగతా 12 మందిలో ఒక అవుట్ రీచ్ వర్కర్, డేటా అనాలసిస్ట్ మినహా పది పోస్టులు ఖాళీగా ఉండడంతో పిల్లల రక్షణకు సంబంధించిన కేసుల పరిశీలన, పునరావాస చర్యలు, బాల్య వివాహాల నియంత్రణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చైల్డ్ కేర్ సంస్థల పర్యవేక్షణ, దత్తత ప్రక్రియ, వివిధ శాఖలతో సమన్వయం వంటి కార్యక్రమాల్లో జాప్యం ఏర్పడుతోంది. అలాగే ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించడం, కౌన్సెలింగ్, ఫాలోఅప్ చర్యలు, ఫీల్డ్ విజిట్ వంటి సేవలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తప్పిపోయిన, పారిపోయిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పోక్సో కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందించాల్సిన ఫైళ్లు కూడా ఎక్కడికక్కడా పెండింగ్లో ఉంటుండడంపై విమర్శలొస్తున్నాయి. ఈ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన ఉన్నతాధికారులు ఏడాదికిపైగా ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో బాలల సంరక్షణ వ్యవస్థ కుంటుపడుతోందన్న చర్చ జరుగుతోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారిస్తేనే డీసీపీయూ గాడిన పడే ఆస్కారముంది. ఇన్చార్జ్ డీపీసీఓ ఉమా మే 31న బదిలీ అయినప్పటి నుంచి అసలు ఈ బాలరక్షా భవన్ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇన్చార్జ్ డీసీపీఓ బదిలీతో పర్యవేక్షణ కరువు డీసీపీయూలోని 12 పోస్టుల్లో పది ఖాళీలే ఆపరేషన్ ముస్కాన్కు తప్పనితిప్పలు ఏడాదికిపైగా భర్తీకాని పోస్టులు కలెక్టర్ దృష్టి సారిస్తేనే బాలలకు రక్షణ -
ఎల్కతుర్తిని అభివృద్ధిలో ముందుంచుతాం
ఎల్కతుర్తి: భవిష్యత్లో హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి మండల కేంద్రాన్ని అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లి వరకు కుడా ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో 3.5 కిలోమీటర్ల పొడవునా చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీతో కలిసి శిలాఫకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. కుడా చైర్మన్ మాట్లాడుతూ.. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కుడా సీపీఓ అజిత్రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్కతుర్తి నుంచి దామెరకు వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్తో కలిసి పరిశీలించారు. మాజీ ఉప ప్రధానికి ఘన నివాళి స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మునిగడుప లావణ్య, ఉపసర్పంచ్ రాజు, ఆర్డీఓ వెంకటేశ్, ఈఈ భీంరావు, పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు ముప్పు శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రావుల రమేశ్, ముప్పు మహేందర్, శనిగరం వెంకటేశ్, శీలం అనీల్, హింగె శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 13 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం -
కోర్టు భవన పనుల పరిశీలన
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని పాత మున్సిపాలిటీ భవనాన్ని మున్సిఫ్ కోర్టుకు కేటాయించి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లా జడ్జి నిర్మలాగీతాంబ శనివారం సందర్శించి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కోర్టు కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందు కు వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 18న ప్రత్యేక లోక్ అదాలత్వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇరుపక్షాలు రాజీమార్గంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు పేర్కొన్నారు. దీనిపై మళ్లీ పైకోర్టుల్లో అప్పీలు చేసుకునే ఆవకాశం ఉండదని, వివాదానికి అక్కడితో పూర్తి ముగింపు పడుతుందని వివరించారు. డీఎల్ఎస్ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా దామోదరబాయి నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా దామోదరబాయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ విధులు నిర్వర్తించారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జ్ సూపరింటెండెంట్ దామోదరబాయికి హెచ్ఓడీలు, ప్రొఫెసర్, ఆర్ఎంఓలు, వైద్యు సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సన్మానించారు. అనధికార లేఔట్లపై చర్యలు వర్ధన్నపేట: అనధికార లేఔట్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా టౌన్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీఓ) జ్యోతి హెచ్చరించారు. మండలంలోని ఇల్లంద గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. పలు అభివృద్ధి పనులు, లేఔట్లు, పంచాయతీ రికార్డులు, పౌర సేవల చార్ట్ను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి శంకర్రావు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లౌఔట్కు అనుమతులు పొందాలన్నారు. అ భివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జి మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ పథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు భరోసా నిధుల జమ ఖిలా వరంగల్: జిల్లాలో 6 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిందని జిల్లా వ్యవసాయాఽధికారి విజయ నిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 1,55,396 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.145.99 కోట్లు భరోసా నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. శాంతివనంలో అడవి బాదం నర్సంపేట: నర్సంపేటకు చెందిన వనప్రేమి గోకా రామస్వామి పది సంవత్సరాల క్రితం యానాం నుంచి తెచ్చిన అడవి బాదం విత్తనాన్ని శాంతివనంలో నాటాడు. 30 అడుగుల వరకు పెరిగిన ఆ చెట్టు ఇప్పుడు కాయలు కాస్తోంది. శనివారం గాలి వానకు కొన్ని కొమ్మలు విరిగాయి. వాటికి కాసిన ఈ కాయలు చూడడానికి బాలా బాగున్నాయి. లోపల ఉన్న తామర గింజల మాదిరిగా ఉన్నవాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. -
పత్తి ఉత్పాదకత పెంపే లక్ష్యం
● రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ ● పక్కాగా ‘కపాస్ కాంతి మిషన్’ అమలు ● 1300 హెక్టార్లలో క్లోజర్ స్పేసింగ్ ప్రదర్శన క్షేత్రాలుఖిలా వరంగల్: పత్తి సాగులో ఉత్పాదకత పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ కపాస్ కాంతి మిషన్ పథకం ప్రవేశ పెట్టింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా ఎంపికై న రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలు అందించి, ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించనున్నారు. పత్తి ఉత్పాదకతను హెక్టారుకు 755 కిలోల లింట్ వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ దూరంలో పత్తి సాగు.. తక్కువ దూరంలో పత్తిని విత్తే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. (క్లోసర్ స్పేసింగ్) విధానంతో 1,300 హెక్టార్లలో ఎంపిక చేసిన 3,250 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు రూ.182 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ప్రదర్శన క్షేత్రాల్లో పాల్గొనే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేయించనున్నారు. దీంతో ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి దిగుబడి అధికమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల పేర్కొన్నారు. 500 ఎకరాల్లో సమగ్ర పంట యాజమాన్యం జిల్లాలోని 13 మండలాల్లో 200 హెక్టార్లలో సమగ్ర పంట యాజమాన్యం (ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్) కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు రూ.15లక్షల నిదులు ప్రభుత్వం కేటాయించింది. ఈ పద్ధతిలో ఎరువుల సమతుల్య వినియోగం, పురుగుల సమగ్ర నివారణ, నీటి నిర్వహణ, పంట సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈమిషన్లో విత్తనాల పంపిణీతోపాటు రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. సద్వినియోగం చేసుకోండి : డీఏఓ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నాణ్యమైన విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల సూచించారు. పలు మండలాల్లో పత్తి విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
● ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు ● లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
హన్మకొండ అర్బన్: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి బాలసముద్రం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి కాజీపేట అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అడిషనల్ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో శనివారం సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అడిషనల్ సీఈఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు సీహెచ్.రాజు, రవీందర్రెడ్డి, అదనపు తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ శివ, డీసీసీ కార్యవర్గ సభ్యుడు మామిండ్ల సురేశ్, బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్
రామన్నపేట: హనుమకొండ డీఎంహెచ్ఓ రామ్కుమార్ వైద్యులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళన చేయడంతో సెలవులో వెళ్లిపోయారు. ఈక్రమంలో శనివారం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. హసన్పర్తి డిప్యూటీ సివిల్ సర్జన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణారావును డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డిలతో పాటు ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. వరంగల్ క్రైం: ఆరోగ్యం బాగుండాలంటే దినచర్యలో మార్పు అవసరమని వరంగల్ సీపీ ఎస్.శ్వేత అన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో నిర్వహించిన వారాంతపు పరేడ్ను ఆమె పర్యవేక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణకు రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సత్యనారాయణ, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్భాస్కర్, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలో శనివారం మూడు విభాగాల్లో కంప్యూటర్సైన్స్, ఫిజిక్స్, కామర్స్ విభాగాల్లో డిపార్ట్మెంటల్ కమిటీలు, సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హాజరైన అభ్యర్థులకు డెమోలు నిర్వహించారు. కామర్స్ విభాగంలో ఇంటర్వ్యూలకు 69 మంది అభ్యర్థులను పిలవగా 58 మంది, ఫిజిక్స్లో 16 మంది అభ్యర్థులకుగాను 9 మంది, కంప్యూటర్ సైన్స్లో 19 మందికి 14మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఖిలా వరంగల్: ఈనెల 6న వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని వెంటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు వేయనున్నట్లు ఎంజీఎం సమీపంలోని పశువైద్య శాల డాక్టర్ అంబిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధి పశువైద్య కళాశాల మామునూరు, వరంగల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు వేయించాలని కోరారు. వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎల్ఎస్ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు. న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈపథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. -
ఉద్యోగాల పేరుతో దళారుల దందా!
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారనుంది. మరో మూడునాలుగు నెలల్లో ఎంజీఎంను 24 అంతస్తుల భవనంలోకి మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు దళారులు కొత్త దవాఖానాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దందా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పత్రికల్లో వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు బయటివారితో కలిసి ఈ దందాకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త భవనం ప్రారంభం కాగానే పోస్టులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని, అందులో ఉద్యోగాల భర్తీ చూసుకుంటామని నమ్మిస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరం పెడుతూ, అడ్వాన్స్గా డబ్బులిస్తేనే మా జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కాంట్రాక్టు ఈ నెలతోనే అయిపోతుందని, కొత్తవారు వచ్చేవరకు వారుంటారని, ఆ తర్వాత మీకే ఉద్యోగాలిప్పిస్తామని దళారులు బేరసారాలు సాగిస్తున్నట్లు పులువురు చర్చించుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వారి మాటలు నమ్మకుండా ఎంజీఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులను అడిగి క్లారిఫై చేసుకోవడంతో వారి దందా బయటపడుతోంది. అలాగే, ఎంజీఎంలో పనిచేసిన వారిని కూడా ఉద్యోగాలు, దళారుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ఈ ఉద్యోగాలకు జీఓ రాలేదు, పోస్టుల వివరాలు రాలేదు, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. నోటిఫికేషన్ కూడా రాకున్నా దళారుల మాయలో నిరుద్యోగులు పడే అవకాశం లేకపోలేదు. ఉద్యోగాలు ఇస్తామనే పుకార్లు నమ్మవద్దు.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దు. ఎలాంటి ఉద్యోగాలైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగాల నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. అనవసరంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారుల వలలో పడొద్దు. దళారులు సమాచారం తెలిస్తే కలెక్టర్, ఏసీబీ, ఇన్చార్జ్ సూపరింటెండెంట్కు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తామని బేరసారాలు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే జాబితాలో ఉంటారని నిరుద్యోగులకు గాలం ఎలాంటి పుకార్లు, షికార్లు నమ్మవద్దని అధికారుల సూచన -
కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలి న్యూశాయంపేట: ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంటసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. పంటమార్పిడి పద్ధతులు పాటిస్తూ, కూరగాయల సాగు ప్రోత్సహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఏఓ విజయనిర్మల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను నియంత్రించాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆర్బీఎస్కే, ఐడీఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, దోమల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో యూరియా, నీటి కొరత లేదు ‘వరంగల్, హనుమకొండ జిల్లాల్లో యూరియా కొరత లేదు. రానున్న 90 రోజుల పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవు’ అని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయనకు వివరించారు. దొడ్డి కొమురయ్య ఆశయాలు ఆదర్శం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు భీమారంలో టీబీ ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ హసన్పర్తి: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భీమారం పాత గ్రామపంచాయతీ ఆవరణలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్షయ–ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సందర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్రావు, ట్రెయినీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, వైద్యాధికారులు డాక్టర్ భరత్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్


