breaking news
Market
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..?
బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి.భారతదేశంలో నేటి బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి. -
బంగారం రివర్స్! కొనేవారికి గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు కొనుగోలు చేసేవారికి ఊరట కల్పించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అటు వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రితం సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 25,489 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పుంజుకొని 82,646 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్యాసివ్ ఫండ్లకు ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’
దేశీయంగా పెట్టుబడుల పరిస్థితుల్లో ఇటీవల గణనీయమైన మార్పులు వస్తున్నాయి. తక్కువ ఖర్చు, వైవిధ్యం, పారదర్శకత, దీర్ఘకాల క్రమశిక్షణ తదితర అంశాలకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ‘ప్యాసివ్ ఇన్వెస్టింగ్’ విధానం వేగంగా విస్తరిస్తోంది. ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లాంటి ప్యాసివ్ ఫండ్లు, స్వయంగా షేర్లను ఎంపిక చేసుకోవాల్సిన బాదరబందీ లేకుండా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్యాసివ్ ఇన్వెస్టింగ్కి సంబంధించి ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’ ఒక వినూత్న మార్గంగా అవతరిస్తున్నాయి. స్మార్ట్ బీటా వ్యూహాల నిర్వచనం.. ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’ అనేవి ఇండెక్స్కు అనుసంధానమైన పెట్టుబడి వ్యూహాలు. ఇవి సంప్రదాయ ప్యాసివ్ ఫండ్ల మాదిరిగా కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పనిచేయవు. ఈ వ్యూహంలో భాగంగా, ముందుగానే నిర్ణయించిన నిర్దిష్ట నియమాల ప్రకారం, పలు ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని షేర్లను ఎంపిక చేసి, వాటికి తగిన వెయిటేజీ కేటాయిస్తాయి. ఈ విధానం ‘ప్యాసివ్ ఇన్వెస్టింగ్’లోని సరళత్వాన్ని కొనసాగిస్తూనే, అదనంగా వ్యూహాత్మక దృష్టికోణాన్ని కూడా జోడిస్తుంది. దీనితో పోర్ట్ఫోలియో నుంచి మరింత మెరుగైన ఫలితాలను పొందేందుకు వీలవుతుంది.ఫాక్టర్ ఆధారిత విధానంస్మార్ట్ బీటా వ్యూహాల్లో విస్తృతంగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ఫాక్టర్లు ఉన్నాయి. విలువ (వేల్యూ), మొమెంటం, నాణ్యత(క్వాలిటీ), తక్కువ వోలటిలిటీ (ఒడిదుడుకులు), సమానమైన వెయిటేజీ తదితర ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో విలువ (వేల్యూ) అనే ఫాక్టర్, కంపెనీల షేర్ల వేల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉందా లేదా అనే అంశాన్ని సూచిస్తుంది. మొమెంటం ఫాక్టర్ గతంలో స్థిరమైన పనితీరు కనబరిచిన కంపెనీ షేర్లపై దృష్టి సారిస్తుంది. నాణ్యత (క్వాలిటీ) ఫాక్టర్ ఆర్థికంగా బలమైన, స్థిరమైన లాభాలు కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేస్తుంది. తక్కువ వోలటిలిటీ ఫాక్టర్ అనేది మార్కెట్తో పోలిస్తే తక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే షేర్లను గుర్తిస్తుంది. సమానమైన వెయిటేజీ అనే ఫ్యాక్టర్ అన్ని షేర్లకు సమాన వెయిటేజీ ఇస్తూ, మధ్యతరహా, చిన్న కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాయి.రిస్క్లు, పరిమితులుస్మార్ట్ బీటా వ్యూహాలకు కూడా కొన్ని రిస్క్లు, పరిమితులున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టర్ ఆధారిత రిస్క్. ఏదో ఒక ఫాక్టర్ కొన్ని మార్కెట్ పరిస్థితుల్లో బాగా పనిచేయవచ్చు. మరికొన్ని సమయాల్లో వెనుకబడే అవకాశం ఉంటుంది. సహజంగానే ప్యాసివ్ ఫండ్లు అనేవి మార్కెట్ సూచీలను అనుసరిస్తాయి. కాబట్టి, మార్కెట్ పడిపోతే వెంటనే ఫండ్ విలువా తగ్గుతుంది. కొన్నిసార్లు మంచి మార్కెట్ సమయంలోనూ సగటు లాభాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకే రంగానికి పరిమితయమ్యే ప్యాసివ్ ఫండ్లూ ఉంటాయి. ఆ రంగానికి ఏదైనా ఇబ్బంది వచి్చనప్పుడు మొత్తం పోర్ట్ఫోలియో ప్రభావితం కావచ్చు. కావున దీర్ఘకాలంలోనే ఈ వ్యూహాల అసలు ప్రయోజనం బయటపడుతుంది. అందుకే తాత్కాలిక పనితీరును చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు.మొత్తంగా, స్మార్ట్ బీటా వ్యూహాలు అనేవి ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సరళతను, నిర్దిష్ట నియమాల ఆధారిత వ్యూహాలను సమన్వయం చేసే ఆధునిక పెట్టుబడి విధానాలుగా అభివర్ణించవచ్చు. ఇవి విభిన్న ఫాక్టర్లను కలిపి పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాలు అందించగలవు. భవిష్యత్తులో భారత ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ప్రయాణంలో స్మార్ట్ బీటా వ్యూహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మార్కెట్లు వృద్ధి చెందుతున్న దశలో ప్యాసివ్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంది.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
నేడు దలాల్ స్ట్రీట్ దారి ఎటువైపు?
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (ఫిబ్రవరి 16, 2026) ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా భారీగా పతనమైన నేపథ్యంలో నేడు కూడా మార్కెట్ బేరిష్(తగ్గుదల) ట్రెండ్ను కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితులు - టెక్ రంగంలో ప్రకంపనలుఅమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్లలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు భారతీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నాస్డాక్ పతనం కారణంగా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిష్క్రమణకు దారితీస్తోంది.క్రూడాయిల్ ధరలు.. భారత్పై ప్రభావంప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అణు చర్చల నేపథ్యంలో సరఫరా అంతరాయాలు తగ్గుతాయన్న ఆశలు ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. క్రూడాయిల్ ధరలు పెరిగితే అది భారతదేశ ద్రవ్యోల్బణంపై, కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది రూపాయి విలువ క్షీణతకు కారణమై మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ భవిష్యత్తు నిర్ణయాలుఇటీవలి ఫిబ్రవరి మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ ఆహార ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా ఆర్బీఐ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేకపోవడం మార్కెట్లలో కొంత నిరుత్సాహాన్ని నింపింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి గ్లోబల్ లిక్విడిటీపై ప్రభావం చూపుతోంది.టెక్నికల్ లెవల్స్పై నిపుణుల అంచనాటెక్నికల్ చార్టుల ప్రకారం, నిఫ్టీకి 25,400 స్థాయి అత్యంత కీలకమైన సపోర్ట్గా ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే అది 25,200 నుంచి 25,000 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. సెన్సెక్స్కు 82,500 - 82,400 జోన్ బలమైన సపోర్ట్గా పనిచేస్తుంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతం దూకుడుగా పెట్టుబడులు పెట్టడం కంటే వేచి చూడటం ఉత్తమమని, ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
గణాంకాలతో మార్కెట్ల తీరెటు?
దేశీ స్టాక్ మార్కెట్లకు ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే ఇటీవల ఆంత్రోపిక్, శాప్ ఏఐ టూల్స్ అమెరికా నుంచి ఆసియా వరకూ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ల తీరెలా ఉండవచ్చంటూ నిపుణుల మధ్య చర్చలు అధికమయ్యాయి. వీటిమధ్య ఈ వారం ట్రెండ్పై పలు అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా నేడు(16న) జనవరి నెల టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. 2025 నవంబర్లో 0.32 శాతం నీరసించినప్పటికీ డిసెంబర్లో డబ్ల్యూపీఐ వార్షికంగా 0.83 శాతం బలపడింది. వెరసి గత మూడు నెలల్లో తొలిసారి పెరిగింది. ఏప్రిల్ తదుపరి వేగమందుకుంది. రిటైల్ ధరలు(సీపీఐ) 2.75 శాతం ఎగసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క వాణిజ్య గణాంకాలు సైతం వెలువడనున్నాయి. డిసెంబర్లో ఎగుమతులకంటే దిగుమతులు అధికమై వాణిజ్య లోటు 25 బిలియన్ డాలర్లకు చేరింది. నవంబర్లో ఇది 24.53 బిలియన్ డాలర్లుకాగా.. 2024 డిసెంబర్లో 20.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ బాటలో వారాంతాన ఫిబ్రవరి నెలకు తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. విదేశీ అంశాలు ఫిబ్రవరి 17న యూఎస్ ఏడీపీ ఉపాధి గణాంకాలు, హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్, పారిశ్రామికోత్పత్తి వివరాలు విడుదలకానున్నాయి. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్) సైతం వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్ ఫండ్స్ రేట్లను యథాతథంగా 3.5–3.75 శాతం వద్ద కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇవి 2022 తదుపరి కనిష్టంకాగా.. తద్వారా మూడు వరుస రేట్ల కోతకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. వీటితోపాటు వ్యక్తిగత వ్యయాల ఇండెక్స్, 2025 అక్టోబర్–డిసెంబర్ జీడీపీ ముందస్తు అంచనాలు సైతం విడుదలకానున్నాయి. పెట్టుబడుల ప్రవాహమెటు? → ఆంత్రోపిక్, శాప్ విడుదల చేసిన ఏఐ టూల్స్ సాఫ్ట్వేర్ ఆధారిత సరీ్వసుల రంగంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్వహించే కొన్ని రకాల ప్రాజెక్టులకు చెక్ పడటంతోపాటు.. సిబ్బందిపై సైతం భారీ సంఖ్యలో వేటు వేయవలసి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి ఆందోళనలుగా మారి ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి ఇతర రంగాలవైపు మళ్లవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీ కస్టమర్ ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోసహా కొన్ని వినియోగ ఆధారిత రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. → టారిఫ్ ఆందోళనలు ఉపశమిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ పాలసీ నిర్ణయాలపై అంచనాలు తదితర అంశాలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యూఎస్, భారత్లలో ద్రవ్యోల్బణం, జీడీపీ పురోగతి వంటి అంశాలు ఫెడ్, ఆర్బీఐ పరపతి విధానాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వెరసి వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. → క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల ప్రభావంతో పలు రంగాల కౌంటర్లు యాక్టివ్గా కదులుతున్నట్లు నాయిర్ తెలియజేశారు. పటిష్ట ఫలితాలు, ఆర్డర్లు సాధించిన కౌంటర్లు బలపడుతుంటే.. నిరాశపరచిన స్టాక్స్ నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి మార్కెట్ భారీ ఆటుపోట్లలోనూ విభిన్న రంగాల కౌంటర్లు యాక్టివ్గా ట్రేడవుతున్నట్లు వివరించారు. → గత వారాంతాన వెలువడిన ఆశావహ యూఎస్ ఉపాధి గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు యోచనకు చెక్ పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తినట్లు మిశ్రా తెలియజేశారు.ఇండెక్సులు అటా.. ఇటా?గత వారం యూఎస్ ట్రేడ్ డీల్ ఆశలు కలి్పంచినప్పటికీ ఏఐ ఆందోళనలు అమ్మకాలకు దారి చూపాయి. వెరసి ఈ వారం సైతం ఇండెక్సులు బలహీనంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. → నిఫ్టీకి 25,200–25,100 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 26,000–26,100 పాయింట్లవరకూ బౌన్స్కావచ్చు. అయితే నిఫ్టీ 25,100 దిగువకు చేరితే 24,700వరకూ పతనంకావచ్చు. → సెన్సెక్స్ తొలుత 82,450–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకునే వీలుంది. ఒకవేళ తదుపరి జోరందుకుంటే 84,500–85,000 వరకూ పుంజుకునే చాన్స్ ఉంది. అయితే నీరసిస్తే 82,000 పాయింట్ల దిగువన 80,500–80,000 స్థాయిలో మద్దతు కనిపించవచ్చు.గత వారమిలా..గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు ఐటీ రంగ కౌంటర్లలో భారీ అమ్మకాల కారణంగా డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 954 పాయింట్లు(1.15 శాతం) క్షీణించి 82,627 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 223 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 25,471 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి.ఎఫ్పీఐల కొనుగోళ్లుఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ నెల 2–13 మధ్య నికరంగా రూ. 19,675 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. యూరప్సహా.. యూఎస్తోనూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే అంతకుముందు 2026 జనవరి(రూ. 35,962 కోట్లు), 2025 డిసెంబర్(రూ. 22,611 కోట్లు), నవంబర్(3,765 కోట్లు)లలో నికరంగా అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..
బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. రెండు రోజులుగా వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
స్టాక్మార్కెట్ క్రాష్.. నెత్తురు కక్కిన షేర్లు!
మార్కెట్పై బేర్స్ పట్టు సాధించడంతో దలాల్ స్ట్రీట్లో శుక్రవారం తీవ్ర రక్తపాతం! చోటుచేసుకుంది. గ్లోబల్ టెక్ మార్కెట్లలో కొనసాగుతున్న మందగమనం ప్రభావంతో హెవీవెయిట్ ఐటీ షేర్లు భారీగా క్షీణించాయి. ఫలితంగా భారతీయ ఈక్విటీ సూచీలు దిగువన పయనించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 82,626.76 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 336.1 పాయింట్లు లేదా 1.30 శాతం క్షీణించి 25,471.1 వద్ద ముగిసింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మినహా అన్ని షేర్లు కుప్పకూలాయి. వీటిలో హెచ్యూఎల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. రంగాలవారీగా నష్టాలకు దారితీసింది. ఇది 3 శాతానికి పైగా పడిపోయింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయి 1.44 శాతం నష్టపోయింది.రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ నష్టపోయి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం పైగా క్షీణించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.79 శాతం పడిపోయాయి. మార్కెట్ అస్థిరతకు సూచిక అయిన ఇండియా వీఐఎక్స్ 15.18 శాతం ఎగసి, పెట్టుబడిదారుల ఆందోళనలను ప్రతిబింబించింది. -
డబుల్ డ్రాప్.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు వరుసగా రెండో రోజూ రూ.వేలల్లో తగ్గి కొనుగోలుదారులకు డబుల్ ఆనందాన్ని ఇస్తోంది. మరో వైపు వెండి ధరలు కూడా చాలా రోజుల తర్వాత భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 257 పాయింట్లు తగ్గి 25,548 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 దిగజారి 82,868 వద్ద ట్రేడవుతోంది.భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 13, 2026) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ కార్పొరేట్ లీగల్ విధులను ఆటోమేట్ చేసే కొత్త టూల్ను విడుదల చేయడం భారత ఐటీ రంగానికి శాపంగా మారింది. ఈ సాంకేతికత వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.అమెరికాలో జనవరి నెలకు సంబంధించి వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమే అయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెట్టాయి.‘ప్రస్తుత పతనం ప్రధానంగా ఐటీ, గ్లోబల్ సెంటిమెంట్ వల్ల జరిగింది. అయితే, నిఫ్టీకి 25,500 వద్ద బలమైన మద్దతు ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లలో ఈ పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూడవచ్చు’ అని నిపుణులు సూచిస్తున్నారు.Today Nifty position 13-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయుల్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ సెషన్లో ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు 6% నుంచి 9% వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్ను తాకడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీనికి గల ప్రధాన కారణాలు కింద చూద్దాం.ట్రంప్ విధానాలు.. డాలర్ బలోపేతంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సుంకాల విధింపు హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువను పెంచాయి. డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు భారంగా మారుతుంది. ఇది సహజంగానే ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.అంతర్జాతీయ అనిశ్చితి.. భౌగోళిక ఉద్రిక్తతలుఅమెరికాకు.. ఇరాన్, వెనిజువెలా వంటి దేశాలకు ఉన్న ఉద్రిక్తతలు కొంతమేర సద్దుమణగడం, దౌత్యపరమైన చర్చలు మొదలవ్వడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం కూడా ఈ పతనానికి ఒక కారణం.మార్జిన్ పరిమితుల పెంపుఎంసీఎక్స్, అంతర్జాతీయంగా కామెక్స్ వంటి ఎక్స్ఛేంజీలు బంగారం ట్రేడింగ్పై మార్జిన్ రిక్వైర్మెంట్లను పెంచాయి. దీనివల్ల ట్రేడర్లు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. వారు తమ పొజిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లో లిక్విడేషన్ పెరిగి ధరలు దిగివచ్చాయి.రూపాయి ప్రభావంభారత రూపాయి విలువలో మార్పులు దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?ప్రస్తుత పతనం అనేది కేవలం టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఎంసీఎక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం పట్ల సానుకూల ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన వ్యూహం కావొచ్చని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
సెబీ చైర్మన్ కీలక ప్రకటన.. ఎస్ఎంఈల్లో..
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) అభివృద్ధి కోసం గతంలో పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్స్ కోణంలో అవి ఇంకా భారీగా విస్తరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్స్లో లిస్ట్ కావడం వల్ల చిన్న కంపెనీల్లో గవర్నెన్స్ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కానీ క్యాపిటల్ మార్కెట్స్ గురించి అంతగా తెలియకపోవడం వల్ల, మర్చంట్ బ్యాంకర్లు అంత తేలిగ్గా దొరక్కపోవడం వల్ల చిన్న సంస్థలు లిస్టింగ్పై సందేహిస్తుంటాయని పేర్కొన్నారు.ఐపీవోల ద్వారా నిధులను సమీకరించేందుకు వ్యయాల భారం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఇండియా ఎస్ఎంఈ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడం వల్ల గవర్నెన్స్ మెరుగుపడుతుందని, విశ్వసనీయత పెరగడం వల్ల పెట్టుబడి వ్యయాలు కూడా తగ్గుతాయని పాండే చెప్పారు. చిన్న సంస్థలకి వర్తించే మినహాయింపులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేయడం వల్ల ఎస్ఎంఈ ఐపీవోలపై ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంటుకి దారి తీసిందని ఆయన తెలిపారు. అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా నిబంధనలను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు మెరుగుపర్చాయన్నారు.ఎస్ఎంఈ ఎక్స్ఛేంజీల్లో 1,400 కంపెనీలు లిస్టయ్యాయని, వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.1 లక్షల కోట్లని పాండే చెప్పారు. ఇందులో 350 సంస్థలు మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అయ్యాయని గర్గ్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా 98 సంస్థలు రూ. 9,800 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 232 లిస్టింగ్స్ ద్వారా రూ. 10,500 కోట్లకు సమీకరించినట్లు చెప్పారు. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
పసిడి ప్రియులకు బంగారం లాంటి న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు తగ్గి 25,853 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 381 దిగజారి 83,836 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 12-02-2026(time: 9:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!
బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) ఇటీవల గణనీయ మార్పులను చూపిస్తోంది. ఇది విలువైన లోహాల మార్కెట్లో ఉన్న అధిక అస్థిరతను సూచిస్తుంది. 2026 జనవరి చివరలో వెండి ధరలు ఘోరంగా పెరగడంతో ఈ నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 44–46కు పడిపోయింది. వెండి ధరలు ఔన్స్కు 100 డాలర్లను మించిపోయాయి.అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో వెండి ధరల్లో తీవ్ర దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, బంగారం-వెండి నిష్పత్తి వేగంగా 60కు పుంజుకుంది. 2026 ఫిబ్రవరి 11 నాటికి ఈ నిష్పత్తి 61 పైన ట్రేడ్ అవుతోంది.నెల ప్రారంభంలో బంగారం-వెండి నిష్పత్తిలో కనిపించిన తీవ్ర అమ్మకాలు, బులియన్ ధరలలో కొత్త ర్యాలీకి దారితీశాయి. బుధవారం (ఫిబ్రవరి 11) స్పాట్ గోల్డ్ ధరలు 0.7% పెరిగి ఔన్స్కు 5,057.23 డాలర్లకు చేరాయి. ఏప్రిల్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి ఔన్స్కు 5,081.40 డాలర్లను తాకాయి. స్పాట్ సిల్వర్ 2.3% పెరిగి ఔన్స్కు 82.56 డాలర్లు చేరింది.ఇక ఫిబ్రవరి 2 నుండి, బంగారం ధరలు 15% పైగా పెరిగాయి, వెండి ధరలు 16% పెరిగాయి. జనవరి 30 న వెండి ఒక్క సెషన్లోనే 26% క్షీణతను ఎదుర్కొంది. ఇది లోహ మార్కెట్లో తీవ్ర అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది.బంగారం-వెండి నిష్పత్తి అంటే..బంగారం-వెండి నిష్పత్తి అనేది బంగారం, వెండి సాపేక్ష విలువను కొలుస్తుంది. ఇది ఒక ఔన్సు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన వెండి ఔన్సుల సంఖ్యను సూచిస్తుంది. బంగారం ధరను వెండి ధరతో భాగించడం ద్వారా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి రెండు విలువైన లోహాల సాపేక్ష పనితీరు, మార్కెట్ విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.నిష్పత్తి 60 దాటడం దేనికి సూచన?బంగారం-వెండి నిష్పత్తి 43.80 వద్ద కనిష్టంగా గుర్తించడం సాంకేతికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంఘటన అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి 60ని దాటడం మార్కెట్ సాధారణీకరణ దశకి సూచన. అంటే సమీప కాలంలో బంగారం ధరలు వెండి ధరలను అధిగమించే అవకాశం ఉంది. -
స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేక్.. పడిపోయిన ఐటీ షేర్లు
భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం మ్యూట్ నోట్తో సెషన్ను ముగించాయి. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నడిచిన ర్యాలీకి బ్రేక్ పడింది. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 40.28 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టపోయి 84,233.64 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18.7 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 25,953.85 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.03 శాతం, 0.02 శాతం లాభపడ్డాయి.సెన్సెక్స్ 30 స్టాక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 3 శాతానికి పైగా ర్యాలీ చేసి, మార్కెట్ క్యాపిటలైజేషన్లో టీసీఎస్ను అధిగమించి నాలుగో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మారుతి సుజుకి, ట్రెంట్ ఇతర టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు ఐటీ షేర్లు పడిపోయాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా క్షీణించింది. హెల్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఐటీసీ ఇతర టాప్ లూజర్స్లో జాబితాలో చేరాయి. రంగాలవారీగా నిఫ్టీ హెల్త్ కేర్ 1.62 శాతం లాభపడగా, నిఫ్టీ ఆటో 1.3 శాతం లాభపడ్డాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఐటీ సెషన్ లో అతిపెద్ద లూజర్గా ఉద్భవించింది. -
బంగారం ధరల్లో స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-02-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్కు మించి బంగారం ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు ఒక డాలర్కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.Just purchased another 600 US Silver Eagles.Today’s spot is $82 an ounce. Still believe silver will reach $200 an ounce….or more…. in 2026.The US dollar is in trouble.Savers of fiat currency (fake $) biggest losersTake care.— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం, వెండి ధరల అప్డేట్స్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,921 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పుంజుకొని 84,269 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 10-02-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ వెండి వేడి
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి. స్థానిక బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాములు రూ. 1,300 బలపడింది. రూ. 1,58,500ను తాకింది. వారాంతాన వెండి కేజీ రూ. 2,55,000 వద్ద, పసిడి 10 గ్రాములు రూ. 1,57,200 వద్ద నిలిచిన విషయం విదితమే. ధరల తాజా పెరుగుదలకు యూఎస్ డాలరు బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడం కారణమైనట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. అంతేకా కుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితికితోడు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య రాజకీయ, భౌగోళిక చర్యలు వెండి, పసిడి తదితర విలువైన లోహాలకు డిమాండును పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. విదేశీ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ స్పాట్ ధర ఔన్స్ 2.8 శాతం(2.2 డాలర్లు) ఎగసింది. 80.21 డాలర్లను తాకింది. మరోపక్క పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం పుంజుకుని 5,013 డాలర్లకు చేరింది. -
బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది. -
ఈ వారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు?
గత వారం బంగారం, వెండి మార్కెట్లు తీవ్రమైన ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఈ వారం కూడా ధరల్లో భారీ మార్పులు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలపై వ్యాపారుల దృష్టి కేంద్రీకృతమైంది.అమెరికా ద్రవ్యోల్బణ డేటా, జీడీపీ వృద్ధి రేటు, పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి సూచికలు బులియన్ ధరల దిశను నిర్ణయించనున్నాయి. అలాగే చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలు వడ్డీ రేటు తగ్గింపుల సమయంపై స్పష్టతనిచ్చే అవకాశముండటంతో, వాటిని కూడా వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో గత వారం కామెక్స్లో బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. ఔన్సుకు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 5,000 డాలర్ల వరకు కోలుకోవడం గమనార్హం. అయితే వెండి ఫ్యూచర్స్పై ఒత్తిడి కొనసాగింది. గత వారం వెండి ధరలు 2 శాతానికి పైగా తగ్గాయి.జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ – కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. “బంగారంలో కన్సాలిడేషన్, రికవరీ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ వెండి విషయంలో మాత్రం అస్థిరత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తదుపరి దిద్దుబాట్ల పట్ల జాగ్రత్త అవసరం” అని చెప్పారు.దేశీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు రూ.15,760 లేదా దాదాపు 6 శాతం పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆదివారం కూడా కమోడిటీస్ మార్కెట్ పనిచేయడం విశేషం.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విశ్లేషకుడు మానవ్ మోడీ మాట్లాడుతూ.. “డాలర్ బలపడటం, ఫెడ్ అంచనాల్లో మార్పులు, దూకుడు పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా బంగారం, వెండి అత్యంత అస్థిర వారాన్ని ఎదుర్కొన్నాయి” అన్నారు. వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రమాదం తగ్గడం వంటి అంశాలు సేఫ్-హావెన్ డిమాండ్ను కొంత తగ్గించాయని ఆయన వివరించారు.అయితే, దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ పెట్టుబడులు కొనసాగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బులియన్కు మద్దతునిస్తాయని అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా చూస్తే, వచ్చే వారం కూడా బంగారం, వెండి మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు. అయినప్పటికీ, ధరలు తగ్గినప్పుడు ముఖ్యంగా బంగారంలో స్వల్పకాలిక కొనుగోలు అవకాశాలు కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రూ.123 ఇవ్వాల్సిన చోట.. రూ.3.62 లక్షల కోట్లు!
దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బిథంబ్ (Bithumb)లో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దీంతో లక్షల కోట్ల బదిలీ జరిగింది. వినియోగదారులకు చిన్న మొత్తంలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.సాధారణంగా విజేతలకు సుమారు 2,000 కొరియన్ వోన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.123) మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. సిస్టమ్లో జరిగిన పొరపాటు వల్ల ప్రతి విజేత ఖాతాకు 2,000 బిట్కాయిన్లు జమయ్యాయి. మొత్తం 695 ఖాతాలకు ఇలా బిట్కాయిన్లు పంపించడంతో, సుమారు 6,20,000 బిట్కాయిన్లు అనుకోకుండా బదిలీ అయ్యాయి. నేటి మార్కెట్ విలువ ప్రకారం.. వీటి విలువ సుమారు రూ.3.62 లక్షల కోట్లు (దాదాపు 40 బిలియన్ డాలర్లు).పొరపాటు జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే.. సంస్థ నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఖాతాల్లో ట్రేడింగ్ & విత్డ్రాయల్స్ను నిలిపివేసింది. అనుకోకుండా పంపిన బిట్కాయిన్లను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికి 99.7 శాతం బిట్కాయిన్లను తిరిగి రాబట్టగలిగింది.ఈ ఘటనపై స్పందించిన బిథంబ్.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇది హ్యాకింగ్ లేదా భద్రతా లోపం వల్ల జరిగిన తప్పిదం కాదని, కేవలం బహుమతుల పంపిణీ ప్రక్రియలో జరిగిన సాంకేతిక పొరపాటు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతే కాకుండా సంస్థకు సంబంధించిన భద్రతా వ్యవస్థలు బాగానే ఉన్నాయని, వినియోగదారుల ఆస్తులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగాబిథంబ్ ప్లాట్ఫారమ్లో జరిగిన ఈ తప్పిదం.. బిట్కాయిన్ ధరపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో బిట్కాయిన్ విలువ 17 శాతం తగ్గింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఫైనాన్షియల్ సూపర్వైజరీ సర్వీస్ (FSS) ఒక సమావేశం నిర్వహించి విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బిథంబ్ సంస్థ పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. -
బంగారం, వెండి.. షాకింగ్ షాపింగ్! ఒక్క గ్రాము కొనాలంటే..
బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 25,822 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పుంజుకొని 84,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.61బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.97 శాతం పెరిగింది.నాస్డాక్ 2.18 శాతం పుంజుకుంది.Today Nifty position 09-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్రేకవుట్కు చాన్సుందా?
సార్వత్రిక బడ్జెట్సహా.. యూఎస్తో ట్రేడ్ డీల్ తదితర అంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నికరంగా బలపడ్డాయి. బడ్జెట్లో ఎస్టీటీ పెంపుతో ఆదివారం అమ్మకాలు పోటెత్తగా.. యూఎస్ డీల్ వార్తలతో ఒక్కసారిగా పరుగందుకున్నాయి. వెరసి సాంకేతిక విశ్లేషణల ప్రకారం సమీప భవిష్యత్లో బ్రేకవుట్కు చాన్సున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్ వారాంతాన ప్రస్తుత ఏడాది(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం ఈ వారం అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం ఫలితాల ఆధారంగా ఆయా స్టాక్లపై అమ్మకాల, కొనుగోళ్ల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నేడు(9న) ఎస్బీఐ కౌంటర్ యాక్టివ్గా ట్రేడ్కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ, టైటన్ కంపెనీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అరబిందో, బాటా, గ్లాక్సో, ఫైజర్, ఎస్కార్ట్స్, కర్ణాటక బ్యాంక్, మదర్సన్ తదితరాలున్నాయి. ద్రవ్యోల్బణంపై దృష్టి 2026 జనవరి వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. 2025 డిసెంబర్లో సీపీఐ 1.33 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.71 శాతంకాగా.. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఈ బాటలో 13న గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2025 డిసెంబర్లో డబ్ల్యూపీఐ 0.32 శాతం నుంచి 0.83 శాతానికి ఎగసింది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడ్ డీల్ జోష్ యూఎస్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గదర్శకాలు(ఫ్రేమ్వర్క్) సిద్ధమైనట్లు వారాంతాన ప్రభుత్వం ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎగుమతి ఆధారిత రంగాలు, కంపెనీలకు జోష్నివ్వనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎగుమతి రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు వెల్లడించారు. అయితే విస్తరిస్తున్న ఏఐ టూల్స్ ప్రభావంతో దేశీ ఐటీ రంగంలో అలజడి తలెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత వారం ఐటీ దిగ్గజాల కౌంటర్లు భారీ అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం ప్రాథమికస్థాయి ఐటీ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు తలెత్తాయి. యూఎస్ ధరలు.. జనవరి నెలకు బుధవారం(11న), శుక్రవారం(13న) చైనా విభిన్న ద్రవ్యోల్బణ గణాంకాలు, హౌసింగ్ డేటా విడుదల చేయనుంది. ఈ బాటలో 2025 డిసెంబర్ నెలకు యూఎస్ రిటైల్ అమ్మకాలు 10న వెల్లడికానుండగా.. 11న వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 12న జనవరి గృహ విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు 13న విడుదలకానున్నాయి. ఈ అంశాలకు సైతం మార్కెట్లలో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. భారత్తో వాణిజ్య ఒప్పందం కారణంగా తక్కువ సుంకాలతో అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు, వైన్, లిక్కర్, ప్రాసెస్డ్ పండ్లు తదితరాలు దిగుమతికానున్నాయి.ఆటుపోట్లు తప్పవా?ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లు కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై తగినరీతిలో స్పందించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజాగా యూఎస్ ట్రేడ్ డీల్ తొలి దశ ఒప్పందం ఖరారుకావడంతో ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొనసాగుతున్న రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, కరెన్సీ బలహీనతలు, కమోడిటీలలో అమ్మకాలు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వీడి కొనుగోళ్లకు దిగడం సానుకూల అంశమని ప్రస్తావించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ కావచ్చని తదుపరి బ్రేకవుట్కు వీలున్నదని అంచనా వేశారు. సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే.. → ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలిగా 25,500–25, 450 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇంతకంటే దిగువన 25,100 వద్ద సపోర్ట్కు అవకాశముంది. ఒకవేళ బలపడితే 26,300– 26,400 పాయింట్లకు చేరే వీలుంది. వీటిని అధిగమిస్తే 26,800ను తాకవచ్చు. → బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే తొలుత 82,800–82,300 పాయింట్ల వద్ద మద్దతు కనిపించే వీలుంది. తదుపరి 81,200 వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఏస్థాయిల నుంచైనా జోరందుకుంటే 85,800–86,000 పాయింట్లకు చేరే అవకాశముంది.గత వారం అప్ గత వారం(1–6) నికరంగా సెన్సెక్స్ 1,311 పాయింట్లు(1.6 శాతం) జంప్చేసి 83,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 373 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 25,694 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లలో అమ్మకాలతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.1–0.4 శాతం మధ్య నీరసించాయి. బడ్జెట్ రోజును మినహాయించి చూస్తే సెన్సెక్స్ 2,857 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు(3.5 శాతం) చొప్పున జంప్చేశాయి. ఎఫ్పీఐల యూటర్న్ రూ. 8,100 కోట్ల పెట్టుబడులు దేశీ స్టాక్ మార్కెట్లలో 2025 కేలండర్ ఏడాదిసహా జనవరిలోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో తాజాగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి ఈ నెల 6వరకూ రూ. 8,129 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. 2026 జనవరిలో రూ. 35,692 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. 2025లో రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రీట్, ఇన్విట్ల్లో పెట్టుబడులు.. సెబీ కీలక మార్పులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్ ఫండ్స్ రీట్లు, ఇన్విట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్విట్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది. -
ఎస్బీఐ లాభాలకు ‘డివిడెండ్’ దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు లాభాలు నమోదు చేసింది. తన అసెట్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కలుపుకొని... కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.21,317 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.18,853 కోట్ల నికర లాభంతో పోలిస్తే 13.06 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు చరిత్రలోనే ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక నికర లాభం కావడం విశేషం. మొత్తం వయ్యాలు రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. ఇదే క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 9.04% పెరిగి రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు చేరింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) స్వల్పంగా 0.03% తగ్గి 3.12 శాతంగా నమోదైంది. డివిడెండ్ను కలుపుకొని వడ్డీయేతర ఆదాయం 15.65% పెరిగి రూ. 8,404 కోట్లకు చేరింది. → ఆస్తుల నాణ్యతలో బ్యాంకు మెరుగైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 31 నాటికి స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు)లు 2.2% నుంచి 1.57 శాతానికి పరిమితమయ్యాయి. కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ స్థూల ఎన్పీఏలు 1.74% గా ఉన్నాయి. స్లిప్పేజీలు రూ.3,823 కోట్ల నుంచి రూ.4,458 కోట్లకు పెరిగినప్పట్టకీ.., మొత్తం ఎన్పీఏలు నియంత్రణలోనే ఉన్నాయని బ్యాంకు చెప్పుకొచ్చింది. → మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) రూ.911 నుంచి రూ.4,507 కోట్లకు పెరిగాయి. భవిష్యత్తు అనిశి్చతులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ కేటాయింపులు చేసినట్లు బ్యాంకు తెలిపింది. → డిసెంబర్ త్రైమాసికంలో రుణాలు 15.14 శాతం పెరిగాయి. ఇందులో కార్పొరేట్ రుణాలు 13.3% వృద్ధి సాధించగా, రిటైల్ రుణ విభాగం కూడా నిలకడగా కొనసాగింది. డిపాజిట్లు 9.02% పెరిగాయి. క్రిడెట్–డిపాజిట్ నిష్పత్తి 72 శాతంగా అనువైన స్థితిలో ఉంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.... ‘‘రుణవృద్ధి గణనీయంగా పెరగడం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ అంశాలు బ్యాంకు నికర లాభాల వృద్ధికి దోహదపడ్డాయి. కార్పొరేట్ రుణాలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ రుణ విభాగం నిలకడైన ప్రదర్శనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణాల వృద్ధి లక్ష్యాన్ని 13–15 శాతానికి పెంచుతున్నాము. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఖరారుతో బ్యాంకులు రుణ వృద్ధి మరింత పుంజుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు రుణాలిచ్చేందుకు బ్యాంకులను అనుమతించాలనే ఆర్బీఐ ప్రతిపాదనను, మోసాలకు గురైన ఖాతాదారులకు రూ. 25,000 వరకు పరిహారం చెల్లింపు నిర్ణయాలను స్వాగతిస్తున్నాము. ఎస్బీఐ ‘‘డిజిటల్–ఫస్ట్’’ బ్యాంకుగా మారే దిశగా ముందుకెళ్తోంది’’ అన్నారు. -
లిస్టింగ్కు 8 కంపెనీలు రెడీ
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలోనూ దేశీయంగా ప్రైమరీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కదులుతున్నప్పటికీ పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది(2025) సెపె్టంబర్– నవంబర్ మధ్య కాలంలో సెబీకి 9 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోగా.. మిగిలిన 8 కంపెనీలకు సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్సహా.. ఆర్వీ ఇంజినీరింగ్, ఎలివేట్ క్యాంపసస్, శంకేష్ జ్యువెలర్స్, ఆర్మీ ఇన్ఫోటెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, సెడెమాక్ మెకట్రానిక్స్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా చేరాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 10,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఏడాది(2026)లో భారత్ కోకింగ్ కోల్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, అమాగీ మీడియా ల్యాబ్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మొత్తం రూ. 4,766 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఎన్బీఎఫ్సీ నుంచి.. ఎన్బీఎఫ్సీ ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఇన్క్రెడ్ హోల్డింగ్స్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్ధుల వసతి(స్టూడెంట్ ఎకామడేషన్), కే–12 ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఎలివేట్ క్యాంపసస్ ఐపీవో ద్వారా రూ. 2,550 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కే–12 సంస్థల కొనుగోలు, క్యాంపస్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు వెచ్చించనుంది. కేబుళ్ల తయారీ కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో విడిభాగాలు పవర్ట్రెయిన్ నియంత్రిత వ్యవస్థలు, ఆటో విడిభాగాల తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80,43,300 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లెడ్ అలాయ్స్ లెడ్ స్మెల్టర్ కంపెనీ ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.76 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత నాణ్యతగల లెడ్ అలాయ్స్ను తయారు చేస్తోంది. ఐటీ ఇన్ఫ్రా.. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లు అందించే ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 250 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్ఫ్రా కన్సెల్టెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సరీ్వసుల కంపెనీ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో కోటి షేర్లను ప్రస్తుత వాటా దారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 38 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. -
బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!
బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట. -
పసిడి ఆశలకు బ్రేక్.. మళ్లీ రేటెక్కిన బంగారం
వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న పసడి ప్రియుల ఆశలకు బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కరుగుతున్న వెండి.. బంగారం
న్యూఢిల్లీ: వెండి, పసిడిలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కిలో రేటు రూ.13,000 (5 శాతం) తగ్గి రూ. 2,55,000కు దిగివచ్చింది. అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ. 3,400 (2 శాతం) క్షీణించి రూ. 1,57,200కి తగ్గింది.అయితే అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్ ధర 3.02 డాలర్లు పెరిగి 74 డాలర్లకు చేరింది.ఇంట్రాడేలో 10 శాతం పతనమై 64.08 డాలర్ల స్థాయిని కూడా తాకింది. అటు ఇంట్రాడేలో 4,654.86 డాలర్ల కనిష్టాన్ని తాకిన బంగారం తర్వాత 106.74 డాలర్లు పెరిగి 4,887.30 డాలర్లకు ఎగిసింది. -
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ.. పసిడి ప్రియులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కనిపించిన రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ. 1,39,650 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,900 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా రూ. 1,53,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 1,53,710 రూపాయల వద్ద నిలిచింది. దీన్ని బట్టి చూస్తే.. గంటల వ్యవధిలో బంగారం రేటు ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. 1,39,800 రూపాయల నుంచి 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1,41,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,52,500 నుంచి 1,53,860 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు మారింది. ఉదయం 1,41,200 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం పసిడి ధర సాయంత్రానికి రూ. 1,42,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,040 రూపాయల వద్ద నుంచి రూ. 1,55,460కు చేరింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది. -
మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..
వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.వెండికి హాల్ మార్క్భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్ అయ్యాయి. మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు ఆర్బీఐ పాలసీ డే కోసం సన్నద్ధమవుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం సెషన్ ను 64.61 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 83,249.32 వద్ద ప్రారంభించగా, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 37 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టపోయి 25,605.80 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్ ప్యాక్ లో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ 1.29 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి ఇండియా 1.28 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.20 శాతం, 0.41 శాతం తగ్గాయి. ఎన్ ఎస్ ఈలో సెక్టోరల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఫార్మా, ఆటో, మెటల్, మీడియా సూచీలు 0.80 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫైనాన్షియల్స్ 0.33 శాతం వరకు లాభాలు సాధించాయి. -
సిల్వర్ క్రాష్.. రూ. 2.68 లక్షలకు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమ్మకాలు వెల్లువెత్తడం, డాలరు బలపడటంలాంటి కారణాలతో గురువారం వెండి ధరలు పతనమయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు 10 శాతం క్షీణించి (రూ. 30,300)రూ. 2.68 లక్షలకు పడిపోయింది.అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర 10 గ్రాములకు రూ. 4,500 క్షీణించి (3 శాతం) రూ. 1,60,600కి తగ్గింది. మళ్లీ అమ్మకాల ఒత్తిడి, ఒడిదుడుకులు పెరగడంతో వెండి, పసిడి రేట్ల రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్ ధర 11.94 డాలర్లు (సుమారు 14 శాతం) తగ్గి 76.26 డాలర్లకు చేరింది. పసిడి సైతం 137.32 డాలర్లు (దాదాపు 3 శాతం) క్షీణించి 4,826.99 డాలర్లకు పరిమితమైంది. చైనా ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, గ్లోబల్ మార్కెట్లు దానికి తగ్గట్లుగా స్పందించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనా న్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. ఫ్యూచర్స్లో: దేశీయంగా ఎంసీఎక్స్ వెండి మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 26,850 తగ్గి రూ. 2,42,000 వద్ద ట్రేడయ్యింది. అటు ఏప్రిల్ కాంట్రాక్టు బంగారం ధర రూ. 2,310 తగ్గి రూ. 1,50,736కి పడిపోయింది. అంతర్జాతీయంగా కామెక్స్లో సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఔన్సుకి 8.85 డాలర్లు క్షీణించి 75.55 డాలర్లకు దిగి వచ్చింది. పసిడి 80 డాలర్లు పడి 4,870.9 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
బిట్కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్కాయిన్లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్కాయిన్ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్కాయిన్ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్కాయిన్పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద, నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
పుంజుకున్న బంగారం, వెండి ధరలు తిరుగుటపా కట్టాయి. భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 86 పాయింట్లు తగ్గి 25,691 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 నష్టపోయి 83,568 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరటనిచ్చాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై రూ.1,46,150లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. -
ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,780 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 85 ఎగబాకి 83,819 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.35బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం తగ్గింది.నాస్డాక్ 1.43 శాతం నష్టపోయింది.Today Nifty position 04-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లో ర్యాలీ.. ఇప్పుడేం చేయాలంటే..
భారత స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 3, 2026 నాటి ట్రేడింగ్ సెషన్లో భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ.12.5 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. ఈ భారీ ర్యాలీకి దారితీసిన కారణాలు, రాబోయే రోజుల్లో మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.సెన్సెక్స్, నిఫ్టీ భారీ జంప్మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు (2.54%) పెరిగి 83,739.13 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 629.75 పాయింట్లు (2.51%) లాభంతో 25,718.15 వద్ద ముగిసింది.మార్కెట్ ర్యాలీకి కారణాలుభారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ప్రకటించిన ట్రేడ్ డీల్ ఈ భారీ ర్యాలీకి కీలకంగా నిలిచింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో గతంలో విధించిన 25% అదనపు పెనాల్టీ సుంకాలను అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. అలాగే భారత ఉత్పత్తులపై ప్రాథమిక సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించడం ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ వంటి ఎగుమతి రంగాలకు పెద్ద ఊరటనిచ్చింది.ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం.. భారత్-అమెరికా డీల్ వార్తలతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. జపాన్ నిక్కీ (Nikkei 225) 2.44%, దక్షిణ కొరియా కోస్పి (Kospi) 5% వరకు పెరగడం భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇచ్చింది.బడ్జెట్ అనంతరం స్పష్టత.. కేంద్ర బడ్జెట్ 2026లో ఎఫ్అండ్ఓపై ఎస్టీటీ పెంపు వంటి అంశాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని ఈ వాణిజ్య ఒప్పందం వార్తలు మరుగునపడేశాయి. పెట్టుబడిదారులు తిరిగి దేశీయ మార్కెట్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.లాభాల స్వీకరణకు అవకాశం ఉందా?మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు సహజంగానే మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్వల్పకాలంలో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. ఫిబ్రవరి 3 నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ మార్కెట్ ప్రారంభంలో వెళ్లిన గరిష్ఠాల నుంచి కొంత మేర తగ్గడం దీనికి సంకేతంగా చూడవచ్చు.ఇన్వెస్టర్లు పాటించాల్సిన జాగ్రత్తలుమార్కెట్ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. నిపుణుల సూచనల ప్రకారం కింది జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక్కసారిగా పెట్టుబడి పెట్టవద్దు.. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా క్రమానుగతంగా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.నాణ్యమైన షేర్లకే ప్రాధాన్యత.. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల లాభపడే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, కెమికల్ రంగాల్లోని నాణ్యమైన కంపెనీలను ఎంచుకోండి.స్టాప్ లాస్ తప్పనిసరి.. స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని కచ్చితమైన స్టాప్ లాస్ పాటించడం అవసరం.పోర్ట్ఫోలియో రీ-బ్యాలెన్సింగ్.. ఇప్పటికే మంచి లాభాల్లో ఉన్న షేర్లలో కొంత మేర లాభాలను స్వీకరించి నగదును సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గితే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
మళ్లీ ట్రెండ్లోకి వెండి
న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24,000 పెరిగి (9.23 శాతం) రూ.2.84 లక్షలకు (పన్నులతో కలుపుకుని) చేరింది. పసిడి సైతం 10 గ్రాములకు రూ.5,000 లాభపడి (3.3 శాతం) రూ.1,57,700 స్థాయిని తాకింది. జనవరి 29న వెండి రూ.4,04,500 వద్ద, పసిడి సైతం రూ.1,83,000 వద్ద ఆల్టైమ్ గరిష్టాలను నమోదు చేయడం తెలిసిందే.కొనుగోళ్ల మద్దతు.. ‘‘బంగారం ఇటీవలి నష్టాలను మంగళవారం కొంత భర్తీ చేసుకుంది. వెండి ధర సైతం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల భారీ విక్రయాలతో ధరలు క్షీణించడాన్ని ఇన్వెస్టర్లు చక్కని అవకాశంగా చూశారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దీర్ఘకాల పొజిషన్లు తీసుకునేందుకు దిద్దుబాటు కోసం వేచి చూసిన ఇన్వెస్టర్లు.. ధరలు దిగిరావడాన్ని అవకాశంగా భావించినట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్స్కు 9.55 డాలర్లు (12.07) పుంజుకుని 88.77 డాలర్లకు చేరింది.బంగారం సైతం ఔన్స్కు (31.10 గ్రాములు) 275 డాలర్లు లాభపడి (5.91 శాతం) 4,935.49 డాలర్ల స్థాయిని తాకింది. బంగారం, వెండికి అధిక మార్జిన్లు అవసరం కావడం, ఈ ఏడాది మేలో ఫెడ్ చైర్మన్ పావెల్ పదవీ కాలం ముగిసే వరకూ రేట్ల సవరణ ఉండదన్న అంచనాలు, రేట్ల పరంగా కఠిన దృక్పథం కలిగిన వార్‡్షను కొత్త చైర్మన్గా ప్రతిపాదించడం క్రితం మూడు సెషన్లలో బంగారం, వెండిలో విక్రయాలకు దారితీసినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ ఏవీపీ కేనత్ చైన్వాలా వివరించారు. వీటి ధరలు సమీప కాలంలో అస్థిరంగానే ఉండొచ్చన్నారు. -
సెన్సెక్స్ సునామీ
ముంబై: భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మంగళవారం దలాల్ స్ట్రీట్లో బుల్ లాభాల రంకె వేసింది.భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా సెన్సెక్స్ 2,073 పాయింట్లు ఎగసి 83,739 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 639 పాయింట్లు దూసుకెళ్లి 25,728 వద్ద నిలిచింది. గతేడాది 2025, మే 12 తర్వాత గడిచిన 8 నెలల్లో సూచీలకు ఒకరోజులో అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం.ఇంట్రాడే ట్రేడింగ్లో రికార్డు: ఉదయమే ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్ 3,657 పాయింట్ల లాభంతో 85,323 వద్ద, నిఫ్టీ 1,220 వద్ద పాయింట్లు పెరిగి 26,308 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. దలాల్స్ట్రీట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతంగా ఇంట్రాడే లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ ఏకంగా 4,205 పాయింట్లు (5.14%) ఎగసి 85,872 వద్ద, నిఫ్టీ 1,253 పాయింట్లు దూసుకెళ్లి 26,341 వద్ద గరిష్టాలు తాకాయి. తద్వారా సూచీలు ఇంట్రాడేలో అత్యధిక లాభాలు ఆర్జించిన కొత్త రికార్డు నమోదైంది. ఇన్వెస్టర్లకు లాభాల పంట: స్టాక్ మార్కెట్ రెండున్నర శాతం ర్యాలీతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. ఒక్కరోజే రూ. 12.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467.14 లక్షల కోట్లకు చేరుకుంది. ⇒ సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (–0.47%), బీఈఎల్(–0.02%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ పోర్ట్స్ 9.12%, బజాజ్ ఫైనాన్స్ 6.68%, ఇండిగో 5.51%, పవర్గ్రిడ్ 4.85%, సన్ఫార్మా 4.54 శాతం పెరిగాయి. ⇒ స్టాక్ మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల షేర్లూ పాలుపంచుకున్నాయి. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో సరీ్వసెస్ 4.86%, రియల్టీ 4.79%, పవర్ 4.79%, యుటిలిటీస్ 3.92%, క్యాపిటల్ గూడ్స్ 3.71%, ఇండస్ట్రియల్స్ 3.44%, కన్జూమర్ డిస్క్రేషనరీ 3.06%, మెటల్స్ 2.85%, ఫార్మా 2.83%, ఫైనాన్షియల్స్ సర్వీసెస్ 2.83% లాభపడ్డాయి. అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్... టెక్స్టైల్, లెదర్ స్టాక్స్: గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 20%, వెల్స్పన్ లివింగ్ 19.85%, గర్వారే టెక్నికల్ ఫైబర్స్ 17.07%, కేపీఆర్ మిల్స్ 15.31 శాతం ర్యాలీ చేశాయి.ఎస్పీ అప్పరెల్స్ 14.19% వర్ధమాన్ టెక్స్టైల్స్ 12.12%, ట్రిడెంట్ 11.27%, అర్వింద్ లిమిటెడ్ 10.23%, పేజ్ ఇండస్ట్రీస్ 3.79%, రేమాండ్ లైఫ్స్టయిల్ 3.39 శాతం లాభపడ్డాయి. సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ షేర్లు: అవంతీ ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 20% ర్యాలీ చేసి వరుసగా రూ.961, రూ.351 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకాయి. జీల్ ఆక్వా 10.58%, కింగ్స్ ఇన్ఫ్రా 7.64%, ముక్కా ప్రోటీన్స్ 5.01%, కోస్టల్ కార్పొరేషన్ 5% లాభపడ్డాయి. స్పెషాలిటీ కెమికల్స్: ఆర్తి ఇండస్ట్రీస్ 15.10%, గుజరాత్ ఫ్లోరో 6.82%, నవీన్ ఫ్లోరైన్ 6.22%, నియోజెన్ కెమ్ 6.19% పెరిగాయి. అతుల్ ఇండస్ట్రీస్ 5.25%, వినతి ఆర్గానిక్స్ 4.67%, ఎస్ఆర్ఎఫ్ 3.76%, ఆక్విటాస్ కెమ్ 1.26% లాభపడ్డాయి. వజ్రాభరణాల షేర్లు: గోల్డియమ్ ఇంటర్నేషనల్ 20%, వైభవ్ గ్లోబల్ 9.13%, కళ్యాణ్ జ్యువెలరీ 4.91%, శ్రింగార్ హౌస్ 4.51% మెరిశాయి. టైటాన్ 3%, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ 1.52%, పీసీ జ్యువెలర్ 0.29% లాభపడ్డాయి. ఆటో ఉపకరణాల కంపెనీల షేర్లు: బెల్రైజ్ ఇండస్ట్రీస్ 7.37%, భారత్ ఫోర్జ్ 6.56%, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ 6.44% బీఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ 6.13%, సుందరం ఫాస్టెనర్స్ 4%, భాష్, యూఎన్ఓ మిండా 3% పెరిగాయి. అదానీ షేర్ల పరుగులు: స్టాక్ మార్కెట్ ర్యాలీలో భాగంగా అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10.61%, అదానీ ఎంటర్ప్రైజస్ 10.38%, అదానీ ఎనర్జీ సొల్యూ షన్స్ 10.23%, అదానీ పోర్ట్స్ 9.12%, అదానీ పవర్ 6.76%, అదానీ టోటల్ గ్యాస్ 4.52%, సంఘీ ఇండస్ట్రీస్ 3.60% లాభపడ్డాయి. -
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే! -
భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.అందులో భారీ లాభాల్లో..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
దిగొస్తున్న కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
2400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 757 పాయింట్లు పెరిగి 25,846 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2467 ఎగబాకి 84,160 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల పెరుగుదలకు కారణాలు..భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.Today Nifty position 03-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూఎస్-భారత్ డీల్.. మార్కెట్లు జోరందుకుంటాయా?
యూఎస్-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది. అమెరికా పన్నుల తగ్గింపు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, బడ్జెట్ 2026 కేటాయింపులు వెరసి ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచుతున్నాయి.మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలు(అంచనా)భారత మార్కెట్లు నేడు భారీ గ్యాప్-అప్తో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?అంతర్జాతీయ పరిణామాలు భారత్కు అనుకూలంగా ఉండటంతో ఐటీ, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. అయితే మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు లాభాల స్వీకరణ జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట! -
గ్లోబల్ అనిశ్చితి వల్లే గోల్డ్ రష్
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచుతూ, వృద్ధికి దోహదపడే సాధనంగా పెట్టుబడులను ప్రభుత్వం పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఈ ధోరణినే ప్రతిఫలిస్తోందని పేర్కొన్నారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాన్ని చూస్తే వృద్ధి సాధనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. 2026–27 బడ్జెట్పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్లే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని, అనేక సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు ఏ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడాన్ని, అందుకే పసిడి వైపు మొగ్గుచూపడాన్ని ఇది తెలియజేస్తోందని ఆమె వివరించారు. స్పెక్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా సామాన్యులను నిలువరించేందుకే ఎఫ్అండ్వోపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచినట్లు వివరించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం 90 శాతం మంది పైగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్అండ్వో సెగ్మెంట్లో తీవ్ర నష్టాల పాలవుతున్నారని వెల్లడైన నేపథ్యంలో ఎస్టీటీ పెంపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ‘స్పెక్యులేషన్ అత్యధికంగా ఉంటున్న ఎఫ్అండ్వో ట్రేడింగ్తో తమ పిల్లలు తీవ్రంగా డబ్బు నష్టపోతున్నారని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని కోరుతూ చాలా మంది తల్లిదండ్రుల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎస్టీటీని పెంచడం వల్ల ఎఫ్అండ్వో ట్రేడింగ్ చేయకుండా కొంత నిరోధించేందుకు వీలవుతుంది‘ అని మంత్రి చెప్పారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ద్రవ్యలోటు లక్ష్యం ఒక్కో సంవత్సరంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ద్రవ్య లోటు లక్ష్యాలు ఆధారపడి ఉంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. గతంలో క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా కాస్త తక్కువ ఉండేలా ప్రతి ఏటా ద్రవ్య లోటు లక్ష్యాలు విధించుకునే విధానం ఉండేదని ఆమె తెలిపారు. ఈసారి వృద్ధికి మరింత ప్రాధాన్యమిస్తున్నందున 4.3 శాతం ద్రవ్య లోటు సౌకర్యవంతమైన స్థాయే అనే ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వివరించారు. డిజిన్వెస్ట్మెంట్, అసెట్ మానిటైజేషన్ యథాప్రకారంగానే కొనసాగుతాయన్నారు. పన్నుయేతర ఆదాయాలను బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయ పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
సాయంత్రానికి మరింత క్రాష్.. గంటల్లోనే పడిపోయిన బంగారం
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం భారీగా తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి మరింత పడిపోయాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.8300 తగ్గి రూ. 1,38,900 లకు దిగిరాగా సాయంత్రానికి మొత్తంగా రూ.12300 క్షీణించి రూ.1,34,900లకు పడిపోయింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.9050 తగ్గి రూ. 1,51,530 లకు తగ్గగా సాయంత్రానికి మరింత రూ.13410 పడిపోయి రూ.1,47,170లకు క్షీణించింది.వేగంగా మారిపోతున్న దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ మారుతుండటంతో బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లలో ఫాగ్-ఎండ్ కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ చివరి గంటలో పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 944 పాయింట్లు లేదా 1.17 శాతం పెరిగి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 263 పాయింట్లు లేదా 1.06 శాతం పెరిగి 25,088 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.94 శాతం, మిడ్ క్యాప్ 1.31 శాతం నష్టపోయాయి.సెన్సెక్స్లో పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఆర్ఐఎల్, ఎం&ఎం టాప్ గెయినర్లలో ఉన్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ట్రెంట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. -
ఎస్టీటీ పెంపు.. ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం వెలువడింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న స్పెక్యులేషన్ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎస్టీటీ అంటే ఏమిటి? ఎందుకు పెంచారు?స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లను లేదా డెరివేటివ్స్ను కొనుగోలు చేసినా, విక్రయించినా ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఎస్టీటీ అంటారు. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ భారీగా నష్టపోతున్నట్లు సెబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రిస్క్ను నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ విభాగంలోని ఫ్యూచర్స్ లావాదేవీలపై పన్ను రేటును సవరించారు. గతంలో 0.02 శాతంగా ఉన్న ఈ పన్నును ఇప్పుడు 0.05 శాతానికి పెంచారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా, ట్రేడింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆప్షన్స్ విభాగంలో కూడా పన్ను భారం పెరగనుంది. గతంలో ఆప్షన్స్ విక్రయాలపై 0.1 శాతంగా ఉన్న ఎస్టీటీ రేటును ప్రభుత్వం 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్ల లావాదేవీల ఖర్చు గణనీయంగా పెరగనుంది.ఉదాహరణకు..ఒక రిటైల్ ట్రేడర్ రూ.10 లక్షల విలువైన నిఫ్టీ ఆప్షన్స్ను విక్రయించాడనుకుందాం. 0.1 శాతం చొప్పున పాత పన్ను విధానంలో అతను రూ.1,000 ఎస్టీటీ చెల్లించేవాడు. 0.15 శాతంతో కొత్త పన్ను విధానంలో ఇప్పుడు అదే లావాదేవీపై రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కేవలం ఒక లావాదేవీపైనే 50% అదనపు పన్ను భారం పడుతోంది. ఇది చిన్న మొత్తాలతో ట్రేడింగ్ చేసేవారి లాభాలను గణనీయంగా తగ్గిస్తుంది.ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమారుతున్న పన్ను నిబంధనల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అతిగా ట్రేడింగ్ చేయకూడదు.. పన్నులు పెరిగినప్పుడు ప్రతి ట్రేడ్కు అయ్యే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి లాభం తక్కువగా ఉండి పన్నులు ఎక్కువగా ఉండే చిన్న ట్రేడ్లను నివారించండి.డెరివేటివ్స్ నుంచి డెలివరీ వైపు.. కేవలం లాభం కోసం చేసే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కంటే మంచి కంపెనీల షేర్లను కొని దీర్ఘకాలం ఉంచుకునే (Delivery Trading) పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పన్ను భారం తగ్గుతుంది.ట్రేడ్ చేసేటప్పుడు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా పెరిగిన ఎస్టీటీ, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నులన్నీ పోగా లాభం మిగులుతుందో లేదో ముందే అంచనా వేసుకోవాలి.మ్యూచువల్ ఫండ్స్/ ఈటీఎఫ్.. నేరుగా ట్రేడింగ్ చేసి నష్టపోయే కంటే నిపుణుల ద్వారా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం సురక్షితం.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొత్తం 15 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎనిమిది సార్లు నష్టాలు మూటగట్టుకుంది. ఏడు పర్యాయాలు లాభాలు ఆర్జించింది. ఇందులో 2019, 2024 సాధారణ ఎన్నికలకు ముందు రెండుసార్లు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.బడ్జెస్ట్ రోజు సెన్సెక్స్ ఇలా..➤2014 జూలై 10 - 72 పాయింట్ల లాభం: 25,373 వద్ద ముగింపు➤2015 ఫిబ్రవరి 28 - 141 పాయింట్ల లాభం: 29,362 వద్ద ముగింపు➤2016 ఫిబ్రవరి 29 - 152 పాయింట్ల నష్టం: 23,002 వద్ద ముగింపు➤2017 ఫిబ్రవరి 1 - 486 పాయింట్ల లాభం: 28,142 వద్ద ముగింపు➤2018 ఫిబ్రవరి 1 - 58 పాయింట్ల నష్టం: 35,907 వద్ద ముగింపు➤2019 ఫిబ్రవరి 1 - 213 పాయింట్ల లాభం: 36,469 వద్ద ముగింపు➤2019 జూలై 5 - 58 పాయింట్ల నష్టం: 39,513 వద్ద ముగింపు➤2020 ఫిబ్రవరి 1 - 395 పాయింట్ల నష్టం: 39,736 వద్ద ముగింపు➤2021 ఫిబ్రవరి 1 - 2,315 పాయింట్ల లాభం: 48,601 వద్ద ముగింపు➤2022 ఫిబ్రవరి 1 - 848 పాయింట్ల లాభం: 58,863 వద్ద ముగింపు➤2023 ఫిబ్రవరి 1 - 158 పాయింట్ల లాభం: 59,708 వద్ద ముగింపు➤2024 ఫిబ్రవరి 1 - 107 పాయింట్ల నష్టం: 71,645 వద్ద ముగింపు➤2024 జూలై 23 - 73 పాయింట్ల నష్టం: 80,429 వద్ద ముగింపు➤2025 ఫిబ్రవరి 1 - 5 పాయింట్ల నష్టం: 77,506 వద్ద ముగింపు➤2026 ఫిబ్రవరి 1 - 1,843 పాయింట్ల నష్టం: 80,723 వద్ద ముగింపు -
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన తరువాత.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ ప్రభావం ఈ రోజు (ఫిబ్రవరి 2) కూడా కొనసాగింది. దీంతో రేట్లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం పసిడి ధర గరిష్టంగా 10370 రూపాయలు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు తగ్గి 24,836 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పెరిగి నష్టపోయి 80,872 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాల్మార్ట్ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.బంగారం, వెండి & బిట్కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.DIfFERENCE BETWEEN Rich People and Poor People:When Walmart has a SALE poor people rush in and buy, buy, buy.Yet when the Financial Asset Market has a sale….a.k.a…..CRASH…the poor sell and run….while the rich rush in….and buy, buy, buy.The gold, silver, and Bitcoin…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 1, 2026 -
క్యాపిటల్ గెయిన్స్గా షేర్ల బైబ్యాక్
మైనారిటీ షేర్హోల్డర్ల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రమోటర్లు ట్యాక్స్ ఆర్బిట్రేజ్ పొందకుండా నివారించేలా షేర్ల బైబ్యాక్లకు సంబంధించిన ట్యాక్సేషన్ నిబంధనలను బడ్జెట్లో సవరించారు. అన్ని కేటగిరీల షేర్హోల్డర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్నులు వేసేలా ప్రతిపాదించారు. ప్రమోటర్లపై అదనంగా బైబ్యాక్ ట్యాక్స్ని ప్రస్తావించారు. దీనితో కార్పొరేట్ ప్రమోటర్లకు ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 22 శాతానికి, నాన్–కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతానికి పెరిగినట్లవుతుంది.బైబ్యాక్ మార్గాన్ని ప్రమోటర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టడానికి దీన్ని ఉద్దేశించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రమోటర్లపై అధిక పన్నుల భారం మోపడం వల్ల డివిడెండ్లు, బైబ్యాక్లకు జరిపే కేటాయింపుల విషయంలో కంపెనీలు తమ వ్యూహాలపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. షేర్హోల్డర్ల నుంచి సొంత షేర్లను కొనుగోలు చేసే కంపెనీలపై విధించే ట్యాక్స్ని మార్కెట్ పరిభాషలో బైబ్యాక్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. కంపెనీలు తమకొచ్చిన లాభాలను వాటాదార్లకు డివిడెండ్ రూపంలో చెల్లించడానికి బదులు, ఇలా షేర్ల బైబ్యాక్ కోసం వెచ్చించడాన్ని నివారించేందుకు ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తుంది.పన్ను భారం 30 శాతం (అత్యధిక శ్లాబ్ రేటు) నుంచి క్యాపిటల్ గెయిన్స్ రేట్ల స్థాయికి తగ్గడం వల్ల (స్వల్పకాలానికి 20 శాతం, దీర్ఘకాలానికి 12.5 శాతం) ఇండివిడ్యువల్ షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హోల్టైమ్ డైరెక్టర్ రూప్ భూత్రా తెలిపారు. అదే సమయంలో కార్పొరేట్లకు ఇది ప్రతికూలంగా ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీలు మిగులు నిధులను బైబ్యాక్ల కోసం వెచ్చించడాన్ని నివారించి, మూలధన పెట్టుబడులు, పరిశోధన కార్యకలాపాల వైపు మళ్లించేందుకు దోహదపడుతుందని వివరించారు.ఇదీ చదవండి: ‘ఛాంపియన్ల’ కోసం మూడంచెల వ్యూహం -
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్అండ్వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్ డకౌట్
2026 బడ్జెట్ మ్యాచ్లో నిర్మలా సీతారామన్ వేసిన తొలి ఓవర్కే స్టాక్ మార్కెట్ డకౌట్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్ టాస్కి బ్రోకరేజీలు క్లీన్ బౌల్డ్ అయ్యాయి. బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పాయింట్ల బ్యాటింగ్ చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్ వేసిన అనూహ్య బౌన్సర్కు సెన్సెక్స్–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్ ఓవర్లోనే సెన్సెక్స్పై భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్ సెషన్కల్లా రెడ్ స్కోర్బోర్డ్ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్ అయ్యి వెనుదిరిగితే, ఎల్బీడబ్లు్య అప్పీల్కి బుల్స్ చేతులు ఎత్తేశారు. బడ్జెట్ మ్యాచ్ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్తో ముగిసింది.న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్ స్టాక్ మార్కెట్పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బడ్జెట్ రోజైన ఆదివారం సెన్సెక్స్ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్ సాగిందిలా బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్టీటీ రద్దు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష ‘‘బడ్జెట్లో ఎస్టీటీ, కార్పొరేట్ బైబ్యాక్లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్లో వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని అంశాలు ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్ టెక్నాలజీస్ 4.21%, కేన్స్ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్ 2.95%, డీసీఎక్స్ సిస్టమ్స్ 2.06%, సైయంట్ డీఎల్ఎం 1 శాతం లాభపడ్డాయి. → సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్(2%), ఇన్ఫోసిస్(1.17%), సన్ఫార్మా(0.95%), టైటాన్ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్బీఐ(5.61%), అదానీపోర్ట్స్(5.53%), బీఈఎల్(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్ (3.88%) õÙర్లు నష్టపోయాయి. → ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్ లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్యూ బ్యాంక్స్ 5.60%, మెటల్ 3.85% క్షీణించాయి. కమోడిటీస్ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్ గూడ్స్ 3.08%, వినిమయ 2.98%, → ఇండ్రస్టియల్స్ 2.66%, విద్యుత్ 2.52% పతనమయ్యాయి. బీఎస్ ఈ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి. → ఎస్టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. → క్యూ3లో లాభం 16% వృద్ధి నమోదుతో సన్ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది. -
బడ్జెట్ దెబ్బ.. కుప్పకూలిన మార్కెట్లు
బడ్జెట్ 2026 దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ను 50-150 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించిన తరువాత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుండి పారిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు ఆదివారం ప్రత్యేక సెషన్ తీవ్ర నష్టాలతో ముగించాయి.ఫ్యూచర్ ట్రేడ్స్ పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,843 పాయింట్లు లేదా 2.23 శాతం 80,723 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 495 పాయింట్లు లేదా 1.96 శాతం నష్టపోయి 24,825 వద్ద నిలిచింది.సెషన్లో అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పడిపోయి 79,899.42 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.విస్తృత మార్కెట్లు కూడా భారీ అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.7 శాతం నష్టపోయాయి. పెట్టుబడిదారులలో భయాన్ని సూచించే ఫియర్ గేజ్ - ఇండియా వీఐఎక్స్ దాదాపు 12 శాతం పెరిగింది.రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు పడిపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతానికి పైగా క్షీణించాయి.నిఫ్టీలోని 50 స్టాక్లలో భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. వాటి షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్లో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్కేర్ లాభాలను అందుకున్నాయి. ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి. -
హ్యాట్రిక్ క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా మూడో రోజూ అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు(Today Gold Rate) భారీ తగ్గుదలను నమోదు చేశాయి. వెండి ధరలూ (Today Silver Rate) భారీగా పతనమ్యాయి.రూ.13,711 తగ్గిన బంగారంఅమ్మకాలు పెరగడంతో ఎంసీఎక్స్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ లోయర్ సర్క్యూట్ను తాకాయి. విలువైన లోహాల అమ్మకాలు వరుసగా రెండవ సెషన్కు కొనసాగాయి, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ గణనీయంగా తగ్గాయి.ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.13,711 లేదా 9 శాతం తగ్గి రూ.1,38,634కి చేరుకుంది, ఫ్యూచర్స్ ట్రేడ్ సమయంలో దాని కనిష్ట సర్క్యూట్ స్థాయిని తాకింది.మునుపటి సెషన్లో, బంగారం రూ.31,617 లేదా 17.2 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,52,345 వద్ద స్థిరపడింది, గురువారం 10 గ్రాములకు రూ.1,93,096 రికార్డు స్థాయిని తాకింది.సిల్వర్ రూ.26,273 డ్రాప్లాభాల బుకింగ్ మధ్య MCXలో సిల్వర్ ఫ్యూచర్స్ లోయర్ సర్క్యూట్కు క్రాష్ అయ్యాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ భారీగా అమ్మకాలు జరపడంతో ట్రేడర్లు లాభాలను అధిక స్థాయిలో బుక్ చేసుకున్నారు. మార్చి వెండి కాంట్రాక్ట్ రూ.26,273 లేదా 9 శాతం తగ్గి కిలోకు రూ.2,65,652 వద్ద కనిష్ట సర్క్యూట్ను తాకింది.శుక్రవారం భారీ పతనం తర్వాత వెండి రూ.1,07,968 లేదా 27 శాతం తగ్గి కిలోకు రూ.2,91,925 వద్ద స్థిరపడింది, ఇది కూడా లోయర్ సర్క్యూట్ను తాకింది. గురువారం వెండి కిలోకు రూ.4,20,048 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ భారీ దిద్దుబాటు జరిగింది.ప్రపంచ మార్కెట్ అస్థిరత, కేంద్ర బడ్జెట్ ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత సెంటిమెంట్ మధ్య లాంగ్ పొజిషన్లను దూకుడుగా నిలిపివేయడం వల్ల ఈ భారీ పతనం జరిగిందని వ్యాపారులు తెలిపారు. -
Budget 2026 : NRIలకు గుడ్న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్సభలో తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. -
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!
భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట. -
ఆదివారం స్పెషల్ ట్రేడింగ్..!
కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం(ఫిబ్రవరి 1న) స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగనుంది. సాధారణ పనిదినాల మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్ పనిచేస్తుంది. ఎంసీఎక్స్లో ఉదయం 9నుంచి 5 గంటల వరకు మొదటి సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన.. కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్కు ఆదివారం సెలవు లేదన్నమాట). -
పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?
బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు. -
పాదరసంలా పడిపోయిన వెండి.. కారణాలివే..
దేశీయ వెండి ధరలు ఇటీవల వారాల పాటు కొనసాగిన తీవ్ర హెచ్చుతగ్గుల అనంతరం కొంత శాంతించాయి. ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకిన వెండి ధరలు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సంకేతాల ప్రభావంతో తగ్గుదల బాట పడుతున్నాయి.జనవరి నెల వెండికి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. నెల ప్రారంభం నుంచే ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, బలహీనమైన అమెరికన్ డాలర్, సురక్షిత పెట్టుబడిగా లోహాలపై పెరిగిన డిమాండ్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.జనవరి చివరి నాటికి వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరాయి. జనవరి 31 నాటికి భారతదేశంలో భౌతిక వెండి కిలోకు సుమారు రూ.3.35 లక్షల వద్ద ట్రేడవగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.3.95 లక్షల వరకు చేరింది. శనివారం (జనవరి 31) ఒక్క రోజే వెండి ధర కేజీకి రూ.55 వేలు పతనమైంది. జనవరి 30న, కామెక్స్ లో వెండి గరిష్ట ధర (ఔన్స్కు) 118 డాలర్ల నుండి 37 శాతం తగ్గి 74 డాలర్లకు పడిపోయింది.ఎందుకీ తగ్గుదల?వెండి ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల వెనుక ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఉన్నాయి.అమెరికా డాలర్ బలపడటంతో విలువైన లోహాలపై ఆసక్తి తగ్గింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు విదేశీ కొనుగోలుదారులకు వెండి మరింత ఖరీదవుతుంది.బంగారం ధరలు పడిపోవడం కూడా వెండిపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం–వెండి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా కెవిన్ వార్ష్ను నామినేట్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్లో మార్పు వచ్చింది.ఈ పరిణామాలన్నీ కలసి వెండి ధరలను ఇటీవలి గరిష్ఠాల నుంచి వెనక్కి నెట్టేశాయి.ఇది చదివారా? కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా? -
బంగారం, వెండి ధరలు క్రాష్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లోకి బిగ్బాస్ ఎంట్రీ
న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఐపీవో విషయంలో ముందుకెళ్లేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నో అబ్జక్షన్ సరి్టఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసింది. ఇష్యూకి సెబీ అనుమతి లభించడం తమ సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయని ఎన్ఎస్ఈ చైర్పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి తెలిపారు. భాగస్వాములందరికి మరింత విలువను జోడించేందుకు ఇది తోడ్పడగలదని చెప్పారు. ఎన్వోసీ లభించిన తర్వాత ఇష్యూకి రావడానికి ఏడు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహన్ గతంలో తెలిపారు.సంస్థ ఐపీవో దేశీయంగా అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎన్ఎస్ఈలో సుమారు 1.77 లక్షల షేర్హోల్డర్లుండగా, అన్లిస్టెడ్ గ్రే మార్కెట్లో రూ. 5 లక్షల కోట్ల పైగా విలువ పలుకుతోందని అనలిస్టులు తెలిపారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ప్రస్తుత షేర్హోల్డర్ల వాటాల విక్రయం ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు 2016లో ఎన్ఎస్ఈ మొదటిసారిగా ముసాయిదా ఆఫర్ పత్రాలను సమర్పించింది.అయితే, గవర్నెన్స్ లోపాల ఆరోపణలు, కో–లొకేషన్ కేసు తదితర అంశాల కారణంగా పబ్లిక్ ఇష్యూకి అప్పట్లో సెబీ ఆమోదముద్ర వేయలేదు. ఆ తర్వాత నుంచి ఎన్ఎస్ఈ పలుమార్లు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రూ. 1,388 కోట్లు చెల్లించి కో– లొకేషన్ కేసును పరిష్కరించుకునేందుకు ఎన్ఎస్ ఈ గతేడాది ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో కంపెనీ లిస్టింగ్ ప్రణాళికలను పరిశీలించేందుకు 2025 మార్చ్లో అంతర్గతంగా కమిటీని వేసింది. సెటి ల్మెంట్ అభ్యర్ధనకు ఆమోదముద్ర వేసినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఇటీవలే తెలిపారు. -
మెటల్స్ క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ మధ్య ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, అమెరికా డాలరు పుంజుకోవడం తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 14,000 క్షీణించి రూ. 1,69,000కు తగ్గింది. అటు వెండి సైతం కేజీకి రూ. 20,000 తగ్గి రూ. 3,84,500కి క్షీణించింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు 8% క్షీణించి రూ. 1,68,750 వద్ద ట్రేడయ్యింది.సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఒక దశలో క్రితం ముగింపు రూ. 4,20,048తో పోలిస్తే ఏకంగా రూ. 1,07,971 మేర పతనమైంది. దాదాపు 27% పడిపోయి రూ. 2,91,922 వద్ద ట్రేడయ్యింది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ జరగడంతో పసిడి, వెండి ధరలు కరెక్షన్కి లోనైనట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కె ట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 285.30 డాలర్లు తగ్గి 5,087.73 డాలర్లకు క్షీణించింది. ఒక దశలో 425.86 డాలర్లు క్షీణించి 4,945.26 డాలర్లకు పతనమైంది. ఇక వెండి కూడా ఇంట్రాడేలో 17.5 శాతం పడి 95.26 డాలర్లను కూడా తాకింది. చివరికి 12% (14 డాలర్లు) తగ్గి 101.47 డాలర్ల వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్లో పుత్తడి ఏప్రిల్ కాంట్రాక్టు 273 డాలర్లు తగ్గి 5,085 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. వెండి దాదాపు 16 డాలర్లు క్షీణించి 98.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. -
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.బంగారం ధరలపై విలియం లీ స్పందనబంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం! -
త్వరలో బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బడ్జెట్ సెషన్కు ముందు ఊగిసలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 167 పాయింట్లు తగ్గి 25,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 522 పాయింట్లు నష్టపోయి 82,071 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 30-01-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం కొనొద్దు.. విలియం లీ హెచ్చరిక!
2025 జనవరిలో రూ. 78వేలు వద్ద ఉన్న బంగారం ధర 2026 జనవరికి రూ. 1.78లక్షలు క్రాస్ చేసింది. ఏడాది కాలంలో లక్ష రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న తీరు చూసి పసిడి ప్రియులలో కూడా ఒకింత భయం మొదలైంది. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా.. పెరిగిపోతుండడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ కొనడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు.బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ప్రజలను భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్ అని విలియం లీ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్చితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయని ఆరోపించారు.ఇదీ చదవండి: ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!1980లో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు గోల్డ్ కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తరువాత గోల్డ్ రేటు 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు (2026) కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి రేటు పెరిగిందని కొనేయకండి. కొన్ని రోజులు వేచి చూడండి. తప్పకుండా.. బంగారం ధర తగ్గుతుందని చెప్పారు. -
వొడాఫోన్కు తగ్గిన నష్టాలు
టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) రూ.5,286 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టం రూ.6,609 కోట్లతో పోల్చితే సుమారు 20 శాతానికి పైనే తగ్గింది. ఆదాయం ఇదే కాలంలో రూ.11,117 కోట్ల నుంచి రూ.11,323 కోట్లకు పెరిగింది.ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 7.3 శాతం పెరిగి రూ.186కు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.173గా ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.09 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో బ్యాంక్లకు రూ.4,424 కోట్ల బకాయి పడగా, స్పెక్ట్రమ్కు సంబంధించి వాయిదా పడిన చెల్లింపులు రూ.1.24 లక్షల కోట్లు ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాల నుంచి లాభాల్లోకి..
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221.69 పాయింట్ల (0.27 శాతం) లాభంతో.. 82,566.37 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్ల (0.30 శాతం) లాభంతో 25,418.90 వద్ద నిలిచాయి.హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్, డిజికాంటెంట్ లిమిటెడ్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, సువిధా ఇన్ఫోసర్వ్ లిమిటెడ్, జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ ఒక్క రోజే (జనవరి 29) కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.ధరలు పెరగడానికి కారణంబంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు వస్తాయనే భయంతో.. చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనావెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొఅహదపడ్డాయని చెబుతున్నారు. -
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 115 పాయింట్లు తగ్గి 25,223 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 436 పాయింట్లు నష్టపోయి 81,898 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-01-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెండి, పసిడి అదే పరుగు..
న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కిలో ధర మరో రూ. 15,000 పెరిగి ఇంకో కొత్త ఆల్ టైం గరిష్టం రూ. 3,85,000కి ఎగిసింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,000 మేర పెరిగి రూ. 1,71,000కు ఎగిసింది. బంగారం, వెండి రేట్లు పటిష్టంగా ర్యాలీ చేస్తున్నాయని, ప్రతీ రోజు కొత్త గరిష్టాలకు ఎగదోసేందుకు బుల్స్కి కొత్త కారణాలు లభిస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరంగా అనిశ్చితులు మొదలైన అంశాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి రేట్లకు రెక్కలొస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 74.57 డాలరు పెరిగి 5,256.35 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 130.13 డాలర్లు ఎగిసి 5,311.38 డాలర్ల స్థాయిని కూడా తాగింది. అటు సిల్వర్ ధర 0.12 శాతం పెరిగి 112.22 డాలర్లకు చేరింది. అటు ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్టు ఒక దశలో దాదాపు 200 డాలర్లు పైగా పెరిగి 5,344.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఇక సిల్వర్ సైతం సుమారు పది డాలర్లకు పైగా పెరిగి ఒక దశలో 116.11 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ కాంట్రాక్టు రూ. 1,75,848 వద్ద, సిల్వర్ మార్చి కాంట్రాక్టు రూ. 3,85,200 వద్ద ట్రేడయ్యింది. అనిశ్చితికి, టారిఫ్ బెదిరింపులు, ఫెడరల్ రిజర్వ్ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాల్లాంటివి భౌగోళిక–రాజకీయ అనిశ్చితికి దారితీస్తూ, సిల్వర్, గోల్డ్ ధరలను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. -
కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?
ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకికి బంగారం, వెండిపై పెట్టుబడులంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అయితే తాను వెండిని మొత్తం అమ్మి బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టానన్న వార్తలు వచ్చాయని, వాటిని ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.దీని గురించి రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్లో జరిగిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని చెప్పారు.అయితే, తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. ఆ నిర్ణయం పెద్ద తప్పు అని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదు’ అన్నారు.కియోసాకి తన పెట్టుబడి తత్వాన్ని మరోసారి వివరించారు. అప్పు ఉపయోగించి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చే రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసి, ఆ ఆదాయంతో బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పారు.అమెరికన్ డాలర్ వంటి ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించిన కియోసాకి, “నకిలీ డాలర్లను అమ్మి నిజమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం” అని పెట్టుబడిదారులకు సూచించారు.ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అస్థిరతలపై కియోసాకి గతంలోనూ పలు హెచ్చరికలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలు, క్రిప్టోకరెన్సీలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం.FYI SILVER Fact:I was at VRIC Vancouver Resource Investor Conference. Great event for anyone serious about their financial education on gold and silver.At VRIC I was informed there is a rumor I sold all my silver to buy more Bitcoin.This is not true. The facts are:I…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2026 -
షాకింగ్ ధరలు.. కొత్త మార్క్లకు బంగారం, వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజు విరామం ఇచ్చి అమాంతం ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బంగారం ధరలు(Today Gold Rate) భారీ పెరుగుదలను నమోదు చేశాయి. వెండి ధరలు కొత్త మార్క్ను తాకాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 34.88 పాయింట్లు పెరిగి 81,892.36 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 83.45 పాయింట్ల లాభంతో 25,258.85 వద్ద ప్రారంభమైంది.భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఖరారు చేయడంపై సానుకూల సెంటిమెంట్ మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో పయనిస్తున్నాయి.Today Nifty position 28-01-2026(time: 9:25 am)నేటి క్యూ3 ఫలితాలులార్సెన్ & టూబ్రో, మారుతి సుజుకి ఇండియా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టివిఎస్ మోటార్, లోధా డెవలపర్స్, ఎస్బిఐ కార్డ్స్, జిఇ వెర్నోవా టిడి ఇండియా, ఫీనిక్స్ మిల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, కొచ్చిన్ షిప్యార్డ్, గ్లాండ్ ఫార్మా, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, టివిఎస్ హోల్డింగ్స్, పైన్ ల్యాబ్స్, స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్, పిరమల్ ఫార్మా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ, ఇక్లెర్క్స్ సర్వీసెస్ తదితరాలు ఈ రోజు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎస్జీబీలతో కేంద్ర ఖజానాకు గండి!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సార్వభౌమ గోల్డ్ బాండ్ (సావరిన్ గోల్డ్ బాండ్స్-SGB) రిడెంప్షన్ల భారం ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ వ్యయాన్ని తట్టుకునేందుకు రానున్న బడ్జెట్లో ‘గోల్డ్ రిజర్వ్ ఫండ్’ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.నిధుల కేటాయింపులో భారీ వ్యత్యాసంగత కొన్నేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.8,550 కోట్లు కేటాయించగా, రిడెంప్షన్ల ఒత్తిడి వల్ల సవరించిన అంచనాల్లో అది ఏకంగా రూ.28,000 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) కేవలం రూ.700 కోట్లే ప్రాథమికంగా కేటాయించినప్పటికీ వాస్తవ రిడెంప్షన్ల దృష్ట్యా దీన్ని భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్ అంచనాల్లోనూ ఈ నిధికి సింహభాగం కేటాయించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.పెరుగుతున్న భారంఎస్జీబీ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. బాండ్లు జారీ చేసినప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ ధరలు 4 నుంచి 5 రెట్లు పెరగడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.సార్వభౌమ గోల్డ్ బాండ్ (SGB) పథకంలో భాగంగా 2017-18 సిరీస్ కింద జారీ చేసిన బాండ్ల ధరలను పరిశీలిస్తే అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.2,881 నుంచి రూ.2,951 మధ్య ఉంది. అయితే, ఈ బాండ్లు మెచ్యూరిటీ సమయానికి బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు ఒక్కో గ్రాముపై రూ.9,486 నుంచి రూ.13,486 వరకు రిడెంప్షన్ ధరను పొందగలిగారు. అంటే జారీ చేసిన ధరతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు అధిక లాభం చేకూరింది.ఇక 2018-19 సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఐదో ట్రాంచ్ (5th Tranche) బాండ్లు ముందస్తు రిడెంప్షన్కు (Premature Redemption) అవకాశం లభించింది. ఈ క్రమంలో వీటిని ఒక్కో యూనిట్కు రూ.14,853 గరిష్ట ధర వద్ద రిడీమ్ చేయడం గమనార్హం. ఇది అప్పట్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గ్రాముకు రూ.16,000 మార్కును దాటి కొనసాగుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదల వల్ల రాబోయే కాలంలో రిడెంప్షన్ కావాల్సిన బాండ్ల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.2026-27లో 2018-19 సిరీస్కు చెందిన 6 ట్రాంచ్లు తుది రిడెంప్షన్కు రానున్నాయి. అలాగే 2021-22 సిరీస్కు చెందిన 10 ట్రాంచ్లు ముందస్తు రిడెంప్షన్కు అర్హత సాధించనున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపనున్నాయి.కొత్త బాండ్ల జారీకి బ్రేక్భౌతిక బంగారం దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 146 టన్నులకు పైగా బంగారానికి సమానమైన పెట్టుబడులు వచ్చాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వానికి ఇది భారంగా మారింది. 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 వరకు మొత్తం 67 ట్రాంచ్లు జారీ అయ్యాయి. పెరుగుతున్న ఆర్థిక భారంతో 2024 తర్వాత ప్రభుత్వం కొత్త ట్రాంచ్లను జారీ చేయలేదు. భవిష్యత్తులోనూ కొత్త బాండ్లు వచ్చే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.ధర నిర్ణయం ఇలా..ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత గల బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. రిడెంప్షన్ తేదీకి ముందున్న చివరి మూడు వ్యాపార దినాల సగటు ధర ఆధారంగా పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తారు.ఇదీ చదవండి: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.77 పాయింట్ల లాభంతో.. 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, కామధేను లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వన్సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, SBFC ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,100 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 27-01-2026(time: 9:32 am)ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లిస్టింగ్కు 12 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా.మార్కెట్ మాతృ సంస్థ హెల్లా ఇన్ఫ్రా మార్కెట్, పర్పుల్ స్టయిల్ ల్యాబ్స్ సహా 12 కంపెనీల ప్రతిపాదిత ఐపీవోలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో జై జగదంబ లిమిటెడ్, యూకేబీ ఎల్రక్టానిక్స్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, ట్రాన్స్లైన్ టెక్నాలజీస్, మెడిక్యాప్ హెల్త్కేర్, ఓస్వాల్ కేబుల్స్, బీవీజీ ఇండియా, సాయి పేరెంటరల్స్, కామ్టెల్ నెట్వర్క్స్, సిఫీ ఇని్ఫనిట్ స్పేసెస్ ఉన్నాయి. గతేడాది జూన్–అక్టోబర్ మధ్య ఈ 12 కంపెనీలు తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి దాఖలు చేశాయి. వివరాలు.. → నిర్మాణ రంగ మెటీరియల్స్ సరఫరా కంపెనీ ఇన్ఫ్రా.మార్కెట్ ప్రతిపాదిత ఐపీవో ద్వారా రూ. 4,500 కోట్ల నుంచి రూ. 5,550 కోట్ల వరకు సమీకరించనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాన్ఫిడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ విధానంలో కంపెనీ దరఖాస్తు చేసింది. షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఇష్యూ ఉండనుంది. కంపెనీలో టైగర్ గ్లోబల్ పెట్టుబడులు పెట్టింది. ళీ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇని్ఫనిట్ స్పేసెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 2,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ళీ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్ఫాం పెర్నియాస్ పాప్ అప్ షాప్ మాతృ సంస్థ పర్పుల్ స్టయిల్ ల్యాబ్స్ తాజా షేర్ల జారీతో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 660 కోట్లు సమీకరించనుంది. → వీడియో సరై్వలెన్స్, బయోమెట్రిక్ సొల్యూషన్స్ సంస్థ ట్రాన్స్లైన్ టెక్నాలజీస్ తలపెట్టిన పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు, ఒక షేర్హోల్డరు 1.62 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ళీ ఎల్రక్టానిక్స్ తయారీ సరీ్వసులందించే నోయిడా సంస్థ యూకేబీ ఎల్రక్టానిక్స్ తమ పబ్లిక్ ఇష్యూ కింద రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. → నాన్–ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ సేవల సంస్థ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. 4.28 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → ఓస్వాల్ కేబుల్స్ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించనుంది. అలాగే 2.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ళీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవల సంస్థ బీవీజీ ఇండియా ప్రతిపాదిత ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు 2.85 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో విక్రయించనున్నారు. → కామ్టెల్ నెట్వర్క్స్ ఐపీవో ద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఓఎఫ్ఎస్ రూపంలో రూ. 750 కోట్లు సమకూర్చుకోనుంది. ఫ్రెష్ ఇష్యూ నిధులను ప్రధానంగా రుణాల చెల్లింపునకు ఉపయోగించుకోనుంది. కంపెనీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. -
ధనికులే స్టాక్ మార్కెట్లతో లాభం ఆర్జిస్తున్నారు
(ఎం.రమణమూర్తి): ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ సాధ నా లు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్థాయిలో రాబడులివ్వటం లేదని, వాస్తవ వడ్డీరేట్లు చూస్తే తరచూ నెగెటివ్ స్థాయిలోనే ఉంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డా రు. ధనికులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతుంటే మధ్యతరగతి మాత్రం బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఒకరకంగా నెగెటివ్ వడ్డీని అందుకుంటోందని తనకిది సముచితంగా కనిపించ ట్లేదని చెప్పారు. ఈ దశలో స్టాక్ మార్కెట్ల దిశగా జనాన్ని నడిపించే లా కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్థించారు. సామా న్యులు సైతం మెరుగైన రాబడులు సాధించడానికిది ఉపయోగపడు తుందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా సోమవారం ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎకానమీ, ఆహార భద్రత, యువత ఆలోచనలు సహా పలు అంశాల పై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పటిదాకా మనది పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇటీవల కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలు ఈ పొదుపు మొత్తాలన్నిటినీ స్టాక్ మార్కెట్ల దిశగా మళ్లించేలా ఉంటున్నాయి? భారత్ లాంటి దేశానికిది కరెక్టేనా? మన బ్యాంకులన్నీ అద్భుతమైన నియంత్రణ వ్యవస్థలో ఉన్నాయి. కాకపోతే వాస్తవ వడ్డీరేట్లు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటున్నాయి. కాస్త ఉన్నతస్థాయి వర్గాలకు స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉంది. మిగిలిన వాళ్లంతా వడ్డీ రేట్లపైనే ఆధారపడుతున్నారు. వాస్తవంగా చూస్తే ఈ వడ్డీరేట్లు ప్రతికూల రాబడులే ఇస్తున్నాయి. మరి కొంత బ్యాలెన్స్ అవసరం కదా? సగటు మనుషులు కూడా మెరుగైన రాబడులు పొందాలి కదా? అందుకే స్టాక్ మార్కెట్లలోకి మళ్లించటమనేది మంచిదనిపిస్తుంది.ఇలా చేయటం ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుని, దాన్ని పౌరులమీదికి నెట్టేయటం కాదా?అలాగని చెప్పలేం. ఎందుకంటే జనం ఎలాగూ కొంత పొదుపు చేస్తున్నారు. ఆ పొదుపు వల్ల ప్రభుత్వం లాభపడుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ బాండ్లలో జనం పొదుపు చేయటం వల్ల వాళ్లకు తక్కువ వడ్డీ ఇచ్చి ప్రభుత్వం లాభపడుతోంది. వాస్తవంగా చూస్తే మధ్య తరగతి జనం ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసి తక్కువ రాబడికే పరిమితమవుతున్నారు. శ్రీమంతులు మాత్రం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు సైతం విస్తరించి అధిక రాబడులు ఆర్జిస్తున్నారు. ఇదైతే నాకు కరెక్టనిపించటం లేదు.మీరు కాసేపటికి ముందు మాట్లాడిన సెషన్లో కూడా ఫుడ్ ఎకనమిక్స్ను ప్రస్తావించారు. ఆహార భద్రతకు ప్రభుత్వాలు చేయాల్సిందేమైనా ఉందా?ఆహార ధాన్యాలను దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రత గురించి మాట్లాడితే... ఇపుడు చాలామందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అవి అందుతున్నాయి. కానీ నా దృష్టిలో ప్రొటీన్ కూడా ఆహార భద్రత పరిధిలోకి రావాలి. భారతీయ ఆహార పద్ధతులు చాలావరకూ ప్రొటీన్కు దూరంగా... కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలతో నిండిపోయాయి. ఆ పరిస్థితి మారాలి. మీరు వరి పంటను కూడా ఒకరకంగా వ్యతిరేకిస్తున్నారు. ఉచిత విద్యుత్ వల్లే వరి సేద్యం పెరిగిందని, ఆ పరిస్థితి మారాలని చెబుతున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలు పేదలకు అందుబాటులో లేవు కదా?ఇప్పుడు చిరుధాన్యాలు (మిల్లెట్స్) కాస్త ప్రియమే. కానీ ముందు నుంచీ ఆ పరిస్థితి లేదు. వాటికి గనక సరైన మద్దతిస్తే తగిన ధరల వ్యవస్థతో అవి అందుబాటులోకి రావటం కష్టమేం కాదు. ఆ రకమైన కరెక్షన్కు అవకాశమైతే ఉంది. అసాధ్యమేమీ కాదు. కావాల్సిందల్లా మిల్లెట్స్పై అందరికీ అవగాహన పెరగటం. అంతే!.పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం యువతలో ఆందోళన పెంచుతున్నాయి. ఆర్థికాంశాలపై వాళ్ల ఆలోచనల్లో ఏమైనా తప్పుందా?పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవటమే విజయం సాధించటమన్న నమ్మకం చాలా మందిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగా లు ఆకర్షణీయమే... కాదనను. కానీ కొన్నాళ్లుగా అవి తగ్గుతూ వస్తున్నాయి. చాలామంది యువత ఐదారేళ్లు పోటీ పరీక్షలకోసం కష్టపడి ఆ తరవాత ఆలస్యంగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇది దేశ ఉద్యోగ మార్కెట్ని దెబ్బతీసి... దేశాన్ని వెనక్కి నెడుతోంది. దేశంలో లక్షల మంది జీవితాల్ని మార్చి కూడా ఫెయిలైన నిర్ణయమేదైనా ఉందని భావిస్తున్నారా?వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది ఒక చిక్కు ముడి. ఆ చిక్కు ముడిలోంచి భారత్ బయటపడాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ వల్ల నీటి వినియోగం బాగా పెరుగుతోంది. అంతిమంగా పంజాబ్ వంటి చోట్ల వరి పండించటం విపరీతంగా పెరిగింది. అలాగని వరి వద్దంటే రైతులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం తమకు సరైన రీతిలో పరిహారమిస్తుందన్న నమ్మకం వారికి లేదు. కానీ జాతీయ స్థాయిలో ఈ విధానమైతే సరికాదు. దీన్ని ఎక్కువకాలం కొనసాగించటం సాధ్యం కాదు. కాబట్టి తక్షణం దీనిపై దృష్టిపెట్టాలి.హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వంటి వేదికలు జనంలో ఆర్థిక వ్యవస్థపై అవగాహన కలిగించడానికి ఏ మేరకు పనికొస్తాయనుకుంటున్నారు?ఎకనమిక్స్ను ఎకనమిస్ట్లకే వదిలేద్దాం. కాకపోతే ఆర్థిక ఆలోచనలనేవి మనం ఎలా ఉండాలనేదానికి పునాది వేస్తాయి. ఆర్థిక వేదికలపైకి సామాన్యుల్ని ఆహ్వానించరు కాబట్టే చాలా విధానాలు ఎలాంటి సవాళ్లూ లేకుండా అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఆర్థికాంశాలపై ప్రజల్లో చర్చ జరగటమనేది ముఖ్యం. -
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.Gold is up over $100, trading above $5,085. Silver is up over $5, trading above $108.25, both at new record highs. Most people are clueless about what this means and are in for quite a shock. Those of us who understand have been expecting the economic crisis that’s about to hit.— Peter Schiff (@PeterSchiff) January 26, 2026బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. -
యాక్సిస్ కొత్త మ్యూచువల్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ బీఎస్ఈ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో/కొత్త పథకం) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కార్తీక్ కుమార్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.బీఎస్ఈ 500 సూచీలోని 21 రంగాల కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రతీ రంగం నుంచి టాప్ 3 కంపెనీలను ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా రంగాల్లోని అగ్రగామి కంపెనీల్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. శామ్కో మిడ్క్యాప్ ఫండ్ శామ్కో అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్.. శామ్కో మిడ్క్యాప్ ఫండ్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బలమైన ఆదాయం, లాభాలు, ధరల తీరు ఆధారంగా భవిష్యత్తులో బలంగా ఎదిగే మధ్యస్థాయి కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఇందుకు గాను ‘కేర్’ విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్క్యాప్ కిందకు వస్తాయి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 4 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
సాయంత్రానికి సగం ఊరట.. మారిపోయిన పసిడి ధరలు
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికి దాదాపు సగం ఊరటనిచ్చాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.2250 పెరిగి రూ. 1,49,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.1550లకే పరిమితమై రూ.1,48,450లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.2450 ఎగిసి రూ. 1,62,710 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.1690 లకు నెమ్మదించి రూ.1,61,950లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ఎక్కడికి చేరుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బంగారం ధర 5000 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో 27,000 డాలర్లకు చేరుతుందని కియోసాకి వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు వెండి ధరలు పెరుగుతాయని చెప్పిన కియోసాకి.. ఇప్పుడు గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు బంగారం విషయంలో జరుగుతాయా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.GOLD soars over $5000.Yay!!!!Future for gold $27,000.— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026భారతదేశంలో బంగారం, వెండి ధరలుఇండియన్ మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ రోజు (జనవరి 26) కూడా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,48,450 రూపాయల వద్ద నిలిచింది. సిల్వర్ రేటు రూ. 10వేలు పెరగడంతో.. కేజీ వెండి ధర రూ. 3.75 లక్షలకు చేరింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక & రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, బంగారం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: 168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు! -
వామ్మో! బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్..తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కొందామా.. అమ్ముదామా?
బంగారం తులం లక్ష అంటే..? అమ్మో! అన్నారు!!. లక్ష దాటడమే అబ్బురం అనుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా రూ.1.65 లక్షలు దాటేసింది. ఇక వెండి గురించైతే చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర కిందటి వరకూ కిలో లక్ష రూపాయలలోపే. లక్ష దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా రూ.3.4 లక్షలకు చేరిపోయింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి. సెంట్రల్ బ్యాంక్లు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తుండటం... వ్యక్తిగత వినియోగ అవసరాలకుతోడు రిటైల్ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారంవైపు చూస్తుండటం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి.ఇక పారిశ్రామిక (సోలార్, ఈవీ తదితర) డిమాండ్ పెద్ద ఎత్తున పెరగ్గా.. సరఫరా ఆ స్థాయిలో లేకపోవడం, పెట్టుబడులకు సైతం ఇన్వెస్టర్లు మక్కువ చూపిస్తుండడంతో వెండి ధరలు ఆకాశమే హద్దుగా రివ్వుమంటున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను నమోదు చేస్తుండడంతో రాబడుల కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితేంటి? ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేటు వచ్చింది కనక దాన్ని విక్రయిస్తే మంచిదా? ఒకవేళ బంగారం, వెండి వంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఈటీఎఫ్లవైపు చూడొచ్చా? అందరికీ ఇవే సందేహాలు. వాటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...ఉరుకులు పరుగులు ఎందుకంటే...2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79 శాతం పెరిగింది. ఔన్స్కు 2,780 డాలర్ల నుంచి 4,965 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్ 30 డాలర్ల నుంచి 100 డాలర్ల స్థాయిని తాకింది. ఈ కాలంలో వెండి ఏకంగా 223 శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా వృద్ధి అంచనాలు మసకబారినప్పుడు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎగసినప్పుడు (పలు దేశాల మధ్య ఘర్షణలు/ యుద్ధాలు తలెత్తడం).. ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణితో తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బంగారం, వెండిలోకి మళ్లిస్తుంటారు. అలాంటి ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడుల విలువ కాపాడుకునే హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు ఉంది. డాలర్ బలహీనత సైతం బంగారం, వెండి ధరలకు ఆజ్యం పోసేదే. డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వారికి బంగారం, వెండి చౌకగా మారతాయి. కనుక అదనపు డిమాండ్ ఏర్పడుతుంది.యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చన్న అంచనాలు కూడా ఒక కారణమే. వడ్డీ రేట్లు దిగొచ్చే క్రమంలో ఈల్డ్స్ తగ్గి బాండ్లు ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో అదనపు రాబడి వస్తుందనే కారణంతో పసిడి, వెండిలోకి పెట్టుబడులు పరుగెడుతుంటాయి. ఆర్బీఐ నుంచి అంతర్జాతీయంగా ఎన్నో దేశాల కేంద్ర బ్యాంక్లు తమ విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా కొన్ని సెంట్రల్ బ్యాంక్లు బంగారం నిల్వలు అదే పనిగా పెంచుకుంటూ వెళుతున్నాయి. గోల్డ్, సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)లోకి వచ్చే పెట్టుబడులు కూడా పెరగడం ధరలను మరింత ఎగిసేలా చేస్తోంది. వెండికి ప్రధానంగా పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎల్రక్టానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో వీటి తయారీకి అదే స్థాయిలో వెండి అవసరం ఏర్పడుతోంది. ఈ స్థాయిలో సరఫరా పెరగకపోవడం ధరలను నడిపిస్తోంది. మన రూపాయి ఇటీవలి కాలంలో డాలర్తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం, వెండిని డాలర్ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే పెరిగేలా చేస్తోంది. ఒకవైపు ఈక్విటీలు ఏడాదిన్నరగా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాయి. మరోవైపు బంగారం, వెండి గణనీయంగా ర్యాలీ చేస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వాటివైపు ఆకర్షితం అవుతుండడం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?బంగారం, వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు.. వీటిల్లో దిద్దుబాటూ అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్, ధరల తీరును కచ్చితంగా అంచనా వేయలేం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాబట్టి ధరలను చూసి ఉద్రేకపడాల్సిన పనే లేదు. ఇప్పటికే భౌతిక బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలనుకుంటే లేదా లిక్విడిటీ (నగదు లభ్యత) పెంచుకోవాలంటే లేదా తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అయితే ముందుకెళ్లొచ్చు. భౌతిక రూపంలో విక్రయించే వారు జీఎస్టీ చార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్టయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనే. ధరల పరుగు చూసి, మరింత పెరిగితే కొనలేమోమోనన్న భయం అవసరం లేదు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్పకాలంలో కరెక్షన్ల రిస్క్ కూడా ఉంటుంది. బంగారం హెడ్జింగ్గానూ పనిచేస్తుంది కనుక కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచుకుంటే మంచి రాబడిని ఆశించొచ్చు. కాకపోతే దాని భధ్రత కోసం చేయాల్సిన వ్యయాలు, జీఎస్టీ ఇతరత్రా చార్జీల ప్రకారం చూస్తే.. డిజిటల్ సాధనాలు అనుకూలం. వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే, తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావొచ్చు. డిజిటల్ రూపంలో అయితే బంగారం, సిల్వర్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?‘సిప్’ రూపంలోనే బెటర్...గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నింటిలోకి మెరుగైన మార్గమన్నది విశ్లేషకుల సూచన. ఇక్కడి నుంచి ధరలు ఇంకా ముందుకే వెళ్లినా, లేక పతనాన్ని చూసినా పెట్టుబడి కొనసాగుతుంది. కొనుగోలు ధర సగటుగా మారుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యానికి.. పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కోసం చూసే వారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్ రూపంలోఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత పెట్టుబడి..?ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండికి కేటాయింపులు 10–20 శాతానికి పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో అధిక ఎక్స్పోజర్ను నివారించొచ్చు. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలతోపాటు, పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్ సాధనాలు, బంగారం–వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు. -
168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది. ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట. -
సిల్వర్ సెంచరీ.. ‘రిచ్ డాడ్’ హ్యపీ
వెండి ధరలు రోజుకో రికార్డ్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ సిల్వర్ 100 డాలర్ల మార్క్ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.‘వెండి 100 డాలర్లు (ఔన్స్కు) దాటుతోంది.. యేయ్’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్లో కియోసాకి తెలిపారు. SILVER to BREAK $100.Yay!!!!— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
ఇంకా రెచ్చిపోయిన బంగారం.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. రోజూ రూ.వేలకొద్దీ పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే బంగారం ధరలు(Today Gold Rate)భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే వెండి ధరల్లో మాత్రం మిశ్రమ మార్పులు కనిపించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూపాయి విలవిల..
ముంబై: డాలరు డామినేషన్కు రూపాయి విలవిల్లాడుతోంది. విలువ అంతకంతకూ కరిగిపోతోంది. తాజాగా శుక్రవారం డాలర్ మారకంలో 32 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 91.90 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, అంతర్జాతీయ అనిశి్చతులు రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. అలాగే క్రూడాయిల్ ధరల ర్యాలీ, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడమూ ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 91.45 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఒక దశలో 42 పైసలు క్షీణించి 92.00 వద్ద చరిత్రాత్మక ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలోపేతం, ఎఫ్ఐఐల విక్రయాల ప్రభావంతో గతేడాదిలో 5% క్షీణించి రూపాయి... 2026లో జనవరి 23 వరకు 2% (202 పైసలు) పతనమైంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో రిస్క్ సామర్థ్యం తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కొనసాగింపు ఒత్తిళ్ల ప్రభావంతో రూపాయి మరింత క్షీణించే వీలుంది. వచ్చే వారం నెలాఖరు కావడంతో దిగుమతిదారులు, హెడ్జర్ల నుంచి డాలర్ల్ల డిమాండ్ నెలకొనవచ్చు. రానున్న రోజుల్లో 91.60 – 92.30 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు. -
పరుగు ఆపని పసిడి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జోడు గుర్రాల్లా పరిగెడుతున్న వెండి, బంగారం మరోసారి కదంతొక్కాయి. స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పసిడి 10 గ్రాములు రూ. 1,500 బలపడి రూ. 1,58,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 9,500 జంప్చేసి రూ. 3,29,500ను తాకింది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం, వెండి సరికొత్త రికార్డులను సాధించాయి. కేజీ వెండి తాజాగా 4 శాతం జంప్చేసింది. ఎంసీఎక్స్లో మార్చి కాంట్రాక్ట్ రూ. 12,638 బలపడి రూ. 3,39,927ను తాకింది. ఇదే బాటలో బంగారం 10 గ్రాములు 2 శాతం(రూ. 2,885) ఎగసింది. ఫిబ్రవరి డెలివరీ రూ. 1,59,226కు చేరింది. బుధవారం వెండి(కేజీ) రూ. 3,35,521 వద్ద, గురువారం పసిడి(10 గ్రా.) రూ. 1,56,341 వద్ద చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం విదితమే. వెరసి బంగారం వరుసగా ఐదో రోజు లాభపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు 98.31కు వెనకడుగు వేయడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్ పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సిల్వర్ సెంచరీ..యూఎస్ కామెక్స్లోనూ వెండి, బంగారం గరిష్ట ధరలతో ధగధగలాడుతున్నాయి. ఔన్స్ వెండి చరిత్రలో తొలిసారి 100 డాలర్లను దాటగా.. బంగారం అంచనాలను నిజం చేస్తూ ఔన్స్(31.1 గ్రా.) 5,000 డాలర్ల సమీపానికి చేరింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.7 డాలర్లు ఎగసి 100 డాలర్లను తాకింది. గోల్డ్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ 4,989.54 డాలర్లను తాకింది. వెరసి 2020 మార్చి తదుపరి ఈ వారం అత్యధికంగా లాభపడినట్లు నిపుణులు వెల్లడించారు. -
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769.66 పాయింట్ల నష్టంతో 81,537.70 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్ల నష్టంతో 25,048.65 వద్ద నిలిచాయి.ధంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.మాక్రాన్ ఉపయోగించిన సన్గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
బాంబులా పేలిన బంగారం, వెండి ధరలు! ఇక కొన్నట్టే!!
బంగారం, వెండి ధరలు మళ్లీ రాకెట్లా దూసుకెళ్లాయి. ఒక్క రోజు ఇలా తగ్గాయో లేదో వెంటనే బాంబులా పేలాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు(Today Gold Rate) రూ.5 వేలకు పైగా ఎగిశాయి. ఇక వెండి ధరలైతే వింటేనే భయమేస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు పెరిగి 25,332 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు లాభపడి 82,427 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.4బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5% లాభపడింది.నాస్డాక్ 0.9% లాభపడింది.Today Nifty position 23-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన ట్రంప్..మార్కెట్ జంప్
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్ల్యాండ్ స్వా«దీనం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్ ట్రేడ్ డీల్ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్ల్యాండ్ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్కాంగ్ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్యూ బ్యాంక్ 2.43%, క్యాపిటల్ గూడ్స్ 2.03%, ఇండ్రస్టియల్స్ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్ 1.43%, మెటల్స్ 1.34%, ఎఫ్ఎంసీజీ 1.22%, కమోడిటిస్ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
సిల్వర్ స్పీడుకు బ్రేక్
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి ధరల పరుగుకు కాస్త బ్రేక్ పడింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ. 2,500 తగ్గి రూ. 1,57,200 వద్ద ముగిసింది. అటు తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేసిన వెండి ధర కిలోకి రూ. 14,300 క్షీణించి రూ. 3,20,000కి పరిమితమైంది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూరప్ దేశాలపై టారిఫ్ల బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రెండు మెటల్స్ కాస్త నెమ్మదించినట్లు వివరించారు. భౌగోళిక–రాజకీయ రిసు్కలపై ఆందోళన కొంత తగ్గడంతో దేశీ మార్కెట్లలో పాక్షికంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 8.80 డాలర్లు తగ్గి 4,822.65 వద్ద ట్రేడయ్యింది. వెండి మాత్రం 0.27 శాతం పెరిగి 93.36 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ నిర్ణయాల వెల్లడికి ముందు ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో పసిడి, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కాయ్నాత్ చైన్వాలా తెలిపారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.45 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 82,389.08 వద్ద, నిఫ్టీ 161.35 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 25,318.85 వద్ద నిలిచాయి.బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్, అక్ష్ ఆప్టిఫైబర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్, హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్, IIFL ఫైనాన్స్ లిమిటెడ్, పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.WHY SILVER is SUPERIORGold and silver have been money for thousands of years.But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of the Industrial Age.In 1990…silver was approximately $ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026 -
జియో బ్లాక్రాక్: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు
జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) ఈ ఏడాది మేలో సేవలు ప్రారంభించగా, 10 లక్షల మంది ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో 18 శాతం తొలిసారి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారని సంస్థ ఎండీ, సీఈవో సిద్ స్వామినాథన్ వెల్లడించారు. ముఖ్యంగా 40 శాతం ఇన్వెస్టర్లు టాప్–30 పట్టణాలకు వెలుపలి ప్రాంతాల నుంచి ఉన్నట్టు చెప్పారు.పరిశ్రమ సగటు 28 శాతం కంటే ఎంతో ఎక్కువని పేర్కొన్నారు. టెక్నాలజీ అనుసరణ, ఇన్వెస్టర్లలో అవగాహనపై దృష్టి సారించడం మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. జియో బ్లాక్రాక్ ఏంఎసీ నిర్వహణలోని పెట్టుబడులు రూ.13,700 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. ఇందులో ఈక్విటీ ఆస్తులు 30 శాతంగా ఉన్నట్టు తెలిపారు. స్పెషలైజ్డ్ ఇన్వస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఆవిష్కరణతోపాటు, అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలను గిఫ్ట్సిటీ ద్వారా అందించనున్నట్టు చెప్పారు.సిఫ్ ప్రారంభానికి వీలుగా సెబీ నుంచి ఇటీవలే నిరభ్యంతర పత్రం అందుకున్నట్టు తెలిపారు. ఈ సంస్థ నుంచి జియోబ్లాక్రాక్ సెక్టార్ రొటేషన్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 27న ప్రారంభం కానుండడం గమనార్హం. రంగాల వారీ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల్లో మార్పులు చేస్తూ, అధిక రాబడులను ఇచ్చే విధంగా ఇది పనిచేస్తుంది. -
పసిడి, వెండి ఢమాల్.. రెచ్చిపోయిన ధరలు రివర్స్!
జోరు మీదున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. దేశంలో పసిడి, వెండి భారీగా దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం పుత్తడి ధరలు (Today Gold Rate) భారీ స్థాయిలో తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. వెండి ధరలు కూడా గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: పడిలేచిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం పుంజుకున్నాయి. లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 250 పాయింట్లు ఎగిసి 25,408 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 793 పాయింట్లు పుంజుకుని 82,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.03 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.18 % లాభంతో ముగిసింది.Today Nifty position 22-01-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాయంత్రానికే మరింత షాక్.. మారిపోయిన పసిడి ధరలు
బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో పసిడి ధరలు ఎగుస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికే మరింత పెరిగాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.4600 పెరిగి రూ. 1,41,900 లకు చేరుకోగా సాయంత్రానికి మొత్తంగా రూ.6250 ఎగిసి రూ.1,43,550లకు చేరింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.5020 ఎగిసి రూ. 1,54,800 లను తాకగా సాయంత్రానికి మొత్తంగా రూ.6820 పెరిగి రూ.1,56,600లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పడిపోయిన రూపాయి.. రికార్డు పతనం
భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. నిరంతర విదేశీ నిధుల నిష్క్రమణ, లోహ దిగుమతిదారుల నుంచి బలమైన డాలర్ డిమాండ్ నేపథ్యంలో బుధవారం ఇంట్రా-డే ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి 77 పైసలు క్షీణించి 91.74 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది.గ్రీన్లాండ్ సమస్యతో పాటు సంభావ్య సుంకాలపై ఐరోపాలో ఉద్రిక్తతలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్ను మరింత దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.ఇంటర్బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 91.05 వద్ద ప్రారంభమై, ట్రేడింగ్లో క్రమంగా క్షీణిస్తూ డాలర్తో పోలిస్తే 91.74 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ఇది మునుపటి ముగింపు స్థాయితో పోలిస్తే 77 పైసల పతనం.మంగళవారం రూపాయి డాలర్తో పోలిస్తే 7 పైసలు తగ్గి 90.97 వద్ద ముగిసింది. అంతకుముందు 2025 డిసెంబర్ 16న ఇంట్రా-డే కనిష్ట స్థాయి నమోదై, ఆ రోజు రూపాయి 91.14 వరకు పడిపోయింది.ఇదిలా ఉండగా, ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 98.61 వద్ద ట్రేడ్ అవుతోంది.అంతర్జాతీయ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.88 శాతం తగ్గి 63.70 డాలర్లకు చేరుకుంది.దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కూడా నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 289.85 పాయింట్లు పడిపోయి 81,890.62 వద్ద, నిఫ్టీ 77.40 పాయింట్లు తగ్గి 25,155.10 వద్ద ట్రేడవుతున్నాయి.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మంగళవారం రూ.2,938.33 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి. -
ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్ క్రాష్ ఈరోజూ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు తగ్గి 25,242 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 82,127 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి మార్కెట్ సెషన్లో సూచీలు దారుణంగా పడిపోయాయి.నిన్నటి స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.Today Nifty position 21-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రికార్డు స్థాయికి బంగారం ధర..
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్చారి ‘సాక్షి’తో తెలిపారు. -
డెట్ ఫండ్స్కు ఇండెక్సేషన్ ప్రయోజనం
మరో 10 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న 2026–27 బడ్జెట్కు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కీలక సూచనలు చేసింది. డెట్ ఫండ్స్లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలకు (మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులపై) గతంలో మాదిరి ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయింపు) పునరుద్ధరించాలని కోరింది. అలాగే, జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) మాదిరి ప్రయోజనాలతో పెన్షన్ ఫండ్స్ను ఆఫర్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను అనుమతించాలని కోరింది.ముఖ్యంగా ఈక్విటీ పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 లక్షలుగా ఉన్న పన్ను రహిత మూలధన లాభాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని సూచించింది. అంతేకాదు ప్రస్తుతం ఏడాది మించిన ఈక్విటీ పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్నును అమలు చేస్తుండగా, దీన్ని ఈక్విటీ ఫండ్స్కు ఐదేళ్లకు పెంచాలని కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగిస్తారని పేర్కొందియాంఫి సూచనలు..ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్లో పెట్టుబడులకు కొత్త పన్ను విధానంలోనూ పన్ను ప్రయోజనాన్ని కల్పించాలి.ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాలను ఈక్విటీ ఆధారిత పథకాలుగా వర్గీకరించాలి. ఫ్యూచర్స్, అప్షన్లపై మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలకు గతంలో మాదిరి సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) రేట్లను వర్తింపజేయాలి. ఎందుకంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ తమ పెట్టుబడులకు హెడ్జింగ్గా ఫ్యూచర్స్, ఆప్షన్లను వినియోగిస్తుంటాయి.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వీట్)లో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్కు ఈక్విటీ పథకాల మాదిరి పన్నును వర్తింపచేయాలి.భారత బాండ్ మార్కెట్ విస్తరణకు వీలుగా డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (డీఎల్ఎస్ఎస్)ను ప్రవేశపెట్టాలి.మ్యూచువల్ ఫండ్ – స్వచ్ఛంద పదవీ విరమణ ఖాతాను ప్రవేశపెట్టాలి.ఎన్ఆర్ఐలకు సంబంధించి వసూలు చేసే మూలం వద్ద పన్ను (టీడీఎస్)పై సర్చార్జీకి ఏకరూప రేటును తీసుకురావాలి.మ్యూచువల్ ఫండ్ స్కీమ్ను పంపిణీ చేసే ఆదాయంపై టీడీఎస్ అమలు పరిమితిని పెంచాలి.సెక్షన్ 54ఈసీ కింద ఎల్టీసీజీ మినహాయింపునకు వీలుగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను దీర్ఘకాల ఆస్తులుగా వర్గీకరించాలి.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు -
పసిడి పరుగులు వెండి వెలుగులు
న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా పరిగణించే పసిడి, వెండి రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి రేటు కీలకమైన రూ. 1.5 లక్షల మార్కును దాటేసింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 5,100 పెరిగి రూ. 1,53,200కి చేరింది. వెండి ధర కిలోకి రూ. 20,400 పెరిగి మరో కొత్త గరిష్ట స్థాయి రూ. 3,23,000కి ఎగిసింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 4,700 డాలర్ల మైలురాయిని అధిగమించింది. 66.38 డాలర్లు పెరిగి 4,737.40 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ కూడా కొత్త గరిష్ట స్థాయి 95.88 డాలర్లకి పెరిగింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 6,861 పెరిగి రూ. 1,52,500 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి కూడా రూ. 17,723 ఎగిసి రూ. 3,27,998 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా కామెక్స్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 147.5 డాలర్లు ఎగిసి 4,724.9 డాలర్లు పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 6.87 డాలర్లు పెరిగి తొలిసారి 95 డాలర్ల మార్కును దాటింది. అనిశ్చితి, ఉద్రిక్తతలతో ఆజ్యం.. అంతర్జాతీయంగా అనిశ్చితి, అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొలిక్కి రాకపోవడంలాంటి అంశాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పసిడి, వెండి వైపు మళ్లుతున్నారని వెంచురా సంస్థ హెడ్ (కమోడిటీ, సీఆర్ఎం) ఎన్ఎస్ రామస్వామి చెప్పారు. -
క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా, ఐరోపా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ అనిశ్చితి దలాల్ స్ట్రీట్ను వణికించాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనం ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,066 పాయింట్లు పతనమైన 83 వేల స్థాయి కింద 82,180 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు దిగివచి్చంది. రోజంతా నష్టాల ట్రేడింగ్: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఏ దశలోనూ కోలుకోలేక రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,235 పాయింట్లు క్షీణించి 82,011 వద్ద, నిఫ్టీ 414 పాయింట్లు కుప్పకూలి 25,171 వద్ద కనిష్టాలు తాకాయి. హెచ్డీఎఫ్సీ షేరుకు మాత్రమే లాభాలు సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మాత్రమే 0.38% స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఇదే సూచీలో ఎటర్నల్ 4%, బజాజ్ ఫైనాన్స్ 3.88% సన్ఫార్మా 3.68%, బజాజ్ ఫిన్సర్వ్ 3.05%, ఇండిగో 3% అత్యధికంగా నష్టపోయిన టాప్ 5 షేర్లు. అన్ని రంగాల ఇండెక్సులు డీలామార్కెట్లోని విస్తృత స్థాయి అమ్మకాలతో బీఎస్ఈలో అన్ని రంగాల ఇండెక్సులు డీలాపడ్డాయి. రియల్టీ 5.21%, సర్వీసెస్ 3%, క్యాపిటల్ గూడ్స్ 2.76%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.73%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.71%, టెలికమ్యూనికేషన్ 2.42%, ఆటో 2.36%, విద్యుత్ 2.23 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.74%, 2.52 శాతం క్షీణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం ట్రంప్ టారిఫ్ భయాలు, గ్లోబల్ టారిఫ్విధానంపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి. చైనా, జపాన్, సింగపూర్, హాంగ్కాంగ్ మార్కెట్లు 1.50% నుంచి 0.50% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% క్షీణించాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నష్టాలకు 4 కారణాలుసూచీలకు ఐటీ షేర్ల పోటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల కారణంగా ఐటీ రంగ కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. బలహీన ఆదాయాల ప్రకటనతో విప్రో 3%, ఎల్టీఐ మైండ్ట్రీ 7%, ఇన్ఫోసిస్ 1%, టీసీఎస్ 2% నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3% పతనమైంది. ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ టారిఫ్ బెదిరింపులు గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించకుంటే వాణిజ్య సుంకాలు విధిస్తానని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్లలో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. విదేశీ ఇన్వెస్టర్ల టేకాఫ్ మూడ్భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ ఆగడంలేదు. సోమ, మంగళవారాల్లో రూ.6,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో 11వ రోజూ అమ్మకాలు కొనసాగాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలహీన పడి జీవిత కాల కనిష్ట ముగింపు 90.97 వద్ద ముగిసింది. పెరిగిన క్రూడ్; వీఐఎక్స్ ఇండెక్స్అంతర్జాతీయంగా బ్రెంట్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతిని సూచించే వీఐఎక్స్ ఇండెక్సు 4% పెరిగి 12.34 వద్దకు చేరుకుంది. దీనికి తోడు మంగళవారం ‘నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ’ కారణంగా భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. -
బడ్జెట్ 2026.. ఆదివారం సెలవు లేదు!
కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన, అంతే కాకుండా ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించాయి.సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు, కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్కు ఆదివారం సెలవు లేదన్నమాట).బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


