breaking news
Market
-
ఐటీ షేర్ల మెరుపులు.. లాభాల్లో స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్ల లాభాల దన్నుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు లేదా 1.16 శాతం పెరిగి 77,654.60 వద్ద, నిఫ్టీ 265 పాయింట్లు లేదా 1.1 శాతం పెరిగి 24,250.20 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.82 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.48 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
వసివాడిన పసిడి మెరుపులు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
700 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 201 పాయింట్లు పెరిగి 24,189 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 721 పాయింట్లు పుంజుకొని 77,478 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పెరిగింది.నాస్డాక్ 0.22 శాతం నష్టపోయింది.Today Nifty position 29-07-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కెనరా బ్యాంక్ లాభం రూ.4,856 కోట్లు!
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో (2026-27, క్యూ1) రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 4,752 కోట్లతో పోలిస్తే లాభం 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 38,063 కోట్ల నుంచి రూ. 39,684 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 13 శాతం పెరిగి రూ. 10,215 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ1లో ఇది రూ. 9,009 కోట్లు మాత్రమే.ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లు ఎట్ 1.3 బిలియన్ డాలర్లుఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ల (ఎఫ్సీఎన్ఆర్-బీ) రూపంలో బ్యాంకు ఇప్పటిదాకా 775 మిలియన్ డాలర్లను సమీకరించింది. మొత్తంమీద ఈ మార్గంలో 1.3 బిలియన్ డాలర్ల డిపాజిట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ బ్రజేష్ కుమార్ సింగ్సింగ్ తెలిపారు. కాగా, విదేశీ రుణాల ద్వారా 1 బిలియన్ డాలర్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు.దిగొచ్చిన ఎన్పీఏలు: క్యూ1లో బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 1.57 శాతానికి దిగొచ్చాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.69 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా నికర ఎన్పీఏలు కూడా 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయి. -
ఇంకా తగ్గనున్న బంగారం ధరలు!
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కారణం అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే మార్కెట్లో ఊహకందని పరిణామాలు జరగలేదన్నమాట. అయినప్పటికీ త్వరలోనే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా పతనమవుతున్నాయి.దేశీయ మార్కెట్లో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1550 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.200 రీఛార్జ్ ప్లాన్.. జియో vs వొడాఫోన్ ఐడియా! -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.86 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 76,765.92 వద్ద, నిఫ్టీ 10.60 పాయింట్లు లేదా 0.044 శాతం నష్టంతో 23,985.35 వద్ద నిలిచాయి.అశికా గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, రాడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, నీల్కమల్ లిమిటెడ్, అఫ్లే 3ఐ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్, ఆరియన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కరుగుతోన్న బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అక్కడక్కడే కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 3 పాయింట్లు పెరిగి 23,996 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 17 పాయింట్లు పుంజుకొని 76,846 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది.నాస్డాక్ 0.18 శాతం నష్టపోయింది.Today Nifty position 28-07-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం లాభంతో 76,835.78 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 23,995.95 వద్ద నిలిచాయి.పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నెల్కాస్ట్ లిమిటెడ్, గాంధర్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్, మోస్చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్, టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, క్రాస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్స్ అలర్ట్: న్యూ ఫండ్ ఆఫర్స్
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా నిఫ్టీ 200 వేల్యూ 30 ఇండెక్స్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) జూలై 27 వరకు అందుబాటులో ఉంటుంది. పారదర్శకమైన విధంగా ఎంపిక చేసిన 30 వేల్యూ ఆధారిత కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది బజాజ్ లైఫ్కి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో అందుబాటులో ఉంటుంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ స్థిరత్వం, మిడ్ క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాల మేళవింపుతో ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇది ఉంటుందని బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. బరోడా బీఎన్పీ పారిబా సర్వీసెస్ ఫండ్ సేవల రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కల్పిస్తూ బరోడా బీఎన్పీ పారిబా తాజాగా సర్వీసెస్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా అధిక వృద్ధి అవకాశాలున్న బీఎఫ్ఎస్ఐ, ఐటీఈఎస్, టెలీకమ్యూనికేషన్స్, హెల్త్కేర్, ఈ–కామర్స్ రంగ సంస్థల షేర్లలో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. మూడేళ్ల పైగా కాలానికి ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్ అనువుగా ఉంటుంది. ఏకమొత్తంగా కనీసం రూ. 1,000 నుంచి, నెలవారీ సిప్ ద్వారా రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీముకు రోహన్ కొర్డె ఫండ్ మేనేజరుగా వ్యవహరిస్తారు. -
బంగారానికి మరింత ఊపు.. తులం భారీ రేటే!
దేశంలో బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. మొన్న భారీగా పెరిగి, నిన్న నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు మరింత ఊపందుకున్నాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 23,944 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 601 పాయింట్లు పుంజుకొని 76,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 27-07-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆగస్టులో ఐపీఓల జాతర
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ ఆగస్టులో భారీ ఐపీఓల రాకతో కళకళలాడనుంది. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన, స్థిరపడుతున్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 12కు పైగా కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్కు సిద్ధమయ్యాయి. రాబోయే నెలలో మార్కెట్లోకి రానున్న ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో కొత్త షేర్ల జారీ తో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లు కూడా ఉన్నాయి. ‘స్టాక్ మార్కెట్ స్థిరీకరణ సాధించడం, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో ఇన్నాళ్లూ వేచి చూసిన కంపెనీలు ఇప్పుడు ఐపీఓలకు సన్నద్ధమయ్యాయి. 2026లో ఐపీఓల ద్వారా సుమారు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.66 లక్షల కోట్లకు పైగా) నిధులు సమీకరించే అవకాశం ఉంది’ అని ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ భవేశ్ షా తెలిపారు. జెప్టో: క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో అత్యంత భారీ ఆఫర్తో మార్కెట్లోకి వస్తోంది. కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్లు సేకరించడమే కాకుండా, ఓఎఫ్ఎస్ రూపంలో 11.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ట్రూహోమ్: ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల ఐపీఓను ప్రతిపాదించింది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.1,500 కోట్ల ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఎలివేట్ క్యాంపసెస్: ఈ కంపెనీ పూర్తిగా తాజా ఇష్యూ ద్వారానే రూ. 2,550 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. షిప్రాకెట్: లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్ షిప్రాకెట్ మొత్తం రూ. 2,342.35 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా రూ. 1,100 కోట్ల తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 1,242.35 కోట్ల షేర్లను జారీ చేయనుంది.ఈ వారంలో మూడు పబ్లిక్ ఇష్యూలు ఈ వారంలో ప్రధానంగా మూడు పబ్లిక్ ఇష్యూలు సబ్్రస్కిబ్షన్ కోసం రానున్నాయి. వీటన్నింటిలో మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓ అతి పెద్ద ఆఫర్. రూ. 9,275 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 29న (బుధవారం) ప్రారంభమై జూలై 31న ముగియనుంది. ధర శ్రేణిని రూ. 560 – రూ. 590గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో రూ. 8,000 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు రూ. 1,275.22 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగానికి చెందిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జూలై 30న (గురువారం) ప్రారంభమై ఆగస్టు 3న ముగియనుంది. ఈ కంపెనీ ఎలాంటి ఓఎఫ్ఎస్ లేకుండా, పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే రూ. 1,800 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో ఇష్యూ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ కూడా జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండనుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో రానున్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 290 కోట్ల నిధులను సేకరించనుంది. -
దలాల్ స్ట్రీట్లో బిగ్ ఫైట్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’ మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.బేరీష్గానే ఎఫ్ఐఐలు గత వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గతవారమంతా నష్టాలే.. దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అలాగే డాలర్తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
రూ.1.45 లక్షలకు చేరిన బంగారం ధర!
బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట. -
అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్!
అప్పు చేసినవాళ్లలో.. చాలా మంది వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుల ఊబి నుంచి బయటకు రావడమే ఆర్థిక స్వేచ్ఛ అని భావిస్తారు. కానీ, కోటీశ్వరులు ఎప్పుడూ అలా ఆలోచించరు. ఈ కారణంగానే సామాన్యులు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతున్నారని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.బ్యాంకులు, ప్రభుత్వాలు, మన విద్యా వ్యవస్థలు ఎప్పుడూ చెప్పని కొన్ని ఆర్థిక రహస్యాలను కియోసాకి వెల్లడించారు. నిజానికి మన ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది అప్పుల ద్వారానే సృష్టించబడుతుంది. ఒకవేళ ఎవరూ అప్పు చేయకుండా.. పూర్తిగా అప్పు లేని జీవితాన్ని గడపాలని చూస్తే.. వారు ఈ ఆర్థిక వ్యవస్థ వెలుపల బతుకుతున్నట్టే లెక్క.అమెరికా జాతీయ అప్పు నేడు 40 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రభుత్వం కూడా అప్పుల మీదే నడుస్తోంది. అప్పుల్లేని వ్యవస్థ ఈ ప్రపంచంలో మనుగడ సాగించలేదు. మరి అలాంటప్పుడు, ప్రపంచంలోని అత్యంత ధనిక ప్రభుత్వమే అప్పులతో నడుస్తున్నప్పుడు.. సామాన్యులైన మనల్ని మాత్రం 'అప్పుల జోలికి వెళ్లొద్దు' అని ఎందుకు భయపెడతారు? ఇక్కడే అసలు రహస్యం ఉంది.ధనవంతులు అప్పును ఎలా వాడుకుంటారు?ఆర్థిక అవగాహన లేని వ్యక్తి అప్పు చేసి కార్లు, విహారయాత్రలు, బట్టలు వంటివి కొనుక్కుంటాడు. దీనివల్ల అతని జీవితం మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి పడిపోతుంది. అదే.. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ధనవంతుడు అప్పును రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, లేదా నిలకడగా ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాడు.ఇక్కడ అసలు మ్యాజిక్ ఏమిటంటే.. అప్పును ధనవంతుడు స్వయంగా కట్టడు. అద్దెలు కట్టే కిరాయిదారులు లేదా వ్యాపారంలో వచ్చే సంపాదన ద్వారా ఆ అప్పు తీరిపోతుంది. ఎప్పుడైతే అప్పు మీ కోసం పనిచేసి, మీకు డబ్బు తెచ్చిపెడుతుందో.. అప్పుడే అది సంపదను సృష్టించే ఒక మిషన్ మాదిరిగా మారుతుందని కియోసాకి చెబుతారు.ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మనం చేసే అప్పు మీద ఎలాంటి పన్ను ఉండదు. మీరు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా, కోటి రూపాయలు తీసుకున్నా ఆదాయపు శాఖ దానిపై పన్ను వసూలు చేయలేదు.Loading post...అందుకే ధనవంతులు ''తమ దగ్గరున్న ఆస్తులను (Assets) బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుంటారు. ఆ డబ్బుతో మరిన్ని కొత్త ఆస్తులను కొంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే అద్దెలు లేదా ఆదాయంతోనే అప్పును కట్టిస్తారు. ఆస్తిని ఎప్పటికీ అమ్మరు (అమ్మితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి). ఆస్తిని అమ్మకుండా కేవలం దానిపై మళ్లీ మళ్లీ లోన్లు తీసుకుంటూ పన్ను లేని నగదును పొందుతారు''.ధనవంతుల ఆర్థిక రహస్యంచివరికి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ ఆస్తులు వారసులకు బదిలీ అవుతాయి. అప్పుడు పన్ను భారం పూర్తిగా తొలగిపోతుంది. ఇది పూర్తిగా చట్టబద్ధమైన, అత్యంత సులభమైన వ్యూహం. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి ఇదే అసలు రహస్యం.అప్పు తీసుకోవడం అనేది ప్రమాదకరమైన విషయం కాదు. అయితే ఏ విధమైన అప్పు తీసుకుంటున్నామనేదే ముఖ్యం. మీ జేబు నుంచి డబ్బులు తీసి అప్పు కడితే అది 'చెడ్డ అప్పు' (ఉదాహరణకు: క్రెడిట్ కార్డు బిల్లులు, కారు లోన్). అలా కాకుండా.. వేరే వాళ్లు (కిరాయిదారులు లేదా కస్టమర్లు) మీ అప్పును తీరుస్తుంటే అది 'మంచి అప్పు'.అయితే కోటీశ్వరులు అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. రిస్క్ తీసుకోకుండా ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మాత్రమే ఎంచుకుంటారు, తగినంత డబ్బును రిజర్వ్లో ఉంచుకుంటారు. నిపుణుల సలహాలతో అప్పులను నిర్వహిస్తారు.మొత్తానికి అప్పు అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది, లేదంటే ముంచేస్తుంది. కాబట్టి, ఆర్థికంగా ఎదగాలంటే.. అప్పు లేకుండా బతకాలి అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, అప్పులను తెలివిగా ఎలా వాడాలో నేర్చుకుంటే ధనవంతులు అవుతారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాల్.. సెక్షన్ 301తో దర్యాప్తు! -
మణిపాల్ హెల్త్ ఐపీవో.. షేరు ధర ఇలా..
న్యూఢిల్లీ: హెల్త్కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. మణిపాల్ హెల్త్ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ (13,000 బెడ్స్) కలిగిన మణిపాల్ హెల్త్.. 2025 సెపె్టంబర్ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్ వెల్లడించారు. -
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ఒక్కరోజులోనే తారుమారయ్యాయి. క్రితం రోజున భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి ధరలు నేడు మళ్లీ పరుగును అందుకున్నాయి. ఇక వెండి ధరలు కూడా నిన్నటి స్థాయిలోనే ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
స్టాక్ మార్కెట్: ఐదో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలతోనే ముగిశాయి. పెరిగిన చమురు ధరల మధ్య ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన భయాలతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ శుక్రవారం నష్టాలతో సెషన్ను ముగించాయి.సెన్సెక్స్ 332 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,059.77 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 23,767.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.32 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
‘బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు ఆ లోహానిదే’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని కమోడిటీ మార్కెట్పైకి మళ్లించారు. ఈసారి బంగారం, వెండి కాకుండా రాగి (కాపర్) భవిష్యత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగి ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని, అయినప్పటికీ ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుండటంతో రాగికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగాలన్నీ విడివిడిగా కాకుండా ఒకేసారి రాగిని అధికంగా వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలను ఆయన ప్రస్తావించారు.అయితే మరోవైపు రాగి ఉత్పత్తి అంతే వేగంగా పెరగడం లేదని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందని, వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గనుల్లో లభించే ఖనిజ నాణ్యత కూడా గత రెండు దశాబ్దాలుగా క్షీణిస్తుండటంతో, అదే పరిమాణంలో రాగిని పొందేందుకు గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ రాళ్లను తవ్వాల్సి వస్తోందని వివరించారు.ఈ పరిస్థితిని కియోసాకి "కాపర్ సిజర్స్"గా అభివర్ణించారు. ఒకవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు సరఫరా తగ్గిపోతోందని, ఈ రెండు పరిస్థితులు కలిసి ధరలను మరింత పెంచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.సాంప్రదాయిక పొదుపు పథకాలపై మాత్రమే ఆధారపడే వారు ఈ పరిస్థితిలో నష్టపోయే ప్రమాదం ఉందని, మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కియోసాకి సూచించారు. ఏ గనుల కంపెనీ విజయం సాధిస్తుందో ఊహించడం కంటే, ఏ సంస్థలు లేదా రంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ లాభపడతాయనే దానిపై దృష్టి పెట్టాలని తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన పాఠమని ఆయన పేర్కొన్నారు. -
డబుల్ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరల స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. దాదాపుగా ఆరు రోజులుగా నాన్స్టాప్గా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయంగా క్షీణించాయి. దీంతో ధరల సెగతో అల్లాడుతున్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల బాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 181 పాయింట్లు తగ్గి 23,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 642 పాయింట్లు నష్టపోయి 75,758 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.41బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.21 శాతం తగ్గింది.నాస్డాక్ 2.15 శాతం నష్టపోయింది.Today Nifty position 24-07-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ లోన్ రంగంలోకి గోద్రెజ్ క్యాపిటల్!
ఎన్బీఎఫ్సీ గోద్రెజ్ క్యాపిటల్ పసిడి రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని రూ.117 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ గోద్రెజ్ ఫైనాన్స్ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.2031 నాటికి రూ.1 లక్ష కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)ను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 10 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ వ్యూహాత్మక కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించింది.కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగానికి ప్రస్తుతం రూ.280 కోట్ల ఏయూఎం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 54 శాఖలు, దాదాపు 12 వేల మంది వినియోగదారులు, సుమారు 250 మంది అనుభవం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఈ కొనుగోలుతో గోల్డ్ లోన్ విభాగంలో కార్యకలాపాలను వేగంగా విస్తరించగలమని గోద్రెజ్ క్యాపిటల్ తెలిపింది.తొలి వ్యూహాత్మక కొనుగోలు‘‘కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపార కొనుగోలు గోద్రెజ్ క్యాపిటల్ ప్రయాణంలో కీలక మైలురాయి. రాబోయే అయిదేళ్లలో రూ.1 లక్ష కోట్ల ఏయూఎంను లక్ష్యంగా పెట్టుకున్న మా ప్రణాళికలో ఇదే తొలి వ్యూహాత్మక కొనుగోలు’’ అని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. ప్రస్తుతం గోద్రెజ్ క్యాపిటల్ ప్రధానంగా ఎంఎస్ఎంఈ రుణాలు, గృహ రుణాల వ్యాపారంలో ఉంది. గత నెలలో గోద్రెజ్ క్యాపిటల్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను ప్రారంభించింది. -
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
పెట్టుబడుల్లో అతిపెద్ద ప్రమాదాలు భావోద్వేగాలే!
పెట్టుబడులు పెట్టే సమయంలో.. చాలామంది మార్కెట్ పతనాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, ఆర్థిక పరిస్థితులను ప్రధాన ప్రమాదాలుగా భావిస్తారు. కానీ.. దీర్ఘకాలంలో పెట్టుబడిదారుడి విజయాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మార్కెట్ కదలికలు కాదని, వాటికి మనం ఎలా స్పందిస్తామనేదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అంటే.. పెట్టుబడుల్లో అతిపెద్ద ప్రమాదం చాలాసార్లు మన భావోద్వేగాలే అవుతాయి.చరిత్రను పరిశీలిస్తే.. ప్రతి మార్కెట్ సంక్షోభానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. డాట్కామ్ బబుల్ సమయంలో టెక్నాలజీ కంపెనీలపై అధిక అంచనాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గృహ రుణాలు, అధిక అప్పుల కారణంగా వచ్చింది. కోవిడ్ సమయంలో మహమ్మారి కారణంగా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఇటీవల ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల ఆందోళనను పెంచాయి.అయితే.. ఈ సంక్షోభాలన్నింటిలో ఒక విషయం మాత్రం సాధారణంగా కనిపించింది. మార్కెట్లు పడిపోయినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు భయంతో తమ పెట్టుబడులను విక్రయించారు. నష్టాలను తప్పించుకోవాలనే ఆలోచనతో మార్కెట్ నుంచి బయటకు వచ్చారు. కానీ చాలాసార్లు అదే సమయంలో మార్కెట్లు తిరిగి కోలుకోవడం ప్రారంభించాయి. ఫలితంగా, బయటకు వచ్చిన పెట్టుబడిదారులు ఆ రికవరీలో వచ్చే అవకాశాలను కోల్పోయారు.మార్కెట్ పతనంలో రెండు రకాల నష్టాలు ఉంటాయి. మొదటిది మార్కెట్ కారణంగా వచ్చే తాత్కాలిక నష్టం. రెండోది పెట్టుబడిదారుడి నిర్ణయాల వల్ల వచ్చే నష్టం. చాలా సందర్భాల్లో రెండో రకమైన నష్టమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మంచి పెట్టుబడులు ఉన్నప్పటికీ, సరైన సమయంలో భయంతో బయటకు రావడం వల్ల దీర్ఘకాలిక లాభాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.పెట్టుబడుల్లో భయం, అత్యాశ, అసహనం వంటి భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి. మార్కెట్ పడిపోయినప్పుడు భయం పెరుగుతుంది. మార్కెట్ వేగంగా పెరుగుతున్నప్పుడు అత్యాశ పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనే ఆశ పెట్టుబడిదారులను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ భావోద్వేగాల కారణంగానే మార్కెట్ ఇచ్చే రాబడులకు, పెట్టుబడిదారులు నిజంగా పొందే రాబడులకు మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది.విజయవంతమైన పెట్టుబడిదారులు మార్కెట్ను ప్రతిసారి ఖచ్చితంగా అంచనా వేసేవారు కాదు. మార్కెట్లో హెచ్చుతగ్గులు వచ్చినా ప్రశాంతంగా ఉండి, తమ దీర్ఘకాలిక ప్రణాళికను కొనసాగించేవారే ఎక్కువగా విజయం సాధిస్తారు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ సరైన వ్యూహంతో, ఓర్పుతో పెట్టుబడుల్లో కొనసాగడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది.ప్రస్తుత కాలంలో సమాచారం కూడా పెట్టుబడిదారులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు మార్కెట్ సమాచారం కోసం అప్పుడప్పుడు మాత్రమే చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనే వార్తలు, సోషల్ మీడియా పోస్టులు, నిపుణుల అభిప్రాయాలు, మార్కెట్ అప్డేట్లు నిరంతరం వస్తున్నాయి. ఈ సమాచార ప్రవాహంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది.సంపద సృష్టి అనేది సమాచారం లేకపోవడం వల్ల కంటే, భావోద్వేగ నిర్ణయాల వల్ల ఎక్కువగా దెబ్బతింటుంది. భయం, అత్యాశ, అతివిశ్వాసం వంటి భావనలు పెట్టుబడిదారులను తప్పు నిర్ణయాల వైపు నడిపించవచ్చు.యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, మహమ్మారులు, సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ మార్కెట్లు చివరకు కోలుకున్నాయి. అయితే ఆ పునరుద్ధరణ సమయంలో పెట్టుబడుల్లో కొనసాగిన వారికే ఎక్కువ ప్రయోజనం లభించింది. అందుకే.. పెట్టుబడుల్లో అసలైన ప్రమాదం మార్కెట్ కాదని, మార్కెట్ మార్పులకు మనం ఇచ్చే భావోద్వేగ స్పందనేనని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలతో, సహనంతో పెట్టుబడులు కొనసాగించడం సంపద సృష్టిలో కీలకమైన అంశం.: గణేష్ మోహన్, మేనేజింగ్ డైరెక్టర్, బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 376.84 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 76,378.20 వద్ద, 126.65 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 23,869.60 వద్ద నిలిచాయి.టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ప్రజే ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, తాన్లా ప్లాట్ఫారమ్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కంట్రోల్ ప్రింట్ లిమిటెడ్, సిఐఇ ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్, వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం నాన్స్టాప్ దౌడు.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పుత్తడి రేట్లు నేడు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా పెరిగిన వెండి ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 23,945 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 208 పాయింట్లు నష్టపోయి 76,557 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.14 శాతం తగ్గింది.నాస్డాక్ 0.57 శాతం నష్టపోయింది.Today Nifty position 23-07-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్కు చమురు సెగ
ముంబై: ముడిచమురు ధరలు పరుగులు తీయడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడో రోజూ నష్టపోయింది. బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బుధవారం సెన్సెక్స్ 715 పాయింట్లు కోల్పోయి 76,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 191 పాయింట్లు పతనమై 24,000 స్థాయి దిగువన 23,996 వద్ద స్థిరపడింది. దలాల్ స్ట్రీట్ ఒక శాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.25 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.480 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా నష్టాల్లోనే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయమే బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీలు ఏ దశలో కోలుకోలేక, రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలోనూ సెన్సెక్స్ 829 పాయింట్లు క్షీణించి 76,641 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు కుప్పకూలి 23,961 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీల ముప్పు తీవ్రమవడం, హార్మూజ్ జలసంధిలో సరఫరా అడ్డంకులు తలెత్తడంతో ముడిచమురు (బ్రెంట్ క్రూడ్) ధర బ్యారెల్కు 92 డాలర్లపైకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై దశలవారీగా 200% వరకు సుంకాలు (టారిఫ్లు) విధిస్తామని ప్రకటించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా, ఈ ఏడాది పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. పదేళ్ల కాలపరిమితి కలిగి బాండ్లపై రాబడులు 4.63 శాతానికి పెరిగాయి. గత నాలుగు రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 6,000 కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలన్నీ, దేశీయ స్టాక్ మార్కెట్పై తీవ్ర ఒత్తిడి పెంచాయి.28 పైసలు తగ్గిన రూపాయిడాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 96.53 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు అనూహ్యంగా పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అధికమవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 96.36 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 96.25 – 96.60 పరిధిలో ట్రేడైంది. ట్రంప్ సుంకాల హెచ్చరికలపై మళ్లీ నెలకొన్న ఆందోళనలు కూడా ఫారెక్స్ ట్రేడర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫార్మా షేర్లకు ‘సుంకాల’ భయాలుఅమెరికాకు ఎగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై దిగుమతి సుంకాలను (టారిఫ్) విధిస్తామంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ‘‘ఫార్మా కంపెనీలు అమెరికాలోనే స్వదేశీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రెండేళ్ల గడువు ఇస్తున్నాం. 2026 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకాన్ని కొనసాగిస్తాం. ఆ తర్వాత ఒక ఏడాది పాటు (2028 ఆగస్టు నుంచి) 100 శాతం, ఆపై (2029 ఆగస్టు నుంచి) 200 శాతం చొప్పున దిగుమతి సుంకాలు ఉంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఫార్మా కంపెనీల మార్జిన్లు, ఎగుమతి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో లుపిన్ షేరు అత్యధికంగా 4.21 శాతం పతనమైంది. అరబిందో ఫార్మా (1.99%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (1.95%), గ్లెన్మార్క్ (1.49%), ఆల్కెమ్ ల్యాబ్స్ (1.43%), సిప్లా (1.08%), సన్ ఫార్మా (0.98%), బయోకాన్ (0.57%) షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు ఆవిరిహెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈలో ఈ షేరు ఒక శాతానికి పైగా నష్టపోయి రూ.753.15 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1.50 శాతం పతనమై రూ.750.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, నికర వడ్డీ మార్జిన్ల తగ్గదలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించాయి. ముఖ్యంగా, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఏకంగా 8.11% మేర పతనమైంది. ఈ ఊహించని పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లు ఆవిరై, రూ. 11.59 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
‘అదిగో.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోందని మరోసారి హెచ్చరించారు. తాను గతంలో రచించిన ‘రిచ్ డాడ్స్ ప్రాఫెసీ’ (Rich Dad's Prophecy) పుస్తకంలోనే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఆ పుస్తకంలోని సూచనలను అనుసరించిన వారు ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నారని తెలిపారు.ఇప్పటికీ ఆలస్యం కాలేదని, తమ ఆర్థిక నిర్ణయాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని కియోసాకి తనను అనుసరించేవారికి సూచించారు. ప్రతి ఆర్థిక పతనంలో ఎంతోమంది తమ సంపదను కోల్పోతారని, అదే సమయంలో కొందరు మాత్రం సరైన వ్యూహాలతో మరింత ధనవంతులవుతారని చెప్పారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ (X) పోస్టులో పేర్కొన్నారు.తనను ఎక్స్లో అనుసరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపిన కియోసాకి, ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తన సందేశాన్ని ముగించారు. ఈ పోస్టు మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వ్యూహాలపై చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా కియోసాకి పలుమార్లు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2026–27 కాలంలో ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని కూడా ఇటీవల పేర్కొన్నారు.REPEATING: Global economy is crashing. I predicted this in my book Rich Dad’s Prophecy.Those that followed the guidance in that book are OK today.Please remember, it’s not too late to make changes now.Please remember in every crash many people are wiped out and a few…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 22, 2026 -
కుప్పకూలిన స్టాక్మార్కెట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంకు షేర్ల కుదేలుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లోనూ భారీగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తత కారణంగా అధిక చమురు ధరలు కూడా రిస్క్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 715.06 పాయింట్లు లేదా 0.92 శాతం క్షీణించి 76,755.05 వద్ద, నిఫ్టీ 191.45 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించి 23,996.25 వద్ద ముగిసింది.సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 22 షేర్లు నష్టపోయాయి. రేపటి క్యూ 1 ఫలితాలకు ముందు ఇండిగో 3.7 శాతం క్షీణతతో టాప్ లూజర్ గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఢమాలయ్యాయి. మరోవైపు, ఎటర్నల్, Q1 ఫలితాల తరువాత ఉత్తమ పనితీరును కనబరిచింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.09 శాతం, 1.54 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ అత్యంత క్షీణించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగాయి. -
ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
సెన్సెక్స్.. 560 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు తగ్గి 24,024 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 568 పాయింట్లు నష్టపోయి 76,915 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.89 శాతం పెరిగింది.నాస్డాక్ 1.29 శాతం పుంజుకుంది.Today Nifty position 22-07-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 238.41 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,470.11 వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,187.70 వద్ద నిలిచాయి.ఆస్థా స్పిన్టెక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, కేసీపీ షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ లిమిటెడ్, విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, ఏకేజీ ఎగ్జిమ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం సెగ ఇప్పట్లో తగ్గేలాలేదు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,251 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 7 పాయింట్లు పెరిగి 77,718 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.నాస్డాక్ 0.05 శాతం నష్టపోయింది.Today Nifty position 21-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై ఆరంభంలో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. తదనంతరం సాగిన లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), కీలక వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల వైఖరి వల్ల ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ అనిశ్చిత వాతావరణంలో సాధారణ మదుపరులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఆర్థిక నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.ధరల కదలికలు.. కారణాలుయుద్ధం, ఆర్థిక అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం ఇస్తారు. జులై నెలలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు మండిపోవడం వల్ల పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ అంచనాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు బంగారంలో కదలికలను పరిమితం చేశాయి. మరోవైపు, వెండి కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక డిమాండ్ (సోలార్, ఎలక్ట్రానిక్స్) కలిగిన లోహం కావడంతో రెసిస్టెన్స్ లెవల్స్ వద్ద కొంత ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.ఇప్పుడేం చేయాలి?దీర్ఘకాలిక మదుపరులు: ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం, వెండి ఉంటే వాటిని వెంటనే విక్రయించాల్సిన అవసరం లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం బంగారం రీ-రేటింగ్ అయ్యే అవకాశం ఉన్నందున హోల్డ్ చేయడం ఉత్తమం.కొత్తగా పెట్టుబడి పెట్టేవారు: మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ప్రమాదకరం. ధరలలో దిద్దుబాటు వచ్చిన ప్రతిసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ-ప్రస్తుతానికి ప్రభుత్వం వీటిని తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ తీసుకొస్తే పెట్టుబడి పెట్టడం), గోల్డ్ ఈటీఎఫ్లు లేదా డిజిటల్ గోల్డ్ ద్వారా 5-10% మేర కేటాయింపులు చేసుకోవడం శ్రేయస్కరం.స్వల్పకాలిక ట్రేడర్లు: ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేవారు గరిష్ట ధరల వద్ద కొంతమేర లాభాలను స్వీకరించి ‘స్టాప్ లాస్’ విధానాన్ని పాటించాలి.అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సమసిపోయే వరకు పసిడి, వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతుంది. ప్రతికూల ఆర్థిక వాతావరణంలో ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోకు రక్షణ కల్పించే ఇంధనంగా పసిడి ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించడమే మెరుగైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 77,708.52 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,238.50 వద్ద నిలిచాయి.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, అషిమా లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భన్సాలీ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, రాజదర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు ఐపీఓలు.. రెండు లిస్టింగ్లు!
ముంబై: దేశీ ప్రైమరీ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి జోరుగా కొనసాగనుంది. నేటి (జూలై 20)తో ప్రారంభమయ్యే ఈ వారంలో మెయిన్ బోర్డ్ విభాగంలో మొత్తం నాలుగు కొత్త పబ్లిక్ ఇష్యూలు ఓపెన్ కానున్నాయి. అలాగే గత వారం ముగిసిన రెండు కీలక కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిస్టింగ్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎస్బీఐ ఫండ్స్ మెగా లిస్టింగ్ గత వారం రూ. 9,813 కోట్ల భారీ ఐపీఓ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు జూలై 21న (మంగళవారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు 16 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. కాలిబర్ మైనింగ్.. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన కోల్ మైనింగ్ సర్వీసెస్ కంపెనీ ‘కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్’ రూ. 450 కోట్ల విలువైన ఐపీఓ జూలై 21న ముగియనుంది. జూలై 24న (శుక్రవారం) ఈ షేరు మార్కెట్లో లిస్ట్ కానుంది. గ్రే మార్కెట్లో షేరు ధర ఏకంగా 27 శాతం ప్రీమియంతో దూసుకుపోతుండటం విశేషం.కొత్త ఇష్యూలు.. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్: ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 5,000 కోట్లను సేకరించనుంది. దీని ధరల శ్రేణి రూ. 151–152. ఇండో–ఎమ్ఐఎమ్: బెంగళూరుకు చెందిన ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. లోహియా కార్ప్: కాన్పూర్కు చెందిన ఈ టెక్నికల్ టెక్స్టైల్ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్: ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ రూ.170 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో జూలై 23న మార్కెట్లోకి వస్తోంది. దీని ధరల శ్రేణి రూ.120–127గా ఉంది. -
బంగారం, వెండికి మళ్లీ ఊపు..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండు రోజుల కిందట వరకూ తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇక వెండి ధరలు కూడా నేడు భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ(Nifty) 165 పాయింట్లు తగ్గి 24,169 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 665 పాయింట్లు నష్టపోయి 77,489 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం తగ్గింది.నాస్డాక్ 1.4 శాతం నష్టపోయింది.Today Nifty position 20-07-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టేంత వరకూ భారత మార్కెట్లు బాగానే ఉన్నాయి. పైపెచ్చు జీవితకాల గరిష్ట స్థాయిలకు అటూఇటుగా ఉన్నాయి. బుల్ మార్కెట్ మంచి జోరుమీద ఉండటంతో అప్పటిదాకా వచ్చిన ఐపీఓలకు ఏకంగా 100 రెట్లు, 200 రెట్లు స్థాయిలో స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో అయితే ఏ ఐపీఓకైనా 100 రెట్లకు తక్కువ స్పందన రాలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అలాంటి స్పందన వచ్చిన ఐపీఓలు కూడా కొన్ని పేలవంగా లిస్టయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. కాకపోతే ఇరాన్పై దాడులు మొదలయ్యాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్లు కిందపడ్డాయి. కంపెనీలు ఐపీఓలకు రావటానికే ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు అప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తిచేసుకుని ఉండటంతో పబ్లిక్ ఇష్యూకు రాక తప్పలేదు. కాకపోతే వాటికి రిటైలర్ల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్ర్స్కయిబ్ కూడా కాలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసుకోవచ్చు. విచిత్రమేంటో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన 6 ఐపీఓల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లాభాలే ఇచ్చాయి. కొన్నయితే ఈ నాలుగు నెలల్లోనే 40–50 శాతానికి పైగా పెరిగాయి. వీటిలో కొన్ని షేర్లయితే లిస్టింగ్ నాడు పెద్దగా లాభాలివ్వకపోయినా... ఆ తరవాత క్రమంగా పెరుగుతూ చక్కటి లాభాలిచ్చాయి. దీనర్థం ఒక్కటే... సబ్ స్క్రిప్షన్ తక్కువయినంత మాత్రాన, లిస్టింగ్ లాభాలు రానంత మాత్రాన ఆ షేర్లు రాణించవని కాదు. మెల్లగా ముందుకెళుతూ అద్భుతమైన రాబడినిస్తాయనేది ఈ షేర్లు చెబుతున్న వాస్తవం. ఆ వివరాలే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై సందేహాలు... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ‘మెయిన్ బోర్డు’ ఐపీఓ మార్కెట్ అద్భుతమైన నిలకడ చూపించింది. మార్చి–2026 తరువాత మార్కెట్లోకి వచ్చిన ఆరు ప్రధాన ఐపీఓల్లో ఐదు ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ఎగువన ట్రేడవుతుండగా... ఒక్క అమీర్ చంద్ జగదీశ్ కుమార్ ఎక్స్పోర్ట్స్’ మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువన కొనసాగుతోంది.ఈ మూడూ... 40 శాతానికిపైనే ఇప్పటివరకు అత్యధిక రాబడినిచ్చిన ఐపీఓగా హెక్సగాన్ న్యూట్రిషన్ నిలిచింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 55 శాతం లాభాన్ని అందించింది. ఆ తర్వాత పవరికా (44 శాతం), సాయి పేరెంటరల్స్ (42 శాతం) టాప్–2, 3, స్థానాల్లో నిలిచాయి. ఏప్రిల్ తరువాత లిస్టయి ఈ మూడు షేర్లూ మూడు 40 శాతానికి పైగా లాభాలివ్వటం గమనార్హం. వీటిలో సాయి పేరెంటరల్స్ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ కావటం విశేషం. లిస్టయిన తరువాత కంపెనీ వెలువరించిన 2025 క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒకస్థాయిలో షేరు ధర రూ.600 కూడా దాటింది. అత్యధిక లాభాలు అందించిన హెక్సగాన్ కూడా ఫార్మా కంపెనీయే కాగా... పవరికా మొదట్లో తడబడినా ఆ తరువాత డేటాసెంటర్ల బూమ్తో ఒక్క నెలలోనే 50 శాతానికిపైగా పెరగటం గమనార్హం. ఒబెరాయ్ల కుటుంబానికి చెందిన ఈ కంపెనీ పవన విద్యుదుత్పత్తితో పాటు డేటా సెంటర్లకు భారీ స్థాయి జనరేటర్లను సమకూర్చే వ్యాపారంలో ఉంది. సబ్ స్క్రిప్షన్ ఎక్కువైతే... లాభాలూ ఎక్కువేనా?ఈ ఐపీఓలు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. పవరికాకు కేవలం 1.45 రెట్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్ లభించింది. అయినప్పటికీ అది 44 శాతం రాబడితో అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు నాక్ ప్యాకేజింగ్కు 87 రెట్లు, హెక్సాగాన్కు 54 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. కాకపోతే వీటి రాబడులు మాత్రం ఒకేలా లేవు. అమీర్ చంద్ జగదీశ్కుమార్ ఎక్స్పోర్ట్స్’కు పవరికా కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఇప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడవుతోంది. అంటే సబ్ స్క్రిప్షన్ సంఖ్య మాత్రమే షేర్ల రాబడులను నిర్ణయించదని ఈ ఐపీఓలు స్పష్టం చేశాయి.ఈ ఐపీఓలు చెప్పిన పాఠాలివీ..→ లిస్టింగ్ రోజున వచ్చే హైప్ శాశ్వతం కాదు. → భారీ సబ్ స్క్రిప్షన్ అంటే భారీ లాభాలు అన్న గ్యారంటీ లేదు. → చివరికి కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, మార్కెట్ నమ్మకమే పెట్టుబడిదారుల సంపదను నిర్ణయిస్తాయి. మంథా రమణమూర్తి -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, కంపెనీల యాజమాన్యాలు వెల్లడించే భవిష్యత్ వ్యాపార అంచనాలు (అవుట్లుక్) సూచీల కదలికలను నిర్దేశించనున్నాయి. వీటితో పాటు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, నైరుతి రుతుపవనాల పురోగతిపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. గత వారం చివరిలో లభించిన బలమైన రికవరీతో నిఫ్టీ కీలకమైన 24,300 స్థాయిని తిరిగి అందుకోవడం మార్కెట్లో ట్రేడింగ్ మొమెంటాన్ని పెంచింది. 250 కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం), జొమాటో, ఇండిగో, మీషో, బీపీసీఎల్తో సహా 250కి పైగా కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఫలితాల సీజన్ ఊపందుకోవడంతో ఇన్వెస్టర్లు స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు మొగ్గు చూపొచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఫలితాల నేపథ్యంలో ఐటీ సెక్టార్పై అందరి దృష్టి కొనసాగనుంది. ఇప్పటికే టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అంచనాలకు మించిన ప్రదర్శన చేయడంతో ఐటీ రంగంపై సానుకూల సెంటిమెంట్ నెలకొంది. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. పశ్చిమాసియా పరిణామాలు జోర్డాన్ దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించిన నేపథ్యంలో, ఇరాన్పై అమెరికా తాజా దాడులకు దిగింది. నెల రోజుల క్రితం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం మరింత ముదిరింది. తాజా పరిణామాలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రానున్న వారంలో గ్లోబల్ సెంటిమెంట్ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్టర్లలో రిస్క్–ఆఫ్ సెంటిమెంట్ను పెంచవచ్చు. క్రూడాయిల్ ధరల భగభగలు అమెరికా–ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో గల్ఫ్ ప్రాంతంలో సరఫరా అడ్డంకులు తలెత్తవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా షిప్పింగ్ ఇబ్బందులకు తోడు, రెడ్ సీ (ఎర్ర సముద్రం) కూడా మూతపడవచ్చనే భయాలు మార్కెట్ను కలవరపరుస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు నాలుగు శాతానికి పైగా ఎగబాకి, నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత వారంలోనే బ్రెంట్ క్రూడాయిల్ ఏకంగా 16% ర్యాలీ (బ్యారెల్ 88 డాలర్ల పైకి) చేయడం గమనార్హం.సాంకేతిక అంశాలు ‘‘సాంకేతికంగా నిఫ్టీ ఇటీవలి కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి బలంగా పైకి కదిలింది. ఇండెక్స్ తన కీలక రెసిస్టెన్స్ లెవెల్ 24,250ను అధిగమించింది. పైగా 21–రోజులు, 55– రోజుల ఈఎంఏల కంటే పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇది మార్కెట్ ట్రెండ్ పాజిటివ్గా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో ఇండెక్స్ 24,600 స్థాయి వైపు దూసుకెళ్లే అవకాశం ఉంది. దిగువ స్థాయిల్లో.. 24,000, 23,800 తక్షణ మద్దతు స్థాయిలుగా పనిచేస్తాయి. నిఫ్టీ ఈ స్థాయి(24,000, 23,800)ల పైన ఉన్నంత కాలం మొత్తం అవుట్లుక్ బుల్లిష్ గానే ఉంటుంది. కావున ఇన్వెస్టర్లు ‘బై ఆన్ డిప్స్’ (ప్రతి పతనంలోనూ కొనుగోలు) వ్యూహాన్ని అనుసరించడం లాభదాయకం’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రవి సింగ్ పేర్కొన్నారు.మళ్లీ ఎఫ్పీఐల అమ్మకం జూలై నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. నగదు మార్కెట్లో రూ. 4,546 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనత నేపథ్యంలో ఎఫ్ఐఐలు అప్రమత్తత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అయితే, గత నాలుగు వారాలతో పోలిస్తే అమ్మకాల పరిమాణం తగ్గడం ఊరట నిచ్చే అంశం. దీనికి భిన్నంగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ. 21,074 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. విదేశీ నిధుల ఉపసంహరణతో మార్కెట్పై పడే ఒత్తిడిని డీఐఐల బలమైన కొనుగోళ్ల మద్దతు సమర్థవంతంగా అడ్డుకుంది.గతవారం ఇలా..గత వారంలో దేశీయ బెంచ్మార్క్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. వారపు ప్రాతిపదికన సెన్సెక్స్ 582 పాయింట్లు (0.75%), నిఫ్టీ 127 పాయింట్లు (0.53%) పెరిగాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుదలపై దూకుడు తగ్గించవచ్చనే అంచనాలు, లార్జ్ క్యాప్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్ లాభాలకు కారణమయ్యాయి. అలాగే కేంద్ర మంత్రిమండలి రూ.1.27 లక్షల కోట్ల ‘సెమికాన్ 2.0’ ప్రోగ్రామ్కు ఆమోదం తెలపడం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ అనుబంధ షేర్లలో భారీ కొనుగోళ్లకు దారితీసింది. -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! మంథా రమణమూర్తి -
క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనడం మంచిదేనా?
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందనే విషయం అందరికీ తెలుసు. పండుగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లు, పేరంటాలకు లేదా పెట్టుబడి కోసం చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం.. బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది అప్పటికి సౌకర్యవంతంగా అనిపించినా, కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.నిపుణుల హెచ్చరికక్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనేవారు.. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. క్రెడిట్ కార్డు అనేది మీ సొంత డబ్బు కాదు. అది బ్యాంకు ఇచ్చే రుణం. కాబట్టి.. బంగారం కొనుగోలు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీనికి ఆలస్య రుసుములు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు కూడా జతవుతాయి. కాబట్టి.. కేవలం రివార్డ్ పాయింట్లు వస్తాయని క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా చేస్తే కొంత ప్రయోజనంఅయితే.. ఇక్కడ గుర్తుచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిల్లు సమయానికి పూర్తిగా చెల్లించేవారికి క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు జీరో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్, రివార్డ్ పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో కొంత మేర అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.నిబంధనలుక్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలుపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 2013లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన బంగారు నాణేలను, ఈఎంఐగా మార్చడానికి బ్యాంకులకు అనుమతి లేదు. అలాగే బ్యాంకు శాఖల్లో క్రెడిట్ కార్డుతో బంగారు నాణేలు విక్రయించకూడదని కూడా సూచించింది.అయితే.. బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి బ్యాంకు వేర్వేరు నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ బ్యాంకు పాలసీని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.అధిక ఛార్జీలుఇంకో విషయం స్వైప్ ఛార్జీలు. చాలా జ్యువెలరీ దుకాణాలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. 2 నుంచి 3.5 శాతం వరకు అదనపు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది. బంగారం విలువ ఎక్కువగా ఉండటంతో ఈ ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది.మరోవైపు.. కొన్ని క్రెడిట్ కార్డులు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లలో బంగారం కొనుగోలు చేస్తే క్యాష్బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తాయి. అయితే, ఈ ఆఫర్లకు కొన్ని షరతులు, పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆఫర్ వివరాలను ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ
చాలామంది ధనవంతుడు, సంపన్నుడు పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ధనవంతుడుఒక వ్యక్తి ఏడాదికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే.. అతన్ని ధనవంతుడు అని అంటారు. ఉదాహరణకు ఒక డాక్టర్ సంవత్సరానికి రూ. మూడు కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అతడు జాబ్ మానేస్తే (పని ఆపేస్తే) ఆదాయం కూడా ఆగిపోతుంది. అంటే అతని జీవనశైలి పూర్తిగా అతను చేసే పనిపై ఆధారపడి ఉంటుందన్నమాట.సంపన్నుడుసంపన్నుడు అంటే తన ఆస్తుల ద్వారా నిరంతరం ఆదాయం పొందే వ్యక్తి. అంటే అతను పని చేయకపోయినా, అతని పెట్టుబడులు, వ్యాపారాలు, ఆస్తులు అతనికి ఆదాయాన్ని అందిస్తాయి. అంటే ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి కేవలం తన సమయాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.అందుకే.. ఆర్థికంగా ఎదగాలంటే కేవలం ఎక్కువ జీతం లేదా ఎక్కువ ఆదాయం సంపాదిస్తే సరిపోదు. ఆ ఆదాయంతో భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించుకోవడం ముఖ్యం. ఇల్లు, వ్యాపారం, పెట్టుబడులు వంటి ఆస్తులు మనకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయి.సాధారణంగా ఒక ధనవంతుడు నేను ఎంత సంపాదిస్తున్నను? అని మాత్రమే ఆలోచిస్తాడు. కానీ సంపన్నుడు నాకు ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని లెక్క వేసుకుంటాడు. దీన్నిబట్టి చూస్తే.. ఒక్క ఆలోచనా విధానమే వారి ఆర్థిక జీవితాన్ని మార్చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహాఎక్కువ ఆదాయం సంపాదించడం ఒక్కటే నిజమైన సంపదకు గుర్తు కాదు. మన దగ్గర ఉన్న ఆస్తులు మనకు నిరంతరం ఆదాయం తెచ్చిపెడుతున్నాయా లేదా అనేదే అసలు విషయం. కాబట్టి డబ్బుకోసం మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం లేకుండా.. మన డబ్బు మన కోసం పనిచేసే స్థితిని ఏర్పరచుకోవడమే నిజమైన సంపన్నత. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
పెరిగిన బంగారం.. తగ్గిన వెండి: తాజా ధరల ఇలా..
దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లో తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1,43,290 వద్దకు చేరింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.జులై 12న హైదరాబాద్, విజవాడలలో రూ.రూ.1,44,330 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు జులై 18 నాటికి రూ.1,43,290 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ.1040 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,32,300 రూపాయల నుంచి రూ.1,31,350 వద్దకు (రూ. 950 పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480 నుంచి 1,43,440 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 నుంచి రూ.1,31,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడురోజుల్లో గోల్డ్ రేటులో ఎంత మార్పు జరిగిందో స్పష్టమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,090 నుంచి రూ.1,43,290 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,000 నుంచి 1,31,350 రూపాయలకు చేరింది. అంటే ఏడూ రోజుల్లో పసిడి ధరలు వరుసగా రూ.1800, రూ.1650 పెరిగింది.వెండి ధరలు ఇలాబంగారం ధరల్లో మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా గణనీయమైన మార్పు జరిగింది. జులై 12న రూ.2.40 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జులై 18 నాటికి రూ.2.35 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో హైదరాబాద్లో వెండి రేటు రూ.5000 తగ్గింది. -
ఐపీవో బాటలో మేక్ మై ట్రిప్ ఇండియా
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం మేక్మైట్రిప్ ఇండియా (ఎంఎంటీ ఇండియా) పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించింది. దీని ప్రకారం.. కంపెనీ మాతృ సంస్థ మేక్మైట్రిప్, దాని అనుబంధ సంస్థ ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్ కొంత వాటాలను విక్రయించనున్నాయి. తద్వారా వచ్చిన నిధులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ఐపీవో అనంతరం కూడా మేక్మైట్రిప్కి ఎంఎంటీ ఇండియా అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది. -
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026 -
తారుమారైన బంగారం ధరలు.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. క్రితం రోజున దిగివచ్చిన పసిడి ధరలు నేడు అదే స్థాయిలో మళ్లీ ఎగిశాయి. ఇందుకు భిన్నంగా వెండి ధరలు మాత్రం గణనీయంగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మూడు వారాల కనిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ రేట్లు ర్యాలీ చేస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటంలాంటి ప్రతికూల అంశాలతో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 800 మేర క్షీణించి రూ. 1,45,500కి తగ్గింది. బంగారం చివరిసారిగా జూన్ 25న రూ. 1,45,300 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి ధర కేజీకి రూ. 2,000 క్షీణించి రూ. 2,22,500కి పడిపోయింది. ఈ వారంలో పసిడి ధర 3,000, వెండి రూ. 14,500 మేర క్షీణించాయి. -
ఇన్వెస్టర్లూ ‘బాస్’తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI), డీప్ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.59 పాయింట్లు లేదా 1.25 శాతం లాభంతో 24,346.15 వద్ద, నిఫ్టీ 273.40 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,346.15 వద్ద నిలిచాయి.రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, పార్ డ్రగ్స్ & కెమికల్స్ లిమిటెడ్, వర్చుసో ఆప్టోఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, నవ్కర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 128 పాయింట్లు పెరిగి 24,202 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు ఎగబాకి 77,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.77బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.47 శాతం దిగజారింది.Today Nifty position 17-07-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1.44 శాతం లేదా 0.0019 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద, నిఫ్టీ 5.75 శాతం లేదా 0.024 పాయింట్ల నష్టంతో 24,072.75 వద్ద నిలిచాయి.లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, శ్రీమతి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేఎన్కే ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్ ట్రేడింగ్ జోష్.. బ్రోకరేజీ కంపెనీలకు కాసుల వర్షం!
ఫిన్టెక్, స్టాక్ బ్రోకరేజీ సంస్థ ‘ఏంజెల్ వన్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆకర్షణీయమైన పనితీరు కనబరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల చురుకైన పార్టిసిపేషన్, భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కారణంగా జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలకు పైగా ఎగసి రూ.231 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (క్యూ1) కంపెనీ నికర లాభం రూ.114.5 కోట్లుగా నమోదైంది. అయితే, మునుపటి త్రైమాసికంతో (ఎఫ్వై26, క్యూ4) పోలిస్తే మాత్రం నికర లాభం 28 శాతం తగ్గి రూ.320 కోట్ల నుంచి రూ.231 కోట్లకు పరిమితమైంది.సమీక్షా త్రైమాసికంలో, కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,143 కోట్ల నుంచి రూ.1,434 కోట్లకు చేరినట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఉద్యోగుల ఖర్చులు, ఫైనాన్స్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఇదే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ.979 కోట్ల నుంచి రూ.1,109 కోట్లకు చేరాయి. కాగా, కంపెనీ బోర్డు డైరెక్టర్లు తమ షేర్ హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 1 తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించారు.పెరిగిన ఆర్డర్లు, ఏయూఎం ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం ట్రేడింగ్ ఆర్డర్లు 18.4% పెరిగి 40.6 కోట్లకు చేరాయి. కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) జూన్ చివరి నాటికి ఏకంగా 81.4 శాతం ఎగసి రూ.620 కోట్లకు చేరుకుంది. మొత్తం క్లయింట్ల బేస్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 19 శాతం వృద్ధితో 3.86 కోట్లకు చేరింది.‘గ్రో’ నికర లాభం 94 శాతం వృద్ధిన్యూఢిల్లీ: డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. జూన్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 94 శాతం ఎగసి రూ.735 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో కంపెనీ రూ.378 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ద్వారా ఆదాయం 66 శాతం వృద్ధితో రూ.904 కోట్ల నుంచి రూ.1,501 కోట్లకు చేరినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.445 కోట్ల నుంచి రూ.556 కోట్లకు పెరిగాయి.గత త్రైమాసికంతో పోలిస్తే... గత త్రైమాసికం (జనవరి–మార్చి) తో పోల్చితే కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,505 కోట్ల నుండి రూ.1,501 కోట్లతో దాదాపు స్థిరంగానే కొనసాగింది. అయితే, నికర లాభం మాత్రం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.686.36 కోట్లతో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో మెరుగైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. -
గోల్డెన్ సర్ప్రైజ్.. అనూహ్యంగా మారిన బంగారం ధరలు!
దేశంలో బంగారం ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. క్రితం రోజున అమాంతం ఎగిసిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 63 పాయింట్లు పెరిగి 24,141 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 245 పాయింట్లు ఎగబాకి 77,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.53బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.62 శాతం పుంజుకుంది.Today Nifty position 16-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్: బ్యాంక్ షేర్ల మెరుపులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 హై నోట్ తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130.49 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 77,185.43 వద్ద ముగిసింది, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 26.45 పాయింట్లు మరియు 0.11 శాతం పెరిగి 24,074.85 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 దాదాపు 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.7 శాతం పెరిగాయి.సెన్సెక్స్ స్టాక్స్ లో 18 లాభాలను అందుకోగా 12 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో ఎటర్నల్, ఎస్బీఐ ఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ లూజర్ గా నిలిచింది. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ కూడా టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతానికి పైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు తమ నష్టాల పరంపరను పొడిగించగా, ఫార్మా వరుసగా రెండవ సెషన్ లో గరిష్టంగా ముగిసింది. రెండు రోజుల నష్టాల తర్వాత చమురు & గ్యాస్ కోలుకున్నాయి. -
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 15-07-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
100 డాలర్లు పెరిగిన బంగారం ధర!
అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చమురు ధర 30 శాతం పడిపోవడమే అని షిఫ్ వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారుతోంది. జూలైలో చమురు ధరలు ఇప్పటికే సుమారు 20 శాతం పెరిగాయి. దీంతో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం వడ్డీ ఆదాయం ఇవ్వదు కాబట్టి, తక్కువ వడ్డీ రేట్ల సమయంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.అయితే.. అధికారిక గణాంకాల్లో ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా, ఇతర అవసరాల ధరలు పెరిగితే దాని ప్రభావం సాధారణ ప్రజలపై ఉంటుంది.జూన్ సీపీఐ తగ్గడం బంగారం ధరలకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చింది. కానీ.. చమురు ధరల పెరుగుదల, వాస్తవ ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయాలపై బంగారం భవిష్యత్ కదలికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, అధికారిక గణాంకాల కంటే ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న వాస్తవ మార్పులను కూడా గమనించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.Gold is up $100 as the June CPI fell 0.4%, more than expected. But the main driver was a 30% drop in oil. Ignoring the fact that oil is already up 20% in July and headed higher, a lower official inflation rate merely gives the Fed an excuse to ignore the rise in actual inflation.— Peter Schiff (@PeterSchiff) July 14, 2026భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు గత కొంత కాలంగా తగ్గుతూ ఉంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,42,800 వద్ద ఉంది. గత నెలతో పోలిస్తే.. బంగారం ధర ఈ నెలలో కొంత తక్కువే అని తెలుస్తోంది. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, బాల్ ఫార్మా లిమిటెడ్, నూరేకా లిమిటెడ్, వ్రాజ్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్, పీపీఏపీ ఆటోమోటివ్ లిమిటెడ్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల్లో స్పల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
250 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు తగ్గి 24,142 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 పాయింట్లు నష్టపోయి 77,359 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.55 శాతం దిగజారింది.Today Nifty position 14-07-2026(time: 9:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంన్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ.. ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.మార్కెట్లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే.. బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చినట్లయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి.ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు, త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.Once again, gold is selling off as the war with Iran escalates. Traders are being conditioned to believe that war is now bearish for gold. Shorts will be in for a world of hurt when they are blindsided by the reality that the opposite is true. Conditions are set for a huge rally.— Peter Schiff (@PeterSchiff) July 12, 2026 -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లేదా 0.061 శాతం లాభంతో 77,616.40 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.017 శాతం లాభంతో 24,211.00 వద్ద నిలిచాయి.తైన్వాలా కెమికల్స్ & ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్, జీఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, సంగమ్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, యూనికెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, ఎస్జీ మార్ట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెబీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిలో మార్పులు
దేశీయ మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తన ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను మార్చేసింది. ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) నివారణకు, పారదర్శకతను పెంచడానికి సరికొత్త ‘సెబీ (ఎంప్లాయీస్ సర్వీస్ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్, 2026’ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కోడ్ ప్రకారం ఉద్యోగులు విధులను వీడిన తర్వాత పాటించాల్సిన నిబంధనలతో పాటు వారి వ్యక్తిగత పెట్టుబడులపై కూడా నిఘా ఉంచనున్నారు.కీలక మార్పులుసెబీ నుంచి రిటైర్ అయినా లేదా రాజీనామా చేసి తప్పుకున్నా.. ఆ తర్వాతి రెండేళ్ల వరకు సదరు మాజీ ఉద్యోగులు ఎలాంటి క్లయింట్ల తరఫున సెబీ ముందు హాజరు కాకూడదు. ఏదైనా కేసుల విచారణ, సెటిల్మెంట్లు లేదా అప్రూవల్స్ వంటి విషయాల్లో బోర్డు ముందు క్లయింట్ల పక్షాన వాదించడం లేదా ప్రాతినిధ్యం వహించడంపై పూర్తిగా నిషేధం విధించారు.నిబంధనల అమలు కోసం ‘కుటుంబం, ఆధారపడిన వారు (డిపెండెంట్స్)’ అనే పదాల నిర్వచనాన్ని సెబీ మరింత విస్తరించింది. ఇకపై దత్తత తీసుకున్న పిల్లలు, సవతి పిల్లలతో పాటు ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడే ప్రతి ఒక్కరూ ఈ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యుల పెట్టుబడుల డిక్లరేషన్ల పరిధి మరింత పెరగనుంది.సెబీలో పని చేస్తూనే బయటి కార్పొరేట్ సంస్థలు లేదా ఇతర యజమానులతో ఉద్యోగ చర్చలు జరిపితే ఆ చర్చలు ప్రారంభించిన నెల రోజుల్లోగా బోర్డుకు డిజిటల్ రికార్డుల రూపంలో సమాచారం అందించడం తప్పనిసరి.పెట్టుబడులపై కఠిన ఆంక్షలుసెబీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మార్కెట్ సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లాభపడకుండా ఉండేందుకు ఇన్వెస్ట్మెంట్లపై స్పష్టమైన నిఘా ఉంచారు.ఉద్యోగ కాలంలో కొత్తగా షేర్లు, డెరివేటివ్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం పూర్తి నిషేధం.మ్యూచువల్ ఫండ్స్, రీట్స్ వంటి నిపుణుల ద్వారా నిర్వహించే పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులకు అనుమతి.కొన్ని రకాల నియంత్రిత పెట్టుబడి సాధనాల్లో గరిష్టంగా మొత్తం పోర్ట్ఫోలియోలో 25 శాతానికి మించి పెట్టుబడి పెట్టకూడదు.మినహాయింపులు: ఉద్యోగి జీవితభాగస్వామికి వారి సొంత ఆఫీస్ నుంచి లభించే ఈసాప్స్ (ESOPs), డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) వంటి పరిమిత అంశాలకు మాత్రమే కొన్ని మినహాయింపులు ఇచ్చారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రెడ్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ(Nifty) 187 పాయింట్లు తగ్గి 24,010 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 672 పాయింట్లు నష్టపోయి 76,898 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 79.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది.నాస్డాక్ 0.29 శాతం పెరిగింది.Today Nifty position 13-07-2026(time: 9:16 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో ఈరోజు ఏం జరుగుతుందంటే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంగా మార్చాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లలోని అమెరికా సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆదివారం సెలవు కావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లు నేరుగా స్పందించనప్పటికీ వారంతపు ఆఖరి సెషన్లో సాధించిన రికార్డు గరిష్టాల నుంచి నేడు ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒడిదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.భగ్గుమన్న బ్రెంట్ క్రూడాయిల్ రేట్లుపశ్చిమాసియాలో ఏ చిన్న అలజడి రేగినా దాని ప్రత్యక్ష ప్రభావం చమురు ధరలపై పడుతుంది. ఇరాన్ దాడులు జరిగిన ప్రాంతాలు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గానికి సమీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత శుక్రవారం (జులై 10) నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు సుమారు 75-76 డాలర్ల వద్ద నిలకడగా ఉంటే ప్రస్తుతం అది 79.2 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశానికి కరెంట్ అకౌంట్ లోటు పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇది భారత మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే మొదటి అంశం.గ్లోబల్ మార్కెట్ల రియాక్షన్అంతర్జాతీయ మార్కెట్లు గత వారం అమెరికా టెక్ స్టాక్స్ ర్యాలీతో రికార్డు స్థాయిల్లో ముగిశాయి. అయితే, ఈ తాజా పరిణామం ఇన్వెస్టర్లను రక్షణ ధోరణి వైపు నెట్టనుంది. నేడు ఉదయం ప్రారంభమయ్యే నికాయ్, హాంగ్ సెంగ్, గిఫ్ట్ నిఫ్టీ సూచీలు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రతికూలతతో కదలాడుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగిసిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లాంటి సంస్థలు గతంలో భావించినప్పటికీ ఇరాన్ నేరుగా ఐదు దేశాలపై దాడులకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇన్వెస్టర్లు నేడు మార్కెట్ ప్రారంభంలోనే కంగారుపడి విక్రయాలు చేయకుండా కొద్దిసేపు మార్కెట్ కదలికలను గమనించడం ఉత్తమం. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, నేడు జులై 13, 2026 సోమవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
రూ.10 వేల కోట్ల సందడి!
ప్రైమరీ మార్కెట్లో ఈ వారం రూ.10 వేల కోట్లకు పైగా విలువైన మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. మెయిన్బోర్డు విభాగంలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వరల్డ్లు, ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానున్నాయి. అలాగే ఇదే వారంలో మూడు ఐపీఓలు ముగియనున్నాయి. నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు ఈ వారం జోరందుకోనున్నాయి.ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ వారంలో ప్రధాన ఆకర్షణ ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్’ ఐపీఓ కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఫ్రాన్స్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అముండి సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఈ కంపెనీ రూ.9,812.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. షేరు ధరను రూ.545–574గా నిర్ణయించారు. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండటంతో సమీకరించే నిధులు కంపెనీకి కాకుండా, షేర్లు విక్రయించే వాటాదారులకే దక్కనున్నాయి. ఆల్పైన్ టెక్స్వరల్డ్ గుజరాత్కు చెందిన టెక్స్టైల్ కంపెనీ ఆల్పైన్ టెక్స్వరల్డ్ మెయిన్బోర్డు విభాగంలో రెండో ఐపీఓగా రానుంది. రూ.126.25 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.100–105గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను కొత్త వీవింగ్ యూనిట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఒక్కటే పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. రూ.160.30 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.315–331గా నిర్ణయించారు. సమీకరించే నిధులను ప్లాంట్ ఏర్పాటు, యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.4 లిస్టింగులు ఈ వారంలో (బుధవారం) జూలై 15న కుసుమ్గర్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. మరుసటి రోజు గురువారం లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా, డెవ్సన్ క్యాటలిస్ట్, హ్యాపీ స్టీల్స్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు రెండంకెల ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
స్టాక్మార్కెట్లో నెక్ట్స్ ఏం జరుగుతుంది?
మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ తెలియజేస్తుండడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే దాదాపు ఐదో వంతు (20 శాతం) ముడి చమురు రవాణా ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతాయనే భయాలు, భారతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అసలు మదుపరులు నిఫ్టీ క్రాష్ (భారీ పతనం)ను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలా? అనే అంశాలపై మార్కెట్ నిపుణుల విశ్లేషణ చూద్దాం.నిఫ్టీ కుప్పకూలుతుందా? మదుపరులు భయపడాలా?ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు మార్కెట్లో స్వల్పకాలిక అలజడి సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ నిఫ్టీ పూర్తిగా క్రాష్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు..గతంలో కంటే ప్రస్తుతం దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న పెట్టుబడుల ప్రవాహం మార్కెట్కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. విదేశీ పెట్టుబడిదారులు విక్రయాలు జరిపినా దేశీయ పెట్టుబడులు మార్కెట్ను నిలబెడుతున్నాయి.ఒకవేళ హార్మూజ్ మార్గం మూతబడినా రష్యా వంటి ఇతర దేశాల నుంచి భారత్ నేరుగా డిస్కౌంట్పై చమురును దిగుమతి చేసుకునే సత్సంబంధాలను కలిగి ఉంది.హార్మూజ్ జలసంధిని ఎక్కువకాలం మూసివేయడం ఇరాన్కు కూడా అంత సులువు కాదు. ఎందుకంటే ఇది చైనా, భారత్ వంటి పెద్ద దేశాలతో పాటు ఇరాన్ సొంత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లో ఎప్పుడూ స్వల్పకాలిక భయాందోళనలను సృష్టిస్తాయి. అయితే ఇలాంటి సమయాల్లో వచ్చే ప్రతి మార్కెట్ పతనం, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. పానిక్ సెల్లింగ్ (కంగారులో అమ్మకాలు) చేయకుండా ఓపిక పట్టడమే ప్రస్తుత తారకమంత్రం.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
భారత స్టాక్ మార్కెట్కు బూస్ట్!
భారత ఈక్విటీ మార్కెట్లకు భారీ ఊరట లభించింది. గత నాలుగు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిరంతరాయంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ప్రస్తుత జులై నెలలో మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నెల మొదటి పది రోజుల్లోనే (జులై 10 నాటికి) ఎఫ్పీఐలు భారతీయ షేర్లలో రూ.15,157 కోట్ల (దాదాపు 1.6 బిలియన్ డాలర్లు) నికర పెట్టుబడులు పెట్టడం గమనార్హం. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ పరిణామం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.నాలుగు నెలల అమ్మకాల పర్వానికి బ్రేక్గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎఫ్పీఐలు భారీగా విక్రయాలు జరిపారు. ఆ వివరాలను పరిశీలిస్తే..మార్చి: రూ. 1.17 లక్షల కోట్ల భారీ అవుట్ఫ్లో (పెట్టుబడుల ఉపసంహరణ)ఏప్రిల్: రూ. 60,847 కోట్లుమే: రూ. 32,963 కోట్లుజూన్: రూ. 49,340 కోట్లుగత ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు వచ్చినప్పటికీ ఆ తర్వాతి నాలుగు నెలల్లో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. తాజా జులై టర్న్అరౌండ్ ద్వారా ఈ అమ్మకాల పరంపరకు తెరపడింది. అయినప్పటికీ 2026 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు ఎఫ్పీఐలు మొత్తం మీద భారత ఈక్విటీల నుంచి దాదాపు రూ.2.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇది 2025 ఇదే కాలంలో జరిగిన రూ.1.66 లక్షల కోట్ల ఉపసంహరణ కంటే ఎక్కువ.మార్కెట్ మలుపునకు ప్రధాన కారణాలివే..భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదులు బలంగా ఉండటం, రూపాయి విలువ స్థిరంగా కొనసాగడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత సడలడంతో ఇంధన ధరలపై ఆందోళనలు తగ్గాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల రిస్క్ తగ్గుతున్నట్లవుతుంది.కొన్ని వారాలుగా మార్కెట్ కన్సాలిడేషన్ (స్థిరీకరణ) మోడ్లోకి వెళ్లడంతో అగ్రశ్రేణి భారతీయ కంపెనీల షేర్ల వాల్యుయేషన్లు సహేతుకమైన స్థాయికి చేరాయి. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కొనుగోలు అవకాశాన్ని కల్పించింది.సెమీకండక్టర్ బిజినెస్లో బలహీనత కారణంగా దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా మార్కెట్లలో ఎఫ్పీఐలు విక్రయాలు పెంచారు. ఆ నిధులలో కొంత భాగం ఇప్పుడు భారత్ వైపు మళ్లింది.జులైలో ఎఫ్పీఐల రాక మార్కెట్కు తాత్కాలికంగా పెద్ద సానుకూల సంకేతమే అయినప్పటికీ, దీన్ని పూర్తి స్థాయి బుల్ రన్గా భావించడం తొందరపాటే అవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇచ్చే సంకేతాలు, త్వరలో విడుదల కానున్న భారతీయ కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల ఆధారంగానే ఈ విదేశీ నిధుల ప్రవాహం ఎంతవరకు స్థిరంగా కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుందని అంచనా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల మద్దతుతో పాటు ఎఫ్పీఐల ఈ రాక మార్కెట్కు రక్షణ కవచంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
బంగారం కొనాలా? వద్దా?
గ్లోబల్ మార్కెట్ల ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితి నడుమ పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అస్థిరతకు లోనయ్యాయి. నేడు, ఆదివారం (12 జులై 2026) మార్కెట్ సెలవు దినం కావడంతో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రముఖ నగరాలు (హైదరాబాద్, విజయవాడలతో సహా), ప్రముఖ జ్యువెలరీ నెట్వర్క్ల పరిధిలో ఇవాల్టి పసిడి రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.పసిడి ధరలు (10 గ్రాములకు)22 క్యారెట్ల ఆభరణాల బంగారం: రూ.1,32,75024 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం: రూ.1,44,000 నుంచి రూ.1,44,960 వరకు ట్రేడ్ అవుతోంది.వారం రోజుల ధరల సరళిగడిచిన వారంలో జులై మొదటి వారంతో పోలిస్తే బంగారం మార్కెట్ మిశ్రమ ధోరణిని కనబరిచింది. వారం ప్రారంభంలో పెరిగిన ధరలు తర్వాత స్వల్ప లాభాల స్వీకరణ కారణంగా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. జులై మొదటి వారంలో 22 క్యారెట్ల బంగారం దాదాపు రూ.1,35,000 మార్కును తాకి, వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అయితే, వారం మధ్యలో ఒక్కసారిగా రూ.1,31,650 కి పడిపోయి, మళ్లీ వారాంతానికి కోలుకుని రూ.1,32,750 వద్ద ముగిసింది. దీన్ని బట్టి మార్కెట్లో కొనుగోలుదారుల కంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఎక్కువగా నడుస్తోందని స్పష్టమవుతోంది.ధరల ఒడిదొడుకులకు కారణాలుబంగారం ధరల ఈ స్థాయి అస్థిరతకు కేవలం స్థానిక డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న కొన్ని కీలక ఆర్థిక పరిణామాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే సెప్టెంబర్ ద్రవ్యోల్బణ సమీక్షలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి పెరిగింది. వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. దాంతో బంగారం ధరలు తగ్గుతాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడం కూడా పసిడి రేట్ల దిగువ ముగింపునకు కారణమైంది. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం దిగుమతి భారం అవుతుంది.ముడిచమురు ధరల ప్రభావంగ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు పడిపోకుండా మద్దతు లభిస్తోంది.మున్ముందు ఎలా ఉండనుంది?ప్రస్తుత సాంకేతిక విశ్లేషణల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ట్రెండ్ ఇంకా బుల్లిష్ (సానుకూల) మార్గంలోనే ఉంది. రాబోయే వారంలో మార్కెట్ కొంత జాగ్రత్తగా లేదా స్వల్ప క్షీణతతో సాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగినంత కాలం బంగారం ధరలు లక్ష రూపాయల దిగువకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పసిడి ప్రేమికులు ధరలు స్వల్పంగా తగ్గిన ప్రతిసారీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం సూచించదగిన వ్యూహం.ఇదీ చదవండి: శామ్సంగ్ కొత్త ఫోన్ వివరాలు లీక్? -
తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశీయ విఫణిలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (శనివారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.490 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. కాగా వెండి ధరలు కూడా ఈ రోజు రూ.5000 తగ్గడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ లేటెస్ట్ ధరల వివరాలు వివరంగా చూసేద్దాం. -
ఈరోజు దలాల్ స్ట్రీట్లో లాభాల పంట..
భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు సరికొత్త ఉత్సాహంతో దూసుకెళ్లాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ అనిశ్చితి, భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడిన దలాల్ స్ట్రీట్ ఈరోజు ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా లాభపడి ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ నింపాయి.ఈరోజు (జులై 10, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి..బీఎస్ఈ సెన్సెక్స్: 827 పాయింట్లు లాభపడి 77,569 వద్ద స్థిరపడింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ: 244 పాయింట్లు పుంజుకుని 24,206 మైలురాయిని తాకింది.ట్రేడింగ్ ప్రారంభం నుంచే బుల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దాదాపు అన్ని రంగాలు లాభాల బాట పట్టడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.ఇరాన్-యూఎస్ వార్పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు (ఇటీవల సీజ్ఫైర్ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, పరస్పర క్షిపణి దాడులు) గ్లోబల్ మార్కెట్లను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మార్కెట్ ర్యాలీకి ఈ ఉద్రిక్తతలు సడలడమే ప్రధాన కారణమైంది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరిగినప్పటికీ అవి కేవలం సైనిక స్థావరాలకే పరిమితం అవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఏదేమైనా శాంతి చర్చలు జరుగుతాయనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్లు ర్యాలీ అయ్యాయి. ఇరాన్ ఇంధన క్షేత్రాలు లేదా చమురు సరఫరా కేంద్రాలను టార్గెట్ చేయకూడదని ట్రంప్ యంత్రాంగం భావిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.ఉద్రిక్తతలు ముదిరితే క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్కు 80 డాలర్లు దాటుతుందని భయపడిన మార్కెట్లకు ప్రస్తుత పరిణామాలు ఊరటనిచ్చాయి. చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ బ్రెంట్ క్రూడ్ ధర స్థిరంగా కొనసాగడం భారత్ వంటి దిగుమతి దేశాల మార్కెట్లకు బూస్ట్గా నిలిచింది. చమురు ధరలు అదుపులో ఉండటం వల్ల ద్రవ్యోల్బణ భయాలు తగ్గి సెంటిమెంట్ బలపడింది.మార్కెట్ ర్యాలీకి తోడైన ఇతర కీలక అంశాలుఅంతర్జాతీయంగా టెక్నాలజీ, ఏఐ రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడుల వార్తలు ఐటీ రంగానికి ఊతాన్నిచ్చాయి. అమెరికాకు చెందిన ప్రముఖ మెమరీ చిప్మేకర్ మైక్రాన్ టెక్నాలజీ దాదాపు 250 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించడంతో వాల్ స్ట్రీట్ (నాస్డాక్) భారీగా పెరిగింది. దీని ప్రభావంతో భారతీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు భారీ లాభాలను ఆర్జించి నిఫ్టీని ముందుకు నడిపించాయి.స్థిరమైన అమెరికా లేబర్ మార్కెట్అమెరికాలో విడుదలైన అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ గణాంకాలు ఆ దేశ లేబర్ మార్కెట్ స్థిరంగా ఉందని నిరూపించాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లడం లేదనే భరోసా అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో స్థిరత్వాన్ని పెంచింది.దేశీయ ఇన్వెస్టర్ల మద్దతుఅంతర్జాతీయంగా ఎటువంటి అస్థిరత ఎదురైనా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ప్రవాహం మార్కెట్కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. నేడు దేశీయ కొనుగోళ్లు మార్కెట్ త్వరగా కోలుకోవడానికి దోహదపడ్డాయి.పశ్చిమాసియా సంక్షోభం పూర్తిగా సమసిపోనప్పటికీ యుద్ధం తీవ్రరూపం దాల్చకపోవచ్చనే అంచనాలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. అయితే రాబోయే రోజుల్లో క్యూ1 ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు మార్కెట్ తదుపరి దిశను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతానికైతే బుల్స్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నిఫ్టీని మళ్లీ పైకి లాగుతుండడం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్ల నమ్మకానికి నిదర్శనం.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10 వద్ద నిలిచాయి.కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముతూత్ మైక్రోఫిన్ లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీ-లింక్ (ఇండియా) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియులకు అలర్ట్.. మారిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు పెరుగుదల మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు దేశీయ విఫణిలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ.380 పెరిగింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. కాగా వెండి ధర మాత్రం రూ.5000 పెరిగింది. తాజా ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. -
Gold Price: గంటల వ్యవధిలో మారిపోయిన ధరలు!
నాలుగు రోజుల తరువాత గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఈ రోజు (గురువారం) ఉదయం గరిష్టంగా రూ.110 పెరిగిన బంగారం ధర, సాయంత్రానికి మరో 20 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇంకాస్త ముందుకు వెళ్ళింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. -
ఇన్వెస్టర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 238.22 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 76,741.82 వద్ద, నిఫ్టీ 80.75 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,962.80 వద్ద నిలిచాయి.పాల్ మర్చంట్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, శంకర బిల్డ్ప్రో లిమిటెడ్, పాల్ మర్చంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, లిబాస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల్లో స్వల్ప మార్పు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.2 శాతం పెరిగింది.Today Nifty position 09-07-2026(time: 10:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
52 పైసలు పతనమైన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 52 పైసలు క్షీణించి 95.48 వద్ద ముగిసింది. అమెరికా ఇరాన్పై తాజా వైమానిక దాడులు జరపడం, దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 6 శాతానికి పైగా ఎగిశాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే అమెరికా డాలర్కు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 101.13 స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ ఈక్విటీ సూచీలు రెండుశాతానికి పైగా క్షీణించింది. ఈ పరిణామాలన్నీ రూపాయి కోతకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 95.15 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించి, ఇంట్రాడేలో 94.98–95.61 శ్రేణిలో కదలాడింది. -
మార్కెట్లో ట్రంప్ కల్లోలం
ముంబై: ‘‘ఇరాన్తో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండవు. కేవలం సంప్రదింపులు మాత్రమే ఉంటాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 6.18 శాతం ఎగిసి బ్యారెల్కు 78.74 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గడిచిన మూడు నెలల్లోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,667 పాయింట్లు క్షీణించి 76,504 వద్ద ముగిసింది. నిఫ్టీ 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద స్థిరపడింది.ఒక్కరోజే ఇన్వెస్టర్ల మార్కెట్ సంపద రూ.8.96 లక్షల కోట్లు కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.471 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా అమ్మకాల ఒత్తిడే... బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్ను ప్రారంభించాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. చివరి గంటలో విక్రయాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,922 పాయింట్లు క్షీణించి 76,259 వద్ద, నిఫ్టీ 594 పాయింట్లు కోల్పోయి 23,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల ఇండెక్సులన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సర్వీసెస్ సూచీ 3.21 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.76%, ప్రైవేటు బ్యాంకులు 2.74%, ఎఫ్ఎంసీజీ 2.54 %, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.49 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ సెలెక్ట్ 2.14 %, స్మాల్క్యాప్ సెలెక్ట్ 1.61 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో అన్ని షేర్లూ డీలా సెన్సెక్స్ సూచీలో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఇండిగో (–5.22%), మారుతీ (–4.11%), హెచ్యూఎల్ (–3.36%), బజాజ్ ఫైనాన్స్ (–3.07%), కోటక్ మహీంద్రా (– 2.93%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. మరోవైపు, అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ (– 2.27%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2.36%), రిలయన్స్ (–2.35%), ఎల్అండ్టీ(–2.41%), ఎయిర్టెల్ (–1.82%) షేర్లు నష్టపోయాయి. ఆయిల్, ఏవియేషన్, పెయింట్స్ షేర్లు బేర్.. క్రూడ్ సెగతో మార్కెటింగ్ మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాలతో హెచ్పీసీఎల్ (–4.60%), ఐఓసీ (–3.51%), బీపీసీఎల్ (–3.20%) షేర్లు బలహీనపడ్డాయి. ఏటీఎఫ్ ధరల ఆందోళనతో ఇండిగో (–5.02%), స్పైస్జెట్ (–3.04%) పడ్డాయి. షాలీమార్ పెయింట్స్ 4.44 శాతం, ఇండిగో పెయింట్స్ 4.18 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.49 శాతం, బర్జర్ పెయింట్స్ 2.26 శాతం క్షీణించాయి.బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు భౌగోళిక, రాజకీయ ఉద్రికత్తల దెబ్బతో ప్రపంచ మార్కెట్లన్నీ ఎరుపెక్కాయి. కొరియా (–5.65%), జపాన్ (–2.15%), చైనా (–0.49%) నష్టపోయాయి. జర్మనీ (–1.96%), ఫ్రాన్స్ (–2.11%) పతనమయ్యాయి. బ్రిటన్ (–1.44%), అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ సక్సెస్ న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ విజయవతమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.170)తో పోలిస్తే 9.41% ప్రీమియంతో రూ.186 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 13% లాభపడి రూ.192 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 7.47 శాతం లాభంతో రూ.183 వద్ద ముగిసింది.ఉదయం 9.15సెన్సెక్స్ 77,816 (–365)మధ్యాహ్నం 1.45సెన్సెక్స్ 77,559 (–622)మధ్యాహ్నం 3.30సెన్సెక్స్ 76,504 (–1,677) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు..
భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఈరోజు గందరగోళంగా మిగిలిపోయింది. గత కొన్ని సెషన్లుగా లాభాల బాటలో పయనిస్తున్న స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో భారీగా నష్టపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 దాదాపు 2% పైగా (516 పాయింట్లు) క్షీణించి 23,882 స్థాయికి పడిపోగా, సెన్సెక్స్ కూడా 1677 పాయింట్లు నష్టపోయి 76,503 వద్దకు చేరింది.మార్కెట్ పతనానికి కారణాలుమార్కెట్ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియా ఉద్రిక్తతలు. హార్మూజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ప్రతిచర్యగా అమెరికా పవర్ స్ట్రైక్స్ పేరిట దాడులు జరపడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసినట్లు పేర్కొన్నారు. దాంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తారేమోనని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.భగ్గుమన్న అంతర్జాతీయ ముడిచమురు ధరలుభారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ముడిచమురు ధరలు పెరగడం సవాలుగా మారుతుంది. నిన్నటి వరకు బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఏకంగా 2.5% పైగా పెరిగి 76 డాలర్ల మార్కును దాటింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెంచడంతో మార్కెట్ సెంటిమెంట్ను పూర్తిగా దెబ్బతీసింది.రూపాయి పతనంఅంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో డాలర్ ఇండెక్స్ 101.08 స్థాయికి చేరగా దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే ఏకంగా 20 పైసలు క్షీణించి 95.16 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి పతనం విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.లాభాల స్వీకరణగత నాలుగు సెషన్లుగా మార్కెట్లు నిరంతరాయంగా లాభపడటంతో (సెన్సెక్స్ 1,800 పాయింట్లు, నిఫ్టీ 560 పాయింట్లకు పైగా పెరిగాయి) గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ముఖ్యంగా హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?పశ్చిమాసియా పరిణామాలు శాంతించే వరకు, అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడే వరకు ఇన్వెస్టర్లు తొందరపడి భారీ పెట్టుబడులు పెట్టకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మార్కెట్ దిద్దుబాట్లు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారుతాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:22 సమయానికి నిఫ్టీ(Nifty) 159 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 507 పాయింట్లు దిగజారి 77,671 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.16 శాతం దిగజారింది.Today Nifty position 08-07-2026(time: 10:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 104.35 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 78,180.72 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,398.70 వద్ద నిలిచాయి.షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, మెరైన్ ఎలక్ట్రికల్స్ (ఇండియా) లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు మారిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,445 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 29 పాయింట్లు పెరిగి 78,329 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.12 శాతం పుంజుకుంది.Today Nifty position 07-07-2026(time: 09:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ మెగా ఐపీఓ ఎప్పుడంటే..
ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మెగా పబ్లిక్ ఇష్యూకి ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రానున్న ఈ ఐపీఓ ఈ ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.ఈ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా. ఐపీఓ విజయవంతమైతే.. 2024 అక్టోబర్లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల పబ్లిక్ ఇష్యూ రికార్డును అధిగమిస్తుంది. తద్వారా భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా అవతరిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలోనే ఉంటుంది. -
రూపాయి.. పావలా పతనం
డాలర్ మారకంలో సోమవారం రూపాయి విలువ 25 పైసలు బలహీనపడి 95.43 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికాలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గడం తదితర కారణాలు రూపాయిపై ఒత్తిడి పెంచాయి. డాలర్తో రూపాయి విలువ 95.25 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 95.22–95.48 మధ్య కదలాడింది. -
నేటి మార్కెట్లో బుల్ రన్.. కారణాలివేనా?
భారత స్టాక్ మార్కెట్లో ఈరోజు (జులై 06, 2026) ర్యాలీ చోటుచేసుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి తోడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు తోడవడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 24,430 వద్దకు, సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్దకు చేరడం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ను స్పష్టం చేస్తోంది.ర్యాలీకి దారితీసిన ప్రధాన కారణాలుమధ్యప్రాచ్యంలో సడలిన ఉద్రిక్తతలు: గత వారం ఇరాన్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్-ఇరాన్ చర్చలలో పురోగతి, యుద్ధ మేఘాలు తొలగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచింది.యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు: అమెరికాలో ఇటీవల విడుదలైన ఉపాధి గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపుతుందనే ఆశలు పెరిగాయి. ఇది అంతర్జాతీయంగా రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు వచ్చేలా చేసింది.ఆసియా, ఐరోపా మార్కెట్ల మద్దతు: యూరోజోన్లో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడం, ఆసియా మార్కెట్లలో (హాంకాంగ్, షాంఘై) ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది.చమురు ధరల పతనంఇరాన్ సంక్షోభం సడలడం, ఒప్పందం ప్రకారం ఓపెక్ ప్లస్ దేశాలు చమురు సరఫరాను పెంచేందుకు అంగీకరించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 71.50 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పెరగడానికి (ముఖ్యంగా ఆటోమొబైల్, పెయింట్స్, ఏవియేషన్ రంగాలకు) ఎంతగానో దోహదపడుతుంది.సంస్థాగత పెట్టుబడులువిదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్ల వైపు మళ్లారు. గత శుక్రవారం దాదాపు రూ.1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా ఈరోజు కూడా కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు బలాన్నిస్తున్నారు. జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాల సీజన్ ప్రారంభం కానుండటంతో కంపెనీల బిజినెస్ అప్డేట్స్ సానుకూలంగా వస్తున్నాయి.రూపాయి స్థిరత్వండాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కొంత బలహీనపడటం, చమురు ధరలు దిగిరావడంతో రూపాయిపై ఒత్తిడి తగ్గింది. రూపాయి బలోపేతం కావడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత ఈక్విటీలపై నమ్మకం పెరిగి మరింత పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై సెబీ దృష్టి!
భారతీయ స్టాక్ మార్కెట్లో లిక్విడిటీని పెంచడంతో పాటు ఇన్వెస్టర్లకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కీలక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. మార్కెట్లో ‘షార్ట్ సెల్లింగ్’ ప్రక్రియను సులభతరం చేసేలా.. సెక్యూరిటీల లెండింగ్స్ అండ్ బారోయింగ్స్(ఎస్ఎల్బీ) పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన స్టాక్స్ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నమ్మకమైన వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. అర్హత కలిగిన షేర్ల సంఖ్యను పెంచడంతో పాటు ‘కొలేటరల్’ (హామీ) అవసరాలను కూడా గణనీయంగా తగ్గించేందుకు సెబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.డెరివేటివ్స్ జోరుకు బ్రేక్.. క్యాష్ మార్కెట్కు బూస్ట్!ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఈ విభాగంలో ట్రేడింగ్ చేసే రిటైల్ పెట్టుబడిదారులలో దాదాపు 90% మంది భారీగా నష్టపోతున్నారని సెబీ ఇటీవలే వెల్లడించింది. డెరివేటివ్స్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం క్యాష్ మార్కెట్ కంటే దాదాపు 500 రెట్లు పెద్దదిగా ఉండటం గమనార్హం. ఇది ప్రపంచంలోని ప్రధాన మార్కెట్ల కంటే చాలా ఎక్కువ.డెరివేటివ్స్లో లెవరేజ్ ఎక్కువగా ఉండటం వల్ల సిద్ధాంతపరంగా నష్టాలకు పరిమితి ఉండదు. అదే క్యాష్ మార్కెట్లో అయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ వాస్తవ షేర్లు, కొలేటరల్ ఆధారంగా జరుగుతుంది. అందుకే, రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ప్రమాదకర డెరివేటివ్స్ మార్కెట్ నుంచి దూరంగా ఉంచి సురక్షితమైన క్యాష్ ఈక్విటీ మార్కెట్ వైపు మళ్లించడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశం.కఠిన నిబంధనల నుంచి సడలింపుల వైపు..గతంలో జరిగిన కొన్ని స్టాక్ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశం తన నగదు ఈక్విటీ మార్కెట్ భద్రత కోసం అత్యంత కఠినమైన నిబంధనలను రూపొందించింది. మొదట 2000వ దశకంలో, ఆ తర్వాత మళ్లీ 2017 - 2020 కాలంలో ఈ నియమాలను మరింత కఠినతరం చేశారు.ప్రస్తుత పరిస్థితి ఇలా..భారత క్యాష్ ఈక్విటీ మార్కెట్లో దాదాపు 95% వాటాను కలిగి ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 2,600 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. కానీ, వీటిలో కేవలం 176 కంపెనీల షేర్లు మాత్రమే ప్రస్తుతం అప్పు ఇవ్వడానికి, తీసుకోవడానికి (ఎస్ఎల్బీ) అర్హత కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయడం ద్వారా మార్కెట్లోని మెజారిటీ లిక్విడ్ షేర్లను ఈ పరిధిలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
రూ.10 వేలు తగ్గిన వెండి: బంగారం ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు (సోమవారం) మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10 వద్ద ఉన్నాయి.సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఆర్టీ నిర్మాణ్ లిమిటెడ్, సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజుల భారీగా పెరుగుదల తర్వాత స్వల్పంగా క్షీణించిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం అంత పెరగదులే!
ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘జేపీ మోర్గాన్’ తన స్వల్పకాలిక అంచనాలను తగ్గించింది. కీలక రంగాల నుంచి బంగారం కొనుగోళ్లు గతంలో ఊహించినంత బలంగా ఉండకపోవడంతో ఈ ఏడాది ధరల పెరుగుదల పరిమితంగానే ఉండొచ్చని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. మూడో త్రైమాసికంలో (Q3) బంగారం సగటు ధర ఔన్స్కు 4,300 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.32 లక్షలు), నాలుగో త్రైమాసికంలో (Q4) 4,500 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.38 లక్షలు)చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇది గత నెలలో ప్రకటించిన ఏడాది చివరినాటికి 6,000 డాలర్ల (10 గ్రాములకు సుమారు రూ.1.84 లక్షలు) లక్ష్యంతో పోలిస్తే గణనీయమైన తగ్గింపే. బ్యాంకు ప్రకారం.. అమెరికా ఆర్థిక గణాంకాలు వేసవి కాలంలో అంచనాల కంటే బలంగా వస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ముందుగానే పెంచే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ తగ్గి, పెట్టుబడిదారులు అధిక రాబడులు ఇచ్చే ఇతర ఆస్తులవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో బంగారం ధరలపై దిగువ ఒత్తిడి ఏర్పడవచ్చని తెలిపింది.అయితే దీర్ఘకాలికంగా మాత్రం జేపీ మోర్గాన్ తన సానుకూల దృక్పథాన్ని కొనసాగించింది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌతిక డిమాండ్ మళ్లీ బలపడడం వంటి అంశాలతో 2027లో బంగారం మరోసారి బలమైన ర్యాలీ చేసే అవకాశముందని పేర్కొంది.ఇదిలా ఉండగా, జూలై 3 ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం పెరిగి ఔన్స్కు 4,174.21 డాలర్ల వద్ద ట్రేడైంది. ఇది జూన్ 23 తర్వాత అత్యధిక స్థాయి కాగా, వారాంతానికి బంగారం ధరలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.ఇతర విలువైన లోహాలపై కూడా బ్యాంకు అంచనాలు వెల్లడించింది. వెండి ధరలు ఔన్స్కు 60–65 డాలర్ల మధ్య సగటున ఉండొచ్చని, దక్షిణాఫ్రికాలో సరఫరా పరిమితుల కారణంగా ప్లాటినం ధరలు 2026 చివరికి 1,800 డాలర్లు, 2027 చివరికి 1,950 డాలర్లు చేరవచ్చని తెలిపింది. మరోవైపు, పల్లాడియం ధరలు 2026 చివరికి ఔన్స్కు 1,350 డాలర్లు, 2027లో సగటున 1,300 డాలర్ల వద్ద ఉండొచ్చని అంచనా వేసింది. -
దిగువకు బంగారం.. పసిడి ప్రియులకు ఊరట
దేశంలో బంగారం, వెండి ధరల దౌడుకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు దిగువకు వచ్చాయి. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్.. పోలీసులకు ఫిర్యాదు
దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. లెజెండ్రీ ట్రేడర్స్ (Legendry Traders), లెట్స్ ట్రేడ్ ఇండియా (Let's Trade India) పేర్లతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న రెండు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం, లెజెండ్రీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్టాక్ మార్కెట్ చిట్కాలు అందించడంతో పాటు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ఖాతాలను నిర్వహించే సేవలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెట్స్ ట్రేడ్ ఇండియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లు, అనుబంధ వెబ్సైట్లు, 9773687281 మొబైల్ నంబర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.గ్యారెంటీ లాభాలంటే నమ్మొద్దుస్టాక్ మార్కెట్లో హామీ లేదా నిర్ధారిత రాబడులు ఇస్తామని ప్రచారం చేసే ఏ వ్యక్తి లేదా సంస్థను నమ్మవద్దని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇటువంటి పథకాలు చట్టవిరుద్ధమని, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.రిజిస్టర్డ్ బ్రోకర్లేనా? ముందుగా చెక్ చేసుకోండిఈ రెండు సంస్థలు ఎన్ఎస్ఈలో నమోదైన స్టాక్ బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. కాబట్టి ఏ బ్రోకర్ లేదా సంస్థతోనైనా లావాదేవీలు చేపట్టే ముందు ఎన్ఎస్ఈ వెబ్సైట్లోని "Know/Locate Your Stock Broker" సదుపాయం ద్వారా వారి నమోదు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించేకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.ఏమిటీ 'డబ్బా ట్రేడింగ్'?'డబ్బా ట్రేడింగ్' అనేది సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెలుపల జరిగే చట్టవిరుద్ధ, అనియంత్రిత ట్రేడింగ్ విధానం. ఇందులో కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు అధికారిక ఎక్స్ఛేంజీలపై అమలు కాకుండా, డబ్బా ఆపరేటర్లు తమ అంతర్గత వ్యవస్థల్లోనే సెటిల్ చేస్తారు. దీంతో ఈ ట్రేడ్లు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణకు దూరంగా ఉంటాయి.ఇలాంటి ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అధికారిక ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వినియోగించుకోలేరు. అందువల్ల డబ్బా ట్రేడింగ్కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఈ మరోసారి స్పష్టం చేసింది. -
అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!
అమెరికన్ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ (Peter Schiff) అమెరికా డాలర్ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పీటర్ షిఫ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ విలువ భవిష్యత్తులో భారీగా పడిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయి సంక్షోభం రావచ్చని తెలుస్తోంది.2008లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన కొద్దిమంది విశ్లేషకులలో పీటర్ షిఫ్ కూడా ఒకరని చాలామంది చెబుతారు. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడం, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు రావడం వంటి అంశాలను ఆయన ముందే హెచ్చరించారని అంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు కొంతమంది ఆర్థిక వర్గాల్లో ప్రాధాన్యం ఇస్తారు.ఇప్పుడు ఆయన డాలర్ గురించి చేస్తున్న వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏమిటంటే.. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు డాలర్పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా దీర్ఘకాలంలో డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయన ''ఆర్థిక సంక్షోభానికి సిద్ధంగా ఉండాలి'' అనే హెచ్చరికలు ఇస్తున్నారు.🚨 BREAKING:THE MAN WHO PREDICTED THE 2008 CRASH, PETER SCHIFF, JUST SAID:"US DOLLAR WILL CRASH. PREPARE FOR A HISTORIC ECONOMIC COLLAPSE."HE PREDICTED THE 2008 CRASH AND CONTROLS OVER $2.18 BILLION NOWHE KNOWS SOMETHING BAD IS COMING... pic.twitter.com/d97gKHXJp4— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) July 2, 2026నిజానికి ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు ఆయన హెచ్చరికలను తీవ్రమైన ప్రమాద సంకేతంగా చూస్తే, మరికొందరు వాటిని అతిశయోక్తిగా భావిస్తారు. డాలర్ ప్రపంచంలో ఇంకా అత్యంత బలమైన కరెన్సీగానే కొనసాగుతోంది, ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ట్రేడ్, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ స్థానం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి డాలర్ విలువ తగ్గుతుందా? లేదా?, రానున్న రోజుల్లో ఆర్ధిక సంక్షోభం వస్తుందా? లేదా? అనే విషయాలను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.ఇదీ చదవండి: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఈ స్కీమ్తో భారీ లాభం! -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 261.79 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 77,763.91 వద్ద, నిఫ్టీ 95.15 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,270.85 వద్ద నిలిచాయి.డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏషియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దౌడు తీసిన బంగారం, వెండి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరల పరుగులు ఆగడం లేదు. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు మరింత దౌడు తీశాయి. ఇక వెండి ధరలూ అదే దారిలో పరుగులు పెట్టాయి. దీంతో ఈరోజూ కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 186 పాయింట్లు ఎగబాకి 24,362 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం తగ్గింది.నాస్డాక్ 0.8 శాతం నష్టపోయింది.Today Nifty position 03-07-2026(time: 09:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. యూఎస్, ఇరాన్ వాణిజ్య చర్చల సానుకూల సంకేతాలపై చమురు ధరలు తగ్గడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. నిఫ్టీ 0.71 శాతం 169.85 పాయింట్ల లాభంతో 24,175.70 వద్ద, సెన్సెక్స్ 0.75 శాతం లేదా 579.48 పాయింట్లు పెరిగి 77,502.12 వద్ద ముగిశాయి.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.25 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ సెక్టోరల్ సూచీలను అధిగమించింది. 2025 మే తర్వాత ఉత్తమ ఇంట్రాడే లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గత మూడు సెషన్ల నుంచి తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా ఈరోజు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.38బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.66 శాతం నష్టపోయింది.Today Nifty position 02-07-2026(time: 09:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం అమ్మేసుకుంటున్నారు..
బంగారం ధరలు ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిని తాకిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాల పసిడి కొనుగోలు ధోరణిలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. సాధారణంగా పాత బంగారు ఆభరణాలను కొత్త నగలుగా మార్చుకునే వినియోగదారులు, ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించి నగదుగా మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలే ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.3 నెలల్లో 50 టన్నుల బంగారంఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం అధికం. పాత ఆభరణాలను అమ్మి నగదు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర కొన్ని సందర్భాల్లో రూ.1.8 లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు రూ.1.4 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరలు ఇంకా రూ.1.2 లక్షల వరకు పడిపోవచ్చనే అంచనాలతో చాలామంది ఇప్పుడే విక్రయించి లాభాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.బంగారం అధిక ధరలను నగదుగా మార్చుకునే అవకాశంగా వినియోగదారులు చూస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతంలో పాత నగలను ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం మాత్రం నేరుగా విక్రయించి నగదు పొందడానికే ప్రాధాన్యం పెరిగిందన్నారు.రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతంఈ పరిణామం దేశంలోని సంఘటిత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతమిస్తోంది. ఇళ్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం తిరిగి మార్కెట్లోకి రావడం వల్ల దిగుమతులపై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధిక ధరల కారణంగా కొత్త బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్: ఎవరికి లాభాలు.. ఎవరికి నష్టాలు?
ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) పెరిగి 76,922.64 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 631 పాయింట్లకుపైగా పెరిగి 77,110.08 గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) లాభంతో 24,005.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలు సూచీల ర్యాలీకి ప్రధాన మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల్లో ఈరోజు టాప్ గెయినర్లు ఏవి, టాప్ లూజర్లు ఏవి.. ఈ కింద చూద్దాం..సెన్సెక్స్ టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%అల్ట్రాటెక్ సిమెంట్11,456+203.00+1.81%యాక్సిస్ బ్యాంక్1,369+23.00+1.71%సెన్సెక్స్ టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ బ్యాంక్796.15-1.81-0.23%టైటాన్4,399-5.40-0.13%నిఫ్టీ 50 టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%అదానీ ఎంటర్ప్రైజెస్3,144+108.00+3.55%నెస్లే ఇండియా1,454+48.60+3.46%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%నిఫ్టీ 50 టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%హిందాల్కో939.70-16.90-1.77%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%డాక్టర్ రెడ్డీస్1,340-17.20-1.27%టాటా మోటార్స్347.80-4.40-1.25%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ లైఫ్569.95-5.90-1.03%మొత్తంగా, గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల కొన్ని భారీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. -
బంగారం ధరలు కూల్ఆఫ్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 01-07-2026(time: 09:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350 వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
జూలై నెలలో మొత్తం 8 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇవి సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. ఇందులో 4 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. తేదీల ప్రకారం చూస్తే జూలై 4, 11, 18, 25 శనివారాలు కాగా, జూలై 5, 12, 19, 26 ఆదివారాలు మార్కెట్ సెలవులు అవుతాయి.సాధారణ వారాంతపు సెలవుల కారణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లోజ్ అవుతాయి. కాబట్టి జూలై 2026లో తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్న పెట్టుబడిదారులు ఈ నెలలో వారపు రోజులలో స్టాక్ మార్కెట్ సెలవులు లేవని గమనించాలి. ఎందుకంటే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ అన్ని ట్రేడింగ్ రోజులలో యధావిధిగా పనిచేస్తాయి.ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026లో తదుపరి వర్కింగ్ డే సెలవు సెప్టెంబర్ 14న వస్తుంది. ఆ రోజు గణేష్ చతుర్థి కారణంగా మార్కెట్ క్లోజ్.2026 సంవత్సరంలో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్కు ఉన్నాయి. రాబోయే నెలల్లో వివిధ జాతీయ, మతపరమైన పండుగల కారణంగా ట్రేడింగ్ ఉండదు. అవి..అక్టోబర్ 2: గాంధీ జయంతిఅక్టోబర్ 20: దసరానవంబర్ 10: దీపావళినవంబర్ 24: శ్రీ గురు నానక్ జయంతిడిసెంబర్ 25: క్రిస్మస్కొన్ని ముఖ్యమైన పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు ఉండవు. ఉదాహరణకు, ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం కావడం వల్ల అదనపు ట్రేడింగ్ సెలవుగా ఉండదు. అలాగే దీపావళి లక్ష్మీ పూజ కూడా ఆదివారం రావడం వల్ల సాధారణ సెలవు ఉండదు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు నష్టపోయి 23,865 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 239 పాయింట్లు తగ్గి 76,498 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 30-06-2026(time: 09:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!
బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.భారతదేశంలో బంగారం ధరలుమన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.I was wrong. Gold still crashing!Thats real life. RD Lesson: Profuts are made when you buy…. Not when you sell.I still believe gold will be $35 k in about 5-years.But that is real life: All markets go up and down.Another RD lesson: The richest investors invest for…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 29, 2026 -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 శాతం లేదా 0.46 శాతం నష్టంతో 23,946.25 వద్ద నిలిచాయి.ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్కేర్ లిమిటెడ్, మాక్పవర్ సిఎన్సి మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, టార్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, అటల్ రియల్టెక్ లిమిటెడ్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం తగ్గింది.నాస్డాక్ 0.24 శాతం నష్టపోయింది.Today Nifty position 29-06-2026(time: 09:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ పశ్చిమాసియా టెన్షన్!
పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంది. సీజ్ఫైర్ను ఉల్లంఘించారంటూ... ఇరాన్–అమెరికా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం మళ్లీ అట్టుడికింది. తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల సెగ ముడిచమురు ధరలపై చూపే ప్రభావం ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుందనేది విశ్లేషకులు అభిప్రాయం. సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే, దేశీయంగా వెలువడే పలు స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రుతుపవనాల కదలికలపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరాన్లోని మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఎటాక్ చేసింది. మరోమారు సీజ్ఫైర్ను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వెరసి ఈ వారం క్రూడ్ ధరలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై ఆశలతో ముడిచమురు ధరలు చల్లారిన సంగతి తెలిసిందే. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల దిగువకు, అంటే యుద్ధం పూర్వపు స్థాయికి చేరింది. తాజా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడులకులు ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. ‘పశ్చిమాసియాలో తాజా టెన్షన్లను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ఒకపక్క శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... అమెరికా, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న దాడులతో భౌగోళిక రాజకీయ రిసు్కలు ఇంకా తొలగిపోలేదని మార్కెట్లకు సంకేతాలిస్తున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితాలు, ఉద్రిక్తతలు సద్దుమణిగితే రిస్క్ సెంటిమెంట్ మెరుగవుతుంది ఒకవేళ దాడులు తీవ్రమైతే ప్రపంచ వృద్ధి, ఇంధన మార్కెట్లపై అంచనాలు తారుమారవుతాయి’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ పేర్కొన్నారు. గణాంకాలపై ఫోకస్... ఈ వారం దేశీయంగా విడుదల కానున్న కొన్ని కీలక గణాంకాలు మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)తో పాటు హెచ్ఎస్బీసీ తయారీ సేవల పీఎంఐ డేటా వెలువడనుంది. మరోపక్క, జూన్ నెల ఆటోమొబైల్ అమ్మకాలను కూడా కంపెనీలు జూలై 1న వెల్లడించనున్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితిని తెలియజేయనున్న నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మరోపక్క, అమెరికా తయారీ రంగ పనితీరును సూచించే డేటా కూడా మార్కెట్లకు కీలకమేనని మోతీలాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ్ ఖేమ్కా చెప్పారు. రూపాయి.. రుతుపవనాలు ముడిచమురు ధరలు దిగిరావడం, డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇటీవల రూపాయి కాస్త పుంజుకుంది. డాలర్ మారకంలో ఆల్టైమ్ కనిష్టం 96.96 స్థాయి నుంచి 94.20 వరకు బలపడింది. ప్రస్తుతం 94.50 వద్ద కదలాడుతోంది అయితే, పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలతో క్రూడ్ ఎగబాకితే.. రూపాయికి దాని సెగ తగులుతుందని.. మళ్లీ బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, జూన్ నెల ముగుస్తున్నా.. ఇంకా రుతుపవనాలు పూర్తిగా విస్తరించలేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు గనుక ఇలాగే ముఖం చాటేస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని.. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు గట్టిగా ఫోకస్ చేస్తారని పోన్ముడి పేర్కొన్నారు. గతవారమిలా... శుక్రవారం మన మార్కెట్లకు మొహర్రం సెలవు కారణంగా ఆసియా మార్కెట్లలో టెక్, చిప్ స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు ప్రతిబింబించలేదు. గతవారం ట్రేడింగ్ నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు (0.38%) పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్లు (0.17%) లాభపడి 24,056 వద్ద ముగిసింది.సాంకేతికంగా చూస్తే... పశ్చిమాసియా ప్రభావంతో మార్కెట్లు గనుక వెనకంజ వేస్తే... నిఫ్టీకి ఈ వారం 23,800 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. మరింత దిగజారితే 23,640 రెండో మద్దతు స్థాయిగా నిలుస్తుంది. ఇక నిఫ్టీ పెరిగితే.. 24,200–24,300 స్థాయిలో తొలి నిరోధం ఎదుర్కొంటుంది. 24,300 స్థాయిని గనుక అధిగమించగలిగితే.. 24,500 దిశగా పయనిస్తుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ రూపాయికీ చిల్లు పడుతోందా?
బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి. అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్ స్టోరీ...ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు. అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు సరిపోయేట్లు ఏమాత్ర ఉండటం లేదు. ఇక చిరు వ్యాపార వర్గాలను చూస్తే.. రవాణా ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైపెచ్చు వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో అమ్మకాలు పడిపోతూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. అయిదు హెచ్చరిక సంకేతాలు.. పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి ఓ అయిదు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ఇంతకీ ఆ హెచ్చరిక సంకేతాలేమిటంటే..1. క్రెడిట్ కార్డు బాకీలను ప్రతి నెలా క్యారీ ఫార్వార్డ్ చేస్తుండటం 2. ఈఎంఐల భారం ఆదాయంలో 40 శాతానికి పైగా ఉండటం 3. అత్యవసర నిధి అంటూ లేకపోవడం 4. వచ్చే ఆదాయంలో పొదుపు మొత్తం 10% కూడా లేకపోవడం5. ఆరోగ్య బీమా లేకపోవడం ఇలా చేద్దాం.. పరిష్కారం 1: ఒక ఏడాదికి సరిపడే అత్యవసర నిధి గతంలో ఎలాంటి అత్యవసరాన్నైనా ఎదుర్కోవాలంటే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా దాచిపెట్టుకుంటే సరిపోయేది. కానీ జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తుతుండటం, ధరలు పరుగులు తీస్తున్న తరుణంలో కనీసం 9–12 నెలల అవసరాలకు సరిపోయేంత మొత్తాన్ని తక్షణం తీసుకోవటానికి వీలుగా పక్కన పెట్టుకోవడం అనివార్యం. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. పరిష్కారం 2: కొత్త భారీ రుణాలకు దూరం.. సాధ్యమైనంత వరకు భారీ స్థాయి రుణాలకు అంటే.. లగ్జరీ కార్ లోన్స్, వ్యక్తిగత రణాలు, ఈఎంఐలతో క్రెడిట్ కార్డుల మీద పెద్ద మొత్తాల్లో కొనుగోళ్లు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. పైగా వడ్డీ రేటు అధికంగా ఉండే అప్పును తీర్చేయడం లక్ష్యంగా పెట్టుకుంటే మరీ మంచిది. వడ్డీ రూపంలో కట్టాల్సిన ఒక్క రూపాయిని ఆదా చేసినా.. పన్నుల భారం లేకుండా కాస్త అదనపు ఆదాయాన్ని అందుకున్నట్లే.పరిష్కారం 3: ఈక్విటీల్లో క్రమంగా పెట్టుబడులుచారిత్రకంగా చూస్తే కరెన్సీ బలహీనపడినప్పుడల్లా బంగారం ఆదుకుంటూ వస్తోంది. పెరిగే ధరలను ఎదుర్కొనగలిగేలా ఈక్విటీలు.. అంటే షేర్లు మెరుగైన రాబడులు అందిస్తూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయనే కారణంతో పెట్టుబడులను ఆపేయకుండా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు.. కొనసాగిచడమే మంచిది. పరిష్కారం 4: బంగారంలో 10–15% పెట్టుబడి.. పసిడిలో ఎంతో కొంతైనా పెట్టుబడి పెడితే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కనుక మొత్తం పోర్ట్ఫోలియోలో ఓ 10–15% బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లలో (మళ్లీ ప్రవేశపెడితే) ఇన్వెస్ట్ చేయొచ్చు. కుటుంబ అవసరాల మేరకే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఎల్రక్టానిక్ పద్ధతిలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. సాధారణంగా రూపాయి బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ పెరుగుతుంది. పరిష్కారం 5: బీమా కవరేజీని సమీక్షించుకోవాలిప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, అలాగే ఆర్జించే కుటుంబ సభ్యుల పేరిట టర్మ్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు.. కవరేజీ కూడా సరిపోయేంతగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సంక్షోభం ముంచుకొస్తే తప్ప చాలా మందికి .. తాము తీసుకున్న బీమా కవరేజీ.. తమ అవసరాలకు సరిపోయేంతగా లేదనే విషయం తెలియదు. కాబట్టి పాలసీ తీసుకుని మర్చిపోవడం కాకుండా.. ప్రతి సంవత్సరం కవరేజీని సమీక్షించుకుంటూ, అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉండాలి. పరిష్కారం 6: కొత్త నైపుణ్యాలు.. అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరిష్కారం. 40 ఏళ్ల పైబడిన ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియ్లల్ ప్లానింగ్ సర్టిఫికేషన్లు, తాము చేసే రంగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. తద్వారా పెట్టుబడులపై రాబడులు ఎలా ఉన్నా ఆదాయం అధికంగా ఉంటే ధరల దాడిని కొంత మేర అయినా సమర్ధంగా ఎదుర్కొనవచ్చు. పరిష్కారం 7: వివిధ ఆదాయ మార్గాలు కేవలం జీతం మీదే ఆధారపడితే సరిపోదు. వేరే వేరే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. కన్సలి్టంగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూషన్లు, ఆన్లైన్ సరీ్వసులు.. ఇలా అదనంగా కనీసం ఒక్క ఆదాయ మార్గమైనా పక్కన ఉంటే... ఆర్థికంగా స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. పరిష్కారం 8: ‘విదేశీ’ తగ్గించుకోవాలి రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, చదువులు, దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు.. చాలా ఖరీదైన వ్యవహారంగా మారతాయి. కాబట్టి అనవసరమైన అప్గ్రేడ్స్ జోలికి వెళ్లకూడదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోతగిన వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది. పరిష్కారం 9: నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి అనిశ్చితి నెలకొన్న వేళ.. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉన్నవి, స్థిరంగా క్యాష్ ఫ్లో ఉన్నవి, క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే కంపెనీలను పరిశీలించి, అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. భారీగా రుణభారం ఉన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి పోవద్దు. పరిష్కారం 10: బిజినెస్లాగే బడ్జెట్ వ్యాపారం చేస్తుంటే ప్రతిదీ ఎలా లెక్కేస్తామో ఇంటి బడ్జెట్లోనూ అలాగే ఉండాలి. ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రవాణా, వినోదం ఇలా అన్నింటినీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సబ్్రస్కిప్షన్లు, ఫుడ్ డెలివరీలు, ఆత్రం కొద్దీ కొనేసే వాటివల్ల ఎంత దుబారా అవుతోందనేది చాలా కుటుంబాలు గ్రహించవు. ఇలాంటి ఖర్చులను నివారిస్తే బోలెడు ఆదా అయినట్లే. -
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్కు 62 డాలర్లు పెరిగిందని పేర్కొంటూ, ఇది కొత్త బుల్రన్కు సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు. మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాను ప్రస్తావిస్తూ, బంగారం ధర ఔన్స్కు 35,000 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తాను కూడా నమ్ముతున్నట్లు వెల్లడించారు.కియోసాకి ప్రకారం.. ఇన్వెస్టర్లు కేవలం వార్తలు లేదా భావోద్వేగాల ఆధారంగా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ (TA) నేర్చుకోవడం అత్యంత అవసరం. మార్కెట్లు ఎప్పుడు ఎగుస్తాయి, ఎప్పుడు పడిపోతాయి అన్న సంకేతాలను చార్టుల ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, మార్కెట్ పెరిగినా, కుప్పకూలినా అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే టెక్నికల్ అనాలిసిస్ను నేర్చుకోవడానికి తనకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు.ఇటీవలే బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో తాను వెంటనే కొనుగోళ్లు చేయబోనని, ముందు మార్కెట్లో బాటమ్ ఏర్పడిందని చార్టులు నిర్ధారించేవరకు వేచి చూస్తానని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మలుపు వచ్చినట్లు కనిపిస్తోందని చెబుతూ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.Yay: I may have picked the turnin price of gold.Gold up $62 since I purchased yesterday. Possibly on a bull run to $35k if Jim Rickards is correct…. and I think he is. LESSON: An important study for you to increase your financial education is Technical Analysis,how…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2026 -
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
దేశంలో బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన వెండి ధరలు నేడు ఎటువంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
భారతదేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (జూన్ 26) గోల్డ్ రేటు ఊహకందని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు జరిగింది. ఈ కథనంలో తాజా ధరల వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో శుక్రవారం ఉదయం రూ.250 పెరిగి రూ.1,29,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు.. సాయంత్రానికి రూ.1,30,850 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1050 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,600 నుంచి రూ.142750 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ ధరలో మార్పులు కనిపించాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం నుంచి సాయంత్రానికి రూ.1,29,950 నుంచి రూ.1,31,050 వద్దకు (రూ.1100 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,750 రూపాయల నుంచి 1,42,950 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,33,000 (రూ.1600 పెరిగింది) వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,45,090 (రూ.1740 పెరిగింది) వద్ద నిలిచింది. -
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.GOLD just made the turn.I think and I have been wrong, the price of gold and silver are about to rise for a long time. Jim Rickards predicts $35,000 gold in near future.As I stated in my previous X the last big bull run began in 2000 and I bought gold at $300.In 2026 the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 25, 2026 -
ఐపీవో బాటలో మరిన్ని కంపెనీలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ రిటైల్ సంస్థ సత్య ఏజెన్సీస్, ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ కనోహర్ ఎలక్ట్రికల్స్, టోరెంట్ గ్యాస్ ప్రతిపాదనలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. సత్యా ఏజెన్సీస్, టోరెంట్ గ్యాస్ మార్చి నెలలో, కనోహర్ ఎలక్ట్రికల్స్ జనవరిలో తమ ఐపీవో ముసాయిదా పత్రాలను సమరి్పంచాయి. వాటిని పరిశీలించిన మీదట జూన్ 2–25 మధ్య సెబీ తన ’అబ్జర్వేషన్స్’ని ఇచ్చింది. దీన్ని పబ్లిక్ ఇష్యూకి గ్రీన్ సిగ్నల్గా పరిగణిస్తారు. కీలకమైన వ్యాపార వివరాలు ప్రస్తుత దశలో బహిర్గతం కాకుండా, టోరెంట్ గ్యాస్ సంస్థ కాన్ఫిడెన్షియల్ విధానంలో తమ పత్రాలను సమర్పించింది. సత్య ఏజెన్సీస్ రూ. 600 కోట్లు.. ముసాయిదా పత్రాల ప్రకారం తమిళనాడుకు చెందిన సత్య ఏజెన్సీస్ రూ. 600 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నారు. ప్రమోటర్లయిన జాన్సన్ అసారియా, జె జాన్ సత్య, చార్లెస్ పకియారాజ్ తలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ నిర్దిష్ట రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. రూ. 300 కోట్ల కనోహర్ ఇష్యూ.. కనోహర్ ఎలక్ట్రికల్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసే యోచనలో ఉంది. అలాగే ప్రమోటర్లు సుమారు 1.45 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సేకరించిన నిధులను వ్యాపార వృద్ధి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. తమ గంగోల్ ప్లాంటు కోసం యంత్రపరికరాల కొనుగోలు, ఆటోమేషన్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మొదలైన వాటిపై వెచ్చించనుంది. -
బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో రివర్స్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనానికి బ్రేక్ పడింది. మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు పెరుగుదల బాటపట్టాయి. ఇక వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్టాక్ మార్కెట్: ట్రేడింగ్ బంద్
మొహర్రం సందర్భంగా శుక్రవారం (జూన్ 26) దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ల్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) తదితర అన్ని ప్రధాన విభాగాల్లో లావాదేవీలు జరగవు. దీంతో దలాల్ స్ట్రీట్కు వరుసగా మూడు రోజుల విరామం లభించింది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో రెగ్యులర్ ట్రేడింగ్ మళ్లీ జూన్ 29 (సోమవారం) ప్రారంభం కానుంది.కరెన్సీ, డెట్ మార్కెట్లలో కూడా శుక్రవారం ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. జూన్ నెలలో ఇదే ఏకైక అధికారిక ట్రేడింగ్ సెలవు కాగా, అంతకుముందు మే 28న బక్రీద్ సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. జూలై, ఆగస్టు నెలల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెలవులు లేకపోగా, తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.అయితే కమోడిటీ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ట్రేడింగ్ ఉండదు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30/11:55 గంటల వరకు ఈవెనింగ్ సెషన్లో ట్రేడింగ్ కొనసాగుతుంది. మరోవైపు NCDEXలో మాత్రం రోజంతా ట్రేడింగ్ అందుబాటులో ఉండదు. -
కొండ దిగుతున్న కనకం
న్యూఢిల్లీ: పసిడి, వెండి గురువారం కూడా దేశీ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. క్రితం రోజు ప్రపంచ మార్కెట్లలో ఈ రెండు లోహాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. దేశీ బులియన్ మార్కెట్పైనా ఇది ప్రతి ఫలించింది. 10 గ్రాముల బంగారం రూ.2,800 నష్టంతో రూ.1,45,300 వద్దకు దిగొచ్చింది.వెండి కిలోకి రూ.5,000 తగ్గి రూ.2,26,000 స్థాయికి పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి, వెండి లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. ఒక దశలో పసిడి అర శాతం తగ్గగా.. తర్వాత 1% వరకు పుంజుకుని ఔన్స్కు 4,033 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర ఔన్స్కు 2 శాతానికి పైగా లాభపడి 58.57 డాలర్ల స్థాయిని చేరుకుంది. -
అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. పెరుగుదల దిశగా అడుగులు వేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు (జూన్ 25) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న తులం 22 క్యారెట్స్ బంగారం ధర సాయంత్రానికి రూ.1,29,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,40,130 నుంచి రూ.1,41,330 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలో పసిడి ధరలు ఎంతగా మారాయో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఇక్కడ ఉదయం రూ.1,28,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,29,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,41,480 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.131400 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1,43,350 వద్ద ఉంది. -
బిట్కాయిన్ పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన!
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్కాయిన్' ఇటీవల 60,000 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. కొద్ది రోజుల క్రితం వరకు బలంగా కనిపించిన బిట్కాయిన్ ధర ఒక్కసారిగా సుమారు 59,000 డాలర్ల వరకు పడిపోవడంతో, క్రిప్టో మార్కెట్ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. దాదాపు 20 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన ఈ పతనం వెనుక అనేక అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ ధర పతనానికి ప్రధాన కారణం.. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళనలు, పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి దూరంగా వెళ్లడం వంటి అంశాలు క్రిప్టో మార్కెట్పై ప్రభావం చూపాయి.Pi42 సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అవినాష్ శేఖర్ ప్రకారం.. బిట్కాయిన్ ధర తగ్గడానికి పెద్ద పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడటం, అలాగే డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సహజమేనని, దీర్ఘకాలిక విలువ, స్వల్పకాలిక ధరల మధ్య పెట్టుబడిదారులు తేడాను గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో సానుకూల వార్తలు లేకపోవడం కూడా ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా అమెరికాలో ప్రతిపాదిత క్లారిటీ యాక్ట్ అమలుపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తోందని బిట్డెల్టా ఇండియా సీఈఓ వికాస్ ఎం సచ్దేవా అన్నారు.అమెరికా డాలర్ బలపడటం కూడా బిట్కాయిన్ పతనానికి కారణమని ముడ్రెక్స్ బిజినెస్ హెడ్ ప్రతీక్ గుప్తా అన్నారు. అమెరికా డాలర్ సూచీ గత 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బిట్కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం క్రిప్టో మార్కెట్పై ఒత్తిడి కనిపిస్తోంది.అయితే.. ఈ పతనం మధ్యలో కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బిట్కాయిన్ నెట్వర్క్లో జరిగే కార్యకలాపాలు మాత్రం బలంగానే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నెట్వర్క్ యాక్టివిటీ క్రమంగా పెరుగుతుండగా, రోజువారీ లావాదేవీలు 8 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇది గత బుల్రన్ సమయంలో కనిపించిన స్థాయిలకు దగ్గరగా ఉండటం విశేషం. అంటే ధర తగ్గుతున్నప్పటికీ, బిట్కాయిన్ వినియోగం,నెట్వర్క్ కార్యకలాపాలపై విశ్వాసం ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.ప్రస్తుత పరిస్థితులను బట్టి, బిట్కాయిన్ పతనమైందని అనుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో అస్థిరత మరికొంతకాలం కొనసాగవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పెట్టుబడులను విభజించడం, దశలవారీగా పెట్టుబడి పెట్టడం వంటి వ్యూహాలను అనుసరించాలని సూచిస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద, నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద నిలిచాయి.గుజరాత్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, సాక్సాఫ్ట్ లిమిటెడ్, రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ వద్ద.. టీసీఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం, వెండి!
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నేడు వరుసగా మూడో రోజూ పతనమై హ్యాట్రిక్ తగ్గుదలను నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా వరుసగా మూడో రోజు భారీగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లే టాప్ గెయినర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 0.63 శాతం లేదా 151.70 పాయింట్లు పెరిగి 24,173.35 వద్ద, సెన్సెక్స్(Sensex) 521.17 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 77,512.39 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 0.56 శాతం, 0.36 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ మంచి పనితీరు చూపిస్తుండగా నిఫ్టీ మెటల్, మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ఢమాల్!
న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3 శాతం నష్టంతో 3,980 డాలర్ల స్థాయికి పడిపోయింది. వెండి ధర అయితే ఔన్స్కు 8 శాతం నష్టపోయి 57 డాలర్లకు దిగొచ్చింది. దీంతో వీటి ధరలు ఈ ఏడాది కనిష్టాలకు చేరినట్టయింది.జనవరి 29న పసిడి ఆల్టైమ్ గరిష్టం 5,626 డాలర్లు, వెండి 121.78 డాలర్లను నమోదు చేయడం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం 29 శాతం, వెండి 50 శాతానికి పైనే నష్టపోయినట్టు లెక్క. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడడానికి తోడు యూఎస్ ఫెడ్ సమీప కాలంలోనే వడ్డీ రేట్ల పెంపును చేపడుతుందన్న అంచనాలతో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో రూ.1,200 డౌన్ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధర రూ.1,200 నష్టాన్ని చవిచూసింది. రూ.1,48,100 వద్ద ముగిసింది. వెండి కిలోకి రూ.4,000 తగ్గి రూ.2,31,000కు పరిమితమైంది. అంతక్రితం రోజు వెండి రూ.10,500 నష్టపోవడం తెలిసిందే. యూఎస్ డాలర్ పవర్ఫుల్ ర్యాలీకి తోడుగా కఠిన ద్రవ్య విధానంపై ఏర్పడిన అంచనాలతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: అవే షేర్లు నిలబెట్టాయ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద, సెన్సెక్స్ 1.04 శాతం లేదా 790.54 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రెంట్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.39 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ 2 శాతానికి పైగా లాభంతో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. మరొవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రైల్వే సంస్థలో ఆఫర్ ఫర్ సేల్.. షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ/రైల్వే శాఖకు చెందిన ఆర్థిక సంస్థ)లో కేంద్ర ప్రభుత్వం 2 శాతం వాటాల విక్రయానికి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)ను ప్రకటించింది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం ఈ విక్రయం ఆరంభమైంది. మొత్తం 26.13 కోట్ల షేర్లను.. ఒక్కోటీ రూ.91 ఫ్లోర్ ధరపై విక్రయించనుంది.బీఎస్ఈలో మంగళవారం ముగింపు ధర రూ.98.69 కంటే 7.79 శాతం తక్కువకు ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వానికి రూ.2,300 కోట్లు సమకూరనున్నాయి. ఒక శాతం వాటాను ప్రభుత్వం ఆఫర్ చేయనుందని, డిమాండ్ ఆధారంగా మరో ఒక శాతం వాటాను గ్రీన్ షూ ఆప్షన్ కింద విక్రయించనున్నట్టు పెట్టుబడులు, ప్రజాస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి అరుణీష్ చావ్లా ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు.రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభం కానుంది. ఐఆర్ఎఫ్సీలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 84.65 శాతం వాటా ఉంది. -
కరుగుతోన్న బంగారు కొండ.. వెండి ఢమాల్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున అత్యంత భారీగా పడిపోయిన పసిడి ధరలు నేడు కూడా కాస్త క్షీణించాయి. ఇక వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పతనమయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19 శాతం లేదా 46.20 పాయింట్లు పెరిగి 23,870.30 వద్ద, సెన్సెక్స్ 230.96 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,431.64 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.03 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ 1 శాతం పెరిగి ఇతర రంగాల సూచీలలో లీడ్ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆటో తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 గంటలు గడవక ముందే.. గోల్డ్ రేటు భారీ పతనం చవి చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు సంభవించింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు ఉదయం రూ.1900 (22 క్యారెట్స్ తులం), రూ.2070 (24 క్యారెట్స్ తులం) తగ్గి వరుసగా రూ. 133750, రూ.145910 వద్ద నిలిచిన 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రాని మరోమారు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు రూ.132500, రూ.144600 వద్దకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే బంగారం ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టమవుతోంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3100 రూపాయలు తగ్గి రూ.132700 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3380 రూపాయలు తగ్గి రూ.144750 వద్దకు చేరాయి.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో సాయంత్రానికి ఏ మాత్రం మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడ తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 147930 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.135600 వద్ద ఉంది.ఇదీ చదవండి: డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా? -
భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా అవతరించిన కొద్ది రోజులకే, ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' అనూహ్యమైన ఎదురుదెబ్బను చవిచూసింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ సంస్థ, మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది.నాస్డాక్లో లిస్టింగ్ అయినప్పుడు స్పేస్ఎక్స్ షేర్లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన పొందాయి. ఐపీఓ ధర 135 డాలర్లు ఉండగా, కొద్ది రోజుల్లోనే దాదాపు 67 శాతం పెరిగి 225 డాలర్ల స్థాయికి చేరాయి. ఆ సమయంలో కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానాలకు చేరుకుంది. అయితే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రారంభ ఉత్సాహం తగ్గిపోవడంతో, పెట్టుబడిదారులు కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.స్పేస్ఎక్స్ కమర్షియల్ స్పేస్ లాంచ్లు, స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, ఏఐ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. అయినప్పటికీ.. కంపెనీ విలువ చాలా ఎక్కువగా ఉండటం, ఏఐ ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయడం, అప్పులు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.ఇటీవల కంపెనీ కొత్త షేర్లు విడుదల చేయకుండా.. స్వల్పకాలిక అప్పులను తీర్చేందుకు బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించడం కూడా మార్కెట్లో మిశ్రమ సంకేతాలకు కారణం అయింది.స్పేస్ఎక్స్లో సుమారు 38 శాతం వాటా కలిగిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఈ పతనం వల్ల భారీగా తగ్గింది. కంపెనీ షేర్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పోలిస్తే, మస్క్ సంపద దాదాపు 350 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. ప్రస్తుతం ఆయన నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ప్రస్తుతం షేర్ ధరల్లో భారీ తగ్గుల కనిపిస్తున్నప్పటికీ, స్పేస్ఎక్స్ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా.. కంపెనీ త్వరలో నాస్డాక్-100 సూచీలో చేరే అవకాశం ఉండటంతో, ఇండెక్స్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారుల నుంచి అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశముంది. -
డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో డిఫ్లేషన్ (Deflation) దిశగా వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వ్యూహకర్త అమిత్ గోయెల్ చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నిపుణులు ద్రవ్యోల్బణం (Inflation) కొనసాగుతుందని భావిస్తున్నా.. అమిత్ మాత్రం పరిస్థితి వేరుగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.డిఫ్లేషన్ అంటే ఏమిటి?సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం (Inflation) అంటారు. అయితే.. దీనికి విరుద్ధంగా, వస్తువుల ధరలు నిరంతరం తగ్గుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. ఇది వినియోగదారులకు మొదట లాభంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.ఎలా అంటే.. ధరలు తగ్గితే, ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు, కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గితే.. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతుంది. దీంతో ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది.డిఫ్లేషన్కు కారణాలు ఏమిటి?అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అప్పుల భారం, కృత్రిమ మేధస్సు వల్ల ఉత్పాదకత పెరగడం డిఫ్లేషన్కు దారితీయవచ్చు.ఏఐ వినియోగం పెరగడం వల్ల.. సంస్థల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తులు, సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీని ప్రభావంగా ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు.. ప్రభుత్వాలు, సంస్థలపై పెరుగుతున్న అప్పుల భారం ఆర్థిక వృద్ధిని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.బంగారం, వెండిపై ప్రభావంసాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల వాటి ధరలు పెరుగుతాయి.కానీ.. డిఫ్లేషన్ పరిస్థితుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నగదు విలువ పెరగడం, పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని గోయల్ అభిప్రాయపడ్డారు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 76,200.68 వద్ద, నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 23,824.10 వద్ద నిలిచాయి.ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఓరియంటల్ హోటల్స్ లిమిటెడ్, కోహాన్స్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రోసెల్ టెక్సిస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, గంగా ఫోర్జింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పు..
దేశంలో బంగారం, వెండి ధరల్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. మూడు రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇక వెండి ధరలైతే మూడు రోజుల తర్వాత దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.


