గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.45 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 82,389.08 వద్ద, నిఫ్టీ 161.35 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 25,318.85 వద్ద నిలిచాయి.
బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్, అక్ష్ ఆప్టిఫైబర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్, హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్, IIFL ఫైనాన్స్ లిమిటెడ్, పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


