Sri Sathya Sai
-
టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మూడు రోజులుగా వరద చేరిక పెరిగింది. మే మొదటి వారంలో ఇన్ఫ్లో జీరోగా ఉండగా.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది. -
పొలాలకు దారి చూపించండి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారి–342 నిర్మాణం వల్ల తమ పొలాలకు దారి లేకుండా పోతోందని పుట్టపర్తి నగర పంచాయతీ కర్ణాటక నాగేపల్లి రైతులు కలెక్టర్ టీఎస్ చేతన్కు మొరపెట్టుకున్నారు. ఈమేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందించారు. కర్ణాటక నాగేపల్లి వెనుకభాగంగా ప్రభుత్వం నూతనంగా నాలుగే లేన్లతో ఎన్హెచ్– 342 నిర్మిస్తోందన్నారు. రహదారి తూర్పు భాగాన సుమారు 150 మంది రైతులకు చెందిన 300 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయని, జాతీయ రహదారి నిర్మాణం వల్ల పొలాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా పోతోందని తెలిపారు. తమ పొలాలకు దారి చూపకపోతే తరతరాలు బాధ పడాల్సి వస్తుందన్నారు. అందువల్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలోపు తమ పొలాలకు దారి చూపాలని కోరారు. స్పందించిన కలెక్టర్, సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ను కలిసిన వానిలో పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ చెరువు భాస్కర్రెడ్డి, నాగశంకర్రెడ్డి, కేశవ, ఎరికల అంజనేయులు, ఈరప్ప, వడ్డి సత్యం, రాఘవేంద్ర, కె.సత్యంతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలకు గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు నుంచి 226 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలతోపాటు, రీ సర్వే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. బుక్కపట్నం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు వంద శాతం అమలయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎఫ్ఓ చక్రపాణి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డీపీఓ సమత, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి సహదేవ, ఆర్అండ్బీ ఎస్ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన వినతుల్లో కొన్ని ఇలా.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో వారం రోజులుగా లోవోల్టేజీ సమస్య నెలకొందని, దీంతో టీవీలు, ఫ్రిజ్లు పలు ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోతున్నాయని గ్రామస్తులు కలెక్టర్కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న విద్యుత్ అధికారులను ఆదేశించారు. ● ఓడీసీ బీసీ కాలనీలోని షిరిడీ సాయి గ్రామ సమైక్య సంఘం వీఓఏగా ఏళ్లుగా ఉన్న తనను అకారణంగా తొలగించారని, దివ్యాంగుడనైన తనకు న్యాయం చేయాలని మల్లిరెడ్డి పలువురు పొదుపు సంఘం మహిళలతో కలసి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ విచారించి న్యాయం చేయాలని అక్కడే ఉన్న డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతన్కు కర్ణాటకనాగేపల్లి రైతుల మొర ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 226 అర్జీలు -
‘జేఈఈ అడ్వాన్స్డ్’లో జిల్లా విద్యార్థుల సత్తా
కదిరి టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో కదిరికి చెందిన ఉపాధ్యాయుడు ఓబులపతి కుమారుడు ఓంకిరణ్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరిలో 1,355 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కోటాలో ఓంకిరణ్కు 223 ర్యాంకు దక్కింది. అదే విధంగా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కేవీ రమణారెడ్డి కుమారుడు కుడుము అనీష్రెడ్డికి ఆల్ ఇండియాలో 1,783 ర్యాంకు సాధించాడు. తమ తల్లితండ్రులు ప్రోత్సాహంతోనే మెరుగైన ఫలితాలు సాధించినట్లు ర్యాంకర్లు ఓంకిరణ్, అనీష్రెడ్డి తెలిపారు. -
టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: క్షయ(టీబీ)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీబీ నిర్మూలనకు 100 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, పంచాయతీ రాజ్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు, అంగన్ వాడీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. టీబీపై అవగాహన పెంచి దాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డీఎల్టీఓ డాక్టర్ తిప్పయ్య, డీసీహెచ్ఎస్ మధుసూదన్, మలేరియా అధికారి లక్ష్మానాయక్, మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్ రమణ, గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాలు సక్రమంగా అందించాలి ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ నల్లమాడ: అవినీతి, అక్రమాలకు తావులేకుండా చౌకదుకాణాల ద్వారా నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డీలర్లను ఆదేశించారు. సోమవారం ఆయన నల్లమాడ –1 చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ణీత సమయాల్లో డీలర్లు అందుబాటులో ఉంటూ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దనే సరుకులు అందజేయాలని సూచించారు. అనంతరం క్యూ ఆర్ కోడ్ గురించి డీలర్లకు అవగాహన కల్పించారు. జేసీ వెంట తహసీల్దార్ రంగనాయకులు ఉన్నారు. సరిహద్దులో గెలిచినా.. ఊళ్లో ఓడిపోతున్నా ● కబ్జాకు గురైన తన భూమిని పరిరక్షించాలి ● వీడియో ద్వారా కోరిన బీఎస్ఎఫ్ జవాన్ అమరాపురం: సరిహద్దులో ఉంటూ దేశ రక్షణలో విజయం సాధిస్తున్న తాను స్వగ్రామంలో ఆస్తులను కాపాడుకోలేక ఓడిపోతున్నానంటూ ఓ జవాన్ ఆవేదనతో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమరాపురం మండల పరిధిలోని ఉదుగూరుకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి కె.శివరం గ్రామంలో వివాహం చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా మరో ప్రాంతంలో ఉన్న ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. తనకు చెందిన 2.09 ఎకరాల భూమిని కె.శివరం గ్రామానికి చెందిన నాగరాజు కబ్జా చేశాడని ఆరోపించారు. తనకు హక్కుగా రావాల్సిన భూమిని సాగు చేయడానికి వెళితే నాగరాజు దాడులు చేస్తున్నాడని, రాళ్లు, కొడవలితో భయపెడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. జవాన్ వీడియో వైరల్ కావడంతో తహసీల్దార్ లక్ష్మీనరసింహ సోమవారం మధ్యాహ్నం కె.శివరం గ్రామానికి వెళ్లి సంబంధిత భూమిని పరిశీలించారు. డాక్యుమెంట్లను తీసుకురావాలని జవాన్ మామకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అలాగే వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
పుట్టపర్తి: రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రెడ్డప్పగారి రమేష్రెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వారు పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం రమేష్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన, హామీలు విస్మరించిన వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పసుపు–కుంకుమ, రైతు రుణ మాఫీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, పీఠంపై కూర్చోగానే మహిళలకు, రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’ హామీలతో పాటు వందల హామీలిచ్చి చంద్రబాబు పొత్తులతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడూ హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మోసం, వంచన, వెన్నుపోటు చంద్రబాబు నైజమన్నారు. 1996లోనే బిడ్డినిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అక్రమంగా పదవి పొందారని, 2024లో అధికారంలోకి వస్తూనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 4వ తేదీ పుట్టపర్తి దద్దరిల్లిల్లేలా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలన్నారు. మోసం చేయటమై చంద్రబాబు లక్ష్యం.. హామీలివ్వడం.. మోసం చేయడం చంద్రబాబు నైజమని వెన్నపూస రవీంద్రరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4వ తేదీన ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, పుట్టపర్తి రూరల్ మండల ఎంపీపీ రమణారెడ్డి, జిల్లా అగ్రీ అడ్వయిజరీ మాజీ అధ్యక్షుడు ఆవుటాల రమణారెడ్డి, పుట్టపర్తి వైస్ చైర్మన్ తిప్పన్న, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కన్యా కుమారి, కవితారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగిశెట్టి, పుట్టపర్తి నియోజకవర్గం డాక్టర్ల విభాగం అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సాయి, రామాంజనేయులు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బడా నాగార్జునరెడ్డి, కొత్తచెరువు ఐటీ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి హామీలు తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం: వెన్నపూస రవీంద్రారెడ్డి -
అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్ పనులను రైతులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్ట్ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్కెనాల్కు లిప్ట్ ఇరిగేషన్ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే లైనింగ్ పనులతో రైతులకు నష్టం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం
పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు. కర్ణాటక వాసి దుర్మరణం పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
కూడేరు: తాగునీటి కోసం కూడేరు వాసులు సోమవారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
●పోలీసు బండి.. జగమొండి
కళ్యాణదుర్గం: కొన్నేళ్ల క్రితం కళ్యాణదుర్గం అర్బన్ పీఎస్కు ఓ బొలెరో వాహనాన్ని అధికారులు కేటాయించారు. స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎస్ఐ పోస్టు లేకపోవడంతో సీఐ స్థాయి అధికారికి ఆ వాహనాన్ని కట్టబెట్టారు. అయితే తరచూ సాంకేతిక సమస్యలతో వాహనం కాస్త మొరాయించడం మొదలు పెట్టింది. దీంతో సోమవారం పెట్రోలింగ్కు వెళ్లేందుకు వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు తోయించి స్టార్ట్ చేయించాల్సి వచ్చింది. పోలీసుల అవస్థలను చూసిన ప్రజలు.. చిన్నపాటి మరమ్మతులు సైతం చేయించుకోలేని పోలీసుల తీరుపై ‘ఎంతైనా సావాస దోషం’ అంటూ చలోక్తులు విసిరారు. -
పేరుకే 40 శాతం సబ్సిడీ
ఖరీఫ్లో విత్తన వేరుశనగపై ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సబ్సిడీతో తమకు ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెబుతున్నా.. 10 శాతానికి మించి సబ్సిడీ అందే పరిస్థితి లేదని అంటున్నారు. మడకశిర: ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తన పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్వింటాకు రూ.9,300 ధర నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ క్వింటా వేరుశనగ ధర రూ.9,300 లేదు. అయితే రాష్ట్రంలో మాత్రం వేరుశనగ విత్తనానికి అధిక ధరను నిర్ణయించి రైతులకు 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు గొప్పలకు పోతోంది. 40 శాతం సబ్సిడీ పోను రైతులు క్వింటా వేరుశనగ విత్తనానికి రూ.5,580 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.6,200 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వేరుశనగకు ఉన్న ధరతో పోల్చుకుంటే రైతులకు నామమాత్రంగానే సబ్సిడీ అందే పరిస్థితి కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లోని ధర ప్రకారం క్వింటాపై రైతులకు రూ.620 చొప్పున మాత్రమే సబ్సిడీ అందుతోంది. అయితే ప్రభుత్వ క్వింటాకు రూ.3,720 చొప్పున సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో కొనుగోలుకే మొగ్గు.. జిల్లాకు ఈ ఖరీఫ్ సీజన్లో 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్వేశించుకోగా... ధర గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు బహిరంగ మార్కెట్లో విత్తన వేరుశనగ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా వేరుశనగ విత్తనంపై అందించే సబ్సిడీ రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. సబ్సిడీ పోను ప్రభుత్వం అందించే ధరకే ఇంచుమించు బహిరంగ మార్కెట్లోనే నాణ్యమైన విత్తనం లభ్యమవుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది రైతులు రైతులు బహిరంగ మార్కెట్లోనే విత్తన కాయలను కొనుగోలు చేసి శుద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే విత్తనం కన్నా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనంలో 78 శాతం నాణ్యత ఉందని అంటున్నారు. విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.9,300గా నిర్ణయించిన ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో రైతుకు రూ.5,580కు బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తనం క్వింటా రూ.6,200కే ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతల అసంతృప్తి -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించారు. బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతిని అటుగా వెళుతున్న వారు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు. -
రైతు ద్రోహి ప్రభుత్వమిది
ఈ చిత్రంలోని రైతు పేరు మేకల లక్ష్మీనరసింహులు. తాడిమర్రి మండలం. మరవపల్లి గ్రామం. తనకున్న మూడెకరాల పొలంలో ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగుచేస్తున్నాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయంతో పాటు రాయితీ విత్తన వేరుశనగ అందించడంతో పంటలు సాఫీగా సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం నేటికీ రైతులకు పెట్టుబడి సాయం, రాయితీ విత్తనం అందించలేదు. దీంతో పెట్టుబడులకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియక లక్ష్మీనరసింహులు సతమతమవుతున్నాడు. ఈ సారి పంట సాగుకు పెట్టుబడి ఎలా అని ఆందోళన చెందుతున్నాడు. ఈ రైతు పేరు ఎస్.హరినాథరెడ్డి. కదిరి మండలం ముత్యాలచెరువు. ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసేవాడు. గత ఐదేళ్లూ ‘రైతు భరోసా’ కింద వైఎస్ జగన్ సర్కార్ పెట్టుబడి సాయం సకాలంలో అందించడంతో ఉత్సాహంగా పంటలు సాగుచేసేవాడు. కానీ కూటమి సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ఇస్తామన్న రూ.20 వేలు నేటికీ ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాచాల్సి వస్తోందని వాపోతున్నాడు. కదిరి: రైతులకు కష్టం కలగకుండా చూసుకుంటానంటూ ఎన్నికల వేళ హామీలిచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఏడాది పాలన సంబరాలకు సిద్ధమవుతున్న ఆయనకు..ఈ ఏడాది కాలంలో ఏనాడూ అన్నదాతలు గుర్తుకు రాలేదు. అందుకే రైతన్నలకు నయాపైసా సాయం చేసిన పాపాన పోలేదు. ఫలితంగా సాయం అందక...సాగుకు సన్నద్ధం కాలేక రైతన్న సతమతమవుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. రూ.560 కోట్లు ఎగనామం.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా..దానిపై ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు సకాలంలో ఆర్థిక చేయూత ఇస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అదిగో..ఇదిగో అని చెప్పడమే కానీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది లేదు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ రైతుల పక్షాన మాట్లాడ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.560 కోట్లు చంద్రన్న సర్కారు ఎగ్గొట్టింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడు విడతల్లో నిధులు జమ.. వైఎస్ జగన్ సర్కార్ ఖరీఫ్ సాగుకు ముందే ఏటా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద తొలివిడత రూ.7,500 ఇచ్చింది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతో పాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు మొత్తం రూ.13,500 చొప్పున నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే ‘సున్నావడ్డీ–పంటరుణాలు’ పథకం ద్వారా 1,71,275 మంది రైతులకు రూ.67.65 కోట్లు, ‘డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ ద్వారా 2,96,541 మంది రైతులకు రూ.718.57 కోట్లు, అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రూ.16.21 కోట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరింది. ఈ ప్రభుత్వం మాత్రం ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్నా రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. అన్నదాత దుఃఖీభవ..! ‘అన్నదాత సుఖీభవ’కు పడని అడుగులు రైతులకు రూ.560 కోట్లు చంద్రబాబు ఎగనామం పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురు చూపు ఖరీఫ్ సాగుకు ‘ప్రైవేటు’ అప్పులు చేస్తున్న వైనం ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గతంలో వైఎస్ జగన్ సర్కారు సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా వచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలోని 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.1,767.09 కోట్ల లబ్ధి చేకూర్చింది. జగన్ హయాంలో అన్నదాతకు ఆర్థిక భరోసా.. చంద్రబాబుకు రైతులంటే గిట్టదు. అందుకే ఆయన వ్యవసాయమే దండగ అని గతంలోనే చెప్పారు. ఎన్నికల వేళమాత్రం రైతులకు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఏడాది కాలంలో రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. పెట్టుబడి సాయం కూడా అందించలేదు. రైతు ద్రోహి ప్రభుత్వమిది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకివ్వాల్సిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటానికి సిద్ధమవుతుంది. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు
పుట్టపర్తి టౌన్: ఏడాది క్రితం చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్పెరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ వెల్లడించారు. ధర్మవరంమండలం పోతుకుంట గ్రామానికి చెందిన మంజునాథకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన యమునతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకు తెరువు కోసం పెనుకొండలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో పెనుకొండకు చెందిన సిద్దప్పతో యమునతో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న మంజునాథ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మంజునాథ్ తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న యమున... ఆ మేరకు సిద్దప్పను ప్రభావితం చేసింది. పథకం ప్రకారం హత్య.. యమునతో కలసి మంజునాథ్ హత్యకు కుట్ర పన్నిన సిద్ధప్ప 2024, ఏప్రెల్ 22న తన స్నేహితులు నూర్ మహమ్మద్, మదన్మోహన్, మోహన్తో ధర్మవరం మండలం నాగలూరు వద్ద ఉన్న పెద్ద వంకలో మద్యం పార్టీ ఏర్పాటు చేసుకుందామని మంజునాథ్ను పిలుచుకెళ్లాడు. అక్కడ మంజునాథ్కు అతిగా మద్యం తాగించి పథకం ప్రకారం టవాలును మెడకు బిగించి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ధర్మవరం రూరల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పసిగట్టారు. ఆదివారం సాయంత్రం పోతుకుంట గ్రామశివారులో తచ్చాడుతున్న ప్రధాన నిందితుడు సిద్దప్ప, నూర్ మహమ్మద్, మదన్మోహన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మోహన్, యమున పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన డీఎస్పీ హేమంత్కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు. ఏడాది క్రితం వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించిన భార్య -
అవ్వకు అష్టకష్టాలు
ఈ వృద్ధురాలు భీమరాయునిపేట గ్రామానికి చెందిన బ్యాల్ల నీలమ్మ. రేషన్కార్డులో ఈమెతో పాటు భర్త ఉన్నారు. వీరు రేషన్ బియ్యం కోసం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లానారాయణపల్లికి వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామానికి వెళ్లడానికి బస్సు, ఆటో సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే బయల్దేరింది. 65 ఏళ్ల వయసు మీద పడిన నీలమ్మ రేషన్ కోసం అష్టకష్టాలు పడి నడిచి వెళితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. ‘గతంలో ఇంటి వద్దే సరుకులు తీసుకునేవాళ్లం. ఈ వయసులో మాకు ఈ అగచాట్లు ఏమిటో అర్థం కావడం లేదు’ అని నీలమ్మ వాపోయారు. – తాడిమర్రి -
ప్రతి కుటుంబానికీ రూ.లక్ష బాకీ
చిలమత్తూరు: హామీలు అమలు చేయని కూటమి సర్కారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రూ.లక్ష బాకీ పడిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పార్లమెంట్ ఇన్చార్జ్ రమేష్రెడ్డి పేర్కొన్నారు. వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించిన పాలకు తీరుపై ఈ నెల నాలుగో తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిర్వహించే నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం హిందూపురం కార్యాలయంలో వారు నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్, రమేష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు అమలు చేసి ఉంటే ఏడాదిలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష దాకా లబ్ధి చేకూరేదని, ఇప్పటికై నా ప్రభుత్వం ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు ఎలా వంచించారో ‘వెన్నుపోటు దినం’లో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కక్షలకే ప్రాధాన్యం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డి, పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత వేణురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్రెడ్డి, రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఎ.శివ, జిల్లా అధికార ప్రతినిధి శివశంకర్రెడ్డి, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జబీఉల్లా, చిలమత్తూరు, లేపాక్షి మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, సయ్యద్ నిస్సార్, వాణిజ్య విభాగం జిల్లా అద్యక్షుడు మహేష్గౌడ్, నాగరాజు, వాల్మీకి లోకేష్, జిల్లా నేతలు గిరీష్, దిలీప్, శ్రీనివాసరెడ్డి,రోషన్ అలీ పార్టీ నేతలు పాల్గొన్నారు. హామీల అమలులో కూటమి సర్కారు అట్టర్ఫ్లాప్ అధికారమిచ్చిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పార్లమెంట్ ఇన్చార్జ్ రమేష్రెడ్డి -
బోగస్పై కలెక్టర్ దృష్టి
అనంతపురం ఎడ్యుకేషన్: బోగస్ సర్టిఫికెట్లతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పొందాలని చూస్తున్న కొందరి టీచర్ల వ్యవహారంపై కలెక్టర్ వినోద్కుమార్ దృష్టి సారించారు. కొందరు టీచర్లు బోగస్ సర్టిఫికెట్లతో పాయింట్లు పొందతున్న వైనంపై ‘సాక్షి’లో వరుసగా ‘పాయింట్లపై ఫిర్యాదల వెల్లువ’ ‘స్టేషన్ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం’ శీర్షికలతో ప్రచురించిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబుతో మాట్లాడారు. స్పౌజ్, పీహెచ్, లీగలీ సపరేటెడ్ తదితర అంశాల్లో అర్హత లేకున్నా బోగస్ సర్టిఫికెట్లతో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చేరారనే విషయాలపై డీఈఓను ఆరా తీశారు. అలాగే మరికొందరు టీచర్లు స్టేషన్ పాయింట్లు నమోదులోనూ ఇష్టానుసారంగా వేసుకున్నారనే అంశంపైనా ఆరా తీశారు. మెడికల్ సర్టిఫికెట్లతో పాటు స్టేషన్ పాయింట్ల వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ పేరుతో జారీ చేసిన సర్కులర్ విద్యాశాఖ, ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. లేని రోగాలను సృష్టించుకుని... అనువైన స్థానాల్లో చేరేందుకు అడ్డదారులు ఎన్నుకున్నారు. లేని రోగాలను సృష్టించుకుని, తక్కువ శాతం ఉన్న వైకల్యాలను ఎక్కువ శాతం చూపిస్తూ, అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నా పైరవీలు చేసి తెచ్చుకున్న బోగస్ వైద్య ఽద్రువీకరణపత్రాలతో ‘ప్రిపరెన్షియల్’ కేటగిరి, ‘స్పెషల్’ పాయింట్లు పొందేందుకు పన్నాగం రచించారు. ఈ క్రమంలో గత కౌన్సెలింగ్ల్లో జనరల్ కేటగిరీల్లో ఉన్న చాలామంది ఈసారి ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ప్రత్యేక పాయింట్ల జాబితాల్లో చేరారు. ఉద్యోగంలో చేరినప్పుడు వైకల్యం ఉన్నవారితో పాటు నిజంగా ప్రమాదవశాత్తూ, మరేదైనా కారణాలతో మధ్యలో వైకల్యం పొందిన వారినీ ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వయసు రీత్యా కాస్త వినకపోవడం, కంటిచూపు తగ్గడం సహజం. ప్రమాదవశాత్తూ కిందకు పడినప్పుడు చిన్నచిన్న సర్జరీలు చేసుకోవడం కూడా సహజమే. అయితే వీటినే పెద్ద బూచీగా చూపిస్తూ అడ్డుగోలుగా పాయింట్లు పొందుతున్నారు. వీరి వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఎంఈఓలతో సమావేశమైన డీఈఓ ఇదిలాఉండగా ఆదివారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలతో డీఈఓ ప్రసాద్బాబు సమావేశం ఏర్పాటు చేశారు. పాతస్టేషన్ పాయింట్ల నమోదులు ఎక్కువగా ఎస్జీటీలే వాడుకున్నారని ఇందుకు ఎంఈఓలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. గరిష్టంగా 24కు మించి అర పాయింటు కూడా ఎక్కువ ఉండకూడదన్నారు. స్టేషన్పాయింట్లు, రీఆపోర్స్మెంట్కు గురైన టీచర్లు పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి టీచరును పిలిపించి విచారించి పాయింట్ల నమోదులో తేడా ఉంటే సరి చేయాలన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్ల నమోదును జాగ్రత్తగా ఒకటిరెండు సార్లు పరిశీలించాలన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. పూర్తయిన తర్వాత కూడా ఎవరికై నా నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు ఉన్నట్లయితే సదరు టీచరుతో పాటు ఎంఈఓలపైనా చర్యలుంటాయని డీఈఓ స్పష్టం చేశారు. టీచర్ల ప్రిఫరెన్షియల్ కేటగిరీ విచారణకు ఆదేశం స్టేషన్ పాయింట్లు ఎక్కువ వేసుకోవడంపైనా ఆరా -
పింఛన్ డబ్బుతో ఆన్లైన్ బెట్టింగ్!
●వెల్ఫేర్ అసిస్టెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ గుడిబండ: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛన్ డబ్బును వాడేసుకున్నాడు. ఫలితంగా తన పరిధిలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. గుడిబండ మండలం గుణేమోరుబాగల్ పంచాయతీలో ఈ సంఘటన వెలుగు చూసింది. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున సామాజిక భద్రత పింఛన్ పంపిణీకి సంబంధించి మే 30న బ్యాంకు నుంచి రూ.1.82 లక్షల నగదు డ్రా చేశాడు. ఒకటో తేదీ ఆదివారం సెలవురోజు కావడంతో మే 31 శనివారం నుంచే పింఛన్ను పంపిణీ ప్రారంభమైంది. అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ తన పరిధిలోని లబ్ధిదారుల్లో ముగ్గురికి మాత్రమే పింఛన్ పంపిణీ చేశాడు. అనంతరం సర్వర్ పనిచేయలేదని, రేపు పంపిణీ చేస్తామని చెప్పాడు. అయితే ఆదివారం పింఛన్ పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు కార్యాలయానికి వస్తే అతడు అందుబాటులో లేడు. తమకు పింఛన్ ఇవ్వలేదని పలువురు మండలస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛన్ డబ్బును సొంతానికి వాడుకున్నట్లు.. ఆ మొత్తాన్ని ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నట్టు తేలింది. ఈ మేరకు ఎంపీడీఓ కేశవరెడ్డి వెల్ఫేర్ అసిస్టెంట్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున ఆన్లైన్ బెట్టింగ్ మోజులో పడి పింఛన్ డబ్బులు పోగొట్టినట్లు సమాచారం. క్రమశిక్షణా చర్యల కింద శెట్టూరు నుంచి గుణేమోరుబాగల్కు బదిలీ చేసినట్లు తెలిసింది. -
ప్రభుత్వ
నేడు పరిష్కార వేదిక కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు.తీరు.. సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, పుట్టపర్తి: గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసింది. నిత్యావసర సరుకుల కోసం పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇంటివద్దకే రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేసింది. అయితే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు స్వస్తి పలికింది. అంతేకాకుండా వివిధ కారణాలతో కార్డుదారులకు పంచదార, గోధుమపిండి, కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. బియ్యంతో మాత్రమే సరిపెడుతోంది. అది కూడా ఈ నెల నుంచి రేషన్ దుకాణం వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి పడిగాపులు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో వృద్ధులు, మహిళలు రేషన్ సరుకులు తీసుకెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఉదయం నుంచి చౌక దుకాణాల వద్ద బారులు తీరారు. ఎండలో ఇబ్బంది పడ్డారు. కొందరు పక్కనే ఉన్న వాహనాలు, చెట్ల కింద సేద తీరారు. మరికొన్ని చోట్ల రేషన్ షాపులు దూరంగా ఉండటంతో అక్కడి నుంచి సరుకులు మోసుకెళ్లలేక.. ఐదారుగురు కలిసి ఒకే వాహనంలో ఇంటి సమీపానికి చేరుకుంటున్నారు. ఇక వృద్ధులు, మహిళలు దూర ప్రాంతంలోని తమ ఇళ్లకు సరుకులు మోసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు. చేసేది లేక కొందరు బాడుగ ఆటో మాట్లాడుకుని తీసుకెళ్తున్నారు. బ్లాక్లో అమ్ముకునేందుకేనా? డీలర్షిప్లన్నీ తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. పేదలకు సరుకులు సరిగా ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముకుని అక్రమంగా ఆదాయం సంపాదించాలనే క్రమంలో అడ్డదారులు తొక్కుతున్నారు. ఫలితంగా కార్డుదారులకు ఇబ్బందులు పెడుతున్నారు. తమ్ముళ్ల కుమ్ములాటలో ఒక్కో పంచాయతీలో కార్డుల ఆధారంగా రెండు, మూడు దుకాణాలు వెలిశాయి. దీంతో తమ కార్డు ఎక్కడ ఉందో? ఏ దుకాణం వద్దకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అగళి మండలం రామాపురంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలోనూ రేషన్ కోసం కార్డుదారులు నిరీక్షిస్తున్న దృశ్యమిది. సాంకేతిక సమస్యలతో గ్రామంలో రేషన్ పంపిణీ తీవ్ర ఆలస్యమైంది. రాత్రయినా రేషన్ అందకపోవడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. చివరకు వారికి రేషన్ ఇవ్వకుండానే.. ‘రేపు రండి’ అంటూ ఇళ్లకు పంపించివేశారు. – అగళి ఈ వ్యక్తి పేరు కమాల్సాబ్. రొళ్ల సమీపాన మారుతి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కుమారుడికి మతిస్థిమితం లేదు. వీరు అంత్యోదయ అన్న యోజన కార్డు కింద 35 కిలోల బియ్యం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఎండీయూ ఆపరేటర్ వాహనంలో వచ్చి ఇంటి వద్దనే సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం రేషన్ షాపువద్దే తెచ్చుకోవాలని చెప్పారు. వృద్ధాప్యం మీదపడిందని, ఇప్పుడు షాపువద్దకెళ్లి సరుకులు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నానని కమాల్సాబ్ ఇంట్లోనే ఉండిపోయాడు. మాలాంటి వారి కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుని ఇంటివద్దకే అందివ్వాలని కోరుతున్నాడు. –రొళ్ల 8లోఇంటి వద్దకే రేషన్.. వివిధ రకాల నిత్యావసర సరుకుల పంపిణీ.. ఇలా సజావుగా సాగిపోతున్న ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి సర్కారు అస్తవ్యస్తం చేసింది. పాత పద్ధతిలో అంటే చౌకధాన్యపు దుకాణం వద్దే రేషన్ సరుకుల పంపిణీని తీసుకొస్తూ ఇంటివద్దకే రేషన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే పేదలు పని మానుకుని సరుకుల కోసం గంటల తరబడి రేషన్షాపు వద్ద పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ తీరుపై ప్రజలు బేజారు పడుతున్నారు.రాత్రి వరకు పడిగాపులు అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంటి వద్దే రేషన్ పంపిణీ విధానానికి స్వస్తి చౌకదుకాణాల వద్దే బియ్యం పంపిణీ ప్రారంభం ఉదయం నుంచే షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు దయ లేదా..? -
అవకతవకలకు తావీయొద్దు
పుట్టపర్తి అర్బన్: రేషన్ పంపిణీలో అవకతవకలకు తావీయరాదని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఆదివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి రేషన్ షాపును కలెక్టర్ తనిఖీ చేసి, లబ్ధిదారులకు నిత్యావసరాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ సరుకులను ఆదివారం నుంచి రేషన్ షాపు వద్దే పంపిణీ చేస్తోందని చెప్పారు. డీలర్లు కార్డుదారులకు సరైన తూకాలతో సక్రమంగా నిత్యావసరాలను అందజేయాలన్నారు. పోస్టర్లు, ధరల బోర్డు, స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్ అందజేయాలన్నారు. ప్రతి నెలా 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి విత్తన వేరుశనగకు రిజిస్ట్రేషన్లు పుట్టపర్తి అర్బన్: సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల కోసం రైతులు సోమవారం నుంచి రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ కోసం జిల్లాకు 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కే6, టీసీజీఎస్–1694 రకం విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 30 కిలోల విత్తన వేరుశనగ బస్తా పూర్తి ధర రూ.2,790 కాగా 40 శాతం సబ్సిడీ పోనూ రైతు వాటాగా రూ.1,674 చెల్లించాలన్నారు. కదిరి లేపాక్షి రకం 30 కిలోల బస్తా పూర్తి ధర రూ.2,460 కాగా సబ్సిడీ పోనూ రైతు వాటా రూ.1,476 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అర ఎకరం వరకు 30 కిలోల బస్తా, అంతకు మించి ఎకరం వరకూ రెండు బస్తాలు, ఎకరం నుంచి ఆపైన భూమి ఉన్న రైతులకు గరిష్టంగా 3 బస్తాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. న్యూస్రీల్ -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు... కక్కలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144/2ఏలో మొత్తం 1.76 ఎకరాల్లో ఆర్.కృష్ణారెడ్డి కుమారుడు హనుమంతరెడ్డికి 0.73 సెంట్లు, మహమ్మద్ షఫీ కుమారుడు సయ్యద్ షామీర్కు 0.58 సెంట్లు, మహేష్బాబు భార్య జి.విజయలక్ష్మికి 0.08 సెంట్లు, షేక్ మహబూబ్బాషా కుమారుడు షేక్ ఇమాం బాషాకు 0.08 సెంట్ల స్థలం ఉంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గత 20 సంవత్సరాలుగా పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంక్ రుణాలు సైతం పొందారు. ఆ స్థలంలో నీటి బోర్లు, కాంపౌండ్ వాల్, షెడ్డు, డోర్ నంబర్లు, కరెంట్ బిల్లులూ ఉన్నాయి. గత నెల 28న సర్వేయర్ ఉమామహేశ్వర్ ఫోన్ చేసి హద్దులు చూపిస్తానని తెలపడంతో వారు హక్కుదారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ప్రహరీని జేసీబీతో కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం సాగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన 50 మంది అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి తమదంటూ దుర్భాషలాడుతూ హక్కుదారులను పక్కకు లాగేశారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దౌర్జన్యపరులపై ఎలాంటి చర్యలూ లేవు. అలాగే కియా కార్ల షోరూం వెనుక ఉన్న ఎకరాలోపు స్థలంలో కుటుంబ సభ్యులపై అనంతపురం, రాప్తాడు ప్రజాప్రతినిధులకు చెందిన ముఖ్య అనుచరులు దాడి చేశారు. నగరంలోని అరవిందనగర్కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ గుప్తాకు చెందిన ఈ స్థలం అత్యంత విలువైనది. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు శనివారం ఆ స్థలం వద్దకెళ్లి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రసాద్ గుప్తా, అతని కుమారులు ప్రణీత్, సాయినాథ్ అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో వెంకటేశ్ప్రసాద్ గుప్తా చెవికి తీవ్ర గాయమైంది. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కె.సాయినాథ్ మాట్లాడుతూ.. భూ వివాదాలపై ప్రాథమికంగా విచారణ చేపడతామన్నారు. బాధితులకు రాత్రి, ఉదయం ఫోన్ చేసి విచారణకు రావాలని సూచించామని, వారిచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
ఇరు కుటుంబాల ఘర్షణ
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు: నియోజకవర్గంలో టీడీపీ నాయకుల నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వివరాలు.. తిమ్మనచెరువు గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు ఆదివారం గ్రామ దేవతలకు మొక్కు చెల్లించి విందు ఏర్పాటు చేసాడు. కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఓబులేసు కుటుంబసభ్యులూ హాజరయ్యారు. కాగా, ఓబులేసుకు కుమార్తె రత్నమ్మ, కుమారులు రాజు, నాగేంద్ర, ఓబులేసు ఉన్నారు. రత్నమ్మకు 15 సంవత్సరాల క్రితమే వివాహమైంది. కుమార్తె కుటుంబానికి తండ్రికి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విందు కార్యక్రమంలో ఇరు కుటుంబాలు తారసపడి ఘర్షణకు దిగాయి. రత్నమ్మపై తండ్రి ఓబులేసు, తమ్ముడు రాజు చేయి చేసుకున్నారు. దీంతో రత్నమ్మ భర్త చిన్నరంగయ్య, అమె బావ పెద్దరంగయ్య, కొడుకు మనోజ్ వెంటనే ఓబులేసు, రాజుపై కర్రలతో, పైపులతో దాడి చేశారు. తండ్రిని, అన్నను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర, ఓబులేసు వెంటనే అక్కడకు చేరుకుని చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య, మనోజ్పై కొడవలి, కర్రలతో ప్రతి దాడికి దిగారు. ఘటనలో వీరితో పాటు బంధువులు కిట్ట, వేణుకూ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి, అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓబులేసు కుమారుడు రాజు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వేమనాథరెడ్డి కారు డ్రైవర్ కావడంతో టీడీపీ నాయకులు వెంటనే రాజకీయ రంగు పులిమి ఆ పార్టీ నేతలపై దాడులు చేశారంటూ వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. కాగా, ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ రంగు పులిమిన పచ్చ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసు బనాయించేలా కుట్ర -
జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన సోనాక్షి
అనంతపురం: సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ఆధ్వర్యంలో గోవా వేదికగా గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించగా.. రోలర్ స్కేటింగ్ విభాగంలో జిల్లాకు చెందిన చిన్నారి ప్రతిభ చాటింది. అండర్–5 కేటగిరిలో ఏకంగా రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కె.వేణుగోపాల్, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షిని ఆమె చదువుతున్న మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆదివారం అభినందించింది. -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. నాలుగు మండలాల్లో విస్తారంగా నిమ్మ సాగు తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పుట్లూరు మండలాలతోపాటు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని రైల్వే కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిమ్మ సాగు విస్తారంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి తాడిపత్రిలోని మార్కెట్ యార్డుకు నిమ్మ కాయలను మంగళ, శుక్ర, ఆదివారాల్లో రైతులు తీసుకువస్తుంటారు. బస్తాలో 1,000 నుంచి 1,100 వరకు నిమ్మకాయలు ఉంటాయి. కాయ నాణ్యత, సైజును బట్టి మూడు రకాలుగా విభజించి వేలం వేస్తారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ ధర గిట్టుబాటు కాకపోతే రైతులు జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మార్కెట్లో తగ్గిన నిమ్మకాయల ధరలు.. గత ఏడాది ఇదే సమయానికి నిమ్మ ధరలు రైతులకు కాస్త వెసులుబాటుగా ఉండేది. అప్పట్లో బస్తా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్ముడు పోయింది. ఈ ఏడాది రుతు పవనాలు వారం రోజులు ముందుగా జిల్లాను పలకరించాయి. దీంతో ఆకాశం మబ్బులు కమ్ముకోవడం, వాతావరణ పరిస్థితులు చల్లబడటంతో నిమ్మ ధరలు అమాంత పడిపోయినట్లుగా తెలుస్తోంది. బస్తా రూ.5వేల నుంచి రూ.1,500 లోపు ఆందోళనలో రైతులు మరింత తగ్గుతాయి నేను తాడిపత్రిలోని మార్కెట్లో డైలీ నిమ్మకాయలు అమ్ముతుంటాను. గత నెలలో రూ.20కి 5 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.10కే 5 కాయలు ఇస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే నిమ్మకాయల ధరలు మరింత తగ్గే అవకాశముంది. – రసూల్బీ, వ్యాపారి, తాడిపత్రి -
పరిహారం కోసం పోరాటం
ముదిగుబ్బ: భూ పరిహారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ఎకరా రూ.కోటి విలువైన భూమికి రూ.12 లక్షల మాత్రమే చెల్లించాలని నిర్ణయించడాన్ని అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాత పనులు చేపట్టాలంటూ పనులు అడ్డగిస్తున్నారు. వివరాలు.. ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి ఎన్హెచ్ 342 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం మొదటి విడతలో 138.59 ఎకరాలను సేకరించి రైతుల ఖాతాల్లో రూ.16,27,50,029 మొత్తాన్ని జమ చేసింది. అయితే అక్కడక్కడ మిగిలిపోయిన భూములకు, ముదిగుబ్బ బైపాస్ నుంచి కొంత దూరం వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం గుంజేపల్లి, దొరిగిల్లు, మంగళమడక, నక్కలగుట్టపల్లి పొలాల్లో రెండో విడతగా 16.69 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. పట్టించుకోని ప్రభుత్వం రెండో విడత సేకరించిన భూమికి ప్రస్తుత ప్రభుత్వం సరైన ధర ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. గుంజేపల్లి పొలానికి ఎకరానికి రూ.12.5 లక్షలు, దొరిగిల్లు పొలానికి రూ.7.5 లక్షలుగా నిర్ణయించింది. అయితే తమ భూములు మండల కేంద్రానికి దగ్గరగా ఉన్నాయని, వాటి ధర ఎకరం రూ.కోటి పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమికి రూ.లక్షల్లో పరిహారం ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పరిహారం పెంచి తమకు న్యాయం చేసేదాకా పనులు జరగనివ్వమని వారు తెగేసి చెబుతున్నారు. ఎకరా రూ.కోటి విలువైన భూమికి రూ.12 లక్షలు చెల్లించాలని నిర్ణయం పరిహారం మొత్తం పెంచాలని అన్నదాతల డిమాండ్ -
టెంకాయపై భారం వేసి..
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లోనూ రైతులు పూర్వీకుల పద్ధతినే అనుసరిస్తున్నారు. తమ పొలాల్లో బోరు బావులు తవ్వాలనుకునే రైతులు ముందుగా టెంకాయపై భారం వేసి నీటి లభ్యతను పసిగడుతున్నారు. టెంకాయను అరచేతిలో పట్టుకుని నడుస్తుండగా అది పైకి లేచి కింద పడిన చోట బోరు తవ్వితే నీరు సమృద్ధిగా లభ్యమవుతుందని నమ్మకం. ధర్మవరం సమీపంలోని ఓ రైతు పొలంలో భూగర్భ జలం కోసం అన్వేషిస్తున్న ఈ దృశ్యం అటుగా వెళుతున్న వారిని ఆశ్చర్యపరిచింది. దీంతో కాసేపు తమ వాహనాలను ఆపి ఆసక్తిగా గమనించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
నిరుద్యోగ భృతి ఊసే లేదు
నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. ఉద్యోగం దొరక్క ఇంటి వద్దనే ఉంటున్నా. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ భృతి ఇస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిరుద్యోగ భృతి అందించాలి. – హరిప్రసాద్ , నిరుద్యోగి, మడకశిర బీటెక్ చేసినా.. ఫలితం లేదు నేను బీటెక్ పూర్తి చేసినా.. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్నా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం దారుణం. దీంతో డిగ్రీలు పూర్తి చేసిన నాలాంటి లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. – షేక్ మౌలాలి, మహమ్మదాబాద్, అమడగూరు మండలం -
సెటిల్మెంట్ల స్టేషన్ !
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సాధారణంగా పోలీసులంటే అరెస్టు చేయడం, లాకప్లో వేయడం చూస్తుంటాం. కానీ పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయం ఆస్తుల పంపకాలు, అగ్రిమెంట్లు రాసుకోవడానికి కూడా వేదికగా మారినట్లు తెలిసింది. చాలాచోట్ల సివిల్ తగాదాల్లో తాము తలదూర్చబోమని పోలీసులు చెబుతుంటారు. కానీ ఇక్కడి ఖాకీలు మాత్రం ‘మేం సివిల్ పంచాయితీలే చేస్తా’మంటూ ముందుకెళుతున్నట్లు సమాచారం. అది కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే అన్నీ జరుగుతున్నాయంటే స్టేషన్లో జరిగే అక్రమాల తంతును అంచనా వేయొచ్చు. ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసులో పుట్టపర్తి పోలీసుల అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటికొస్తున్నాయి. ఏదైనా కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడంటే అరెస్టు చేయడం, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు పంపడం పరిపాటి. కానీ ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ రాజును పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకుని వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ఆధీనంలో ఉండగానే బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సత్యనారాయణ రాజు పేరుపై ఉన్న ఆస్తులకు ఏకంగా అనామతు అగ్రిమెంట్లు కూడా చేశారు. అంటే సత్యనారాయణ రాజుకు పూర్తిగా డబ్బు ముట్టిందని, దీనిపై సర్వహక్కులు తనకే అనేలా నాన్జ్యుడీషియరీ స్టాంపు పేపర్లపై అగ్రిమెంట్లు జరిగాయి. ఎవరికి రాయించారో (కొనుగోలు చేసిన వారి వివరాలు) పేర్లు వెల్లడించలేదు. ఈ క్రమంలో పుట్టపర్తి పోలీసులపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ డివిజనల్ స్థాయి పోలీస్ అధికారి సమక్షంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్ ఆర్విన్ను రూ.12 కోట్లకుపైగా మోసం చేసిన సత్యనారాయణ రాజుపై మే 22వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదైతే మే 28వ తేదీ అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. అంటే వారం రోజుల పాటు అతణ్ని స్టేషన్లోనే ఉంచి చిత్ర హింసలు పెట్టడంతో పాటు ఆస్తుల బదలాయింపు, ఆస్తులపై సేల్ అగ్రిమెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా చిన్న కేసులో నిందితుణ్ని పట్టుకుంటేనే మీడియా ముందు హాజరుపెట్టి అద్భుతం చేశామని చెప్పుకునే పోలీసులు.. మే 28న డీఎస్పీ విజయకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించే సమయంలో నిందితుడిని చూపకపోవడం గమనార్హం. ఇటీవల ‘తెనాలి’లో జరిగిన తరహాలోనే ఇక్కడ కూడా నిందితుడికి చిత్రహింసలు పెట్టడంతో మీడియాకు చూపలేదని కొంతమంది పోలీసులే ‘సాక్షి’తో తెలిపారు. తర్వాత ఒకరిద్దరు మీడియా ప్రతినిధులకు నిందితుణ్ని ముసుగేసి చూపించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీకి చెందిన అన్నదమ్ములు కీలక పాత్ర పోషించడమే కాదు, పోలీసులకు రూ.50 లక్షల నగదు ముట్టజెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అన్న చర్చ జరుగుతోంది. ‘ప్రవాస భారతీయుడికి మోసం’ కేసులో వెలుగులోకి కొత్త అంశాలు పోలీస్ స్టేషన్లోనే ఆస్తుల అగ్రిమెంట్లు నిందితునికి చిత్రహింసలు పెట్టి పేపర్లపై సంతకాలు ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే అన్యాయపు తంతు మీడియా ముందుకూ తేలేదు.. వారం రోజులు చిత్రహింసలు.. -
ద్విచక్రవాహనాల ఢీ
● ముగ్గురికి గాయాలు మడకశిర రూరల్: యు.రంగాపురం వద్ద శనివారం ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... జీవీపాళ్యం పంచాయతీ బంద్రేపల్లి నుంచి శివన్న లక్ష్మీదేవి అనే మహిళతో కలిసి దిచక్రవాహనంలో మడకశిరకు బయల్దేరాడు. ఇదే సమయంలో యూ రంగాపురం చెందిన ఖాసీమ్ పని నిమిత్తం బైక్పై వెళ్తున్నాడు. సరిగ్గా రోడ్డు క్రాస్లోకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు వేగం అదుపు చేసుకోలేక ఢీకొన్నాయి. శివన్న, ఖాసీమ్లకు తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మీదేవి స్వల్పంగా గాయపడింది. స్థానికులు గమనించి 108కు ఫోన్ చేస్తే ఎంతసేపటికీ అంబులెన్స్ చేరుకోలేదు. ఆలస్యమవుతుండడంతో బాడుగకు వాహనం మాట్లాడుకుని కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం శివన్న, ఖాసీమ్ను మెరుగైన వైద్యం కోసం హిందూపురం పంపించారు. వివాహిత బలవన్మరణం ● అదనపు కట్నం వేధింపులే కారణం ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక వివాహిత తన పుట్టింటిలో బలవన్మరణానికి పాల్పడింది. ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డప్ప వివరాల మేరకు... కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ చిన్న నరసింహులుకు ధర్మవరంలోని శాంతినగర్కు చెందిన భాగ్యలక్ష్మి(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లయిన కొంతకాలం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుబ్బమ్మ, పెద్ద నరసింహులు వేధించడం మొదలు పెట్టారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా చేశారు. అయినా మెట్టినింటి వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భాగ్యలక్ష్మి 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. మనోవేదనకు గురైన భాగ్యలక్ష్మి శనివారం ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి తల్లి కొండమ్మ ఫిర్యాదు మేరకు మెట్టినింటి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. వ్యక్తి ఆత్మహత్య ఓడీచెరువు: పగడాలవారిపల్లికి చెందిన కొక్కంటి శంకరప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మే 29న శంకరప్ప గౌనిపల్లిలో మద్యం తాగి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుమారుడు అతడిని ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకే శంకరప్ప ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఊరి చివరన ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో వంచన ● నిందితుడికి రిమాండ్ కదిరి టౌన్: పెళ్లి పేరుతో వంచన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు. ఎన్పీకుంట మండలం గంగిరెద్దులోళ్లపల్లికి చెందిన హరిప్రసాద్రెడ్డి కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ప్రైవేట్ విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతను గతంలో కదిరి పట్టణంలోని ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒంటరి మహిళను పెళ్లి చేసుకుంటానని దగ్గరై.. గర్భవతిని చేసిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీంతో బాధిత మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హరిప్రసాద్ను శనివారం రాయచోటి రోడ్డు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి సమీపంలో అరెస్టు చేసి కదిరి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్కు విధించడంతో అతన్ని అనంతపురం సబ్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. -
4న వెన్నుపోటు దినం
పుట్టపర్తి టౌన్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన పుట్టపర్తిలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తెలిపారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులతో కలసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లు విడుదల చేశారు. దుద్దుకుంట శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం, ఇంటికో ఉద్యోగం/ నిరుద్యోగ భృతి, అన్నదాతా సుఖీభవ తదితర పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోవచ్చని నారా లోకేష్ ఎన్నికల సమయంలో అన్నారని, మరి ఇప్పుడు దీనిపై ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కుటమి ప్రభుత్వంపై సమర సంఖారావం పూరించే సమయం ఆసన్నమైందన్నారు. నాలుగో తేదీ ఉదయం 9 గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధసంఘాల సభ్యలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు -
ప్రాణం తీసిన ఓవర్టేక్
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: ఓవర్ టేక్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. కారును కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ జాన్రెడ్డి (80), చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె షైనీదీప్తి, అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించి శనివారం కారులో తిరుగు పయనమయ్యారు. బూదగవి సమీపంలో బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు, అల్లుడుతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రతమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. కారును ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు ఒకరు మృతి.. నలుగురికి గాయాలు -
స్టేషన్ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా స్టేషన్ పాయింట్లు (పని చేస్తున్న స్కూల్) గరిష్టంగా 24కు మించి ఉండకూడదు. ఎనిమిదేళ్ల సర్వీసుకు (3వ కేటగిరీ) 24 పాయింట్లు వస్తాయి. ఆపైన 9–10 ఏళ్లు సీనియారిటీ ఉన్నా..గరిష్టంగా ఎనిమిదేళ్లకే పాయింట్లు పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అయినా కొందరు టీచర్లు ఇష్టానుసారంగా నమోదు చేసుకున్నారు. సరి చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది టీచర్లు ఇష్టానుసారంగా స్టేషన్ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ఎస్జీటీ తెలుగులో 3,872 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వీరిలో 84 మంది ఎస్జీటీలు స్టేషన్ పాయింట్లు 24కు పైగా వేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎడిట్ చేయాలని డీఎస్ఈ నుంచి డీఈఓలు, ఎంఈఓలకు ఆదేశాలు వచ్చాయి. పట్టించుకోని ఎంఈఓలు.. ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను..సంబంధిత టీచర్లతో హార్డ్కాపీలు తెప్పించుకుని వారు వేసుకున్న పాయింట్లను పరిశీలించి ఆమోదం తెలపాలి. చాలా మండలాల్లో ఎంఈఓలు పట్టించుకోని కారణంగా ఈ ప్రక్రియ సరిగా జరగలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే నిర్ధారించారు. తర్వాత డీఈఓ లాగిన్కు వచ్చిన దరఖాస్తులను కూడా కార్యాలయ సిబ్బంది అలానే నిర్ధారించి పంపారు. ఫలితంగానే వందలాది మంది టీచర్లకు స్టేషన్ పాయింట్లలో తేడా వచ్చింది. వీటిని సరిదిద్దుతున్నామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ‘ప్రత్యేక’ పాయింట్లలోనూ అడ్డదారులు.. కొందరు టీచర్లు అనుకూలమైన స్థానాలకు వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యాలు, వ్యాధుల బారిన పడిన వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నా, ప్రత్యేక పాయింట్లు పొందినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే..లేని రోగాలను సృష్టించుకుని అడ్డదారుల్లో నకిలీ సర్టిఫికెట్లు పొంది పాయింట్లు పొందుతుండడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. డి.హీరేహాళ్ మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బైకుపై నుంచి కిందకు పడ్డాడు. ఇదే అదనుగా తనకు మేజర్ సర్జరీ జరిగినట్లు ప్రచారం చేసుకుని నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకుని.. ప్రత్యేక పాయింట్లు పొందాలని చూస్తున్నాడు. ఈయన వ్యవహారంపై కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. బదిలీలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లను పున:పరిశీలించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఎవరైనా మెడికల్ సర్టిఫికెట్లను దుర్వినియోగపరిస్తే.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్న 84 మంది ఎస్జీటీలు అధికారుల పరిశీలనలో వెలుగులోకి.. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య, ఆరోగ్యశాఖతో పాటు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని కోర్టు హాలులో జిల్లా అధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల కలిగే ఇబ్బందులు...ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... జిల్లాలో వర్షాల కారణంగా చెరువులు, కాలువలకు గండి పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ, విషజ్వరాలు విజృంబించే అవకాశం ఉందని, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్లోరినేషన్ చేయడంతో పాటు నీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డీపీఓ సమత, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు. 11 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కదిరి మండలంలో 24.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక అమడగూరు మండలంలో 15.4 మి.మీ, నల్లమాడ 10, గాండ్లపెంట 7.8, ఓడీచెరువు 5.4, నల్లచెరువు 5.2, తనకల్లు 4.2, గుడిబండ 3.2, పెనుకొండ 2.8, తలుపుల 2.2, ఎన్పీకుంట మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. న్యూస్రీల్ -
స్తంభానికి కట్టేసి.. చితకబాది..
కదిరి టౌన్: పెట్రోల్ బంకు వర్కర్ను స్తంభానికి కట్టేసి.. చితకబాదిన అమానుష ఘటన కదిరిలో వెలుగు చూసింది. కుమ్మరవాండ్లపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తి పెట్రోలుబంకు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ బాబా అనే వ్యక్తి వర్కర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని.. పెట్రోలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని మేనేజర్ సూర్యనారాయణకు అందజేశాడు. అయితే అందులో రూ.24వేలు తక్కువగా వచ్చిందని, ఆ మొత్తాన్ని అతనే కాజేసి ఉంటాడని మేనేజర్ సూర్యనారాయణ, అమర అనే మరో వర్కర్తో కలిసి బాబాను దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం బాధితుడు తాను డబ్బు సక్రమంగా జమచేసినా.. అకారణంగా దొంగను చేసి కొట్టారంటూ మేనేజర్, మరొక వర్కర్పై కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ నిరంజన్రెడ్డి కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్సీపీలో నయా జోష్
● పార్టీ అనుబంధ విభాగాల్లో జిల్లా వాసులకు చోటు సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురు యువకులకు చోటు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు లభించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా జీవీ లింగారెడ్డి (రాప్తాడు), యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా పి.చంద్రశేఖర్రెడ్డి (హిందూపురం), బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీలుగా బిల్లే మంజునాథ (రాప్తాడు), ఎం.రాజునాయుడు (పుట్టపర్తి), బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా పి.వెంకటరమణ (పుట్టపర్తి), కుండ్ల కిష్ట (పుట్టపర్తి), వలంటీర్ విభాగం రాష్ట్ర సెక్రటరీగా మిద్ది భాస్కర్రెడ్డి (పుట్టపర్తి), వలంటీర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా టీడీ విజయభాస్కర్రెడ్డి (పుట్టపర్తి), ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా బత్తల సుధీర్ కుమార్ రెడ్డి (రాప్తాడు), ఐటీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సుబ్బు రాయల్ (రాప్తాడు), వాణిజ్య విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కె.నర్సిరెడ్డి (పుట్టపర్తి), వాణిజ్య విభాగం రాష్ట్ర సెక్రటరీగా చెరువు భాస్కర్ రెడ్డి (పుట్టపర్తి), వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఇ.సోముశేఖర్రెడ్డి (పుట్టపర్తి)ని నియమించారు. ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలి ● ఎఫ్సీఆర్ఏను వెంటనే పునరుద్ధరించాలి: రఘువీరా మడకశిర రూరల్: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు రాకుండా కేంద్రం విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి ఆర్డీటీకి నిధులు అందే విధంగా వెంటనే ఎఫ్ఆర్సీఏను పునరుద్ధరించాలన్నారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, సవిత, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిలకు లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆర్డీటీ సంస్థ గత 50 ఏళ్లుగా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంతో పేదలకు సేవలు అందించిదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లక్షలాది కుటుంబాలకు ఆర్డీటీ సేవలందించిందన్నారు. ఈ సంస్థ ఎక్కువగా విదేశీ నిధులపైనే ఆధారపడుతోందన్నారు. ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ నిలిపి వేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి సంస్థ గురించి కేంద్రానికి నివేదించి సేవలను పునరుద్ధరించాల్సిన బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. పుట్టపర్తిలో జరిగిన ఘటన పోలీసుల పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలకే దొంగ, కేటుగాళ్లకు కేటుగాడు వంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం.. కాన
ఎన్ఆర్ఐని చీటింగ్ చేసిన కేసులో భారీ ట్విస్టులు ● నిందితుడిని పోలీస్స్టేషన్లో పెట్టి స్థిరాస్తుల బదలాయింపు ● పోలీసుల ఆధ్వర్యంలోనే నిందితుడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి ● కేసు నమోదు చేసిన వారానికి అరెస్టు చూపించిన పోలీసులు ● పోలీసు అధికారులకు రూ.50 లక్షల డీల్ కుదిర్చిన టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడైన ఆర్వీన్ మహేంద్రకర్ను పుట్టపర్తికి చెందిన సత్యనారాయణ రాజు రూ.12.50 కోట్ల మేర మోసం చేశారు. ఈ కేసులో బాధితుడికి పెద్దగా లాభం చేకూరకపోగా నిందితుడి నుంచి పోలీసులకు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు, ద్వితీయశ్రేణి నాయకులకు బాగా లబ్ధి కలిగింది. పోలీసులకు రూ.50 లక్షల డీల్ ఎన్ఆర్ఐ మోసపోయిన కేసులో పోలీసులకు రూ.50 లక్షల డీల్ కుదిరినట్టు తెలిసింది. ఈ నెల 22న బాధితుడి ఫిర్యాదు మేరకు సత్యనారాయణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. 28వ తేదీ వరకు అరెస్టు చూపించలేదు. ఈ ఏడు రోజుల పాటు నిందితుణ్ని స్టేషన్లో హింసించి.. లొంగదీసుకుని దారికి తెచ్చుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారు. తాము చెప్పినట్టు చేస్తే మీకు రూ.50 లక్షలు ఇస్తామని టీడీపీ నాయకులు పోలీసు అధికారికి చెప్పడంతో తలూపిన సదరు అధికారి బాధితుణ్ని గోప్యంగా ఉంచి.. చేయాల్సిందంతా చేశారు. ఆస్తుల బదలాయింపు నిందితుడి పేరిట భారీగా భూములు, స్థలాలు ఉన్నాయి. వీటిని కొట్టేయాలనేదే ఆలోచన. పథకంలో భాగంగా అరెస్టుకు ముందే నిందితుడి పేరున ఉన్న కొన్ని భూములు ఓ మహిళ (ఎన్ఆర్ఐ భార్య) పేరిట బదలాయించారు. ఈమె పుట్టపర్తిలో పూల వ్యాపారం చేసుకునేది. వీసా సమస్య వస్తుందని గతంలో మహేంద్రకర్కు సదరు మహిళతో ప్రస్తుత నిందితుడు సత్యనారాయణరాజు పెళ్లి జరిపించారు. ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్కు ఇక్కడి విషయాలు తెలియవు. దీంతో ఈమెను టీడీపీ నాయకులు, పోలీసులు భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. అనంతరం సత్యనారాయణరాజు పేరుపై ఉన్న ఆస్తులు బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో (డాక్యుమెంటు నంబర్లు 1563, 1564, 1584) ఆమె పేరుపై బదలాయించారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు ఎస్కార్టు వాహనాల్లో నిందితుణ్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారంటే పోలీసులు ఏ స్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు. ముందుగా ఆమె పేరుతో బదలాయించి.. ఆ తర్వాత తక్కువ ధరకు టీడీపీ నేతలు రాయించుకోవాలనేది ఎత్తుగడ. నిందితుణ్ని వారం రోజులు అరెస్టు చూపించకుండా చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఇక్కడ భారీగా లబ్ధిపొందిన పోలీసు అధికారిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐతో కలిసి పోలీసు బాస్లకు వసూళ్లు చేసి పెట్టడంలోనూ ఈ అధికారికి ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అరాచకాలు సాయి భక్తులకు విస్మయం కలిగిస్తున్నాయి. ఎన్నో దేశాల నుంచి సాయి సన్నిధికి భక్తులు వస్తుంటారు. ఇలా పోలీసులే నిందితుల నుంచి వసూళ్లు మొదలెడితే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో పుట్టపర్తి పోలీసులు తమను తాము కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. -
అనుమతుల్లేకుండా క్లినిక్లు నడిపితే చర్యలు
● డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం కదిరి టౌన్: అనుమతుల్లేకుండా క్లినిక్లు నడిపితే చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఫైరోజాబేగం హెచ్చరించారు. క్లినిక్ సీజ్ చేయడంతో పాటు సదరు డాక్టర్పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆమె కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో కదిరి ఐఎంఏ ప్రతినిధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయన్నారు. అందువల్ల డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో బ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనధికార అబార్షన్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జననాల ధ్రువీకరణ పద్ధతి, మేల్ అండ్ ఫిమేల్ జననాల సంఖ్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కదిరి శాఖ సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు డీఎంహెచ్ఓను సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ఓ నాగేంద్రనాయక్, డాక్టర్లు శంకరయ్య, సీవీ మదన్కుమార్, విద్యాసాగర్, హుస్సేన్, చంద్రశేఖర్రెడ్డి, అశోక్కుమార్రెడ్డి, మారుతి ప్రసాద్, ముస్తఫా, విజయ్, తన్వీర్, ప్రమీల, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో ఆరుగురికి పదోన్నతి అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురికి పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ల్యాబ్ అసిస్టెంట్, ఓ రికార్డు అసిస్టెంట్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో భీమయ్య (గుమ్మఘట్ట), ఫకృద్ధీన్ (సిద్దరాంపురం), లక్ష్మన్న (నాగసముద్రం), సాదిక్ బాషా (తగరకుంట), హరికృష్ణ (ముదిగుబ్బ), వెంకటేశులు (కళ్యాణదుర్గం) ఉన్నారు. వీరికి పదోన్నతుల ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేసి, అభినందించారు. అలాగే జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగులకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ సమక్షంలో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. -
4న ‘వెన్నుపోటు దినం’
పెనుకొండ రూరల్: ‘సూపర్ సిక్స్’ పథకాల పేరుతో ప్రజలను నట్టేట ముంచిన కూటమి సర్కార్ చర్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసగించిందన్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలుకు అడుగులు వేయలేదన్నారు. ముఖ్యంగా సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్యూరెన్స్ వంటి పథకాలు అమలు చేయకుండా కార్మికులు, రైతులు, మహిళలు..ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా యువతకు ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూటమి పార్టీల నేతల మోసాన్ని వివరించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉషశ్రీచరణ్ కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్ రెడ్డి, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెన్నకేశవులు, గణప్ప, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరించిన ఉషశ్రీచరణ్ -
రోడ్డుపై వరినాట్లు!
రొళ్ల: చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న రహదారి.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పైగా రోడ్డుపై నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల్లో చలనం లేదు. దీంతో మహిళలు రోడ్డుపై వరినాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని హెచ్టీ హళ్లి–సీసీ గిరి ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షానికి రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థలేని కారణంగా వర్షపునీరు ప్రధాన రోడ్డు మధ్యలోనే నిలిచింది. వర్షపు నీరు రోజుల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెందాయి. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించడంతో పాటు రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని ఆర్అండ్బీ అధికారులను వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మల్లినమడుగు పంచాయతీ కేంద్రంలో మహిళలు హెచ్టీ హళ్లి–సీసీ గిరి ప్రధాన రహదారి మధ్యలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రోడ్డు మధ్యలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్య తీర్చాలని మహిళల వినూత్న నిరసన -
స్వయం ఉపాధి పొందేదెన్నడు?
● బీసీ కార్పొరేషన్ రుణాల కోసం అభ్యర్థుల నిరీక్షణ అనంతపురం రూరల్: వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం (బీసీ కార్పొరేషన్) అందించే సబ్సిడీ రుణాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నుంచి కానీ ఎటువంటి సమాచారమూ అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో అవేమీ కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి పథకంలోనూ బీసీలకు సముచిత న్యాయం జరిగింది. ఆయా సంక్షేమ పథకాల లబ్ధిని ఠంచన్గా అందుకున్న సంగతి తెలిసిందే. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు ఐదు నెలల కిందట నోటిఫికేషన్ వచ్చింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,220 యూనిట్లకు 33,129 మంది బీసీ కులాల వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనంతపురం జిల్లాలో 1,728 యూనిట్లకు గాను 19,098 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,492 యూనిట్లకు 14,031 మంది దరఖాస్తు చేసుకోగా.. అధికారులు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక.. రుణాల మంజూరు సమాచారం ఏదీ తెలియడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రుణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తర్వులు రాగానే రుణాలిస్తాం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం నిరుద్యోగ యువత చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలు పూర్తి చేశాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే లబ్ధిదారులకు సమాచారం అందించి రుణాలు అందజేస్తాం. – సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్ -
సీబీఎస్ఈ అభ్యర్థులపై ‘తెలుగు’ పిడుగు
పుట్టపర్తి: డీఎస్సీలో సీబీఎస్ఈ అభ్యర్థులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తెలుగు చదివి ఉండాలనే నిబంధనతో సీబీఎస్ఈ అభ్యర్థుల నెత్తిన పిడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోనున్న 20 వేల మంది.. ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటంతో పాటు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15తో తుది గడువుగా పేర్కొంది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది అభ్యర్థులు సీబీఎస్ఈ విధానంలో చదువుకున్నవారున్నారు. వీరంతా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసినవారే. అయితే డీఎస్సీ రాసే అభ్యర్థులు పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తెలుగు చదివి ఉండాలనే నిబంధనను కూటమి ప్రభుత్వం చేర్చింది. వాస్తవానికి సీబీఎస్ఈ పదో తరగతిలో లాంగ్వేజ్–2 కింద తెలుగు ఉంటుందని, ఇక ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టే ఉండదనే విషయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. దీంతో సీబీఎస్ఈ విధానం కింద చదువుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన 3 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదే విషయమై హెల్ప్లైన్ ద్వారా అధికారులను అభ్యర్థులు సంప్రదించారు. పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు ఉండాలని తెలపడంతో దరఖాస్తులో ‘తెలుగు’ అని పేర్కొన్నారు. దీంతో దరఖాస్తును ఇప్పటికి ఆమోదించినప్పటికీ పోస్టుల భర్తీ సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోనున్న 3 వేల మంది అభ్యర్థులు -
‘ఖజానా’లో బదిలీల సందడి
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖజానా శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై బదిలీల నిర్వహణ కమిటీ సభ్యులు అనంతపురం జిల్లా డీడీ వెంకటేశ్వర్లు, ఏటీఓ రాణి, శ్రీసత్యసాయి జిల్లా డీడీ శ్రీనివాసులు, ఏటీఓ పవిత్ర శుక్రవారం అనంతపురంలోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ చాంబర్లో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది సీనియర్ అకౌంటెంట్లు, 15 మంది జూనియర్ అకౌటెంట్లు, 12 మంది ఆఫీస్ సబార్డినుట్లు చొప్పున మొత్తం 61 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీనియర్ అకౌంటెంట్లు 19 మంది, జూనియర్ అకౌంటెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు 8 మంది ఉన్నారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఖజానా శాఖలో బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అంటూ ఏదీ ఉండదన్నారు. ఖాళీల జాబితా ప్రకటించామని, బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి చేసి స్థానాలను కేటాయిస్తామన్నారు.● సమస్యలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న మైనర్లు ● ఇన్స్టాలో చూపులు.. వాట్సాప్లో చాటింగ్ ● యువతను ముంచుతున్న సోషల్ మీడియా అవగాహన కల్పిస్తున్నాం మొబైల్ ఫోన్ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్స్ట్రాగాం తదితర సోషల్ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి ● హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు, అడ్రస్ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. ● పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్ కాల్స్ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్.. ఫొటోల మార్పిడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది మైనర్లే.. తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్లైన్ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్కు వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్లైన్ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు.. సోషల్ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్ కావడం... అప్పటికే పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు. -
రాష్ట్రంలో దగాకోరు పాలన
అనంతపురం ఎడ్యుకేషన్: మహానాడులో చంద్రబాబు ప్రసంగం పరిశీలిస్తే అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే బాధ స్పష్టంగా కనిపిస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనలో అన్ని విధాలుగా దగాపడ్డామనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారన్నారు. టీడీసీ, జనసేనతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే భావనలో ఉన్నారన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు సైతం స్పష్టత వచ్చిందని, అందుకే రానున్న రోజుల్లో అధికారం కోల్పోవాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. చెప్పుకునేందుకు వంద ఉన్నాయి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ నెరవేర్చారన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధిని సైతం పరుగులు పెట్టించారన్నారు. జగన్ పాలనలో ప్రజలకు చేకూరిన లబ్ధిపై చెప్పుకునేందుకు వంద ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో చెప్పుకునేందుకు ఏ ఒక్కటీ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమల ఊసే లేదు కానీ, అన్నీ అమలు చేశానని చంద్రబాబు గొప్పలకు పోతున్నారని, ఆయనకు అల్జీమర్స్ పీక్స్కు వెళ్లిందనేందుకు ఇదే నిదర్శమన్నారు. ఈ పరిస్థితులను చూస్తూంటే ఆయన కుర్చీని లోకేష్బాబు లాక్కొనే టైం వచ్చిందనే అనుమానం కలుగుతోందన్నారు. వ్యవస్థలన్నీ నాశనం.. చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అమ్మకాలు, వెనుకబడిన ప్రాంతాల తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. వలంటీర్ల వ్యవస్థ, ఉన్న ఉద్యోగాల రద్దు, సచివాయాలు, ఆర్బీకేలు, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశారన్నారు. నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. పథకాల కోసం గొంతెత్తితే గొంతుకోస్తారనే భయాన్ని సృష్టించారన్నారు. రాష్ట్రానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి కరువుకు, అపద్ధాలకు, దగాకోరు పాలనకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని విస్మరించారన్నారు. అభివృద్ధి పేరుతో ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి, వాటిని పక్కదారి పట్టించడంపై ఉన్న తపన నీళ్లు పారించే విషయంగా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే రాయలసీమకు కాని, గ్రేటర్ రాయలసీమకు గాని తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి పథకం తీసుకొచ్చి సగానికి పైగా పనులు చేస్తే చివరకు ఆ ప్రాజెక్ట్ను చంద్రబాబు రద్దు చేశారన్నారు. హంద్రీనీవా మొదటిదశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీల నీటిని అదనంగా తీసుకొచ్చే పనులను ప్రారంభిస్తే ఆ ప్రాజెక్ట్నూ రద్దు చేశారన్నారు. నారా వారి పాలనపై రాయలసీమ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు పొగాకు రామచంద్ర, కదిరి ఇస్మాయిల్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజి, గంగుల సుధీర్రెడ్డి, బండిపవన్, ఈశ్వరయ్య పాల్గొన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన చాకలి రంగ (45)కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాఆపరుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన రంగ... శుక్రవారం కోమలి – జూటూరు గ్రామాల మధ్య ఉన్న పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
యోగా జీవితంలో భాగం కావాలి
ప్రశాంతి నిలయం: నిత్య జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు వివిధ రోగాల బారిన పడకుండా కాపాడే యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. ‘యోగాంధ్ర’ వేడుకలు ముగిసిన తర్వాత కూడా సమాజంలోని ప్రతి ఒక్కరూ యోగాను కొనసాగించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్ 21న జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని లేపాక్షిలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర పోటీలు నిర్వహించాలన్నారు. ‘ప్రధాన మంత్రి సూర్యఘర్’ పథకం కింద సోలార్ రూఫ్టాప్ నిర్మించుకుంటే విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసేలా చైతన్యం తీసుకురావాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
రెండోరోజూ ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్ల ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్ల ఖాళీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండోరోజూ శుక్రవారం అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ పదోన్నతుల అంశంపై హైకోర్టులో వేసిన కేసు పరిష్కారమైందన్నారు. 2023, జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 వరకు రూ. 2,500 గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లుగా పనిచేసిన ఎస్జీటీలకు ఇంగ్లిష్ టీచర్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 230 ఖాళీలకు గాను కేవలం 19 మాత్రమే ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని, వీటిని 2023లో తాత్కాలిక పద్ధతిలో ఇచ్చిన 230 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల ఖాళీలుగానే చూపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి 30 శాతం కోటా 103 పోస్టులు కేటాయించి ఇందులో 70 శాతం ఇవ్వాల్సిన పదోన్నతులను కాదని కేవలం 19 మాత్రమే ఇస్తామనడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి సూర్యుడు, చంద్రశేఖర్, నాగభూషణ, జయరాం నాయక్, జయపాల్ నాయుడు, సురేష్, నరసింహులు, మురళి, భాస్కర నాయుడు, రవి, విజయ శ్రీ, పరిమళ, తులసి, మాధవి,ఆదిలక్ష్మి, కౌసర్ బాను పాల్గొన్నారు. ధర్నాకు ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, యూటీఎఫ్ నాగేంద్ర, పీఆర్టీయూ విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్టీఏ నాగిరెడ్డి, శ్రీనివాసులు, రవినాయక్, నాగభూషణ, ఆర్ఈఎఫ్ నారాయణ నాయక్ మద్దతు తెలిపారు. -
రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ
గుత్తి: రైలులో నగదు, నగలు చోరీ చేస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం మచిలీపట్నం – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులోని కోచ్–1లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఓ ప్రయాణకుడి బ్యాగ్లోని బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు అపహరిస్తుండగా గమనించి మరో ప్రయాణికుడు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. రైలు గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకోగానే జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ కానిస్టుబుల్ భాస్కర్ నాయుడు కోచ్–1లోకి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు, రూ.10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు నంద్యాల జిల్లాకు చెందిన జయరాజ్గా గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రొళ్లలో చైన్ స్నాచింగ్ రొళ్ల: మహిళ దృష్టిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించుకెళ్లిన ఘటన రొళ్లలో సంచలనం రేకెత్తించింది. వివరాలు.. రొళ్లలోని మధూడి గ్రామానికి వెళ్లే మార్గంలో 544ఈ జాతీయ రహదారి పక్కనే బసవరాజు కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. ఇంటి వద్దనే ఓ చిల్లరకొట్టు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 9.45 గంటలకు పాలు తీసుకొచ్చేందుకు బసవరాజు బయటకు వెళ్లడంతో అతని భార్య అనిత దుకాణంలో వ్యాపారం కొనసాగిస్తోంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడగడంతో అనిత తీసిచ్చి వెనుదిరిగే సమయంలో ఆమె మెడలోని 35 గ్రాముల బరువున్న బంగారం మాంగల్యం చైన్ను లాగాడు. అప్రమత్తమైన ఆమె చైన్ను పట్టుకోవడంతో పది గ్రాముల వరకు చైన్ తెగి చేతిలో ఉండిపోయింది. మిగిలిన 25 గ్రాముల చైన్తో యువకుడు బైక్పై ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. ఆవినకుంట సమీపంలో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఏక పంట విధానం వద్దు
పుట్టపర్తి అర్బన్: ఏక పంట విధానానికి రైతులు స్వస్తి పలికి పంటల సాగులో వైవిధ్యతను ప్రోత్సహించడం ద్వారా నేల ఆరోగ్యంతో పాటు రైతుల ఆదాయమూ మెరుగుపడుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.మంజునాథ్, జేడీఏ డాక్టర్ సుబ్బారావు పేర్కొన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా పుట్టపర్తి మండలం పెడపల్లి, నిడిమామిడి గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన రైతు సదస్సుల్లో వారు మాట్లాడారు. పంటల సాగులో అనువైన విత్తనాలు, వర్షపాతం, అధికారుల సలహాలు.. సూచనలు పాటించడం, ఎరువులు, మందుల పిచికారీ తదితర అంశాలు అధిక దిగుబడులపై ఆధారపడి ఉంటాయన్నారు. పంట ప్రతి దశలోనూ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పంటల సాగుకు ముందు పచ్చి రొట్ట సాగు చేసి పొలంలో కలియ దున్నడం ద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. ప్రతి పంటకూ విత్తన శుధ్ది తప్పనిసరిగా ఉండాలన్నారు. వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటల సాగు విధానాలను వివరించారు. వేరుశనగకు ప్రత్యమ్నాయంగా ఆముదం సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చునని అన్నారు. బెట్టకు తట్టుకునే విత్తనాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యమన్నారు. రెడ్డిపల్లి కృషి విజ్ఙాన కేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని, కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పలువురు రైతులకు నాణ్యమైన కంది విత్తనాలను ఉచితంగా అందజేశారు. భూసార పరీక్షల కార్డులను పంపిణీ చేశారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య, కృషి విజ్ఙాన కేంద్రం రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ త్రికళ మాధవి, సెరికల్చర్ ఏడీ పద్మమ్మ, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, సర్పంచ్ మంగ్లీబాయి, ఏడీ సనావుల్లా, ఉద్యాన అధికారి నవీన్కుమార్, ఏఓ వెంకటబ్రహ్మం, సిబ్బంది పాల్గొన్నారు. ఐసీఏఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మంజునాథ్ -
మురళీనాయక్ క్రికెట్ టోర్నీ విజేత కోడూరు
చిలమత్తూరు: వీర జవాన్ మురళీనాయక్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నీ విజేతగా చిలమత్తూరు మండలం కోడూరు జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సోమఘట్ట జట్టుపై కోడూరు జట్టు ఘన విజయం సాధించింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు ఇరు జట్లకూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో డీటీ జగన్నాథ్, ఎస్ఐ మునీర్ అహమ్మద్, ప్రవీణ్కుమార్, అశోక్, చిన్నప్పయ్య, కోడూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కారు ఢీకొని రైతు మృతి ధర్మవరం రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం చంద్రశ్చర్ల గ్రామానికి చెందిన గోనుగుంట్ల ప్రతాప్ (55), సుబ్బమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పంట రుణం రెన్యువల్ కోసమని గురువారం ఉదయం తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై మామిళ్లపల్లిలోని బ్యాంక్కు వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు... 44వ జాతీయ రహదారిపై ధర్మవరం మండలం సీతారాంపల్లి సమీపంలోకి చేరుకోగానే బెంగళూరు నుంచి అనంతపురం వైపుగా వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులిద్దరినీ స్థానికులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రతాప్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సుబ్బమ్మకు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం రూరల్ పోలీసులు తెలిపారు. 5న జాబ్ మేళా అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జూన్ 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లా రెడ్డి తెలిపారు. ఎంపికై న వారు ఐఆర్ఈపీ సంస్థ (ఎన్బీఎఫ్సీ)లో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి, ప్రొద్దుటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, చిత్తూరు, హిందూపురం, కదిరి ప్రాంతాల్లోపనిచేయాల్సి ఉంటుంది. సేల్స్ ఆఫీసర్, సీనియర్ సేల్స్, ఆఫీస్ అడ్మిన్, కలెక్షన్ ఎక్జిక్యూటీవ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రూ.3.6 లక్షల వార్షిక వేతనం, రూ.2.4 లక్షల వార్షిక వేతనం అందిస్తారు. డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. 35 సంవత్సరాల్లోపు వయసు గల వారు అర్హులు. ఎన్బీఎఫ్సీ, ఎంస్ఈ, ఎంఎస్ఎంఈల్లో అనుభవం తప్పనిసరి. -
ప్రతిభా పురస్కారాల ప్రదానం
ధర్మవరం: కురుబ విద్యార్థులు అన్నింటా రాణించాలని యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కల్యాణ మంటపం కమిటీ అధ్యక్షుడు మాలగుండ్ల మల్లికార్జున, మాలగుండ్ల రవీంద్ర పిలుపునిచ్చారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన కురుబ సామాజిక విద్యార్థులకు స్థానిక కురుబ కల్యాణ మంటపంలో గురువారం ప్రతిభా పురస్కారాలను వారు అందజేసి, మాట్లాడారు. దాతల సహకారంతో పదేళ్ల క్రితం కురుబ కల్యాణ మంటపాన్ని నిర్మించామని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో ఏటా పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం ధర్మవరం పట్టణంతోపాటు రూరల్ పరిధిలోని కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతిభగల విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కురుబ కల్యాణ మంటపం కమిటీ ప్రధాన కార్యదర్శి కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప, గౌరవాధ్యక్షుడు బిల్లె నాగప్ప, ఉపాధ్యక్షులు కోటి వెంకటేష్, గిరక నారాయణస్వామి, గవ్వల నారాయణస్వామి, సూరిబాబు, బిల్లె యజ్జన్న, సహాయ కార్యదర్శి బులగొండ్ల నాగార్జున, డైరెక్టర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి తరలింపులు అడ్డుకోండి
బత్తలపల్లి: చెరువులో మట్టి అక్రమ తరలింపులు అడ్డుకోవాలంటూ తహసీల్దార్ స్వర్ణలతకు పోట్లమర్రి గ్రామ రైతులు విన్నవించారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో చెరువు మట్టిని వేల్పుమడుగు వద్ద ఉన్న పెళ్లల పరిశ్రమకు తరలించే విషయంలో ఆంజనేయస్వామి ఆలయానికి కొంత మొత్తం చెల్లించేలా గ్రామ పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం చెరువు మట్టిని తరలిస్తే సారవంతమైన మట్టిని రైతులు కోల్పోవాల్సి వస్తుందవని గుర్తించి వెనక్కు తగ్గారన్నారు. అప్పటి నుంచి చెరువు మట్టిని గ్రామంలోని రైతులు తమ పొలాలకు మాత్రమే తరలించాలని, డబ్బులకు విక్రయించరాదని నిర్ణయించారన్నారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ కట్టుబాటును కాదని అక్రమంగా పెళ్లల ఫ్యాక్టరీకి స్థానిక టీడీపీ నేత దేవరకొండ రామకృష్ణ రేయింబవళ్లు చెరువు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అభ్యంతరం తెలిపితే తనకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువు మట్టి అక్రమ తరలింపులు అడ్డుకోవాలని కోరారు. తహసీల్దార్ను కలసిన వారిలో రైతులు దామోదరరెడ్డి, రమణారెడ్డి, నాగేంద్రరెడ్డి, శివయ్య, అనంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరేష్రెడ్డి, మాధవరెడ్డి, నరసింహరెడ్డి, కరుణాకర్రెడ్డి ఉన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి పుట్లూరు: మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన తోలు కృష్ణయ్య, సరస్వతి దంపతుల రాజకుళ్లాయప్ప (24) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కృష్ణయ్య, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, కొన్నేళ్ల క్రితమే కుటుంబ పెద్ద కృష్ణయ్య మృతి చెందాడు. అప్పటి నుంచి చిన్న కుమారుడు రాజకుళ్లాయప్ప వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకూ రాజకుళ్లాయప్ప ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న కుమారుడుని చూసి తల్లి సరస్వతి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాము కాటుతో మహిళ... బెళుగుప్ప: మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన పాటిల్ ప్రభాకర్రెడ్డి భార్య సావిత్రమ్మ(60) పాము కాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి సమీపంలోనే ఉన్న తమ తోటలో గురువారం ఉదయం కూలీలతో పనులు చేయిస్తున్న భర్తకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకుని సావిత్రమ్మ వెళ్లింది. ఆ సమయంలో కూలీలతో కలసి తాను కూడా కలుపును తొలగిస్తుండగా గడ్డి చాటున దాగి ఉన్న రక్త పింజరి కాటు వేసింది. వెంటనే విషయాన్ని గుర్తించిన కూలీలు పామును కట్టెలతో కొట్టి చంపేశారు. సావిత్రమ్మను ఆగమేఘాలపై అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చిత్రావతికి పర్యాటక శోభ
రెస్టారెంట్ను అందుబాటులోకి తేవాలి సీబీఆర్ను తిలకించడానికి వచ్చే పర్యాటకుల కోసం రెస్టారెంటును అందుబాటులోకి తేవాలి. సీబీఆర్ వద్ద ప్రస్తుతం ఉన్న రెస్టారెంట్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. – గద్దె కృష్ణారెడ్డి, మద్దులచెరువు, తాడిమర్రి మండలం ఆహ్లాదకరంగా ఉంటుంది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సందర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సీబీఆర్ వద్ద ఏర్పాటు చేసిన ఉద్యాన వనం, రిజర్వాయర్ దిగువన ఉన్న పచ్చని పొలాలు, జలాశయంలో బోటింగ్ మర్చిపోలేని అనుభూతులను అందిస్తున్నాయి. అయితే జలాశయం వద్ద ఉన్న రెస్టారెంట్లో పర్యాటకులను అనుమతించకపోవడం ఇబ్బందికరంగా ఉంది. కనీసం టీ, కాఫీ, కూల్ డ్రింక్, తిను బండారాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. – తబ్జూల సత్యనారాయణశెట్టి, తాడిమర్రి తాడిమర్రి: మండల సరిహద్దులోని పార్నపల్లి వద్ద ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)కు పర్యాటకుల తాకిడి అధికమవుతోంది. వేసవి సెలవులు కావడంతో పాటు జలాశయంలో బోటింగ్, సీబీఆర్ ముందు భాగంలో ఉన్న పచ్చని పొలాలు పర్యాటకులను అధికంగా ఆకర్శిస్తున్నాయి. వైఎస్సార్ ప్రత్యేక కృషితో నిర్మాణం.. మండల సరిహద్దులోని వైఎస్సార్ కడప జిల్లా, లింగాల మండలం, పార్నపల్లి మధ్య ఉన్న చిత్రావతి నదిపై 1992లో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టారు. వైఎస్సార్ కడప జిల్లా సింహ్రాదిపురం, లింగాల, పులివెందుల, వేంపల్లి తదితర మండలాల్లో 60 వేల హెక్టార్లకు సాగు నీరు, పులిదెందుల పట్టణానికి తాగునీరు, తుమ్మల యురేనియం కంపెనీ అసవరాలకు నీటిని అందించేందుకు రూ.39 కోట్ల వ్యయంతో 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 1999లో రూ.90 కోట్లు నిధులను విడుదల చేసి గ్రావెల్ లెయర్ పనులు తిరిగి ప్రారంభించారు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మరో రూ.30 కోట్లు నిధులు విడుదల చేసి సీబీఆర్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. సీబీఆర్ లోతట్టు ప్రాంతంలో నీటి బావులను తవ్వి వాటి ద్వారా తాగునీటిని పులివెందుల, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలకు అందిస్తున్నారు. పర్యాటకంగా మార్చిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఆర్పై ప్రత్యేక దృష్టి సారించారు. 2022లో రూ.5.50 కోట్ల నిధులను విడుదల చేసి వైఎస్సార్ లేక్వ్యూ పాయింట్. రెస్టారెంట్, ఉద్యానవనం, వాహనాల పార్కింగ్, జలాశయంలో విహరించడానికి బోట్లను ఏర్పాటు చేశారు. జలాశయంలో విహరించడానికి 26 మంది సామర్థ్యంతో ఒక్కొక్కరికి రూ.50 ప్రకారం డీలక్స్ బోట్, 10 మంది సామర్థ్యంతో ఒక్కొక్కరికి రూ.75 ప్రకారం పాంటూన్బోట్, నలుగురి సామర్థ్యంతో ఒక్కొక్కరికి రూ.150 ప్రకారం స్పీడ్బోట్లను అందుబాటులో ఉంచారు. రిజర్వాయర్ దిగున కోనసీమను తలపించే పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో సీబీఆర్కు పర్యాటకుల తాకిడి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సెలవు రోజుల్లో 500 నుంచి 600 మంది వరకూ పర్యాటకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లో వందకు పైగా పర్యాటకులతో సీబీఆర్లో సందడి నెలకొని ఉంటుంది. సీబీఆర్ సందర్శనకు తరలి వస్తున్న పర్యాటకులు ఆకర్శిస్తున్న జలాశయం, పచ్చదనం -
మహానాడులో జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ హల్చల్
సాక్షి, టాస్క్ఫోర్స్: కడపలో జరుగుతున్న మహానాడులో గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలోని జీఆర్పీలో హెడ్ కానిస్టేబుల్ వాసు హల్చల్ చేశాడు. మహానాడులో రెండో రోజు (28వ తేదీ) పాల్గొన్న వాసు.. టీడీపీ నేతలు ఇసురాళ్లపల్లికి చెందిన కిట్టుయాదవ్, లచ్చానుపల్లికి చెందిన రామాంజినేయులుతో ఫొటోలు దిగుతూ సందడి చేశాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై ప్రస్తుం విస్తృత చర్చ జరుగుతోంది. కాగా, ఈ నెల 11న గుత్తికి చెందిన టీడీపీ సీనియర్ నేత కోనంకి కృష్ణపై టీడీపీ కార్యాలయంలోనే వాసు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కోనంకి కృష్ణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి వాసు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ నేతగా చెలామణి అవుతున్నాడు. -
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు.. జాబితా సిద్ధం చేస్తున్నాం తదితర కారణాలు చెబుతూ మధ్యాహ్నం 2 గంటలకు చేపడతామని స్వయంగా డీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలో అందరూ భోజనం చేసుకుని 2 గంటలలోపే అక్కడికి చేరుకున్నా అప్పటికీ ప్రారంభం కాలేదు. సాయంత్రం 4 గంటలకు అంటూ మరోమారు ప్రకటించారు. తర్వాత 6 గంటలకు అని చెప్పినా అప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు రాత్రి 7 గంటల తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు ముగిసింది. మొత్తం 148 హెచ్ఎం పోస్టులకు గాను ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 3 పోస్టులకు ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులు కల్పిస్తారు. తక్కిన జిల్లా పరిషత్, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన 145 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఇదిలాఉండగా కౌన్సెలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. చీకటి పడిన తర్వాత వెలుతురు సరిగా లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ముఖ్యంగా మహిళా టీచర్లు అగచాట్లు పడ్డారు. 133 మంది హెచ్ఎంల బదిలీలు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 133 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. మొత్తం 191 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29 మంది తప్పనిసరి బదిలీ కాగా...162 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 104 మంది బదిలీ కాగా తక్కిన 58 మంది బదిలీ కాలేదు. ఆలస్యమైన సీనియార్టీ జాబితా.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితా శుక్రవారం విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రెండు రోజుల కిందటే జాబితా సిద్ధం కావాల్సి ఉన్నా...హెచ్ఎం పదోన్నతుల కౌన్సెలింగ్ ఉన్న కారణగా ఆలస్యమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కువ పాయింట్ల నమోదుపై జాగ్రత్త.. ఉపాధ్యాయుల పాయింట్ల నమోదును ఎంఈఓలు జాగ్రత్తగా పరిశీలించాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావాల్సిన పాయింట్ల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అలాంటి వారితో గ్రీవెన్స్ పెట్టించి తగ్గించుకునేలా చూడాలని ఆదేశించారు. తర్వాత ఎక్కువ పాయింట్లు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ ఉదయం నుంచి రాత్రిదాకా వేచిఉన్న టీచర్లు ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమై 10 గంటలకు పూర్తి -
జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత అవకాశాన్ని బట్టి రిక్వెస్ట్ బదిలీలకు చోటు కల్పించాలని సూచించింది. బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు 236.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ యాజమాన్యం పరిధిలో పని చేస్తున్న వారిలో 236 మంది ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 136 మంది ఉండగా 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రిక్వెస్ట్ బదిలీల కోసం ఏకంగా వంద మంది దరఖాస్తు చేసుకున్నారు. అటెండర్లలో 64 మంది ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకోగా బదిలీల కోసం 59 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జాబితా సిద్ధం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిషత్ కార్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మందిని బదిలీ చేయవచ్చనే సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బృందం రూపొందించిన జాబిత పరిశీలన కోసం సీఈఓ వెంకటసుబ్బయ్య టేబుల్పైకి గురువారం చేరింది. ఆయన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. కొందరు అటెండర్లు పదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. మరి కొందరు జిల్లా కేంద్రం దాటి బయటకు పోవడం లేదు. ఇక్కడిక్కడే జెడ్పీ లేదా పీఆర్ఐ, పీఐయూ, క్యూసీ, ఆర్డబ్ల్యూఎస్ ఇలా ఏదో ఒక ఆఫీసుకు బదిలీ చేయించుకోవడం పరిపాటిగా మారింది. జెడ్పీలో పని చేస్తూ ఏడాది కిందట ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు తిరిగి జెడ్పీకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల ఇళ్లు, జెడ్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు అనారోగ్యాన్ని సాకు చూపిస్తూ అందుకు అనుగుణంగా సర్టిఫికెట్లు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడు తుది ఆమోదం.. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వద్దకు శుక్రవారం పంపనున్నారు. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. శని లేదా ఆదివారంలోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించే ఆలోచనలో జెడ్పీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ వెంకటసుబ్బయ్య పరిశీలనకు అర్హుల జాబితా నేడు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనుమతి కోసం ఫైల్ -
ఖాద్రీశుడి సేవలో తెలంగాణ జడ్జి
కదిరి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపాలిటెన్ సిటీ సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, ఆమె భర్త కిశోర్ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి వారిని దుశ్శాలువాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. రేపు పింఛన్ల పంపిణీ పుట్టపర్తి అర్బన్: జూన్ నెల ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులు 2,66,986 మందికి రూ.114.86 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేస్తారన్నారు. జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపుప్రశాంతి నిలయం: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు మే 31 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అక్రిడిటేషన్ కార్డు కలిగివున్న జర్నలిస్టులకు మాత్రమే పొడిగింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. పక్కాగా ఆయుష్మాన్ భారత్ ప్రశాంతి నిలయం: ‘జిల్లాలో ఆయుష్మాన్ భారత్ స్కీంను పక్కాగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు జిల్లా అమలు కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ వైద్యశాఖ అధికారి ఆధ్వర్యంలో వైద్యులు, మెడికల్ సిబ్బందితో ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యసేవలపై సమీక్షించాలన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, వారి ఆరోగ్య ప్రయోజనాలు, వైద్య సంరక్షణను ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తోందన్నారు. అనంతరం హిందూపురం పట్టణంలోని బాలాజీ , స్పందన , రాఘవేంద్ర, తేజ ఆస్పత్రుల్లో పీఎంజేఎవై సేవలపై సమీక్షించారు. అలాగే కదిరి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ ఫిరోజ్ బేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మహిళా డాక్టర్పై విచారణ మడకశిర: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని గురువారం డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్ సందర్శించారు. ఆస్పత్రిలో 2022లో పని చేసిన ఓ మహిళా డాక్టర్పై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన విచారణ జరిపారు. మెడికల్ ఆఫీసర్ శశిరేఖ, ఆర్ఎంఓ దివాకర్ విచారణకు హాజరయ్యారు. -
వైద్యం పడకేసింది
ఊటుకూరు పీహెచ్సీ ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తోంది. విలేజ్ హెల్త్ క్లీనిక్లో వైద్యులు సేవలందిస్తున్నారు. ఇందులో మరుగుదొడ్డి, వాష్రూమ్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల లేమి ఉంది. దీంతో పాటూ వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంతో పాటు ఆస్పత్రి సిబ్బందిని నియమించాలని కోరుతున్నాము.– విజయలక్ష్మీ, ఊటుకూరు, పరిగి మండలంరామగిరి మండలంలోని పేరూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి వైద్యులు కూడా సరిగారారు. దీనికి తోడు ఇక్కడ మందుల దొరకవు. దీంతో రోగం వస్తే వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే. వారం రోజుల క్రితం వైద్యం కోసం పీహెచ్సీ దగ్గరకు వెళ్తే అక్కడ డాక్టర్లు ఎవ్వరూ కనిపించలేదు. దీంతో గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకొన్నాను.ముత్యాలప్ప, పేరూరు గ్రామం, రామగిరి మండలంసాక్షి ప్రతినిధి, అనంతపురం: పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం మంది తమకు మందులు అందడం లేదని చెప్పారు. చాలాచోట్ల యాంటీబయాటిక్స్ లేవు. పాముకాటు మందు లేదు. గర్భిణులకు కాన్పు సమయంలో ఇచ్చే ఇంజెక్షన్లు లేవు. అంతెందుకూ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం ఆస్పత్రిలోనే మందులు లేవు. పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రి వరకూ మందుల కొరత రోగులను వేధిస్తోంది.దారుణ పరిస్థితులు..ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది వాపోతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.‘ఆరోగ్య శ్రీ’ నిర్వీర్యం..2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం జగన్ చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త జవసత్వాలు నింపుకుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 3,250 జబ్బులకు ఈ పథకం ద్వారా చికిత్సలు అందించేవారు. అయితే, చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పటినప్పటి నుంచి పథకం ప్రకారం ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ‘ఆరోగ్య శ్రీ’ని ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో పథకం పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.గాల్లో దీపంలా 108, 104 ..ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిని ఆపత్కాలంలో ఆదుకున్న 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ రాప్తాడు వద్ద షెడ్డులో పడ్డాయి. కాల్ వెళ్లిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. ఇక 104 అంబులెన్సులకు కూటమి సర్కారు రాగానే కాలం చెల్లింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 104 వాహనాలు పల్లెలకు వెళ్లక ఏడాది అవుతోంది.పెనుకొండలో మెడికల్ కాలేజీకి గ్రహణం...శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్ జగన్ హయాంలో రూ.375 కోట్లతో మెడికల్ కాలేజీకి పునాది వేశారు. కూటమి సర్కారు వచ్చాక దీన్ని ముందుకు కదలనివ్వలేదు. ఉమ్మడి జిల్లా అంతటికీ కలిపి ఇప్పటికీ ‘అనంత’లో ఒక్కటే మెడికల్ కళాశాల ఉంది. కొత్త కాలేజీ వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకు వరం అయ్యేది. కానీ ‘కూటమి’ దీన్ని కాలరాసింది.శాశ్వత భవనాన్ని నిర్మించాలి ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాలి..కూటమి.. కనికరం లేమిచంద్రబాబు ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య రంగం కుదేలు104, 108 వాహనాలసేవలకు తీవ్ర విఘాతంమందుల కొరతతో అల్లాడుతున్న సామాన్య రోగులుఏడాది పాలనలోఆరోగ్య రంగం తిరోగమనంపడకలు లేకపోతే ఎలా?పరిగి మండల వ్యాప్తంగా పరిగి పీహెచ్సీలో మాత్రమే గతంలో వైద్య సేవలను అందించేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 25 వేల మందికి పీహెచ్సీని ఏర్పాటు చేయాలన్న క్రమంలో ఊటుకూరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. అధికారులు పీహెచ్సీ నిర్మాణానికి స్థలం కేటాయించారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేటికీ పీహెచ్సీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్లో సేవలు అందిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు ఉన్నారు. అయితే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టుతో పాటు స్టాఫ్ నర్సులను నియమించలేదు. పీహెచ్సీలో ప్రస్తుతం మరుగుదొడ్డి సదుపాయం లేదు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.ఈ నెల 16న మా తల్లి ఆరోగ్యం విషమించడంతో అనంతపురం సర్వజ నాస్పత్రికి తీసుకువచ్చాం. అక్యూట్ మెడికల్ కేర్లో మంచం లేదని రెండు రోజుల పాటు ఇక్కడే ఉంచారు. ప్రాణాపాయ కేసులకు ఎప్పటికప్పుడు వార్డుకు షిఫ్ట్ చేసి సేవలందిస్తే బాగుంటుంది. రోజుల పాటు ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచితే ఎలా.. చాలి ఇబ్బందిగా ఉంది. – తిక్కయ్య,చిగిచెర్ల గ్రామం, ధర్మవరం మండలం -
ఉద్యోగులకు జీతాలూ లేవ్
ఉరవకొండ: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా వారి ఇంటికి చేర్చడానికి తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఆ వాహనాల డ్రైవర్లు ఎంతో భద్రంగా తల్లీబిడ్డలను తీసుకెళతారు. అలాగే రక్తహీనతతో బాధపడే గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడం, రక్తం ఎక్కించిన తరువాత ఇంటి దగ్గర దింపే అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇంతలా సేవ చేస్తున్నా వారిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత మూడు నెలలుగా జీతాలివ్వలేదు. దీంతో వారందరూ కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 24 ఉన్నాయి. మొత్తం 32 మంది డ్రైవర్లు పనిచేస్తుండగా వీరికి గత టీడీపీ హయాంలో నెలకు రూ.7,200 చొప్పున వేతనం చెల్లించేవారు. వీరి సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 8,800కు పెంచారు. అయితే, కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. -
మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయి
హిందూపురం: మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. వంటగది, శుద్ధ జలప్లాంట్, బ్యారక్లు, పరిసరాలు, నిత్యావసరాలు, ఫిర్యాదుల పెట్టె తదితరాలను పరిశీలించారు. ఖైదీల పట్ల తీసుకున్న జాగ్రత్తలను సబ్జైలు అధికారి హనుమప్పతో అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రిమాండ్ ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. ఏ తప్పు చేసి జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి జైలులో ఉంటున్నారు. కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా? లేదా? బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేకపోవడం వల్ల ఎవరైనా ఇంకా జైలులోనే ఉంటున్నారా? అనే వివరాలను ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పునకు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని, తరచూ తప్పులు చేసి జైలుకు వెళుతుంటే కుటుంబ మర్యాదలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. చివరకు పిల్లలను కూడా సమాజంలో చిన్నచూపు చూస్తారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రశాంతయుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు జి.ఆర్.సిద్దు, పార్వతి, సంతోషికుమారి, ఈశ్వరప్ప, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని కలెక్టర్ చేతన్, ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పుట్టపర్తిలో విద్యాగిరి రోడ్డుపై పర్యాటక యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో పాటు పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకొందని అందులో భాగంగా జిల్లాలో రెండు చోట్ల యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన చేస్తే వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాల్లో మరింత నైపుణ్యత సాధిస్తారని తెలిపారు. చిన్న వయసు నుంచే యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం యోగా గురువును సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్, డ్వామా పీడీ విజయానంద్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి నిర్మలాజ్యోతి, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు -
హామీలు సరే.. అమలేదీ?
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హామీల అమలును విస్మరిస్తూనే ఉంటారు. నాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి.. కొందరికే పరిమితం చేశారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని చెప్పినా అతీగతీ లేదు. ఇంటివద్దకే రేషన్ పంపిణీ రద్దు చేసి మళ్లీ పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చారు. – కవిత, ప్రశాంతి గ్రామ్, పుట్టపర్తి -
ఈ పనులకు మోక్షమెన్నడో!
రామగిరి: దశాబ్దాలుగా నీటిబొట్టులేక బోసిపోయిన పేరూరు డ్యాం (అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్).. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తి జలకళను సంతరించుకుంది. ఐదేళ్ల పాటు ఆయకట్టు మురిసిపోయింది. చుట్టుపక్కల భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో వ్యవసాయ బోరు బావుల కింద వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేరూరు డ్యాం పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. నీటి కేటాయింపులు లేక డ్యాం బోసిపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్యామ్ గేట్ల మరమ్మతులకు రూ.1.21 కోట్లను మంజూరు చేసిన కూటమి సర్కార్... పనులు పూర్తి చేయించడంలో అంతులేని ఉదాసీనత కనబరుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేరూరు డ్యాంను సందర్శించి గేట్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలు గడిచినా పనుల్లో ఏ మాత్రమూ ప్రగతి లేదు. వేసవి ముగిసింది. వర్షాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే పేరూరు డ్యాం పూర్తిగా నిండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో డ్యామ్కు గేట్లు లేకపోవడంతో ఆ నీరంతా వృథా అవుతుందని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తిటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. స్థానిక పంప్ హౌస్ వద్ద బుధవారం కార్మికుల సమావేశం జరిగింది. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్మికులు చర్చించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ క్రాంతికుమార్ను కలసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... శ్రీసత్యసాయి నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ.8 కోట్ల బకాయిలను మున్సిపాలిటీ చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపి వేశారన్నారు. ఫలితంగా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తిందని వివరించారు. అలాగే వెంగలమ్మ చెరువు పంప్ హౌస్ నుంచి 35 ఏళ్లుగా నీటి సరఫరా అగిపోయిందన్నారు. దీంతో కార్మికులకు చెల్లించాల్సిన నాలుగు నెలల వేతనాలు బకాయి పడ్డాయన్నారు.10నెలల పీఎఫ్ చెల్లించనందున కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు. మున్సిపాలిటీ బకాయిలు చెల్లించక పోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించి, కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘం అధ్యక్షుడు నరేష్, నాయకులు మధునూదన్, బాలు, శివప్రసాద్, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు -
రోజూ రూ. 2 వేలు నష్టం
నేను నిర్వహిస్తున్న వాటర్ ప్యాకెట్ తయారీ పరిశ్రమలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రూ.2 వేలకు పైగా నష్టం వస్తోంది. సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పనిలోకి వచ్చే కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోంది. ఇది పరోక్షంగా కార్మిక కుటుంబాల జీవనంపై ప్రభావం చూపుతోంది. – నాగార్జునరెడ్డి, నీటి కవర్ల తయారీ కంపెనీ యజమాని -
పెరిగిన శ్రీవారి ఆలయ ఆదాయం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు హుండీలో వేసిన కానుకలను బుధవారం ఆలయ, బ్యాంకు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో లెక్కించారు. 62 రోజులుకు గాను రూ.1,10,69,573 నగదుతో పాటు 72 గ్రాముల బంగారు, 662 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ చలపతి, ఆలయాధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీఫార్మసీ ఫలితాలు విడుదల అనంతపురం: బీఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్ ధర్మవరం రూరల్: బాలుడి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన నరసింహులు, సుమలత దంపతుల కుమారుడు శ్రీనాగచైతన్య అనే చిన్నారి మార్చి 24న ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ నెల పదో తేదీన నాగచైతన్య ఇంటికి తిరిగి వచ్చాడు. మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు లోతుగా విచారణ చేపడితే విస్తుపోయే విషయం వెలుగుచూసింది. బాలుడిని కిడ్నాప్ చేసింది మేనమామ ప్రశాంత్, అతని మామ వెంకటరాముడు అని తేలింది. ఈ రెండు కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సుమలత చిన్నకుమారుడైన నాగచైతన్యను ప్రశాంత్, వెంకటరాముడు దాచిపెట్టారని విచారణలో బయటపడింది. దీంతో డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో వెళ్లి నిందితులిద్దరినీ బుధవారం అరెస్టు చేసి, రిమాండ్కు పంపించారు. 230 పోయి 19 పోస్టులు మిగిలాయి అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెంరేళ్లు సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు. -
ఖరీఫ్ పెట్టుబడికి పాట్లు
మడకశిర: జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పదునైన వర్షం పడుతుండడంతో ఖరీఫ్ – 2025 సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.13,500 ఠంచన్గా అందడంతో సకాలంలో పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామన్న ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయంపై ఇంతవరకూ స్పష్టత లేదు. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పంటలు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పంటలు 2,69,152 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం.. ఖరీఫ్లో వ్యవసాయం చేయడానికి రైతులకు పెట్టుబడి చాలా ముఖ్యం. ప్రధానంగా భూములను దుక్కి దున్ను కోవడం నుంచి విత్తు వరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసే భూములను దుక్కి చేసుకోవడానికి ట్రాక్టర్కు గంటకు అద్దె రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విత్తనాలు, ,క్రిమి సంహారక మందుల కొనుగోలుకు కూడా డబ్బు అవసరం. కూలీల ఖర్చులు రూ.వేలల్లోనే ఉంటాయి. ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేయడానికి రైతులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్–2025 పంటల సాగు అంచనా.. మొత్తం సాగు అంచనా: 2,69,152 హెక్టార్లు వేరుశనగ: 1,51,824 హెక్టార్లు కంది: 28,925 హెక్టార్లు మొక్కజొన్న: 17,949 హెక్టార్లు అమలుకు నోచుకోని అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో ఠంచన్గా పెట్టుబడి సాయం నేడు పంటలు పెట్టేందుకు డబ్బు లేక రైతుల అగచాట్లు -
పారిశ్రామిక వాడలో విద్యుత్ సమస్య
కదిరి అర్బన్: అధికారంలోకి వస్తే పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తామన్న కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రగతి మాటను పక్కనపెట్టి ఉన్న పరిశ్రమలూ మూత పడేందుకు కారణమవుతోంది. ఇందుకు కదిరిలోని పారిశ్రామిక వాడనే నిదర్శనం. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పారిశ్రామిక వాడలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటోంది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో ఉన్న పరిశ్రమలు కాస్త మూతేసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. రోజూ 15 సార్లు అంతరాయం.. కదిరి పట్టణానికి ఆనుకుని ఉన్న కుమ్మరవాండ్లపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల 25 పరిశ్రమలను ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. కవర్ల తయారీ, వేరుశనగ ప్రాసెసింగ్, బీరువాల తయారీ, సోఫాలు.. కుర్చీల తయారీ, బిందెల తయారీ, పట్టు పరిశ్రమ, ట్రాన్స్ఫార్మర్ల రిపేరు తదితర పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో తీరని అంతరాయంతో పరిశ్రమల నిర్వహణ భారమవుతోందని యజమానులు వాపోతున్నారు. రోజులో 15 సార్లు కరెంటు వచ్చి పోతోందని పేర్కొంటున్నారు. ఒక్కొసారి 5 నుంచి 10 నిమిషాల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటోందని, దీంతో యంత్రాలను ఆపడం ద్వారా ఉత్పత్తి గణనీయంగా తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని వచ్చిన తర్వాత యంత్రాలను ఆన్ చేయబోతుండగా వెంటనే సరఫరా నిలిచిపోతుంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు మరమ్మతుకు లోనై ఆర్థిక భారం మరింత పెరిగి పోతోందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. ప్రతి నెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నా.. నాణ్యమైన విదు్య్త్ను ప్రభుత్వం అందించలేకపోతోందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం రోజూ రూ.వేలలో నష్టపోతున్నామంటున్న పరిశ్రమల నిర్వాహకులు -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పి తాళలేక ఒకరు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వలస కార్మికుడితో పాటు మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ●● నల్లచెరువు: స్థానిక వీవర్స్ కానీకి చెందిన సుధాకర్(45) ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని దిగువపల్లికి చెందిన సుధాకర్ తన భార్య అనితతో కలసి వీవర్స్ కాలనీలో ఆరేళ్లుగా నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా హిందూపురం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా కడుపు, వెన్ను నొప్పి కారణంగా మెడికల్ లీవ్ కింద ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరు కుమార్తెలతో కలసి భార్య అనిత తన పుట్టింటికి వెళ్లింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధాకర్ పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మక్బూల్ బాషా తెలిపారు. ● ధర్మవరం రూరల్: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన రైతు జ్వాల లక్ష్మీరెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో కుటుంబసభ్యులు ఆరా తీశారు. పొలం వద్దకెళ్లి పరిశీలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం తన పొలానికి సమీపంలో ఉన్న వంకలో కంప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీరెడ్డిని గొర్రెల కాపరులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఉరికి వేలాడుతున్న లక్ష్మీరెడ్డి మృతదేహాన్ని గమనించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మీరెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సిఉంది. ● ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామ పొలాల్లో బుధవారం మహారాష్ట్రకు చెందిన గణపత్ భానుదాస్ (41) ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని సుధాఘడ్ రాణిఘర్కు చెందిన భానుదాస్.. భార్యతో కలిసి వలస వచ్చి వెంకటతిమ్మాపురంలో స్థిరపడ్డాడు. కట్టెలు కాల్చి బొగ్గుల వ్యాపారం చేస్తుండేవారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో భార్య అలిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భానుదాస్ బుధవారం తాను నివాసముంటున్న గుడిసెలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తచెరువు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామానికి చెందిన నరసింహులు (62)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వ్యక్తిగత పనిపై మంగళవారం కొత్తచెరువుకు వెళ్లిన ఆయన సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు నరసింహులు గతంలో లోచర్ల సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భర్త అదృశ్యంపై ఫిర్యాదు బెళుగుప్ప: మండల పరిధిలోని శీర్పి గ్రామానికి చెందిన తన భర్త మంగలి మహేష్ ఈనెల 20 నుంచి కనిపించడం లేదని భార్య రూప బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రాప్లోన్ రెన్యూవల్ కోసం కళ్యాణదుర్గం వెళ్లిన మహేష్.. తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాలు, బంధువులను విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బాల నరసింహులు కేసు నమోదు చేశారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోని ఆరు విభాగాలకు ఎన్బీఏ (నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది. సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. అక్రిడిటేషన్ రావడానికి తోడ్పాటు అందించిన విభాగాధిపతులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్బీఏ గుర్తింపు గల కళాశాల జారీ చేసే సర్టిఫికెట్కు విలువ అధికంగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ నిదర్శనంగా నిలుస్తుంది. -
ప్రయాణికులపై ‘మహా’ దెబ్బ
మడకశిర: టీడీపీ మహానాడు దెబ్బ ఆర్టీసీ ప్రయాణికులపై పడింది. మంగళవారం కడపలో మహానాడు ప్రారంభం కాగా, గురువారం ముగింపు సభ జరగనుంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేయాలని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జ్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే జనాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలైతే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని భావించిన ‘తెలుగు తమ్ముళ్లు’ ఆర్టీసీ బస్సులపై దృష్టి సారించారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి దాదాపు సగం బస్సులను మహానాడుకు సిద్ధం చేశారు. దీంతో గురు, శుక్రవారాల్లో జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘పల్లె వెలుగు’లే ఎక్కువ.. జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకున్న టీడీపీ నేతలు అందులోనూ ఖర్చు తక్కువగా ఉంటుందని ‘పల్లె వెలుగు’లకే మొగ్గు చూపారు. మొత్తంగా జిల్లాలోని ధర్మవరం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి డిపోల పరిధిలోని 167 బస్సులను మహానాడు కోసం తీసుకున్నారు. ఇందులో ధర్మవరం డిపో నుంచి 30, హిందూపురం డిపో నుంచి 30, కదిరి డిపో నుంచి 50, మడకశిర డిపో నుంచి 17, పెనుకొండ డిపో నుంచి 15, పుట్టపర్తి డిపో నుంచి 25 బస్సుల చొప్పున ఆర్టీసీ అధికారులు కేటాయించారు. ఇందులో ఎక్స్ప్రెస్ బస్సులు 48 ఉండగా, పల్లె వెలుగు బస్సులు 119 ఉన్నాయి. ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం.. ఆర్టీసీ అధికారులు బస్సులను అద్దెకు పంపినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను పంపాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ అధికారంలో ఉండటంతో అడిగేవారే లేరన్నట్లు వ్యవహరించారు. మడకశిర డిపోలో మొత్తం 30 బస్సులుండగా, ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏకంగా 17 బస్సులను మహానాడుకు కేటాయించారు. కేవలం మిగిలిన 13 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన డిపోల పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రభావంతో కొన్ని బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఎక్కువగా పల్లె వెలుగు బస్సులను తీసుకోవడంతో రెండు రోజుల పాటు ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేరడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. మహానాడుకు అత్యధికంగా ఆర్టీసీ బస్సులనే వాడుకోవడం కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వందలాది ప్రైవేట్ బస్సులు, వాహనాలున్నా...ఆర్టీసీ బస్సులను మహానాడుకు వినియోగించుకోవడం ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడమేనని వాపోతున్నారు. అమరావతిలో ఇటీవల జరిగిన మోదీ సభకు కూడా ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రెండు రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ టీడీపీ నాయకులు మహానాడు పేరుతో ఆర్టీసీ బస్సులను తీసుకుని ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుండటం సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది. మహానాడుకు జిల్లా నుంచి 167 ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ‘పల్లె వెలుగు’ బస్సులను పంపిన వైనం రెండు రోజులు ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు -
బాబు స్వార్థం.. సీమకు అన్యాయం
ఆత్మకూరు: జిల్లాలో రైతు మనుగడను కూటమి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే సీఎం చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీ–నీవా ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కాలువలో నీరు ప్రవహించే సమయంలో ఎంతో కొంత నీరు భూమిలోకి ఇంకడం ద్వారా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో జిల్లాలో ఉద్యాన పంటలు గణనీయంగా విస్తరించాయి. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోవడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు తగ్గిపోయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లైనింగ్ పనులను అడ్డుకున్నారు. వట్టిపోనున్న చెరువులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ హంద్రీ–నీవా ద్వారా కొత్త ప్రాజెక్టులకు కూడా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు (కర్నూలు తాగునీటి పథకం)కు 3 టీఎంసీలు, డోన్లో లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 63 చెరువులకు నీరు ఇచ్చేందుకు 2 టీఎంసీలు, జిల్లాలోని శింగనమల చెరువుకు 1 టీఎంసీ, శింగనమల పాత తాలూకాలోని చెరువులకు 1.3 టీఎంసీలు, జీడిపల్లి, భైరవానితిప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 3.7 టీఎంసీలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, సోమరాండ్లపల్లి రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు 4.5 టీఎంసీలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 23 టీఎంసీలు కేటాయించడంతో పాటు 40 టీఎంసీల నీటిని రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు అందించేలా బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. కాలువకు లైనింగ్ పనులు చేయడం ద్వారా భవిష్యత్తులో నీరంతా దిగువకు వెళ్లిపోయి చెరువులన్నీ పూర్తిగా వట్టిపోయే ప్రమాదం నెలకొంది. హంద్రీ–నీవా లైనింగ్ పనులతో బీళ్లుగా మారనున్న రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడకే ముప్పు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమంటున్న ‘రాప్తాడు’ రైతులు పంటల సాగు కష్టం రాప్తాడు నియోజకవర్గంలో చాలా పొలాలు హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నాయి. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరిగి మా వ్యవసాయ బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగింది. దీంతో నాకున్న 4 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. ఇప్పుడేమో కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత లేక పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రైతు కష్టాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. లైనింగ్ పనులు ఆపి 83 టీఎంసీల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేయాలి. – సుబ్బర రామాంజినేయులు, సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలం రైతుల పొట్ట కొట్టొద్దు హంద్రీ–నీవాలో నీటి ప్రవాహం వల్ల చాలా మంది బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువ పక్కన పొలాల్లో చీనీ, అరటి, టమాట, వరి, అంజూర, ద్రాక్ష, దానిమ్మ వంటి ఉద్యాన పంటల సాగు పెరిగింది. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయితే బోర్లు ఎండి పోయే ప్రమాదముంది. రైతులు నష్టపోతారు. కాంక్రీట్ లైనింగ్ పనులతో రైతుల పొట్ట కొట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – వెంకటేష్, సింగంపల్లి, ఆత్మకూరు మండలం -
15 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్/చిలమత్తూరు: తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం జిల్లాలోని 15 మండలాల పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా లేపాక్షి మండలంలో 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక అగళి 6.4 మి.మీ, గోరంట్ల 6.2, గుడిబండ 6, పరిగి 4.2, హిందూపరం 3.4, సీకేపల్లి 2.8, మడకశిర 2.6, రొళ్ల 2.4, అమడగూరు 2.4, బుక్కపట్నం 1.8, తనకల్లు 1.8, ముదిగుబ్బ 1.4, సోమందేపల్లి 1.4, రొద్దం మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు. జిల్లాకు వర్షసూచన.. రాగల ఐదు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉందని వెల్లడించారు. గంటకు 16 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ సలహాలు.. ఈనెల 26న నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం ఉన్నందున అరటి, బొప్పాయి లాంటి వాటికి ఊతకర్రలు పెట్టుకోవాలని, రాలిన మామిడి కాయలు వెంటనే సేకరించి విక్రయించుకోవాలన్నారు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని భూసారం పెంచుకోవాలన్నారు. జీవాల్లో ఈటీ, షీప్ పాక్స్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున టీకాలు వేయించుకోవాలన్నారు. పిడుగులు పడే పరిస్థితి ఉన్నందున రైతులు, కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ప్రియుడి వ్యసనాలు నచ్చక యువతి ఆత్మహత్య
అగళి: చెడు వ్యసనాలు మానాలని చెప్పినా ప్రియుడు వినకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామానికి చెందిన రాజన్న కుమారుడు పునీత్, అగళికి చెందిన దళిత సన్న భూతన్న, కారియమ్మ దంపతుల మూడో కుమార్తె రక్షిత (22) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. ఆగస్టులో ఇద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ క్రమంలో పునీత్ రోజూ రక్షితకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. మాటల్లో పునీత్ వ్యసన పరుడని రక్షిత గుర్తించింది. ఆయనకు తాగుడు అలవాటుతో పాటు ఇతర దురలవాట్లూ ఉన్నాయని తెలుసుకున్న ఆమె వాటిని మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా పునీత్లో మార్పు రాలేదు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పకోలేక తనలో తాను కుమిలిపోతూ వచ్చింది. రేపు పెళ్లి తర్వాత ఇంటి అల్లుడు వ్యసనపరుడని తెలిస్తే పుట్టింటి వారి గౌరవానికి భంగం కలుగుతుందని భావించిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లోనే పైకప్పునకు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కాపాడి స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్ణాటకలోని శిరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనకు సంబంధించి సన్న భూతన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అగళి పీఎస్ ఎస్ఐ వీరేష్ తెలిపారు. -
అన్యాయం జరుగుతోంది
హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులతో ఒక్క రాప్తాడు నియోజకవర్గమే కాదు... మొత్తం రాయలసీమకే అన్యాయం జరుగుతోంది. రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతాయి. భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా రిలే నిరాహార దీక్షలు రాప్తాడు నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తాం. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఉద్యమించాలి. ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు, పోలీసులకు అనుమతులు కోరాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్
● ఆన్లైన్ అంటూనే భౌతికంగా సాగిన కౌన్సెలింగ్ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం మొదలైన జోనల్ స్థాయి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము సరిగ్గా 6 గంటలకు ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోనల్ స్థాయి కావడంతో ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు సూపరెండెండెంట్లు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు రిక్వెస్ట్ కింద ఐదుగురు సూపరెండెండెంట్లు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది ఏడీఏలు, 122 మంది ఏఓలు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అసోసియేషన్లకు చెందిన నాయకులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఇందులోనూ ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. 255 మందికి పైగా కౌన్సెలింగ్కు హాజరవుతున్నట్లు తెలిసినా కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం చేయడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రంతా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా ఉద్యోగులు జాగరణతో పడిగాపులు కాసేలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆన్లైన్ పక్రియ అంటూనే భౌతికంగా చేపట్టారు. ప్రతి విషయంలో ఒకరిద్దరు జేడీఏలు జోక్యం చేసుకోవడంతో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏఓ స్థాయి అధికారులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. అలాగే రిక్వెస్ట్ కింద, అసోసియేషన్ల వెసులుబాటు, కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. -
పీఆర్లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బాలూనాయక్, ఎస్ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్ఈలతో పాటు పీఆర్ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు. -
స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి
సాక్షి, పుట్టపర్తి కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జడలు విప్పుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు అధికారులు ముందస్తు నివారణ చర్యల గురించి ప్రస్తావించకపోవడంతో మనం భద్రమేనా..అన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిహద్దు నుంచి నిత్యం రాకపోకలు.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది విద్య, ఉపాధి కోసం బెంగళూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, యలహంక వెళ్లి వస్తుంటారు. కార్లు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తారు. దీంతో మనిషి నుంచి మనిషికి సులువుగా సోకే కరోనా వైరస్ ఇక్కడి ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం లేకపోలేదు. గత 2020, 2021లో కరోనా వైరస్ చేసిన మరణ మృదంగం తలుచుకుంటే ప్రజలకు నిద్ర పట్టడం లేదు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయం భయంగా గడుపుతున్నారు. జిల్లా వాసుల్లో టెన్షన్.. కరోనా వంటి ప్రమాదకర వైరస్ సమీపంలోని బెంగళూరు వరకు వచ్చిందనే విషయం తెలియగానే.. జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది. పొరుగు రాష్ట్రంలో వైరస్ తొంగి చూడటంతో ఇక్కడి జనం ఉలిక్కిపడ్డారు. జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, కార్లలో రోజూ వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి రోజూ సగటున వంద వరకు కార్లు విదేశీయులతో బెంగళూరు విమానాశ్రయం వెళ్తుంటాయి. ఈ క్రమంలో విమానాల్లో వచ్చిన వారి నుంచి వైరస్ సంక్రమిస్తుందన్న భయం అందరినీ వెంటాడుతోంది. పెరిగిన డిమాండ్.. కొత్తగా వైరస్ కేసులు పక్కనే ఉన్న బెంగళూరులో తేలడంతో మాస్క్లు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. ఎవరికి వారుగా ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పాటు జ్వరం, జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్లు ధరించి బయటికి వస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ముందు తరహాలో అనుమతించడం లేదు. రెండు మూడు రోజుల్లోనే పుట్టపర్తిలో మార్పు వచ్చింది. గతంలో కరోనా వైరస్ విజృంభించిన తీరు గురించి పదే పదే చర్చించడం మొదలుపెట్టారు. ముందస్తు చర్యలు తీసుకోని ప్రభుత్వం.. కరోనా వంటి ప్రమాదకర వైరస్లు ప్రబలిన సమయంలో గతంలో వైఎస్సార్ సీపీ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రజారోగ్యమే పరమావధిగా కఠినంగా వ్యవహరించింది. పాజిటివ్ కేసుల గుర్తింపు మొదలు క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయడం, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆహారం సరఫరా, కూరగాయల పంపిణీతో పాటు అత్యవసర సమయాల్లోనూ వలంటీర్ల ద్వారా ప్రతి నెలా పింఛన్ అందజేయడం వంటి సహాయక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై కూడా ఆంక్షలు విధించి జిల్లా వాసులను కాపాడింది. అయితే ప్రస్తుత కూటమి సర్కారు అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కనీసం కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన కిట్లు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో చిన్న జ్వరం వచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. పైగా ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా రద్దు చేసింది. దీంతో ప్రజల్లో వైరస్ల భయం రెట్టింపయ్యింది. ప్రభుత్వం నుంచి భరోసా అనుమానమే అన్న భయం వెంటాడుతోంది. పుట్టపర్తికి చెందిన శ్రీనివాసులు ఉపాధి నిమిత్తం రోజూ రైలులో సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరుకు వెళ్లివచ్చేవాడు. అక్కడ కరోనా కేసులు నమోదుకావడంతో స్థానికంగానే పనులు చేసుకుంటున్నాడు. బెంగళూరుకు వెళ్తే కూలి ఎక్కువ వస్తుంది కదా అని ప్రశ్నిస్తే... ఆ డబ్బులొద్దు... ఆ జబ్బు వద్దంటున్నాడు. హిందూపురానికి చెందిన ప్రకాష్ స్థానికంగా గిఫ్ట్ అండ్ నావల్టీస్ దుకాణం నడుపుతున్నాడు. ప్రతి చిన్న పనికీ సమీపంలో ఉన్న బెంగళూరుకు వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ఈ ఊరి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. ఇటీవల అక్కడ కరోనా కేసులు బయటపడటంతో ఏదైనా కావాలంటే అనంతపురం వెళ్తున్నాడు. ..ఇలా వివిధ పనుల నిమిత్తం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగించే జిల్లా వాసులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కానీ బెంగళూరు నుంచి వచ్చేవారు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. దీంతో జిల్లా వాసులు హైరానా పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా...మనం భయపడాల్సిన పనిలేదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జనావాస ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలి. మాస్కు లేకుంటే ఆస్పత్రుల్లో ప్రవేశం నిషిద్ధం. గతంలో కరోనా వైరస్ సమయంలో పాటించిన జాగ్రత్తలను తిరిగి కొనసాగించండి. వైరస్ సోకక ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది. అయితే వైరస్తో ఏమీ కాదనే నిర్లక్ష్యం వద్దు. – డాక్టర్ ఫిరోజాబేగం, డీఎంహెచ్ఓ -
జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
పుట్టపర్తి టౌన్: ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ చేతన్ సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి గణేష్ కూడలిలోని మైనార్టీ షాదీ మహల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు. స్వయంగా ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా చేసే వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారని, యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లే ప్రభుత్వం కూడా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21 వరకు జిల్లాలో యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 18, 19 తేదీల్లో యోగాసన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్తో పాటు యోగా గురువులు పాల్గొన్నారు. యోగాతోనే ఒత్తిడి జయించడం సాధ్యం: కలెక్టర్ -
భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్హెచ్ –342, ఎన్హెచ్–716జీ రహదారులతో పాటు పలు జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూకేటాయింపు ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక రూపొందించి రెవెన్యూ డివిజనల్ అధికారులకు, కలెక్టరేట్లో అందజేయాలని ఆదేశించారు. ఎన్హెచ్–342 జాతీయ రహదారికి సంబంధించి బుచ్చయ్యగారిపల్లి గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం రెవెన్యూ గ్రామస్తులకు ఇవ్వాలని పరిహారం పనులు పెండింగ్లో ఉన్నాయని, ఆ పనులన్నీ వెంటనే పూర్తి చేసి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్ కుమార్, శర్మ, మహేష్, ఎన్హెచ్ ఏఐ పీడీ అశోక్ కుమార్, అధికారులు మల్లికార్జునరావు, బి.నాగరాజు, గిడ్డయ్య, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సీటు రాదేమోనని.. విద్యార్థిని ఆత్మహత్య పరిగి: పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మండలంలోని కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు మేరకు... కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న వెట్టి గోపాలప్ప కుమార్తె వెట్టి హేమావతి(15) 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమెకు 379 మార్కులు వచ్చాయి. అయితే ఇంకా మంచి మార్కులు రావాల్సి ఉండేదని హేమావతి నిత్యం బాధపడేది. ఇంటర్లో చేరేందుకు మంచి కళాశాలలో సీటు వస్తుందో రాదోనని ఆందోళన చెందేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబుతూ తరచూ బాధపడేది. ఈ నేపథ్యంలోనే ఇంటర్లో మంచి కళాశాలలో సీటు రాదేమోనన్న భయంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమావతి తండ్రి గోపాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడు తెలిపారు. ‘తమ్ముళ్ల’ చిల్లర వేషాలు ● వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు ● వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వైనం చిలమత్తూరు: తెలుగు తమ్ముళ్లు చిల్లర వేషాలు వేస్తున్నారు. తమ మాట వినని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. చివరకు వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు తయారు చేయించి వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీకి చెందిన చిలమత్తూరు– 2 ఎంపీటీసీ సభ్యురాలు సనమ్హుస్నా భర్త షాకీర్తో పాటు ఆయన తల్లి పేరుతో కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు పంపించారు. వాటిని టీడీపీ నేతలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన షాకీర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను ఎప్పుడూ టీడీపీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయలేదని, పార్టీ మారాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. టీడీపీ నేతలు చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. తన రాజకీయ ప్రయాణం వైస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతల విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు. -
డీఈఈ సెట్ నిర్వహణకు రెండు కేంద్రాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈ సెట్)–2025కు జిల్లాలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 2న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరిగే పరీక్షలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా (చిన్మయానగర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ), రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న ఎస్వీఐటీ కళాశాల కేంద్రాలుగా ఉంటాయన్నారు. https://apdeecet.apcfss.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. నిర్ణీత సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆధార్కార్డ్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
పుట్టపర్తిలో దాహం కేకలు
పుట్టపర్తి టౌన్: అధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పుట్టపర్తిలో దాహం కేకలు మిన్నంటాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా..చాలా వార్డుల్లో తాగునీటికి జనం అల్లాడిపోతున్నారు. తాజాగా మంగళవారం 5 వార్డు కుమ్మరిపేట మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నాలుగురోజులుగా తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే పల్లె సింధూరారెడ్డికి వ్యతిరేకంగా ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...నాలుగు రోజులుగా బోరు మోటర్ మరమ్మతుకు గురైందని, దీంతో తమకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. నాలుగురోజులుగా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి సమస్య చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా గతంలోనూ తమకు ఇష్టమొచ్చినప్పుడు నీరు వదిలేవారని, దీంతో కూలి చేసుకునే తాము పనులు మానుకుని నీటికోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని, లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన గురించి స్థానిక కౌన్సిలర్ సూర్యాగౌడ్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా... ఆయన స్పందించి త్వరగా మోటర్ మరమ్మతు చేయించి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు ఎమ్మెల్యే సింధూరారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు -
చౌకధరల దుకాణాల వద్దే రేషన్ పంపిణీ
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రశాంతి నిలయం: జూన్ నెలకు సంబంధించన రేషన్ సరుకులను చౌకధరల దుకాణాల వద్దే పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డుదారులు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల వద్ద రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. డీలర్లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరుకుల అందించాలన్నారు. ధరల్లో, తూకాల్లో తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించాలన్నారు. రేషన్ సరుకులు పంణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా ఆయా మండలాల తహసీల్దార్లు, సీఎస్డీటీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. రేపటి నుంచి రైతుల వద్దకే శాస్త్రవేత్తలుబుక్కరాయసముద్రం: ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జూన్12వ తేదీ వరకు రైతుల వద్దకే శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు. రోజూ 3 గ్రామాలు చొప్పున 32 మండలాల్లోని గ్రామాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్దతలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్ వినియోగం, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. బాలిక బలవన్మరణం తాడిపత్రి టౌన్: స్థానిక సీపీఐ కాలనీకి చెందిన రజని (16) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కాలనీకి చెందిన చాకలి పుల్లయ్య, రాజేశ్వరి దంపతుల కుమార్తె రజని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఫలితాలు అందిన రోజున తల్లిదండ్రులు విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివిస్తామని చెప్పడంతో సంతోష పడింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మూడు రోజుల క్రితం తాడిపత్రిలోనే చదువుకోవాలని తల్లిదండ్రులు సూచించారు. దీంతో క్షణికావేశానికి లోనైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. బలవంతపు పెళ్లిపై ఫిర్యాదు గుమ్మఘట్ట: తనకు ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు బలవంతంగా పెళ్లి చేశారంటూ పోలీసులకు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. వివరాలు.. రాయదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయిని గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే మైనారిటీ తీరని రెండో అమ్మాయిని కూడా నెల రోజుల క్రితం పూలకుంట గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే అప్పటికే అతనికి వివాహమై ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పెళ్లి ఇష్టం లేని బాలిక స్థానికుల సహకారంతో తప్పించుకుని నేరుగా ఎస్పీని ఆశ్రయించింది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారని వాపోయింది. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో యువకుడి మృతి బెళుగుప్ప: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన ఆవుల హనుమంతరాయుడు (34)కు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రహదారి పక్కనే ఉన్న గోడను ఢీకొని సమీపంలోని గుంతలోకి దూసుకెళ్లాడు. ఘటనలో తలకు, చాతీకి బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న హనుమంతరాయుడిని స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ద్వారా సమాచారమం అందిందని కలెక్టర్ చేతన్ తెలిపారు. మంగళవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవెన్యూ సిబ్బంది మందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండల కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 08555 289039 నంబర్కు సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ప్రశాంతి నిలయం: తాము చేస్తున్న పనితో సంబంధం లేకుండా అరకొర జీతాలు చెల్లిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతన్ను కలసి వినతి పత్రం అందజేసి, సమస్య వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 550 మంది తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. తమకు అరబిందో యాజమాన్యం చెల్లించే జీతం సరిపోవడం లేదన్నారు. గత 9 సంవత్సరాలుగా కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోగలమని ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్ల వేతనం రూ.18,500 చెల్లించాలని, పీఎఫ్ వాటాను యాజమాన్యమే భరించాలని, చట్ట ప్రకారం వారాంతపు సెలవులతో పాటు జాతీయ సెలవులనూ అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమాతో పాటు, విధులలో మరణించిన డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా అందజేయాలన్నారు. పోక్సో కేసు నమోదు రాప్తాడు: స్థానిక పంచాయతీ పరిధిలోని ముస్లీం మైనార్టీ కాలనీకి చెందిన ఓ బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. కొన్ని నెలలుగా తమ కుమార్తెను ప్రేమ పేరుతో కదిరి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన యువకుడు వేధిస్తున్నట్లు బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
హెర్బల్ పార్కుకు స్థల పరిశీలన
ధర్మవరం అర్బన్: పట్టణంలో హెర్బల్ పార్కు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని ఏపీ మెడిషనల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలో సోమవారం గాంధీనగర్, రామ్నగర్లో ఉన్న మున్సిపల్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాల్లో 58 రకాల ఔషధ మొక్కలతో ప్రత్యేక హెర్బల్ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఏర్పాట్ల కోసం స్థలాలను పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, తహసీల్దార్ నటరాజ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్బాబు పాల్గొన్నారు. ‘మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలి’ ముదిగుబ్బ: ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వైపునకు వెళ్లే ఎన్హెచ్ 342 జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధర ప్రకారం ఎకరానికి రూ.8,90,000 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యాల్యుషన్ ప్రకారం ఎకరానికి రూ, 63,88,000 ఉందన్నారు. వీటి ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు తహసీల్దార్ నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు. మాకు పరిహారం అందించే వరకు పనులను నిలిపివేయాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్నాయుడు, రమేష్బాబు, సనత్కుమార్, విశ్వనాథ్, ప్రభాకర్ నాయుడు, హనుమంతు, అశోక్, రాగినాయుడు, ప్రసాద్, లక్ష్మీదేవి, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు. రైతు ఇంట చోరీ రొద్దం: మండలంలోని కంచిసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకిల క్రిష్టప్ప ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆర్డీటీ సౌజన్యంతో గ్రామంలో ఇంటిని నిర్మించుకుని అందులోనే నివాసముంటున్న క్రిష్టప్ప.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు నగలు, 12 తులాల వెండి సామగ్రి, రాగి పాత్ర అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బైక్ ఢీ – ఒకరి మృతి
ముదిగుబ్బ: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కూలి పనులతో జీవనం సాగిస్తున్న నల్లచెర్లోపల్లికి చెందిన ఎం లక్ష్మన్న (59) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మలకవేమల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో లక్ష్మన్నతో పాటు మరో ద్విచక్ర వాహనదారుడు శంకర్నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మన్న మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అక్కడంతా.. ఆ ఇద్దరే!
సాక్షి, పుట్టపర్తి: ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యం చేసే ఆరోగ్య శాఖ జబ్బు బారిన పడింది. ఇద్దరు అసిస్టెంట్లు దళారీ అవతారమెత్తి.. వసూళ్లు చేస్తుండటం కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా క్లినిక్ మొదలు.. నర్సింగ్ హోం వరకు.. నెల, ఆరు నెలలు, ఏడాదికి చొప్పున టార్గెట్ పెట్టుకుని మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెలవు కావాలన్నా.. ఎఫ్ఆర్ఎస్ నమోదు కావాలన్నా.. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. కొత్త ఆస్పత్రుల రిజిస్ట్రేషన్.. పాతవి రెన్యూవల్స్తో పాటు తనిఖీ చేయకుండా ఉండాలన్నా.. అడిగినంత సమర్పించుకోవాల్సిందే. అసిస్టెంట్లే.. దళారీలుగా.. ఎఫ్ఆర్ఎస్ నమోదు నుంచి సెలవులకు అనుమతులు.. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ వరకు.. ప్రతి విషయంలో ఆ ఇద్దరు అసిస్టెంట్లు దళారీలుగా మారి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి పైసలు పంపనిదే.. ఫైలు కదలని పరిస్థితి. ఎఫ్ఆర్ఎస్, సెలవులన్నీ.. ఓ అసిస్టెంట్కు.. రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ విషయంలో మరో అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఒకరిపై మరొకరు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నారు. పైగా తమపై ఎక్కడ ఫిర్యాదు చేసినా.. ఇబ్బంది లేదని.. కార్యాలయంలో ఖర్చులను తామే భరిస్తున్నామని.. ఎవరూ ఏమీ అనే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలుకుతున్నారు. విజయవాడకు చేరిన పంచాయితీ ఓ సీనియర్ అసిస్టెంట్ నిర్వాకంపై కొందరు మెడికల్ ఆఫీసర్లు పక్కా ఆధారాలతో జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు విన్నవించారు. ఆ తర్వాత నేరుగా విజయవాడలోని కమిషనర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ నుంచి అధికారులు సీరియస్ కావడంతో పాటు డీఎంహెచ్ఓపై కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖలో జరిగే విషయాలపై ఎందుకు స్పందించకుండా ఉన్నారని.. వెంటనే విచారణ చేయించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ● ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లలో ఒకరిపై శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఒకరిని సోమవారం కడప రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) వద్ద సరెండర్ చేశారు. మరొకరిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. దళారీ అవతారమెత్తిన సీనియర్ అసిస్టెంట్లు డీఎంహెచ్ఓ కార్యాలయంలో వసూళ్ల పర్వం ఏ పని కావాలన్నా.. వారి వద్దకు వెళ్లాల్సిందే ఆస్పత్రుల రెన్యూవల్ విషయంలో భారీగా దందా విచారణ చేస్తున్నాం కొందరు మెడికల్ ఆఫీసర్లు ఓ సీనియర్ అసిస్టెంట్పై ఫిర్యాదు చేస్తే.. ఆయనను ఆ విధుల నుంచి తప్పించాను. ఆ తర్వాత విజయవాడకు ఎవరు ఫిర్యాదు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. అవన్నీ తప్పుడు మెయిల్స్గా అనుమానం ఉంది. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. కార్యాలయంలో ఖర్చులకు ప్రభుత్వమే భరిస్తుంది. ఖర్చుల కోసం సిబ్బందితో వసూళ్లు చేయడం లేదు. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్ఓ -
పోలీసులు న్యాయం చేయడం లేదు
పుట్టపర్తి టౌన్: కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నా.. పోలీసులు మాత్రం న్యాయం చేయడంలేదంటూ డీఎస్పీ విజయకుమార్ ఎదుట బాధితుడు చెన్నకేశవులు వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, తన సమస్య వివరించారు. వివరాలు... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన చెన్నకేశవులు, విజయలక్ష్మి దంపతులకు అదే గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 51, 552, 553, 836, 837లో 8.70 ఎకరాల భూమి ఉంది. ఇందులో 550 మామిడి చెట్లతో పాటు వరి సాగు చేస్తున్నారు. 2005లో చెన్నకేశవులు అన్న రమణ మృతి చెందాడు. ఆయన పేరున ఉన్న భూమిని 2007లో చెన్నకేశవులు, విజయలక్ష్మి పేరుతో కొనుగోలు చేశారు. అయితే భూమిలో తమకూ హక్కు ఉందని అన్న కుమారుడు రెడ్డి కుమార్, బంధువులు రెడ్డెమ్మ, రెడ్డెప్పరెడ్డి అడ్డు తగలడంతో దీనిపై చెన్నకేశవులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో చెన్నకేశవులుకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దాయాదులు అడ్డుతగుతుండడంతో కోర్టు ఉత్తర్వులు నకళ్లను జతపరుస్తూ పోలీసులకు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. ఇందులో టీడీపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్కు బాధితుడు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన డీఎస్పీ వెంటనే కదిరి పీఎస్కు ఫోన్ చేసి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు. -
ప్రమాదంలో మెకానిక్ మృతి
ధర్మవరం రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని శాంతినగర్కు చెందిన జయరాములు కుమారుడు నవీన్కుమార్ కారు మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య కీర్తన ఉన్నారు. సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆయన చిగిచెర్ల రోడ్డులో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరసన పుట్టపర్తి అర్బన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ ఎల్డీ కంప్యూటర్స్ సిబ్బంది సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లతో పని భారం పెరుగుతోందని, దీంతో ఒత్తిళ్ల కారణంగా తప్పిదాలు చోటు చేసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్లను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసహరించుకోవాలని, ఉద్యోగుల పరిధిలో ఉన్న పనులను మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫిరోజ్బేగంకు వినతి పత్రం అందజేశారు. కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి తలుపుల: వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వివరాలు... ముదిగుబ్బ గ్రామానికి చెందిన మల్లికార్జున గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన గొర్రెల మందను మేపు కోసం తలుపుల మండలం మాడికవాండ్లపల్లి సమీపంలోని సూర్యనారాయణరెడ్డి పొలంలో వదిలాడు. సోమవారం 30 గొర్రె పిల్లలను జార్లీ (గంప) కింద వేసి పెద్ద గొర్రెలను మేపునకు తోలుకెళ్లారు. ఆ సమయంలో వీధి కుక్కలు జార్లీలో చొరబడి బీభత్సం సృష్టించడంతో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో ఐదు గొర్రెపిల్లుల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనపై బాధిత కాపరి మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు వేడుకలు ధర్మవరం అర్బన్: పట్టణంలోని కొత్తపేట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గణపతి సచ్చిదానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ ట్రస్ట్, వలంటీర్ల ఆధ్వర్యంలో సచ్చిదానంద స్వామి చిత్రపటాన్ని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దత్త శివ, మెటికల కుళ్లాయప్ప, రామంజనేయులు, సాగా సురేష్, రంగా శ్రీనివాసులు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించడం తగదు తనకల్లు: మండలంలోని మల్లిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సోలార్ కంపెనీకి కేటాయించడం తగదని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్ శోభా సువర్ణమ్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామం సమీపంలోని సర్వే నంబర్ 63లో ఉన్న ప్రభుత్వ భూములను సోలార్ కంపెనీకి మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలన్నారు. ఆ భూములను సోలార్కు కేటాయిస్తే దాదాపు 15 గ్రామాలకు చెందిన పశువులకు మేత, నీరు ఉండదని తెలిపారు. కార్యక్రమంలో పెండ్లుగుండుతండా, జామ్లానాయక్ తండా, పెద్దపల్లి, ఎర్రబల్లి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఖాళీలు తగ్గించరాదని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలోని శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో నిరసన వ్యక్తం చేసి, డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. 2023లో తాత్కాలిక పదోన్నతులకు సంబంధించి ఎస్ఏ ఇంగ్లిష్లో 230 మందికి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం చేపట్టిన పదోన్నతులలో అంతకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్యుడు, నాగభూషణ, కేశవరెడ్డి, జయరాం నాయక్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు నాయక్, శ్రీదేవి, విజయశ్రీ, సురేష్, కృష్ణారెడ్డి, పీరూనాయక్, వన్నారెడ్డి, సూర్యనారాయణ, క్షీరలింగేశ్వర్, వెంకటేష్, రసూల్, ఓబిరెడ్డి, నరసింహులు, విశ్వనాథరెడ్డి, రాజశేఖర్, శివప్రసాద్, మధు, రమేష్ పాల్గొన్నారు. డీఈఓను కోరిన ఉపాధ్యాయులు -
పాఠ్యపుస్తకాల దోపిడీ అరికట్టాలి
ధర్మవరం: ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మార్సీలో సోమవారం ఎంఈఓ రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, వైఎస్సార్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతలయ్య, వైఎస్సార్ఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, గిరీష్ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకమునుపే అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. ఫీజు వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. భవిష్యత్తులో పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
ఇదెక్కడి న్యాయం..?
కదిరి: కష్టపడి పాఠాలు చెప్పి బడిలో విద్యార్థుల సంఖ్య పెంచిన వారి కన్నా.. విధులకు డుమ్మా కొడుతూ ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గి పోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఈ బదిలీల్లో 7 అదనపు పాయింట్లు కేటాయిస్తోంది. మరోవైపు బాగా పాఠాలు చెప్పి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తోంది. దీన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇలా అదనపు పాయింట్లు కేటాయించడమేంటని వారు మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు మూడు వేల మంది దాకా ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఆన్లైన్ ద్వారానే బదిలీ ఉత్తర్వులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు ఆన్లైన్ ద్వారానే ఉత్తర్వులు అందనున్నాయి. హెచ్ఎంలకు ఈ నెల 30న, స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 4న, ఎస్జీ టీచర్లకు జూన్ 11న బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఎస్జీటీల దరఖాస్తు ప్రక్రియ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నెల 31న ఎస్జీటీల ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా విడుదల కానుంది. ఈ జాబితాపై అభ్యంతరాలను ఎస్జీటీలు ఈ నెల 28 నుంచి జూన్ 1లోగా తెలియజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బదిలీలకు సంబంధించి పాఠశాల ఎంపికకు హెచ్ఎంలు ఈ నెల 28లోగా, స్కూల్ అసిస్టెంట్లు జూన్ 1, 2వ తేదీల్లో, ఎస్జీటీలు జూన్ 7 నుంచి 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్–2025 ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం ఈ బదిలీలు చేపడుతోంది. ఎస్జీ టీచర్లకు ఆఫ్లైన్ ద్వారానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుగా పేర్కొన్నప్పటికీ.. దీనిపై ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. విద్యార్థుల సంఖ్య తగ్గించిన వారికి 7 అదనపు పాయింట్లు గందరగోళంగా మారిన ఉపాధ్యాయుల బదిలీలు నేటితో ముగియనున్న ఎస్జీటీల దరఖాస్తుల గడువు సాంకేతిక చిక్కులు బదిలీల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ఉపాధ్యాయులను ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీనిపై తమకు జరిగిన అన్యాయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే తమ పరిధిలో ఏమీ లేదని, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని పలువురు టీచర్లు వాపోతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో తమకు స్టేషన్ పాయింట్లు రావడం లేదని కొందరు, స్పౌజ్ పాయింట్ల విషయంలోనూ సమస్యలున్నాయని ఇంకొందరు అంటున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
సౌదీలో ధర్మవరం వాసి అవస్థలు
ధర్మవరం అర్బన్: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి ఏజెంట్ చేసిన మోసం వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. డ్రైవింగ్ కోసమని వెళ్తే ఇంటి పనుల్లో కుదిర్చారు. ఇంటి పనులు సరిగా చేయడం లేదని యజమానులు వీసా లాగేసుకుని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన భర్తను రక్షించాలని భార్య ధర్మవరం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు... బోయవీధికి చెందిన సయ్యద్ ఫరూఖ్, హర్షియా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఉపాధి కోసం సౌదీకి వెళ్లేందుకు పుట్టపర్తికి చెందిన ఏజెంట్ ఖలీల్ను సంప్రదించాడు. డ్రైవింగ్ పని ఇప్పిస్తానని చెప్పి అతని నుంచి ఏజెంట్ రూ.1.40 లక్షలు తీసుకున్నాడు. వీసాలో మోసం.. డ్రైవింగ్ వీసా స్థానంలో ఏజెంట్ ‘ఫ్రీ వీసా’ ఇచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 23న ఫరూఖ్ను విమానంలో సౌదీకి పంపించాడు. అక్కడి ఎయిర్పోర్టులో దిగిన ఫరూఖ్ను తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఏజెంట్ను ఫోన్లో సంప్రదించాడు. ఏజెంట్ మరో వ్యక్తిని ఫరూఖ్ దగ్గరకు పంపించాడు. అతను ఫరూఖ్ను తీసుకెళ్లి వాళ్లకు సంబంధించిన పెద్ద భవనాల్లో శుభ్రం చేసేందుకు, ఇంటి పనులు చేసేందుకు నియమించాడు. తాను డ్రైవింగ్ పని కోసం వచ్చానని, ఇంటి పనులు చేయనని మొండికేయడంతో ఆగ్రహించిన యజమానులు అతని వద్దనున్న ఫ్రీవీసా లాక్కున్నారు. బెల్టు, స్టీల్ పైపులతో చితకబాదేవారు. రోజూ మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను శుభ్రం చేసినా.. చిన్నపాటి దుమ్ము, ధూళి కనిపిస్తే యజమానులు మరోసారి శుభ్రం చేయించేవారు. జరిమానా విధించిన సౌదీ ప్రభుత్వం ఓ రోజు ఇంటి పనులు ముగించుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గదికి నడుచుకుంటూ వెళ్తున్న ఫరూఖ్ను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకుని, వీసా లేదని కేసు నమోదు చేశారు. 20 వేల దినార్లు (రూ.4.50 లక్షలు) జరిమానా విధించారు. ఆ డబ్బు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో ఫరూఖ్ తన భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ప్రస్తుతం సౌదీలోని మదరసాలో ఉంటున్నానని తెలిపాడు. భర్తను విడిపించాలని వేడుకోలు సౌదీలో బందీ అయిన తన భర్తను విడిపించడంతో పాటు వీసా పేరిట మోసం చేసిన ఏజెంట్ ఖలీల్పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ భార్య హర్షియా సోమవారం ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఏజెంట్ ద్వారా ఫరూఖ్ను ఇండియాకి రప్పిస్తామని సీఐ హామీ ఇచ్చారు. అనంతరం ఫరూఖ్ కుటుంబ సభ్యులు మంత్రి సత్యకుమార్యాదవ్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్కు లేఖ రాసి.. ఫరూఖ్ను కాపాడాలని, అతని పాస్పోర్టును తిరిగి అందించాలని, భారత దౌత్య కార్యాలయం ద్వారా నిరంతర కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగం పేరిట ఏజెంట్ మోసం డ్రైవర్ జాబ్ అని.. ఇంటి పనికి కుదిర్చిన వైనం పని చేయలేక యజమానుల చేతిలో చిత్రహింసలు -
వ్యవసాయ శాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషినల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుశాఖలో.. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు. -
బలవంతపు భూ సేకరణపై ఆగ్రహం
● వ్యవసాయం వీడితే వలసలే గతి ● తమ భూములను వదిలేయాలని రైతుల వేడుకోలు లేపాక్షి/ హిందూపురం: పరిశ్రమల స్థాపన కోసం వ్యవసాయ భూములను లాగేసుకోవడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ కొండూరు, తిమ్మగానిపల్లి, వడ్డిపల్లి గ్రామాల రైతులు వ్యవసాయ కార్మిక, రైతు సంఘం నాయకులతో కలిసి సోమవారం లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు భూములు లాగేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతే జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. తమ భూములను తమకు వదిలేయాలని అధికారులను వేడుకున్నారు. అలాగే హిందూపురం మండలం చలివెందుల, రాచపల్లి మలుగూరు, మీనకుంటపల్లిలో బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఓపీడీఆర్ నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏడాదికి మూడు పంటలు పండే 2,191 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని రైతులు మండిపడ్డారు. తమ ప్రమేయం లేకుండానే భూములు సర్వే చేయడం ఏమిటని నిలదీశారు. నాయకులు మాట్లాడుతూ బడా బాబులకు, అదాని, అంబానీ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసమే భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించారని, అందులో ఎన్ని పరిశ్రమలు స్థాపించారంటూ ప్రశ్నించారు. హిందూపురం తహసీల్దార్ వెంకటేశులు స్పందిస్తూ రైతుల అనుమతి లేకుండా భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి ప్రశాంతి నిలయం: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేసి చక్కటి ఫలితాలు సాధించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ 224 అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్లు, స్థలాలు, భూ సమస్యలు తదితర వాటిపై ఎక్కువగా అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అర్జీల పరిష్కారంలో ఫలితాలు సాధించాలన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయాలి యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ చేతన్ కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర షెడ్యూల్స్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న పుట్టపర్తి, జూన్ 4న కదిరి, జూన్ 6న ధర్మవరం, జూన్ 15న పెనుకొండ, జూన్ 13న హిందూపురంలో టీచర్స్–స్టూడెంట్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించాలన్నారు. జూన్ 21న లేపాక్షిలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఎ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమల శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్రెడ్డి, డీసీహెచ్ఎస్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్ఓ ఫెరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధి శివరంగ ప్రసాద్, డీపీఓ సమత, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, డీఎఫ్ఓ చక్రపాణి, సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, క్రీడల శాఖ అధికారి ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. -
జూన్లో గృహ ప్రవేశాలు లేనట్టే!
కదిరి అర్బన్: టిడ్కో గృహనిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీతో జూన్లో గృహప్రవేశాలు చేయొచ్చని లబ్ధిదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 2017లో కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు చెందిన దాదాపు 3వేల మంది పేదలకు కదిరి– హిందూపురం రోడ్డు పక్కన టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 75 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఏడేళ్లుగా ఈ భవనాలు పాడుబడిపోయాయి. గృహాలకు సంబంధించిన మెటీరియల్ చాలావరకు చోరీకి గురయింది. పనులు పూర్తయ్యేదెన్నడో..? పట్టణ శివారులోని కదిరి– హిందూపురం రహదారికి ఆనుకుని 40 ఎకరాల విస్తీర్ణంలో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా భవనాల్లో విద్యుత్, ఉడ్ వర్క్, పెయింటింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. వీధిలైట్లు, డ్రెయినేజీ, అంతర్గత రోడ్డు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. భవనాలు విషసర్పాలకు ఆవాసంగా మారిపోయాయి. పూర్తి కాని టిడ్కో ఇళ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలూ నిల్ సొంతింటి కల మరింత ఆలస్యం మరింత సమయం పట్టొచ్చు ప్రస్తుతానికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. 75 శాతం పూర్తయిన ఇళ్లను మిగిలిన 25 శాతం ఈ ఏడాది జూన్కు ఒక ఫేజ్, అక్టోబర్కు 2వ ఫేజ్లో పూర్తి చేసి ఇవ్వాలని గతేడాది రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఇవి ఫైనల్ స్టేజ్లో ఉన్న భవనాలకు మాత్రమే. ఫైనల్ స్టేజ్ జాబితాలో కదిరి లేదు. ఇంకా సమయం పట్టచ్చు. – కిరణ్కుమార్, మున్సిపల్ కమిషనర్, కదిరిత్వరగా గృహాలు అప్పగించాలి టిడ్కో ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వాలి. ఇళ్ల నిర్మాణాల పూర్తి కోసం సీపీఎం ఆద్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టాం. అయినా పనుల్లో వేగం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి గృహనిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలి. – నరసింహులు, సీపీఎం పట్టణ కార్యదర్శి -
జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది.
జవాన్ భూమి కబ్జా ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు ప్రశాంతి నిలయం: దేశ భద్రత కోసం సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్ భూమిని కొందరు కబ్జా చేశారు. మూడేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయతీ రాగిమేకలపల్లికి చెందిన చౌడేష్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ఈయనకు రాగిమేకల పల్లి రెవెన్యూ గ్రామ ఎల్పీఎం నంబర్ 72లో 4.92 ఎకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన కొందరు ఈ భూమిని కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతేకాదు ప్రశ్నిస్తే కబ్జాదారులు జవాన్ తల్లి, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారు. మూడేళ్లు అవుతున్నా సమస్య అలానే ఉండిపోవడంతో న్యాయం చేయాలని జవాన్ చౌడేష్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దేశం కోసం పాటుపడుతున్న తన ఆస్తులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సజావుగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా సాగుతున్నాయని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 2,911 మంది విద్యార్థులకు గాను 2,466 మంది హాజరయ్యారని తెలిపారు. 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల చీఫ్ అశ్వర్థరెడ్డి ఎనుములపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ నెల 28వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయించారు. కాగా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సాగిన పరీక్షలో అభ్యర్థుల హాజరు 59.50 శాతంగా నమోదైంది. 2,546 మంది హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పేపర్–1 పరీక్షకు కేవలం 1,522 మంది హాజరయ్యారు. 1,024 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,515 మంది హాజరుకాగా 1,031 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు ఎంఎం నాయక్, కలెక్టర్ వి.వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సందర్శించారు. 59.50 శాతం అభ్యర్థుల హాజరు ప్చ్.. అదృష్టం లేదు! యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. ఉదయం 9 తరువాత, మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే కొందరు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సిన కదిరికి చెందిన షర్మిల, కర్నూలుకు చెందిన కిరణ్, అనంతపురం నగరానికి చెందిన స్రవంతి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మరికొన్ని కేంద్రాల్లోనూ ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. -
గ్రంథాలయాలపై పాలకుల నిర్లక్ష్యం
ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. సోమందేపల్లి: ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శిథిల దశకు చేరుకున్న భవనాల మరమ్మతులకు నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఇందులో 23 పాతబడిన, పక్కా భవనాలు, 8 రెంటెండ్ ఫ్రీ భవనాలు, 5 అద్దె భవనాల్లో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. కొన్ని భవనాలు ఇరుకుగా ఉంటుండటంతో పత్రికలు, పుస్తకాలు చదవడానికి పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీల కొరత కారణంగా కొందరు నిల్చునే చదువుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే శిథిలమైన భవనాల గోడలు, పై కప్పులు కూలే ప్రమాదం లేకపోలేదు. కొన్ని చోట్ల గ్రంథాలయాల భవనాల ముందు స్థలాలు ఆక్రమణకు గురవుతుండటంతో పాఠకుల వాహనాల పార్కింగ్కు సమస్య ఏర్పడుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత గ్రంథాలయాలకు సిబ్బంది కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఒకే గ్రంథాలయ అధికారి రెండు మూడు చోట్ల ఇన్చార్జ్లుగా పనిచేస్తున్నారు. తద్వార లైబ్రరీల ద్వారా సరైన విధంగా పాఠకులకు సేవలు అందే పరిస్థితి లేదు. జిల్లాలో దాదాపు 20 చోట్ల గ్రంథాలయ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ కలేనా? ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ లైబ్రరీలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. అయితే శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్క చోట కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయలేదు. ఉన్న గ్రంథాలయాల్లో తగిన పుస్తకాలు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు, తాగునీటి తదితర సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. శిథిల దశకు చేరుకున్న భవనాలు భారీ వర్షాలకు కూలే ప్రమాదం మరమ్మతులకు వేధిస్తున్న నిధుల కొరత -
చిరుత సంచారంతో కలవరం
అగళి: హెచ్డీ హళ్ళి పంచాయతీ గాయత్రి కాలనీ గ్రామ సమీపాన ఫారెస్ట్లో తరచూ చిరుత సంచరిస్తోంది. ఆదివారం రాత్రి కాలనీకి వెళ్లే రోడ్డు పక్కన చిరుతను గమనించి కొందరు వీడియో తీశారు. గొర్రెల మందలపై దాడి చేసి గొర్రెను లాక్కువెళుతుండాగా ప్రజలు కేకలు వేయండంతో వదలి వెళ్లిపోయింది. అయితే రెండు చిరుత పిల్లలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లి చిరుత గ్రామంలోకి ఎప్పుడు వస్తుందోనన్న కలవరం వారిలో మొదలైంది. వ్యవసాయ పనులు, పశువుల, గొర్రెలను మేపడానికి వెళ్లేవారు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని కరిదాసనపల్లి సమీపంలో పెద్దబండలో కూడా ఇదే మాదిరిగా చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు స్పందించి గ్రామాల్లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉదుగూరులోనూ చిరుత అలజడి అమరాపురం: ఉదుగూరులో చిరుత అలజడి రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రామ పొలి మేరలోకి చిరుత వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్కను చంపినట్లు, చిరుత కాలినడకన వెళ్లినట్లు ఆనవాళ్లను గుర్తించారు. రాత్రిపూట పొలాలు, బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకుని అడవుల్లో వదిలేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. పోలీస్ కార్యాలయంలో.... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అందజేయవచ్చని సూచించారు. చిన్నారిని మింగిన కరెంట్ పెనుకొండ: అభం శుభం తెలియని చిన్నారిని కరెంట్ షాక్ బలిగొంది. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకా మళ్లియకరై గ్రామానికి చెందిన అశోక్ పెనుకొండ నగర పంచాయతీ వెంకటాపురం తండా వద్ద ఉన్న రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పక్కనే ఉన్న క్వార్టర్స్లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. ఆదివారం అశోక్ పని నిమిత్తం ఫ్యాక్టరీలోకి వెళ్లాడు. భార్య గాయత్రి బకెట్లో నీళ్లు పెట్టి వాటర్ హీటర్ స్విచ్ వేసింది. కాసేపటి తర్వాత పెద్ద కూతురు సెల్వ మౌలిక (7) అటువైపు వచ్చి బకెట్లోకి చేయి పెట్టగానే విద్యుత్షాక్కు గురైంది. వెంటనే భర్తను పిలిపించి కూతురును పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మౌలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలరించిన సంగీత కచేరీప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఒడిశా బాల వికాస్ చిన్నారులు ఆదివారం సత్యసాయి సన్నిధిలో సంగీత కచేరీ నిర్వహించారు. భక్తి గీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన పాయింట్లు హార్డ్కాపీ ప్రింట్ తీసుకునేలోపు మాయమవుతున్నాయి. పాఠశాల ఒక కేటగిరి కింద ఉంటే...వెబ్సైట్లో మరో కేటగిరీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రీ అపోర్షన్కు గురైన టీచర్లకు స్పెషల్ పాయింట్లు కనిపించడం లేదు. జనరేట్ అయిన స్పౌజ్ ప్రత్యేక పాయింట్లు గల్లంతయ్యాయి. గార్లదిన్నె మండలంలో ఓగణితం టీచరుకు దరఖాస్తు చేసుకున్న రోజు 43.4898 పాయింట్లు చూపించగా రెండోరోజు 43.4713 పాయింట్లు, మూడోరోజు (ఆదివారం) 38.4713 పాయింట్లు చూపిస్తోంది. ఇక సోమవారం (నేడు) ఎన్ని పాయింట్లు కనిపిస్తాయోనని సదరు టీచరు బెంబేలెత్తుతున్నారు. చివరకు కొందరు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసిన ఫారాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ‘టీచర్ల బదిలీ చట్టం–2025’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ టీచర్లకు సమస్యగా మారింది. దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అనంతపురంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న శారదా స్కూల్కు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేదంటూ ఇక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎం దరఖాస్తులు మాయం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసి... హార్డ్కాపీలు ప్రింట్ తీసుకుని అధికారులకు అందజేసి నిర్ధారణ చేసిన తర్వాత కొందరు హెచ్ఎంల పేర్లు తాత్కాలిక సీనియార్టీ జాబితాలో కనిపించలేదు. తాడిపత్రి మండలం చుక్కలూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.సుధాకర్ ఈనెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేశారుు. డౌన్లోడ్ చేసుకుని 22న గుత్తి డీవై ఈఓకు సబ్మిట్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తు అటు డీవైఈఓ లాగిన్లోనూ, ఇటు డీఈఓ లాగిన్లోనూ కనిపించలేదు. ఈలోగా గడువు ముగిసి తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. ఇందులో సుధాకర్ పేరే లేదు. డీఈఓను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కాగా సుధాకర్ రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నాడు. అదే తప్పనిసరి బదిలీ అయి ఉండి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు కనిపించకపోతే పెద్ద సమస్య అయ్యేదని టీచర్లు చెబుతున్నారు. మరో 10 మందిదాకా హెచ్ఎంలు సుధాకర్ లాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. స్కూల్ 3వ కేటగిరీ.. పాయింట్లు ఒకటో కేటగిరీవి.. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం టీచరు బి.రామాంజనేయులు 8 ఏళ్లు పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకున్నాడు. అగ్రహారం జెడ్పీహెచ్ఎస్ 3వ కేటగిరీలో ఉంది. అంటే ఏడాదికి మూడు పాయింట్లు చొప్పున 24 పాయింట్లు రావాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ స్కూల్ కేటగిరీ–1లో ఉన్నట్టు చూపిస్తోంది. కేటగిరీ–1కు ఏడాదికి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మొత్తం 8 పాయింట్లు మాత్రమే చూపిస్తోంది. మూడు రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... ఏ ఒక్కరూ స్పందించడం లేదని వాపోతున్నాడు. టీచర్ల బదిలీ ఆన్లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు మాయమైపోతున్న పాయింట్లు ఉన్న పాయింట్లు చూపని వెబ్సైట్ చివరకు దరఖాస్తులూ కనిపించని వైనం డీఈఓ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయుల ప్రదక్షిణలు తమ చేతుల్లో లేదంటున్న అధికారులు -
జగన్ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం
మడకశిర: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫొటోను చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంటోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్, మడకశిర ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్ రాజు.. జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చాంబర్లోకి దౌర్జన్యంగా వెళ్లి వైఎస్ జగన్ ఫొటోను తొలగించి.. చెత్త రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. మహిళా అనే గౌరవం లేకుండా చాంబర్లోకి అక్రమంగా చొరబడడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేయడమేనని మండిపడ్డారు. వెంటనే పోలీసులు సదరు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక అడుగు ముందుకేసి దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. మడకశిర నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యే వ్యవహార శైలిని గమనిస్తున్నారని తెలిపారు. జెడ్పీ నుంచి నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే కృషి చేయకుండా చైర్పర్సన్ చాంబర్లోకి దౌర్జన్యంగా వెళ్లి రభస సృష్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే తన వ్యవహార శైలి మార్చుకోకపోతే రాజకీయాల్లో కనుమరుగు కావడం ఖాయమని పేర్కొన్నారు. సంక్షేమ పాలనతో వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని గుర్తు చేస్తూ.. ఫొటో తీసేసినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడం మాని నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించాలని ఎంఎస్ రాజుకు ఈరలక్కప్ప సూచించారు. అభివృద్ధి పనులు చేయకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం -
కఠిన చర్యలు తీసుకుంటాం
సాక్షి, పుట్టపర్తి కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లను భారంగా భావిస్తున్నారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే కడతేరుస్తున్నారు. వారసత్వం అంటే కేవలం మగబిడ్డ అనే నమ్మకంలో చాలామంది ఉండటం దౌర్భాగ్యం. దీన్ని ఆసరా చేసుకుని ల్యాబ్ నిర్వాహకులు అధిక ఆదాయం కోసం లింగ నిర్ధారణను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. జిల్లాలో చాలా ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి.. టెక్నీషియన్ల అర్హతలు, బాధితుల నుంచి నమూనాలు సేకరిస్తున్న తీరు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రిపోర్టుల జారీ వంటి అంశాలను పరిశీలించాల్సిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో లింగ నిర్ధారణ యథేచ్ఛగా సాగుతోంది. రెన్యూవల్స్ కోసం కూడా వెళ్లకుండా.. ప్రైవేటు ఆస్పత్రులు ప్రతి ఐదేళ్లకు ఓసారి అనుమతులు రెన్యూవల్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అడిగేవారు లేకపోవడంతో పదేళ్లు అయిన ఆస్పత్రులు కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల్లో చాలామంది ప్రభుత్వ జీతం తీసుకునే వారే కావడం విశేషం. డ్యూటీ సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి.. అక్కడి నుంచి రోగులను తెచ్చుకుని ప్రైవేటుగా వైద్యం చేసి డబ్బులు గుంజుతున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్హతలు మరచి.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే టెక్నీషియన్లు, ల్యాబ్ నిర్వాహకులు చాలామంది అర్హత లేనివారే. వారిచ్చే తెలిసీ తెలియని రిపోర్టు ఆధారంగా రోగులకు డాక్టర్ మందులు (ఔషధాలు) రాసిస్తారు. వాటిని వాడిన తర్వాత రోగులకు కొత్త అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అదే డాక్టర్ వద్దకు వెళ్లినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. అబార్షన్ చేయించుకున్న తర్వాత చాలామంది అనారోగ్యం బారిన పడిన దాఖలాలు ఉన్నాయి. కోడ్ భాష ద్వారా.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసి వివరాలు రహస్యంగా వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కోడ్’ భాష వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆడబిడ్డ అయితే శుక్రవారం, మగబిడ్డ అయితే సోమవారం అనే భాషలో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. అటకెక్కిన పీఎన్డీటీ చట్టం పీఎన్డీటీ (ప్రీ–నాటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్) – చట్టం– 1994ను అటకెక్కించారు. లింగ నిర్ధారణ చేస్తే చట్టం ప్రకారం రూ.50 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి.. జన్యుపరమైన విషయాలను మాత్రమే వెల్లడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ, మగ అనే విషయాలు వెల్లడించరాదు. లింగ నిర్ధారణ చేసే కేంద్రాల గురించి సమాచారం ఎవరు ఇచ్చినా.. వారి పేర్లు గోప్యంగా ఉంచి.. దాడులు చేసి జరిమానాతో పాటు కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం కాసుల కోసం ల్యాబ్ నిర్వాహకుల కక్కుర్తి ఆడపిల్ల అంటే.. ఆలస్యం లేకుండా అబార్షన్! జిల్లాలో 190 ల్యాబ్లకు అనుమతులు ఉన్నాయి. అయితే ఎక్కడా లింగ నిర్ధారణ చేయరాదు. గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసే ఆస్పత్రుల వివరాలు చెబితే తనిఖీలు చేసి కేసుల నమోదుకు సిఫారసు చేస్తాం. లింగ నిర్ధారణ నేరం. ఎవరూ చేయించుకోకూడదు. గర్భం దాల్చిన మహిళ కూడా ముందు ఆడబిడ్డ అనే విషయం గుర్తుంచుకోవాలి. భ్రూణ హత్యలు చేయరాదు. అలాంటి ల్యాబ్లను తప్పకుండా సీజ్ చేస్తాం. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, పుట్టపర్తి -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు. -
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతా అక్రమ ఆదాయమే.. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్మెంట్లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 శ్రీరామ్ ట్యాక్స్ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్స్టేషన్ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గార్మెంట్ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు. భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు హంద్రీ నీవా లైనింగ్ పనులతో రైతులకు తీరని అన్యాయం న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువును విస్మరించిన జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు. చెరువు మట్టిని దోచేస్తున్నారిలా.. అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నివేదిక పంపించాం. – ప్రతాప్రెడ్డి, తహసీల్దార్, యాడికి రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ 24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం -
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్ ఉన్నారు. -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నాసిరకం సాఫ్ట్వేర్తో బెంబేలు ● రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో గడువు ముగుస్తున్నా దరఖాస్తు చేసుకోవడానికి కొందరు ఉపాధ్యాయులకు ఆన్లైన్ ఓపెన్ కావడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్లికేషన్ పూర్తి చేయడానికి పీఈటీలు, ఎల్పీటీలు ప్రయత్నిస్తే సైట్ ఓపెన్ కావడం లేదన్నారు. రిఅపోర్షన్కు ఎఫెక్ట్ అయినవారికి పాత స్టేషన్ పాయింట్స్ ఉపయోగించుకునేలా ఉంచిన ఎస్ బటన్ క్లిక్ చేసినా ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. సబ్మిట్ చేయడానికి వెళ్తే ఎర్రర్ అని వస్తోందన్నారు. డీఈఓ ఏర్పాటు చేసిన సెంటర్కు వెళ్లి గ్రీవెన్స్ ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందన్నారు. లీగలీ సెపరేట్ అయిన మహిళా ఉపాధ్యాయులు, రెండు సార్లు రీ అపోర్షన్కు గురై బదిలీకి దరఖాస్తు చేస్తే ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. నాసిరకం సాఫ్ట్వేర్తో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ● వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి● ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప బుక్కరాయసముద్రం: సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప అన్నారు. ఆదివారం స్థానిక వాల్మీకి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన 2 వేల మంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు చైతన్యకుమార్, పవన్కుమార్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, న్యాయవాది చంద్రశ్చర్ల హరి, కోనయ్య, అక్కులప్ప, సాకే నరేష్, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో ఇద్దరి మృతిశెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక సరిహద్దున శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఏలుకుంట్లలో ఘర్షణ
ధర్మవరం రూరల్: వివాహేతర సంబంధం కారణంగా ధర్మవరం మండలం ఏలుకుంట్లలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓ వర్గానికి చెందిన విజయ్, శ్రీనివాసులు, అప్పస్వామి, లక్ష్మీనారాయణ, మరో వర్గానికి చెందిన బొగ్గు నాగరాజు, దామోదర్, సత్యమయ్య, ఓబుళమ్మకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిరుత దాడితో జింక మృతిఓడీచెరువు: తంగేడుకుంట పంచాయతీ గొల్లవారిపల్లిలో శనివారం సాయంత్రం ఓ చిరుత దాడిలో జింకపిల్ల మృతి చెందింది. వ్యవసాయ బోరు వద్ద పడి ఉన్న సగం జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ రొళ్ల: మండలంలోని కె.బ్యాడిగెర గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం రొళ్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్కుమార్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆదివారం కె.బ్యాడిగెర గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద చింత చెట్టు కింద క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఆరుగురు పట్టుపడ్డారు. వీరి నుంచి రూ.1.02 లక్షల నగదు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రిపోర్టర్ మృతిఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ బోయ నాగరాజు (32) మృతిచెందాడు. బూదగవి గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
ఊరంతా వన్నూరప్ప, వన్నూరమ్మలే..
వన్నూరప్ప అని పిలిస్తే ఆ గ్రామంలో వంద మంది పలుకుతారు. వన్నూరప్ప, వన్నూరమ్మ, వన్నూర్రెడ్డి, వన్నూరక్క ఇలా.. హజరత్ వన్నూరు వలి సాహెబ్ను కొలిచేవారందరూ ఆయన పేరే పెట్టుకున్నారు. 30 ఏళ్లు పైబడిన సుమారు 100 మంది దాకా స్వామి పేరునే పెట్టుకున్నారంటే ఆయన మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది.తాడిమర్రి: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని మరవపల్లిలో వెలసిన హజరత్ వన్నూరు వలి సాహెబ్ (వన్నూరు స్వామి) కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపదలు, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడు. దీంతో గ్రామంలో ఎక్కువ మంది స్వామి పేరు కలసి వచ్చేలా పేర్లను పెట్టుకుంటున్నారు. 200 ఏళ్ల క్రితం వెలసిన వన్నూరు స్వామి ఇప్పుడున్న మరవపల్లి గ్రామంలో 200 ఏళ్ల కిత్రం రెండు, మూడు గుడిసెలు ఉండేవట. ఆ కాలంలో ఇప్పుడున్న ఎం.అగ్రహారం గ్రామం చెరువు పనులు జరుగుతుండగా కడప జిల్లా లింగాల మండలం అంకేన్పల్లికి చెందిన కొందరు ఇక్కడ చెరువు పనులు చేస్తూ గుడిసెల్లో ఉండేవారని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలోనే కణేకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి గుర్రంపై తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్లారట.తిరుగు ప్రయాణంలో గుడిసెల వద్ద ఆగి వేపపుల్లతో పళ్లు తోముకుని పళ్లు తోముకున్న పుల్లను ఓ చోట భూమిపై గుచ్చారని అంటున్నారు. దీంతో అక్కడ వేపమాను మహావృక్షమైందని అంటున్నారు. ఆ మహనీయుడు అక్కడే ఉన్న బావిలో ముఖం కడుక్కొని ఆయన అక్కడే పాదరక్షలు వదిలి వెళ్లిపోయారట. గుడిసెల్లో ఉన్నవారు ఆ వృక్షం వద్ద పూజలు చేస్తూ వచ్చారని, దీంతో గ్రామస్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా వన్నూరుస్వామి కాపాడుతూ వచ్చరని భక్తుల నమ్మకం. స్వామి మహిమలు ఇలా.. సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కలరాతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారట. అలాంటి విపత్కర సమయంలో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని అంటున్నారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావిలో మహిమలు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన అంధురాలు లింగమ్మ జీవితంపై విరక్తితో చనిపోవాలని బావిలోకి దూకిందట. దేవుని మహిమతో ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని చెబుతున్నారు. అలాగే బావి ఒడ్డున ఉన్న అరుగుపై పలువురు పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిని చిన్నపాటి గాయం కూడా కాలేదంటున్నారు. దీంతో బావి రోడ్డు పక్కన ఉన్నప్పటికీ పూడ్చకుండా అలాగే ఉంచారు. నార్పలకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం తన భార్యకు ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చుచేసి ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జబ్బు నయం కాలేదు. చివరకు గ్రామస్తుల ద్వారా స్వామి మహిమ గురించి తెలుసుకుని భార్యాభర్తలు కొన్నాళ్లపాటు ఆలయానికి వచ్చి పూజలు చేసి, అక్కడే నిద్రించారు. దీంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతి గురువారం గ్రామానికి వచ్చి 10, 20 కిలోలు చక్కెర తీసుకొచ్చి స్వామికి చదివించి వెళుతున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. కొంత కాలంగా మరవపల్లికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి చక్కెర చదివించి భక్తులకు పంచి పెడతారు. అలాగే కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను కొట్టి గ్రామస్తులకు పంచుతారు. కందూరి చేసినప్పుడు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఉత్సవ పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం, శుభకార్యాలు జరినప్పుడు గ్రామస్తులు ముందుగా ఆలయంలో చక్కెర చదివించి ప్రారంభిస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు, శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు గ్రామంలో వెలసిన వన్నూరుస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడు. గ్రామంలో ఎవరు, ఎలాంటి శుభకార్యక్రమాలు చేపట్టిన ముందుగా ఆలయంలో దీపాలు వెలిగించి, చక్కెర చదివింపులు చేస్తాం. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి. – సాకే వన్నూరప్ప, మరవపల్లి, తాడిమర్రరోగాలైనా నయం అవుతాయి వన్నూరుస్వామి ఆలయంలో నిద్రచేస్తే ఎలాంటి రోగాలు అయినా నయం అవుతాయి. ప్రపంచాన్ని గడగడ లాండించిన కరోనా కాలంలో ప్రజలు ఎంతో భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాలు కరోనాతో విలవిల లాడాయి. అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా మా గ్రామంలో ఎక్కరికి కూడా కరోనా సోకుండా స్వామి కాపాడారు. – గాండ్లపర్తి కుళ్లాయరెడ్డి, మరవపల్లి, తాడిమర్రి -
అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం
ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి విడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు. విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్ గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వురుగా స్థానిక రైల్వేస్టేషన్లోని 6–7 నంబర్లు ప్లాట్ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్రును బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్లోకి వెళ్లాకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్పై అధికారి అనుమతితో వారిని స్టేషన్లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. ఎలుగు దాడిలో వ్యక్తికి గాయాలు కళ్యాణదుర్గం రూరల్: ఎలుగు బంటి దాడిలో వ్యక్తి గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని మోరేపల్లికి చెందిన బాలరాయుడు తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లిన సమయంలో ఎలుగు బంటి దాడిచేసింది. ఆయన కేకలు వేయటంతో ఎలుగు బంటి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. గాయపడిన బాలరాయుడు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
రేషన్ పంపిణీలో అక్రమాలు సహించం
● జూన్ నుంచి రేషన్ దుకాణాల వద్దే సరుకుల పంపిణీ ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను సహించబోమని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాల శాఖ సీఎస్డీటీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,367 రేషన్ దుకాణాలున్నాయని, ఆయా దుకాణాల పరిధిలోని కార్డుదారులందరికీ రేషన్ సరుకులు పంపిణీ పక్కాగా జరగాలన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్దే నిత్యావసరాలు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుండీ 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద ధరల పట్టిక, సరుకుల నిల్వలను సూచించే బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, జిల్లాలోని పలువురు సీఎస్డీటీలు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో పరిశ్రమల స్థాపన, సోలార్ ప్రాజెక్ట్ భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్ట్కు అవసరమైన భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలో 7,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు 35 వేల ఎకరాలు అవసరం కాగా, మడకశిర ప్రాంతంలో 25 వేల ఎకరాలు గుర్తించామన్నారు. భూసేకరణకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. రైతుల భూములు సేకరించాల్సిన చోట వారికి అవగాహన కల్పించి... అనుమతులను నివేదిక రూపంలో జూన్ 15వ తేదీలోపు సమర్పించాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, శర్మ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, సోలార్ ప్రాజెక్ట్ పీడీ శివశంకర్ నాయుడు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య
ధర్మవరం రూరల్: ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన ఉడతనపల్లి లలిత (56) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో శుక్రవారం ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ సీఐ పి. నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు .. మృతురాలు కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుండేది. షుగర్ వ్యాధి వల్ల ఆమె కుడి కాలు ఇన్ఫెక్షన్ అయి కాలికి ఉన్న రెండు వేళ్లను తొలగించారు. నొప్పిని భరించలేక మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లి చెరువు కట్ట వద్ద ఉన్న శివాలయం సమీపంలో చెరువులోకి దూకి చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు ధర్మవరం రూరల్: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ధర్మవరం పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకొచ్చి బదిలీలు చేస్తోందని, బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఆన్లైన్లో అప్లికేషన్ నమోదుకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సేవలు అన్ని ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రామకృష్ణనాయక్, లతాదేవి, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మేరీ వరకుమారి, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్కు చేరిన కిడ్నాప్ కథ తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త యాసిన్ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్కుమార్రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాషిన్ పోలీసుల ముందు వాపోయారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పుట్టపర్తి టౌన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు సర్వీసులు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ప్లాట్ఫారం, మౌలిక వసతుల కల్పన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరుగుదొడ్ల స్థితగతులు, హోటళ్లు, సమాచార కేంద్రం, రిజర్వేషన్ కౌంటర్ల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు గురించి ప్రయాణికులనే అడిగి తెలుసుకున్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలును కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్టీసీ బస్టాండ్ను స్వచ్ఛతకు చిరునామాగా మార్చాలన్నారు. ఇందుకోసం మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలన్నారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సముదాయంలోని హోటళ్లు దుకాణాల వద్ద చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బస్టాండ్ నుంచి సర్వీసులు బయలుదేరు వేళల వివరాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీపీటీఓ మధుసూదన్, డీఎం ఇనయతుల్లా, ఏఓ ఉషారాణి, అసిస్టెంట్ మేనేజర్ హరితతో పాటు సిబ్బంది ఉన్నారు. యోగాపై అవగాహన పెంపొందించుకోవాలి ప్రశాంతి నిలయం: ప్రతి ఒక్కరూ వయసుతో పని లేకుండా యోగాసనాలపై అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలసి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ప్రతి మనిషి తమ దైనందిన జీవితంలో యోగాకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకొని ఇంటింటికీ వెళ్లి యోగాపై అవగాహన కల్పించాలన్నారు. యోగా డే సందర్భంగా జూన్ 21న జిల్లాలో యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పుట్టపర్తిలో ఆ నెల 28న, కదిరిలో జూన్ 4 , ధర్మవరంలో జూన్ 10, పెనుకొండలో జూన్ 17న యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన -
వివాహిత ఆత్మహత్యాయత్నం
అనంతపురం మెడికల్/కదిరి అర్బన్: కదిరి పట్టణానికి చెందిన యషిక సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. కదిరికి చెందిన లక్ష్మీనారాయణ, శిరీష దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శిరీషకు సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ తదితరులను పోలీసుస్టేషన్కు రావాలని పిలుపుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం యషికకు సీఐ నారాయణరెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో ఆమె స్టేషన్కు వెళ్లింది. అక్కడ సీఐతో పాటు ఎస్ఐ బాబ్జాన్ నానా మాటలు అనడంతో మనస్థాపంతో యషిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తమను వేధిస్తున్నారని, శిరీషతో ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను తన మిత్రుడితో కలసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారని శిరీష కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. శిరీష ఫిర్యాదు మేరకు ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె యషిక, ఆమె భర్త శివ, జగదీష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ, ఎస్ఐలే కారణమంటున్న బాధితురాలు -
● మరువపల్లిలో వంద మందికి పైగా ఆ పేర్లతోనే.. ● గ్రామమంతా వన్నూరుస్వామిని కొలుస్తున్న వైనం ● ఏ శుభ కార్యమైనా ఆలయం వద్ద చక్కెర చదివింపులు
వన్నూరప్ప అని పిలిస్తే ఆ గ్రామంలో వంద మంది పలుకుతారు. వన్నూరప్ప, వన్నూరమ్మ, వన్నూర్రెడ్డి, వన్నూరక్క ఇలా.. హజరత్ వన్నూరు వలి సాహెబ్ను కొలిచేవారందరూ ఆయన పేరే పెట్టుకున్నారు. 30 ఏళ్లు పైబడిన సుమారు 100 మంది దాకా స్వామి పేరునే పెట్టుకున్నారంటే ఆయన మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది.మరవపల్లి గ్రామం వ్యూతాడిమర్రి: మండలంలోని మరవపల్లి గ్రామంలో వెలసిన హజరత్ వన్నూరు వలి సాహెబ్ (వన్నూరు స్వామి) కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మండలంలోని మరవపల్లి గ్రామ ఇలవేల్పుగా స్వామి వెలుగొందుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపదలు, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడు. దీంతో గ్రామంలో ఎక్కువ మంది స్వామి పేరు కలసి వచ్చేలా పేర్లను పెట్టుకుంటున్నారు. 200 ఏళ్ల క్రితం వెలసిన వన్నూరు స్వామి ఇప్పుడున్న మరవపల్లి గ్రామంలో 200 ఏళ్ల కిత్రం రెండు, మూడు గుడిసెలు ఉండేవట. ఆ కాలంలో ఇప్పుడున్న ఎం.అగ్రహారం గ్రామం చెరువు పనులు జరుగుతుండగా కడప జిల్లా లింగాల మండలం అంకేన్పల్లికి చెందిన కొందరు ఇక్కడ చెరువు పనులు చేస్తూ గుడిసెల్లో ఉండేవారని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలోనే కణేకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి గుర్రంపై తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్లారట. తిరుగు ప్రయాణంలో గుడిసెల వద్ద ఆగి వేపపుల్లతో పళ్లు తోముకుని పళ్లు తోముకున్న పుల్లను ఓ చోట భూమిపై గుచ్చారని అంటున్నారు. దీంతో అక్కడ వేపమాను మహావృక్షమైందని అంటున్నారు. ఆ మహనీయుడు అక్కడే ఉన్న బావిలో ముఖం కడుక్కొని ఆయన అక్కడే పాదరక్షలు వదిలి వెళ్లిపోయారట. గుడిసెల్లో ఉన్నవారు ఆ వృక్షం వద్ద పూజలు చేస్తూ వచ్చారని, దీంతో గ్రామస్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా వన్నూరుస్వామి కాపాడుతూ వచ్చరని భక్తుల నమ్మకం. స్వామి మహిమలు ఇలా.. సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కలరాతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారట. అలాంటి విపత్కర సమయంలో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని అంటున్నారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావిలో మహిమలు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన అంధురాలు లింగమ్మ జీవితంపై విరక్తితో చనిపోవాలని బావిలోకి దూకిందట. దేవుని మహిమతో ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని చెబుతున్నారు. అలాగే బావి ఒడ్డున ఉన్న అరుగుపై పలువురు పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిని చిన్నపాటి గాయం కూడా కాలేదంటున్నారు. దీంతో బావి రోడ్డు పక్కన ఉన్నప్పటికీ పూడ్చకుండా అలాగే ఉంచారు. నార్పలకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం తన భార్యకు ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చుచేసి ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జబ్బు నయం కాలేదు. చివరకు గ్రామస్తుల ద్వారా స్వామి మహిమ గురించి తెలుసుకుని భార్యాభర్తలు కొన్నాళ్లపాటు ఆలయానికి వచ్చి పూజలు చేసి, అక్కడే నిద్రించారు. దీంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతి గురువారం గ్రామానికి వచ్చి 10, 20 కిలోలు చక్కెర తీసుకొచ్చి స్వామికి చదివించి వెళుతున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. కొంత కాలంగా మరవపల్లికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి చక్కెర చదివించి భక్తులకు పంచి పెడతారు. అలాగే కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను కొట్టి గ్రామస్తులకు పంచుతారు. కందూరి చేసినప్పుడు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఉత్సవ పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం, శుభకార్యాలు జరినప్పుడు గ్రామస్తులు ముందుగా ఆలయంలో చక్కెర చదివించి ప్రారంభిస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు, శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. -
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈసారి ఈ నెల 26నే తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈ నెల 29 నాటికే ఉమ్మడి ‘అనంత’లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదు కావాల్సి ఉంటుంది. నైరుతి వర్షాలపై గంపెడాశలు ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ కాలంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. సాధారణంగా జూన్ రెండో వారంలోనే జిల్లాకు రుతుపవనాలు అయితే ఈ సారి ఈ నెలాఖరుకే ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తల వెల్లడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ‘ఖరీఫ్’కు నైరుతి ప్రభావంతో వర్షాలు 319.6 మి.మీ సాధారణం కన్నా అధిక వర్షపాతంపై అన్నదాత ఆశలు -
‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చెప్పకూడదు’ అన్నట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు వ్యవహరిస్తున్నారు. వంగివంగి దండాలు పెడితే సరి.. లేకపోతే దండనకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు పంపుతున్నారు. తప్పు చేయకపోయినా కుట్ర చేసి మరీ బదిలీ బహుమాన
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా.. ముక్కుసూటిగా పని చేయడంతో పాటు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. నంద్యాల జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన్ను కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అనంతపురం జెడ్పీ సీఈఓగా బదిలీ చేసింది. డిసెంబర్ 28న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పని చేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. అలాంటి అధికారిని అధికార టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఎలాగైనా జిల్లా దాటించాలని కంకణం కట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో సీఎం ఫొటో సరైన స్థానంలో లేదంటూ రచ్చచేసి... దానికి సీఈఓను బాధ్యున్ని చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. రామచంద్రారెడ్డిపై కక్ష ఎందుకంటే.. వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల పదవులకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) స్థానానికీ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్కడి ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. ‘ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ ఉండదు సర్’ అంటూ అక్కడి అధికారి సమాధానమిచ్చారని తెలిసింది. దీంతో జెడ్పీ సీఈఓ ద్వారా ఎన్నిక వాయిదా వేయించాలనుకున్నా... అందుకు సీఈఓ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జిల్లాలో 15 మంది డిప్యూటీ ఎంపీడీఓ(ఈఓపీఆర్డీలు)లు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు రాగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పదోన్నతిపై మరో ఐదుగురు ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వారికి పోస్టింగ్ వేసే క్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా విజయసింహారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ముందు ఎమ్మెల్యే తనయుడితో పాటు పీఏకూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే కూతురి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఎంపీడీఓకు పోస్టింగ్ ఇచ్చారని ఆగ్రహించి విజయ సింహారెడ్డిని వెనక్కి పంపేశారని సమాచారం. ఈ రెండు అంశాలను మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు.. మడకశిర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ను కలుపుకొని.. సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష గట్టినట్లు స్పష్టమవుతోంది. మహిళా చైర్పర్సన్ చాంబర్లోకి ప్రవేశించి.. బోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజమ్మ వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆమె పదవీకాలం ఇంకా 15 నెలలు ఉంది. బీసీ కులం నుంచి వచ్చిన గిరిజమ్మ తమ అభిమాన నేత, మాజీ సీఎం జగన్ ఫొటోను తన చాంబర్లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా తన చాంబర్లో ఏర్పాటు చేయించారు. అయితే ఈ నెల 21న జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే...ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి తదితరులు జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధి చాంబర్లోకి దూసుకెళ్లి చంద్రబాబు ఫొటో ఎక్కడంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గ్రూప్–1 అధికారి అన్న గౌరవం కూడా లేకుండా అవమానించారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ఫొటోను బలవంతంగా తీయించి, గాంధీజీ ఫొటో స్థానంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టించారు. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కూడబలుక్కొని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. జెడ్పీ సీఈఓపై కోపం చల్లారని ముగ్గురు ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒకే రోజు వ్యవధిలో ఆయన్ను బదిలీ చేయించి తమ పంతం నెగ్గించుకున్నారు. దీన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం తప్పుబడుతున్నారు. నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే.. అది ప్రభుత్వానికే ముప్పుగా పరిణమిస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయాలకు జెడ్పీ సీఈఓను బలిచేయడం దుర్మార్గమంటున్నారు. ఇలాగైతే జిల్లాలో పనిచేసే పరిస్థితులు ఉండవని, ఈ పరిణామాలన్నీ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి బదిలీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సహకరించలేదని అక్కసు ఓ ఎంపీడీఓకు పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే అమిలినేని అసంతృప్తి జెడ్పీ సమావేశానికి వచ్చి చైర్పర్సన్ చాంబర్లో చంద్రబాబు ఫొటో లేదంటూ రగడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... పోస్టింగ్ కూడా ఇవ్వకుండా కసి తీర్చుకున్న వైనం నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటున్న ఉద్యోగులు -
ఆక్రమణల ‘తమ్ముడు’..అడిగేవారే లేరు
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోతోంది. ముఖ్యంగా బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఆ పార్టీ నేతలు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ఇక మోతుకపల్లికి చెందిన టీడీపీ నేత చంద్రమోహన్ ఏకంగా ఆస్తులపై కన్నేసి మరీ ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నాడు. డ్రైన్ను పూడ్చేసి... చదును చేసి హిందూపురం – పరిగి ప్రధాన రహదారి కొడిగేపల్లి పంచాయతీ పరిధిలో చంద్రమోహన్కు పెట్రోల్ బంక్ ఉంది. ఈ బంకు వద్ద డ్రైన్ నిర్మించేందుకు గతంలో అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆపై కూటమి అధికారంలోకి రావడంతో చంద్రమోహన్ రెచ్చిపోయాడు. తాజాగా ఏకంగా పాత డ్రైన్ను పూడ్చి వేసి భూమిని చదును చేయించి రోడ్డునే ఆక్రమించాడు. ఆయనకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండ ఉండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఆయన దుర్మార్గంపై కనీసం నోరు మెదపలేకపోతున్నారు. పురంలో రెచ్చిపోతున్న టీడీపీ నేత చంద్రమోహన్ డ్రైన్ వెయ్యనీయకుండా అడ్డుకుని రోడ్డు ఆక్రమణ -
మడకశిరలో ఎలుగుబంటి హల్చల్
మడకశిర: పట్టణంలో గురువారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. అటుఇటూ తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ ఎలుగుబంటి కనిపించింది. అనంతరం అది సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో అటూ ఇటూ తిరుగుతుండగా... భయపడిన స్థానికులు పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ దాన్ని కొండ ప్రాంతంలోకి తరిమి వేశారు. గతంలో కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల కనిపించాయి. పట్టణానికి ఆనుకుని కొండ ఉండటం, కొండపై ఉన్న ఎలుగుబంట్లు తాగునీరు, ఆహారం కోసం తరచూ పట్టణంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు పట్టణంలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి ● విత్తన ప్రాసెసింగ్ను పరిశీలించిన డీఏఓ సుబ్బారావు ధర్మవరం రూరల్: ఖరీఫ్లో వేరుశనగ సాగుచేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) వైవీ సుబ్బారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు సనావుల్లా, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో కలిసి మండలంలోని విజేత అగ్రిటెక్, సాయి సీడ్స్ విత్తన వేరుశనగ ప్రాసెసింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. మొలకశాతం పరిశీలించిన తర్వాతే విత్తనాలు పంపిణీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో వేరుశనగ కాయలను నిల్వ ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా విత్తన సంచుల తూకాలు, తేమ శాతం తదితర వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ ముస్తఫా, ఏఈఓ అశ్వని, ఏపీ సీడ్స్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీజింగ్ పేరుతో 8 ఏళ్లకే సర్వీస్ పాయింట్లు అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2014లో ఎంపికై న ఉపాధ్యాయులు 2016 జూన్లో జాయిన్ అయ్యారు. వారికి 2024 మే 31 నాటికి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే తప్పనిసరిగా బదిలీ కావాలి. 2024 లో ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు జరపలేదు. దీంతో లాంగ్ స్టాండింగ్ అయినా అదే స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికి వారి సర్వీస్ 9 సంవత్సరాలు పూర్తయింది. అయితే ప్రస్తుత బదిలీల్లో ఫ్రీజింగ్ పేరుతో ఎనిమిది సంవత్సరాలకే పాయింట్లను కేటాయిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని 2014 డీఎస్సీ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. స్టేషన్ పాయింట్ల విషయంలో ఉపాధ్యాయుడు ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలు కేటాయించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జల శివయ్య, ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీ కోసం పెట్టుకొనే అప్లికేషన్లో స్టేషన్ సీనియారిటీ పాయింట్లు, సర్వీస్ సీనియారిటీ పాయింట్లలో పూర్తయిన సంవత్సరాలకు మాత్రమే పాయింట్లు వస్తున్నాయన్నారు. నెలలు, రోజులకు పాయింట్లు రావడం లేదన్నారు. ఫలితంగా టీచర్లు బదిలీల్లో నష్టపోతారన్నారు. ప్రస్తుత స్టేషన్ లో ఎన్ని సంవత్సరాలు పని చేస్తే పూర్తి కాలానికి పాయింట్స్ కేటాయించాలన్నారు. నియామక జాబితాలు లేవట! డీఎస్సీ–2002కు సంబంధించిన టీచర్ల నియామక జాబితాలు డీఈఓ కార్యాలయంలో లేవని చెబుతున్నారని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా నాయకులు వై.ఆదిశేషయ్య, నరసింహారెడ్డి, ఆపస్ నాయకులు ఎర్రిస్వామి మండిపడ్డారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచుకోకపోతే ఎలా? అని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సందేహాల నివృత్తికి డీఎస్సీల వారీగా మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచి అడక్వసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
మహిళను బలిగొన్న కరెంట్ షాక్
మడకశిరరూరల్: దిగువ అచ్చంపల్లికి చెందిన మహిళ పుష్పావతి (36) బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి ఆవరణలో సింగిల్ పేజ్ మోటార్ ఆన్ చేసి సంపు వద్ద నీటిని పట్టుకోవడానికి వెళ్లే సమయంలో పుష్పావతి కరెంట్ షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్షితకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు అమరాపురం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హలుకూరు సమీపంలోని కేజీబీవీ విద్యార్థిని అక్షిత 600కు 586 మార్కులతో రాష్ట్రంలోనే కేజీబీవీల్లో రెండో స్థానంలో నిలిచి ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విద్యార్థినికి అవార్డును అందజేసినట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. మారుమూలన, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థినికి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల మంత్రి ప్రశంసల జల్లు కురిపించారని పేర్కొన్నారు. ఈమె తల్లిదండ్రులు చిత్తయ్య, ఎర్రక్కలు కుందుర్పి మండలం నిజవల్లి గ్రామానికి చెందిన వారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా కేజీబీవీ టీచర్లు, సిబ్బంది అక్షితను అభినందించారు. అదనపు కట్నం వేధింపుౖలపె కేసు హిందూపురం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త సయ్యద్ అతావుల్లాపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం హస్నాబాద్లో నివాసముంటున్న సానియాతో అతావుల్లాకు వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు వరకట్నం తదితర కానుకలను అందజేశారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని అతావుల్లా వేధిస్తుండటంతో భరించలేకపోయిన భార్య వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి, అతావుల్లాను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పటి వరకు 20 రకాల అంశాలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. ఆర్డీటీకి అండగా ఉందామన్నారు. ప్రజానీకానికి ఆర్డీటీ అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు ఆ సంస్థ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడుదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఏడాదిలో మూడు పంటలు పండే పొలాలను సేకరించేందుకు సిద్ధం కాగా రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం హిందూపురం మండలం మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, కొండూరు గ్రామాల్లో భూములు సేకరించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే ఇటీవల కొందరు అధికారులు రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా సర్వేకు సిద్ధమయ్యారు. తమ జీవనాధారమైన భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఆయా గ్రామాల నుంచి వందలాది మంది రైతులు బుధవారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదురుగా బైఠాయించి లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడారు. చంద్రబాబూ.. వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతే... దేశానికి వెన్నముక అంటారని, అలాంటి రైతుల పొలాలను లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను లాక్కుంటే వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి తలెత్తుతుందన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు ఈ భూములు లేకపోతే రోడ్డున పడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సర్వే ఎందుకు మలుగూరు రెవెన్యూ పొలాల్లో రైతులకు తెలియకుండానే భూ సర్వే చేయించడమేమిటి రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. రైతులు గంటల తరబడి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే కార్యాలయంలోనికి వెళ్లారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ కల్పించుకుని తనకు పూర్తి విషయం తెలియదని, అయితే అనుమతి లేకుండా ఎవరి భూములూ సేకరించబోమని తెలిపారు. భూసేకరణ ఏదైనా ఉంటే తప్పక తెలిజేస్తామంటూ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ చిలమత్తూరు ఆఫీసుకు వెళ్లారని, ఆయన వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తారని సమాధానం చెప్పారు. అయితే రైతులు దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించేందుకు తహసీల్దార్ రాగా, తామే కార్యాలయానికి వస్తామని, అప్పుడే సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పుడు ఆయనే కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడం చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదని లేదన్నారు. తహసీల్దార్ ఏమైనా చెప్పాలనుకుంటే ఆయనే, తమ గ్రామానికి రావాలని చెప్పారు. అనంతరం తమ భూములు సేకరించవద్దని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. రైతుల నిరసనకు రైతు సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డి, ఓడీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, సోమకుమార్, రవీంద్రరెడ్డి, పెద్దన్న, వెంకటరెడ్డి, అంజన్రెడ్డి, బీఎస్పీ శ్రీరాములు పాల్గొన్నారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి మూడు గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన రైతులు తమకు తెలియకుండానే భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యవసాయం నుంచి తమను దూరం చేయకండని వేడుకోలుభూ సేకరణను అడ్డుకున్న రైతులు లేపాక్షి: మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను రైతులు బుధవారం అడ్డుకున్నారు. భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను వెనక్కు పంపారు. అనంతరం తమ జీవనాధారమైన భూములను సేకరించవద్దని తహసీల్దార్ సౌజన్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. -
నిరక్షరాస్యులైనా.. పిల్లలను చదివించుకున్నారు
అమడగూరు: అదో కుగ్రామం. అక్కడ నివసిస్తున్న వారంతా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారే. గతంలో ఒకే కుటుంబంలా ఉన్నవారు.. నేడు వంద కుటుంబాల వరకు విస్తరించారు. ఇందులో 90 ఇళ్లకు చెందినవారు గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. అమడగూరు మండలంలో పుట్టగోసులపల్లిగా పిలిచే ఊరు కాల క్రమేణా హరిపురంగా రూపాంతరం చెందింది. అన్ని కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ పిల్లలను కష్టపడి చదివించారు. ఇప్పుడు ఆ గ్రామంలో 15 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. మరో 35 మంది ప్రైవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, మేనేజర్లుగా, సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలో ఉన్న యువతీ యువకులంతా ఉద్యోగాల కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఇంటికో ఉద్యోగమే లక్ష్యంగ్రామంలో 40 మంది యువకులతో పాటు 33 మంది యువతులు ఉండగా.. వారంతా డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యావంతులుగా ఉన్న వారంతా తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే తపనతో అందరూ నూతన గృహాలను నిర్మించుకోవడంతో పాటు చందాల ద్వారా రూ.75 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. జేకే పల్లి పంచాయతీలో మారుమూల గ్రామంగా ఉన్న హరిపురానికి గ్రామస్తులంతా కలసికట్టుగా ఉంటూ కందుకూరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పొగాకుతోపు నుంచి తనకంటిపల్లి మీదుగా తారు రోడ్డు వేయించుకున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో గ్రామంలోని ఇంటికో ఉద్యోగం ఉందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చర్చించు కొంటున్నారు. -
లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా దినోత్సవం
● కలెక్టర్ టీఎస్ చేతన్ లేపాక్షి: జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లేపాక్షిలో యోగా దినోత్సవ ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నంది విగ్రహం, జఠాయువు, వీరభద్రస్వామి దేవాలయ ఆవరణ, ఆర్టీసీ బస్టాండు, నవోదయ విద్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవోదయ విద్యాలయలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి నెలరోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం నుంచి తహసీల్దార్, ప్రిన్సిపాల్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయలో యోగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ చేతన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. యోగా జీవితంలో భాగం కావాలి పుట్టపర్తి టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించే ‘యోగా మంత్’ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్ బుధవారం స్థానిక సాయి ఆరామంలో ప్రారంభించి యోగాసనాలు వేశారు. ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
తాడిమర్రి: నిడిగల్లు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... ధర్మవరానికి చెందిన షబ్బీర్ బుధవారం ఉదయం కారులో ఎరువులు వేసుకుని దాడితోటలో ఓ రైతుకు అందించి తిరిగి ధర్మవరం వెళుతున్నాడు. నిడిగల్లు సమీపంలోని చింతతోపు వద్దకు రాగానే కారు అదపుతప్పి సోలార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి గుంతకల్లు: ఉగ్రవాదాన్ని అంతమొందించేందకు ప్రభుత్వం కృషి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా కోరారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో యాంటీ టెర్రిరిజంపై ఉద్యోగులతో డీఆర్ఎం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పిచ్చితో ఉగ్రవాదులు చేసే దుశ్చర్యలకు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, ఆర్పీఎఫ్లు తదితరులు పాల్గొన్నారు. బాలికపై అత్యాచారయత్నం హిందూపురం: ఆరుబయట ఆడుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు విన్న స్థానికులు గమనించి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ బాలిక ఆడుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి తినుబండారాల ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, బంధువులు గమనించి పరుగున వచ్చారు. వారిని చూసి ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసినా.. వెంటాడి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
21 మండలాల్లో వర్షం
ప్రశాంతి నిలయం: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 21 మండలాల పరిధిలో 306.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గోరంట్ల మండలంలో 48.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రొద్దం మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక నల్లచెరువు మండలంలో 45.2 మి.మీ, ఓబులదేవర చెరువు 44.2, కనగానపల్లి, ఎన్పీకుంట 24.2, సోమందేపల్లి 21.4, అమడగూరు 16.4, పెనుకొండ 14.0, కొత్తచెరువు 12.8, పుట్టపర్తి 10.6, గాండ్లపెంట 9.6, బత్తలపల్లి 8.2, తలుపుల 4.2, కదిరి 4.0, తనకల్లు 3.6, ధర్మవరం, బుక్కపట్నం మండలాల్లో 3.4 మి.మీ, రామగిరి 3.2, చిలమత్తూరు 2.8, చెన్నేకొత్తపల్లి మండలంలో 1.6 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. -
ఉమ్మడి జిల్లాలో చెరువులను పూర్వస్థితికి తేవాలి
అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 507 చెరువులను పూర్వస్థితికి తేవాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణకు కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఐ అండ్ ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ నిధులతో శ్రీ సత్యసాయి జిల్లాలో 411 చెరువులు, అనంతపురం జిల్లాలో 96 చెరువులను పూర్వస్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. చెరువులను గుర్తించి పనులకు సంబంధించి ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీకి పంపించాలన్నారు. ఇప్పటికే 29 చెరువులను గుర్తించారని, మిగిలిన చెరువులను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండమేరు పైభాగాన, మరువ వంక, నడిమి వంక పైభాగన ఉన్న చెరువులను కూడా బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డ్వామా పీడీ సలీంబాషా, భూగర్భ జల శాఖ డీడీ తిప్పేస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, కేంద్ర భూగర్భజల బోర్డు అధికారి స్వరూప్ కళ్యాణ్, కేంద్రీయ జలసంఘం ఏడీ సీహెచ్ సంజీవ్, మైనర్ ఇరిగేషన్ ఈఈ రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు పాల్గొన్నారు. -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
ఫొటోల కోసం పాకులాడటమేంటి?
అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివాటిపై పాలకులు నోరు మొదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
నీట మునిగి వ్యక్తి మృతి
లేపాక్షి: మండలంలోని చోళసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగానిపల్లికి చెందిన శివప్ప(56) నీట మునిగి మృతిచెందాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. శివప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.‘బెట్టింగ్’ అప్పులు తీర్చలేక యువకుడి పరారీబత్తలపల్లి: ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇల్లు విడిచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన చింతపంటి చెన్నారెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి ఆన్లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో బెట్టింగ్కు పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరగడంతో తీర్చలేక ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. బంధువులు, సన్నిహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.విద్యుదాఘాతంతో గేదె మృతిచెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం గేదె మృతి చెందింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఓబుగారి సుబ్బిరెడ్డి పాడి పెంపకంతో కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పచ్చగడి పెరగడంతో మేత కోసం రెండు గేదెలను గ్రామ నడిబొడ్డులో ఉన్న బయలు ప్రాంతానికి వదిలాడు. గేదెలు పచ్చగడ్డిని మేస్తూ ఉండగా అందులో ఒక గేదె సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి ఏర్పాటు చేసిన స్టే వైర్ను తాకింది. స్టేవైర్కు విద్యుత్ ప్రసరించడంతో గేదె షాక్తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఘటనలో రూ.80 వేలు నష్టపోయినట్ల బాధితుడు వాపోయాడు.వ్యక్తిపై కేసు నమోదుగార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
దీక్షిత్.. కొట్టాడు ఐఎఫ్ఎస్
అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. మధ్య తరగతి కుటుంబం.. పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు. ఇంట్లో ఉంటూ చదువుకుని.. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్తో దీక్షిత్కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో ...ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు. కష్టాన్ని మరిపించిన ఫలితం.. యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు. మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటిన అమరాపురం యువకుడు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 30వ ర్యాంకు కై వసం అమ్మానాన్నకు అంకితం ఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్ -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు. డీఎంఈ నరసింహం -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ప్రశాంతి నిలయం: ‘‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలి. ఎంపీడీఓలంతా ఈ కార్యక్రమాలు పర్యవేక్షించాలి. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేది లేదు. కఠిన చర్యలకూ వెనుకాడబోం’’ అంటూ కలెక్టర్ చేతన్ ఎంపీడీఓలను హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ‘నీరు–మీరు’ అనే థీమ్తో నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలు, బహిరంగ ప్రదేశాల్లోని నీటి సేకరణ నిర్మాణాలను శుభ్రపరచడంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి సేకరణను ఉపయోగించుకోవడానికి ఈ మూడు వారాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు, భూగర్భ జల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలన్నారు. లేపాక్షి, హిందూపురం, రొళ్ల, అగళి, నల్లమాడ, తనకల్లు, కొత్తచెరువు మండలాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి పైప్లైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా చెత్త సేకరణ, రవాణాకు ఉపయోగించే పరికరాలు నిరుపయోగంగా ఉండకూడదన్నారు. సమావేశంలో డీపీఓ సమత, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జునప్ప, గ్రామ/వార్డు సచివాలయాల నోడ్ అధికారి సుధాకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి పడేలా పథకాలు అమలు చేయాలి.. సంక్షేమ పథకాలు ప్రజలు సంతృప్తి పడేలా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ మెరుగుదలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయాలన్నారు. అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ‘దీపం’ పథకం కింద గ్యాస్ డెలివరీకి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ స్వచ్ఛతా కార్యక్రమాలతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం -
అధినేతతో రామగిరి ఎంపీటీసీల భేటీ
రామగిరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన రామగిరి మండల ఎంపీటీసీ సభ్యులు మంగళవారం కలిశారు. రామగిరి ఎంపీపీ స్థానాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సాగిస్తున్న కుట్రను భగ్నం చేస్తూ ఎన్నికకు ఎంపీటీసీలందరూ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామగిరి మండలంలో నెలకొన్న పరిస్థితులను వారు వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు సుజాతమ్మ, భారతి, వెంకటలక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, బాలకొండయ్య, సాయిలీల, వైఎస్సార్సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, శంకరయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తులను భారీ ఊరేగింపుతో ఆమిద్యాల గ్రామానికి తరలించారు. ఉదయం ఆలయంలో స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో ఆమిద్యాలకు తరలించారు. ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబుళేసుడి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడ కొలువుదీర్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకేరమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. హుండీ కానుకల లెక్కింపు.. పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ కానుకలు మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి పాండురంగారెడ్డి, దేవదాయ శాఖ పర్యవేక్షణ అదికారులు వన్నూరుస్వామి, కె.రాణి, ఆలయ ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు. 13 రోజులకు గాను కానుకల రూపంలో రూ.15.85 లక్షలు, అన్నదానం హుండీ ద్వారా రూ.8,212 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లుకు చెందిన హనుమాన్ సేవా సమితి, ఉరవకొండ షిర్డీ సాయి ఆలయం, అనంతపురం ఫస్ట్రోడ్డు శివాలయం సేవా సమితి వారు పాల్గొన్నారు. -
‘పల్లె’వించిన కక్ష రాజకీయం
సాక్షి, పుట్టపర్తి: ఆయనో విద్యాధికుడు...కొన్నేళ్ల పాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. కానీ రాజకీయంలోకి దిగాక కొత్త పాఠం నేర్చుకున్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం... ఎదురొస్తే దాడులు చేయించడం ద్వారా తనకు ఎదురేలేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమిలోని జనసేన, బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. ‘ఇది కూటమి ప్రభుత్వం... మేమంతా ఒక్కటే’ అంటూ ఆయా పార్టీల నేతలు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతుండగా... పుట్టపర్తిలో మాత్రం ‘పల్లె’ మిత్రపక్షాల నేతలను టార్గెట్ చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని.. పోలీసులతో రాజకీయం చేస్తూ కేసులు, అరెస్టులు అంటూ బీజేపీ, జనసేత నేతలను నిత్యం వేధిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తమపైనే దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. బీజేపీ నేతలపై కక్ష సాధింపు.. పెనుకొండ సమీపంలోని ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద గతంలో తన అనుచరులు, స్నేహితులను కలుపుకుని వందల ఎకరాల భూమి కొన్నారు. ఆ తర్వాత విలువ ఆధారంగా పంపకాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వాటాల్లో తేడా కారణంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డం తిరిగినట్లు ఆరోపణలున్నాయి. కొందరు అల్లరిమూకలను రెచ్చగొట్టి.. పదే పదే రోడ్లు ధ్వంసం చేయించడం.. బీజేపీ నేత ఆదినారాయణయాదవ్పై కేసు నమోదు చేయించడం పనిగా పెట్టుకున్నాడు. సుమారు రూ.80 కోట్లు విలువ చేసే భూమిని పల్లె రఘునాథరెడ్డి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆదియాదవ్ ఆరోపిస్తున్నారు. గత ఆర్నెల్లుగా ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన నేతను చితకబాదించి.. అమడగూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు పసుపులేటి రమేష్పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కక్షగట్టారు. ‘పల్లె’ అవినీతికి సంబంధించిన సమాచారం మొత్తం తన వద్ద ఉందని రమేష్ చెప్పడంతో.. పల్లె భయపడిపోయినట్లు సమాచారం. అవన్నీ ఎక్కడ దాచారో చెప్పేవరకు చితకబాదాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై గతంలో పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలను పసుపులేటి రమేష్ ఖండించినందుకే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అక్కడి నుంచి రమేష్పై కక్ష సాధింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్పై బయటికి వచ్చిన రమేష్ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్టు చూపలేదు. దీంతో అతని తండ్రి ‘నా కొడుకు ఆచూకీ తెలపండి స్వామీ, నా కొడుకు ఏమైపోయాడో అని అన్నహారాలు మాని ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆవేదన చెందుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత్రికేయులకూ బెదిరింపులు.. తన అవినీతి బాగోతాలన్నీ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులపైనా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొందరు అల్లరి మూకలతో భౌతికదాడి చేయించేందుకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ పత్రికా ప్రతినిధిపై కక్ష గట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ‘పల్లె’ కనుసన్నల్లోనే పోలీసులు.. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందనే విమర్శలున్నాయి. ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారు. ఎలాంటి కేసయినా సరే తనకు చెప్పిన తర్వాతే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తనమాట వినని ఓ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పుట్టపర్తిలో బీజేపీ, జనసేన నేతలను టార్గెట్ చేసిన ‘పల్లె’ ఎదురొస్తే తాట తీయిస్తానంటూ బెదిరింపులు ఇప్పటికే బీజేపీ నేత ఆదియాదవ్కు ఇబ్బందులు తాజాగా జనసేన నేత పసుపులేటి రమేశ్ అరెస్టు మాజీ మంత్రి దెబ్బకు అల్లాడిపోతున్న కూటమి నేతలు -
కేబుల్ దొంగల అరెస్టు
పావగడ: తిరుమణి సోలార్ పార్క్కు చెందిన వళ్లూరు గ్రామం అవధా సోలార్ ప్లాంట్లో కేబుల్ అపహరించిన దొంగలు పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ గిరీశ్ వివరాల మేరకు.. జనవరి 20న రాత్రి అవధా సోలార్ కంపెనీ సోలార్ ప్యానల్కు ఏర్పాటు చేసిన సుమారు రూ .2 లక్షల విలువ చేసే సుమారు 2,500 మీటర్ల డీసీ కేబుల్ వైరు చోరీకి గురైందన్నారు. దొంగతనానికి పాల్పడ్డ పావగడ పట్టణంలోని ఆఫ్ బండ ప్రాంతానికి చెందిన చోరులు మల్లేష్ అలియాస్ మల్లికార్జున, బాబు అలియాస్ బాబురావ్, మంజ అలియాస్ అణ్ణప్పలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి డీసీ కేబుల్తో దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నాగరాజును త్వరలో పట్టుకుంటామన్నారు. -
‘సూర్యఘర్’తో విద్యుత్ బిల్లు ఆదా
పుట్టపర్తి టౌన్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు ఆదా అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సాయిఆరామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం సోలార్ విద్యుత్ స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు కరెంట్ ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకొని విద్యుత్పొదుపుతో పాటు బిల్లులు కూడా తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యుత్ శాఖ డీఈలు శివరాములు, మోసస్పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగం ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది. టీచర్ల బదిలీలకు వేళాయె ● నేటి నుంచి హెచ్ఎంల బదిలీలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్హెచ్ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. హెచ్ఎం పోస్టులు 178 ఖాలీలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో రెండేళ్లు పూర్తయిండాలి) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశంఅనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి మంగళవారం సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. -
డ్రైప్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని రెండో రోజు డ్రైప్రూట్స్తో అలంకరించారు. సోమవారం వేకువజామునే ఆలయంలో మూలవిరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మంటపంలో కొలువుదీర్చి తమలపాకులతో లక్షార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. సజావుగా సప్లమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలి రోజు తెలుగు పరీక్ష సజావుగా జరిగినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 1,554 మంది పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా 1,135 మంది హాజరయ్యారన్నారు. నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్ అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్నాయక్ కోసం గాలిస్తున్నారు. -
ఉన్నతాధికారులు వేధిస్తున్నారు
పుట్టపర్తి టౌన్: పైస్థాయి ఉద్యోగుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కన్నీటి పర్యంతమైంది. వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నను కలసి విన్నవించుకుంది. వివరాలు... లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన ప్రభావతి హిందూపురంలోని ఆర్టీసీ డిపోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అదే డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు డి.వి.నారాయణ, భరత్కుమార్రెడ్డి, జీవీ రమణ తరచూ ఆమెను లైగింక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. వారి కోరిక తీర్చకపోవడంతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెట్టసాగారు. ఈ విషయంపై గతంలో హిందూపురం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. విచారణ పేరుతో కాలయాపన చేసిన పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. చివరకు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తనను కాపాడాలంటూ బాధితురాలు సోమవారం ఎస్పీని కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే హిందూపురం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి.. బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ సురేస్ పాల్గొన్నారు. న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేడుకోలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి వినతి -
అన్నదాతలకు వ్యథ
వ్యవసాయం భారం తలుపుల: వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతులపై పెట్టుబడుల భారం పెరిగిపోతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పొలం పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న నీతి అయోగ్ ఆలోచన ఎనిమిదేండ్లు అవుతున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేక పోతోంది. దీంతో కూలీల కొరత కారణంగా పంటల సాగు వ్యయం పెరిగి.. వ్యవసాయం భారమవుతోంది. కూలీల కొరత తీవ్రం.. కూలీలు ఎక్కువగా ఉపాధి పనులకు పోతుండడంతో వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,69,152 హెక్టార్లలో సాగు భూమి ఉండగా... వేరుశనగ, వరి, మొక్కజొన్న, మిరప,బొప్పాయి, కర్బూజా, టమాటా తదితర పంటలు సాగుచేస్తున్నారు. సాధారణగా ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు ఎకరాకు రూ.25 వేలు ఖర్చు అవుతుంది. అలాగే మొక్కజొన్న, మిరప, వేరుశనగ తదితర పంటలకూ అంతే మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే వారికి భోజనంతో పాటు రోజుకి ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తామన్నా.. కూలీలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనుల వైపే కూలీలు మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనాలూ చేకూరుతాయని మేధావులు అంటున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రైతులూ కోరుతున్నారు. జిల్లా సమాచారం... జిల్లాలో సాగుభూముల విస్తీర్ణం : 2,69,152 హెక్టార్లు ప్రధానంగా సాగు చేసే పంటలు : వేరుశనగ, వరి, మామిడి, ఉలవ, టమాట తదితర పంటలు ఉపాధి కూలీల సంఖ్య : 55,857 -
వైభవంగా వసంతోత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీవారు పదోరోజు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహా మంగళహారతి తదితర పూజలు చేశారు. ఉదయం ఆలయం వద్ద నుంచి లక్ష్మీబజారు వరకు వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. విశ్వ హిందూ పరిషత్, రజక సంఘం, హరిజన, మాల, హట్కారి కెత్తర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మయూర వాహన సేవ కొనసాగింది. చివరి రోజు మంగళవారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
కోల్డ్స్టోరేజ్లో కుళ్లిన బ్యాడిగ మిర్చి
కూడేరు: కర్ణాటక రాష్ట్రం బ్యాడిగికి చెందిన కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతు మల్లికార్జున నష్టపోయాడు. ఇప్పేరుకు చెందిన రైతు మల్లికార్జున సోమవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఎకరాల్లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి బ్యాడిగ మిర్చి సాగు చేశానన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఏప్రిల్ నెలలో బ్యాడిగిలో కోల్డ్ స్టోరేజ్లో 60 క్వింటాళ్ల మిర్చిని నిల్వ ఉంచానన్నాడు. క్వింటా రూ.15 వేలు వరకు ధర ఉండడంతో రెండు రోజులు క్రితం కోల్డ్ స్టోరేజ్కు వెళ్లి విక్రయించేందుకు వెళ్తే నిల్వ ఉంచిన మిర్చి కుళ్లిపోయిందన్నారు. సరుకు నాణ్యతగా లేకపోవడంతో క్వింటా రూ.4 వేలుతో వ్యాపారులు అడుగుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.9 లక్షలు వరకు వచ్చేదని, కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోయాడు. -
కోర్టు తీర్పును అమలు చేయండి
● మత్స్యకార సహకార సంఘం సభ్యుల వినతి పుట్టపర్తి అర్బన్: కోర్టు తీర్పును అమలు చేసి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీని వెంగళమ్మచెరువు మత్స్యకార సహకార సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు కోర్టు తీర్పు నకళ్లను సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వేర్వేరుగా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నను కలసి అందజేసి, మాట్లాడారు. సంఘంలో మొత్తం 41 మంది సభ్యులు ఉండగా తమ గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టనీయకుండా టీడీపీకి చెందిన సభ్యులు అడ్డుకున్నారని, దీంతో కేవలం 25 మంది మాత్రమే చేపలను పడుతూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా మత్స్యకార సహకార సంఘం అధికారులకు, పుట్టపర్తి రూరల్ పోలీసులకు విన్నవించినా తమకు న్యాయం జరగలేదన్నారు. వదిలిన చేపలను పట్టుకోనీయకుండా అడ్డుకోవడంతో మిగిలిన 16 మంది సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో చేపలు పట్టేందుకు హక్కు కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాల ప్రహరీ కూల్చివేత గోరంట్ల: స్థానిక ఆస్పత్రిలో సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీని టీడీపీ మద్దతుదారులు శివప్ప, బాలచందర్ ఆదివారం జేసీబీలను ఏర్పాటు చేసి కూల్చివేశారు. పాఠశాల ఎదుట శివప్ప, బాలచందర్ పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో తమ సొంత స్థలంలో ప్రహరీ నిర్మించారంటూ దాదాపు 50 మీటర్లకు పైగా గోడను నేలమట్టంచేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తహసీల్దార్ మారుతీ ప్రసాద్ను వివరణ కోరగా... పట్టా స్థలంలో కొంత మేర ఆక్రమించి పాఠశాల ప్రహరీ నిర్మించారని, దీనిని తొలగించాలని ఇటీవల కలెక్టర్కు గ్రీవెన్స్లో బాలచందర్ ఫిర్యాదు చేశారన్నారు. సర్వే చేసిన తర్వాత పాఠశాల హద్దు మేరకు నూతనంగా ప్రహరీ నిర్మించిన తర్వాత పాత గోడను తొలగించి ఇస్తామని ఫిర్యాదుదారుకు తెలిపామన్నారు. ఈ లోపు శివప్ప, బాలచందర్ ఏకంగా 50 మీటర్ల ప్రహరీని తొలగించారని, దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి బలవన్మరణం గోరంట్ల: మండలంలోని బూచేపల్లికి చెందిన చరణ్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం సొంతూరిలోనే వివాహం చేసుకున్న చరణ్... కుటుంబకలహాలతో విసుగు చెంది ఆదివారం రాత్రి పొద్దుయిన తర్వాత గ్రామంలోని నీటి ట్యాంక్ సమీపంలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, చరణ్ గతంలో వలంటీర్గా బూచేపల్లి గ్రామంలో పనిచేశారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి వృద్ధురాలు.. హిందూపురం: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆంజినమ్మ(69) సోమవారం సాయంత్రం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ లభ్యం ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని కురుబ కల్యాణమంటపం వెనుక ఉన్న పట్టాలపై ఆదివారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడిని ధర్మవరంలోని సిద్దయ్యగుట్టకు చెందిన శ్రీనివాసులు (63)గా గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ ఎర్రిస్వామి సోమవారం వెల్లడించారు. బార్బర్ వృత్తితో జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా తరచూ అనారోగ్యం వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయిందన్నారు. మృతుడి భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రెటరీగా కదిరి నియోజకవర్గానికి చెందిన పూల ప్రవీణ్కుమార్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రెటరీగా హిందూపురం నియోజక వర్గానికి చెందిన అక్కంపల్లి నాగేంద్రకుమార్ను నియమించారు. పాఠశాలపై కూలిన చెట్టు సోమందేపల్లి: మండలంలోని వెలిదడకల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలపై చెట్టు కూలింది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో పాటు గాలులు బలంగా వీచడంతో చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు పడడంతో పాఠశాల భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు.