breaking news
Warangal District News
-
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్
శాయంపేట: మండలంలోని కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు, శాయంపేట సీఐ రంజిత్రావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీలో తేలిందని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోతు చరణ్ నుంచి రూ.20 వేల నగదు, సెల్ఫోన్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అల్లె అనిత నుంచి ట్యాబ్, టోకెన్ షీట్ బుక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. -
విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యా యమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివితే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. బాలికలకు సురక్షిత, ఆరోగ్యకర, సమానమైన భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత అన్నారు. సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్కుమార్, సఖీవన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి.హైమవతి, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డి.కల్యాణి, హనుమకొండ సీడీపీఓ ఎం.విశ్వజ, భరోసా కేంద్రం ఎస్సై బి.మంగ, పాఠశాల హెచ్ఎం ఉమ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ వరంగల్ లీగల్: స్వదేశీ వస్త్రాలు, చేనేత వస్రాలను ప్రోత్సహించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం–వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ మన వాతావరణానికి చేనేత వస్త్రాలు శాసీ్త్రయంగా చల్లదనంతో పాటు సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. సింఽథటిక్తో తయారుచేసిన విదేశీ వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొన్నారు. చేనేత ప్రదర్శన, అమ్మకం కౌంటర్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, కార్యదర్శి రమాకాంత్, ఉపాధ్యక్షుడు జయపాల్, కోశాధికారి అరుణ, సీనియర్ న్యాయవాదులు జీవన్గౌడ్, ఆనంద్మోహన్, కొండబత్తుల రమేశ్బాబు, చిర్ర సాంబశివరాజు, రాచకొండ కృష్ణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
కష్టపడే వారికి కాంగ్రెస్లో పదవులు
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయిక్ పరకాల: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా పదవులు వస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని, పార్టీ నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్హాల్లో మంగళవారం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నవజ్యోతి పట్నాయక్ నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా కోసం కష్టపడేవారికి ఎలాంటి అన్యాయం జరుగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక పాల్గొన్నారు. -
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్వాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూయజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు. పాత రోజులు గుర్తొచ్చేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మాము నూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1 గంటకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్ నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీ వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు.. 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న ముఖ్యమంత్రి -
84,654 మందికి పోలియో చుక్కలు
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో 84,654 మంది (100.4 శాతం) పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం 472 పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మొబైల్ బృందాలతో పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కార్యక్రమాన్ని పరిశీలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులు పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా 1 జూలై 2017 నుంచి 31 అక్టోబర్ 2025 మధ్య కాలంలో సంస్థలో చేరిన, ఈపీఎఫ్లో నమోదు కాకపోయిన, ప్రస్తుతం జీవించి ఉన్న, ఉద్యోగంలో ఉన్నవారిని ఈపీఎఫ్ఓ అందించే ఆన్లైన్ సౌకర్యం ద్వారా సంస్థలు ఉద్యోగుల నమోదు చేసుకోవాలని వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కవరేజీ పెరుగుతుందని, సంస్థలు తక్కువ ఆర్థిక, చట్టపరమైన భారంతో గత రికార్డులను సాధారణీకరించుకోవచ్చని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలల 20 రోజుల హుండీ ఆదాయం 5,56,967 రూపాయలు, పూజా టికెట్ల ద్వారా రూ.6,30,000 వచ్చింది. మొత్తం ఆదాయం రూ. 11,86,967 సమకూరిందని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: కోల్కతాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ విడుదల చేసిన జిమ్నాస్టిక్ డిప్లొమా ఇన్ కోచింగ్ 2024–25 ఫలితాల్లో వరంగల్ జిమ్నాస్ట్లు జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారు. వరంగల్లోని ఉర్సుకు చెందిన పేర్న సూర్యదేవ్ 72.12 శాతం మార్కులతో మొదటి ర్యాంకు, హనుమకొండలోని గుడిబండల్కు చెందిన జంగా శివసాయి 68.07 శాతంతో నాలుగో ర్యాంకు, లష్కర్బజార్కు చెందిన తెల్లి ప్రశాంత్ 60.83 శాతంతో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్నాస్టిక్ అకాడమీలో 2009 నుంచి 2021 వరకు ముగ్గురు క్రీడాకారులు శిక్షణ పొందారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వరంగల్ ఖ్యాతిని దేశం నలుమూలల చాటిన ముగ్గురు క్రీడాకారులను జిమ్నాస్టిక్స్ వరంగల్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ నెమరుగొమ్ముల రమేశ్రావు అభినందించారు. -
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ నడికూడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాయపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాలల్లో మధ్యాహ భోజనం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన స్థాయిలను పరీక్షించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాల్లో మెనూచార్ట్, అంగన్వాడీ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, తహసీల్దార్ రాణి, ఎంఈఓ కె.హనుమంతరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఎంజీఎంలో పెద్దసార్ల విధులు.. ఉండేది హైదరాబాద్.. వరంగల్కు అప్అండ్డౌన్ ● బయోమెట్రిక్ అటెండెన్స్పై చర్యలు శూన్యం ● ఖాళీగా దర్శనమిస్తున్న ఆర్ఎంఓల కుర్చీలు ● రూ.లక్షల్లో వేతనాలు.. గంటల్లో సేవలు బదిలీల తర్వాత పరిపాలనపై పర్యవేక్షణ శూన్యం..ఆస్పత్రిలోని కీలక మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికి వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురు నుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం పేద ప్రజలకు శాపంగా మారింది. ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదల ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్పై చర్యలు శూన్యం ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి.. వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే.. ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వారు యూనిట్ చీఫ్గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విషయం కలెక్టర్తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్కు సైతం స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది. -
సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
రాయపర్తి: సాదాబైనామా దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 22ఎ రిజిస్టర్లు, సాదాబైనామా దరఖాస్తులు పరిశీలించారు. రైతులు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ గంకిడి శ్రీనివాస్రెడ్డి, సర్వేయర్ వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి నర్సంపేట: నర్సంపేట పట్టణం మహబూబాబాద్ రోడ్డులో కబ్జాకు గురైన సర్వే నంబర్ 121 ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మైసీ శోభన్, రాష్ట్ర నాయకుడు ఆరేపెల్లి బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకుల బృందం మంగళవారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత రెవెన్యూ అధికారులు అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు. లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నివేషణ స్థలాలు లేని నిరుపేదలతో గుడిసెలు వేయించి ధర్నా, రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకులపల్లి ఉప్పలయ్య, చిలపాక బాబు, స్వామి, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సెమినార్కు సుమలత దుగ్గొండి: రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్లో నిర్వహించనున్న సెమినార్కు మండలంలోని నాచినపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు వెలిదండి సుమలత ఎంపికయ్యారు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఇంఫాక్ట్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారీర్ చాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించింది. దీంతో బుధవారం జరిగే సెమినార్కు సుమలత ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం జూలూరి జ్యోతిలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక వర్ధన్నపేట: మండలంలోని ల్యాబర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న మంద నందిని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ జలగం రఘువీర్ తెలిపారు. మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–17 వాలీబాల్ విభాగంలో అత్యున్నత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోలీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నందిని పాల్గొననుందని తెలి పారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో నందినిని హెచ్ఎం లింగం శైలజ, పీఈటీ రఘువీర్ ఉపాధ్యాయులు, అభినందించారు. బీసీలను అణచివేసేందుకు కుట్ర నర్సంపేట రూరల్: బీసీలను అణచివేసేందుకు అగ్రకులాలు కుట్రలు పన్నుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీని వాస్ అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు యాక య్య ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ చేశారన్నారు. తక్షణమే 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రవి, మరుపాల వీరస్వామి, కడారి సురేష్, సంగెం రమేష్, మేరుగు శంకర్లింగం, ముత్యం చేరా లు, సుదర్శన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బాలికలకు భరోసా.. ఈ విద్యాసంవత్సరం పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమార దశ భద్రత క్లబ్లు ఏర్పాటు చేయాలని సమగ్రశిక్ష అధికారులు ఆదేశించారు. మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత -
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సంగెం: రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. మంగళవారం సంగెం మండల రైతువేదికలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్ను వీక్షించారు. అనంతరం వరి, పత్తి పంటల కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పత్తి నాణ్యత ప్రమాణాలను వివరించారు. మండలంలోని చింతలపల్లిలో క్షేత్రస్థాయిలో పత్తి పంటను సందర్శించి చీడపీడల నియంత్రణ, వరి, మొక్కజొన్న పంటలపై నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. నల్లబెల్లిలో పంటల నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నర్సింహరావు, ఏఓ జ్యోత్స్నభవాని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
యువతలో మానసిక స్థైర్యం కల్పించాలి
నర్సంపేట: యువతలో మానసిక స్థైర్యం కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యు అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ సౌజన్యంతో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మారుతున్న అలవాట్లకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారిక విభాగం అధ్యక్షురాలు ఎస్.రజిత మా ట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన వారికి త్వరలో బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం సభ్యులు డాక్టర్ సంధ్య, మాధవి, అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, ఎన్ఎస్ఎస్ జిల్లా బాధ్యులు డాక్టర్ ఎం.రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వడివడిగా..
సాక్షి, వరంగల్: జిల్లావాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూ యజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు.పాత రోజులు గుర్తొచ్చేలా...కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మామునూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. -
మార్పులకు అనుగుణంగా విద్యాబోధన
● డీఈఓ రంగయ్య నాయుడునర్సంపేట రూరల్: విద్యాపరంగా సాంకేతిక రంగా ల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబో ధన జరగాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నా రు. మంగళవారం నర్సంపేట మండలం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల, జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ లర్నింగ్పై గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడు తూ విద్యార్థులకు సాంకేతిక విద్యపై బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు సాంకేతికంగా కంప్యూటర్పై అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్య నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కొర్ర సారయ్య, సరళ, శిబిరం ఇన్చార్జ్లు భిక్షపతి, పాపమ్మ, ఎస్ఆర్పీలు రాజప్రభు, సురేష్ కుమార్, సుధాకర్, గణేష్ కుమార్, ఉల్లాస్, రాజేంద్రప్రసాద్, డీఆర్పీలు, 13 మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించాలి
నెక్కొండ: పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ ఇంటికి సౌర విద్యుత్ వ్యవస్థను అందించేందుకు పాటుపడుతున్నాయని తెలంగాణ పునరుత్పాదక శక్తి ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సౌర విద్యుత్ అవగాహన సదస్సులో ఆయ న పాల్గొని మాట్లాడారు. సౌర విద్యుత్ పెంచడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు. జిల్లాలో తెలంగాణ రెడ్ కో పథకం కింద నెక్కొండ ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ సబ్ఇంజనీర్ నరేశ్, సోలార్ ఫీల్డ్ అధికారి నవీన్, కార్యదర్శి సదానందం, కుసుమ చెన్నకేశువులు, కదురు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ సత్యశారద ● నర్సంపేట బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ నర్సంపేట: వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని బీసీ బాలు ర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి ద్యార్థులు, సిబ్బంది వివరాలు, రిజిస్టర్లు, వంట గది, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ మెనూ ప్రకారం రుచి కర మైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్కు వచ్చివెళ్లే టప్పుడు కేర్టేకర్ వెంట ఉండాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం బీసీ హాస్టల్స్ విద్యార్థులు మెరుగైన ఫలితా లు సాధించేందుకు కృషిచేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారీగా ప్రశ్నలు అడిగా రు. హాస్టల్ పరిసరాలు, ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. -
వారానికి రెండ్రోజులే..!
ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదలు ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్పై చర్యలు శూన్యం ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి.. వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేదల ఆరో గ్యానికి భరసా కల్పించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు.. ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వా రు యూనిట్ చీఫ్గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్ర మే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విష యం కలెక్టర్తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్కు స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీ ఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది. హైదరాబాద్ నుంచి అప్అండ్డౌన్ఆస్పత్రిలోని కీలక మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికిపైగా వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురునుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేద ప్రజలకు శాపంగా మారింది. -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
● మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు ● 2 గంటలకు తిరుగు పయనం ● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎంసాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్య మంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం
● ఏసీపీ అంబటి నర్సయ్య రాయపర్తి: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్స య్య అన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో దాతల సహకారంతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యా పార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మైలారం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆడపిల్లల హక్కుల గురించి తెలుసుకోవాలి
రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక గీసుకొండ: ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక అన్నారు. సోమవారం వంచనగిరి కేజీబీవీలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు విద్య, చట్టపరమైన హక్కులు, వైద్య సదుపాయం, సామాజిక భద్రత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారతకు బాలికలు విజ్ఞానవంతులై చురుకుగా వ్యవహరించాలన్నారు. వేధింపులు, అత్యాచారాల బాధిత బాలికలు 1096,100, 9391907363 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఎస్సై రోహిత్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సురేశ్, అసిస్టెంట్ కౌన్సిలర్ రజిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్ష ఎంపికలో నూతన ఒరవడి
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపికలో నూతన ఒరవడికి ఏఐసీసీ శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. గుజరాత్లో రాహుల్గాంధీ పైలట్ ప్రాజెక్టుగా ఈకార్యక్రమాన్ని చేపట్టారని, అదే తరహాలో దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటన ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ సోమవారం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విపక్ష కార్పొరేటర్లున్న 57వ డివిజన్ హనుమకొండ శ్రీకృష్ణ కాలనీ, 59వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలో డివిజన్ కార్యకర్తలు, స్థానికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో పీసీసీ నాయకులు అనిల్కుమార్, ఈ.వి.శ్రీనివాస్రావు, బత్తిని శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 సంవత్సరానికిగాను వైన్షాపు(ఏ–4)ల టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. దరఖాస్తు గడువు నేటి(మంగళవారం)తో మరో ఐదు రోజులే ఉంది. మద్యనిషేధ, ఆబ్కారీశాఖ గత నెల 26న ఉమ్మడి వరంగల్లో 296 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి 296 మద్యం దుకాణాలకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 500 దాటలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువని చెబుతున్న అధికారులు.. మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వైన్షాపులకు ఈసారి దాఖలవుతున్న దరఖాస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 2023–25 టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్లో 15,926 దరఖాస్తులు రాగా, ఈసారి శనివారం నాటికి కేవలం 258 వచ్చాయి. హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలో 89, వరంగల్ (వరంగల్ రూరల్)లో 49, జనగామలో 34, మహబూబాబాద్లో 57, భూపాలపల్లి, ములుగు కలిపి 29 అప్లికేషన్లే వేశారు. సోమవారం కొంత స్పందన కనిపించినా.. ఉమ్మడి జిల్లాలో 457కే పరిమితమయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు 199 రాగా, హనుమకొండ జిల్లాలో 63, వరంగల్లో 46, జనగామలో 25, మహబూబాబాద్లో 56, భూపాలపల్లిలో 9 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. కాగా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, దరఖాస్తుల ద్వారానే కేవలం రూ.318.52 కోట్ల ఆదాయం వచ్చిందన్న చర్చ ఉంది. రూ.2 లక్షలున్న దరఖాస్తు ధర ఈసారి రూ.3 లక్షలకు పెంచగా.. పోటీ కూడా గతేడాది మాదిరిగానే ఉండి అప్లికేషన్ల ఆదాయం రెట్టింపవుతుందని భావించారు. అందుకు భిన్నంగా దరఖాస్తులు తగ్గడం.. ఆబ్కారీశాఖను సైతం షాక్కు గురిచేస్తోంది. వ్యాపారుల వ్యూహం ఏంటి? వైన్షాపుల టెండర్ల విషయంలో మద్యం వ్యాపారుల వైఖరి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే మద్యం ‘సిండికేట్’లనుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు పడాల్సి ఉన్నా చడీచప్పుడు లేదు. వరంగల్కు చెందిన కొంతమంది వ్యాపారులు సిండికేట్గా మారి వందల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. ఒక గ్రూపు రూ.14 కోట్లు వెచ్చించి 700 దరఖాస్తులు వేస్తే.. మరో గ్రూపు 650 దరఖాస్తులకు రూ.13 కోట్లు వెచ్చించింది. గతేడాది రూ.12 కోట్లు వెచ్చించి 600 దరఖాస్తులు వేసిన జనగామకు చెందిన ఓ సిండికేట్ గ్రూపు ఈసారి ఇప్పటి వరకు స్పందించలేదని తెలిసింది. ఇలా మహబూబాబాద్, భూపాలపల్లితో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని మద్యం వ్యాపారులు పలువురు ఇంకా దరఖాస్తులు వేయలేదు. దీంతో వారి వైఖరి ఏంటన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి 18 రోజులు గడిచినా టెండర్లకు స్పందన లేకపోవడంతో మద్యనిషేధ, ఆబ్కారీశాఖ అధికారులు సైతం ప్రస్తుతం షాపులు నడుపుతున్న వారికి, మద్యం వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. 2023–25 వైన్షాపుల టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ దెబ్బతింటున్న నేపథ్యంలో రియల్ఎస్టేట్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగంలో పలువురు మద్యం దందావైపు చూశారు. ఈ దందా కొందరికీ అనుకూలించగా, మరికొందరిని నిండా ముంచేసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టిన చాలా మంది ఈసారి దూరంగా ఉండడం వల్ల దరఖాస్తులు తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ నాలుగైదు రోజుల్లోనే కచ్చితంగా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా.. మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు 296 వైన్షాపులకు 500లు కూడా దాటని వైనం మిగిలింది ఇంకా ఐదు రోజులే.. గతేడాది 15,928 దరఖాస్తులు.. రూ.318.52 కోట్ల ఆదాయం రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు.. వ్యాపారుల తీరుపై అనుమానం.. ‘సిండికేట్’గా టెండర్లకు ప్రయత్నం? వేచిచూసే ధోరణిలో ఎకై ్సజ్ అధికారులు -
కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరం
● రూ.60,610 నగదు.. 9 ఫోన్లు స్వాధీనం ● కార్పొరేటర్ భర్తతోపాటు 11మంది అరెస్ట్ ● వారిలో ముగ్గురు మహిళలువరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సోమవారం టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతూ 12 మంది పట్టుబడినట్లు తెలిపారు. వారినుంచి రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన వారిలో సిరిసిల్ల జిల్లా శాంతినగర్కు చెందిన ఇందిరియాల రాజేందర్, కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్కు చెందిన గడ్డం శ్రీనివాస్, హనుమకొండ వడ్డేపల్లికి చెందిన గీతం జితేందర్రెడ్డి, కనకదుర్గ కాలనీకి చెందిన వెల్దండి రమేశ్, హనుమాన్నగర్కు చెందిన ముస్కం ముత్తయ్య, కనకదర్గ కాలనీకి చెందిన గుజ్జుల మహేందర్రెడ్డి (కార్పొరేటర్ భర్త), వేముల శివాజీ, బాలసముద్రానికి చెందిన కల్వ రమ, వాణినగర్కు చెందిన పల్లె సుజాత, కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన బీరం నీరజ, టీచర్స్ కాలనీకి చెందిన మడిశెట్టి భాస్కర్ ఉన్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫౌండేషన్ తరగతులు షురూ
నర్సంపేట రూరల్: ఈ విద్యా సంవత్సరంలో నర్సంపేట వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఫౌండేషన్ కోర్సు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 50 సీట్లను కేటాయించగా రాష్ట్ర కోటాలో 42 సీట్లు, నేషనల్ కోటాలో 8 సీట్లతో మొత్తం 50 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర కోటలో మొత్తం 42 సీట్లకు 42 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. నేషనల్ కోటలో 8 సీట్లకు గాను 5 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. మరో మూడు సీట్లు రానున్న కౌన్సెలింగ్లో భర్తీ కానున్నాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదార రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నర్సంపేట పట్టణంలోని సర్వాపురం శివారులో దాత స్వర్గీయ దొడ్డ మోహన్రావు అందించిన భూమిలో నూతనంగా నిర్మించిన 250 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనంలో ప్రారంభించారు. సీ బ్లాక్లో తాత్కాలికంగా వైద్య కళాశాల భవనాన్ని కేటాయించి 2024–25 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు ఎంబీబీఎస్లో మొదటి సంవత్సరాన్ని సైతం పూర్తి చేసుకున్నారు. 2025–26 సంవత్సరంలో ఎంబీబీఎస్కు రెండో బ్యాచ్ అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, నేషనల్ కోటా కింద మొత్తం 50 సీట్లకు గాను 47 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. సోమవా రం నుంచి వారికి తొలుత పౌండేషన్ కోర్సును ఆన్లైన్లో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేషన ల్ కోటాలో కౌన్సెలింగ్లో మరో ముగ్గురు ఎంబీబీ ఎస్ విద్యార్థులు రావాల్సి ఉంది. ఈనెల 23 నుంచి కళాశాలలో నేరుగా తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మా ణం, వసతుల కోసం సుమారు రూ.180కోట్లు మంజూరు చేసిందని, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని, తక్షణమే ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టి వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ప్రారంభించిన నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్ -
మూక్స్ శిక్షణ ప్రారంభం
● నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువస్తున్న మూక్స్(మాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్)లను సద్వినియోగం చేసుకోవాలని నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. నిట్ వరంగల్లోని సెమినార్హాల్ కాంప్లెక్స్లో వారం రోజుల మూక్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్వీ.రమణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ప్రొఫెసర్ ఇందిరా కోనేరు యాలవర్తి, నిట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మా పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదు
న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కీ (బీఎస్ఏ) కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నర్సంపేటకు చెందిన ఓ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో విద్యార్థి సంఘాలతో కలిసి కలెక్టర్ సత్యశారదకు మొరపెట్టుకున్నారు. నెలరోజులుగా పాఠశాలకు వెళ్లకుండా నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డీఎస్డీఓను కలెక్టర్ ఆదేశించారు. అయినా సమస్యలను ఇప్పుడే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కలెక్టర్ సమావేశ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు వారిని సముదాయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ సత్యశారద స్వీకరించారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 80 ఫిర్యాదులు రాగా రెవెన్యూ 40, జీడబ్ల్యూఎంసీ 6, హౌసింగ్ 4, డీఆర్డీఓ 4, మిగతాశాఖలకు సంబంధించి 26 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అలాగే తమ కుమారుడు (ప్రభుత్వ ఉద్యోగి) తమ బాగోగులు చూడటం లేదని కలెక్టర్కు విన్నవించారు. వర్ధన్నపేట సబ్ రిజిస్ట్రార్ ఏజెంట్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఈరెల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణం ఆపాలి వరంగల్ మట్టెవాడలోని సర్వేనంబర్ 442లోని ప్రభుత్వ భూమిలో కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ సర్వే నంబర్లో జిల్లా కోర్టు ప్రభుత్వ భూమిగా గుర్తించినా.. నిర్మాణాలు జరుగుతున్నాయి. – బి.రాజు కొత్తవాడ, వరంగల్ ప్రజావాణిలో బీఎస్ఏ బాధితుల మొర వినతులు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో 80 అర్జీలు -
వర్షార్పణం..
జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వానఈ ఫొటోలో తడిసిన మొక్కజొన్నను ఆరబెడుతున్న యువరైతు రెడ్డి కృష్ణ. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామం. వ్యవసాయ భూమి లేకపోవడంతో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఎకరం భూమిలో మొక్కజొన్న వేశాడు. పంట బాగానే వచ్చింది. కంకి తీసుకువచ్చి మిషన్లో వేసి జొన్నలు వేరు చేశాడు. ఒకరోజు పాటు జొన్నలను ఆరబోశాడు. అకస్మాత్తుగా సోమవారం తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షానికి మొన్నజొన్నలు తడిసిపోయాయి. దీంతో ఆరు నెలల పాటు చేసిన కష్టం ఒక్కరాత్రి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కౌలు డబ్బులు, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. సాక్షి, వరంగల్: జిల్లాలో సోమవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా మిరప తోటల్లో నీరు నిలిచింది. చేతికొచ్చిన మొక్కజొన్న తడిసి పోయింది. నల్లబెల్లి, దుగ్గొండి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో భారీ వర్షం కురవగా, పర్వతగిరి, ఖానాపురం, నర్సంపేట, రాయపర్తి, వరంగల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇతర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మొత్తంగా జిల్లాలో 545.2 మిల్లీమీటర్ల వర్షం కురసింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిరపతోటల్లో భారీగా నీరు నిలవడంతో ఆ పంటపై ఏమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతుల్లో కనబడుతోంది. కొన్నిచోట్ల వరి పంట కూడా నేలకు ఒరిగిన పరిస్థితి ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అలాగే వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు కొంతమేర తడిచినా.. వెంటనే అధికారులిచ్చిన టార్పాలిన్లతో రైతులు కప్పి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే.. ● భారీ వర్షంతో నల్లబెల్లి నుంచి మహమ్మద్ గౌస్పల్లి ప్రధాన రహదారిపై ఉన్న నందిగామ, రేలకుంట వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ● దుగ్గొండి మండలంలో మిరపతోటల్లో నీరు నిలిచింది. మొక్కజొన్న కల్లాలు తడిశాయి. పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం పడడంతో దూది గింజ నాణ్యత తగ్గింది. కొన్నిచోట్ల దూది నేలపై పడింది. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ● నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం చెరువు మత్తడి పోయడంతో లోలెవల్ బ్రిడ్జిపై వరదనీరు ప్రవాహం పెరిగి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రామస్తులు సహకారంతో లోలెవల్ బ్రిడ్జి దాటించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికెళ్లి పరిశీలించారు. అలాగే చంద్రుగొండ గ్రామానికి చెందిన దాసరి సంపత్కు చెందిన రెండు గేదెలపై పిడుగు పడడంతో మృత్యువాత పడ్డాయి. ● వరంగల్ నగరంలోనూ చాలా కాలనీల్లోని రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రాత్రి సమయంలోనే వర్షం నీరు క్లియర్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పత్తి రైతులకు తీవ్ర నష్టం, మిరపతోటల్లో నిలిచిన వర్షపు నీరు తడిసిన మొక్కజొన్న -
పౌరుల భాగస్వామ్యమే కీలకం
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తిలకించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. బహిరంగంగా నిర్వహించే డంప్సైట్లతో ఉత్పన్నమయ్యే అంత్య ఉత్పన్నాలను విషపూరిత వాయువులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్మార్క్ నగరంగా అవతరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యం ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన విధాన సంస్థల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్రెడ్డి, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్బాబు, ప్రిన్సిపల్, సైంటిస్ట్ డా.ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షంలోనూ బారులు
ఖానాపురం: పంటల సాగు చివరి దశకు చేరినా.. రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ గొడుగులతో వచ్చి టోకెన్లు తీసుకున్నారు. ఖానాపురం పరిధిలో బుధరావుపేటకు 444, మంగళవారిపేటకు 222, మనుబోతులగడ్డకు 222, అశోక్నగర్కు 333, దబ్బీర్పేటకు 222 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్దకు వెళ్లి వర్షంలో బారులుదీరి టోకెన్లు తీసుకున్నారు. -
వర్షంతో రైతుల్లో ఆందోళన
హన్మకొండ: వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికి వచ్చి కల్లాల్లో ఆరబోయగా, వర్షానికి తడిసిముద్దయ్యాయి. ముందుగా నాటు వేసిన వరి పంట కోతకు వచ్చింది. చేతికి వచ్చిన వరి.. ఈదురు గాలులు, భారీ వర్షం కురిసిన చోట నేలవాలుతోంది. దీంతో నీటిలో తడిసి ధాన్యం గింజలు మొలకెత్తి నష్టం చేకూరుతోందని రైతులు మొత్తుకుంటున్నారు. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. కమలాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో మోస్తరు వర్షం కురవగా.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 62.3 మిల్లీమీటర్లు, కమలాపూర్లో 43, ఆత్మకూరులో 31.5, దామెరలో 18.8, పులుకుర్తిలో 7.3, పరకాలలో 7, ఎల్కతుర్తిలో 6.3, ధర్మసాగర్లో 5.5, కాజీపేటలో 5, నడికూడలో 5, హసన్పర్తి చింతగట్టులో 5, శాయంపేటలో 4.5, హసన్పర్తి నాగారంలో 3.3, ఐనవోలు కొండపర్తిలో 2.5, మడికొండలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టరేట్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజవాణిలో జీడబ్ల్యూఎంసీ 16, పీడీ హౌసింగ్, ఆర్డీఓ హనుమకొండతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నర్సంపేట: బీసీ వ్యతిరేక అగ్ర కులాలకు చెందిన నాయకులు బీసీల హక్కులను కాలరాసే విధంగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే వచ్చేలా చేశారని బీసీ సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బీసీ సంఘాల జేఏసీ నాయకుడు డ్యాగల శ్రీనివాస్ముదిరాజ్, బీసీ సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘాల సభ్యులతో కలిసి సోమవారం అమరవీరుల జంక్షన్ వద్ద రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆరు శాతం కూడా లేని వారికి ఈడబ్ల్యూఎస్ ద్వారా 10శాతం రిజర్వేషన్లను దొడ్డి దారిలో కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల ఓట్లు అగ్రవర్ణ నా యకులకు వేయకుండా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. 42శాతం బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు ప్రతిఒక్కరూ బీసీ సంఘాల జేఏసీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు డ్యాగల శ్రీనివాస్ముదిరాజ్, కొల్లూరి లక్ష్మినారాయణ, చిలువేరు కొమ్మాలు, రుద్రారపు పైడి, మహాదేవుని జగదీష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్యాదవ్, నర్సంపేట పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, సురేందర్, రవీందర్, సురేందర్, శ్రీనివాస్, రమేష్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి
హసన్పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతీ చెరువు, కుంటలను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన చెరువులు, కుంటలు, కెనాల్ భూములు కబ్జా చేసిన అడ్డంకులు సృష్టించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వడ్లకొండ చెరువు కట్టను బలోపేతం చేయడమేకాకుండా కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. భూములను ఆక్రమిస్తే చర్యలు పర్వతగిరి: చెరువుకు సంబంధించిన భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని అన్నారం పెద్ద చెరువు తూము వెనుక భాగంలో ఉన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి తూమును వెంటనే రిపేరు చేయించి చెరువుకు సంబంధించిన భూములను ఎవరైన ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్రాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలకు ఎంపికపర్వతగిరి: మండలంలోని కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య, ఆర్డీఎఫ్ ప్రిన్సిపాల్ ఎ.జనార్దన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు మాట్లాడుతూ 80 మంది క్రీడాకారులు పాల్గొనగా అండర్ 19 విభాగంలో పి.వినయ్ 1వ ర్యాంకు, ఎం.అజయ్ 3వ ర్యాంకు, బి.కరుణాకర్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో టింకీ 1వ ర్యాంకులో నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో బి.వినయ్ 1వ, అశ్విత్ 2వ, అవినాష్ 3వ, రామ్చరణ్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో బి.మానస 1వ ర్యాంకు, పి.ఉషారాణి 2వ ర్యాంకుతో ప్రతిభ కనబర్చారు. అండర్–14 బాలుర విభాగంలో బి.సిద్దు 4వ ర్యాంకు, బాలికల విభాగంలో సహస్ర 1వ ర్యాంకు సాధించారు. విద్యార్థుల ప్రతిభను తీర్చిదిద్దడంలో అర్చరీ కోచ్ బండారి భరత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. నాన్ మెడికల్ అధికారులను నియమించొద్దునర్సంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆస్పత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందన్నారు. ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్దమని, రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఐనవోలు పీఎస్ను సందర్శించిన కేంద్ర పోలీస్ అధికారి
● వివిధ కోణాల్లో పరిశీలించి సంతృప్తి ఐనవోలు: మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ దేశ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్లను గుర్తించి అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేస్తుంది. అందులో భాగంగా 2025 గాను ప్రతీ రాష్ట్రంనుంచి మూడు, దేశ వ్యాప్తంగా 78 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేయగా అందులో ఐనవోలు పోలీస్ స్టేషన్ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ఆధీనంలోని ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ సోమవారం ఐనవోలు పోలీస్స్టేషన్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. డాక్యుమెంటేషన్, రికార్డులు, ఇన్ఫ్రా, స్టేషన్ ప్రాంగణం, స్టాఫ్ ప్రవర్తన, ఇతరుల ఫీడ్బ్యాక్ తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. పౌరులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరును గమనించారు. డిపార్ట్మెంట్ పరంగా 19 పారామీటర్లపై పలు ప్రశ్నలు సందించి సమాధానాలు తెలుసుకున్నారు. 100 డయల్కు 2024లో 1,207 ఫిర్యాదులు రాగా అన్ని కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా సగటున 4.08 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్టేషన్లో 840 సన్నిహిత పిటిషన్లు రాగా, అందులో 236 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 60 రోజుల్లోగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా 8 అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ను ఆహ్లాద భరిత వాతావరణంలో కొనసాగిస్తూ వృద్ధులు, మహిళలు, చిన్నారుల, దివ్యాంగుల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపికలో భాగంగా సోమవారం ఐనవోలు పోలీస్ స్టేషన్ను సందర్శించి కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను క్షుణ్ణంగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్లో దేశ వ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్లను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఐనవోలు పోలీస్స్టేషన్పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఐనవోలు ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
భూ పరిహారం డిపాజిట్ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ పూర్తయిన రైతులకు పరిహారం చెల్లించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోజాతీయ రహదా రుల శాఖ, వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వా జ్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పరకాల డివిజన్ పరిధిలో సేకరించిన భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా ఆయా మండలాల పరిధి 10 గ్రామాలకు చెందిన 110 కేసుల్లో మొత్తం పరిహారం రూ.7.52కోట్లు, బావులు, చెట్లు, స్ట్రక్చర్కు సంబంధించి రూ.6.50 కోట్లు రావాల్సి ఉండగా వీటిపై కలెక్టర్ సమీక్షించారు. కాగా, పరిహారం పొందిన తర్వాత కూడా కొందరు రైతులు భూమి మోకాపై ఉండి పంటలు వేసుకున్నారని, ఆభూముల్ని జాతీయ రహదారుల శాఖకు అప్పగించాలని ఎన్హెచ్ పీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రూ.15 లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణం వరంగల్–ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణ పనుల్ని రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జాతీయ రహదారుల శాఖ డీఈ కిరణ్కుమార్, ఏఈ చేతన్, సాగునీటిపారుదల శాఖ డీఈ సునీత, ఏఈ వేణుగోపాల్, అధికారులున్నారు. పోస్టర్ ఆవిష్కరణ‘సే నో టు డ్రగ్స్’లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల ప్రమాదాలు, నిర్మూలనకు సంబంధించి చేపట్టే పలు అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, డీడబ్ల్యూఓ జయంతి, డీపీఆర్ఓ, ఎఫ్ఆర్ఓ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి
● గోపు జైపాల్రెడ్డి దుగ్గొండి: అగ్రకుల పేదలందరూ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు జాతీయ, రాష్ట్రస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గిర్నిబావిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అగ్రకుల పేదలైన రెడ్డి, బ్రహ్మణ, వెలమ, కమ్మ, వైశ్య, మా ర్వాడిలు ఐక్యం కావాలన్నారు. ఈనెల 19న హనుమకొండలో జరగనున్న అగ్రకుల పేదల సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోలి బక్కారెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, కంచరకుంట్ల నర్సింహారెడ్డి, తోకల శ్రీనివాసరెడ్డి, బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, తోకల వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య.. -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.మేయర్ గుండు సుధారాణి -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. ఫీజు రీఫండ్ చేస్తాం.. దూరవిద్యలో 2024–25 బ్యాచ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్సీఏహెచ్పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సరం విద్యార్థులకు యథావిధిగా.. -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: కలెక్టరేట్లో నేడు(సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశహాల్లో ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పంటపొలాల్లో మొసలి ఖానాపురం: పాకాల ఆయకట్టు పరిధిలో మొసళ్ల సంచారం పెరిగిపోయింది. కాల్వలు, పంట పొలాల్లోకి చేరుతుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పల్నాటి రవీందర్ గ్రామశివారులోని దుంపిల్లగడ్డలో ఉన్న వరి పొలానికి ఆదివారం నీరుపెట్టడానికి వెళ్లాడు. వరి పొలంలో నీరుపెడుతూ తిరుగుతుండగా వరిలో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న రైతులకు అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు మొసలిని అదుపులోకి తీసుకుని పాకాల సరస్సులోకి జారవిడిచారు. ఆయకట్టు పరిధిలో అనేక మొసళ్లు సంచరిస్తున్నాయని, పంటపొలాలకు వెళ్లే క్రమంలో మొసళ్ల దాడి జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేజీబీవీ ఎస్ఓ నీలిమకు అవార్డు సంగెం: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేకాధికారి కె.నీలిమ సావిత్రిబాయి పూలే అవార్డు–2025 అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, వావ్ మ్యూజిక్ హైదరాబాద్, కలాం విజన్, యువతేజం ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో సిటీ కల్చరల్ హాల్ ఆర్టీసీ ఎక్స్రోడ్ హైదరాబాద్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆదివారం నీలిమ అవార్డు అందుకున్నారు. కలాం విజన్, యువతేజం ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు కరీముల్లా, అడ్మిన్ చైర్మన్ అంజనీకుమారి, వావ్ మ్యూజిక్ ఫౌండర్, చైర్పర్సన్ పీవీ.లక్ష్మి పాల్గొన్నారు. ఓరుగల్లును మరువలేను ● హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. తన హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో అప్పుడు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. నేటి నుంచి క్రీడా ఎంపిక పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్ లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్ఆఫ్వార్, త్రోబాల్, టేబుల్ టెన్సిస్, మకంబ్, సాఫ్ట్టెన్నిస్, బీచ్వాలీబాల్, తంగ్తా మార్శల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్బాల్, అథ్లెటిక్స్, షూ టింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14 వ తేదీన) హ్యాండ్బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్బాల్, లాన్టెన్ని స్, బాల్ బ్యాడ్మింటన్, తై క్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, వెయి ట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బా క్సింగ్, ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్ఆఫ్వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్టెన్నిస్, బీచ్వాలీబాల్, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్ట్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్బాల్, లాన్టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో రాకేశ్రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 200 పాఠశాలల్లో రూ.180 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 80 నుంచి 200కు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెంచి, 8 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదన్నారు. సమస్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో చర్చించి బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు. కాళోజీ సెంటర్: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశానికి సంబంధించిన కార్యక్రమంపై ఈనెల 14, 15, 16 తేదీల్లో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గణితం ఉపాధ్యాయులు ప్రభుత్వ, స్థానిక సంస్థల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు వీలైతే సొంత లాప్టాప్, ట్యాబ్ లేదా ఇటీవల విద్యాశాఖ అందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ ఆర్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. సుమారు 21 ఏళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. దూరవిద్యలో 2024–25 బ్యాచ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్సీఏహెచ్పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సరం విద్యార్థులకు యథావిధిగా.. -
యాదృచ్ఛికమా.. అధికారుల నిర్లక్ష్యమా..?
● నర్సంపేట సబ్ జైల్లో గతంలో ఇద్దరు ఖైదీల మృతి ● నెలల వ్యవధిలోనే ఘటనలు ● ప్రజలను తొలుస్తున్న అనేక ప్రశ్నలునర్సంపేట: నర్సంపేట మహిళా సబ్ జైల్లో ఇటీవల రిమాండ్లో ఉన్న ఇద్దరు ఖైదీలు మృతి చెందడం కలకలం రేపుతోంది. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే జైల్లోకి అనుమతిస్తారు. అలాంటిది ఒకే జైల్లో నెలల వ్యవధిలో ఇద్దరు మహిళా ఖైదీలు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అనే ప్రశ్నలు ప్రజలను తొలుస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఖైదీలు అనారోగ్యంతోనే మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. చికిత్స పొందుతూ మృతి జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో రెండు మూడు రోజుల్లోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజే ఇద్దరు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్లో ఓ కేసులో నిందితురాలైన పెండ్యాల సుచరిత జైల్లో బాత్రూంకు వెళ్లి కింద పడిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందినట్లు జైలర్ లక్ష్మిశృతి తెలుపగా ఆమె నిర్లక్ష్యం వల్లనే మహిళా ఖైదీ మృతి చెందిందనే నెపంతో సస్పెండ్ చేశారు. తాజాగా శిశు విక్రయాల కేసులో సబ్ జైలుకు వచ్చిన కరీంనగర్ జిల్లా రాంపూర్కు చెందిన కల్పన ఎంజీఎంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నర్సంపేట సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు రెండు నెలల వ్యవధిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లామని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆమె జైలుకు వచ్చిన 16రోజుల పాటు మౌనంగానే ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని తెలిపారు. జైలుకు వచ్చే ముందు చేసిన ఆరోగ్య పరీక్షల్లో ఆరోగ్యం బాగానే ఉందని.. జైలుకు వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకొని చికిత్స చేయించినట్లు తెలిపారు. ఏం జరిగి ఉంటుంది.. మహిళా జైలులో నెల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరుగుతున్నాయా.. లేదా అధికారుల తప్పిదమా.. నిజంగానే అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందతున్నారా.. అనే కోణంపై పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
నిబద్ధత కలిగిన వారికే డీసీసీ పీఠం
హన్మకొండ చౌరస్తా: నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగిన వారికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పీఠం దక్కుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నాయక్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల భర్తీ కార్యక్రమంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంఘటన శ్రీయన్ అభియాన్ పార్టీ పునఃనిర్మాణానికి మొదటి అడుగు పడిందన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం డీసీసీ భవన్లో హనుమకొండ జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, వెంకట్రెడ్డి, శ్రవణ్, సాగరిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ -
ఓరుగల్లును మరువలేను
● హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ● ఎక్స్లో ట్వీట్ చేసిన ‘సాక్షి’ క్లిప్పింగ్ ఖిలా వరంగల్: ‘చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. నా హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. -
కారాఘోరం!
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది. ● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జైళ్లలో ఖైదీల సహజ మరణాలు, ఆందోళనకరంగా ఆత్మహత్యలు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య..సహజ మరణాలకు అనేక కారణాలు.. సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పో లీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకమే.. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు -
బీసీలు బలహీనులు కాదు
● ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ హన్మకొండ: రిజర్వేషన్లు బీసీల పౌర హక్కు అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. బీసీలు బలహీనులు కాదని, బాహుబలులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం అవకాశం కల్పిస్తామని ఆశ చూపి మోసం చేశారన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఆయా సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, మౌనిక గౌడ్, పులి రజనీకాంత్, మేధావులు పాల్గొన్నారు. -
రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత
● కలెక్టర్ సత్యశారద ● పుప్పాలగుట్ట పీహెచ్సీలో పల్స్పోలియో పర్యవేక్షణ ఖిలా వరంగల్: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట పీహెచ్సీ కేంద్రంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం చుక్కల మందు వేయించని చిన్నారుల ఇళ్లకు వెళ్లి బ్బంది పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి దేవానికి సంపదని పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరినారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో రక్తహీనత సమస్యలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వహించుకుని తగిన చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారి సాంబశివరావు మాట్లాడారు. జిల్లాలో 12 నుంచి 15వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, ఎస్ఎన్ఐ ప్రోగ్రాం ఇన్చార్జ్ ప్రసాద్, డీవైఓ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, పుప్పాల గుట్ట హెల్త్సెంటర్ డాక్టర్ బజ్జూరి దిలిప్ పాల్గొన్నారు. పల్స్ పోలియో సక్కెస్.. గీసుకొండ: వరంగల్ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. 0–5 ఏళ్లలోపు చిన్నారులు నగరంలో 20,121 మంది ఉన్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మందికి చుక్కల మందు వేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఈత కొట్టేదెన్నడో?
వరంగల్ స్పోర్ట్స్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లేమి కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు ఆరు నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు. రూ.41 లక్షలు కేటాయింపు.. హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనుల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం.. టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అబివృద్ధి పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో ఆరు నెలలు కావొస్తున్నా.. పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్. అలాంటిది ఆరు నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులు 90 శాతం పూర్తయ్యాయి, రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ సైతం విజయవంతంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో డీఎస్ఏకు స్విమ్మింగ్ పూల్ను అప్పగిస్తాం. – రవీందర్, డీఈ, టీజీఈడబ్ల్యూఐడీసీ, హనుమకొండ ఆరు నెలలైనా పూర్తికాని మరమ్మతులు సాధనకు దూరమవుతున్న స్విమ్మర్లు -
ధాన్యం సేకరణలో భారీ అక్రమాలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో అతి పెద్ద ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శశిధర్రాజు, ఓఎస్డీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధాన్యం కొనుగోలులో గుర్తించిన అక్రమాలు, తీసుకున్న చర్యలపై ఎస్పీ మాట్లాడుతూ.. రబీ 2024–25 సీజన్లో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి విచారణ జరిపి అక్రమాలు గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. కమలాపూర్కు చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్ ఈ మోసానికి ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నకిలీ ప్రొఫైల్.. బెజ్జంకి శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులు, మధ్యవర్తులు, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మకై ్క ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ పోర్టల్ను ఉపయోగించి 12 మంది నకిలీ రైతుల ప్రొఫైళ్లు సృష్టించాడని ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ రైతులు 278 ఎకరాల భూమిని సాగు చేసినట్లుగా సదరు రైస్ మిల్లుకు 8,049.6 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేసినట్లుగా చూపించారన్నారు. వాస్తవానికి ఎక్కడా ధాన్యం సేకరించలేదని, రవాణా చేయలేదని తెలిపారు. ఈ అవకతవకల ద్వారా రూ.1,86,63,088 మొత్తాన్ని అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నట్లు, ఆ నగదును నకిలీ లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. సహకరించిన అధికారులు అక్రమాలకు పాల్పడినవారిలో బండ లలిత నకిలీ ఎంట్రీల అక్రమ సృష్టికి మధ్యవర్తిగా వ్యవహరించారని, ప్రైవేట్ ఆపరేటర్ వాంకుడోత్ చరణ్ కీలక పాత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బి.హైమావతి, కాట్రపల్లి కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అనిత ఇతరులకు ట్యాబ్లు ఇచ్చి అక్రమాలకు సహకరించారన్నారు. వ్యవసాయ అధికారులు ఏఓ కె.గంగజమున, ఏఈఓలు బి.అర్చన, ఎం.సుప్రియ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సహకరించారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్రావు ధాన్యాన్ని భౌతికంగా రవాణా చేయకుండానే 27 లారీల చిట్టీలకు రవాణా ఛార్జీలను క్లెయిమ్ చేశారని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 12 మంది నకిలీ రైతులు, 278 ఎకరాల భూమి, 8,049 క్వింటాళ్ల దాన్యం ద్వారా రూ.1,86,63,088 కొల్లగొట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. విచారణ అనంతరం నగదు రికవరీ, పోర్టల్ నుంచి భూమి తొలగింపు, తదుపరి క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.రూ.1.86 కోట్లు దుర్వినియోగం రికవరీ, క్రిమినల్ చర్యలకు ఆదేశం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని శ్రీనివాస్, వారికి సహకరించిన బండ లలిత, వాంకుడోత్ చరణ్, బలబద్ర హైమావతి, అనిత, వ్యవసాయ అధికారులు గంగాజమున, అర్చన, సుప్రియ, రవాణా కాంట్రాక్టర్ సుధతి రాజేశ్వర్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని యాజమాన్యాలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే గ్రేడ్ పదోన్నతి కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. కాగా, ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై హై దరాబాద్లో విద్యుత్ సంస్థల్లోని యూనియన్లతో చ ర్చించి జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. ఆర్టిజన్ జేఏసీ చైర్మన్గా టీఎస్ఈఈయూ–327కు కేటాయించగా నాలుగు విద్యుత్ సంస్థలకు చైర్మన్లను ఎన్నుకున్న ట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్గా డి.సికిందర్, ఎస్పీడీసీఎల్ చైర్మన్గా ఎస్.సతీశ్రెడ్డి, జెన్కో చై ర్మన్గా రమేశ్కుమార్, ట్రాన్స్కో చైర్మన్గా కల్యాణ్ ను ఎన్నుకున్నట్లు వివరించారు. యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ శ్రీనివాస్, జెన్కో ప్రెసిడెంట్ మాధవరావు, రాష్ట్ర నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, సుంకు సతీశ్ రెడ్డి పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతా -
అత్యంత వైభవంగా నరకాసుర వధ
మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని మంత్రి స్వగృహంలో మంత్రి కొండా సురేఖను నరకాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మరుపల్లి రవి కలిసి ఏర్పాట్లపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపావళి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్కు చెబు తానని ఆమె పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉన్నారు హన్మకొండ కల్చరల్: రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన ‘పుంజు తోక’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో జరగనున్నట్లు మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి పుస్తక పరిచయం చేస్తారని తెలిపారు. జిల్లా సాహితీవేత్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేడు ‘ఆరెపల్లి మట్టిబిడ్డలు’ పుస్తకావిష్కరణనయీంనగర్: నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆరెపల్లి గ్రామం సరళి అధ్యయన కేంద్రంలో ‘మట్టిబిడ్డల మావూరి యధార్థ జీవిత కథలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుస్తక రచయిత, జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టిబిడ్డల పుస్తకాన్ని సాహితీవేత్త, మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్–సుధ దంపతులకు అంకితమిచ్చి నట్లు తెలిపారు. కవులు, సాహితీమిత్రులు పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభకు రావాలని కోరారు. కార్యక్రమంలో రాకేశ్, రఘువీర్, దినేశ్, గోపాల్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఏ బుక్ ఆఫ్ ఆన్ డిజిటల్ లెర్నింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు జిల్లాలోని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల్లో డిజిటల్ లెర్నింగ్, కోడింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, 21వ శతాబ్ద నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిక్షణ ఉపయోగడనుందని డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. ఈనెల 13న ఉదయం 9గంటలకు ల్యాప్టాప్లతో, 6 నుంచి 9వ తరగతి డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా డిజిటల్గా నమోదు చేయనున్నారు. మూడు రోజులపాటు శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారని వారు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 16, 18, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
మైక్రోలైట్ విమానంలో ఎయిర్వింగ్ శిక్షణ
ఎన్సీసీ కేడెట్ల గగన విహారం మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్సీసీ కేడెట్ల సేవల్ని దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్ఎం కాయిత శ్రీనివాస్, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. -
రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గీసుకొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. శనివారం మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద పీఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు, రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు పంటలు సాగుచేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి కె, అనురాధ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ బాలకృష్ణ, డీహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, రాస్ శాస్త్రవేత్త మధు, ఏడీఏ నర్సింగం, ఏఓ హరిప్రసాద్బాబు, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ పాల్గొన్నారు. గీసుకొండ : కొనాయమాకుల రైతువేదికలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద -
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
దుగ్గొండి: విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని పేర్కొన్నారు. గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు. తరగతుల నిర్వహణ, హాజరు పట్టికలు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం భోజనం పెడుతున్నారా, కూరలు రుచిగా ఉంటున్నాయా అని అడిగారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యూలో నిలబడి భోజనం తెచ్చుకుని భోజనం చేశారు. పాఠశాలలోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కరించా లని హెచ్ఎం మల్లయ్యను ఆదేశించారు. తరగతి గదిలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబ ట్టారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. బాస్కెట్బాల్ కోర్టు కావాలని విద్యార్థులు కోరడంతో వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పుష్పలత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద గిర్నిబావిలో ఎంజేపీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ -
ఇక బోగస్ హాజరుకు చెక్
సంగెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కూలీలకు ఈ–కేవైసీ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్ఎంఎంఎస్) యాప్లో కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ విధానంలో కూలీల జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడం, వారి ఐరిస్ నమోదుతో ఒకరికి బదులుగా మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదు. మృతుల పేర్లు నమోదు చేసే వీలుండదు. దీంతో ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మస్టర్లు రాసే అవకాశం ఉండదు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో ఉపాధి హామీ కూలీల ఈ–కేవైసీ నమోదు కొనసాగుతోంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకోని కూలీలకు ఇక మీదట పనులు కల్పించే అవకాశం ఉండదు. అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నూతన సంస్కరణలతో ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒకరి జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,23,701 మంది కూలీలు.. జిల్లాలోని 325 గ్రామపంచాయతీల పరిధిలో 1.2 లక్షల జాబ్కార్డులు జారీచేయగా 2.39 లక్షల మంది కూలీలున్నారు. అందులో యాక్టివ్గా ఉన్న 74 లక్షల జాబ్కార్డుల్లో 1,23,701 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 1,23,698 మంది కూలీలకు ఆధార్ జాబ్కార్డుకు అనుసంధానం, 77,111 మందికి (62.34 శాతం) ఈ–కేవైసీ పూర్తి అయ్యింది. ఇంకా 46,590 మందికి ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్ఎంఎంఎస్ యాప్ తీసుకొచ్చిన కేంద్రం.. పనిప్రదేశం వద్ద కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేసేవారు. కానీ, క్షేత్రసహాయకులు, మేట్లు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడడంతో వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ను తీసుకొచ్చింది. దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు గ్రహించి నకిలీల హాజరు నమోదును అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ–కేవైసీ పూర్తి అయిన తర్వాత పనులకు వచ్చిన కూలీల ఫొటోలను ఫోన్లో తీసి అప్లోడ్ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఫొటో దిగి అప్లోడ్ చేయిస్తే కూలీల డబ్బులు విడుదల కావు. అక్రమాలకు ఆస్కారం లేకుండా.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పనిచేసే ప్రాంతాల వివరాలను గుర్తించి ముందుగా లెక్కించి కొలత పుస్తకంలో రాసి తర్వాత ఆన్లైన్, ఈ ఎంబీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రత్యేక యాప్తో అనుసంధానిస్తే ఆయా పనుల వివరాలను ఎప్పుడైనా చూసుకోవచ్చు. దీంతో ఒకే చోట రెండు పనులు చేయడం వంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదు. సాంకేతిక సమస్యతో ఆలస్యం.. జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమై దాదాపు పది రోజులు అవుతోంది. సిగ్నల్స్ అంతరాయం కారణంగా ఈ–కేవైసీ నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సమయాల్లో యాప్ మొరాయిస్తుండడంతో ఆలస్యం అవుతున్నది. ఈ–కేవైసీ పూర్తికి చర్యలు.. అన్ని గ్రామాల్లో జాబ్కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఈ విధానం గురించి అవగాహన కల్పించాం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అడిగినవారందరికీ పనులు కల్పిస్తాం. నకిలీ మస్టర్లకు తావులేకుండా అర్హులైన కూలీలందరికి 100 రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. – గణేశ్, ఏపీఓ, సంగెం ఉపాధి హామీ జాబ్కార్డుతో ఆధార్ అనుసంధానం పని ప్రదేశంలో కూలీలకు ఐరిస్ నమోదు ఈ–కేవైసీ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు -
బీట్ ఆఫీసర్ సస్పెన్షన్
నల్లబెల్లి: మండలంలోని గోవిందాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శోభన్బాబును సస్పెండ్ చేస్తూ అటవీశాఖ జిల్లా అధికారి అనూజ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నర్సంపేట ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బీట్ ఆఫీసర్ శోభన్బాబు రైతుల నుంచి డబ్బులు తీసుకుని పోడు చేయిస్తున్నాడని ఫిర్యాదులు అందాయి. విచారణ చేయగా డబ్బులు తీసుకున్నట్లు పోడు రైతులు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎఫ్ఆర్వో రవికిరణ్ పేర్కొన్నారు. రేపు ఉద్యోగమేళాకాళోజీ సెంటర్: హనుమకొండ అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో సోమవారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్, ఏ గ్రూపు విద్యార్థులైనా 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, ఓవరాల్గా 60 శాతం గణితంలో మార్కులు సాధించినవారు అన్ని సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు హెచ్సీఎల్ ప్రతినిధి శివ (7569177071, 7981834205)ను సంప్రదించాలని డీఐఈఓ సూచించారు. 6.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేతనర్సంపేట రూరల్: పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని రాజిరెడ్డి రైస్మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేశారన్న పక్కా సమాచారం అందింది. ఈ మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు శనివారం సంయుక్తంగా దాడులు చేసి 6.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి మిల్లు యజమాని సాయిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో నర్సంపేట రూరల్ ఎస్సై గూడ అరుణ్, టాస్క్ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలిక అదృశ్యంనర్సంపేట రూరల్: బాలిక అదృశ్యమైన సంఘటన నర్సంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు బాలిక తండ్రి శనివారం సాయంత్రం నర్సంపేట పోలీస్ స్టేషన్లో చేశారు. ఆటో టైరు అపహరణగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్లో ఆటో టైరును డిస్క్తో సహా దొంగలు ఎత్తుకుని వెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. కీర్తినగర్కు చెందిన అనుమాండ్ల మహేశ్ ఈనెల 9న తన ఆటోను ఇంటిపక్కన నిలిపి నిద్రపోయాడు. తెల్లారి లేచి చూస్తే ఆటో వెనక టైరును డిస్క్తో సహా దొంగలు ఎత్తుకుపోయారని గుర్తించాడు. దీంతో తనకు రూ.4 వేల నష్టం వచ్చిందని, ఈ విషయాన్ని 112కు డయల్ చేసి చెప్పగా వారు కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించారు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయాలి నయీంనగర్: జనరల్ సీట్లన్నింట్లో బీసీలు పోటీ చేసి గెలవొచ్చని బీసీ నాయకులు ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ చైతన్య వేదిక, ఆలిండియా ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ’ అంశంపై శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, జి.శ్రీనివాస్, సోమ రామమూర్తి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధనకు సబ్బండ వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుందామని నినదించారు. బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతికుమార్, కుమార్ గాడ్గె, వీరస్వామి, వేణుమాధవ్, రామారావు, తిరుపతి, సంపత్, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
మైక్రోలైట్ విమానంలో ఎయిర్వింగ్ శిక్షణ
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్సీసీ కేడెట్ల సేవలను దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్ఎం కాయిత శ్రీనివాస్, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. – వెంకటాపురం(ఎం) వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతా -
బీమా చెక్కు అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. -
పత్తి పంట పరిశీలన
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలో శుక్రవారం పత్తి పంట క్షేత్రాలను విదేశీయులు సందర్శించారు. స్విట్లర్లాండ్ జెనీవాకు చెందిన హెలెన్, లండన్కు చెందిన అంజలినారస్.. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతుల పత్తి పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పత్తి సాగులో క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడి సాధించేందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ ప్రతినిధులు హర్ష, వంశీకృష్ణ, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి కమలాపూర్: సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, కార్యాలయాన్ని పరిశీలించి మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలు అడిగి తెలుసుకునిన్నారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వితంతువుకు అండగా నిలిచిన పీఏసీస్ డైరెక్టర్ మండలంలోని వంగపల్లికి చెందిన వితంతువు జూపాక ఇందిరకు పీఏసీఎస్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు అండగా నిలిచారు. ఇందిర భర్త జలందర్కు రావాల్సిన వారసత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు 2018లో ఆర్ఓఆర్ ద్వారా పట్టా చేసుకోగా.. ఈ విషయమై ఇందిర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తన భూమి తనకు ఇప్పించండని ఇందిర విలపిస్తుండగా.. గమనించిన సత్యనారాయణరావు చలించిపోయారు. మాజీ సర్పంచ్ శనిగరపు సమ్మయ్యతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి వద్దకు ఇందిరను తీసుకెళ్లి విషయాన్ని అదనపు కలెక్టర్కు వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని, బా ధ్యులపై చర్యలు చేపట్టి అక్రమ పట్టా రద్దు చేయాలని ఆదేశించారు. తనకు అండగా నిలిచిన సత్యనారాయణరావుకు ఇందిర కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించండి
వరంగల్ అర్బన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంఏవై– అర్బన్–2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్–25 పోస్టర్ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. పీఎంఏవై–అర్బన్ 2.0 పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పేద, బలహీన వర్గాలకు మేలు జరిగేలా చూడడంతో పాటు, రుణ మేళాల ద్వారా లబ్ధిదారులకు గృహ రుణాలు అందేలా చూడాలని కమిషనర్ కోరారు. సమవేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు గణపతి, హరికృష్ణ, బల్దియా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, హౌసింగ్ బోర్డు ప్రత్యేకాధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ నర్సంపేట: అగ్రకులాల నాయకుల కుట్రలో భాగంగానే తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నర్సంపేటలోని అమరవీరుల జంక్షన్ వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా బిల్లు కేంద్రానికి పంపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పార్లమెంట్లో చర్చించకుండా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల జీఓ 9ని రద్దు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు పిటిషన్ వేయడంతో హైకోర్టు స్టే విధించడం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక కుట్ర జరిగిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పోరాడాలని సూచించారు. పార్టీల జెండాలను పక్కన పెట్టి జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసి రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేశ్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేశ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగల శివాజీ, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యాంకుమార్, పట్టణ కార్యదర్శులు గాండ్ల శ్రీని వాస్, బేతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతను రైతుకు చేరువ చేయాలి
● రైతు సదస్సులో కలెక్టర్ సత్యశారద గీసుకొండ: వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఎలుకుర్తిహవేలిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల రావెప్ విద్యార్థులు, వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న కాలంలో వ్యవసాయంలో చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా రైతును సన్నద్ధంచేయాలని సూచించారు. వ్యవసాయ సహపరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి మాట్లాడుతూ మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయవద్దని, యాంత్రీకరణ అలవర్చుకోవాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయ్భాస్కర్ మాట్లాడుతూ వరి, పత్తిలో ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ మాట్లాడుతూ పత్తి రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్ యాప్’లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ ఎగ్డే ఉత్సవాలు కూడా నిర్వహించారు. వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బీవీ రాజ్కుమార్, విశ్వతేజ, రమేశ్, జె.నరేందర్, గోపిక, ప్రజ్ఞ, సాయికిరణ్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఏఓ హరిప్రసాద్బాబు, అభ్యుదయ రైతులు, ఏఈఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కెట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి వరంగల్: పత్తి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధరలకు విక్రయించేలా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఒక హెల్ప్డెస్క్ వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్కెట్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, యార్డుల్లోని పంట ఉత్పత్తులు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో రైతులు, వ్యాపారులు, కార్మికులకు కనీన వసతులు కల్పించేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, కోశాధికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావొద్దు న్యూశాయంపేట: రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి 266 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కంటే 65 కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెంచినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జ్ డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, ఆర్టీఓ శోభన్, లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, కోశాధికారి ఇరుకు కోటేశ్వర్రావు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఆదాయం రూ.20.7 లక్షలు ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. 2 ఆగస్టు 2025 నుంచి 10 అక్టోబర్ 2025 వరకు (69 రోజులకు) గాను హుండీలో రూ. 4,37,108, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.16,33,533 రాగా, మొత్తం రూ.20,70,641 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీలో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ధర్మకర్తలు ఆనందం, కీమా, కుమారస్వామి, నర్సింహారెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రమేశ్, రాజు, జి.పరమేశ్వరి, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు వరంగల్లో పల్స్పోలియో
● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: వరంగల్ నగరలో 0–5 ఏళ్లలోపు ఉన్న 20,121 మంది పిల్లలకు ఈ నెల 12న పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్ నేషనల్ పోలియో వ్యాక్సినేషన్పై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం వరంగల్ నగర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకుని వెళ్లి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ నగరంలోని సీకేఎం, ఎంజీఎం, చింతల్, దేశాయిపేట, ఫోర్టు వరంగల్, కీర్తినగర్, రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట, కాశి బుగ్గలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చుక్కల మందు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్సిస్ట్ పాయింట్లు, మరో ఏడు మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, ట్రాన్సిస్ట్ సెంటర్లలో 24 గంటలపాటు చుక్కల మందు వేస్తారని చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాల్లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రుతిహర్షిత జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ పొందనున్నారు.ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వీఓల అధ్యక్షురాళ్లకు డీఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి హాజరై పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే వర్షాలు వచ్చినా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన వెంటనే రైతు పేరు సీరియల్ బుక్లో రిజిస్టర్ చేసి, నంబర్ ఇచ్చి తూకం వేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, కామన్ గ్రేడ్కు రూ.2,369, సన్నధాన్యానికి అదనంగా బోనస్ రూ.500 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రజిత, కార్యదర్శి ఉమాదేవి, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐతో సుపరిపాలన రామన్నపేట/కాళోజీ సెంటర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన’ అంశంపై జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్, కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు అనిత, శ్రీధర్, శ్రీనివాస్, సంజీవ, గోపి పాల్గొన్నారు. లేఅవుట్లకు అనుమతి న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని లేఅవుట్ల అనుమతుల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఒక లేఅవుట్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు అనుమతుల కోసం ప్రతి పాదనలను కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, కుడా పీఓ అజిత్రెడ్డి, సిటీప్లానర్ రవీందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, రోడ్లు, భవనాల అధికారి రాజేందర్, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్కుమార్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం డిప్యుటేషన్పై ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి సెల్ ఏర్పాటుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు, హెచ్ఎంల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ డీఈఓ, ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ) దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్కు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తఽథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్తోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడి నుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి
కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం నిట్కు గర్వకారణమని పేర్కొన్నారు. -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
సంగెం: విద్యార్థినులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని జీసీడీఓ కె.ఫ్లోరెన్స్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నశముక్తు భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ దేశభవిష్యత్ విద్యార్థినుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. వైద్యశాఖ డిప్యూటీ డెమో అనిల్కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మ నిగ్రహంతో ఉండాలని, చెడు ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యత, లింగసమానత్వం సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే అన్నిరంగాల్లో విజయం వరిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం గురించి తెలిస్తే 1908, 14446కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం పలు పోటీలు నిర్వహించి విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఎంఈఓ రాము, డాక్టర్ రాకేశ్, ఎస్సై కె.వంశీకృష్ణ, కేజీబీవీ ప్రత్యేకాధికారి నీలిమ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వానిదే
కమలాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అది సాధించే వరకు కొట్లాడుదామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ ఈటలకు కమలాపూర్ మండలం అంబాల క్రాస్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘ఇవి జరిగే ఎన్నికలు కావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు దసరా దావతులు ఇవ్వొద్దు’ అని ఎంపీ ఈటల చేసిన సూచన మేరకు తాము ఎలాంటి ఖర్చు పెట్టలేదని, తాము కష్టాల పాలు కాకుండా చేసిన ఈటలకు ఆశావహులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారందరికి కలిపితే రూ.కోట్లు మిగిలాయని, దీంతో పోటీ చేయాలనుకున్న ఆశావహులమంతా సంతాషంగా ఉన్నామని ఈటలకు తెలిపారు. అనంతరం కమలాపూర్లోని తన నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఈటల సమావేశమై కాసేపు ముచ్చటించారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఈటల పరామర్శించారు. సాధించే వరకు కొట్లాడుదాం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
మిషనరీస్ ఆఫ్ చారిటీలో వైద్యశిబిరం
వరంగల్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) పురస్కరించుకుని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన కాశిబుగ్గలోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లోని మేధో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. ‘మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్లో వీరికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలకు తమను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని ఆమె అభినందించారు. అనంతరం మేధో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు అందించి, వారితో సరదాగా గడిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతేజార్గంజ్ ఎస్ఐలు తేజ, వెంకటేశ్వర్లు, డాక్టర్ క్యూరీ, డాక్టర్ అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా పాల్గొన్నారు. -
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని బన్ను న్యూరో హెల్త్ అండ్ రిహబిలిటేషన్ సెంటర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిన్నారుల మానసిక ఆరోగ్య స్థితిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వారు ఒత్తిడిని అధిగమించి మానసిక ఆరోగ్యం పొందేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్రావు, కేయూసీ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి ఎంజీఎం ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగం డాక్టర్ చిమ్మి కృష్ణ, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ అధ్యక్షుడు వీరమల్ల చంద్రజిత్రెడ్డి, బన్ను స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరమల్ల కిరణ్కుమారి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు గాను శుక్రవారం 16 దరఖాస్తులను హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు మద్యం వ్యాపారులు అందజేశారు. కాగా, వైన్స్ టెండర్ల ప్రకటన వెలువడినప్పటి నుంచి శుక్రవారం వరకు మొత్తం 65 దరఖాస్తులు అందాయి. వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు సాధించడం నిట్కు గర్వంగా నిలుస్తోందన్నారు. హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్శర్మ, పానుగంటి ప్రణవ్, శ్రవణ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. -
ఇక.. డీసీసీల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈమేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ పరిశీలకులతో భేటీ అయ్యి పలు సూచనలిచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ) దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్కు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్తోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ తోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్జులు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకోండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
పోషకాహారంతోనే ఆరోగ్యమైన సంతానం
● జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి శాయంపేట: గర్భిణులు పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పరకాల సీడీపీఓ స్వాతి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి జాతీయ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి పాల్గొని మాట్లాడారు. ప్రతీ సంవత్సరం పోషణ మాసం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆరోగ్యలక్ష్మి, ప్రీస్కూల్, లోప పోషణతో బాధపడే పిల్ల ల పోషణ స్థితిని మెరుగుపర్చే సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిచంద్ర, మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్యులు విద్య, శోభ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సునీత, పుణ్యవతి, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ కళ్యాణి, బ్లాక్ కో–ఆర్డినేటర్ భిక్షపతి, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్షన్లో ‘కార్పొరేషన్’ ఫెయిల్
వరంగల్ అర్బన్: పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ చతికిల పడింది. ఫస్ట్ ఆఫ్ ఆరు నెలల వ్యవధిలో ఆస్తి పన్ను 25 శాతం, నీటి చార్జీలు 12 శాతం వసూళ్లతో సరిపెట్టుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)కి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. డిమాండ్ మేరకు ఏటా ఆస్తి, నీటి పన్నులు కచ్చితంగా వసూలు చేస్తేనే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాల రివైడ్జ్, పేరు మార్పిడుల పేరిట కాసుల కోసం వేట కొనసాగిస్తున్నారే తప్ప పన్ను వసూళ్లపై సరైన కార్యాచరణతో ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో పన్నుల వసూళ్లను ఫస్ట్, ఆఫ్ సెకండ్ ఆఫ్గా వసూలు చేస్తుంటారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, రెండో దఫా అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు వర్గీకరించి పన్నులు వసూలు చేస్తుంటారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)సూచనల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడాదికి ఒకేసారి డిమాండ్ నోటీస్ జారీ చేశారు. కానీ, అందులో ఆర్నెళ్లకోసారి చెల్లించుకునే పొందుపర్చారు. వసూళ్లు ఇలా.. మహా నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను అసెస్మెంట్లు 2,28,901 కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.81.18 కోట్లు, వడ్డీ రూ.46.06 కోట్లు, పాత బకాయిలు రూ.43.60 కోట్లు మొత్తంగా రూ.170.80 కోట్లు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ.42.10 కోట్లు అంటే 25 శాతం వసూలు చేశారు. ఇకపోతే తాగునీటి నల్లా కనెక్షన్లు 1,77,567 ఉండగా.. రూ.49.70 కోట్లు కరెంటు, పాత బకాయిలు రూ.25.28 కోట్లు కాగా, మొత్తంగా రూ.74.99 కోట్లు డిమాండ్ నెలకొంది. ఇందులో 8.87 కోట్లు అంటే 12 శాతం మాత్రమే వసూలు చేశారు. సర్కారీ శాఖల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి, నీటి చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చొరవ తీసుకునే నాథుడే బల్దియా యంత్రాంగంలో కరువయ్యారనే విమర్శలు నెలకొన్నాయి. లోపం యంత్రాంగానిదే... పన్ను బకాయిలు పెరిగిపోవడానికి, సక్రమంగా వసూలు కాకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుకోకుండా ప్రజలు సక్రమంగా చెల్లిస్తున్నారా? చెల్లించని వారికి ఆ సొమ్ముపై 2శాతం వడ్డీ భారం తోడవుతుందని చెల్లింపుదారుల్లో చైతన్యం కల్పించడంతో విఫలమవుతున్నారు. కేత్ర స్థాయిలో పన్నుల వసూళ్లను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు కలిసి వసూళ్ల బాధ్యత ఇ–సేవా కేంద్రాల సిబ్బందికి వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే అరోపణలున్నాయి. ఆస్తి, నీటి చార్జీలు ఫస్ట్ ఆఫ్లో వెనుకబడిపోవడానికి పన్నుల విభాగం అధికారులను వివరణ కోరితే ఎవరికి వారు దాటవేస్తుండడం గమనార్హం. ఫస్ట్ ఆఫ్లో ఆస్తి పన్ను 25% నీటి చార్జీలు కేవలం 12% వసూలు నిద్రావస్థలో పన్నుల విభాగం అధికారులు జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం -
స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు
● డీఎంహెచ్ఓ అప్పయ్య ఆత్మకూరు: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా హైస్కూల్లో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు ఆటపాటలపై శ్రద్ధ పెట్టాలన్నారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ప్రహసిత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మానసిక సమస్యలుంటే 14416 టెలి మానస్కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, పాఠశాల హెచ్ఎం జాయిస్, సిబ్బంది జునేడి, సంపత్, శ్రీనివాస్, నరేశ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు ఐనవోలు: వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ కార్తీక్, దివ్యకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు మూడేళ్ల దేవాన్ష్ గురువారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పిల్లల తల్లి అయిన ఓ వీధికుక్క దేవాన్ష్పై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపర్చింది. బాలుడిని తల్లిదండ్రులు ముందుగా పీహెచ్సీకి తరలించగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్రావు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీఐని పకడ్బందీగా అమలు చేయాలి
పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ పరకాల: ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం–2005 అమలు కోసం కార్యాలయ ఉద్యోగులంతా పారదర్శకంగా వ్యవహరించాలని పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ కోరారు. సమాచార హక్కు చట్టం – 2005 వారోత్సవాల్లో భాగంగా పరకాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జవాబుదారీతనంతో ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం ద్వారా కోరిన సమచారాన్ని పారదర్శకంగా అందించాలని కోరారు. జవాబు దారీగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి అనుమానాలు రావని, పాలనలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ డాక్టర్ నారాయణ దామెర: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె. నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతిలక్ష్మీదేవి, నాయబ్ తహసీల్దార్ ఖురేషి, ఆర్ఐలు సంపత్, భాస్కర్ రెడ్డి, జీపీఓలు పాల్గొన్నారు. ఢిల్లీ సదస్సులో మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అరైస్ సిటీకి అనుగుణంగా వరంగల్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఇక్లీ సౌత్ ఏసియా సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్నందున, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎన్ఐయూఏ) సంయుక్తంగా అరైస్ సిటీస్పై సదస్సు నిర్వహించారు. బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాల నుంచి 200 మంది డెలిగేట్స్ వేదికపై హాజరవ్వగా.. ఇందులో మేయర్ మాట్లాడుతూ.. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, హుజూరాబాద్ వద్ద రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని విశ్లేషించి అందుకు తగినట్లుగా అడాప్టివ్ మెజర్స్, స్ట్రక్చరల్ మెజర్స్, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్గా విభజించినట్లు తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామని, ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. పదిశాతం గ్రీన్ బడ్జెట్తో పచ్చదనం కోసం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. -
ఇప్పటికిక ఇంతే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించేవారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, నోటిఫికేషన్ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్ డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
గీసుకొండ: ఎన్నికల సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. హెల్ప్డెస్క్, వీడియోగ్రఫీ, పో లీసు బందోబస్తు, సపోర్టింగ్ స్టాఫ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నోటిఫికేషన్ పత్రాలను పరిశీలించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓ కృష్ణవేణి, మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సురేశ్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్, కార్యాలయ సూపరింటెండెంట్ కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. ఒక నామినేషన్ దాఖలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల తొలి రోజు గురువారం మనుగొండకు చెందిన తుప్పరి వికాస్ నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు) అభ్యర్థిగా ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు మండల ఎన్నికల అధికారి డి.సురేశ్ తెలిపారు. -
నాటికలతో నైపుణ్యాల పెంపు
కాళోజీ సెంటర్: నాటికలు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తాయని జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ అన్నారు. దక్షిణ భారత సైన్స్ డ్రామా ఫెస్ట్వల్–2025లో భాగంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు గురువారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నవంబర్లో బెంగళూరులో జరగనున్న దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలు–2025 జరుగుతాయని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరిశుభ్రతే పరమాత్ముడు నాటిక ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈనెల 17వ తేదీన హైదరాబాద్లోని ఎన్సీఆర్టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లా తరఫున ఎంపికై ందని తెలిపారు. ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్మార్ట్ వ్యవసాయం ద్వితీయ స్థానం, రాయపర్తి మండలం కొలనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అందరికీ పరిశుభ్రత నాటిక తృతీయస్థానం సాధించింది. న్యాయనిర్ణేతలుగా రహమాన్, మాణిక్య రేఖ, డాక్టర్ స్వప్న, సురేశ్బాబు వ్యవహరించారు. విజేతలకు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వర్లు ప్రశంసపత్రాలు అందజేశారు. పాఠశాల హెచ్ఎం అరుణ, జిల్లా సైన్స్ రిస్సోర్స్ పర్సన్స్ కృష్ణంరాజు, సంతోష్, పరమేశ్వర్ పాల్గొన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన
● డీఎంహెచ్ఓ సాంబశివరావు దేశాయిపేట: పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానం మానేందుకు ఇష్టపడని వారికి సరైన సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ధూమపానంతో వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించి ధూమపానాన్ని నిరోధించాలని సూచించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి మోహన్సింగ్, సైకియాట్రిస్ట్ భరత్, స్థానిక వైద్యాధికారి భరత్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయపాల్రెడ్డి, ఎన్సీసీ అధికారి కెప్టెన్ డాక్టర్ సతీశ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సోమేశ్వర్, ప్రకాశ్రెడ్డి, కోర్నేలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కాళోజీ సెంటర్: జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం, సుపరిపాలన అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పోటీలను జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సంపత్కుమార్, శరదృతి, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఎంజీఎం : పది రోజులుగా జలుబు, గొంతునొప్పి, సీజనల్ విషజ్వరాలతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. గత ఎనిమిది రోజుల్లో విషజ్వరాలతో బాధపడుతూ 440 మందికి పైగా ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మందికి డెంగీ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. 9 మంది మలేరియాతో బాధపడుతున్నారు. చిన్నారులను సైతం విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఈ సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు. వణికిస్తున్న డెంగీ జ్వరాలు.. ఎంజీఎం ఆస్పత్రికి విష జ్వర పీడితులతోపాటు డెంగీ పాజిటివ్గా తేలిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీరోజు ఇద్దరు, ముగ్గురికి పాజిటివ్ నమోదవుతుండడం..వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. బాధితులకు అన్ని రకాల రక్తపరీక్షలతోపాటు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రక్త పరీక్షలకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్నింటిని బయటకు పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అత్యసవర విభాగానికి దగ్గరలో ఉన్న ఓ డయాగ్నోస్టిక్ నిర్వాహకులు ఏకంగా ఆస్పత్రిలో కొంతమంది సిబ్బందితో అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సిబ్బంది ఏకంగా ఆస్పత్రి లోపలికి వచ్చి శాంపిళ్లు సేకరిస్తుండడం గమనార్హం. డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి ఎంజీఎంలో జ్వర పీడితుల కోసం ప్ర త్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేశాం. డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందిస్తున్నాం. అన్ని రక్త పరీక్షలతోపాటు కావాల్సిన సంఖ్యలో ప్లేట్లెట్లు కూడా అందుబాటులో ఉంచాం. – కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ ఎంజీఎం ఆస్పత్రికి పెరుగుతున్న విష జ్వరాల రోగులుఎనిమిది రోజులుగా ఎంజీఎంలో ఇన్పేషెంట్ల వివరాలు ఈ ఫొటోలు చూడండి.. హనుమకొండ జిల్లా పరకాల సివిల్ ఆస్పత్రిలోని ఇన్పేషెంట్ వార్డు. సాధారణ రోజుల్లో ఆస్పత్రిలో 100 నుంచి 150 ఓపీ నమోదవుతుంది. కానీ, ఇటీవల విష జ్వరాలు విజృంభించడంతో నెల రోజులుగా 250కి పైగా ఓపీ నమోదవుతోందని ఆస్పత్రి వైద్యులు తెలుపుతున్నారు. ఇక్కడ 30 పడకలే ఉండడం.. ఇన్పేషెంట్లకు సరిపోకపోవడంతో ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. – పరకాల 8 రోజుల్లో 23 మంది డెంగీతో అడ్మిట్ చిన్నారులను సైతం వణికిస్తున్న జ్వరాలు ప్రత్యేక ఓపీతో ఎంజీఎంలో వైద్యచికిత్సలు -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య హన్మకొండ: ప్రజలు పొగాకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్ 3.0లో భాగంగా.. డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల ఆవరణకు వంద గజాల దూరం వరకు పొగాకుకు సంబంధించిన దుకాణాలు ఉండకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బహిరంగ ప్రదేశంలో పొగాకు ఉత్పత్తులు వినియోగించవద్దని సూచించారు. ర్యాలీ తీసిన అనంతరం ఎన్జీఓస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులపై అవగాహన: వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు దేశాయిపేట: పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానంతో వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి మోహన్సింగ్, సైకియాట్రిస్ట్ భరత్, స్థానిక వైద్యాధికారి భరత్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయపాల్రెడ్డి, ఎన్సీసీ అధికారి కెప్టెన్ డాక్టర్ సతీశ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సోమేశ్వర్, ప్రకాశ్రెడ్డి, కోర్నేలు తదితరులు పాల్గొన్నారు. -
విలవిల
వరంగల్శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025విష జ్వరాలతోఎంజీఎం ఆస్పత్రికి రోగుల తాకిడి..ఈవీ.. ఈజీ డ్రైవ్! కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నెక్కొండ: ఈఫొటోలో కనిపిస్తున్న 9 సంవత్సరాల బాలిక పేరు గాండ్ల సహస్ర. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన మౌనిక– అనిల్కుమార్ దంపతుల కుమార్తె అయిన ఈమె స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. 6 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్ర అస్వస్థతకు గురైన సహస్ర చికిత్స పొందుతూ ఈనెల 6న చనిపోయింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా.. జ్వరాలు ఒక్క గుండ్రపల్లిలోనే కాదు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. నర్సంపేట రూరల్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాల ఉంది. అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఉన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రతిరోజూ ఓపీ (ఔట్ పేషెంట్) 600 నుంచి 800 వరకు, ఐపీ (ఇన్ పేషెంట్) 30 నుంచి 50 వరకు ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు 50 పడకలు గల పాత ఆస్పత్రి భవనంలోనే సేవలందిస్తున్నారు. కొత్త భవనంలో మరో 50 పడకలతో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో సర్జికల్ యంత్రాలు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మేజర్ ఆపరేషన్ల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్లను నియమించలేదు. ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లి సంవత్సరం కావొస్తున్నా సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. అత్యవసర సమయంలో ఉన్న సిబ్బందికి సెలవులు కూడా దొరకడం లేదు. పేషెంట్ కేర్ అందుబాటులో లేకపోవడంతో రోగులను ఆస్పత్రిలో బంధువులు వీల్చైర్లలో తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. నర్సంపేట పట్టణం, మండలంలో సుమారు 80వేల జనాభా వరకు ఉంటుంది. దోమలు వ్యాప్తి చెంది వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 15 డెంగీ కేసులు నమోదుకాగా 14 మంది ఎంజీఎం, నర్సంపేట ఆస్పత్రిలో రికవరీ అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలవని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.. దోమల నివారణ కోసం ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వారంలో ఒకరోజు ప్రత్యేకంగా ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని తొలగిస్తే దోమల ఉధృతి తగ్గుతుంది. దోమలతోనే ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. డెంగీ జ్వరం వచ్చిన వారు కోలుకునే సమయంలో బీపీ, రక్తకణాలు తగ్గితే, శ్వాస సంబంధిత సమస్యలకు బారినపడి మృతువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో వారిని ఐసీయూలో చేర్పించి వెంటిలేషన్పై చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారు. డెంగీ జ్వరం రాగానే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తూ సమయానికి భోజనం చేసి, మందులు వేసుకోవాలి. – డాక్టర్ చంద్రశేఖర్, జనరల్ మెడిసిన్, ఫ్రొఫెసర్ నర్సంపేట వైద్య కళాశాల ఎంజీఎం: జలుబు, గొంతునొప్పి, విషజ్వరాలతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. 8 రోజుల్లో విషజ్వరాలతో బాధపడుతూ 440 మందికి పైగా అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మందికి డెంగీ, 9 మంది మలేరియాతో బాధపడుతున్నారు. చిన్నారులను సైతం విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఈ సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు. రక్తపరీక్షలకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల రక్తపరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్నింటిని బయటికి పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి దగ్గరలో ఉన్న ఓ డయాగ్నొస్టిక్ నిర్వాహకులు ఏకంగా కొంతమంది సిబ్బందితో అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సిబ్బంది ఆస్పత్రి లోపలికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తుండడం గమనార్హం. జిల్లాలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు నర్సంపేట మండలంలో 15 డెంగీ కేసుల నమోదు 14 మంది రికవరీ.. చికిత్స పొందుతున్న మరొకరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్న వైద్యులునెల ఓపీ ల్యాబ్ ఐపీ అక్టోబర్ 1 634 101 25 2 – – 16 3 129 32 16 4 692 300 19 5 – 17 6 853 215 20 7 695 215 31 8 718 201 31 -
కళాసాంస్కృతిక రంగాల్లో రాణించాలి
● డీఈఓ రంగయ్యనాయుడు విద్యారణ్యపురి: విద్యార్థులు కళాసాంస్కృతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు సూచించారు. భారత్వికాస్ పరిషత్ (బీవీపీ) ఓరుగల్లు శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాతీయ బృందగీతాల పోటీలను వరంగల్ దేశాయిపేట రోడ్డులోని నాగార్జున ప్రైమ్ స్కూల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాఠశాలలల నుంచి 160 మంది విద్యార్థులు హాజరైన పోటీల్లో డీఈఓ మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు బీవీపీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బీవీపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ రాష్ట్రంలో 23 శాఖలు కలిగి ఉందని తెలిపారు. బీవీపీ రాష్ట్ర బృంద గీతాల పోటీల కన్వీనర్ ఎన్.సదాశివరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గుర్రం దామోదర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.సుధీర్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సత్యనారాయణ, వడుప్పా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యాం మాట్లాడారు. న్యాయనిర్ణేతలుగా నితీశ్చంద్ర, కీర్తి సతీష్కుమార్, ఎ.మోహన్రావు వ్యవహరించారు. సాయంత్రం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బీవీపీ బాధ్యులు వెంకటరెడ్డి, రామారావు, చంచల్అగర్వాల్ పాల్గొన్నారు. -
ఇప్పటికిక ఇంతే...!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటివారం తర్వాతే.. ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని వరంగల్ జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజుతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇప్పించిన పోలీసులు -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుందని వివరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఖోఖో తదితర పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్వో అయూబ్అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, రిటైర్డ్ పీఈటీ చెన్నబోయిన రామదాసు, పీజీ హెచ్ఎం రాజుబోయిన భిక్షపతి, హనుమకొండ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి కుమార్, అండర్–19 ఎస్జీఎఫ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి నర్సంపేట: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని ఆరు మండలాల తహసీల్దార్లు, ఇతర సిబ్బందిలో భూ భారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, రాజేశ్వరరావు, రాజ్కుమార్, అబిద్అలీ, రమేశ్, కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి నర్సంపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు, ఆలస్యం లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని, భద్రతాపరంగా పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. లక్నెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఓ సిటీలో జిల్లాస్థాయి పాఠశాల క్రీడలు ప్రారంభం -
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా
సాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.మూడేళ్లుగా తాత్సారం..రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.వివాదమైనప్పుడే స్పందన..కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్ల ర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని మింగేశారు. వారినుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ఇప్పటికీ చర్యల్లేవు. -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బీఏఎస్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ మేకల సుమన్, గుగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్కూరి సునీల్, నాయకులు యేసోబు, మురళి, పేరెంట్స్ కమిటీ బాధ్యులు మహేందర్, శంకర్, రామ్మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఐతో కీలక మార్పులు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకు వచ్చేందుకు సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన సమాచారం అందించేందుకు పీఐఓ, ఏపీఓలు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు హనుమకొండ కలెక్టరేట్ పీఐఓ రాష్ట్ర స్థాయిలో నిలిచినందుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలతో కలెక్టర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సమాచార హక్కు చట్టం విషయ నిపుణులు ధరమ్సింగ్, జిల్లా స్థాయి అధికారులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్, న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, ప్రభుత్వ కార్యాలయాల పీఓలు, ఏపీఐఓలు, అధికారులు పాల్గొన్నారు. -
మహాజాతరకు 112 రోజులే..
వనదేవతల ప్రాంగణ విస్తరణకు కసరత్తుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరుగనుంది. ఈ సారి జాతరకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇటీవల ఆవిష్కరించిన విషయం విదితమే. అప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం సాలహారం (ప్రహరీ) నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. సాలహారం నిర్మాణానికి మార్కింగ్ సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. సారలమ్మ ఆర్చి ఎగ్జిట్ గేట్ ప్రహరీ నిర్మాణానికి బయట స్థలాన్ని చదును చేశారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మీడియా వాచ్ టవర్ల నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకర, రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ శాఖ ఇన్చీఫ్ మోహన్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ ఓంప్రకాశ్, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న పనులను పరిశీలించారు. అమ్మవార్ల దర్శనానికి పోలీస్ కమాండ్ కంట్రోల్ క్యూలైన్ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులు గద్దెల ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్టాండ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. ప్రహరీ పనుల మార్కింగ్ను కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేయాల్సిన పనులపై సూచనలు చేశారు. సాలహారంతో పాటు ఎనిమిది ఆర్చీ ద్వారాల నిర్మాణాలతో పాటు అదనంగా మరో ఆర్చీ ద్వారం నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ మ్యాప్లను చూపిస్తూ పనుల వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ పనుల్లో ఎక్కడ కూడా సంస్కృతి, సంప్రదాయాల్లో తేడా రాకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, డీఈ రమేశ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నం సమీపిస్తున్న జాతర సమయం -
స్థానిక ఎన్నికల సంరంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం నేటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసి పటిష్ట ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. మెదటి విడత ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగన్నాయి. భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట జెడ్పీటీసీలు, ఆ మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనగామలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘన్పూర్, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు జెడ్పీటీసీలు... 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీ స్థానాలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు, 30 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి వరంగల్ లో మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు -
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ రైతులకు ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్ పూలింగ్ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులు సానుకూలంగా స్పందించి సమయం కావాలని కోరారు. -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
హనుమకొండ అర్బన్/న్యూశాయంపేట: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. ఆమె హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అధికారులు హాజరయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాల్ నుంచి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
తలా పిడికెడు!
తిలా పాపం..కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సాసాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా తాత్సారం.. రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం విచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు -
వైన్స్కు 11 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు బుధవారం 11 దరఖాస్తులను హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు కలెక్టరేట్లోని డీపీఈఓ కార్యాలయంలో అందజేశారు. కాగా, టెండర్ల ప్రకటన వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 35 దరఖాస్తులు అందాయి. కేయూ క్యాంపస్: పార్ట్టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.రాంబాబు అన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా, అన్ని అర్హతలు ఉన్నా, వేతనాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు కూడా 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ ఉండేలా పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు మాట్లాడుతూ.. పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నరేందర్నాయక్, బాధ్యులు డాక్టర్ బూర శ్రీధర్, డాక్టర్ నివాస్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీనంగర్ జోనల్ అధ్యక్షుడిగా సీహెచ్.రాంచందర్, కార్యదర్శిగా జి.లింగమూర్తి, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, సహాయ కార్యదిర్శిగా ఎం.రాజయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎంజీఎం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన నీట్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన నూతన విద్యార్థులకు బుధవారం కాలేజీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఒరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. కాకతీయ మెడికల్ కాలేజీ చరిత్ర, వైద్యరంగంలో సాధించిన ప్రతిష్టాత్మక విజయాలను వివరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆకాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్టాఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎంఓయూ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి అధ్యాపకులు తదితరులున్నారు. -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
దుగ్గొండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, సహాయకులకు బుధవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, నియమ నిబంధనలు, బాధ్యతలను వివరించారు. నామినేషన్ నుంచి పోలింగ్ నిర్వహణ, ఎన్నికల ఫలితాల వరకు రిటర్నింగ్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ మోడెం శ్రీధర్గౌడ్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రావుల రణధీర్రెడ్డి, ఏఈలు సతీశ్, మంగ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఈసీజీ 30 సీట్లు, డయాలసిస్ 30 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్లు జతచేయాలని సూచించారు. తప్పుడు సమాచారం, సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొన్నారు. నవంబర్ ఒకటిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని, మరిన్ని వివరాల కోసం tgpmb.telangana.gov.in లో సంప్రదించాలని కోరారు.వంద శాతం ఎఫ్ఆర్ఎస్కాళోజీ సెంటర్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,191 మంది ప్రథమ సంవత్సరం, 959 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 187 మంది సిబ్బందికి పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందని, విద్యార్థుల హాజరు మెరుగుపరిచేందుకు దృష్టి సారించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు చెప్పారు.కబడ్డీ క్రీడాకారులకు అభినందనలునర్సంపేట: నిజామాబాద్ జిల్లా ముప్కప్లో సెప్టెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నర్సంపేటకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అజ్మీరా శ్రీజ, మూడు అశోక్కు జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి బుధవారం జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ సత్యవాణి మాట్లాడుతూ నర్సంపేట స్టేడియంలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే విధంగా పట్టుదలతో శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఇన్చార్జ్, కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, డీవైఎస్ఓ కార్యాలయ స్టాఫ్, కోచ్లు పాల్గొన్నారు.రైతులతో సమావేశంనయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ రైతులకు ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్ పూలింగ్ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంక్
వరంగల్ అర్బన్: మెప్మాకు చెందిన పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంకు కేటాయించేందుకు ఏర్పాట్లు వేగిరమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల సెర్ప్కు పెట్రోల్ బంకులు కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను మండలానికి ఒకటి చొప్పున బస్సులను సమాఖ్యలకు అప్పగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. నగర నడిబోడ్డున ఉన్న బల్దియా బంక్ను కూడా అప్పగిస్తే ఎలా? ఉంటుందనే అంశంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి సారించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ.. బంక్ను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదన్నారు. బంక్ కేటాయింపును రద్దు చేయాలన్నారు. మెప్మాకు అప్పగించాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు డీఈలు తదితరులు పాల్గొన్నారు. కంపోస్ట్ ఎరువును బ్రాండ్తో విక్రయించాలి బయో గ్యాస్ అథారిటీ ప్లాంట్ ద్వారా ఉత్పతవుతున్న విద్యుత్ను వినియోగించుకుంటూ, తద్వారా వెలువడే కంపోస్ట్ ఎరువును బ్రాండ్ల పేరుతో విక్రయించాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం ఉదయం హనుమకొండ పలివేల్పులలో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నిర్మిత ప్లాంట్ స్థలం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. కేయూ ఫిల్టర్ బెడ్ డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్ను పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి సమీక్షలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇప్పించిన పోలీసులు -
వరంగల్
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025విద్యుత్ వినియోగం తగ్గింది వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని టీజీఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. కలెక్టర్లు సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. వివాదమైనప్పుడే స్పందన.. -
‘కలెక్టరేట్లో కామాంధుడు’పై వేటు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కామాంధుడిపై కలెక్టర్ స్నేహ శబరీష్ కొరఢా ఝుళిపించారు. సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తీరుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతోపాటు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ప్రాథమిక చర్యల్లో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్.. అతనిని గత నెల 19న కలెక్టరేట్నుంచి ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. ఆ వెంటనే సమగ్ర విచారణకు ఐసీసీ కమిటీని ఏర్పాటుచేశారు. తొమ్మిది మందితో ఏర్పాటైన ఐసీసీ కమిటీ.. బాధితురాలు, నిందితుడు, సాక్షులను విచారించింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నివేదిక ఇచ్చి నట్లు సమాచారం. వీటన్నింటిని పరిశీలించిన కలెక్టర్ న్యాయ సలహా కూడా తీసుకుని ఆ కామాంధుడిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఇప్పటికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసుకున్న చాంబర్ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యలకు సిఫారసు.. కలెక్టర్.. సదరు సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ను సస్పెండ్ చేయడంతోపాటు తదుపరి కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. భవిష్యత్లో మహిళా ఉద్యోగుల పట్ల అలాంటి ఆలోచన వస్తే ప్రస్తుత చర్యలు గుర్తుకు రావాలన్నట్లు కలెక్టర్ స్పందించి చర్యలకు ఉపక్రమించారు. కుల సంఘాల ఫిర్యాదు.. బాధితురాలి పక్షాన ఎస్సీ సంఘాలు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఇప్పటికే విన్నవించారు. ఈ ఫిర్యాదుపై కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచిఉండాలని కలెక్టర్ వారికి సూచించారు. పలువురు మహిళా సిబ్బందిని వేధించిన సదరు ఉద్యోగి విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘సాక్షి’కి అభినందనలు.. ఈ ఘటన విషయంలో మొదటి నుంచి వాస్తవాలు వెలికి తెస్తూ, కథనాలు రాసిన ‘సాక్షి’కి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి. సస్పెండ్ చేసిన హనుమకొండ కలెక్టర్ తదుపరి చర్యలకు సిఫారసు -
ఎప్సెట్ కౌన్సెలింగ్ షురూ
రామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మాస్యూ టికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్సెట్ అడ్మిషన్స్ హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు సర్టిఫికెట్లషన్ ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్సైట్ సందర్శించాలని ఆయన కోరారు.కార్మిక చట్టాల రక్షణకు ఉద్యమించాలిన్యూశాయంపేట: కార్మిక చట్టాల రక్షణ కోసం నిరంతరం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలో మంగళవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం రెండో మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.సారంగపాణి, ప్రధాన కార్యదర్శిగా టి.ఉప్పలయ్య, కోశాధికారిగా ఎ.యాకయ్యతోపాటు పి.రవి, పి.అశోక్, సాంబయ్య, వెంకటస్వామి, భిక్షపతి, రవీంద్రాచారి, సుదర్శన్, రవీందర్, రాజు, స్వప్నను ఎన్నుకున్నారు.సీజేఐపై దాడికి యత్నం.. న్యాయ దేవతపై దాడేవరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించడం.. న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. సీజేఐ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఓట్లను అపహరించిన బీజేపీ, బీఆర్ఎస్
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికాజీపేట రూరల్: బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. ఓటు చోరీపై కాజీపేటలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్లను చోరీ చేస్తోందని, దీనిపై రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటు చోరీపై ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించాలని వారు సూచించారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీరజాలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్రావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ నాయకులు అరారి సాంబయ్య, ఎండీ అంకూస్, గుంటి కుమార్, సుంచు అశోక్, సిరిల్లారెన్స్, దొంగల కుమార్, అజ్గర్, మనోహర్, నీలక్క, స్వరూప, సుకన్య, మానస, సమతా, రేవతి, శ్వేత పాల్గొన్నారు. -
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా అడుగులు
● జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ నర్సంపేట: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రవేత్తలుగా అడుగులు వేయాలని జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, ఎంఈఓ కొర్ర సారయ్య సూచించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పోడెం కాంతారావు ఆధ్వర్యంలో పీఎంశ్రీ స్కూల్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సంపేట, కొండూరు ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్తో త్రీడీ మోడల్ పరికరాలతో విద్యాబోధనపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట పీఎంశ్రీ గర్ల్స్ స్కూల్, కొండూరు పాఠశాలలకు మాత్రమే 25చిన్న ట్యాబులు, 10 త్రీడీ పరికరాలు, ఒక పెద్ద ట్యాబు రాగా, పంపిణీ చేసినట్లు వివరించారు. బి.రాజేష్, బి.సురేష్కుమార్, వాణి, రాజేందర్రెడ్డి, రమేష్, ఎస్.స్వరూప, టెక్నికల్ అసిస్టెంట్ సుధీర్ పాల్గొన్నారు. భవిత సెంటర్ పనులు పూర్తిచేయాలిదుగ్గొండి: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్మిస్తున్న భవిత సెంటర్ నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని కమ్యూనిటీ మొబిలైజేషన్ జిల్లా అధికారి కట్ల శ్రీనివాస్ ఆదేశించారు. ఒకవేళ పూర్తి చేయకుంటే మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, వెంకట్రాంరెడ్డి, ఐఈఆర్పీలు సంజీవ్కుమార్, కుసుమ రవి, తదితరులు ఉన్నారు. -
ఇసుక, మొరం రవాణాపై విచారణ
కమలాపూర్: మొరం, మట్టి, ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీస్ శాఖతో కలిసి మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. కమలాపూర్లోని సమ్మక్క గుట్ట నుంచి కొందరు వ్యాపారులు అక్రమంగా మొరం, మట్టి తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారని, నేరెళ్ల వాగు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని ప్రజావాణిలో ఇటీవల కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం మైనింగ్ శాఖ ఏడీ రవిశంకర్, రాయల్టీ ఇన్స్పెక్టర్ చంద్రకళ, స్థానిక తహసీల్దార్ సురేశ్కుమార్, ఎస్సై మధు, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందితో కలిసి సమ్మక్క గుట్ట ప్రాంతం, నేరెళ్ల వాగును పరిశీలించి పంచనామా రికార్డు చేశారు. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని, విచారణ పూర్తయ్యాక నివేదికను కలెక్టర్కు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ బంగారు కిరీటం చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి చెరువు మట్టిని అమ్ముకుని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, రమేష్, పులి రజనీకాంత్ పాల్గొన్నారు. వినయ్భాస్కర్కు పోలీసుల నోటీసులు.. దాస్యం వినయ్భాస్కర్కు పోలీసులు నోటీసులు అందించారు. రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో గత నెలలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినయ్భాస్కర్ ధర్నా చేశారు. కాగా, ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హనుమకొండ ఎస్సై సదానందం నోటీసులు అందించారు. -
‘స్థానికం’లో కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ అరూరి రమేశ్ వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారానాయక్, నాయకులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, ఎరబ్రెల్లి ప్రదీప్రావు, కంభంపాటి పుల్లారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్షా, వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్రెడ్డి, జక్కు రమేశ్, వనంరెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్
● ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ అధికారం కోసం బీజేపీ చేస్తున్న కుట్రను బహిర్గతం చేయడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు పౌరుడి హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. అబ్బిడి రాజిరెడ్డి, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిరాయపర్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మహబూబ్నగర్ గ్రామ బీఆర్ఎస్కు చెందిన సుమారు 30 బీఆర్ఎస్ కుటుంబాలు కాంగ్రెస్పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మంగళవారం ఆహ్వానించారు. అనంతరం, యశస్వినిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. ప్రజాసంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని, ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకై క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డితో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తుతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)ను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిని పొత్తుల విషయంలో కలువనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఐనవోలు
ఐనవోలు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 70 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఇటీవల ఎంపిక చేశారు. అందులో ఐనవోలు పోలీస్స్టేషన్ ఒకటి. 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంది. కాగా, కేంద్ర బృందం ఈ వారంలో ఐనవోలు పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఐనవోలు పోలీస్ స్టేషన్ను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏసీపీ వెంకటేశ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ఇన్స్పెక్టర్, ఎస్సై పస్తం శ్రీనివాస్కు వారు పలు సలహాలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఐనవోలు పోలీస్ స్టేషన్ను సదర్శించనున్నట్లు సమాచారం. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి.. ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐ పార్టీకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో స మన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం పార్టీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
సీజేఐపై దాడి న్యాయ దేవతపై దాడే
వరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది యత్నించిన దాడి న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. ఇటీవల సీజేఐ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. దేశ ప్రజలు న్యాయవ్యవస్థను గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి
న్యూశాయంపేట: ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియమ, నిబంధనలతో కూడిన పత్రాలను ముందుగా వారికి అందించాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు అనుబంధం –ఏ, అనుబంధం –బీను రాజకీయ పార్టీల ప్రతినిధులు పూరించి ఇస్తే వాటిని ముద్రించాలన్నారు. -
అందరి దృష్టి హైకోర్టు తీర్పు పైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్: షెడ్యూల్ వచ్చే దాకా ఒక టెన్షన్.. తేదీలు ప్రకటించాక రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై మరో టెన్షన్. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తేలే సమయం రానే వచ్చింది. బుధవారం వెలువడే హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. అన్ని వర్గాల్లోనూ అనుకూలమా? ప్రతికూలమా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల జీఓను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి వంగా గోపాల్రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది.తీర్పు వెలువడిన తర్వాతే ముందుకు..2024 ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటన్నింటితోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో కుల గణన చేపట్టింది. అలాగే, బీసీ డెడికేషన్ కమిటీ వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్ నెలాఖరులో జీఓ 9 తీసుకొచ్చి వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి, ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో వేచిచూసే ధోరణికి వచ్చిన ప్రధాన పార్టీల నేతలు.. నేడు వెలువడే తీర్పు తర్వాత పరిస్థితులను బట్టి మరింత ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.తీర్పుకు ముందే ఊహాగానాలు..బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీలు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలకు రిజర్వేషన్ల గెజిట్ ఇప్పటికే విడుదలైంది. 778 ఎంపీటీసీ, 1,708 సర్పంచ్ స్థానాలు, 15 వేల పైచిలుకు వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సమయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జోరందుకుంటున్న ఊహాగానాలు పల్లెల్లో గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయని, ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్కు పెరుగనున్నాయని.. ఇలా రకరకాలు జరుగుతున్న ప్రచారానికి తోడు రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలతో పరిస్థితులు హాట్హాట్గా కనిపిస్తున్నాయి. -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ విశ్వప్రసాద్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కందిక చెన్న కేశవులు, కళ్యాణి, రాకేష్, వెంకన్న, రాజు, భద్రు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
10 రోజులు.. 1,622 వాహనాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు పది రోజుల వ్యవధిలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్), రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం వచ్చింది. ఓవైపు దసరా పండుగ, ఇంకోవైపు వాహనాలపై విధించే జీఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. తొలి వరుసలో బైక్లు ఉండగా, ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 1,622 వాహనాల విక్రయాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 75 శాతం బైక్లు, కార్లు ఉండగా, మిగిలినవి ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, ఓమ్నీ బస్సులు తదితర వాహనాలు ఉన్నాయి. విక్రయాలు ౖపైపెకి.. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 22న 95 వాహన విక్రయాలు జరిగాయి. 23న 115, 24న 158, 25న 189, 26న 173, 27న 154, 28న 112, 29న 193, 30న 240, అక్టోబర్ ఒకటిన 193 వాహనాల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 22న 95 వాహనాలు విక్రయాలైతే, అధికంగా సెప్టెంబర్ 30న 240 వాహనాల అమ్మకాలు జరిగాయి. మిగతా రోజుల్లో సెంచరీపైనే విక్రయాలు జరిగాయని ఆర్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో భారీగా వాహన విక్రయాలు సెప్టెంబర్ 22న 95 విక్రయించగా, అధికంగా 30న 240 వాహనాలు జిల్లా రవాణాశాఖకు దసరా ధమాకా టీఆర్, రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం -
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డితో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎం గోదాముల పరిశీలన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి వర్ధన్నపేట: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం, కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్ఎం వెంకటేశ్వర్లును ఆదేశించారు. వెంకట్రావ్పల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్ప న, హౌజింగ్ పీడీ గణపతి, డీబీసీడీఓ పుష్పలత, నోడల్ అధికారులు, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాయపర్తి మండలంలో ఆకస్మిక పర్యటన రాయపర్తి: రాయపర్తి మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల సామగ్రి, రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులు, జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుల గదులు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం రాయపర్తి రైతువేదిక పక్కన నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, హౌజింగ్ పీడీ గణపతి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై చర్చ
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై క్లైమేట్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫెసిలిటీ (సీపీపీఎఫ్) ప్రతినిధులు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొని చెత్త సేకరణ, నిర్వీర్యం, ఆదాయం, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. నగరంలో భవిష్యత్లో తడిచెత్త ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టుల ఏర్పాటు, తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్టు గవర్నెన్స్ ప్లాన్, కార్పొరేషన్ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఆరోపణలు
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య ‘‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’’ను విడుదల చేశారు. తెలంగాణలో పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏమేమీ హామీలను నెరవేర్చలేదో వాటిలో కొన్నింటిని ఆ కార్డులో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ప్రజలకు జీవితాంతం బాకీ ఉంటామనేది వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో 11 శాతం వ డ్డీపై అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలే ప్రజలకు అసలైన బాకీదారులని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు మారుపేరుగా నిలిచిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీ డర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రవీందర్, విజ యశ్రీ, కిసాన్సెల్ జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హనుమకొండలో ‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’ విడుదల -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. చెత్తను తొలగించండి.. డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో సోమవారం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, కుడా లేఅవుట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్కులో 12వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ స్వామి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేటాయించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకు అనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలక మండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ నుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండడంతో పాటు పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణంపై ప్రస్తావన.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20 కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్ల్యూఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలక మండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. ఇక పార్ట్టైం లెక్చరర్ల నియామకం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20 కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలక మండలి సమావేశంలో ఆమోదం -
ఆరు జెడ్పీల్లో మూడు చోట్ల మహిళలే..
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మహిళలకు కలిసి వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పురుషులకంటే మహిళలకే ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి. ఉమ్మడి వరంగల్లో జనాభా, ఓటర్ల సంఖ్యతో పాటు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు కూడా ‘ఆమె’కే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈనేపథ్యంలో.. రిజర్వేషన్లు కలిసొచ్చే (భార్య లేదా భర్త) పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన పార్టీల నాయకులు. సుమారు రెండేళ్ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. రేపటి హైకోర్టు తీర్పు వెలువడడమే తరువాయి తమకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు మహిళలు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా పార్టీలకు వారు దరఖాస్తులు కూడా చేసుకున్నారు.ఓటర్లుగా ఆధిక్యం.. సీట్లలోనూ ప్రాధాన్యంజనవరి 5న ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. ఉమ్మడి వరంగల్లో ఓటర్ల సంఖ్య 30,43,540కు చేరింది. పురుషులు, మహిళలు, ఇతరులు, సర్వీసు ఓటర్లు కలిపితే 30.44 లక్షలకు చేరగా.. ఈసారి మహిళలదే అగ్రస్థానం. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళా ఓటర్లు 15,51,289 ఉన్నారు. ఇతరులు (థర్డ్జెండర్స్) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఉమ్మడి వరంగల్కు వచ్చేసరికి 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా నమోదైన మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే 61,683 మంది ఎక్కువగా ఉన్నారు. ఈనేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికే ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా.. ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామ ఎస్సీ మహిళలకు కేటాయించారు. 75 జెడ్పీటీసీలకుగాను 38 మహిళలకు దక్కాయి. 39 ఎంపీపీ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. అదేవిధంగా 778 ఎంపీటీసీ స్థానాల్లో 399, 1708 గ్రామ పంచాయతీల్లో 860 చోట్ల మహిళలకే అవకాశం దక్కనున్నట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.పోటెత్తుతున్న దరఖాస్తులుస్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈక్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ రెండు రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. స్టేషన్ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు. వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ వరకు దరఖాస్తులు చేసుకోగా.. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో ఆశావహులు గట్టిగానే తలపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఛాలెంజ్గా తీసుకుని అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈసారి మహిళలకు అత్యధిక స్థానాలు రిజర్వ్ కావడంతో ఆ స్థానాల్లో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా అన్ని పార్టీలు తలమునకలవుతున్నాయి. -
‘స్థానిక’ంగా గెలిపించుకుంటా..
కమలాపూర్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నన్ను గెలిపించిన కార్యకర్తలు, నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను గెలిపించుకుంటా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. కమలాపూర్లో సోమవారం బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసం గెలుచుకున్నోళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు. కమలాపూర్ మండలంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు లక్ష్మణ్రావు, నవీన్కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచి పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త అని, ఎవరైనా పార్టీ మారితే వెయ్యి మందితో వారి ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ప్రస్తుతం అక్కడ రోడ్డంతా గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే ఎమ్మెల్యేల నిధులైనా విడుదల చేస్తే రోడ్డును బాగు చేయించుకుంటామన్నారు. హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగురవేద్దాం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి -
ఎర్రబారిన వరిపొలం
● కలుపు నివారణకు మందు పిచికారీతో రంగుమారిన వైనం ● డీలర్, కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వేడుకోలు రాయపర్తి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లైంది. ఓ రైతు పరిస్థితి. కలుపును నివారించి వరిపంటను కాపాడుకునేందుకు యత్నించిన రైతుకు డీలర్ ఇచ్చిన కలుపు నివారణ మందు శాపమైంది. మూడెకరాల్లో నాటిన వరిపంట పూర్తిగా ఎర్రబారిపోయింది. ఈ సంఘటన రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అబ్బోజు సేనాపతి కథనం ప్రకారం గతనెల 19న వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డులోని ఎస్బీఐ పక్కన ఉన్న మాధురి ఏజెన్సీస్ పెస్టిసైడ్స్, సీడ్స్ ఫెర్టిలైజర్ దుకాణంలో నోవిక్సిడ్, తారక్ అనే కంపెనీలకు చెందిన పిచికారీ మందులను కొనుగోలు చేశాడు. ఆ మందులను వారం రోజుల క్రితం పిచికారీ చేయగా, మూడెకరాల్లోని వరి మొత్తం నిప్పుతో కాల్చిన విధంగా ఎర్రబారింది. ఈ విషయాన్ని వరంగల్లోని డీలర్కు తెలియజేయగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కంపెనీ ప్రతినిధులు పూజిత, కుమార్.. దాటవేసే ధోరణిలో వ్యవహరించారు. అధికారులు పంటక్షేత్రాన్ని సందర్శించి కంపెనీపై, తనకు మందులు ఇచ్చిన డీలర్పై చర్యలు తీసుకొని, పంట నష్టం అందేలా చొరవ తీసుకోవాలని బాధిత రైతు సేనాపతి వేడుకుంటున్నాడు. కార్యక్రమంలో గ్రామ రైతులు తీగల సాయిలు, బండి కుమార్, నిమ్మల రాజు, సల్ల కొంరయ్య, బొమ్మెర రవి, గడ్డం సుధాకర్, బండి సంతోష్, మామిండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు ౖపైపెకి..
సాక్షి, వరంగల్: ఈ వానాకాలంలో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పైకి ఉబికాయి. జూన్లో సగటున 5.98 మీటర్ల లోతులో ఉన్న నీరు జూలైలో 5.66 మీటర్లు, ఆగస్టులో 3.14 మీటర్లకు పైకి ఎగబాకిన భూగర్భ జలమట్టాలు.. సెప్టెంబర్లో 2.61 మీటర్లకు సగటున వచ్చి చేరాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురవాల్సి వాన కంటే అధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ వానలతో చెరువులు, కుంటలు, వాగులు నిండి ఆయా ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పైకి ఎగబాకాయి. దాంతో ఈ ఏడాది వ్యవసాయానికి సాగునీటికి ఢోకా లేదు. కానీ, పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు మాత్రం అదనపు వర్షంతో కొంతమేర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,84,375 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 2,53,420 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. పత్తి 1,18,106, వరి 1,03,160, మొక్క జొన్న 13,654, ఇతర పంటలు 18,500 ఎకరాల్లో సాగవుతున్నాయి. అదనంగా వర్షాలు జూన్లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్లకు 312.8 మిల్లీమీ టర్ల వాన కురిసింది. అంటే జూన్లో లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టులో 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. సెప్టెంబర్ నెలలో 174.9 మిల్లీమీటర్ల వర్షానికి 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలుపుకుంటే 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. జూన్లో 5.98 మీటర్లలో భూగర్భ జలమట్టం తాజాగా 2.61 మీటర్లపైకి ఎగబాకిన నీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు అదనపు వానలతో సాగునీరుకు నిశ్చింతమండలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ చెన్నారావుపేట 1.46 0.32 0.12 0.01 దుగ్గొండి 4.71 3.53 0.21 0.15 గీసుకొండ 5.03 4.67 1.26 0.61 ఖానాపురం 3.34 2.92 0.69 1.06 నల్లబెల్లి 7.70 7.33 1.25 0.97 నర్సంపేట 4.97 4.10 1.15 1.60 నెక్కొండ 2.85 0.48 0.19 0.43 పర్వతగిరి 11.65 13.51 7.66 6.58 రాయపర్తి 8.06 9.63 7.05 4.17 సంగెం 3.58 3.12 2.26 2.52 వర్ధన్నపేట 8.30 7.33 5.65 5.52 వరంగల్ 2.22 1.81 1.21 1.27 ఖిలా వరంగల్ 4.65 3.87 1.70 0.32 -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, కుడా లేఅవుట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల టెక్స్టైల్ పార్కు మాస్టర్ ప్లాన్ను ఆమోదించి అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించిందని గుర్తుచేశారు. టెక్స్టైల్ పార్కులో 12వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇండస్ట్రీయల్ జోనల్ మేనేజర్ స్వామి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసీల్దార్ రాజ్కుమార్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి
● విద్యార్థులను పాఠశాలలోకి రానివ్వని యాజమాన్యం ● ప్రభుత్వం స్పందించాలని రోడ్డెక్కిన బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులునెక్కొండ: ప్రభుత్వం బీఏఎస్ బిల్లులు చెల్లించలేదని మండల కేంద్రంలోని విద్యోదయ బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించక పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక అంబేడ్కర్ సెంటర్లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మాట్లాడారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యాన్ని మంత్రులు, సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే బీఏఎస్ యాజమాన్యం మొండికేసిందని వాపోయారు. మూడేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో తమ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక పోతున్నామని, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ వంటివి సమకూర్చుకోవడం కష్టంగా మారిందని బీఏఎస్ స్కూల్ యాజమాన్యం చెబుతోందని అన్నారు. పిల్లల చదువులు సక్రమంగా సాగకపోతే ప్రభుత్వం దిగి వచ్చే వరకు దశల వారీగా ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
రేపటి నుంచి కళాశాలల సిబ్బంది వివరాల పరిశీలన
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఆమోదించనున్నట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటలో తెలిపారు. డీఐఈఓ ఆమోదం పొందిన సిబ్బందికి ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్ బోర్డు వెబ్సైట్ https// acadtgbie.cgg.gov.in ద్వారా ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ, పుట్టిన తేదీ వంటి అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డాక్యుమెంట్లను భౌతికంగా పరిశీలించేదుకు ఆయా కళాశాలలకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించినట్లు పేర్కొన్నారు. 8, 9వ తేదీల్లో ప్రైవేట్ కళాశాలలు, 14, 15, 16వ తేదీల్లో ప్రభుత్వ కళాశాలల సిబ్బంది వివరాలను, మొత్తం 864 మంది బోధన, బోధనేతర సిబ్బంది డాక్యుమెంట్లను పరిశీలించి అఫ్రూవ్ చేయనున్నట్లు డీఐఈఓ స్పష్టం చేశారు.యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండిరామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్ పాల్గొన్నారు.చెత్తను తొలగించండి..డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు.దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారును నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.9న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలువిద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. -
మామూళ్ల మత్తులో ‘ఎకై ్సజ్’
● బెల్ట్ షాపు నుంచి నెలకు రూ.వెయ్యి, గుడుంబా సెంటర్ నుంచి రూ.2 వేల చొప్పున అక్రమంగా వసూలుపర్వతగిరి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండలంలో ఎకై ్సజ్ అధికారుల దోపిడీ కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. మండలంలోని 33 గ్రామాల్లో సుమారు వంద బెల్ట్ షాపుల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున, 50 గుడుంబా సెంటర్ల నుంచి నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాగే, మండలంలోని ఏనుగల్, చింత నెక్కొండ, అన్నారం షరీఫ్, పర్వతగిరి గ్రామాల్లో ఆరు వైన్ షాపుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. ఎకై ్సజ్ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బెల్ట్ షాపులు, గుడుంబా సెంటర్లపై ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించకపోవడంతో పలు విమర్శలు తావిస్తోంది. 30 ఏళ్లుగా గుడుంబా సెంటర్ల నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పదేళ్లుగా గుడుంబా నిర్వాహకులపై కేసులు పెట్టడంలో ఎకై ్సజ్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు ఎకై ్కజ్ అధికారులు నెలవారీ మామూళ్ల వసూళ్లలో భాగంగా తమ డ్రైవర్ ద్వారా లంచాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వసూళ్లలో ఎకై ్సజ్ శాఖ డ్రైవర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట: పేద విద్యార్థుల విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. ప్రభుత్వ గురుకులాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో సర్కారు విఫలమైందని తెలిపారు. -
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై చర్చ
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై క్లైమేట్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫెసిలిటీ (సీపీపీఎఫ్) ప్రతినిధులు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొని చెత్త సేకరణ, నిర్వీర్యం, ఆదాయం, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. వరంగల్ నగరంలో భవిష్యత్లో తడిచెత్త ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టుల ఏర్పాటు, తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్టు గవర్నెన్స్ ప్లాన్, కార్పొరేషన్ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
10 రోజులు 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎలక్షన్స్పై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది. లక్ష్యం చేరేనా? హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.వైన్స్ అప్లికేషన్లపై ఆసక్తి కరువు 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం జరగదన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై ప్రజలు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని ఆమె కోరారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు ఈనెల 7న రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ కూతాడి అర్జున్రావు రానున్నారు. ఈసందర్భంగా శంభునిగుడి, మ్యూజియ భవనం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 6న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. కొత్తూరు, హనుమాన్నగర్ డబ్బాలు, కేయూ సెకండ్ గేట్, రెడ్డి కాలనీ, పాలజెండా, యాదవనగర్, ఏకశిల కాలేజీ, గోపాల్రావు బిల్డింగ్, కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. జవహర్కాలనీ, కొండా మురళి గెస్ట్హౌస్ రోడ్డు, ఎస్వీఎస్ హోమ్స్, విష్ణుపురి కాలనీ, నవయుగ కాలనీ, ద్వారకాసాయి కాలనీ ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, నయీంనగర్, లష్కర్సింగారం, రాజాజీనగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్–19 ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా హసన్పర్తి మండలంలోని భీమారం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నరెడ్ల శ్రీధర్ నియమితులయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వాసంతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీగా శ్రీధర్ రెండేళ్ల పాటు కొనసాగుతారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ పర్వతగిరి: తాళం వేసి ఉన్న చోరీ జరిగిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మార్కెట్ యార్డు సమీపంలోని చనమల్ల నర్సయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లో తన కూతురు కాలేజీ ఫీజు కోసం దాచిన రూ.50వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు నడపలేం..
● ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున్రెడ్డి నెక్కొండ: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమెన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (బీఏఎస్) నిధులు విడుదల కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారుతోంది. మూడేళ్లుగా బీఏఎస్ నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయా స్కూల్స్ యాజమాన్యాలు నేటి (సోమవారం) నుంచి విద్యార్థులకు పాఠశాలల అనుమతి నిరాకరిస్తున్నామని బెస్ట్ అవైలబుల్ స్కూల్ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన సలహాదారుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగా ర్జున్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాజమాన్యాలు వడ్డీలకు అప్పులు తెచ్చి, నగలు తాకట్టు పెట్టి ఇప్పటి వరకు పాఠశాలలను నడిపించామన్నారు. గత బకాయిలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 32 స్కూళ్లు ఉన్నాయని, ఇందులో 3,500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారన్నారు. గతంలో నిధుల విడుదల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్లను కలిసి విన్నవించామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు, డీటీడబ్ల్యూ, డీఎస్డీఓ అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయామన్నారు. ఇకపై స్కూళ్ల నిర్వహణ ఆర్థిక భారాన్ని భరించలేమని, విద్యార్థులకు అనుమతించడం లేదని తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా సమాచారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం స్పందించి బీఏఎస్ బకాయిలు చెల్లించాలని కోరారు. -
కంఠమహేశ్వరుడికి జలాభిషేకం
నర్సంపేట: పట్టణంలో శ్రీకంఠమహేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం స్వామి వారి కి భక్తులు జలాభిషేకం నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతిఒక్కరూ ఆలయానికి డప్పు చప్పుళ్లతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, జలాలతో అభిషేకాలు చేశారు. పట్టణంలోని గౌడ కులస్తుల ఇంటి నుంచి బిందెలతో జలాలను కొత్త వస్త్రాలు ధరించి మంగళహారతులతో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లుగౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీని వాస్గౌడ్, ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య, ఆర్థిక కార్యదర్శి నాతి సదానందం, గిరగాని కిరణ్, డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు. -
10 రోజులు.. 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎన్నికలపై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది.హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైన్స్ అప్లికేషన్లపై అనాసక్తి 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
మక్క రైతులను ముంచుతున్న దళారులు
నర్సంపేట: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను దళారులు, వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించి మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చిన రైతుల ఇబ్బందులు, ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైఫరీత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకుండా దళారులకు, వ్యాపారులకు వత్తాసు పలుకుతుందన్నారు. ఈ క్రమంలో కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 అమ్మాల్సిన మొక్కజొన్నలు రూ.1,600 నుంచి రూ.2,100 దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోనే మొదట దిగుబడి వచ్చే జిల్లాలో ఇంత వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పండిన మొక్కజొన్నలకై నా కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మార్కెట్లో మొక్కజొన్నలు ఆరబోసుకుని వారాలు గడుస్తున్న కుంటి సాకులతో ధర తగ్గించడానికి కొనుగోలు జరగకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా తక్షణమే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర అమలు అయ్యే విధంగా మార్క్ఫెడ్లను రంగంలోకి దించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, కలకోట్ల యాదగిరి, రాజేందర్, వీరన్న, సురేష్, రైతులు పాల్గొన్నారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కాపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కాపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోవాలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సి న బాధ తప్పుతుంది.‘కాపాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగు -
దుఃఖం
దూది రైతులఈ ఫొటోలో పత్తి కాయలు ఒలుస్తోన్న మహిళా రైతు నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని అరుణ. తనకున్న ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసింది. సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయింది. పత్తి పంటలో వర్షం నీరు నిలవడంతో దిగుబడి తగ్గింది. ఉన్న ఒకటి, రెండు కాయలు తెంపుకొచ్చి ఇంటి దగ్గర ఒలుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి ఇలానే ఉంది.అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తిపంటనర్సంపేట: పత్తి రైతు ఏటా నష్టపోతూనే ఉన్నాడు. అకాల వర్షాలు, తెగుళ్లు, చీడపీడలతో దిగుబడి రాక, ఉన్న కొద్దిపాటి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడులు పెరిగి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.8,110 ధర కూడా పెట్టడం లేదు. కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు టెండర్లకు ముందుకు రాకపోవడంతో సీసీఐ కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.7వేల వరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. అకాల వర్షాలు, తెగుళ్లు, ఎరువుల కొరత ఈ ఏడాది మే మాసంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు నాటారు. ఏపుగా పెరిగి కాయ దశలో తెగుళ్లు విజృంభించి పత్తి పంటను నాశనం చేశాయి. ఇదే క్రమంలో యూరియా దొరకకపోవడంతో పత్తి ఎదుగుదలలో లోపం స్పష్టంగా కనిపించింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. అయితే ఉన్న కాస్త పత్తి ఏరి ఇటీవల అమ్ముకుంటున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదు. సీసీఐ కొనుగోలు లేకపోవడంతో దళారులు వారిని నిలువునా ముంచుతున్నారు. కొత్త నిబంధనలతో... సీసీఐ కొత్త నిబంధనలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2022లో క్వింటా పత్తి ధర రూ.14వేలు ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీసీఐ ధరలపై ఆధారపడుతున్నారు. కాగా సీసీఐ ఉమ్మడి వరంగల్ జి ల్లాలో 58 జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేస్తుంది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య ఏర్పడిన వివాదంతో కొనుగోలు జరగడం లేదు. మార్క్ఫెడ్ మినహా ప్రైవేట్ వ్యాపారులు దూరంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాలతో పత్తి అమ్మకాలు... అకాల వర్షాలతో రైతులు పత్తిని ఇంట్లో నిల్వ చేసుకోవడం లేదు. ఏరిన పత్తిని ఏరినట్లు మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పత్తిని అమ్మితే మద్దతు లభించడం లేదని, కూలీల ఖర్చులు పెరిగాయని, దీంతో పెట్టిన పెట్టుబడులు మీద పడి అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మురిగిపోతున్న పత్తి కాయలు సీసీఐ కొనుగోళ్లపై అనుమానాలు కొత్త నిబంధనలతో టెండర్లకు దూరంగా జిన్నింగ్ మిల్లులు దళారులకు వరంగా మారిన కొనుగోళ్లు జిల్లాలో 1,26,500 ఎకరాల్లో పత్తి సాగు -
నిర్వహణ కనుమరుగు
వివిధ పనుల నిమిత్తం రోజూ వరంగల్ నగరానికి వచ్చేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వారికి ఒకటికో రెంటికో వస్తే నరకమే. ఏ షాపింగ్ మాలో.. పెట్రోల్ బంకో.. బస్టాండ్, రైల్వే స్టేషన్కో పరుగులు పెట్టాల్సిందే. నగరంలో అక్కడక్కడా మరుగుదొడ్లు కనిపించినా ఆ కంపునకు దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కొన్ని చోట్ల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. – వరంగల్ అర్బన్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రజా మరుగుదొడ్లు.. స్థలాల లేమి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఈ నిర్మాణల్ల్లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలున్నాయి. అవేమీ చాలవన్నట్లుగా ఇప్పుడు నిర్వహణ పేరిట ప్రజా సొమ్ము వాటాలుగా పంపిణీ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్లో రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మాయమయ్యాయి. అక్కడక్కడా మిగిలిన కొన్ని ప్రస్తుతం చెత్త కుప్పల్లా మారాయి. లూకేఫ్ సంస్థకు ఇచ్చిన కంటైనర్ తరహాలో ఏర్పాటు చేసినవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లు రెండు బల్దియా ప్రధాన కార్యాలయంలో పార్కింగ్కే పరిమితయ్యాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన వాటికి కూడా అదే దుస్థితి. ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు ఏమేర అక్కరకు వస్తున్నాయో తెలియదు కానీ, ఏజెన్సీ, అధికారులు, సిబ్బందికి మాత్రం ఆర్థిక మేలు చేకూరుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే వెయ్యి సీటర్లు..నగరంలో ప్రత్యేకంగా ఆరు చోట్ల షీ టాయిలెట్లను నిర్మించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, బాలసముద్రం, సుబేదారి, ఖిలా వరంగల్ కోట, కాజీపేట, నయీంనగర్లో ఉండగా.. ఇవి నామ మాత్రంగానే నడుస్తున్నాయి. రూ.30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రెండు మొబైల్ షీ టాయిలెట్లు బస్సులు మూలకు చేరి తప్పుపడుతున్నాయి. హైదరాబాద్ తరహాలో నగరంలో ఆరు ఆధునిక టాయిలెట్లను సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట, నిట్, హనుమకొండ కలెక్టరేట్, భీమారం, టీబీ ఆస్పత్రి, హనుమకొండ పాత బస్డిపో, వరంగల్ పోచమ్మ మైదాన్, ఖిలా వరంగల్ కోట ఖుష్మహల్ దగ్గర ప్రస్తుతం ఇవి వాడకంలో ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ములుగురోడ్డు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా, చార్బౌళి, అండర్ బ్రిడ్జి, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు మొత్తంగా రూ.10 కోట్లతో 88 చోట్ల 324 సీటర్లు నిర్మించారు. అందులో పది శాతం మాత్రమే ఉపయోగంలో ఉండగా.. 40ఽ శాతం నామమత్రంగా, మరో 50 శాతం తాళాలు పడ్డాయి. ప్రైవేట్వి పని చేస్తున్నాయ్.. జీడబ్ల్యూఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో బీఓటీ (బిల్డ్, ఓన్, ఆపరేట్) పద్ధతిలో నిర్మించి, రుసుము వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చారు. అలాంటివి నగరంలో సుమారు 60 వరకు 676 సీటర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని చోట్ల (సులభ్ కాంప్లెక్స్)లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి రూ.5 చొప్పన రుసుము వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొకరి నుంచి రూ.10 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరుగుదొడ్ల తనిఖీలపై బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేస్తాం. నిర్వహణ ఉన్న టాయిలెట్లకు నిధులు మంజూరు చేస్తాం. లేకపోతే రద్దు చేస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ రూ.10 కోట్లతో 88 నిర్మాణాలు వినియోగంలో ఉన్నవి 10 శాతమే.. లేకున్నా బిల్లుల చెల్లింపులుప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అంటూ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లలో సగం కనుమరుగయ్యాయి. రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని అపరిశుభ్ర వాతావరణంలో చెత్తకుప్పలుగా మారాయి. ప్రతీ నెల పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై పౌరులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా అధునాతన మరుగుదొడ్ల నిర్వహణకు ఓ ఏజెన్సీకి కట్టబెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కానీ, 90 శాతానికిపైగా పనిచేయడం లేదు. చాలా చోట్ల నీటి, విద్యుత్ సదుపాయాలు లేక కొన్ని మూలకు చేరాయి. కనీసం డోర్లు లేక మరికొన్ని అధ్వానంగా మారాయి. ఈ లెక్కాపత్రాలను వెల్లడించేందుకు ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు ససేమిరా.. అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.