Market
-
రేటెక్కిన బంగారం.. ఇప్పుడు తులం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులు నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు (జూన్ 2) పెరుగుదల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 పెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల ఆందోళనల మధ్య భారత బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్బీఐ ద్రవ్య విధాన ఫలితాలకు ముందు భయాందోళనలు సోమవారం సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 581 పాయింట్లు లేదా 0.71 శాతం క్షీణించి 80,870 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 165 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 24,586 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీసీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బీఐ నష్టాల నుంచి తప్పించుకున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున క్షీణించాయి. ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ ప్రారంభ డీల్స్ లో 8 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు యాక్టివ్గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్యూఎఫ్లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
పసిడి పలుకు: బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున కాస్త పెరిగిన పసిడి ధరలు నేడు (మే 31) నిలకడగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 31 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,460🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,350ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
జీడీపీ వృద్ధి 7.4%
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో (2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ4) 7.4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది తొలి మూడు నెలల్లో నమోదైన వృద్ధి రేటు 8.4 శాతంతో పోల్చితే ఒక శాతం క్షీణించింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) 9.2 శాతంగా ఉంది. క్యూ4తోపాటు గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తయారీ రంగం డీలా పడడం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. అదే సమయంలో వ్యవసాయ రంగం బలమైన పనితీరు నమోదు చేయడం ఊరటనిచ్చే అంశం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 330.68 లక్షల కోట్లు (3.9 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమైంది. ‘‘రియల్ జీడీపీ (ప్రామాణిక) లేదా స్థిరమైన ధరల ఆధారిత జీడీపీ 2024–25లో 187.97 లక్షల కోట్లుగా ఉంది. 2023–24 సంవత్సరానికి జీడీపీ సవరించిన అంచనాల ప్రకారం 176.51 లక్షల కోట్లుగా ఉంది. అంటే 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. నామినల్ జీడీపీ (వస్తు సేవల తుది ధరల ఆధారంగా) 2024–25లో రూ.330.68 లక్షల కోట్లుగా వచ్చింది. 2023–24 సంవత్సరానికి రూ.301.23 లక్షల కోట్లుగా ఉంది. అంటే 9.8 శాతం వృద్ధి రేటు నమోదైంది’’ అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటే, 2024 జూలై–సెపె్టంబర్ క్వార్టర్కు 5.6 శాతం, 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా జీడీపీ 5.4 శాతం వృద్ధిని సాధించింది. డీలా పడిన తయారీ రంగం → ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఎక్కువ క్షీణతను చవిచూసింది. ఈ రంగం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి పరిమితమైంది. → ఇదే కాలంలో వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధితో ఆదుకుంది. 2023–24 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2.7 శాతమే కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి పుంజుకున్నది. → గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో తయారీ రంగం వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన 11.3 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. ఈ గణాంకాల ఆధారంగా తయారీ రంగం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. → ఇక వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లోనూ మెరుగైన పనితీరు చూపించింది. వృద్ధి రేటు 5.4 శాతానికి చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్కు ఇది 0.9 శాతంగా ఉంది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 8.7 శాతంగా ఉంది. → విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 5.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది. → క్యూ4లో సేవల రంగంలో (ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు) జీవీ ఏ వృద్ధి (స్థూల విలువ జోడింపు) రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఉన్న 8.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. → ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవల పరంగా వృద్ధి క్యూ4లో 7.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 9 శాతంగా ఉంది. అంచనాల మేరకే ద్రవ్యలోటు2024–25లో 4.8 శాతం గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీలో ద్రవ్యలోటును 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించింది. రూ.15,77,270 కోట్లుగా నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్కు ప్రభుత్వం సమరి్పంచిన సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.15,69,527 కోట్ల కంటే కేవలం రూ.7వేల కోట్ల మేర (లక్ష్యంలో 105 శాతం) అదనంగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.30.36 లక్షల కోట్లుగా ఉంది. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.3 శాతానికి సమానం. 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.46.55 లక్షల కోట్లుగా ఉందని, సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.7 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 5.63 శాతంగా ఉండడం గమనార్హం. నాలుగో ఏడాది వేగవంతమైన వృద్ధిభారత్ వరుసగా నాలుగో ఏడాదీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన వృద్ధి క్రమాన్ని కొనసాగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు వెలువడడంతో ఆమె స్పందించారు. క్యూ4లో తయారీ రంగం చక్కని పనితీరు చూపించడం జీడీపీ వృద్ధి రేటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5% చేరడానికి దారితీసినట్టు చెప్పారు. ‘‘భారత్ నాలుగో ఏడాది వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కృషి వల్లే ఇది సాధ్యమైంది. మన తయారీ, సేవల సామర్థ్యాలు చురుగ్గానే ఉన్నాయి. వ్యవసాయం సైతం స్థిరమైన వృద్ధిని చూపిస్తోంది’’అని మంత్రి చెప్పారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ, మెటల్, ఆటో రంగాల్లో విస్తృత స్థాయి అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 182.01 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 81,451.01 వద్ద ముగిసింది. ఈ సూచీ 81,698.21 - 81,286.45 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 82.90 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 24,750.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,863.95 వద్ద, ఇంట్రాడే కనిష్ట స్థాయి 24,717.40 వద్ద నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.06 శాతం, 0.06 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్ నేతృత్వంలో 2.88 శాతం లాభంతో స్థిరపడింది.నిఫ్టీ మీడియా, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా ఎన్ఎస్ఈలోని మిగతా సెక్టోరల్ ఇండెక్స్లలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా దాదాపు ఒక శాతం (0.98 శాతం) నష్టపోయింది.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,955 షేర్లలో 1,581 నష్టాల్లో ముగియగా, 1,299 షేర్లు లాభాలను అందుకున్నాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది.2025 మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ ఆదాయాల తుది సెట్ను ఇన్వెస్టర్లు అంచనా వేయడం, క్యూ4 జీడీపీ గణాంకాల కోసం వేచి ఉండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య పరిణామాలను ట్రాక్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉంది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
పడి లేచిన పసిడి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గడిచిన రెండు రోజులుగా పడిపోయాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు తిరిగి రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,200 (22 క్యారెట్స్), రూ.97,310 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,310 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 పెరిగి రూ.89,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.270 పెరిగి రూ.97,460 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో కేజీ వెండి ధర రూ.1,10,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 20 పాయింట్లు తగ్గి 24,821కు చేరింది. సెన్సెక్స్(Sensex) 57 ప్లాయింట్లు దిగజారి 81,579 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.39 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్చి త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రెట్టింపై రూ. 870 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది(2025–26) టర్న్అరౌండ్ సాధించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1,598 కోట్ల నుంచి రూ. 611 కోట్లకు క్షీణించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా పెరిగి రూ. 2,276 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 1,584 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5,010 కోట్ల నుంచి రూ. 4,514 కోట్లకు డీలా పడింది.సుజ్లాన్ ఎనర్జీ లాభం దూకుడుక్యూ4లో రూ. 1,181 కోట్లుపవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ కన్సాలిడేటెడ్ నికర లాభం గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(క్యూ4)లో 5 రెట్లు దూసుకెళ్లి రూ. 1,181 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,207 కోట్ల నుంచి రూ. 3,825 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 660 కోట్ల నుంచి రూ. 2,072 కోట్లకు జంప్చేసింది. మొత్తం ఆదాయం రూ. 6,568 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు పెరిగింది.బజాజ్ ఆటో లాభం డౌన్ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10%నీరసించి రూ. 1,802 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,011 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,555 కోట్ల నుంచి రూ. 12,646 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 11,02,934 వాహనాలు విక్రయించింది. అంతక్రితం క్యూ4లో 10,68,576 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 210 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం నీరసించి రూ. 7,325 కోట్లకు చేరింది. 2023–24లో రూ.7,708 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 44,870 కోట్ల నుంచి రూ. 50,995 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన విక్రయాలు 7% పుంజుకుని 46,50,966 యూనిట్లను తాకాయి.పోకర్ణ లాభం రూ.59 కోట్లుగత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్ నికర లాభం సుమారు 280 శాతం వృద్ధి చెంది రూ. 59 కోట్లకు ఎగిసింది. ఆదాయం 62 శాతం వృద్ధి చెంది రూ. 263 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 115 శాతం పెరిగి రూ. 186 కోట్లకు, ఆదాయం 35 శాతం వృద్ధి చెంది రూ. 930 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 30 శాతం డివిడెండ్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పటిష్టమైన పనితీరు సాధించగలిగామని సంస్థ చైర్మన్ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
చిన్న పట్టణాల్లోకి నిప్పన్ ఇండియా విస్తరణ
కోల్కతా: నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చిన్న పట్టణాల్లోకి సేవలను విస్తరించడం ద్వారా మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ కావాలని చూస్తోంది. తద్వారా రానున్న 7–8 ఏళ్లలో తమ ఇన్వెస్టర్ల బేస్ను రెట్టింపు చేసుకోవాలన్న (5 కోట్లకు) లక్ష్యంతో ఉన్నట్టు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో సందీప్ సిక్కా తెలిపారు. ముఖ్యంగా తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, దాంతో ఈ ప్రాంతంపై ఎక్కువ బుల్లిష్ ధోరణితో (సానుకూలం) ఉన్నట్టు చెప్పారు. ‘‘తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా 20 శాతం వృద్ధి ఉంటే నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023–24లో ఈ ప్రాంతంలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు 38 శాతం వృద్ధిని చూస్తే.. నిప్పన్ ఇండియా సిప్ పెట్టుబడులు 55 శాతం పెరిగాయి. అదే ఏడాది జాతీయ సిప్ సగటు వృద్ధి 34 శాతంగా ఉంది. రిటైల్ మార్కెట్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోవడమే మా వ్యూహం. ముఖ్యంగా ఫండ్స్ సేవలు పెద్దగా విస్తరణకు నోచుకోని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అక్కడే వృద్ధి అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో యూనిక్ ఇన్వెస్టర్ల బేస్ 6 కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం మా ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల మేర ఉంది’’అని సంస్థ ప్రణాళికలను సిక్కా వివరించారు. అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ నిప్పన్ ఇండియా భారత్లో అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ సంస్థ అని (జపాన్కు చెందిన నిప్పన్ లైఫ్).. టాప్ 5 సంస్థల్లో బ్యాంకింగ్ స్పాన్సర్ లేకుండా ఎక్కువ వృద్ధిని తాము నమోదు చేసినట్టు సందీప్ సిక్కా తెలిపారు. 2023–24లో 27 శాతం అధికంగా 82 లక్షల ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 269 శాఖలు ఉంటే.. తూర్పున 11 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో శాఖలు కలిగి ఉన్నట్టు తెలిపారు. ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహనతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అసంఘటిత రంగం నుంచి పొదుపులు సంఘటిత రంగం వైపు మళ్లుతున్నట్టు వెల్లడించారు. తాము కొత్త పథకాల ఆవిష్కరణ కంటే ప్రస్తుత పథకాల రూపంలో మెరుగైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. భారతీయులు బంగారాన్ని ఆభరణాలుగా, పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావించి.. ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దేశంలో బంగారు ఆభరణాల వినియోగం 2026 ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 12-14 శాతం గణనీయంగా పెరుగుతుందని ''ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్'' (ICRA) వెల్లడించింది.2025 ఆర్ధిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి, 2026లో ధరలు పెరుగుతూనే ఉంటాయని ICRA తెలిపింది. సాధారణంగా గోల్డ్ రేటు పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. కానీ భారతదేశంలో శుభకార్యాలకు, శుభదినాలకు బంగారం కొనుగోలు పెరుగుతోంది. ధరలు మరింత పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా బంగారం ఆభరణాల వినియోగం అదే తరహాలో పెరుగుతుంది. ధరలు కూడా గత ఆర్ధిక సంవత్సరం కంటే.. 20 శాతం ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాలలో గోల్డ్ బార్లు, నాణేల వినియోగం వరుసగా 17 శాతం, 25 శాతం పెరిగింది.దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల చాలామంది.. పసిడి కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ బార్లు, నాణేలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.70 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 81,633.02 వద్ద, నిఫ్టీ 128.35 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 24,880.80 వద్ద నిలిచింది.మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంటీసీ), వీటో స్విచ్గేర్స్ అండ్ కేబుల్స్, ఎన్టీఎల్ గ్లోబల్, నేచురల్ క్యాప్సూల్స్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరస్, ఆల్పా లాబొరేటరీస్, లాసా సూపర్జెనరిక్స్, డీసీ ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
గోల్డ్ హాట్రిక్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు (మే 29) వరుసగా మూడో రోజూ దిగివచ్చాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 29 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,190🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,100ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 తగ్గి రూ.1,10,900 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించి రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.56 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం పడిపోయింది.పరిమిత శ్రేణి ట్రేడింగ్లో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు నిన్నటి మార్కెట్ సెషన్లో 3% పడి సూచీల పతనానికి ప్రధాన కారణమైంది. నిన్న సూచీలు ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. మే నెల వారీ ఎక్స్పైరీ గడువు ముగింపు(నేడు), దేశీయ క్యూ4 జీడీపీ, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్లో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పీఎస్యూ బ్యాంకులు, మీడియా, ఇంధన షేర్లు రాణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
హీరో ఫిన్కార్ప్ ఐపీవోకు వచ్చేస్తోంది..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం హీరో ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.వీటికి జతగా మరో రూ. 1,568 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 3,668 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. లిస్టింగ్కు వీలుగా 2024 ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ మూలధన అవసరాలకు ఎన్బీఎఫ్సీ హీరో ఫిన్కార్ప్ వినియోగించనుంది. తద్వారా రుణ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2024 మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 51,281 కోట్లుగా నమోదయ్యాయి. -
ఇండస్ఇండ్ బ్యాంక్ కథ్పాలియాపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన ఆరోపణలపై సంస్థ మాజీ సీఈవో సుమంత్ కథ్పాలియాతో పాటు మరో నలుగురికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 19.78 కోట్ల జరిమానా విధించింది. అలాగే వారు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీస్ను కొనడం, అమ్మడం లేదా ఇతరత్రా ఏ విధమైన లావాదేవీలు జరపరాదని స్పష్టం చేసింది. నిషేధం ఎదుర్కొంటున్న మిగతావారిలో అప్పటి డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ సుశాంత్ సౌరవ్, జీఎంజీ ఆపరేషన్స్ హెడ్ రోహన్ జఠన్న, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ మార్కో రావు ఉన్నారు. కీలక హోదాల్లో ఉన్న ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకి, సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, బైటికి రావడానికి ముందే తెలుస్తాయి. ఆ వివరాలను ఉపయోగించుకుని వీరు బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ చేసి లబ్ధి పొందారని సెబీ విచారణలో వెల్లడైంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 239.31 పాయింట్లు (0.29 శాతం) క్షీణించి 81,312.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 81,613.36 నుంచి 81,244.02 మధ్య ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 73.75 పాయింట్లు (0.30 శాతం) క్షీణించి 24,752.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 నేడు 24,864.25 నుంచి 24,737.05 మధ్యలో కదలాడింది. నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, నెస్లే ఇండియా షేర్లు 1.93-1.62 శాతం మధ్య నష్టపోయాయి.మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.51 - 0.63 శాతం మధ్య లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,940 షేర్లలో 1,462 లాభాల్లో ముగియగా, 1,395 షేర్లు నష్టాలను చవిచూశాయి. 83 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.విస్తృత మార్కెట్ సూచీల్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్వల్పంగా 0.02 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.33 శాతం లాభంతో ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.49 శాతం నష్టపోయింది.బ్రిటిష్ అమెరికన్ టొబాకో పీఎల్సీ (బీఏటీ) కంపెనీలో 2.5 శాతం వాటాను విక్రయించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 1.17 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో, మెటల్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ సూచీలు 0.68 శాతం వరకు నష్టపోయాయి.మరోవైపు నిఫ్టీ మీడియా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు మార్కెట్ ట్రెండ్ను అధిగమించి వరుసగా 1.04 శాతం, 0.97 శాతం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.79 శాతం క్షీణించి 18.02 పాయింట్ల వద్ద ముగిసింది. -
ఆగిన ధరలు: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!
దేశంలో బంగారం దాగుడుమూతలాడుతున్నట్లు.. ఒకసారి తగ్గుతూ, మరోసారి తగ్గుతూ ఉన్నాయి. నేడు (మే 28) మాత్రం గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 89,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,480 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు స్థిరంగా ఉండిపోయాయి. కాబట్టి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు, నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగాయియు. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో పసిడి ధరలు వరుసగా రూ. 89,350 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 97480 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిదేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 89,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 97,600 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. మొత్తం మీద దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (బుధవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 40 పాయింట్లు తగ్గి 24,781కు చేరింది. సెన్సెక్స్(Sensex) 152 ప్లాయింట్లు పడిపోయి 81,388 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 2.05 శాతం లాభపడింది. నాస్డాక్ 2.47 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ ఇటీవల మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చేవిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
హమారా.. స్కూటర్!
మన రోడ్లపై స్కూటర్లు టాప్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుముఖంతో మందగమనాన్ని ఎదుర్కొంటున్న టూవీలర్ల మార్కెట్కు ఇప్పుడు స్కూటర్లే దన్నుగా నిలుస్తున్నాయి. బైక్ అమ్మకాలతో పోలిస్తే గతేడాఇ స్కూటర్ల విక్రయాల్లో భారీగా వృద్ధి నమోదవడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమ నిఫుణులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్తో పాటు నెమ్మదిగా ద్విచక్ర వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ)కు మారుతుండటం కూడా స్కూటర్ దూకుడుకు దోహదం చేస్తోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్స్కూటర్ల అమ్మకాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘టాప్’లేపాయి. ఏకంగా 68.5 లక్షల విక్రయాలతో కోవిడ్ ముందు (2018–19)లో నమోదైన 67 లక్షల రికార్డును బ్రేక్ చేశాయి. అప్పుడు కూడా స్కూటర్ల జోరు కారణంగానే మొత్తం టూవీలర్ విభాగం దేశీ అమ్మకాలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిని (2.12 కోట్ల వాహనాలు) తాకడం గమనార్హం. కాగా, ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ గణాంకాల ప్రకారం గతేడాది స్కూటర్ల విక్రయాలు 17.36 శాతం ఎగబాకాయి. మొత్తం టూవీర్ల అమ్మకాలు 9% పెరగ్గా... బైక్ల సేల్స్ 5 శాతం మాత్రమే పుంజుకున్నాయి. పట్టణాల్లో ఫుల్ డిమాండ్... గత కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం ఇతరత్రా సమస్యలకు తోడు.. కుటుంబంలో అందరూ నడపడానికి అనువుగా ఉండటం వంటి సానుకూలతల కారణంగా స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ‘గేర్లెస్ కావడంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో నడపడం ఈజీగా ఉండటం వల్ల నిత్యం ఆఫీసులకు వెళ్లొచ్చేవారు, ముఖ్యంగా మహిళలు, నవతరం వాహనదారులు స్కూటర్లకే జై కొడుతున్నారు. పటిష్టమైన అర్బన్ డిమాండ్కు తోడు ఈవీలకు మారుతున్న వారు పెరుగుతుండటం వల్ల కూడా బైక్లతో పోలిస్తే స్కూటర్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. వాటా పైపైకి... టూవీలర్ విభాగంలో ఇప్పటికీ బైక్లదే పైచేయి. మొత్తం అమ్మకాల్లో 60 శాతం పైగా మెజారిటీ వాటాను కొల్లగొడుతున్నాయి. అయితే, గత నాలుగైదేళ్లుగా స్కూటర్ మార్కెట్ వాటా క్రమంగా పుంజుకుంటోంది. వాహన తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం 2019–20లో టూవీలర్ అమ్మకాల్లో 66 శాతంగా ఉన్న మోటార్సైకిళ్ల వాటా.. 2024–25 నాటికి 62%కి దిగొచి్చంది. మరోపక్క, స్కూటర్ల వాటా 30 శాతం నుంచి 35 శాతానికి జంప్ చేసింది. దీని ప్రకారం చూస్తే... çట్రెండ్ మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.‘ఎలక్ట్రిక్’ వేగం...ఇటీవలి కాలంలో ఈవీల జోరు పెరగడం.. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవడంతో టూవీలర్ విభాగం పుంజుకోవడానికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 2025–26లో అమ్ముడైన మొత్తం టూవీలర్లలో ఈవీల వాటా 6 శాతానికి పైగా నమోదైంది. ‘రాబోయే కాలంలో ఈవీల ధరలు దిగొచ్చే అవకాశం ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలతో స్కూటర్ పరిశ్రమలో ఈవీల వాటా మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీవీఎస్ మోటార్స్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తాజాగా పేర్కొన్నారు. 2024–25లో తొలిసారి ఈ–టూవీలర్లు 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటాయి. మొత్తం 11.4 లక్షలకు పైగా సేల్స్తో ఈ–టూవీలర్ విభాగంలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది.టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటో వంటి టూవీలర్ దిగ్గజాలతో పాటు నవతరం ఎలక్ట్రిక్ వాహన సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటివి కొంగొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో వాటా కోసం పోటీపడుతున్నాయి. స్కూటర్లలో విభిన్న వర్గాల అవసరాలకు, విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండడం కూడా ఎకానమీ బైక్లకు మించి స్కూటర్ అమ్మకాలు పుంజుకోవడానికి మరో ముఖ్య కారణమని రాధాకృష్ణన్ చెప్పారు. 2021–22లో టీవీఎస్ టూవీలర్ సేల్స్లో స్కూటర్ల వాటా 25 శాతం ఉండగా.. 2024–25లో ఇది 40 శాతానికి దూసుకెళ్లింది. గతేడాది కంపెనీ మొత్తం 47.4 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఇదిలాఉంటే, టీవీఎస్ స్కూటర్ విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ ఐక్యూబ్దే కావడం మరో విశేషం! -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో.. 81,584.94 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 24,826.20 వద్ద నిలిచాయి.నూపూర్ రీసైక్లర్స్, బోరానా వీవ్స్ లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, బజాజ్ హెల్త్కేర్, పార్శ్వనాథ్ డెవలపర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్థిరపడుతున్న ఇండెక్స్ ఆప్షన్స్ మార్కెట్
నియంత్రణ నిబంధనలు కఠినతరం కావడంతో వరుసగా మూడు నెలల పాటు క్షీణించిన ఇండెక్స్ డెరివేటివ్స్, ఆప్షన్స్ మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. మార్కెట్ వర్గాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయనడానికి వాల్యూమ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి కఠినతర నిబంధనల అమలు కారణంగా ఇండెక్స్ ఆప్షన్లలో ట్రేడింగ్ లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.ఇదీ చదవండి: జెప్టో కేఫ్ల మూసివేత..?2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంతో పోలిస్తే 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి మధ్య సగటున రోజువారీ ప్రీమియం టర్నోవరు 18 శాతం క్షీణించింది. ఆప్షన్స్ కాంట్రాక్టుల సంఖ్య 60 శాతం పడిపోయింది. రూ. 10,000 లోపు నెలవారీ ప్రీమియం టర్నోవరు ఉండే ఇన్వెస్టర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2025 మార్చిలో 49 శాతం తగ్గింది. 2024–25 నాలుగో త్రైమాసికంలో తొమ్మిది సెక్యూరిటీస్ బ్రోకింగ్ సంస్థలపై నిర్వహించిన సర్వే ప్రకారం వాటి ఆదాయం 19 శాతం, లాభదాయకత 26 శాతం తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ ట్రేడింగ్ కార్యకలాపాలు చారిత్రక స్థాయుల కన్నా అధికంగానే ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. -
అంతకంతకూ పెరుగుతున్న పసిడి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,950 (22 క్యారెట్స్), రూ.98,130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.450, రూ.490 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,130 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.90,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.98,280 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల వరుస లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 220 పాయింట్లు తగ్గి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 743 ప్లాయింట్లు పడిపోయి 81,431 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1 శాతం పడిపోయింది.ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ సోమవారం అరశాతానికిపైగా లాభపడింది. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చాయి. అమెరికా కరెన్సీ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలు కలిసిరావడంతో నిన్నటి మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలపడి 85.10 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు.. స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
గెట్.. సెట్.. గ్రో!
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ బిలియన్ డాలర్ల(రూ. 8,500 కోట్లు)వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రో బ్రాండుతో కంపెనీ రిటైల్ బ్రోకింగ్ సర్వీసులందించే సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీసహా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రోలో ఇప్పటికే పీక్ ఎక్స్వీ, టైగర్ క్యాపిటల్, సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్ సీఈవో) తదితరులు ఇన్వెస్ట్ చేశారు. ఇష్యూ నిధులను టెక్నాలజీ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రస్తుత విలువ 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు)కు చేరుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వేగంగా విస్తరించిన కంపెనీ 2025 మార్చికల్లా 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం గతేడాది(2024–25) 34 లక్షల మంది కొత్త కస్టమర్లను జత చేసుకుంది. మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 95 లక్షల నుంచి 1.29 కోట్లకు ఎగసింది. 2023లో కంపెనీ టర్న్అరౌండ్ సాధించి రూ. 449 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,277 కోట్లను తాకింది. 2024కల్లా ఆదాయం రూ. 3,145 కోట్లకు ఎగసింది. రూ. 535 కోట్ల నిర్వహణ లాభం సాధించినప్పటికీ రూ. 1,340 కోట్ల వన్టైమ్ పన్ను చెల్లింపుల కారణంగా రూ. 805 కోట్ల నికర నష్టం ప్రకటించింది. -
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా బిట్కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేస్తుందో వివరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేసిందో నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా సులభం. అయితే ప్రతి ఒక్కరూ ఎందుకు బిట్కాయిన్ కొనుగోలుచేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరో రెండేళ్లలో 0.01 బిట్కాయిన్ కూడా చాలా అమూల్యమైందిగా మారుతుందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.బిట్కాయిన్ విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులుగా మారడానికి, ఆర్థికంగా స్వేచ్ఛను పొందటానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోండి.. అని కియోసాకి అన్నారు. బిట్కాయిన్ విలువ మాదిరిగానే.. బంగారం విలువ కూడా భారీగా పెరుగుతుందని చాలా రోజుల నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు.ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకిబిట్కాయిన్ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 0.57 శాతం పెరిగి రూ.93.38 లక్షలకు చేరింది. పెరుగుతోంది. అమెరికా సెనేట్లో స్టేబుల్కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని విలువ మరింత పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు.I cannot believe how easy Bitcoin has made getting rich…so easy.Why everyone is not buying and holding Bitcoin is beyond me.Even .01 of a Bitcoin is going to be priceless in two years…. and maybe make you very rich.Sure Bitcoin goes up and down….but so does real life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 26, 2025 -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455.38 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 82,176.45 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 25,001.15 వద్ద నిలిచాయి.శ్రేయాన్స్ ఇండస్ట్రీస్, ఖైతాన్ (ఇండియా), ఎక్సారో టైల్స్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్, వాక్స్టెక్స్ కాట్ఫ్యాబ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫేజ్ త్రీ, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఎమ్బి ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?
రాబోయే బోర్డు సమావేశంలో మార్కెట్లో సులభతర వ్యాపారాన్ని పెంపొందించడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 18న జరిగే ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులోని కొన్నింటి గురించి కింద తెలియజేశాం.పేపర్ వర్క్ను తగ్గించడానికి, కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్(క్యూఐపీ)ల నిబంధనలు క్రమబద్ధీకరించడం.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులను (ఇన్వీట్లు) ఈక్విటీలతో అనుసంధానం చేయడం వల్ల ఈ రంగాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.కో-ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్స్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లను సులభతరం చేయడం.ప్రభుత్వ బాండ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) నిబంధనలను సడలించడం.చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నిబంధనలను బలోపేతం చేయడం.క్లియరింగ్ కార్పొరేషన్ల స్వతంత్రతను ఖరారు చేయడం.ఇదీ చదవండి: 5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలుఈ ప్రతిపాదనలను మెరుగుపరచడానికి స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సహా పరిశ్రమ వాటాదారులతో సెబీ సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ పారదర్శకత, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా. -
గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఇప్పుడు...
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజుల క్రితం గణనీయంగా పెరిగిన పసిడి ధరలు నేడు (మే 26) కాస్త దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి. వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించిపెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
25,000 మార్కుపైన నిఫ్టీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 185 పాయింట్లు పెరిగి 25,035కు చేరింది. సెన్సెక్స్(Sensex) 623 ప్లాయింట్లు ఎగబాకి 82,326 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.79 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1 శాతం పడిపోయింది.దేశీయంగా ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి–మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్, కరెన్సీ అప్డేట్స్
నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
మళ్లీ ఐపీవోల హవా
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి నెలకొంది. ఈ బాటలో మరో నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్ల తలుపు తట్టనున్నాయి. ఈ వారం ఇష్యూలు ప్రారంభంకానున్న కంపెనీల జాబితాలో లీలా ప్యాలసెస్ హోటల్స్ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ చేరాయి. ఇతర చిన్న సంస్థలలో ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ ఐపీవోకు రానున్నాయి. మరోపక్క గత వారం ఇష్యూలను పూర్తి చేసుకున్న బొరానా వీవ్స్(28న), బెల్రైజ్ ఇండస్ట్రీస్(29న) లిస్ట్కానున్నాయి. లీలా ప్యాలసెస్ ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు షేరుకి రూ. 413–435 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 3,500 కోట్ల సమీకరణపై కన్నేసింది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏజిస్ వొప్యాక్ లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ రూ. 223–235 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్కోడా ట్యూబ్స్స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబులు, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ రూ. 130–140 ధరల శ్రేణిలో ఈ నెల 28–30 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 220 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ సమీకృత పవర్ సొల్యూషన్ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 95–105 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమూ 29న ముగియనుంది. తద్వారా రూ.168 కోట్లు సమకూర్చుకోనుంది. -
జీడీపీ గణాంకాలపై ఫోకస్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా యూఎస్, భారత్ జీడీపీ గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ వివరాలు, రుతుపవనాల తీరు తదితర పలు అంశాలు సైతం ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇటు దేశీ, అటు విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా పలు ఆర్థిక గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. దేశీయంగా చూస్తే ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), త యారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి –మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. విదేశీ అంశాలు ఏప్రిల్ నెలకు యూఎస్ మన్నికైన వస్తు ఆర్డర్లు 27న, కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్(ఎఫ్వోఎంసీ) గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్) 28న విడుదలకానున్నాయి. 29న క్యూ1 జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి. ఇదే రోజు మే నెలకు జపాన్ కన్జూమర్ కాని్ఫడెన్స్ ఇండెక్స్ వెల్లడికానుంది. 30న యూఎస్ ఏప్రిల్ పీసీఈ ధరల ఇండెక్స్ విడుదలకానుంది. కాగా.. చైనాసహా ఇతర దేశాలతో యూఎస్ వాణిజ్య చర్చలకు ప్రాధాన్యమున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. కొద్ది రోజులుగా మళ్లీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నప్పటికీ కొన్ని సెషన్లలో అమ్మకాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని నిపుణులు పేర్కొన్నారు. క్యూ4 ఫలితాలు ఇప్పటికే క్యూ4(జనవరి–మార్చి2025) ఫలితాల సీజన్ ముగింపునకురాగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాల పనితీరు వెల్లడికానుంది. జాబితాలో బజాజ్ ఆటో, ఐఆర్సీటీసీ, అరబిందో ఫార్మా తదితరాలున్నాయి. ఈ ఏడాది అంచనాలకంటే ముందుగానే రుతుపవనాలు కేరళను తాకడం, కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ అత్యధిక డివిడెండ్ చెల్లింపు సానుకూల అంశాలుకాగా.. యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్తోపాటు, ప్రభుత్వ రుణ భారం అధికమవుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత వారాంతాన ఆర్బీఐ ప్రభుత్వానికి రూ. 2.69 లక్షల రికార్డ్ డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. సాంకేతికంగా గత వారం మార్కెట్లు స్వల్పంగా డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 610 పాయింట్లు(0.75 శాతం) క్షీణించి 81,721 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు(0.7 శాతం) నష్టంతో 24,853 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ మాత్రం 0.95 శాతం ఎగసింది. సాంకేతికంగా ఈ వారం నిఫ్టీకి 24,950–25,000 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ బాటలో సెన్సెక్స్కు 82,500–83,000 పాయింట్లవద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. -
ఎఫ్అండ్వో.. ఓ డేంజర్ ‘గేమ్’!
ప్రసాద్ (55) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలి మార్కెట్ దిద్దుబాటుకు ముందు ఎఫ్అండ్వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఒక ప్రైవేటు సంస్థ సిఫారసులతో ట్రేడ్ చేయగా.. ఒక్కరోజులోనే రూ. లక్షన్నర లాభం కళ్లజూడడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్రేడింగ్ చేశాడు. పది రోజుల తర్వాత అకౌంట్ చూసుకుంటే అప్పటి వరకు వచ్చిన లాభాన్నంతా మళ్లీ మార్కెట్టే పట్టుకుపోయిందని అర్థమైంది. అంతేకాదు, అదనంగా రూ.2 లక్షల పెట్టుబడి కూడా కరిగిపోయింది. అయినా సరే పోయినచోటే వెతుక్కోవాలనే తపనతో.. ప్రసాద్ పొద్దస్తమానం ఎఫ్అండ్వో ఆలోచనలతో బతికేస్తున్నాడు. ఎఫ్అండ్వో మార్కెట్ విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ల పరిణతి లేమికి మచ్చుకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే! సెబీ అధ్యయనం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్వో విభాగంలో ప్రతి 10 మంది ట్రేడర్లకు గాను లాభం పొందింది ఒక్కరే. 91.1 శాతం మంది (73 లక్షల మంది సుమారు) ఎఫ్అండ్వోలో నష్టాలు పోగేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8.9 శాతం మందిలో రూ. లక్షపైన లాభం సొంతం చేసుకున్నది కూడా కేవలం ఒక్క శాతమే ఉన్నారు. 75 శాతానికి పైగా ఎఫ్అండ్వో ట్రేడర్లు 2023–24లో తమ ఆదాయం రూ.5 లక్షల్లోపే అని వెల్లడించడం వీరంతా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారన్నది స్పష్టం చేస్తోంది. అంతేకాదు వీరంతా అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఎఫ్అండ్వో చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల ‘గేమ్’ కానే కాదని నిపుణులు తరచూ చెప్పేది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీపడే సామర్థ్యాలు, వసతులు, నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లకు లేకపోవడంతో ఎఫ్అండ్వోలో నెగ్గలేని పరిస్థితి. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలు, టెక్నాలజీ, వసతులతోనే ఎఫ్అండ్వోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైనదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. వేగంగా లాభాలు అసాధ్యం! కరోనా విపత్తు తర్వాత ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2019లో 3.93 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే అవి ప్రస్తుతం 19.24 కోట్లకు పెరగడం దీనికి నిదర్శనం. కొత్త ఇన్వెస్టర్లలో ప్రధానంగా కనిపించే సమస్య.. లాభాల ఆకాంక్షలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కొద్ది పెట్టుబడితోనే భారీగా సంపాదించేయొచ్చన్న అత్యాశ వారిని ఎఫ్అండ్వో మార్కెట్వైపు ఆకర్షిస్తోంది. ‘‘డెరివేటివ్లు (ఎఫ్అండ్వో) అన్నవి హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, యాక్టివ్ ట్రేడింగ్ కోసం రూపొందించినవి. కానీ, ప్రస్తుత రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేటివ్ ట్రేడింగ్వైపే మొగ్గు కనిపిస్తోంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎఫ్అండ్వోలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా దీన్నొక ఆదాయ మార్గంగా చూస్తుండడం మరింత రిస్్కను ఆహ్వానించడమే అవుతుంది. రుణంతో మరింత రిస్క్ ఎఫ్అండ్వో మార్కెట్లో మార్జిన్ ఫండింగ్, వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్కు సైతం రిటైల్ ఇన్వెస్టర్లు వెనుకాడడం లేదు. ట్రేడ్లతో నష్టపోయి.. తమవద్ద పెట్టుబడి సరిపోక రుణ సదుపాయంతో పొజిషన్లు తీసుకుంటున్నారు. లాభంతో తీర్చేయొచ్చన్న అంచనాలతో మరింత రిస్క్ తీసుకుంటున్నారు. నష్టం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. ఇన్వెస్టర్లలో ప్రవర్తనా పరమైన బలహీనతలు సైతం అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రేడ్లో నష్టం రాగా, తదుపరి ట్రేడ్లో లాభం వస్తుందన్న అతివిశ్వాసం పనికిరాదంటున్నారు. ‘‘ఆప్షన్ ధరల తీరు, నమూనాలు, డెరివేటివ్లను సరిగ్గా అర్థం చేసుకోకుండా.. యూట్యూబ్ ఛానళ్లను చూడడం, సోషల్ మీడియా గురువులను అనుసరించడం లేదంటే వాట్సాప్ గ్రూప్లలో చేరడం ద్వారా ఎఫ్అండ్వోలో లాభాలు సంపాదించేయగలమన్నది తప్పుడు అవగాహనే అవుతుంది’’ అని ప్రైమ్ వెల్త్కు చెందిన సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్పీ) అలోక్ దూబే పేర్కొన్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లలో సరైన విజ్ఞానం, క్రమశిక్షణ ఉండడం లేదన్నారు. ఇవి లేకుండా ఎఫ్అండ్వో ట్రేడింగ్ గ్యాంబ్లింగే అవుతుందని హెచ్చరించారు. పెద్ద సవాలు.. ఎఫ్అండ్వో ట్రేడింగ్ అన్నది ఎంతో సంక్లిష్టమైనదని నిపుణుల విశ్లేషణ. మార్కెట్, స్టాక్స్ కదలికలు దేశీ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఉంటాయి. కనుక ఒక స్టాక్ పెరుగుతుందా? పడుతుందా? అని ఊహించడం అసాధ్యం. ఈ సవాళ్లను అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి. ట్రేడ్స్ ఎంపికకు స్పష్టమైన, నిర్మాణాత్మకమైన విధానం లేకుండా ఎఫ్అండ్వో మార్కెట్లోకి అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పిదమని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. అసలు ఎఫ్అండ్వో మార్కెట్ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. క్యాష్ మార్కెట్ లేదా ఎఫ్అండ్వో లేదా కమోడిటీలు ఇలా ఏ విభాగమైనప్పటికీ కాల పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసమరని.. అవి లేకుండా ట్రేడింగ్ చేయడం అవకాశమే కానీ, నైపుణ్యం కాబోదన్నారు. ‘‘ఎఫ్అండ్వో వారం, నెలవారీ సిరీస్లలో రోజులు గడుస్తూ, ఎక్స్పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చలనం లేకపోతే, అప్పుడు ఆప్షన్ల విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఒక వ్యూహం ఫలించి మంచి లాభం వచ్చినప్పటికీ.. అదే వ్యూహం ప్రతి రోజూ ఫలితమిస్తుందని గ్యారంటీ లేదు’’ అని అగర్వాల్ వివరించారు. ఫిన్ఫ్లుయెన్సర్స్ మాయలోపడితే అంతే.. బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ప్రకారం.. ఎఫ్అండ్వోలోకి ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు అడుగు పెట్టడం వెనుక ఆర్థిక ప్రభావశీలురు (ఫిన్ఫ్లూయెర్స్) పరోక్ష ప్రోద్బలం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎఫ్అండ్వోలో తాము పెద్ద మొత్తంలో సంపాదించామంటూ యూట్యూబ్, ఎక్స్ ప్లాట్ఫామ్, ఇన్స్టా్రగామ్లపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. అప్పటి వరకు ఎఫ్అండ్వో మొహం చూడని వారు సైతం ట్రేడింగ్కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ప్రభావశీలురులో రాబడులను ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్్కలు, ట్రేడింగ్ స్ట్రాటజీలను వెల్లడించడంపై ఉండదు. దీంతో ఎఫ్అండ్వో ట్రేడింగ్ ధనవంతులు కావడానికి సులభ మార్గం అన్న తప్పుడు అభిప్రాయానికి దారితీస్తోంది. అందుకే ఫిన్ఫ్లుయెన్సర్స్ తీరును నియంత్రించేందుకు సెబీ ఎన్నో కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇన్స్టిట్యూటషనల్ ఇన్వెస్టర్లదేపైచేయి ఎఫ్అండ్వో మార్కెట్లో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి.. అతి కొద్ది మంది బడా ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సమర్పయామిగా మారుతోంది. ‘‘ఎఫ్అండ్వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లకు స్పష్టమైన అనుకూలతలు ఉన్నాయి. గొప్ప టెక్నాలజీ వసతులు, ట్రేడ్లపై తక్కువ చార్జీలు, క్రమశిక్షణతో కూడిన విధానాలు వారి సొంతం’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిసింగ్ వివరించారు. 2023–24లో ప్రొప్రయిటరీ ట్రేడర్లు (బ్యాంక్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజీలు తదితర) రూ.33,000 కోట్లు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.28,000 కోట్ల చొప్పున ఎఫ్అండ్వో మార్కెట్లో లాభాలు పోగేసుకున్నారు. రిటైల్ ట్రేడర్లు ఉమ్మడిగా రూ.61,000 కోట్లు నష్టపోయారు. లావాదేవీల చార్జీలు దీనికి అదనం. ‘‘అతి విశ్వాసం, పాక్షిక వాదం తదితర ప్రవర్తనా లోపాలకు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఉచ్చులోకి లాగేవి ఇవే. అత్యాధునిక టూల్స్, వ్యయాల పరంగా సానుకూలత, సహేతుక నిర్ణయాలు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఎఫ్అండ్వో మార్కెట్లో అనుకూలిస్తున్నాయి’’ అని రవిసింగ్ తెలిపారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఆల్గోరిథమ్ ట్రేడింగ్ (ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు, విక్రయాలు చేయాలన్న కోడింగ్ సాఫ్ట్వేర్) అత్యంత అనుకూలించే అంశం. ప్రొప్రయిటరీ ట్రేడర్లలో 96 శాతం మందికి లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నట్టు రవిసింగ్ తెలిపారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ధరల గమనం ఆధారంగా వేగంగా కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను ఆల్గోరిథమ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ పూర్తి చేస్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో 13 శాతం మందే ఆల్గోరిథమ్ ట్రేడింగ్ వినియోగిస్తున్నారు. ‘‘ఇనిసిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తాజా మార్కెట్ సమాచారాన్ని మైక్రో సెకన్లలోనే తెలుసుకోగలరు. ఆప్షన్లతో హెడ్జ్ చేసుకోగలరు. వోలటాలిటీ స్ప్రెడ్స్ (తటస్థ ఆప్షన్ విధానం), నేరుగా మార్కెట్ యాక్సెస్, తక్కువ చార్జీలు వారికి అనుకూలం. రిటైల్ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాపై ఆధారపడుతుంటారు. ట్రేడ్వారీ చార్జీలు వీరికి ఎక్కువ. అంచనాలు తప్పడం, సోషల్ మీడియా టిప్స్ వారికి ప్రతికూలం’’ అని రవిసింగ్ వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్ల తప్పటడుగులు → ఫ్యూచర్స్, ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలియకుండా ఎఫ్అండ్వోలోకి పెట్టుబడితో అడుగుపెట్టడం. → మార్కెట్ సంకేతాలను, కాంట్రాక్టుల సంక్లిష్టతలను తప్పుగా అర్థం చేసుకోవడం. → మార్జిన్ ఫండింగ్తో ట్రేడ్లు చేయడం. → నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్లాస్ ఆర్డర్లను వినియోగించుకోకపోవడం. → స్పష్టమైన ప్రణాళిక లేకుండా అత్యాశ, భయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. → నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మరిన్ని ట్రేడ్లు చేయడం. → తరచూ ట్రేడ్లు చేయడం ద్వారా చార్జీల రూపంలో అధికంగా నష్టపోవడం. → ప్రతికూల పరిణామాల్లోనూ ట్రేడ్లు కొనసాగించడం. → ఎలాంటి వ్యూహాలు లేకుండా మార్కెట్లో వచ్చే సమాచారం ఆధారంగా స్వీయ అంచనాలతో ట్రేడ్లు చేయడం. ప్రయోజనాలు వేరు.. ఎఫ్అండ్వో అన్నది నిజమైన స్టాక్స్ కాకుండా డిజిటల్ కాంట్రాక్టులు. కనుక 10–20 శాతం మార్జిన్తోనే 100 శాతం విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్లు అయితే ఇంకా తక్కువ పెట్టుబడికే వస్తాయి. మార్కెట్ పతనాల్లో స్టాక్స్ హోల్డింగ్స్ విలువను కాపాడుకునేందుకు ఎఫ్అండ్వోను హెడ్జింగ్ టూల్ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటారు. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీలు తెలియవు. పైగా వారి పెట్టుబడి హెడ్జ్ చేసుకునే స్థాయిలోనూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల తరఫున ఫండ్ మేనేజర్లు ఈ హెడ్జింగ్ టూల్స్ను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. సెబీ ఇటీవలే అనుమతించిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) అనే కొత్త మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అయితే ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తుల్లో గరిష్టంగా 20 శాతం వరకు ఎఫ్అండ్వో ఎక్స్పోజర్ తీసుకునేందుకు అనుమతి ఉంది. కనుక రిస్క్ ఉన్నా అధిక రాబడి కోరుకునే వారు సిఫ్లను పరిశీలించొచ్చు. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి మార్గం..? ‘‘భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు, అపరిమిత ట్రేడింగ్, స్టాప్లాస్లను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం పెట్టుబడిని వేగంగా హరించేస్తుంది. విజయవంతమైన ట్రేడింగ్ అంటే సానుకూల పరిస్థితుల్లో లాభాలు ఆర్జించడమే కాదు. క్రమశిక్షణతో ప్రతికూలతలను అధిగమించి పెట్టుబడిని కాపాడుకోవడం కూడా’’ అని సహజ్ అగర్వాల్ తెలిపారు. → డెరివేటివ్లకు సంబంధించి సాంకేతిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. మార్జిన్ అవసరాలు, అస్థిరతలు, ఆప్షన్ ధరల తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అంశాలు తెలియాలి. – సంప్రదాయ స్టాక్స్లో పెట్టుబడులతో పోలి్చనప్పుడు ఎఫ్అండ్వోలో పెట్టుబడులపై ప్రాథమి క అవగాహన ఒక్కటే సరిపోదు. తగినంత వి జ్ఞానం కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. వేగంగా లాభాలు సంపాదించాలన్న కాంక్షతో చాలా మంది రిటైల్ ట్రేడర్లు దీన్ని విస్మరిస్తుంటారు. – దశాబ్దాల అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ టూల్స్, పెట్టుబడి బలంతో ఉన్న ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పోటీపడాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి. – స్పెక్యులేటివ్ ధోరణిని వీడి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, హెడ్జింగ్ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలి. – ఆర్థిక ప్రభావశీలురు, తప్పుదోవ పట్టించే కంటెంట్కు దూరంగా ఉండాలి. ట్రేడింగ్, సాంకేతిక అంశాలపై విఖ్యాత ఇన్వెస్టర్లు రాసిన పుస్తకాలను చదవి అపోహలు తొలగించుకోవాలి. ‘‘ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ రెండూ విరుద్ధమైనవి. పెట్టుబడులకు సహనం, దీర్ఘకాల దృష్టి అవసరం. ట్రేడింగ్లో రిస్్కతో కూడిన తక్షణ వ్యూహాత్మక చర్య అవసరం. అవగాహన కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తమ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్కు పరిమితం కావడం మంచిది. ఈ విషయంలోనూ నిపుణుల మార్గదర్శనం అవసరమే’’ అని సహజ్ అగర్వాల్ సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరగబోతోంది, ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, బంగారం రూ.21 లక్షలకు చేరుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా చాలా మంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.రాబర్ట్ కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను ''గ్రేషమ్స్ లా, మెట్కాల్ఫ్ లా'' గురించి వివరిస్తూ.. ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు. 'డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు' అని పేర్కొన్నారు.గ్రేషమ్స్ లా ప్రకారం.. 'చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు.. మంచి డబ్బు దాగిపోతుంది'. ఎలా అంటే యూఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోయే అవకాశం ఉంది. నిజమైన డబ్బును ఆదా చేయాలంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.మెట్కాల్ఫ్ లా అనేది.. నెట్వర్క్స్. దీనికి ఉదాహరణగా ''మెక్డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ నెట్వర్క్. మామ్ పాప్ బర్గర్స్ అనేది కాదు. ఫెడెక్స్ ఒక నెట్వర్క్. జో వన్-ట్రక్ డెలివరీ అనేది కాదు'' అని కియోసాకి వివరిస్తూ.. నేను బిట్కాయిన్లో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అది ఒక నెట్వర్క్.. అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు. మీరు ధనవంతులు కావాలనుకుంటే.. చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..''వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి, ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు'' అనే మైఖేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. నేను యూఎస్ డాలర్లను ఆదా చేయను, ఎందుకంటే పొదుపు అనేది గ్రేషమ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే నేను నెట్వర్క్లు లేని చెత్త నాణేలలో పెట్టుబడి పెట్టను, ఎందుకంటే అవి మెట్కాల్ఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. అందుకే నేను బంగారం, వెండి, బిట్కాయిన్ల మీదనే పెట్టుబడి పెడతాను. అయితే ఈ చట్టాలని పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారు.ARE YOU BREAKING the LAWS?Most poor people are poor…. because they break the 2 most important laws of money.LAW #1: GRESHAM’s LAW: “When bad money enters a system….good money goes into hiding”In Rich Dad Poor Dad….I stated….“ Savers are losers.” In 2025 poor people…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2025 -
అంతకు మించి పెరిగిన బంగారం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు నేడు (మే 24) అంతకుమించి దూసుకుపోయాయి. దీంతో బంగారం తగ్గిందేలే అనుకుంటే మళ్లీ పెరిగిందంటూ కొనుగోలుదారులకు నిట్టూర్పు తప్పలేదు. మే 24 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.👉ఇది చదివారా? బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,230🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి. వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 తగ్గి రూ.1,10,900 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించి రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
IPO: కొత్త షేర్లు.. కొనుక్కుంటారా?
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 130–140 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 27న షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 220 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 220 కోట్లు అందుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 100 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఇష్యూ నిధులను సీమ్లెస్, వెల్డెడ్ ట్యూబ్స్, పైప్స్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను కేటాయించనుంది. ధరల శ్రేణి ప్రకారం కంపెనీ విలువను రూ. 840 కోట్లుగా బ్రోకరేజీలు అంచనా వేశాయి. ఈపీసీ, ఇండస్ట్రియల్ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో వీటిని వినియోగిస్తారు.27 నుంచి బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ఐపీవో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ప్రతిపాదిత ఐపీవో మే 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు మే 26 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది.పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరు ధర శ్రేణి 132–135గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ. 40.50 కోట్లు సమీకరించనున్న బ్లూ వాటర్ సంస్థ ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫాంలో లిస్ట్ కానుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వాహనాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. -
పెరిగిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్) నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 253 కోట్లకు పెరిగింది. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 168 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. రూ. 2,570 కోట్ల నుంచి రూ. 2,977 కోట్లకు చేరింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నష్టం రూ. 829 కోట్ల నుంచి రూ. 817 కోట్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయం పనులు మార్చి ఆఖరు నాటికి సుమారు 69 శాతం పూర్తయినట్లు జీఏఎల్ తెలిపింది. నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ కొత్తగా జారీ చేసిన టారిఫ్ ఆర్డరుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆదాయం, లాభదాయకత మరింత మెరుగుపడతాయని పేర్కొంది. ఈ ఆర్డరు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచి్చంది. దీన్ని గత ఆర్థిక సంవత్సరంలోనే జారీ చేసి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని సంస్థ వివరించింది. జీఏఎల్ లో భాగమైన సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, మోపా (గోవా) విమానా శ్రయాలను నిర్వహిస్తున్నాయి. అటు ఇండొనేషియాలోని మెడాన్ ఎయిర్పోర్ట్, గ్రీస్లోని క్రెటే ఎయిర్పోర్టు కూడా కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో జీఏఎల్ షేరు రెండు శాతం పైగా క్షీణించి రూ. 86.83 వద్ద క్లోజయ్యింది. -
రూ.94 లక్షలు దాటేసిన బిట్కాయిన్: తొలిసారి..
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్కాయిన్ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్కాయిన్ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. గురువారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్లో బిట్కాయిన్ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్లను దాటేసింది. రెండవ స్థానంలో ఉన్న ఈథర్ విలువ కూడా 7.3 శాతం పెరిగింది. అమెరికా సెనేట్లో స్టేబుల్కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బిట్కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ గరిష్టాలకు నెమ్మదిగా కదులుతోందని.. ఫాల్కన్ఎక్స్ లిమిటెడ్లోని గ్లోబల్ కో-హెడ్ ఆఫ్ మార్కెట్స్ జాషువా లిమ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..మైఖేల్ సాయిలర్ అనుబంధ సంస్థ ఇప్పటికే.. 50 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ) విలువైన బిట్కాయిన్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా.. కన్వర్టిబుల్ బాండ్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ వంటి అనేక కొత్త టెక్ కంపెనీలు కూడా వివిధ మార్గాల్లో బిట్కాయిన్లను కొనుగోలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో బిట్కాయిన్ విలువ మరింత భారీగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
పసిడి ధర పతనం! తులం ఎంతంటే..
ప్రస్తుత కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లవైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,400 (22 క్యారెట్స్), రూ.97,530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.350, రూ.380 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,530 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.350 దిగి రూ.89,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.380 తగ్గి రూ.97,680 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా శుక్రవారం పడిపోయాయి. గురువారం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్లు లేదా 0.90 శాతం లాభంతో.. 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి.సిగ్మా సాల్వ్, ఖైతాన్ (ఇండియా), క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైప్స్, హొనస కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, కృతి న్యూట్రియంట్స్, సంఘ్వీ మూవర్స్, ది గ్రోబ్ టీ, యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం లాభపడింది.అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్ సెషన్లో సెన్సెక్స్ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్ బాండ్ ఈల్డ్స్ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలురూపాయి 36 పైసలు క్రాష్విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్ఎస్ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్వోసీ కోసం సెబీకి ఎన్ఎస్ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
భారత్పై బ్రూక్ఫీల్డ్ భారీ అంచనాలు
ముంబై: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే బ్రూక్ఫీల్డ్ అస్సెట్ మేనేజ్మెంట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) వచ్చే మూడేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 100 బిలియన్ డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు సుమారు) చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ ఏయూఎం వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సంస్థ ప్రెసిడెంట్ కానర్ టెస్కే తెలిపారు. ఇదే సమయంలో భారత్ తదితర వర్ధమాన మార్కెట్లలో వృద్ధి మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారత్లో ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో బ్రూక్ఫీల్డ్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులను మూడు లేదా నాలుగింతలు చేసుకోగలమన్న అంచనాతో ఉన్నట్టు టెస్కే చెప్పారు. భారత జీడీపీ వృద్ధి 5.5 శాతానికి పడిపోయినా తమ ఆస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. భారత్ మాదిరి ఆర్థిక వ్యవస్థకు అది మెరుగైన రేటే అవుతున్నారు. విలీనాలు.. కొనుగోళ్లు.. ప్రధానంగా విలీనాలు, కొనుగోళ్ల రూపంలో భారత్లోని తమ నిర్వహణ ఆస్తులు పెంచుకోనున్నట్టు కానర్ టెస్కే తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వ్యాపార వృద్ధిపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. భారత్ వేగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెబుతూ.. స్థిరమైన సరఫరా వ్యవస్థల కోసం చూసే కంపెనీలకు గమ్యస్థానం అవుతుందన్నారు. మౌలిక సదుపాయాలపై అధిక వ్యయాలు చేస్తుండడంతో ఈ రంగంలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో పెట్టుబడులపై రాబడులు తమ అంచనాలకు అనుగుణంగా లేదా అంతకుమించే ఉన్నట్టు టెస్కే తెలిపారు. బ్రూక్ఫీల్డ్ నిర్వహణ ఆస్తుల్లో 12 బిలియన్ డాలర్లు ఇన్ఫ్రాలో, మరో 12 బిలియన్ డాలర్నలు రియల్ ఎస్టేట్లో ఉండగా.. పునరుత్పాదక ఇంధన రంగంలో 3 బిలియన్ డాలర్లు, ప్రైవేటు ఈక్విటీలో 3.6 బిలియన్ డాలర్ల మేర నిర్వహిస్తోంది. యూఎస్ అనుసరిస్తున్న టారిఫ్ల విధానంతో భారత్కు ఎక్కువ ప్రయోజనకరమని టెస్కే అభిప్రాయపడ్డారు. -
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025 -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..
భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు. -
ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు?
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 413–435 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2025 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 3,900 కోట్లుగా నమోదైంది. లీలా బ్రాండ్ సంస్థ 12 హోటళ్ల ద్వారా మొత్తం 3,382 గదుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ఏజిస్ వొప్యాక్లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 223–235 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.తొలుత రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 2,016 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. ఈ నిధులతో మంగళూరులో క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్ను కొనుగోలు చేయనుంది.కాగా.. కంపెనీ విలువను రూ. 26,000 కోట్లుగా బ్రోకరేజీలు మదింపు చేశాయి. 2024 జూన్కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,584 కోట్లుగా నమోదైంది. కంపెనీ దేశవ్యాప్తంగా పెట్రోలియం, లూబ్రికెంట్స్, కెమికల్స్, ఎల్పీజీ, ప్రొపేన్ తదితర లిక్విడ్స్, గ్యాస్ సంబంధ స్టోరేజీ సౌకర్యాలను కలిగి ఉంది. కీలక పోర్టులకు సమీపంలో టెర్మినళ్లను ఏర్పాటు చేసింది.షిప్రాకెట్ ఐపీవో బాట Shiprocket IPO: ఈకామర్స్ సంస్థలకు సర్వీసులందించే షిప్రాకెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా ప్రాస్పెక్టస్ వివరాలను తొలి దశలో రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది.కాగా.. టెమాసెక్, జొమాటో తదితర దిగ్గజాలకు పెట్టుబడులున్న కంపెనీ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూ నిధులను ప్రొడక్ట్ డెవలప్మెంట్, వ్యూహాత్మక కొనుగోళ్లు, లాజిస్టిక్స్తోపాటు, వేర్హౌసింగ్ ఇన్ఫ్రా విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాఆలు పేర్కొన్నాయి. -
పాదరసంలా పసిడి ధరలు! తులం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పాదరసంలా కదులుతున్నాయి. క్రితం రోజున సర్రున ఎగిసిన పసిడి ధరలు నేడు (మే 22) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు మరింత భారం తప్పదు. మే 22 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,060🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి. వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 1,01,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
గురువారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 80,951.99 వద్ద, నిఫ్టీ 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 24,609.70 వద్ద నిలిచాయి.కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్కో సిస్టమ్, అలికాన్ కాస్టల్లాయ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, గీకీ వెంచర్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.41 శాతం పడిపోయింది.భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతుంది. వారం రోజుల్లో 170కి పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగికరెన్సీ విలువ -
మళ్లీ బంగారం రయ్..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలతో పసిడికి మరోసారి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,910 పెరిగి రూ.98,450 స్థాయికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,870 లాభపడి రూ.98,000 స్థాయిని అందుకుంది.‘‘బలహీన డాలర్ పసిడి ధరలకు మద్దతునిచ్చింది. యూఎస్ క్రెడిట్ రేటింగ్ను మూడీస్ డౌన్గ్రేడ్ చేయడంతో సావరీన్ రిస్క్ను సైతం ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రేటింగ్ డౌన్గ్రేడ్తో దీర్ఘకాలంలో యూఎస్ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.మరోవైపు వెండి ధరలకు సైతం కదలిక వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1,660 పెరిగి రూ.99,160 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,300 స్థాయిని దాటేసింది. స్పాట్ గోల్డ్ 22 డాలర్ల లాభంతో 3,312 డాలర్ల స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు అమెరికా ఆర్థిక ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలతో బంగారం 3,300 డాలర్లను తిరిగి అందుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
ప్రైవేట్ లేబుల్స్కి జై...
న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రైవేట్ లేబుల్స్ వైపు మళ్లే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం దాదాపు సగం మంది వినియోగదారులు ఇలా మొగ్గు చూపుతున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక సర్వే నివేదికలో తెలిపింది. ఈవై రూపొందించిన ఫ్యూచర్ కన్జూమర్ ఇండెక్స్ (ఎఫ్సీఐ) ఇండియా నివేదిక ప్రకారం సంప్రదాయ బ్రాండెడ్ ఉత్పత్తుల స్థానంలో స్టోర్ల సొంత బ్రాండ్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. 52% మంది వినియోగదారులు ప్రైవేట్ లేబుల్స్కు మారారు. ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని విశ్వసిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది తెలిపారు. అలాగే, బ్రాండెడ్ ఉత్పత్తులతో సరిసమానంగా ప్రైవేట్ లేబుల్స్ ప్రోడక్టులు తమ అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయని భావిస్తున్నట్లు 70% మంది వినియోగదారులు పేర్కొన్నారు. ముడి సరుకులను లేదా ఫార్ములాను మార్చి, ఉత్పత్తిని మెరుగుపర్చి, వినూత్నంగా అందించేందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తున్నా.. ఇవన్నీ నిఖార్సయిన ఆవిష్కరణలు కావని, కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనని 34% మంది భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వినియోగదారుల ధోరణులు మారడం సాధారణమే అయినా, ప్రస్తుత మార్పులు శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా కనిపిస్తోందని ఈవై–పారీ్థనన్ పార్ట్నర్ అంగ్షుమన్ భట్టాచార్య చెప్పారు.నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. → బ్రాండ్కు కట్టుబడి ఉండటం కన్నా డిస్కౌంట్లకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సేల్ పెట్టినప్పుడు మాత్రమే పెద్ద బ్రాండ్లను కొంటున్నామని 59 % మంది తెలిపారు. → రిటైల్ స్టోర్స్లో కూడా ప్రైవేట్ లేబుల్స్కి ప్రాధాన్యత పెరుగుతోంది. తాము షాపింగ్ చేసే చోట మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఆప్షన్లు కనిపిస్తున్నట్లు 74 శాతం మంది చెప్పారు. స్టోర్లలోని షెల్ఫుల్లో సరిగ్గా కంటికి కనిపించే స్థాయిలో మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను డిస్ప్లే చేస్తున్నట్లు గమనించామని 70 శాతం మంది వివరించారు. స్టోర్ల సొంత బ్రాండ్లు, ప్రైవేట్ లేబుల్స్తో డబ్బు ఆదా అవుతోందని 69 శాతం మంది వినియోగదారులు చెప్పారు. → రిటైలర్లు మరింత ధీమాగా ప్రైవేట్ లేబుల్స్ను ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రధానమైన ప్రైమ్ షెల్ఫ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. అలాగే, వినియోగదారులకు అపరిమిత ఆప్షన్లను, టెక్నాలజీతో ఇతర ఉత్పత్తులతో పోల్చి చూసుకునే వెసులుబాట్లను కలి్పస్తూ మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తున్నారు. → తాజా, కొత్త బ్రాండ్లకు భారత వినియోగదారుల్లో ప్రాచుర్యం పెరుగుతుండటాన్ని ప్రైవేట్ లేబుల్స్ వేగవంతమైన వృద్ధి సూచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో వారికి మరింతగా చేరువయ్యేందుకు పెద్ద బ్రాండ్లు దృష్టి పెట్టాల్సిన అవసరం నెలకొంది. → అత్యుత్తమమైన రుచి, నాణ్యత లేదా పని తీరును అందిస్తే తిరిగి బ్రాండెడ్ ఉత్పత్తికి మళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని 47 శాతం మంది తెలిపారు. కట్టే డబ్బుకు మరింత మెరుగైన విలువను పొందడం కోసం తాము మళ్లీ బ్రాండెడ్ ఉత్పత్తులకు మళ్లే అవకాశం ఉందంటూ 44 శాతం మంది సూచనప్రాయంగా తెలిపారు. → కృత్రిమ మేధ(ఏఐ) కీలకమైన షాపింగ్ సాధనంగా మారింది. ఏఐ సిఫార్సుల ఆధారంగా తాము కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు. తమ షాపింగ్ అనుభూతిని ఏఐ మరింత మెరుగుపర్చిందంటూ 58 శాతం మంది వినియోగదారులు తెలిపారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..హెచ్డీఎఫ్సీ క్రెడిలాగతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్ సరీ్వసెస్ కాన్ఫిడెన్షియల్(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్ను డిసెంబర్లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీబాలీవుడ్ స్టార్స్తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్ఫీల్ రియల్టీ, ధ్యాన్ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.యూరో ప్రతీక్వాల్ ప్యానల్ డెకొరేటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు. మైనింగ్, లాజిస్టిక్స్ నాగ్పూర్ కంపెనీ కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.జారో ఇన్స్టిట్యూట్ఐపీవోలో భాగంగా జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది. జెన్సన్స్ ఇండస్ట్రీస్ఐపీవోలో భాగంగా జెన్సన్స్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లుజెమ్ ఆరోమాటిక్స్స్పెషాలిటీ ఇన్గ్రెడియంట్స్ తయారీ ముంబై కంపెనీ జెమ్ ఆరోమాటిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
బ్లూచిప్స్లో లాభాల స్వీకరణ
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.⇒ భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.పతనం ఎందుకంటే...⇒ ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవారం ఎఫ్ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. -
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: భారతీయ మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమ 2025 ఆర్థిక సంవత్సరాన్ని అద్భుతమైన పనితీరుతో ముగించింది. మార్చి 2025 నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) రికార్డు స్థాయిలో రూ. 65.74 లక్షల కోట్లకు చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.సవాళ్లను అధిగమించి వృద్ధిమార్చి 2024లో రూ. 53.40 లక్షల కోట్లుగా ఉన్న AUM, 2025 మార్చి నాటికి 23.11 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉన్నారని ఈ వృద్ధి స్పష్టం చేస్తుంది.సానుకూల వృద్ధి అంచనాAMFI సీఈఓ వెంకట్ ఎన్ చలసాని మాట్లాడుతూ, "మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ప్రవేశిస్తుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సానుకూల వృద్ధి అంచనా ఉంది. మార్క్-టు-మార్కెట్ (MTM) లాభాలు, సంవత్సరమంతా స్థిరమైన నిధుల ప్రవాహం AUM పెరుగుదలకు దోహదపడ్డాయి" అని తెలిపారు.ఈక్విటీ, డెట్ పథకాలకు నిధుల ప్రవాహం2025 ఆర్థిక సంవత్సరంలో, దేశీయ మ్యూచువల్ ఫండ్లలోకి మొత్తం రూ. 8.15 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం ఈక్విటీ-ఆధారిత పథకాలలోకి ప్రవహించాయి, రూ. 4.17 లక్షల కోట్ల నిధులు ఈ పథకాలను ఆకర్షించాయి. దీర్ఘకాలిక వృద్ధి పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిని ఇది సూచిస్తుంది. గత మూడేళ్లుగా నిధుల అవుట్ఫ్లోను ఎదుర్కొంటున్న డెట్ పథకాలు, రూ. 1.38 లక్షల కోట్ల నిధులను ఆకర్షించాయి. తక్కువ వడ్డీ రేట్లు, భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు డెట్ ఫండ్లపై ఆసక్తిని పెంచాయని AMFI పేర్కొంది.పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంరిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం ఈ నివేదికలో మరో ముఖ్యాంశం. మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17.78 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 23.45 కోట్లకు 32 శాతం పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈక్విటీ-ఆధారిత పథకాలు అధిక శాతం ఫోలియోలను కలిగి ఉన్నాయి, వాటి సంఖ్య 33 శాతం పెరిగి 16.38 కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు కూడా ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు 48 శాతం ఫోలియోల వృద్ధితో అత్యంత వేగంగా వృద్ధి చెందాయి.సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (SIP) కీలక పాత్రఈ వృద్ధిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIP) కీలక పాత్ర పోషించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో SIPల ద్వారా వచ్చిన విరాళాలు 45.24 శాతం పెరిగి రూ. 2.89 లక్షల కోట్లకు చేరాయి. ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబించడమే కాకుండా, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUMలో SIP ఆస్తుల వాటాను రూ. 13.35 లక్షల కోట్లకు, అంటే దాదాపు 20 శాతానికి పెంచింది. SIP ఖాతాల సంఖ్య, విరాళాలు రెండూ ఈ సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి.దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణిపెట్టుబడిదారులు క్రమశిక్షణతో సంపదను సృష్టిస్తున్నారని సూచిస్తూ, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం SIP ఆస్తులను కలిగి ఉన్న వారి సంఖ్య పెరిగిందని AMFI పేర్కొంది. యువ పెట్టుబడిదారులు మరింత దూకుడుగా పెట్టుబడి విధానాన్ని ఇష్టపడగా, వృద్ధులు రిస్క్ నిర్వహణ, వైవిధ్యీకరణపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ప్రాబల్యం ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు పెట్టుబడిదారులలో పెరుగుతున్న అవగాహన, నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 886.65 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టంతో.. 81,172.77 వద్ద, నిఫ్టీ 270.85 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,674.60 వద్ద నిలిచాయి.ఆల్కలీ మెటల్స్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, కాప్స్టన్ సర్వీసెస్, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, HLE గ్లాస్కోట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గణేష్ బెంజోప్లాస్ట్, క్వెస్ కార్ప్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, డీఓఎంఎస్ ఇండస్ట్రీస్, కొచ్చిన్ షిప్యార్డ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,100 (22 క్యారెట్స్), రూ.95,020 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 దిగి రూ.87,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.95,170 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ ఐపీఓల సందడి!
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది. -
మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 98,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్పై అప్డేట్లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్ఎస్ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్పీఐలు ఏప్రిల్లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్లోకి వచ్చిన ఎఫ్పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది. -
హమ్మయ్య.. పసిడి ప్రియులకు ఊరట
పసిడి ప్రియులకు ఊరట లభించింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (మే 17) నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు ఈరోజు మరింతగా పెరగకుండా స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. మే 17 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,130🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,200హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,130🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,200చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,280🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,350ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,280🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,200ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు. బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,130🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,200బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ రూ.1,08,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 97,000 వద్ద కొనసాగుతున్నాయి.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఐపీవోలు..
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభంకానుంది. 23న ముగియనున్న ఇష్యూకి రూ. 85–90 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. 20న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 166 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 1,618 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. 2024 డిసెంబర్కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,600 కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్రధానంగా ఆటో రంగంలోని సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్ను రూపొందించడంతోపాటు.. ఇత ర ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. బొరానా వీవ్స్ టెక్స్టైల్ తయారీ కంపెనీ బొరానా వీవ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. 22న ముగియనున్న ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా 67.08 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 145 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 19న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులను కొత్త తయారీ యూనిట్ ఫైనాన్స్ వ్యయాలతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గుజరాత్లోని సూరత్ వద్ద ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా గ్రే ఫ్యాబ్రిక్ను ఉత్పత్తి చేయనుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి. ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాల నమోదుకు పరుగులు తీయడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు.శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 200.15 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 82,330.59 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు 82,514.81 నుంచి 82,146.95 మధ్య ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 25,019.80 వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.86 శాతం, 0.94 శాతం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1.20 శాతం నుంచి 0.60 శాతం మధ్య లాభపడ్డాయి. అదేసమయంలో భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 2.76 శాతం నుంచి 0.79 శాతం మధ్య నష్టపోయాయి. -
ఉన్నట్టుండి భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం.. -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటలకు సెన్సెక్స్ 205.81 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 82,324.93 వద్ద, నిఫ్టీ 45.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 25,016.15 వద్ద ముందుకు సాగుతున్నాయి.బియర్డ్సెల్, జీ లెర్న్, వాన్బరీ, శివమ్ ఆటోటెక్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, న్యూలాండ్ లాబొరేటరీస్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ట్రంప్ ప్రకటన: ఒక్కసారిగా మారిపోయిన స్టాక్ మార్కెట్లు
ఖతార్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్సెషన్ వరకు ఫ్లాట్గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.ఇరాన్తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.ఇదీ చదవండి: మరింత తగ్గుతున్న గోల్డ్ రేటు: ఆల్టైమ్ గరిష్టాల నుంచి..వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
పర్యావరణహితంగా సిమెంట్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్ 2025 చైర్మన్ అజయ్ కపూర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. సిమెంట్ తయారీ సంస్థల అసోసియేషన్తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు. -
2025లో తొలిసారి 25000 పైకి నిఫ్టీ
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. → దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.లాభాలు ఎందుకంటే → ఖతార్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్సెషన్ వరకు ఫ్లాట్గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. → ఇరాన్తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. → వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
బంగారం ధరలు డౌన్: తగ్గుతున్న డిమాండ్!
అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారీగా పెరిగి.. లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే టారిఫ్ భయం తగ్గుతోంది. ఇటీవలే అమెరికా - చైనా వంటి దేశాలు టారిఫ్లను 115 శాతం తగ్గించుకున్నాయి.ఈ రోజు కూడా బంగారం ధరలు భారతదేశంలో గరిష్టంగా రూ.2130 తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ బంగారం రూ. 97000 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్గోల్డ్ ఔన్సు 16 డాలర్లు తగ్గి.. 3160 డాలర్ల వద్ద ట్రేడయింది. వెండి ఔన్స్ 32 డాలర్ల వద్ద కొనసాగింది. ఏప్రిల్ 2025లో ఔన్స్ 3500 డాలర్ల వరకు వెళ్ళింది.ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టంఆల్టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధర 10 శాతం తగ్గింది. తాజాగా గోల్డ్ 3150 డాలర్ల స్థాయికి చేరింది. ఇండియన్ మార్కెట్లో కూడా లక్ష రూపాయలు దాటేసింది బంగారం సుమారు 7000 రూపాయల కంటే ఎక్కువ తగ్గింది. అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయం ఒక ఒప్పందానికి రావడం, ఇండియా - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గడం వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారమైనట్లు తెలుస్తోంది. -
నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,127.91 పాయింట్లు లేదా 1.39 శాతం లాభంతో 82,458.48 వద్ద నిలిచింది. నిఫ్టీ 395.20 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 25,062.10 వద్ద ఉంది.మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్, నెల్కాస్ట్, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వెండ్ట్ (ఇండియా), సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్, హికాల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
దేశంలో బంగారం ధరలు (Gold Prices) భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ గణనీయ తగ్గుదలను నమోదుచేశాయి. అమెరికా, చైనా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రభావంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు పతయ్యాయి. దీంతో బంగారం తులం ధర నేడు (మే 15) రూ.వేలల్లో క్షీణించింది. మే 15 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. 👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే.. చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.94,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,250ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద రూ.1000 మేర తగ్గి రూ.1,08,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలో రూ.900 తగ్గి రూ. 97,000 వద్దకు దిగివచ్చింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నిన్నటి అస్థిర సెషన్ తరువాత, భారత్, యూఎస్ల నుంచి ఊహించిన దానికంటే మెరుగైన సీపీఐ ద్రవ్యోల్బణ డేటా మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు గ్రీన్లో స్థిరపడ్డాయి. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతానికి పడిపోయింది.బీఎస్ఈ బెంచ్మార్క్ సూచీ సెన్సెక్స్ 182.34 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 81,330.56 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 88.55 పాయింట్లు లేదా 0.36 శాతం లాభపడి 24,666.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 3.95 శాతం, టెక్ మహీంద్రా 2.26 శాతం, ఎటర్నల్ 2.20 శాతం, మారుతీ సుజుకీ 1.66 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ 1.64 శాతం వరకు నష్టపోయాయి.కాగా విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్ సూచీలను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.19 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.63 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఎనర్జీ, మీడియా 2.46 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ ఆటో, హెల్త్ కేర్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ ఎంసీజీ 1 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 0.25 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.23 శాతం నష్టపోయాయి. భారత మార్కెట్లో అస్థిరతను కొలవడానికి ఉపయోగించే ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ 5.61 శాతం క్షీణించి 17.18 పాయింట్లకు పడిపోయింది. -
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల ఒడిదొడుకులకు లోనవుతుంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.88,050 (22 క్యారెట్స్), రూ.96,060 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 తగ్గింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.88,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.96,060 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 దిగి రూ.88,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 తగ్గి రూ.96,210 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు బుధవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రత్నాభరణాల ఎగుమతులు ఎలా ఉన్నాయంటే..
భారత రత్నాభరణాల ఎగుమతులు (జెమ్స్, జ్యుయలరీ) ఏప్రిల్ నెలలో కొంత నీరసించాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 4.62 శాతం తక్కువగా 2,037 మిలియన్ డాలర్లుగా (రూ.17,314 కోట్లు) నమోదయ్యాయి. 2024 ఏప్రిల్లో జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు 2,136 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చి చూసినప్పుడు 6% తక్కువగా 1,109 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 1,181 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు సైతం 5.41 శాతం తగ్గాయి. 684 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాల ఎగుమతులు జరిగాయి.క్రితం ఏడాది ఇదే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 724 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్ పట్టిన ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎగుమతులు 110.74 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు 12% క్షీణతతో 38.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్స్టోన్ ఎగుమతులు మాత్రం 12శాతం 27.76 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 24.8 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్ ఇవి..కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గతంలో ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ పథకం ఈ ధోరణికి చెక్పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. -
సెన్సెక్స్ 1,282 పాయింట్లు డౌన్
ముంబై: ఐటీ, ఆటో, ప్రైవేటు బ్యాంకులు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో మంగళవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,282 పాయింట్లు క్షీణించి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 24,578 వద్ద నిలిచింది. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి చైనా మార్కెట్కు తరలిపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో ట్రేడ్ వార్ ఆందోళనలు తెరపైకి వచ్చాయి.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–2%), ఇన్ఫోసిస్(–3.50%), రిలయన్స్ (–1.50%), టీసీఎస్(–3%), భారతీ ఎయిర్టెల్(3%), ఐసీఐసీఐ బ్యాంకు (–1%) నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ పతనంలో ఈ షేర్ల వాటాయే 845 పాయింట్లు కావడం గమనార్హం. ⇒ రంగాల వారీగా సూచీల్లో ఐటీ 2.50%, టెక్ 2.40%, యుటిలిటీ 1.35%, విద్యుత్, మెటల్, ఆయిల్అండ్గ్యాస్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. స్మాల్క్యాప్ సూచీ 1%, మిడ్క్యాప్ ఇండెక్స్ 0.17శాతం పెరిగాయి. మరోవైపు ఫార్మా, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ⇒ రక్షణ రంగ షేర్లకు మూడోరోజూ డిమాండ్ నెలకొంది. భారత్ డైనమిక్స్ 11%, యాక్సిస్కేడ్స్ 5%, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎల్రక్టానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50% రాణించాయి. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డీసీఎక్స్ సిస్ట మ్స్ 3% లాభపడ్డాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 9%, ఏరియల్ ఇన్నోవేషన్స్ 5% పెరిగాయి. ⇒ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎండీ పదవికి అన్మోల్ సింగ్, హోల్టైమ్ డైరెక్టరు పదవికి పునీత్ సింగ్ జగ్గీ రాజీనామాతో జెన్సోల్ ఇంజనీరింగ్ షేరు 5% క్షీణించి రూ.52 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. తదుపరి అనూహ్య రికవరీతో 5% లాభపడి 57.28 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి, అక్కడే ముగిసింది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అమెరికా - చైనా టారిఫ్లకు 90 రోజులు బ్రేక్ పడిన తరువాత.. భారీ లాభాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మళ్ళీ ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,281.68 పాయింట్లు లేదా.. 1.55 శాతం నష్టంలో 81,148.22 వద్ద, నిఫ్టీ 346.35 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో.. 24,578.35 వద్ద నిలిచాయి.ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, డైనమిక్ కేబుల్స్, లింక్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, గిన్ని ఫిలమెంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీఎంసీసీ స్పెషాలిటీ కెమికల్స్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, అనుప్ ఇంజనీరింగ్, కృష్ణ డయాగ్నోస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు: జిన్పింగ్
అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయంలో ఒక డీల్ కుదుర్చుకున్న తరువాత.. బీజింగ్లో బ్రెజిల్, కొలంబియా, చిలీ అధ్యక్షులతో సహా లాటిన్ అమెరికా, కరేబియన్ అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు 'జిన్పింగ్' మాట్లాడారు. బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని, ఒంటరిని చేస్తాయని అన్నారు.ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్పింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.టారిఫ్లకు 90 రోజులు బ్రేక్అమెరికా దిగుమతులపైన చైనా రెండు దేశాలు ఇప్పటికి విధించిన సుంకాలలో 115 శాతం తగ్గించుకున్నాయి. అంటే చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,650 (22 క్యారెట్స్), రూ.95,620 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,620 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 పెరిగి రూ.87,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.160 పెరిగి రూ.95,770 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడికి అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: పసిడి ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.3,400 నష్టపోయి రూ.96,550కు దిగొచ్చింది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..యూఎస్–చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడడం బంగారం ధరల పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. వెండి కిలోకి రూ.200 నష్టపోయి రూ.99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్లను 30%కి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకు వచ్చింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య సంధి కుదరొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. -
డెట్ ఫండ్స్లోకి పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్ నెలలో మంచి జోరు చూపించాయి. ఈ విభాగంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ముందుకు వచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత రక్షణాత్మక ధోరణితో డెట్ విభాగం వైపు మొగ్గు చూపించినట్ట తెలుస్తోంది. ఫలితంగా ఏప్రిల్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో (2025 మార్చిలో) ఇదే డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే ఒక్క నెలలోనే ఇన్వెస్టర్ల ప్రాధాన్యంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పెట్టుబడుల్లో మార్పులు–చేర్పులు కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. సంస్థాగత ఇన్వెస్టర్లు ముందస్తు పన్ను చెల్లింపులు, బ్యాలన్స్ షీట్ల సర్దుబాట్లు మార్చి నెలలో పెట్టుబడుల ఉపసంహరణకు కారణమై ఉండొచ్చని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెచ్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెస్రామ్ తెలిపారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. లిక్విడ్ ఫండ్స్లోకే అధికం.. → డెట్లో లిక్విడ్ ఫండ్స్లోకి అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → ఓవర్నైట్ ఫండ్స్ రూ.23,900 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.31,507 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → అల్ట్రా షార్ట్ ఫండ్స్లోకి రూ.26,734 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్లోకి రూ.9,371 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → గిల్ట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.425 కోట్లను ఉపసంహరించుకున్నారు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.302 కోట్లు, గిల్ట్ ఫండ్స్ నుంచి 39 కోట్లు చొప్పున బయటకు వెళ్లిపోయాయి. → మొత్తానికి ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్లోని అన్ని విభాగాల్లోకి కలిపి నికరంగా రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.17.57 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడులు (ఏయూఎం) రూ.17.57 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు మార్చి చివరికి డెట్ నిర్వహణ ఆస్తుల విలువ రూ.17.02 లక్షల కోట్లుగా ఉంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్యలోనూ వృద్ధి కనిపించింది. ఏప్రిల్లో కొత్తగా 1.44 లక్షల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) ప్రారంభమయ్యాయి. మొత్తం డెట్ ఫోలియోలు 79.36 లక్షలకు చేరాయి. డెట్లో మొత్తం 16 కేటగిరీలు ఉంటే అందులో 12 కేటగిరీల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ‘‘ఏప్రిల్లో డెట్ ఫండ్స్లోకి పెట్టుబడులు రాక పెరగడం అన్నది స్థిరాదాయ పథకాల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వసానికి నిదర్శనం’’అని మార్నింగ్ స్టార్ మెస్రామ్ తెలిపారు. లిక్విడ్ ఫండ్స్లోకి ఎక్కువ పెట్టుబడులు రావడం అన్నది స్వల్పకాల పెట్టుబడుల పట్ల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పంజ్ తెలిపారు. -
రూ. 2 వేల కోట్ల ఐపీవోకు మోర్ రిటైల్
కోల్కతా: సూపర్మార్కెట్ చెయిన్ మోర్ రిటైల్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించుకోనుంది. కంపెనీ ఎండీ వినోద్ నంబియార్ ఈ విషయాలు తెలిపారు. వేల్యుయేషన్, మార్కెట్ పరిస్థితులు బట్టి వచ్చే 12–18 నెలల్లో ఐపీవోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రమోటర్లు సుమారు 10 శాతం వాటా విక్రయించవచ్చని పేర్కొన్నారు. 2030 నాటికి స్టోర్ల సంఖ్యను 3,000కు పెంచుకునేందుకు, సంస్థను రుణరహితంగా మార్చుకునేందుకు ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఉపయోగించుకోనున్నట్లు నంబియార్ చెప్పారు. గత 120 రోజుల్లో ఫ్యామిలీ ఆఫీసుల నుంచి సంస్థ రూ. 150 కోట్లు సమీకరించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీకి సుమారు రూ. 500 కోట్ల రుణభారం ఉంది. సమరా క్యాపిటల్, అమెజాన్ సంస్థలు మోర్ రిటైల్కు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీ కొనుగోలు కోసం రూ. 4,300 కోట్లు వెచి్చంచడంతో పాటు గత అయిదేళ్లలో వ్యాపార విస్తరణకు రెండు సంస్థలు రూ. 900 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశాయి. -
సీజ్ఫైర్.. బుల్ జోష్!
ముంబై: భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దలాల్ స్ట్రీట్లో బుల్ పరుగులు తీసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా బుల్కు జోష్నిచ్చాయి. ఫలితంగా సూచీలు గడిచిన నాలుగేళ్లలో (2021) తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్ 2,975 పాయింట్లు లాభపడి 82,430 వద్ద, నిఫ్టీ 917 పాయింట్లు బలపడి 24,925 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం ముగింపు. సూచీల 4% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.432.56 లక్షల కోట్ల(5.05 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. రోజంతా లాభాలే: గత వారాంతాన భారత్, పాక్ల మధ్య సీజ్ఫైర్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందాల పరిణామాల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లు బలపడి 80,804 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు ఎగసి 24,420 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు మరిన్ని లాభాలు ఆర్జించగలిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 3,041 పాయింట్లు దూసుకెళ్లి 82,496 వద్ద, నిఫ్టీ 937 పాయింట్లు ఎగసి 24,945 వద్ద గరిష్టాన్ని తాకాయి. → సెన్సెక్స్ సూచీలో ఇండస్ఇండ్ (–3.57%), సన్ఫార్మా(–3.36%) మినహా 28 షేర్లూ లాభపడ్డాయి. సూచీల్లో ఐటీ 6.75%, రియల్టీ 6%, మెటల్, టెక్, యుటిలిటీ, పవర్ ఇండెక్సులు 5% రాణించాయి. ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్ సూచీలు 4–3% లాభపడ్డాయి. → మార్కెట్ అనూహ్య ర్యాలీలో రక్షణ రంగ, డ్రోన్ల తయారీ కంపెనీల షేర్లకు డిమాండ్ కొనసాగింది. యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ 5%, డేటా ప్యాటర్న్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, పెరిగాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 6%, డ్రోణాచార్య ఏరియల్ 5% పెరిగాయి.లాభాలు ఎందుకంటే: → పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా ఊపువచ్చింది. → అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది. → ఈక్విటీ ఫండ్లలోకి సిప్ల ద్వారా ఏప్రిల్లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మారి్నంగ్స్టార్ డీబీఆర్ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.భారీ లాభాల్లో అమెరికాచైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా వాణిజ్య యుద్ధానికి 90 రోజుల విరామం ప్రకటించడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్అండ్పీ 500 ఇండెక్సు 2.70%, డోజోన్స్ సూచీ 2%, నాస్డాక్ ఇండెక్సు 4% లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్సులూ పెరిగాయి. -
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లో క్లోజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి.ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, బిర్లా కార్పొరేషన్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేపీఆర్ మిల్, జిందాల్ వరల్డ్వైడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
బంగారం జాక్పాట్! ఈరోజు కొంటే..
దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు (Gold Prices) శుభవార్త చెప్పాయి. రూ.లక్షకు చేరువలో ఉన్న మేలిమి బంగారం తులం ధర నేడు (మే 12) భారీగా దిగివచ్చింది. ఆభరణాలకు వినియోగించే పసిడి లోహం కూడా రూ.90వేల దిగువకు వచ్చేసింది. మే 12 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,030- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. వెండి ధరలు కూడా భారీగానే..దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద ఏకంగా రూ.2000 మేర తగ్గి రూ.1,09,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలో రూ.1150 తగ్గి రూ. 97,900 వద్దకు దిగివచ్చింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్ల దృష్టి
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశి్చత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు.ద్రవ్యోల్బణంపై కన్ను ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(13న) విడుదలకానున్నాయి. మార్చిలో సీపీఐ వరుసగా ఐదో నెలలోనూ నీరసిస్తూ 3.34 శాతానికి పరిమితమైంది. ఈ బాటలో ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెల్లడికానున్నాయి. మార్చిలో డబ్ల్యూపీఐ 2.38 శాతం నుంచి 2.05 శాతానికి బలహీనపడింది. ఇక ప్రభుత్వం ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఫలితాలు కీలకం ఇప్పటికే గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వచి్చంది. ఈ బాటలో ఈ వారం సైతం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) పనితీరును వెల్లడించనున్నాయి. జాబితాలో రేమండ్, టాటా స్టీల్, యూపీఎల్(12న), టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, హీరోమోటో కార్ప్, సీమెన్స్, గెయిల్(13న), ఐషర్ మోటార్స్, లుపిన్, శ్రీ సిమెంట్, టాటా పవర్(14న), అబాట్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, గోద్రెజ్ ఇండస్ట్రీస్(15న), బీహెచ్ఈఎల్(16న) ఫలితాలు ప్రకటించనున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతలతోపాటు క్యూ4 ఫలితాలు ట్రెండ్కు కీలకంగా నిలవనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. విదేశీ అంశాలు ఈ వారం ఏప్రిల్ నెలకు యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం 13న, రిటైల్ అమ్మకాలు 15న విడుదలకానున్నాయి. గురువారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి. గత వారమిలా.. భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం(5–9) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,048 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 79,454 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 339 పాయింట్లు(1.4 శాతం) నీరసించి 24,008 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు సైతం 1.4 శాతం చొప్పున నష్టపోయాయి. అమ్మకాలు పెరిగితేమార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడటంతో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,000 పాయింట్లవద్ద నిలిచింది. భారత్, పాక్ మధ్య ఘర్షణలు నెలకొనడంతో నిఫ్టీ 23,900స్థాయి దిగువకు చేరే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జరిగితే మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాకాకుండా 24,250 పాయింట్ల ఎగువకు చేరితే బలాన్ని పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణతోపాటు పరిస్థితులు కుదుటపడితే సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించవచ్చని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సీ విశ్లేషించారు. సాధారణంగా మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల నుంచి త్వరగా రికవరీ సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.ఎఫ్పీఐలు రివర్స్గేర్గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారాంతాన ఉన్నట్టుండి నికర అమ్మకందారులుగా నిలిచారు. నగదు విభాగంలో శుక్రవారం(9న) రూ. 3,799 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 14,167 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! జీఎస్టీ వసూళ్లు, ఎఫ్పీఐ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో 3,973 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు ఏప్రిల్లో రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తిరిగి ఈ నెలలో దేశీ స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. -
తగ్గినట్టే తగ్గి.. తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. క్రితం రోజున భారీగా క్షీణించిన పసిడి ధరలు నేడు (మే 10) కాస్త ఎగిశాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశ ఎదురైంది. మే 10 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,830- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి. ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి. బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 98,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
స్టాక్ మార్కెట్లో మరో కొత్త ఇండెక్స్
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా డివిడెండ్ లీడర్స్ 50 పేరుతో ఇండెక్స్ను ప్రారంభించింది. బీఎస్ఈ అనుబంధ సంస్థ ఆసియా ఇండెక్స్ ఈ కొత్త ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. బీఎస్ఈ 500 ఇండెక్స్లో భాగమైన 50 కంపెనీలకు దీనిలో చోటు కల్పింంది. అయితే గత 10ఏళ్లలో నిరవధికంగా డివిడెండ్లు చెల్లించిన దిగ్గజాలను మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు.ప్రతీ ఏటా డిసెంబర్లో ఇండెక్స్ను సమీక్షించనున్నట్లు ఆసియా ఇండెక్స్ వెల్లడించిది. ఈ ఇండెక్స్ను ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్తోపాటు.. దేశీయంగా విభిన్న రంగాల పనితీరును మదింపు చేయవచ్చని పేర్కొంది.అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఫండ్ పోర్ట్ ఫోలియోల బెంచ్ మార్క్ కోసం దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.మరో స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ కూడా ఇటీవల నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది. -
ఈక్విటీ ఫండ్స్లోకి రూ.24,269 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించింది. మార్చి నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.25,082 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం క్షీణించి రూ.24,269 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్లో ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ఏప్రిల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 3.65 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 3.46 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఏప్రిల్ నెలలో వచ్చిన పెట్టుబడులు ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ మేరకు ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి నెలవారీ పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. అయినప్పటికీ ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 50వ నెలలోనూ నికర సానుకూల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు రాక తగ్గడం అన్నది యూఎస్ టారిఫ్ల పట్ల అనిశి్చతి, డెట్, హైబ్రిడ్ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడం కారణమని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ తెలిపారు. సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లు ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం చేసే సిప్ పెట్టుబడులు ఏప్రిల్ నెలలో రూ.26,632 కోట్లుగా ఉన్నాయి. ఒక నెలలో సిప్ గరిష్ట పెట్టుబడులు ఇదే ప్రథమం. మార్చి నెలలో సిప్ పెట్టుబడులు రూ.25,926 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగాయి. ఏప్రిల్లో కొత్తగా 46.01 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో కొత్త సిప్ ఖాతాలు 40.18 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 8.38 కోట్లకు చేరాయి. సిప్ నిర్వహణ ఆస్తుల విలువ మార్చి చివరికి రూ.13.35 లక్షల కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి రూ.13.89 లక్షల కోట్లకు పెరిగింది. ‘‘ఏప్రిల్లో సిప్ పెట్టుబడులు ఆల్టైమ్ గరిష్టం అయిన రూ.26,632 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ను క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పొదుపు సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తుండడం వల్లే పెట్టుబడులు ఇలా క్రమంగా పెరుగుతున్నాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. అన్ని మారెŠక్ట్ సైకిల్స్లోనూ పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న ప్రాధాన్యం పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్నట్టు చెప్పారు. విభాగాల వారీ పెట్టుబడులు → ఏప్రిల్లో డెట్ ఫండ్స్లోకి మొత్తంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరణతో పోలి్చతే సీన్ రివర్స్ అయింది. → డెట్లోని మొత్తం 16 విభాగాలకు గాను 12 రకాల పథకాల్లోకి పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా రూ.1.18 లక్షల కోట్లు లిక్విడ్ ఫండ్స్లోకే వచ్చాయి. → మొత్తం మీద అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్లోకి ఏప్రిల్లో రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.64 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. → దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (అన్ని విభాగాలు సహా) విలువ ఏప్రిల్ చివరికి రూ.70 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఇది రూ.65.74 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ పథకాల్లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, 2024 డిసెంబర్లో రూ.41,156 కోట్ల చొప్పున వచ్చాయి. → ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.5,542 కోట్ల పెట్టుబడులను ఏప్రిల్లో ఆకర్షించాయి. → మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు ఆదరణ కొనసాగింది. మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.3,314 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.4,000 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.2,671 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.2,479 కోట్లుగా ఉన్నాయి. → హైబ్రిడ్ ఫండ్స్ రూ.14,247 కోట్లను ఆకర్షించాయి. మార్చి నెలలో ఈ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.946 కోట్లను ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో అమ్మకాలుగోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలోనూ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.77 కోట్లకు వెనక్కి తీసుకోవడం గమనార్హం. బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడంతోపాటు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. -
భారత్ - పాక్ యుద్ధం: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 79,454.47 వద్ద, నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 24,008.00 వద్ద నిలిచాయి.ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, మయూర్ యూనికోటర్స్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ, ప్లాటినం ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నవకర్ అర్బన్స్ట్రక్చర్, చెంబాండ్ కెమికల్స్, సీపీ క్యాపిటల్, ముత్తూట్ మైక్రోఫిన్, ఏజీఐ ఇన్ఫ్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఒక్కసారిగా పడిపోయాయి. వరుసగా నాలుగు రోజులుగా భగ్గుమన్న పసిడి ధరలు నేడు (మే9) భారీగా దిగివచ్చాయి. గత నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసి మళ్లీ రూ.లక్షకు చేరువైంది. దీంతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు నేటి భారీ తగ్గుదల ఊరట కలిగించనుంది. మే 9 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,11,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మార్కెట్లకు సైబర్ దాడి ముప్పు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని మార్కెట్ వర్గాలను స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ హెచ్చరించింది. రిస్క్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒక సర్క్యులర్లో సూచించింది. రిస్క్ లను మదింపు చేసుకుని, నివారణ చర్యలు తీసుకోవాలని, సిస్టంల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను పటిష్టపర్చుకోవాలని, దాడులు జరిగిన పక్షంలో సత్వరం స్పందించేలా తగు ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత సైన్యం క్షిపణి దాడులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టంతో 80,334.81 వద్ద, నిఫ్టీ 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం నష్టంతో 24,273.80 వద్ద నిలిచాయి.గిన్ని ఫిలమెంట్స్, పావ్నా ఇండస్ట్రీస్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, గ్రిండ్వెల్ నార్టన్, శ్రీరామ్ పిస్టన్స్ & రింగ్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరగా.. అవలోన్ టెక్నాలజీస్, గోధా క్యాబ్కాన్ అండ్ ఇన్సులేషన్, రవీంద్ర ఎనర్జీ, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా), డీబీ కార్ప్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
Operation Sindoor: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. -
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) భగ్గుమంటున్నాయి. వరుసగా నాలుగో రోజూ భారీగా పెరిగాయి. నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసింది. దీంతో తులం బంగారం మళ్లీ రూ.లక్షకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మే 8 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,750- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,450ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,11,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ లక్ష పైకి
న్యూఢిల్లీ: పసిడి మరోసారి రూ.లక్ష మార్క్పైకి చేరింది. ఇటీవలే మొదటిసారి రూ.లక్ష దాటిన తర్వాత అమ్మకాల ఒత్తిడితో పుత్తడి ఆ స్థాయిని కోల్పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,00,750 స్థాయిని చేరుకుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతలతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350 స్థాయికి చేరింది. ఏప్రిల్ 22న పసిడి రూ.1,01,600 ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేయడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు వెండి కిలోకి రూ.440 పెరిగి రూ.98,940 స్థాయిని సమీపించింది. అంతర్జాతీయ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి కనిపించింది. బంగారం 25 డాలర్ల నష్టంతో 3,397 డాలర్ల వద్ద ఉంది. యూస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలకు ముందు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించినట్టు తెలుస్తోంది. ‘వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశలతో మళ్లీ రిస్కీ ఆస్తులవైపు మార్కెట్లు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ మధ్య ప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్, భారత్–పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు. -
Operation Sindoor: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 105.71 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34.80 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.16 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి.రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ మినహా మిగతా అన్ని రంగాలు గ్రీన్లో ముగియడంతో ఆటో, మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 5.2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, ఎటర్నల్ 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, టైటాన్ 1.27 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 4 శాతం, సన్ ఫార్మా 1.95 శాతం, ఐటీసీ-1.3 శాతం, నెస్లే ఇండియా-1.06 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.01 శాతం నష్టపోయాయి.పాక్ స్టాక్ మార్కెట్ కుదేలుపాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ జరిపిన దాడుల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కేఎస్ఈ 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్లో 6,272 పాయింట్లు లేదా 6 శాతం పడిపోయింది. భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఎస్ఈ-100 సూచీ క్షీణించి 1,12,076.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) కోలుకునే సూచనలు కనిపించలేదు. పీఎస్ఎక్స్ వెబ్సైట్ మూతపడింది. ఆ వెబ్సైట్ తెరిస్తే "తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్వహణలో ఉంటుంది" అన్న సందేశం కనిపిస్తోంది. -
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,750 (22 క్యారెట్స్), రూ.99,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 పెరిగి రూ.90,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 పెరిగి రూ.99,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)లు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్ను తీసుకొచ్చింది. -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా పుంజుకున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు మరోసారి లిస్టింగ్ బాటలో సాగుతున్నాయి. తాజాగా ఐదు కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, అజయ్ పాలీ, జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, రెగాల్ రిసోర్సెస్ చేరాయి. ఈ 5 కంపెనీలు 2024 డిసెంబర్, 2025 జనవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఈ ఏడాది జనవరి 6న లిస్టింగ్కు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన ఎర్తూడ్ సరీ్వసెస్ ఇటీవల ఐపీవో డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది.రూ. 2,800 కోట్లు: నాన్డిపాజిట్ ఎన్బీఎఫ్సీ వెరిటాస్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,200 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ విభాగంపై అధిక దృష్టిపెట్టిన కంపెనీ ఈక్విటీ జారీ నిధులను రుణ విడుదలకు సహకరించే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎన్బీఎఫ్సీ..: ఎన్బీఎఫ్సీ.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా 1.04 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 56.38 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు సహకరించే మూలధన పటిష్టత, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిఫ్రిజిరేషన్ సీలింగ్: రిఫ్రిజిరేషన్ సీలింగ్ సొల్యూషన్లు అందించే అజయ్ పాలీ ఐపీవోలో భాగంగా రూ. 238 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు ప్లాంట్, మెషినరీ తదితర పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. రూ. 190 కోట్లు సహా..: రెగాల్ రిసోర్సెస్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ 90 లక్షల షేర్ల వరకూ ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. రూ. 150 కోట్లు మాత్రమే: ప్రాస్పెక్టస్ ప్రకారం జజూ రష్మీ రిఫ్రాక్టరీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను జార్ఖండ్లోని బొకారో ఫెర్రో అల్లాయ్స్ విస్తరణకు వీలుగా కొత్త తయారీ సౌకర్యాలపై వెచి్చంచనుంది. నిధులలో కొంతమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సైతం వినియోగించనుంది.మెప్పించని ఏథర్ ఎనర్జీ ఎంట్రీ ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేరు లిస్టింగ్ రోజే నష్టాలు చవిచూసింది. ఇష్యూ ధర(రూ.321)తో పోలిస్తే బీఎస్ఈలో 1.57% స్వల్ప ప్రీమియంతో రూ.326 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4% లాభపడి రూ.333 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై ఆరంభ లాభాలు కోల్పోయింది. ఒకానొక దశలో 6.50% క్షీణించి రూ.300 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ. 302.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.11,267 కోట్లుగా నమోదైంది. ‘‘ఏథర్ ఎనర్జీ షేరు నామమాత్రపు ధరతో లిస్టింగ్ అవ్వడం, ఇంట్రాడేలో 6.50% పతనం పరిణామాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు అధిక వాల్యుయేషన్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని లెమాన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు. -
లాభాల్లోంచి నష్టాల్లోకి..
ముంబై: భారత్ – పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, యూఎస్–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆటో, టెక్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్ గూడ్స్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2%కి పైగా క్షీణించాయి. -
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్లను ప్రతిపాదించారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఎకాఎకి భారీగా పెరిగిన బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,250 (22 క్యారెట్స్), రూ.98,460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2,500, రూ.2,730 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,730 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,460 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,500 పెరిగి రూ.90,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,750 పెరిగి రూ.98,610 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై స్వల్పంగా రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,07,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్ సమయాలపై ఆర్బీఐ సూచనలు
ముంబై: ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లకు ప్రస్తుత ట్రేడింగ్ వేళలనే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సిఫార్సు చేసింది. కాల్ మనీ మార్కెట్ టైమింగ్స్ను మాత్రం రాత్రి 7 గం.ల వరకు పొడిగించాలని సూచించింది.ప్రస్తుతం కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 3.30 గం.ల వరకు ఉంటున్నాయి. అయితే, ఆన్షోర్ మార్కెట్ వేళల తర్వాత నాన్ రెసిడెంట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు సాయంత్రం 5 గం.ల నుంచి రాత్రి 11.30 గం.ల వరకు ట్రేడింగ్ వేళలు ఉంటున్నాయి.మరోవైపు, కాల్ మనీ మార్కెట్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు, రెపో మార్కెట్ టైమింగ్స్ ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 2.30 గం.ల వరకు ఉంటున్నాయి. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో.. 80,796.84 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 24,461.15 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో అషిమా, యూనివర్సల్ కేబుల్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఆర్ఆర్ కాబెల్ వంటి కంపెనీలు చేరగా.. జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, కేసాల్వ్స్ ఇండియా, లోటస్ ఐ కేర్ హాస్పిటల్, వీ-మార్ట్ రిటైల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలవగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం పాలసీ సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమయ్యే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) 7న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే మార్చి నెల సమావేశంమాదిరిగా ఈసారికూడా ఫెడ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏప్రిల్ నెలకు యూఎస్ సర్వీసుల పీఎంఐ గణాంకాలు సోమవారం(5న) విడుదలకానున్నాయి. ఇక చైనా ఏప్రిల్ వాణిజ్య గణాంకాలు 9న వెల్లడికానున్నాయి. మార్చిలో ఎగుమతుల జోరు కారణంగా 102 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు నమోదైంది.బ్లూచిప్స్ ఫలితాలుఈ వారం ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం(5న), బ్యాంక్ ఆఫ్ బరోడా(6న), కోల్ ఇండియా, డాబర్(7న), మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, బయోకాన్, టైటన్(8న), డాక్టర్ రెడ్డీస్(9న) గత ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. గత వారాంతాన(3న) బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్బ్యాంక్, కొటక్ మహీంద్రాతోపాటు డీమార్ట్ క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(5న) మార్కెట్లలో కనిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. కాగా.. హెచ్ఎస్బీసీ పీఎంఐ సరీ్వసుల డేటా 6న విడుదలకానుంది.యుద్ధ భయాలుపహల్గావ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఓవైపు ఆందోళనలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఫలితంగా భారత్, పాకిస్తాన్ మిలటరీ దళాల ప్రతీ కదలికలనూ కూలంకషంగా పరిశీలించే వీలున్నట్లు వివరించారు. ఫలితంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు గౌరవ్ గార్గ్ అంచనా వేశారు. సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,400 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే మరింత బలపడవచ్చని, లేదంటే పరిమిత శ్రేణి కదలికలకే పరిమితంకావచ్చని అంచనా వేశారు. క్యూ1లో యూఎస్ జీడీపీ నీరసించడం గ్లోబల్స్థాయిలో అనిశ్చితికి దారితీస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ విశ్లేషించారు. దీంతో ఫెడ్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.గత వారమిలా..గురువారం సెలవు కావడంతో 4 రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం.. సెన్సెక్స్ 1289 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 80,502కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,347 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ మాత్రం 1.33 శాతం క్షీణించింది.ఇదీ చదవండి: న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!ఎఫ్పీఐల దన్నుఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు టారిఫ్ల విషయంలో యూఎస్తో ఒప్పందం కుదరనున్నట్లు అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో గత 12 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. ఫలితంగా యూఎస్ డాలరుతో మారకంలో రూపాయి వేగంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తున్నట్లు వివరించారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99కు బలహీనపడటం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆరి్థకవేత్తలు పేర్కొన్నారు. దేశీయంగా తొలి మూడు నెలల(జనవరి–మార్చి) తదుపరి ఏప్రిల్లో ఎఫ్పీఐలు నికరంగా రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!
యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్వివిధ మార్కెట్ క్యాప్స్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్ ఫండ్ను ప్రకటించింది యూటీఐ మ్యూచువల్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 13 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ స్టాక్స్లో 3ఎస్ విధానంతో (సైజు, సెక్టార్, స్టయిల్) ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సెగ్మెంట్కి కనీసం 25 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. పటిష్టమైన ఫండమెంటల్స్తో టర్న్రౌండ్ అవకాశాలు ఉండి ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్లో లభించే స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని యూటీఐ ఏఎంసీ సీఐవో వెట్రి సుబ్రమణియమ్ తెలిపారు. దీనికి కార్తీక్రాజ్ లక్ష్మణన్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 6న మొదలు కానుంది. 20వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్లకు అనుమతి ఉంటుంది. ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ‘నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్ఐ’ కొనసాగుతుంది. ఇహబ్ దల్వాయ్, మసూమి జుర్మర్వాలా ఫండ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన నగదు ప్రవాహాలు, రుణ భారం తక్కువగా ఉండి, నిధుల వ్యయాల సామర్థ్యాలు గొప్పగా ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేస్తుంది. అందుకే పథకానికి క్వాలిటీ అని పేరు పెట్టారు. సుమారు 625 కంపెనీలను జల్లెడ పట్టి అందులో మెరుగైన 40–60 కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను నాణ్యమైన కంపెనీలు ఎదుర్కొని బలంగా నిలబడగలవని భావిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని తీసుకొచి్చంది. పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయిస్తే విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ అమలవుతుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే ఎగ్జిట్ చార్జీలు ఉండవు. ఇదీ చదవండి: త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థగ్రో సిల్వర్ ఈటీఎఫ్వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం గ్రో మ్యూచువల్ ఫండ్ ‘గ్రో సిల్వర్ ఈటీఎఫ్’ ఎన్ఎఫ్వోను ప్రారంభించింది. ఈ నెల 16 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మే 30 నాటికి స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీ పెట్టుబడులు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దేశీ వెండి ధరలకు అనుగుణంగా గ్రో సిల్వర్ ఈటీఎఫ్ ట్రేడవుతుంటుంది. వెండి ధరల గమనానికి అనుగుణంగానే ఇందులో లాభ, నష్టాలు ఆధారపడి ఉంటాయి. భౌతిక వెండి కొనుగోలు, నిల్వ, విక్రయం వంటి సమస్యలను సిల్వర్ ఈటీఎఫ్ తప్పిస్తుంది. ఇందులో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాబడులు కోరుకునే వారికి ఇది అనుకూలమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగారం–వెండి నిష్పత్తి 91.64 వద్ద ఉందని.. ఈ ప్రకారం చూస్తే బంగారం కంటే వెండి ధరలే అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. -
త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
న్యూఢిల్లీ: కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది.ఎప్పటిలోగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేదీ పాండే స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి కేవైసీ వ్యవస్థ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలోనూ మేము సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బఫెట్ వారసుడొచ్చాడు..!2025లో నూతన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీని తీసుకురానున్నట్టు బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సెక్యూరిటీలకు సంబంధించి టీప్లస్0 సెటిల్మెంట్ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉందని పాండే చెప్పారు. దీనివల్ల మార్కెట్ భాగస్వాములు క్రమంగా కొత్త వ్యవస్థకు మారేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిఘా, ఐపీవో దరఖాస్తులను వేగంగా మదింపు వేసేందుకు ప్రస్తుతం సెబీ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల దీన్ని వాడనున్నట్టు తెలిపారు. టీప్లస్1 ప్రస్తుతం తప్పనిసరిగా అమల్లో ఉన్న విధానం. స్టాక్స్ కొనుగోలు చేసిన తర్వాతి పనిదినం రోజున అవి కస్టమర్ల డీమ్యాట్ ఖాతాలకు జమ అవుతాయి. -
పెట్టుబడులకు కాస్త స్థిరత్వం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంత అవసరమో ఇటీవలి మార్కెట్ పతనం చూసి తెలుసుకోవచ్చు. లార్జ్క్యాప్తో పోల్చితే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో గణనీయమైన దిద్దుబాటు కనిపించింది. పెట్టుబడులపై మెరుగైన రాబడులు కోరుకోవడంలో తప్పులేదు. అదే సమయంలో ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు స్థిరత్వం కూడా అవసరమే. కనుక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ నిర్ణీత శాతం మేర డెట్ సాధనాలకూ కేటాయించుకోవాలి. ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఇదే పని చేస్తాయి. ఇవి ఈక్విటీతోపాటు కొంత మేర డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడిపై మెరుగైన రాబడికి తోడు అస్థిరతల్లో మెరుగైన రక్షణను ఆఫర్ చేస్తుంటాయి. ఈ విభాగంలో కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకంలో ఏడాది కాల రాబడి 10 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లలో అస్థిరతలు, దిద్దుబాట్ల నేపథ్యంలో దీన్ని మెరుగైన రాబడిగానే చూడొచ్చు. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఏటా 14 శాతానికి పైనే రాబడి తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో 18.55 శాతం, ఏడేళ్లలో 13.95 శాతం, పదేళ్లలో 13.45 శాతం చొప్పున ఈ ఫండ్ డైరెక్ట్ ప్లాన్లో రాబడులు కనిపిస్తాయి. పెట్టుబడుల విధానం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకాలు ఈక్విటీ, డెట్ కలయికగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీల వ్యాల్యుయేషన్స్ (స్టాక్స్ విలువలు) ఆకర్షణీయంగా ఉన్న సందర్భాల్లో మొత్తం పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి మిగిలిన 20 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా ఈక్విటీ వ్యాల్యూయేషన్లు ఖరీదుగా మారాయని భావించి సందర్భాల్లో ఈక్విటీ కేటాయింపులను 65 శాతానికి పరిమితం చేసి, మిగిలిన మేర డెట్ సాధనాలకు మళ్లిస్తుంటాయి. ఇలా పరిస్థితులకు తగినట్టు మార్పులు చేస్తూ అధిక రాబడులు తెచి్చపెట్టే విధంగా ఈ పథకాలు పనిచేస్తాయి. మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేస్తుంటాయి. ఈ తరహా పెట్టుబడుల వ్యూహాలను ఈ పథకంలో గమనించొచ్చు. పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.10,372 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 71 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్లో 25.58 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. మరో 3.29 శాతం పెట్టుబడులను నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో అనిశ్చితుల నేపథ్యంలో కొంత నగదు నిల్వలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోలో 64 స్టాక్స్ను కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 77 శాతం మేర కేటాయింపులు మెగా, లార్జ్క్యాప్ కంపెనీల్లో ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 19.78 శాతం ఉంటే, స్మాల్క్యాప్ కంపెనీల్లో 3 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్లో రిస్క్ అత్యంత కనిష్టంగా ఉండే ఏఏఏ రేటెడ్, ఎస్వోవీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీ పెట్టుబడుల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిల్లో 25 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 8.99 శాతం, ఇండ్రస్టియల్ కంపెనీలకు 8.28 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీలకు 6.55 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు
ఐపీవోకు ప్రయారిటీ జ్యువెల్స్ఆభరణాల రిటైల్ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ బంగారం, ప్లాటినం, వెండిసహా వజ్రాలతోకూడిన ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తోంది. క్యారట్లేన్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, రిలయన్స్ రిటైల్, టీబీజెడ్, సెన్కో గోల్డ్ తదితర జ్యువెలరీ రిటైల్ స్టోర్లకు సైతం ప్రొడక్టులు సరఫరా చేస్తోంది. ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీతో చర్చలుపబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తోంది. కొన్ని కీలక అంశాల పరిష్కారం కోసం ఎన్ఎస్ఈ, సెబీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లింపులు, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితర అంశాలపై సెబీ ఎన్ఎస్ఈతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్వోసీ కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీకొరోనా రెమిడీస్ ఐపీవోఫార్మా రంగ కంపెనీ కొరోనా రెమిడీస్ ఐపీవో బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనున్నప్పటికీ నిధులు కంపెనీకి లభించబోవు. మహిళా ఆరోగ్య పరిరక్షణ, కార్డియో– డయాబెటో, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ తదితర విభాగాలలో కంపెనీ ప్రొడక్టులు రూపొందిస్తోంది. -
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్ను కూడా రాబర్ట్ పోస్ట్కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025 -
రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం నిలువలు పరిమితంగా ఉండడంతో దాని విలువ పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర రూ.96 వేలకుపైగా చేరింది. నిత్యం దీని ధర మారుతుంటోంది. అయితే ఇంతకీ ఈ ధరను ఎవరు నిర్ణయిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. దీని ధరను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది.. అందుకు ఎలాంటి సంస్థలు నిర్ణయాత్మకంగా ఉంటాయి.. అనే అంశాలను తెలుసుకుందాం.పసిడి ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలులండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్బీఎంఏ) ఫిక్సింగ్ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్బీఎంఏ రోజుకు రెండుసార్లు బెంచ్మార్క్ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్గా పనిచేస్తాయి.గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లుకమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్.. మానిటరీ పాలసీరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.ద్రవ్యోల్బణం.. ఆర్థిక అనిశ్చితిబంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలుదిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలుభారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.కరెన్సీ మారకం రేట్లుబంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.పండుగలు, వివాహాలుదేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.దేశీయ సరఫరా, ఆభరణాల మార్కెట్ ధోరణిబంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ)ఐబీజేఏ గ్లోబల్ బెంచ్మార్క్లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు. -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నెమ్మదిగా దిగివస్తున్నాయి. వరుస తగ్గుదలలతో పసిడి కొనుగోలుదారుల్లో ఉత్సాహం తిరిగొచ్చింది. మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (మే 3) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మే 3 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,09,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 98,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
ముంబై: స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.స్టోరీలు, మ్యూజిక్, ఇన్నోవేషన్, క్రియేటివ్ స్పిరిట్ ఇకపై దేశం నుంచి భారీగా ఎగుమతికానున్నట్లు 2025 వేవ్స్లో ఎన్ఎస్ఈ ఇండెక్స్ను విడుదల చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 2005 ఏప్రిల్1 ఇండెక్స్కు బేస్కాగా.. ప్రాథమిక విలువను 1,000గా నిర్ధారించారు.దేశీయంగా అత్యంత డైనమిక్ రంగాలలో ఒకటైన మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ లోతును ప్రతిబింబించే విధంగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్కు తెరతీసినట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్కుమార్ చౌహాన్ తెలియజేశారు. -
వాణిజ్య ఒప్పందంపై ఆశలతో లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్ 1.67%, ఆయిల్అండ్గ్యాస్ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ 1.67%, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్–సెజ్ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. ⇒ భూషణ్ స్టీల్ అండ్ పవర్ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్డబ్ల్యూ స్టీల్ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..
గ్లోబల్ మార్కెట్లలో టారిఫ్ భయం తగ్గిపోతున్న క్రమంలో.. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో గోల్డ్ రేటు లక్ష రూపాయల నుంచి సుమారు రూ. 7000 తగ్గింది. దీంతో కొనుగోలుదారుల్లో కూడా బంగారం కొనాలా? వద్దా? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎందుకంటే ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అనే ఆలోచన వారిలో తలుపుతట్టింది.గత వారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3500.05 డాలర్ల వద్ద ఉంది. అయితే గురువారం రోజు 2.2 శాతం క్షీణించి 3216.41 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా బంగారం ధరలు రూ. 95510 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ధరలు కొంత తక్కువే అని స్పష్టమవుతోంది.బంగారం ధరలు తగ్గడానికి కారణంప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు మళ్ళీ లాభాలను ఆర్జించడానికి సిద్ధమయ్యాయి. అంతే కాకుండా దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు.. చైనాతో ఒప్పందం గురించి సానుకూల వ్యాఖ్యలు కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైందని ఏంజెల్ వన్లో కమోడిటీస్ అండ్ కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ 'తేజస్ అనిల్ షిగ్రేకర్' అన్నారు.ఇదీ చదవండి: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..అమెరికా సుంకాలను నివారించడానికి అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు "చాలా మంచి" ఆఫర్లను అందించారని, ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి 'స్కాట్ బెసెంట్' అన్నారు. మొత్తం మీద రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 80,501.99 వద్ద, నిఫ్టీ 12.50 పాయింట్లు లేదా 0.051 శాతం లాభంతో 24,346.70 వద్ద నిలిచాయి.జుల్లుందూర్ మోటార్ ఏజెన్సీ ఢిల్లీ, స్పోర్ట్కింగ్ ఇండియా, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఫోర్స్ మోటార్స్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. యునైటెడ్ పాలీఫ్యాబ్ గుజరాత్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, వైశాలి ఫార్మా, మాలు పేపర్ మిల్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
బంగారం మాయలో పడొద్దు..
బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడి ధోరణి ఇన్వెస్టర్లలో మరీ ఎక్కువైంది. బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్షకు చేరువలో ఉన్నందున పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన అవకాశం అని చాలా మంది భావిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు ఎల్లప్పుడూ అద్భుతమైన రాబడిని ఇస్తాయనుకోవద్దని, బంగారం మాయలో పడొద్దని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు నితేష్ బుద్ధదేవ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్.స్వల్పకాలిక ధోరణుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని ఇన్వెస్టర్లకు సీఏ బుద్ధదేవ్ సూచించారు. గత కొన్నేళ్లుగా బంగారం బలమైన రాబడులను అందించినప్పటికీ, ఎల్లప్పుడూ అలా ఉండదని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి, బంగారం దాదాపు సున్నా రాబడిని అందించిన సుదీర్ఘ కాలం కూడా ఉంది. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఈ లెక్కలు చూడండి..తన హెచ్చరికకు మద్దతుగా బుద్ధదేవ్ 2012 నుండి 2019 వరకు బంగారంపై రాబడులు ఏ మాత్రం ఉన్నాయనే దానికి సంబంధించిన చారిత్రక లెక్కలను ముందుపెట్టారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బంగారం ధరలు మరీ అంత పెద్దగా పెరిగిందేమీ లేదు. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 2019 నాటికి అది స్వల్పంగా పెరిగి రూ.35,220కి చేరింది. అంటే 8 సంవత్సరాలలో పెరిగింది కేవలం రూ .4,170. శాతంలో చెప్పాలంటే మొత్తం 13% రాబడి. సగటున చూసినప్పుడు, కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు సంవత్సరానికి 1.5% కంటే తక్కువగానే ఉంది. ఇక 1992 నుంచి 2002 మధ్య కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.4,334 నుంచి కేవలం రూ.4,990కి పెరిగిందని, 1.5 శాతం కంటే తక్కువ వార్షిక రాబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.2020 తర్వాత బంగారం ఎందుకు పెరిగిందంటే..2020 తర్వాత బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం యాదృచ్ఛికం కాదని బుద్ధదేవ్ వివరించారు. సురక్షిత ఆస్తులకు డిమాండ్ను పెంచిన 2019 కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ బంగారం నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయి.ఈ అంశాలు మదుపర్లు బంగారం కొనుగోలుకు ఎగబడే పరిస్థితిని సృష్టించాయి, ధరలు భారీగా పెరిగాయి. కానీ సీఏ బుద్ధదేవ్ చెబుతున్నట్లుగా ప్రతి పెద్ద స్పైక్ తర్వాత సుదీర్ఘ ఫ్లాట్ లైన్ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్లు బంగారం పనితీరులో బూమ్లతోపాటు పడిపోయే స్థితినీ అంచనా వేయాలి.బంగారం ఇప్పటికీ మంచి పెట్టుబడేనా అంటే బుద్ధదేవ్ ప్రకారం.. పెట్టుబడి పోర్ట్ఫోలియోలో బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ ఇది డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఈక్విటీల మాదిరిగా స్థిరమైన రాబడిని అందించదు. కాబట్టి మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారానికి కేవలం 5% నుండి 12% కేటాయించాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు. -
బంగారం హాట్రిక్ తగ్గుదల.. తులం ఇప్పుడు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజూ పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నేడు (మే 2) దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు మాత్రం నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.2000 మేర పెరిగి రూ.1,09,000 వద్దకు ఎగిసింది. అదే ఢిల్లీ ప్రాంతంలో ఎటువంటి మార్పు లేకుండా రూ. 98,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)