Sri Sathya Sai
-
కందికుంట పేరుతో కే–ట్యాక్స్
ప్రశాంతి నిలయం: ‘‘కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది. కే–ట్యాక్స్ పేరుతో కందికుంట ట్యాక్స్ను అధికారులే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్దన్రెడ్డి, జనసేన కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్, న్యాయవాది, టీడీపీ నాయకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులే ఫీజులతో పాటు కే–ట్యాక్స్ అనే కోడ్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా ఉన్నత స్థాయి సిబ్బంది, దళారీల సహకారంతో భవనాల మార్కెట్ విలువలు తగ్గించి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిషేధించిన, వివాదాస్పద భూములను నిబంధనలు ఉల్లంఘించి అధికారులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రతి నెలా రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. రైతులు, చిరువ్యాపారుల ఫైళ్లు మాత్రం పెండింగ్లో పెట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. సుమారు రూ.20 కోట్ల కుంభకోణం జరిగినట్లు చెప్పారు. సిబ్బంది ఫోన్ కాల్ డేటా, వారి వ్యక్తి గత ఆస్తులు, వారి బినామీల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. గత కొద్ది నెలలుగా కే–ట్యాక్స్తో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం అందరికీ తెలుసన్నారు. గతంలో పని చేసిన కొంతమంది అధికారులు కందికుంట మోచేతి నీళ్లు తాగి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపారన్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూలు చేస్తున్నారు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు -
వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు, పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94412 38182కు సమాచారం ఇవ్వాలని హిందూపురం రైల్వే పోలీసులు కోరారు. ఊజీ మాత్రలు మింగి వ్యక్తి.. బత్తలపల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన సాకే వెంకటప్ప(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంట్లో కుమారుడితో గొడవ పడి ధర్మవరం వెళ్లాడు. తిరిగి వస్తూ మల్లేనిపల్లి వద్ద ఊజీ మాత్రలు మింగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావ నరసింహుడుకు ఫోన్ చేసి తెలిపాడు. ఆయన సంఘటనాస్థలానికి చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకటప్పను బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడేశ్వరితో ఇద్దరు కుమారులు ఉన్నారు. బావిలో దూకి... ముదిగుబ్బ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన షెక్షావలి (40)కు భార్య నసీమా, ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్లుగా ఆమె వేరు కాపురం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ముదిగుబ్బలోని బంధువులను కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ముదిగుబ్బ శివారున ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై..? పావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని రొప్పం గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు జయ ప్రకాష్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమే ఇందుకు కారణంగా తెలిసింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. -
మండే ఎండ.. మంటలతో జాగ్రత్త!
పుట్టపర్తి టౌన్: భానుడి భగభగలతో జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం రామగిరిలో ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాలకూ అస్కారం ఎక్కువగా ఉంటోంది. అగ్ని ప్రమాదాల బారి నుంచి తమతోపాటు చుట్టుప్రక్కల వారినీ కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక శాఖ ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి ఈనెల 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది. జిల్లాలో ఆరు అగ్నిమాపక కార్యాలయాలు.. జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర తదితర ప్రాంతాల్లో ఆరు అగ్ని మాపక శాఖ కార్యాలయాలున్నాయి. మొత్తంగా ఆరుగురు ఫైర్ ఆఫీసర్లతో పాటు 115 మంది ఫైర్ ఫైటర్లు, 24మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజురోజుకూ ఎండలు ముదిరిపోతున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడ్డివాములు, ఉద్యాన పంటలు, అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉన్నా... కొన్ని సమయాల్లో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అగ్ని మాపకశాఖ కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకోవడంతోపాటు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను అవగాహన కల్పిస్తోంది. పాటించాల్సిన నియమాలు.. చిన్న పిల్లల దగ్గర అగ్గిపెట్టెలు, లైటర్లు టపాకాయలు వంటి వాటిని ఉంచకూడదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు అగ్గిపుల్లలు ఆర్పకుండా పాడేయకూడదు. ఐఎస్ఐ మార్క్ ఎలక్ట్రానిక్ పరికరాలే ఉపయోగించాలి. ఊళ్లకు వెళ్లే సమయంలో ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఉత్తమం. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆర్పడానికి నీటిని సిద్ధంగా ఉంచాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి. గోడౌన్లలో వస్తువులు స్టాక్ ఉంచేటప్పుడు వస్తువుల మధ్య ఖాళీ ప్రదేశం వదలాలి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రదేశాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని ఉపయోగించకూడదు. మంటలను ఆర్పేందుకు పొడి ఇసుకను మాత్రమే వాడాలి. పెట్రోల్, గ్యాస్ నింపుకునేందుకు వెళ్లినప్పుడు వాహనాల ఇంజన్లను ఆఫ్ చేయాలి. పెట్రోలు బంకుల్లో సెల్ఫోన్లు వాడకూడదు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.. మంగళవాం నుంచి 20 తేదీ వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు అమరవీరులకు నివాళి, 15న అగ్ని ప్రమాదాలపై బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు, 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్ గోడౌన్లు, ఆయిల్ ఫార్మ్లు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటుు. 20న అన్ని వర్క్షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అవగాహనతోనే అగ్ని ప్రమాదాలకు చెక్ అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు గత ఏడాది అగ్నిప్రమాదాలు ఇలా.. ప్రమాదాలు 376 ఆస్తి నష్టం రూ. 4,92,11,746కాపాడిన సొమ్ము రూ.14,97,21,000 సిద్ధంగా ఉన్నాం జిల్లాలో ఎలాంటి ప్రమాదం, విపత్తు సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితోనే ప్రమాద సమయంలో వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు వెంటనే మాకు సమాచారం ఇస్తే నష్టం జరగకుండా చూస్తాం. అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తాం. – మాధవ నాయుడు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి -
‘పరాఖ్’ సర్వేను విజయవంతం చేయండి
పుట్టపర్తి: ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పరాఖ్ సర్వేను విజయవంతం చేయాలని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. సోమవారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుక్కపట్నం డైట్ కళాశాలలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. మూడో తరగతి విద్యార్థులకు ఫండమెంటల్ లెర్నింగ్ స్టడీ సర్వే జరుగుతోందని, ఇందులో భాగంగా ఎంపిక చేసిన 18 పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసనా స్థాయిలను అంచనా వేస్తారన్నారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరించే డైట్ విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లి టెస్ట్ నిర్వహించాలన్నారు. విద్యాధికారులు సీఆర్పీలను సమన్వయం చేసుకొని 16, 17, 18 తేదీల్లో సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ గోపాల్, మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, సూపరింటెండెంట్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ వైష్ణవి కదిరి అర్బన్: తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కదిరికి చెందిన చల్లా ధనుంజయ, చల్లా ధనలక్ష్మీ దంపతుల కుమార్తె చల్లా వైష్ణవి (ఎంపీసీ ఈటీ ఒకేషనల్ విభాగం) స్టేట్ ఫస్ట్ స్థానాన్ని కై వసం చేసుకుంది. వైష్ణవి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఈటీ)లో 500 మార్కులగాను 498 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచింది. తండ్రి ధనుంజయ బస్ మెకానిక్గా పని చేస్తున్నారు. రావులచెరువు వీఆర్ఏపై దాడి ధర్మవరం రూరల్: పాతకక్షల నేపథ్యంలో మండల పరిధిలోని రావులచెరువు వీఆర్ఏ శివానందపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఓ విషయమై మూడు నెలల క్రితం వీఆర్ఏ శివానందతో గ్రామానికి చెందిన కొందరు ఘర్షణ పడ్డారు. ఆరోజు మాటామాటా అనుకున్నారు. దీన్ని వారు మనసులో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో వీఆర్ఏ శివానంద ఇంటి వద్ద ఉండగా... అక్కడికి వచ్చిన మేకల ఉపేంద్ర, మేకల లక్ష్మయ్య, మేకల నరసమ్మ, మేకల కుమార్ కట్టెలు, రాళ్లతో అతనిపై దాడి చేశారు. గాయపడిన శివానందను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు నెలల క్రితం జరిగిన ఘర్షణే దాడికి దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
25 నుంచి సమ్మెలోకి తాగునీటి పథకం కార్మికులు
పుట్టపర్తి: బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు పథకం నిర్వహణకు సరైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుడు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా ఈ నెల 25నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జేసీ మౌర్యభరద్వాజ్ను కలిసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. జిల్లాలో 550 మంది కార్మికులు జిల్లాలోని 15 లక్షల మంది జనాభాకు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. గతంలోనూ సమ్మె చేస్తేనే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. దీంతో నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. తాగునీటి పథకం నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 నెలలకు సరిపడే నిధులు మాత్రమే కేటాయించడం సమంజసంగా లేదన్నారు. వాటర్ ప్రాజెక్టును జిల్లా పరిషత్ పరిధిలో విలీనం చేసి తమకు ఉపాధి భద్రత లేకుండా చేయడానికి సిద్ధమవుతున్నారని, ఇదే కనుక జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి తలుపుల: మండలంలోని కుటాగుళ్లకు చెందిన నరసింహులు (35) వడదెబ్బతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటాగుళ్లకు చెందిన చెన్నమ్మ ఉడమలకుర్తి వద్ద మామిడి తోట తీసుకుని అక్కడే ఉంటోంది. ఆమెకు నలుగురు సంతానం కాగా, చిన్న కుమారుడు నరసింహులు ఈ నెల 11వ తేదీన తల్లి చెన్నమ్మ వద్దకు వచ్చాడు. 12వ తేదీ ఆదివారం ఉదయం కుటాగుళ్లకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. నడుచుకుంటూ వస్తున్న అతను ఎండ దెబ్బకు తాళలేకపోయాడు. వడదెబ్బకు గురై ఓదులపల్లి వద్ద కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ గుర్రప్ప ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
పరిష్కార వేదికకు 80 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. ప్రాణాలు బలిగొన్న ఫిట్స్ తాడిపత్రి రూరల్: మూర్చ వ్యాధి ఒకరి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శివశంకర్ కుమారుడు మోహన్కుమార్ (25) తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన స్నేహితుడు మధుతో కలసి పనుల కోసమని ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళుతుండగా తేళ్లమిట్టపల్లి వద్దకు చేరుకోగానే బైక్ నడుపుతున్న మోహన్కుమార్కు ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మోహన్కుమార్ అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘చిలకం’తో నాకు ప్రాణహాని
పుట్టపర్తి టౌన్: తనకు, తన కుటుంబీకులకు రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మవరానికి చెందిన ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్కుమార్ను కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఎస్పీ సతీష్కుమార్కు ఓబుళరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయ ఆవరణలో కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనను గ్రామం నుంచి తరిమివేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 11వ తేదీన చిలకం మధుసూదన్రెడ్డి ఓ ప్లాన్ వేశారన్నారు. అందులో భాగంగా తన పేరు (ఓబుళరెడ్డి)తో సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి ఇష్టానుసారం పోస్టులు చేశారన్నారు. వాటి ఆధారంగా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించారన్నారు. దీంతో పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేసి కేసు నమోదు చేసి జైలుకు తరలించారన్నారు. ప్రస్తుతం తాను బెయిల్పై బయటకు వచ్చానని, అయినా అధికారం అండతో చిలకం తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఓర్వలేకే అక్రమ కేసులు.. ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కూటమి పార్టీల నేతలు వైఎస్సార్ సీసీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికి ఎక్కడ కోల్పోతామేమోనన్న భయంతో చిలకం మధుసూదన్రెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కేసులతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అశోక్, కేశవరెడ్డి, శివారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్రెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన ఓబుళరెడ్డి -
పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలి
ప్రశాంతి నిలయం: ‘‘వరుణుడు కరుణించలేదు..పట్టించుకోవాల్సిన పాలకులూ ఇక్కడి నీటిని హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేసి మరీ కుప్పానికి తరలించారు. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయి రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. నాడు కళకళలాడిన పొలాలన్నీ నేడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కోరారు. సోమవారం రైతులతో కలిసి పుట్టపర్తికి వచ్చిన ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో 65 కిలోమీటర్లు కాలువ తవ్వించి నీటిని విడుదల చేసి పేరూరు డ్యాంను కళకళలాడించామన్నారు. కానీ ప్రస్తుత పాలకులు డ్యాంకు నీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత వల్లే రైతులకు అన్యాయం.. రాప్తాడు కరువు పరిస్థితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణమని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో తాము రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే.. నేడు సాగునీరు లేక బీడు భూములు కనిపిస్తున్నాయన్నారు. సాగునీటి సమస్యతో పంటలు సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తే కనీసం రెండు పంటలను సాగు చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా... రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాము పాపంపేటకు నీళ్లివ్వాలని ప్రయత్నించినప్పుడు ఇళ్లను కూల్చివేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా... పేరూరు డ్యాంకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేసి నీటిని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించారన్నారు. దీంతో గతంలో వంద అడుగుల లోతులోనే బోర్లలో నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 400 అడుగులు వేసినా నీరు రావడం లేదన్నారు. 2018లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేసినప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.170 కోట్లు పనులకు బిల్లులు చేశామన్నారు. అయితే ఒక్క పనీ చేయకుండా పేరూరు డ్యాంకు పరిటాల రవి పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగంపేట గోపాల్రెడ్డి, మజ్జిగ శంకరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, రామగిరి, కనగానపల్లి జెడ్పీటీసీలు నాగార్జున, మారుతి, పెద్దిరెడ్డి, చంద్రకుమార్, మీనుగ నాగరాజు, రాజేష్, నాగముని, తలమర్ల సంజీవరెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ రైతులతో కలిసి జేసీకి వినతి పత్రం అందజేత -
మామూళ్లిచ్చినా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు
తహసీల్దార్లపై కలెక్టర్ సీరియస్ ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్లపై కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ముదిగుబ్బ, కదిరి, బుక్కపట్నం తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్జీలన్నీ పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 30 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో ధర్మవరం, కదిరి, కొత్తచెరువు మండలాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రశాంతి నిలయం: ‘‘విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించే మొత్తం కాకుండా మామూళ్ల కింద విద్యుత్ శాఖ ఏఈకి అదనంగా రూ.40 వేలు ఇచ్చినా...ట్రాన్స్ఫార్మర్ ఇవ్వక పోగా, రూ.24 వేలకే బిల్లులు ఇచ్చాడు. అయినా ట్రాన్స్ఫార్మర్ నేటికీ మంజూరు చేయలేదు’’ అని రొద్దం మండలం రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన రైతులు నరేష్, మాల అంజినప్ప, వడ్డ్డే గోపాల్, నాగరత్నమ్మ, సుబ్బరాయుడు తదితరులు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం జెడ్పీటీసీ అక్కులప్పతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వారు విద్యుత్శాఖ ఏఈపై ఫిర్యాదు చేశారు. బోర్లకు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీరి నుంచి అర్జీ స్వీకరించిన జేసీ... విచారించి న్యాయం చేస్తానన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 131 అర్జీలు అందాయి. జేసీ మౌర్యభరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ శ్రీకర్, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యకమ్రం అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్.. ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో వందకు పైగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్కు సంబంధించి వేర్వేరుగా అర్జీలు స్వీకరించారు. ఇందులో పలువురికి అడంగల్ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, శర్మ, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ట్రైసైకిల్ పంపిణీ.. ‘పరిష్కార వేదిక’కు వచ్చిన గోరంట్లకు చెందిన హుస్సేన్ పీరాకు జేసీ మౌర్య భరద్వాజ్ ట్రైసైకిల్ను పంపిణీ చేశారు. ఆయన ఇదివరకే ట్రై సైకిల్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈపై జాయింట్ కలెక్టర్కు రైతుల ఫిర్యాదు ‘పరిష్కార వేదిక’కు 131 అర్జీలు -
గోల్షాట్ బాల్ విజేతలుగా తిరుపతి, గుంటూరు
కదిరి అర్బన్: మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జరిగిన 4వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలుర, బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ గోల్షాట్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతి, గుంటూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో తిరుపతి జట్టు, ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో గుంటూరు జట్టు, ద్వితీయ స్థానం శ్రీసత్యసాయి జట్టు, తృతీయస్థానం విశాఖపట్నం జట్లు నిలిచాయి. విజేతలకు ఎంఈఓ చెన్నక్రిష్ణ ట్రోఫీలు, ప్రశంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోల్షాట్ బాల్ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దేవిప్రియా, ప్రతినిధులు ప్రసన్నకుమార్, రామాంజులురెడ్డి, జగదీష్, డేనియల్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు హ్యాండ్ బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, మహేష్ తెలిపారు. జిల్లా జట్లు 18, 19వ తేదీల్లో నెల్లురులో జరిగే 5వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు దానమయ్య, పీడీ యశోదలు పాల్గొన్నారు. సీనియర్ పురుషుల జట్టు డేనియర్, భరత్, యాసిర్, సిద్ధికీ, సాధిక్, సాయికుమార్, విశ్వనాథ్, కుమార్, నారాయణ, వరుణ్తేజ్, మోహిత్రెడ్డి, అరుణ్, ప్రవీణ్నాయక్, జోషినాయక్, మహేష్, శిశ, నాగారాజు, చంద్ర, సిద్ధార్థ సీనియర్ మహిళా జట్టు నక్షత్ర, మాధవి, సమీరా, స్వప్న, ఆదర్శిని, రిహాన, ఓంశ్రీ ప్రియాంక, ఫర్హాణా, విష్ణుప్రియా, జయదీపిక, సాయిప్రసన్న, నిహారిక, పవిత్ర, హర్షిణి, వినీత, జోష్ణ, జలజ, దివ్య, యశ్విని, హర్షిత, పవిత్ర -
ఉపాధిని కోల్పోయాం
చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఆపరేటర్లు ఉపాధిని కోల్పోయారు. వాహనాలను తిప్పలేక మూలన పడేశాం. బ్యాంకు రుణాలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నేటికీ ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. సక్రమంగా వాయిదాలను ప్రభుత్వం చెల్లించకపోవడతో ఆపరేటర్లకు సంబంధించి సిబిల్ స్కోర్ తగ్గిపోతోంది. వాహనాల ఇన్సూరెన్స్ రూ.11,500 కూడా ప్రభుత్వం చెల్లించాలి. – రామాంజినేయులు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
రైల్వే పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
తాడిపత్రి రూరల్: తాడిపత్రి రైల్వేస్టేషన్లో అమృత్ పథకం కింద జరుగుతున్నా పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్లో వివిధ పనుల నిమిత్తం రెండు విడతలుగా రూ.20 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు పనుల్లో కూడా నాణ్యతలో లోపాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న గ్రానైట్ బండ పరుపు కోసం ప్లాట్ ఫారంపై ఉన్న సిమెంట్ కాంక్రీట్ను తొలగించారు. సిమెంట్ బెడ్ పనులు చేస్తున్నారు. సిమెంట్ బెడ్ కోసం వేసిన సిమెంట్, ఇసుకను నిబంధనల మేరకు వేయకుండా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బెడ్ కోసం ఉపయోగిస్తున్న కంకర కూడా నాణ్యత లోపించిందంటున్నారు. ఇందులో కంకర పొడి కనిపిస్తోందని, కొంత వరకు వేసిన సిమెంట్ బెడ్పై క్యూరింగ్ సరిగా చేయలేదన్న విమర్శలున్నాయి. ఆ బెడ్పై గ్రానైట్ బండ పరుపు పరచడం వల్ల భవిష్యత్తులో కుంగిపోయి ఎగుడు, దిగుడుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు.. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది. జరుగుతున్న పనులను అధికారుల పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం చేస్తున్నారు. జరిగిన పనుల నాణ్యతను లోతుగా పరిశీలిస్తే తప్ప ఏమేరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో అర్థమవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. -
ఇన్స్టాలో పరిచయం.. టీచర్కు వేధింపులు
● పుట్టపర్తి వాసిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు దొడ్డబళ్లాపురం: టీచర్ మీ స్టూడెంట్నే అంటూ ఇన్స్టాలో మహిళా ఉపాధ్యాయురాలిని పరిచయం చేసుకొని ఆపై వేధించిన యువకుడిని పోలీసులు కటకటాలపాలుచేశారు. వివరాలు.. ఎలక్ట్రానిక్ సిటీలో టీచర్గా పని చేస్తున్న మహిళ (40)కు, పుట్టపర్తికి చెందిన అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థినంటూ కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ అర్షద్ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో కలవాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న అతను.. నూ్య్డ్ వీడియో తన వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు తరచూ అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే వేధింపులు తారాస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచన మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అవయవాలను కోసుకుంటానని అతను కొంతసేపు హల్చల్ చేశాడు. గ్రామస్తుల దాడిలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లికి చెందిన బావిరెడ్డి (51)అనే మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు శనివారం రాత్రి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడని, మనుషులపై కూడా దాడి చేయడం, బట్టలు లేకుండా తిరగడం వంటి చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగా గ్రామస్తులు బావిరెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని కాళసముద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన రామాంజినేయులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి రాప్తాడురూరల్: రాప్తాడు మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన రాజశేఖర్ (40) మామిళ్లపల్లి వైపు నుంచి జాతీయ రహదారిపై రాప్తాడు వైపు బైకులో వస్తున్నాడు. ఎం.చెర్లోపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైకు అదుపుతప్పి... యల్లనూరు: యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన మారుతి తన సోదరి మమతతో పాటు ఆమె కుమారుడు గగన్ (5)తో కలిసి రాప్తాడు వైపు నుంచి అనంతపురం వైపు బైకులో వస్తున్నారు. అయితే గాయత్రి మిల్క్డైరీ సమీపంలో అదుపుతప్పి బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గగన్ తలకు తీవ్ర గాయాలై మృత్యువాతపడ్డాడు. మారుతి, మమత గాయాలతో బయటపడ్డారు. తన కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో రైతు... కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన మహలింగప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన చిలగడ దుంపలను హైదరాబాద్ మార్కెట్కు బొలెరోలో తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రి కర్నూలు సమీపంలో బొలెరో వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మహలింగప్ప అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
అగళి: కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని కసాపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. హైదరాబాద్ నుంచి శిర వైపుగా వెళ్తోంది. అయితే మండలంలోని కసాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. దీంతో సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు మూగ గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో విద్యుత్ స్తంభం ధ్వంసమైన ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మహిళపై అత్యాచారయత్నం గుత్తి: పట్టణ పరిధికి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాలమేరకు.. జడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన లక్ష్మిదేవి పట్టణ శివారులోని డాబాలో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి ఒంట గంట సమయంలో ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని దారం చెవి కమ్మకు తగిలి చెవికు గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆరు కుట్లు వేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సురేష్ .. జడ్.వీరారెడ్డి కాలనీకి వెళ్లి బాధితురాలిని కలిసి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కాలనీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. మతిస్థిమితం లేని మహిళ మృతిఉరవకొండ: మండల పరిధిలోని చిన్నమూష్టూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మతిస్థిమితం లేని మహిళ (30 నుంచి 40 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం సీఐ మహానంది మాట్లాడుతూ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని మహిళ హంద్రీనీవా కాలువ గట్ల వద్ద ఉంటూ తిరిగేదన్నారు. ఆహారం లేక ఎండ వేడిమికు తట్టుకోలేక కాలువ సమీపంలోని చెట్టు కింద మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యాచకురాలు మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బకాయిలు విడుదల చేయాలిఅనంతపురం టవర్క్లాక్: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యయ, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీపీఎస్ ఏపీ జీఎల్ఐ, గ్రాడ్యుటీ, సరెండర్ లీవ్లకు సంబంధించిన బకాయిలు కొద్దిగా మాత్రమే విడుదల చేశారని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటేష్ బాబును ఘనంగా సన్మానించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్బాబును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్, రవికుమార్, జమీల బేగం, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, దస్తగిరి, పద్మావతి, అనంతయ్య, మనోహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. -
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ధర్మవరం అర్బన్: మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం కరపత్రాలు విడుదల చేశారు. శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో దాదాపు 50 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. మహిళా ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవని, లైంగిక వేధింపులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సంక్షేమానికి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక స్టాఫ్రూమ్, ప్రత్యేక వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాస్థాయిలో ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులతో సంతకాలు సేకరించి యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్నాథ్రెరడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరి వరకుమారి, కార్యదర్శులు నాగేంద్రమ్మ, లతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ విద్యార్థినికి జపాన్ నుంచి పిలుపు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంత’ విద్యార్థినికి జపాన్ దేశం నుంచి పిలుపు వచ్చింది. సైన్స్లో కనబరచిన ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. గుంతకల్లు మండలం కసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇడుపులపాయలో ఇంటర్ చదువుతున్న కావలి జ్యోతి తన సృజనాత్మకతతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే వినూత్న నమూనాను రూపొందించిన విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ ప్రతిభతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప అవకాశం లభించింది. జపాన్ సైన్స్,టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ కింద మన రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కావలి జ్యోతి ఒకరు ఉండడం విశేషం. వడదెబ్బతో వృద్ధురాలి మృతి కూడేరు: వడదెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. గార్లదిన్నె మండలం సంజీవ పురానికి చెందిన బొగ్గు వెంకటలక్ష్మమ్మ (65) ఆదివారం కూడేరులో పోలీసు స్టేషన్ వెనుక వైపు వ్యవసాయ పొలంలో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆ పొలం రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆమె వద్ద లభించిన కవర్లో ఆస్పత్రి చీటీ కనిపించింది. అందులో ఉన్న చిరునామా ఆధారంగా కుమారుడు సోముకు సమాచారమిచ్చారు. అతను వచ్చి చనిపోయినది తన తల్లి వెంకటలక్ష్మమ్మ అని గుర్తించాడు. తన తల్లి పుట్టినిల్లు అరవకూరని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతుండేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఆమె వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గొడవలు.. గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం న్యూటౌన్ జూనియర్ కళాశాలలో ఇటీవల ముగిసిన ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) శిబిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోర్డు నుంచి సీనియార్టీ ఆధారంగా వచ్చిన చీఫ్ ఎగ్జామినర్ల (సీఈ) జాబితాలో మార్పులు చేయడం వివాదానికి దారి తీసింది. సీనియర్ లెక్చరర్లను పక్కనబెట్టి జూనియర్లను నియమించడం, విధి విధానాలను ఉల్లంఘిస్తూ నియామకాల్లో ఇష్టానుసారం వ్యవహరించడం శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. దీనికి తోడు అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఈ క్రమంలో రగడ రాజుకుందని సీఈలు, ఏఈలు విమర్శిస్తున్నారు. గొడవలు, పరస్పర దూషణలు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. బోర్డు జాబితాలో 5వ పేరు.. ఇక్కడి జాబితాలో 14వ పేరు సీనియార్టీని అనుసరించి చీఫ్ ఎగ్జామినర్ (సీఈ)ల నియామకం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నుంచే జరుగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 12 మందితో సీనియార్టీ జాబితా పంపారు. దీన్నికాదని జిల్లాస్థాయిలో మరో జాబితా తయారు చేయడం.. అందులో సీనియార్టీని అనుసరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి వచ్చిన జాబితాలో 5వ పేరులోఉన్న ప్రిన్సిపాల్..ఇక్కడి జాబితాలో 14వ పేరుగా మార్చడమే ఇందుకు నిదర్శనం. గణితం సబ్జెక్టులోనూ ఇదే రకంగా జరిగిందని అధ్యాపకులు చెబుతున్నారు. జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు? క్యాంపులో ఓ జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు. ఈ విషయం గతనెల 31న వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఏఈ, సీఈలకు ముచ్చెమటలు పట్టాయి. వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ దుమారం క్యాంపు మొత్తం వైరల్ కావడంతో పెద్ద చర్చ జరిగింది. ఈ ఘటన మూల్యాంకన ప్రక్రియ భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల విద్యావర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి.. క్యాంపులో మిస్ అయిన జవాబుపత్రం నాలుగు రోజుల తర్వాత అదికూడా క్యాంపునకు సంబంధం లేనిచోట లభించింది. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న ఫిజిక్స్ ల్యాబ్లో దొరకడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రధానగేటుకు తాళం వేసే ఉంటుంది. బయట వారికి అనుమతి ఉండదు. అలాగే ఫిజిక్స్ ల్యాబ్కు తాళం వేసే ఉంటుంది. అధికారులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే శిబిరం నుంచి మాయమైన జవాబుపత్రం.. తాళం వేసి ఉండే ల్యాబ్లో ఎలా దొరికిందనేది అంతుచిక్కని ప్రశ్న. దీని వెనుక దాగి ఉన్న కుట్రకోణం బయటకు రావాలని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే ఇంటిదొంగలు బయటపడతారని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఈలు, ఏఈలు మూల్యాంకన విధులంటేనే బెంబెలేత్తే పరిస్థితి వస్తుందని వారు వాపోతున్నారు. సీఓఈకు ఫిర్యాదు చేసిన ఏసీఓ.. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో జరిగిన అవకతవకలపై స్వయంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ)కు ఓ అసిస్టెంట్ క్యాంపు అధికారి (జనరల్) ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అనవసరమైన వాగ్వాదాలతో తొలిరోజు శిబిరం బాగా ఆలస్యమైందని, ఏసీఓ (జనరల్)ను పక్కనపెట్టి అన్నీతానై క్యాంపు అధికారి వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అప్పటికే పని చేసిన వ్యక్తిని మళ్లీ సీఈగా నియమించారని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఏసీఓ జనరల్–1ను చేర్చకపోవడం, అవసరమైన సమాచారం అందించకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యలేనని పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ ఇంటర్ ‘స్పాట్’ తీరు -
వైభవం.. పోతులరాజు మహోత్సవం
రొళ్ల: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చారిత్రక ప్రదేశం, శైవక్షేత్రంగా పేరొందిన రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ‘పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం’ ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని గ్రామవీధుల గుండా నృత్య మాడుతూ మంగళవాయిద్యాల నడుమ కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు పాలబావిలో గంగా పూజ చేశారు. జాతరలో తినుబండారాల దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బి.అనంతరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్, మాజీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నాయకుడు నగేష్రంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్, మాజీ వైస్ సర్పంచ్ సీఎం ఘట్ట రవి, నాయకులు యరగుంటప్ప, సురేష్, హనునాయక్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ కె.నరసింహుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (నేడు) పాల బావిలో గంగా పూజతో పాటు రాత్రికి పోతుల రాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. రెవెన్యూ క్లినిక్లు.. భూ వివాదాల పరిష్కారానికి కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటర్లలో ఆయా రెవెన్యూ డివిజన్లకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అడంగల్ మార్పులు–చేర్పులు, మ్యుటేషన్లు, రస్తా, శ్మశాన వాటిక సమస్యలు, 22ఏ చుక్కల భూములు, సబ్ డివిజన్లు, పట్టాదారు పేరు మార్పులు తదితర సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఈ విషయంపై ఆదివారం ఆయా డివిజన్ల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష అనంతపురం అర్బన్:యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించిన ఫ్లాగ్షిప్ (ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఏ) పరీక్ష సజావుగా జరిగింది. పరీక్షలకు 522 మంది అభ్యర్థులకు గానూ 340 మంది హాజరయ్యారు. ఎస్ఎస్బీఎన్ కేంద్రంలో జరిగిన కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 55 శాతం నమోదైంది. కేఎస్ఆర్ కళాశాల కేంద్రంలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 65.18 శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆనంద్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. -
జిల్లాలో వివిధ రకాల సిలిండర్ల వివరాలిలా..
హిందూపురం మోడల్ కాలనీకి చెందిన చాంద్బాషా టీ కేఫ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఏర్పడిన గ్యాస్ కొరతతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బ్లాక్లో సిలిండర్ కొందామంటే రూ.3 వేలపైనే చెబుతుండడంతో అంతమొత్తం వెచ్చించలేక కేఫ్ బంద్ చేసుకుంటున్నాడు. .. గ్యాస్ కొరతతో వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చాంద్బాషా లాంటి చిరువ్యాపారులు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లూ దర్జాగా బతికిన వారంతా ఇప్పుడు కుటుంబానికి మూడు పూటలా కడుపు నింపేందుకు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. హిందూపురం టౌన్/ పెనుకొండ: పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు చిరువ్యాపారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అధికారులు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో టీ కేఫ్లు, చిన్నపాటి హోటల్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ బంకులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మూసివేశారు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచేసి బ్లాక్లో విక్రయిస్తున్నాయి. ‘కమర్షియల్’ కష్టాలు హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్లు దొరక్క నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా అంతంతమాత్రానే ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో పలు చోట్ల ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. కొన్ని చోట్ల బ్లాక్లో సిలిండర్లను కొనుగోలు చేసి మరీ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.2,200– రూ.2,300 ఉండగా.. పలు ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు రూ.4,500 వరకూ వసూలు చేస్తున్నాయి. ఇంతమొత్తం చెల్లించలేని కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అన్నీ బంద్ కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెనుకొండ మండలంలో పలు కేఫ్లు, హోటళ్లు మూతబడ్డాయి. కట్టెల పొయ్యితో హోటల్, కేఫ్ నిర్వహణ కష్టంగా మారడంతో చాలా మంది బంద్ చేశారు. గతంలో ఒక వెలుగు వెలిగిన హోటళ్లు, కేఫ్లు నిరవధికంగా మూతబడ్డాయి. వ్యాపారులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కేఫ్లు, హోటళ్ల ఏర్పాటు కోసం బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకుని నెలనెలా కంతులు చెల్లిస్తున్నారు. అలాంటి వారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద సైతం కొన్ని కేఫ్లు మూతబడగా, హోటళ్లు భారంగా నడుస్తున్నాయి. పొయ్యి వెలగక.. కడుపు నిండక హోటళ్లు, చిరు వ్యాపారులపై సిలిం‘డర్’ మోత కొరతను సాకుగా చూపి బ్లాక్లో విక్రయం మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.3 వేలపైనే గ్యాస్ కొనలేక కేఫ్లు, హోటళ్లు మూసేసిన వైనం వ్యాపారం లేక పస్తులుంటున్న చిరువ్యాపారులు వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లను నిర్వహించలేకపోతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. సిలిండర్ దొరికిన రోజు హోటల్ను నిర్వహిస్తూ, మిగతా రోజుల్లో మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్లాక్లో కొందామంటే గ్యాస్ సిలిండర్ ధర భారీగా ఉంది. అధికారులు స్పందించి వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి. – సాయి, హోటల్ నిర్వాహకుడు, హిందూపురం -
కొల్హాపురి లక్ష్మీదేవికి జ్యోతులు
రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయమే అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహాలను భక్తులు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళలు హారతులను అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, దేవాలయం కిటకిటలాడింది. పలువురు మహిళలు ఆలయ సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. -
ప్రొటోకాల్ కోసం ‘పల్లె’ ఆరాటం..
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అయినప్పటికీ ప్రతి విషయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు. అధికారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకొంటూ.. నిత్యం అధికార కార్యక్రమాల్లో దర్జా చూపుతుంటారు. ఎమ్మెల్యే ఉన్నా.. లేకున్నా.. తానే ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో, కార్యక్రమాల్లో ‘పల్లె సింధూరరెడ్డి’ అన్న బోర్డు కనిపించిన సీట్లో కూర్చుంటుంటారు. ప్రొటోకాల్ కోసం నానా తిప్పలు పడుతూ.. ఉనికి చాటుకునేయత్నం చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యే తరహాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎవరయినా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేకు ఏం తెలీదని.. రాజకీయాల గురించి ట్రైనింగ్ ఇస్తున్నానని లెక్చర్ ఇస్తుంటారు. తాజాగా మూడురోజుల క్రితం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వేదికపై కలెక్టర్ పక్కనే ఆసీనులయ్యారు. అయినా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఆయన్ను ఆక్షేపించలేదు. -
దర్పం.. పచ్చ పెత్తనం
సాక్షి, పుట్టపర్తి ప్రజాప్రతినిధులు కాదు... ఎలాంటి హోదా ఉండదు... కానీ ‘తెలుగు తమ్ముళ్లు’ అధికార దర్పంతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటూ హల్చల్ చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పాల్గొంటూ ప్రజాప్రతినిధులను మించి హడావుడి చేస్తున్నారు. ప్రతి పంచాయితీలోనూ జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. అధికారం చూపి అధికారులతోనే సలాములు కొట్టించుకుంటున్నారు. దీంతో గ్రాఉమ సచివాలయాల నుంచి ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసుల వరకూ ‘పచ్చ’ పెత్తనమే కొనసాగుతోంది. ఉనికి కోల్పోకుండా.. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలోని టీడీపీ నేతలు షాడో ఎమ్మెల్యేల అవతారమెత్తారు. తమ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. కొందరైతే అధికారులను ఇళ్లకే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. మరికొందరు అధికారిక సమావేశాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటుగా మార్చుకున్నారు. ఎమ్మెల్యే ఎవరైనానా.. అక్కడంతా వారిదే పెత్తనం అన్న చందంగా ప్రైవేటు ప్రచారం చేయించుకుంటున్నారు. అ‘ధర్మం’గా శ్రీరామ్ పెత్తనం.. ధర్మవరం నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. పెత్తనం మాత్రం పరిటాల శ్రీరామ్దే. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తలదూరుస్తూ..అంతా తానే అనేలా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరుతో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కూటమి ధర్మం పాటిస్తున్నామని చెబుతూ.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనసేన ఇన్చార్జ్ కూడా తన స్థాయిలో తాను పెత్తనం చేస్తున్నారు. మంత్రి అప్పుడప్పుడూ నియోజకవర్గానికి వస్తుండగా హడావుడంతా స్థానిక నేతలే చేస్తుండటంతో జనం కూడా ఏ పనికోసమైనా వారి వద్దకే వెళ్తున్నారు. మడకశిరలో పెత్తందారీ హవా.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో టీడీపీ ఇన్చార్జ్గా వ్యాపారవేత్త గుండుమల తిప్పేస్వామి ఉన్నారు. ఓ వైపు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన స్థానికేతరుడు ఎంఎస్ రాజు జనం దృష్టిలో, అధిష్టానం కంట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ ఎంఎస్ రాజు... చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుండగా... గుండుమల తిప్పేస్వామి మాత్రం ఎమ్మెల్యే స్థాయిలో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. పెత్తందార్లకు పెత్తనం కట్టాలనుకున్నప్పుడు తమకు రిజర్వేషన్ ఎందుకని వాపోతున్నారు. ‘పురం’లో పీఏల పెత్తనం.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపు చూపుగా హిందూపురం వస్తుంటారు. అయితే ఆయన అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. ఒకరు కాదు.. ఇద్దరు చాలరు.. అన్నట్లు ఏకంగా ముగ్గురు పీఏల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటూ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారం మాది... అడిగేవారెవరు అన్నట్లుగా ‘పచ్చ’ నేతలు రెచ్చిపోతున్నారు. సెటిల్మెంట్లు, భూదందాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. చివరకు అధికారిక కార్యక్రమాల్లోనూ దర్జా చూపుతున్నారు. ఎలాంటి హోదా లేకపోయినా.. కలెక్టర్ పక్కనే కూర్చుని ఫోజులిస్తున్నారు. తమ స్థాయి ఇదీ అంటూ చాటుకుంటున్నారు. ప్రొటోకాల్ను మరచిన అధికార యంత్రాగం కూడా ‘పచ్చ’ నేతలకే దండాలు పెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేతల దర్జా అధికారుల సమావేశాల్లో హడావుడి హోదా లేకున్నా జిల్లా సమీక్షలకు హాజరు కలెక్టరేట్ సమావేశాల్లోనూ పల్లె, పరిటాల హల్చల్ ప్రొటోకాల్ లేకుండా పక్కనే కూర్చున్నా పట్టించుకోని కలెక్టర్ హిందూపురం, మడకశిరలోనూ షాడో ఎమ్మెల్యేలు -
‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు ఉమ్మడి పోరాటం
బత్తలపల్లి: ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, నిరుపేదలకు మేలు చేసే ‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఉమ్మడి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉపాధిహామీ కూలీల హక్కుల కోసం సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలం కాటికోటేశ్వరక్షేత్రం నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తమ బృందంతో పాదయాత్రగా లింగారెడ్డిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా... వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం తాజా మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బత్తలపల్లి వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్సింగ్ గురియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తదితరులు మాట్లాడారు. వలసలు నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉపాధిహామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాపై భారం.. ఉపాధి చట్టం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రాంజీ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతుందని నేతలు అన్నారు. గతంలో ఉపాధి పథకానికి 90 శాతం నిధులను కేంద్రం అందించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందన్నారు. కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేసినప్పడే టీడీపీ సర్కార్ బిల్లులు సకాలంలో చెల్లించలేదని, ఇప్పుడు 40 శాతం నిధులివ్వాలంటే కష్టమేనన్నారు. దీనివల్ల మళ్లీ వలసలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల పని దినాలు కూడా కల్పించలేదన్నారు. గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించినట్లు వివరించారు. అందువల్ల పాత పద్ధతిలోనే ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జాతీయ కార్యదర్శి నిర్మల్, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, ఆవుల శేఖర్, బండి వెంకటేశ్వరరావు, వేమయ్య యాదవ్, మల్లికార్జున, రాజారెడ్డి, వలరాజు, నాసర్, సంతోష్కుమార్, యుగంధర్, చంద్ర నాయక్, కాటమయ్య, చలపతి, ముసుగు మధు, కదిరప్ప, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మహేష్నాయుడు, కోటి సురేష్కుమార్, గుర్రం శ్రీనివాసరెడ్డి, బండి వీరనారప్ప, షరాబ్ యోగానంద ఆచారీ, బగ్గిరి బయపరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, మాజీ సర్పంచులు అక్కిం దామోదర్, చెడిపోతుల గోపాల్, గొల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీబీ జీ రాంజీతో రాష్ట్రంపై పెనుభారం ఏన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. ప్రయోజనం లేదు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రకు మద్దతు -
మూల్యాంకనం పక్కాగా జరగాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల మేరకు పక్కాగా జరగాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను అడిగి తెలుసుకున్నారు. గడువులోపు మూల్యాంకనం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా మార్కులు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ కిష్టప్ప, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. డీఎస్పీ విజయ్కుమార్పై బదిలీ వేటు పుట్టపర్తి టౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్పై బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి డీఐజీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ను శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే పుట్టపర్తి డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. 17 నెలలుగా విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా పనిచేశారు. పలు అంశాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విదేశీయుల భూముల అంశం, కొత్తచెరువు హత్యకేసు, పేకాట అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
పూలే మార్గం అనుసరణీయం
● జయంతి వేడుకల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: సంఘ సంస్కర్త, కుల నిర్మూలన, సీ్త్ర విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మానవతావాది జ్యోతిరావు పూలే మార్గం అనుసరణీయని కలెక్టర్ శ్యాంప్రసాద్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టేకులోడు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విద్య ద్వారానే మార్పు సాధ్యమని నమ్మిన పూలే సీ్త్ర విద్య, బడుగుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడారన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్షను రూపుమాపడానికి ఫూలే ఆశయాలు, దార్శనికత నేటి తరానికి ఆదర్శమన్నారు. పూలే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా బీసీలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ నిర్వాహకుడు రాజేష్, దేవరాజ్లను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్, ఆర్డీఓ సువర్ణ, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పటివేత
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. వీటిని తహసీల్దార్, ఆర్డీఓకు అప్పగించినట్లు ఎస్ఐ వీరాంజనేయులు తెలిపారు. డైట్లో ఘనంగా ఫేర్ వెల్ డే పుట్టపర్తి: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ డే ఘనంగా జరిగింది. 2024–26 బ్యాచ్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ... తాను కూడా డైట్ కళాశాల విద్యార్థినేనని, కొంత కాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశానని గుర్తు చేశారు. ఏ ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్థి అని, వారి పని తీరు బాగుంటే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి బత్తలపల్లి: మండలంలోని డి.చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పాలమసి నారాయణస్వామి(59) గుండెపోటుతో మరణించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలోని బాలాజీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న ఆయన గురువారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించారు. కాగా, నారాయణస్వామికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నారు. నారాయణస్వామి మృతి చెందిన విషయం తెలియడంతో ఎంఈఓ సుధాకర్నాయక్తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనంతపురానికి తరలివెళ్లారు. నారాయణస్వామి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు● 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ప్రశాంతి నిలయం: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు, పథకాల అమలు ఉండాలని అధికారులకు 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. శుక్రవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాం ప్రసాద్తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వైద్యం, విద్య, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రస్తుత స్థితి గతులను కలెక్టర్ వివరించారు. పెనుకొండలో మెడికల్ కళాశాల పనులు జరుగుతున్నాయన్నారు. మధ్యాహ్న భోజనం సమగ్రంగా అందిస్తున్నారని, తాగునీటి పథకం పనులు కొనసాగుతున్నాయని, జిల్లాలోని 32 మండలాల్లో 2214 నివాస ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు 3899 పీడబ్ల్యూఎస్ స్కీములు, 4033 హ్యాండ్ పంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి 4,942 మంది నమోదు చేసుకోగా 1,130 ఇళ్లకు ఇన్స్టలేషన్ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర, ఆర్డీఓ సువర్ణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్మడకశిర: ఆంధ్రతో పాటు కర్ణాటకలోనూ చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఆంజనేయులు, చిన్నా ఉన్నారు. వీరిద్దరూ ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ చైన్స్నాచింగ్లకు పాల్పడేవారు. అలాగే పలు ఇళ్లలో చోరీలకు తెగబడ్డారు. ఇప్పటికే ఆంజనేయులుపై 45 కేసులు, చిన్నాపై 15 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర ప్రాంతంలో జరిగిన దొంగతనాలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం ఇద్దరినీ అరెస్ట్ చేసి, రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో సమావేశంలో మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్, అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య పాల్గొన్నారు. -
వెంగళమ్మచెరువు సొసైటీలో గోల్మాల్
పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంగళమ్మచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) లో గోల్మాల్ వెలుగు చూసింది. రైతులకు ఇచ్చే రుణాల్లో రూ.20లక్షలు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సొసైటీ పరిధిలో 500 మందికి పైగా రైతులు ఉండగా, వీరందరూ భూములను తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి ఏటా వడ్డీలు చెల్లించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సొసైటీలో ప్రతి ఏటా లాంగ్ టర్మ్ కింద రూ.1.5 కోట్లు, షార్ట్ టర్మ్ కింద రూ.3.5 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. క్లర్క్గా చేరి... సీఈఓగా ఎదిగి వెంగళమ్మచెరువు పంచాయతీలోని వీరాంజనేయపల్లికి చెందిన వెంకటాద్రి తొలుత ఈ సొసైటీలో క్లర్క్గా చేరాడు. కాలానుగుణంగా అదే సొసైటీకి సీఈఓగా అధికారులు నియమించారు. చాలా ఏళ్లుగా ఈ హోదాలనే ఆయన పనిచేశాడు. 2024 జూన్లో అతని పదవీ కాలం ముగిసింది. అయితే కోర్టుకు వెళ్లి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించుకోవడంతో పాటు సీఈఓ జీతం తీసుకుంటూ క్లర్క్గా విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతని పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. సీఈఓగా ఉన్నప్పుడే రైతులు చెల్లించే వడ్డీలను స్వాహా చేస్తూ వాటిని కప్పి పుచ్చుకునేందుకు క్లర్క్ గా అవతారమెత్తినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. వడ్డీపై అదనంగా వసూలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి రైతులు ఏటా మార్చి నుంచి జూన్ నెల లోపు రెన్యువల్ చేయిస్తుంటారు. ఇందుకుగాను గతంలో రసీదులను మాన్యువల్గా అందజేసేవారు. 2024 నుంచి ఈ ప్రక్రియను కంప్యూటరైజ్డ్ చేశారు. దీంతో అప్పటి నుంచి రసీదులు, బిల్లులు అన్నీ కంప్యూటర్ కాఫీలనే అందజేస్తున్నారు. అయితే వెంకటాద్రి నేటికీ మాన్యువల్ రసీదులను స్వయంగా సంతకం చేసి రైతులకు అందజేస్తున్నాడు. ఈ క్రమంలో వడ్డీకి అదనంగా డబ్బు రైతుల నుంచి వసూలు చేసి, బ్యాంక్కు కట్టే సమయంలో రుణానికి వడ్డీ మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాలను స్వాహా చేస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మాన్యువల్ రసీదు పుస్తకాలను సొసైటీలో ఉంచకుండా తన ఇంట్లో ఉంచుకుని మొత్తం కథ నడిపించినట్లుగా సమాచారం. దాటవేత ధోరణితో తప్పించుకుంటూ సీఈఓగా వెంకటాద్రి పదవీ కాలం ముగియగానే ఇన్చార్జ్ సీఈఓగా రవిశంకరరెడ్డిని నియమించారు. ఈ క్రమంలో చెల్లింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించిన ఆయన రైతులను నిలదీశారు. అయితే తాము వడ్డీలు చెల్లించామంటూ కొందరు రైతులు తమ వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను చూపడంతో స్వాహా పర్వం బయటపడింది. ఈ అంశంపై వెంకటాద్రిని సొసైటీ అధ్యక్షుడు శ్రీరామరెడ్డి, ఇన్చార్జ్ సీఈఓ నిలదీశారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నానంటూ విచారణకు సహకరించకుండా వెంకటాద్రి దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో రైతుల వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను సొసైటీ అధ్యక్షుడు తెప్పించుకుని వాటిని భద్రపరిచారు. 500 రసీదులకు గాను ప్రస్తుతం 100 వరకూ స్వాధీనం చేసుకోగా ఇందులోనే రూ.5 లక్షలకు పైగా స్వాహా అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన మొత్తం రూ.20 లక్షలకు పైగా గోల్మాల్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 51 ఎంకై ్వరీ కోరుతున్న రైతులు: సాధారణంగా వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తవకలు చోటు చేసుకుంటే ఆ శాఖకు చెందిన అధికారులు విచారణ చేపడతారు. అయితే వెంగళమ్మచెరువులో పెద్ద ఎత్తున అవతవకలు జరిగినా స్థానిక టీడీపీ నాయకులు, కో–ఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది మాత్రమే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ విచారణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. 51 ఎంకై ్వరీ చేపడితేనే అక్రమాలు బయటపడి తమకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు. రూ.20 లక్షలు స్వాహా రైతుల నుంచి ఏటా వడ్డీల రూపంలో వసూలు దొంగ రసీదులతో మాయ చేసిన మాజీ సీఈఓ విచారణకు సహకరించాలి వెంగళమ్మ చెరువు సొసైటీలో చోటు చేసుకున్న అక్రమాలపై రైతులు 51 ఎంకై ్వరీ కోరుతున్నారు. అయితే 51 ఎంకై ్వరీ అంటూ జరిగితే సొసైటీకి వచ్చే నిధులు ఆగిపోతాయి. దీంతో విచారణను సొసైటీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఈఓ, బ్యాంకు సిబ్బందినే చేయాలని సూచించాను. విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఈ విచారణకు వెంకటాద్రి పూర్తిగా సహకరించాలి. తన ఇంట్లో దాచిన రసీదు పుస్తకాలను తీసుకొచ్చి ఇవ్వాలి. – కృష్ణానాయక్, జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ) -
అక్రమ తవ్వకాలపై తనిఖీ
ముదిగుబ్బ: మండల పరిధిలోని చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను తహసీల్ధార్ మహేశ్వరరెడ్డి శుక్రవారం సీజ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తున్న చిత్రావతి నది నుంచి గతంలో ముదిగుబ్బ మండలం పీసీరేవు, తాడిమర్రి మండలం చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద మాత్రమే ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఓ ప్రజాప్రతినిధి భారీ యంత్రాలను ఉపయోగించి ఉప్పలపాడు సమీపంలోని చిత్రావతి నది నుంచి ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అంశంపై ‘చిత్రావతిలో ఇసుక దోపిడీ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం రెవెన్యూ సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇసుక తరలిస్తూ ఓ ట్రాక్టర్ పట్టుబడింది. అనంతరం ఉప్పలపాడు వద్ద ఉన్న ఇసుక డంప్లను తహసీల్దార్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు హిటాచీలను సీజ్ చేయకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ మహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హిటాచీలు ఉన్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని పేర్కొనడం విశేషం. -
ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం
పుట్టపర్తి టౌన్: స్థానిక గణేష్ కూడలి సమీపంలో ఉన్న షాదీమహల్లో శుక్రవారం సర్వేయర్ల సంఘం అధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్ హాజరై, రక్తదానం చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన సర్వేయర్లకు, రక్తదాతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే భూరికార్డులు అధికారి విజయశాంతి బాయి, ఐఓఎస్లు, డీఐఔస్లు, మండల, వార్డు సర్వేయర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఆపిల్ సాగు శుభపరిణామం గార్లదిన్నె: జిల్లాలో ఆపిల్ పంట సాగు చేయడం శుభపరిణామమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గార్లదిన్నె మండలం కోటంకలో రైతు రమణారెడ్డి సాగు చేసిన ఆపిల్ తోటను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పంట సాగు విధానాలపై రైతుతో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఆపిల్ మొక్కలు నాటాలని ఎవరూ తొందర పడరాదన్నారు. ముందుగా జిల్లాలో ఆపిల్ సాగుపై శాసీ్త్రయంగా ఉద్యానశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా విశ్లేషణ చేసిన తర్వాత ఆశాజనక ఫలితాలు వస్తే పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈరమ్మ, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఉద్యాన అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు. -
రీ టెండర్పై హైకోర్టు సీరియస్
కదిరి: ఖాద్రీశుడి ఆలయం ఎదుట టెంకాయలు విక్రయించుకునేందుకు నిర్వహించిన టెండర్ అంశం హైకోర్టుకు చేరింది. ఈ నెల 7న టెంకాయల విక్రయానికి ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి టెండర్ పిలవగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి రూ.31.21 లక్షలకు దక్కించుకున్నాడు. అదే రోజు ఆ మొత్తం డబ్బు డీడీ రూపంలో ఈఓకు అందజేశారు. అయితే అనంతరం ఆటెండర్ను రద్దుచేసిన ఈఓ ఈనెల 16న మరోసారి టెండర్ పిలిచారు. దీనిపై బాధితుడు చంటి తనకు జరిగిన అన్యాయంపై శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (నం.9847/2026) దాఖలు చేశారు. ఈ కేసును వెంటనే స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున గుడపాటి వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగిన కొబ్బరి కాయల వేలంపాట ప్రక్రియ మొత్తాన్ని ఆలయ అధికారులు వీడియో చిత్రీకరించి నిబంధనల మేరకే నిర్వహించారని కోర్టుకు విన్నవించారు. అందులో హెచ్చుపాటదారుడైన తన క్లయింట్ చంటికి తూర్పు రాజగోపురం వద్ద వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొబ్బరికాయలు అమ్ముకునేందుకు హక్కులు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటించారన్నారు. ఆలయ అధికారులు సూచించిన బ్యాంకులో ఆ నగదుకు సంబంధించి డీడీ తీసుకొని ఆలయ ఈఓకు అదే రోజు సకాలంలో అందజేసిన విషయాన్ని కూడా ఆ న్యాయవాది ఆధారాలతో కోర్టు ముందుంచారు. కేవలం ఓ ప్రజాప్రతినిధి మాటకు తలొగ్గి మళ్లీ టెండర్లు పిలుస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున నగారు నాగరాజు ఈ కేసులో వాదనలను వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి..ఈ నెల 16న రీ టెండర్ నిర్వహించాలని ఆలయ అధికారులు ప్రకటించినందున, ఈ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ కక్షతోనే... బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్రెడ్డికి ప్రధాన అనుచరుడైన చంటికి టెంకాయల విక్రయ టెండర్ దక్కడం స్థానిక ఎమ్మెల్యే కందికుంటకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే అదే రోజు బహిరంగ వేలంపాటలో రూ.27.20 లక్షలకు వేలం పాట పాడిన బీజేపీకే చెందిన దళిత మోర్చా నాయకుడు తలుపుల గంగాధర్కు ఆ టెండర్ కట్టబెట్టాలని ఆలయ ఈఓపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 7వ తేదీన జరిగిన టెండర్ను రద్దు చేసి ఈ నెల 16వ తేదీన మళ్లీ వేలంపాట నిర్వహిస్తామని ఆలయ ఈఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కందికుంట ఆదేశాల మేరకు ఈఓ టెంకాయల విక్రయానికి రీ టెండర్ పిలిచారని విష్ణువర్దన్రెడ్డి వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఓపై కలెక్టర్ సీరియస్! కొబ్బరి కాయల టెండర్ను రద్దు చేసి, మళ్లీ ఎందుకు టెండర్ పిలవాల్సి వచ్చిందని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సీరియస్ అయినట్లు తెలిసింది. హైకోర్టు దీన్ని అత్యవసర కేసుగా పరిగణిస్తూ లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించిందంటే ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ మండిపడినట్లు సమాచారం. ‘నీ ఇష్టానుసారం వ్యవహరించడానికి ఇదేమైనా నీ సొంత ఆస్తి అనుకున్నావా? లేదంటే మీ అత్తగారి ఆస్తి అనుకున్నావా?’ అని సీరియస్గా మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. కోర్టుకు చేరిన కదిరి టెంకాయల పంచాయితీ రీ టెండర్పై హైకోర్టును ఆశ్రయించిన చంటి లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించిన కోర్టు రాజకీయ ఒత్తిడితోనే రీ టెండర్ పిలిచారన్న న్యాయవాది కేసును ఈ నెల 15కు వాయిదా వేసిన న్యాయమూర్తి -
ఉక్కపోత.. పుస్తకాల్లేక..
పరీక్షలు ముగియగానే హమ్మయ్యా... అంటూ ఊపిరి పీల్చుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం మళ్లీ పరీక్ష పెడుతోంది. ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించే వారికి ‘ప్రత్యేక తరగతులు’ అంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా ఎండలు దంచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు చెబుతుండగా.. విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పుట్టపర్తి: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం విషమ పరీక్ష పెట్టింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో ‘ప్రత్యేకం’ అంటూ తరగతుల నిర్వహిస్తోంది. భానుడి భగభగలతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. కానీ ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఈ అవకాశం ఇవ్వలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రత్యేక తరగతులంటూ హింసపెడుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్లాసులు నిర్వహిస్తోంది. పుస్తకాల పంపిణీ చేయకుండా తరగతులు నిర్వహిస్తుండటంతో అధ్యాపకులు ఏం చెబుతున్నారో విద్యార్థులకు తెలియడం లేదు. అందరికీ ఇబ్బందే.. మార్చి నెలాఖరు వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సేదదీరుతున్నారు. చాలా మంది బంధువుల ఊళ్లకు వెళ్లేందుకు, శీతల ప్రదేశాల్లో విహరించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా మంది ప్రత్యేక తరగతులకు హాజరు కావడం లేదు. ప్రత్యేక తరగతుల సమయం మార్చాలని ఇదివరకే అధ్యాపకులు నిరసనకు దిగారు. అయినా చంద్రబాబు సర్కార్ వెనక్కు తగ్గలేదు. భారీగా పడిపోయిన హాజరు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేటు కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు 11,737 మంది ఉన్నారు. ఇందులో బాలికలు సుమారు 6,197 మంది ఉన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని కళాశాలలకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా ఆ తర్వాత బస్టాండుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లే బస్సు ఎక్కాలంటే గగనంగా మారుతోంది. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం పుస్తకాలు కూడా ఇవ్వకుండా పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తరగతులకు కనీసం 10 శాతం మంది కూడా హాజరు కావడం లేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు ఎండలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు భారీగా పడిపోయిన హాజరుశాతం -
డెడ్ స్టోరేజీకి చేరువలో ’పీఏబీఆర్’
కూడేరు: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీరు అందించే పీఏబీఆర్ (పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ నీటి మట్టం పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, రిజర్వాయర్ భద్రతా దృష్ట్యా 5.5 టీఎంసీలకు మించి ఇరిగేషన్ అధికారులు నీటిని నిల్వ ఉంచడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు డ్యాంలో 5 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడం, కుడికాలువ ద్వారా 49 చెరువులను నింపడం, అనంత, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తుండడంతో శుక్రవారం నాటికి డ్యాంలో 2.6 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. ఈ క్రమంలో మరో 30, 40 రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుడి కాలువకు నీటి సరఫరాను త్వరలో నిలిపి వేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కృష్టా జలాలను ఎలాంటి ఖర్చు లేకుండా పీఏబీఆర్కు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కుప్పం ప్రాంతానికి తరలించడంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో రిజర్వాయర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటంతో తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అచ్చెన్నా.. తీరు మార్చుకో
చిలమత్తూరు: వాస్తవాలు తెలుసుకోకుండా నీచంగా మాట్లాడడం సరికాదని, ఈ విషమంగా మంత్రి అచ్చెన్నాయుడు తన తీరును మార్చుకోవాలంటూ హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక హితవు పలికారు. ఆంబోతులా వ్యవహరించడం మానుకోవాలన్నారు. తల పొగరుతో నీచంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అధికారం కోసం ఛండాలపు పనులు చేసే టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజామోదంతోనే నాడు మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎం అయ్యారని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజల మనసులు గెలిచి సీఎం అయ్యారన్నారనే విషయం మరువరాదన్నారు. తన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొవడమే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడినని చెప్పుకునే చంద్రబాబులా దొడ్డి దారిన ముఖ్యమంత్రి కావాలని ఏనాడూ వైఎస్సార్ కుటుంబం ఆలోచన చేయలేదన్నారు. 2009లో మహానేత మరణం తర్వాత ఆయన తనయుడు సీఎం కావాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులేనని స్వయానా ప్రస్తుతం కాంగ్రెస్లోనే కొనసాగుతున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, తెలంగాణా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అయినా అచ్చెన్నాయుడు కేవలం చంద్రబాబు మెప్పు కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. దానిని యథాతథంగా ప్రసారం చేసి ప్రజలను పచ్చమీడియా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ కారిడార్ తెర మీదకు రావడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ, వైఎస్సార్ మరణంపై తల పొగరుతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ప్రజల దృష్టి మళ్లించే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. ఎందుకు ఇలాంటి బతుకు బతుకుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికై నా టీడీపీ నేతలు మారాలని, అభివృద్ది అంటే అమరావతి ఒక్కటే కాదనే విషయాన్ని గుర్తించి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని నోటికి వచ్చినట్లు తమ నాయకుడిని మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆంబోతులా వ్యవహరించడం సరికాదు ప్రజామోదంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్ ‘పురం’ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక -
‘సీమ’ లిఫ్ట్ అత్యంత అవశ్యం
అనంతపురం: కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత అవశ్యమని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. అలాంటి కీలకమైన సాగు–తాగునీటి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని గండికొట్టడంపై మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపివేతతో ‘సీమ’ ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్ట్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల పూర్తి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామన్నారు. ● ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్లు – సమాలోచన’ అనే అంశంపై శుక్రవారం అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రేటర్ రాయలసీమ టాస్క్ఫోర్స్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్నాథ్రెడ్డి, కేవీ రమణ తదితరులు మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలని, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తితో పాటు పలు అంశాలపై తీర్మానం చేశారు. పోరు ఉధృతం బాబు ఆలోచన సరైంది కాదు రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. సీమకు తీరని ద్రోహం రాయలసీమ ఎత్తిపోతల పాజెక్టు పూర్తి చేస్తేనే ఉమ్మడి అనంతకు సాగు–తాగునీరు రూ.10వేల కోట్ల ఖర్చుతో పెండింగ్ నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు హంద్రీనీవా కాలువ వెడల్పు, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తికి తీర్మానం జల సాధన పోరుబాటకు సిద్ధం కావాలి రౌండ్టేబుల్ సమావేశంలోవైఎస్సార్సీపీ నేతల పిలుపుప్రాజెక్టులను పరిరక్షించుకోవాలి రాయలసీమలో పుట్టిన ప్రతి బిడ్డ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ సంస్థను అమరావతికి తీసుకెళ్లారు. బడ్జెట్లలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నయాపైసా కేటాయించలేదు. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వై ఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త -
మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు
ఇంటర్ ద్వితీయ సంవత్సం ప్రత్యేక తరగతులకు మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. చదవడానికి పుస్తకాలు లేవు. మరోవైపు ఎండలు భయపెడుతున్నాయి. కాలేజీలో ఉండలేక పోతున్నాం. ప్రభుత్వం సెలవులు ఇస్తే ఆనందంగా ఇంటికి వెళ్తాం. సార్లు చెప్పిన పాఠాలు పుస్తకాల్లో చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. – తరుణ్, అమడగూరు విద్యార్థుల కోసమే తరగతులు విద్యార్థుల కోసమే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. పుస్తకాల కోసం ఇప్పటికే ఇండెంట్ పంపాము...త్వరలోనే వస్తాయి. – చెన్నకేశవప్రసాద్, డీఐఈఓ -
నేడు పూలే జయంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించడానికి తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం చేసినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియార్టీ జాబితాను మూడోసారి డీఈఓ బ్లాగ్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా రాతపూర్వకంగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అప్పేపల్లి, కాకి గ్రామంతో పాటు దొమ్మరహట్టి గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్ను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలరించి పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులంతా ఆలయ సమీపంలోని పాలబావిలో గంగ పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రత్నగిరిలోని ఎస్సీ కాలనీ వాసుల జ్యోతుల ఉత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు ● మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి యత్నం ● చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ తరుముకుంటూ వెళ్లిన వైనం నల్లచెరువు: సహజ వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు చివరకు మట్టినీ వదలడం లేదు. చెరువుల నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు టీడీపీ నేతలు మండలంలోని అల్లుగుండు గ్రామ సమీపంలోని పాలకమ్మ చెరువు నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ అక్కడకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న వారు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ సమాచారాన్ని ఫోన్ చేసి తెలపడంతో దాదాపు 30 మందికి పైగా టీడీపీ గూండాలు పాలకమ్మ చెరువు చేరుకుని గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. ‘‘అధికారపార్టీ నేతలమైన మమ్మల్నే అడ్డుకుంటారా.. రండి రా.. చూసుకుందాం.. ప్రాణాలు తీస్తాం.. జాగ్రత్త’’ అంటూ.. చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ ప్రజలను తరుముకుంటూ వెళ్లారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఘటనపై శుక్రవారం ఉదయం తహసీల్దార్ రవినాయక్ను కలిసి ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. మరోవైపు నీటి పారుదల శాఖ ఏఈ ఆదెమ్మ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి అక్రమ తవ్వకాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
● వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. రొళ్ల మండలం టీడీ పల్లి, హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతండా, రొళ్లకొండ, అలుపనపల్లి, ఎ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల నుంచి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. అమ్మవారి మూలవిరాట్ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రత్నగిరి రాజవంశీకులు కుటుంబ సమేతంగా జ్యోతులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో రాజవంశీకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కూడా వివిధ గ్రామల నుంచి జ్యోతులను తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. -
వేధింపులకు వివాహిత బలి
పెనుకొండ రూరల్: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం దుద్దేబండ గ్రామంలో స్థిరపడిన కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన పాలూరి రమేష్ కుమార్తె అనూష (21)కు గత ఏడాది నవంబర్ 2న గొల్లపల్లికి చెందిన బోయ రాజేష్తో వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబ సభ్యులకు కట్నం కింద 8 తులాల బంగారం కోరడంతో పెళ్లి సమయంలో 2.8 తులాలు, రెండేళ్ల తర్వాత 4.2 తులాలు మొత్తం 8 తులాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమకు తెలియకుండా అనూష కుటుంబసభ్యులు బంగారాన్ని మార్చారంటూ అత్తింటి వారు అనుమానంతో ఆమెను వేధిస్తూ వచ్చారు. మిగులు బంగారాన్ని కూడా తీసుకురావాలని ఒత్తిడి చేయసాగడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అనూషను పుట్టింటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న అనూష గురువారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ నర్శింగప్ప, సీఐ రాఘవన్, తహసీల్దార్ స్వాతి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. భర్త రాజేష్, అత్త జయలక్ష్మి, మామ రామాంజనేయులు వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు కియా ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుంతకల్లు టౌన్: ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లులోని శ్రీనివాసనగర్కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్.. నీట మునిగిపోయాడు. బాలుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని నీట మునిగిన సుదీప్ను వెలికి తీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చిత్రావతిలో ఇసుక దోపిడీ
ముదిగుబ్బ: సహజ వనరుల దోపిడీని ఆదాయ వనరుగా మార్చుకున్న కూటమి నాయకులు చిత్రావతిని తూర్పారబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు భారీగా తగ్గి సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధే ఇసుకాసురుడు! చిత్రావతి నది ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తుంది. గతంలో ముదిగుబ్బ మండలంలో పీసీరేవు, తాడిమర్రి మండలంలో చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. కానీ ఓ ప్రజాప్రతినిధి ఉప్పలపాడు సమీపంలో భారీ యంత్రాలను ఉపయోగించి చిత్రావతిని ఇష్టానుసారం తవ్వేస్తున్నాడు. టిప్పర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ దందా గురించి తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రజలు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. అక్రమానికి ‘ఉమ్మడి ఒప్పందం’ కూటమిలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు ఓ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం పంపకాలు చేసుకొని ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కూటమి నేతలు ధనదాహంతో చిత్రావతి నుంచి ఇష్టానుసారం ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని నది సమీప ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి చిత్రావతి నది నుంచే ముదిగుబ్బ మండలంలోని పలు గ్రామాలతో పాటు కదిరి ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో చిత్రావతి ఎండిపోయి నీరు సరఫరా చేయలేకపోతే వేలాది మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు భేఖాతరు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా నిరంతరం తవ్వకాలు జరిపి వాల్టా చట్టానికి తూట్టు పొడుస్తున్నారు. నదిలో పరిమితికి మించి తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కూటమి నాయకుల కనుసన్నల్లోనే అక్రమ దందా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ప్రజల ఆవేదన నిఘా ఉంచుతాం చిత్రావతి నుంచి ఇసుక అక్రమ తరలింపు విషయం మా దృష్టికి రాలేదు. ఇసుక తరలింపుపై సమాచారం వస్తే దాడులను నిర్వహించి చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా చిత్రావతి నది నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – అమీర్ బాషా, మైనింగ్ ఏడీ -
పులి మాస్క్ ధరించి చోరీ
పామిడి: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఓ కళ అని నిరూపించాడు ఓ దొంగ. పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఏకంగా పులి మాస్క్ ధరించి దుకాణంలో చొరబడి నగదుతో పాటు విలువైన వస్తువులను అపహరించుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే... పామిడిలోని మెయిన్ బజార్లో రఫీ అనే వ్యక్తి జీఎస్ఆర్ పేరుతో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత 15 రోజులుగా దుకాణంలోని వస్తువులు, నగదు మాయమవుతుండడాన్ని గమనించిన ఆయన ఇటీవల సీసీ కెమెరాలను అమర్చాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి మరోసారి చోరీ జరిగింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన దుకాణదారుడు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి అవాక్కయ్యాడు. పాతికేళ్ల లోపు వయసున్న యువకుడు రెయిన్కోట్ ధరించి, ముఖానికి పులి మాస్క్తో దుకాణంలో తిరుగాడుతూ విలువైన సరుకులు, నగదు అపహరించడాన్ని గమనించి విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శివశంకరనాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉత్సాహంగా దున్నపోతుల రాతిదూలం పోటీలు కణేకల్లు: చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ మైదానంలో గురువారం దున్నపోతుల రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలకు మొత్తం ఏడు జతల దున్నపోతులను రైతులు తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంకాలం వరకూ సాగిన ఈ పోటీల్లో రైతు దాదాకు చెందిన దున్నపోతులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే రైతు కురబ నాగరాజు దున్నపోతులు ద్వితీయ స్థానం, రైతు లాలుస్వామి దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నపోతుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ చంద్రమౌళి, జూనియర్ అసిస్టెంట్ మారుతి, మాజీ వైస్ సర్పంచ్ ఆనంద్, మార్కెట్ యార్డు డైరెక్టర్ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. అప్పు చెల్లించలేదని దాడి పెనుకొండ రూరల్:అప్పు చెల్లించలేదంటూ ఓ వ్యక్తిపై వడ్డీ వ్యాపారులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం గుట్టూరుకు చెందిన ముక్తియార్ ధర్మవరానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో గురువారం ధర్మవరం నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు.. ముక్తియార్ కుటుంబసభ్యులు గౌస్బాషా, శర్మష్, జుబేర్, ఇమ్రాన్పై దాడి చేశారు. ఘటనలో గౌస్బాషా, శర్మాష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కియా ఎస్ఐ రాజేష్ తెలిపారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు : కలెక్టర్ప్రశాంతి నిలయం: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుతో పాటు అబివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఇదే అంశంపై గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 6 ప్రాధాన్యత పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ ఆస్తులను సంరక్షిస్తూనే ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. -
తలసేమియా కేంద్రం ప్రారంభం
అనంతపురం: నగరంలోని పాతూరులో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెడ్క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్ను డీఆర్వో మలోల గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెడ్క్రాస్ చైర్మన్ ఈ.రామారావు, రాష్ట్ర వైస్ చైర్మన్ రామచంద్ర రాజు, అనంతపురం జిల్లా చైర్మన్ కాపు భారతి, జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ పాల్గొన్నారు. రెడ్క్రాస్ తలసేమియా కేంద్రానికి ఆర్థిక, వస్తు సాయం చేసిన దాతలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన తలసేమియా బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రక్తదాన శిబిర నిర్వాహకులు, వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, విద్యార్థులు, సమాజ సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ.రామారావు మాట్లాడుతూ... తలసేమియా బాధిత చిన్నారులకు సేవ చేయడమనేది అతిపెద్ద మానసిక ప్రశాంతత కలిగించే కార్యక్రమమన్నారు. రెడ్క్రాస్ కాకినాడ తలసేమియా కేంద్రంలో రక్త మార్పిడి చేసుకుంటున్న పిల్లల్లో కొందరు ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రామచంద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తరపున త్వరలో ఇంపోర్టెడ్ లింబ్స్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తలసేమియా కేంద్రం చాలా బాధ్యతతో కూడుకున్న కార్యక్రమమని జిల్లాలో ప్రముఖ పిల్లల డాక్టర్లు శ్రీనివాసులు, రఘువంశీ వంటి వారు ఈ కేంద్రంలో సేవా చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామం అని కొనియాడారు. డీఆర్వో మలోల మాట్లాడుతూ.. రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జన్యు సంబంధిత తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రెడ్క్రాస్ రక్త మార్పిడి, మందులు, ఇతరత్రాలను పూర్తి ఉచితంగా అందించేలా ప్రణాళిక చేయటం చాలా సంతోషకరమన్నారు. యూపీఎస్సీ ఫ్లాగ్ షిప్ పరీక్ష రేపు అనంతపురం అర్బన్: ఈ నెల 12న జిల్లాలోని రెండు కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ప్లాగ్ షిప్ (ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఎ) పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ–1 (సీడీఎ) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ ఆకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ–1(ఎన్ఏ) పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్స్పెక్టింగ్ అధికారులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు టి.పద్మావతి, రామ్మోహన్, రూట్ అధికారులుగా డ్వామా పీడీ సలీమ్బాషా, మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నపత్రాలకు కస్టోడియన్గా డీఆర్వో మలోల ఉంటారన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే చేరుకోవాలని, అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. మద్యం తాగి వ్యక్తి మృతి అనంతపురం సెంట్రల్: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురంలోని శారదానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను ఉమానగర్కు చెందిన ఆదిశేషయ్య(45)గా వన్టౌన్ పోలీసులు గుర్తించారు. కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆదిశేషయ్య గురువారం శారదనగర్లోని ఓ మద్యం షాపులో పూటుగా మద్యం తాగాడు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద మత్తులో పడిపోయాడు. అపస్మారక స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికుల సమాచారంతో వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
గోవిందరెడ్డికి కన్నీటి వీడ్కోలు
● ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు మడకశిర రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మెళవాయి గ్రామంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మడకశిర ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్థార్ కళ్యాణచక్రవర్తి, సీఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ సోమశేఖర్రెడ్డి, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, బంధువులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయికి జైలు శిక్షహిందూపురం: చెల్లని చెక్కులకు సంబంధించి రెండు కేసుల్లో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రమణయ్య తీర్పు వెలువరించారు. వివరాలు.. హిందూపురం పట్టణానికి చెందిన సరోజాబాయి, పవిత్రకు ష్యూరిటీ కింద చెక్కులు ఇచ్చి చెరో రూ.5 లక్షలు వంతున బద్రి ఫైనాన్స్ నిర్వాహకుడు ఎంఎన్ఎస్ మణి అప్పు చేశాడు. నిర్ణీత గడువు ముగియడంతో ఆ చెక్కులను వారు క్యాష్ చేసుకునేందుకు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అయితే మణి ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు కాస్త చెల్లకుండా పోయాయి. దీంతో వారిద్దరూ సీనియర్ న్యాయవాది సి.రామచంద్రారెడ్డి ద్వారా న్యాయస్థానంలో కేసులు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను విచారించిన న్యాయమూర్తి రమణయ్య... నేరం రుజువు కావడంతో ముద్దాయి ఎంఎన్ఎస్ మణికి ఆరు నెలల జైలుశిక్ష తోపాటు రూ.5 లక్షల వంతున జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై తాను ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు ముద్దాయి అనుమతి కోరగా... బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. -
ఫాదర్ ఫెర్రర్కు ఘన నివాళి
బత్తలపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరితపించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కు పలువురు ఘన నివాళులర్పించారు. ఫాదర్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని గురువారం బత్తలపల్లిలోని ఫీల్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, స్పెయిన్ దేశస్తులు సంజీవ్ సంఘ్వాన్, యమున దంపతులు హాజరయ్యారు. ముందుగా ఫాదర్ ఫెర్రర్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా అన్నే ఫెర్రర్ మాట్లాడారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్దరణతో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం జిల్లా వాసులు సాగించిన పోరాటాలను కొనియాడారు. 57 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చివరకు రెన్యూవల్ పునరుద్దరించిందన్నారు. కష్ట సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శుక్రవారం అన్నే ఫెర్రర్ పుట్టిన రోజు కావడంతో ముందస్తుగానే ఆమెకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. రాత్రి 9 గంటలకు మారుతీ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్డీ హనుమంతప్ప, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్లు పాల్, అక్బర్, మనోరంజన్, దశరథరామయ్య, హరి, శర్మ, రీజనల్ ఇంజనీర్ మధుసూదన్, ఆసుపత్రి ఇన్చార్జ్ హనుమంతరెడ్డి, సీబీఆర్ సెంటర్ మేనేజర్ రామకృష్ణ, సీబీఆర్ ఎస్టీఎల్ అంకాల్కుమార్, సోషల్ వర్కర్ లక్ష్మణ్, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
పుట్టపర్తి టౌన్: తీవ్ర ఒత్తిళ్ల మధ్య పని చేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాలు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అధికార యంత్రాంగం సంయుక్తంగా పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీ మహల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని గురువారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే పని తీరు కూడా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్ఓ భరత్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెఎస్ మధుసూదన్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచన -
రాయలసీమ భవిష్యత్తు కోసం ‘సీమ’ నేతలు పిడికిలి బిగించి ఏకమవుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంపై భగ్గుమంటున్నారు. ఆరునూరైనా ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభతో పాటు
సాక్షిప్రతినిధి అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలపై రెండు ప్రభుత్వాలకు హక్కు లభించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం జలాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ప్రారంభించింది.శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తోడేసేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఈక్రమంలో ‘సీమ’ నష్టపోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పేరుతో రూ.3,850 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన హయాంలో రూ.990 కోట్ల విలువైన పనులు చేపట్టి బిల్లులు కూడా చెల్లించేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ను నిలిపేయాలని చంద్రబాబును ఆదేశించడం, బాబు అందుకు ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే! ఈ విషయాన్ని రేవంత్ స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ కోసం గ్రేటర్ రాయలసీమ నేతలు ఉద్యమిస్తున్నారు. ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అనంతపురంలో గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించ తలపెట్టారు. కీలకమైన ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డి, అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయకర్తలు హాజరు కానున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ఎందుకంటే.. శ్రీశైలం ప్రాజెక్టును ‘సీమ’వాసుల త్యాగాలతో 1981లో నిర్మించారు. 2003–04 వరకూ రోజుకు 11 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి ‘సీమ’కు తరలించేవారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 7 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించవచ్చు. 2004 వరకూ 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ‘సీమ’ బాగు గురించి ఆలోచించలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఎంతమంది అడ్డుపడినా ఖాతరు చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశారు. రాష్ట్రం విడిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మొదటికొచ్చినట్లైంది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నపుడే రోజుకు 2 టీఎంసీలు తరలించుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టింది. కృష్ణాజలాలు శ్రీశైలం చేరుకోక ముందే రోజుకు 8 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం సామర్థ్యం కూడా 129 టీఎంసీల నుంచి 229 టీఎంసీలకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇదే జరిగితే ‘సీమ’ ఎడారిగా మారే పరిస్థితి. పైగా శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు, అంతకు తక్కువ ఉంటే పూర్తిస్థాయి నీటిని తీసుకోలేం. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతిరెడ్డిపాడు దిగువన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈర్ష్యతో కేసులు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందని, తన రాజకీయ మనుగడే ప్రమాదంలో పడుతుందనే ఈర్ష్యతో మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ సానుభూతి పరులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో చంద్రబాబు కేసులు వేయించారు. ఈ క్రమంలో అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతి ఉందని, ఆ ప్రాజెక్టుల కిందే చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్లో అప్పటి ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఓవైపు ఎన్జీటీ అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు పనులను పరుగులు పెట్టించింది. 2024 మే వరకూ వేగంగా పనులు జరిగాయి. అప్పటికి రూ.990 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. సాకారమైతే సస్యశ్యామలం.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. తాగునీటి కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు మరింత మేలు జరుగుతుంది. హంద్రీ–నీవా ఫేజ్–1లో ‘అనంత’లో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–2లో 90,235 ఎకరాలు ఉంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో ఫేజ్–2లో 2.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–1, 2 కింద ఉమ్మడి ‘అనంత’లో 4.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 40 టీఎంసీలకుపైగా నీరు అవసరం. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే ఫేజ్–2లోని వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని హంద్రీ–నీవాకు గాలేరు–నగరి ద్వారా నీరు అందిస్తారు. దీంతో అనంత నుంచి ఆ రెండు జిల్లాలకు కృష్ణా జలాలు పంపాల్సిన అవసరం ఉండదు. ఆ నీటిని మనమే వాడుకోవచ్చు. 4.11 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించవచ్చు. అనుకున్నంత నీటిని హంద్రీ–నీవా ద్వారా తీసుకురాలేకపోవడంతో ఏటా చెరువులకు మళ్లించడం మినహా డిస్ట్రిబ్యూటరీలు చేసి ఆయకట్టుకు అందించడం లేదు. 40 టీఎంసీలు మనమే తీసుకునే పరిస్థితి వస్తే చెరువులతో పాటు ఉప, పిల్ల కాలువలు నిర్మించి పొలాలకు నీరు పారించుకోవచ్చు. బాబు దగాపై బిగుస్తున్న పిడికిలి రాయలసీమ లిప్ట్ సాధన కోసం ఏకమవుతోన్న ‘సీమ’ నేతలు, ప్రజలు నేడు అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం ‘సీమ’ను సుభిక్షం చేసేందుకు రూ.3,850 కోట్లతో పనులు చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులతో కేసులు వేయించి ఆపించిన చంద్రబాబు -
12న ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
లేపాక్షి: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సీఈటీ) నిర్వహిస్తున్నట్టు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ చందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5వ తరగతికి, 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్, అలాగే వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, హాల్టికెట్, అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పాఠశాల కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆమె సూచించారు. గ్యాస్, రేషన్ పంపిణీ పక్కాగా జరగాలి ప్రశాంతి నిలయం: జిల్లాలో గ్యాస్, రేషన్ పంపిణీ పారదర్శకతతో పక్కాగా జరగాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో పౌరసరఫరాల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ డోర్ డెలివరీ చేయాలని, బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సిలిండర్లు అందించాలన్నారు. అలాగే డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కమర్షియల్ సిలిండర్లను ప్రాధాన్యతా క్రమంలో పాఠశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు అందించాలన్నారు. రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6–ఏ కేసులు నమోదు చేయాలన్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, పలువురు డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. -
బూతురాతల రాధాకృష్ణను అరెస్టు చేయండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ పెనుకొండ రూరల్: ‘కొత్త పలుకు’ పేరుతో చెత్తరాతలు రాసి వైఎస్సార్ సీపీ నేతల భార్యలను తీవ్రంగా అవమానించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో రాధాకృష్ణ రాసిన రోత రాతలను నిరసిస్తూ గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. వీకెండ్ కామెంట్స్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఛానల్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే రాధాకృష్ణ తానో జర్నలిస్టునన్న విషయం కూడా మరచిపోయారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పవిత్రమైన భార్య, భర్తల బంధాన్ని తప్పు పట్టే విధంగా వర్ణించడం దుర్మార్గమన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా...కూటమి పెద్దలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, గజేంద్ర, నరసింహమూర్తి, మండల మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, నాయకులు ఎన్. నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పితే పోరుబాటే
● 12వ పీఆర్సీ నియమించాలి ● 30 శాతం ఐఆర్ వెంటనే ఇవ్వాలి ● ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్ పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పితే తామంతా పోరుబాట పట్టక తప్పదని ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విడతల వారీ ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులు గురువారం కొత్తచెరువులోని పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్రెడ్డి, కార్యదర్శి గౌస్ లాజంతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు పవన్కళ్యాణ్ కూడా ఉపాధ్యాయులకు అలవిగాని హామీలిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించడంతో పాటు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు కోశాధికారి గోపాల్, డిప్యూటీ కార్యదర్శి చంద్ర, సమీఉల్లా, గోపాల్ నాయక్, జాఫర్ హుస్సేన్, వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఆ సంఘ నేతలు ప్రకాశ్రెడ్డి, మస్తాన్, వెంగమ నాయుడు, యూటీఎఫ్ నేతలు రామకృష్ణనాయక్, లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ, ఏపీటీఎఫ్ నేత అశోక్కుమార్, ముత్యాలప్ప, రాజశేఖర్ పాల్గొన్నారు. -
తీర్థయాత్రికులకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 1 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలతో విశాఖ, హైదరాబాద్ నుంచి రైళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ● కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం, తంజావురు, అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర (ఎస్సీజెడ్జీ 60) ఈ నెల 27న ప్రారంభమై మే 4న వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్ ధర రూ.14,700 ఉంటుంది. విశాఖపట్నంలో రైలు బయలుదేరి తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంట జంక్షన్ల మీదుగా వెళ్తుంది. ● హరిద్వార్–మాతా వైష్ణోదేవి–రిషికేష్ యాత్ర (ఎస్సీజెడ్బీ 57) మే 12న ప్రారంభమై మే 21 వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్ ధర రూ.16,500, 3 ఏసీ ధర రూ.25,700, 2 ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. సికింద్రాబాద్లో బయలుదేరే రైలు భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, బల్హర్ష, వార్తా నాగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ● ఈ రైళ్లలో సౌకర్యాల్లో భాగంగా బస్సు, హోటల్తో మూడు పూటలా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు. ప్రమాద బీమా, కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు రైళ్లలో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. టికెట్ను విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి బుక్ చేసుకునే ప్రయాణికులు 9281495847, 9281495848, 9281030748 నంబర్లకు, హైదరాబాద్ నుంచి బుక్ చేసుకునే వారు 9701360701, 9281030727, 7670900698 నంబర్లకు సంప్రందించాలని అధికారులు సూచించారు. -
రోత రాతలపై మహిళాగ్రహం
సాక్షి, పుట్టపర్తి జర్నలిస్టు ముసుగులో మహిళల గురించి దిగజారుడు రాతలు రాసిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. భార్యకు, చెల్లికి తేడా లేకుండా నీచంగా మాట్లాడిన రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం మహిళలను కించపరిచేలా విధంగా కథనాలు ప్రచురించిన రాధాకృష్ణ... తన దిగజారుడు తనాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని.. కానీ రాధాకృష్ణ పాత్రికేయ వృత్తిని అడ్డు పెట్టుకుని బ్రోకరిజం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే రాధాకృష్ణ వైఎస్సార్సీపీ మహిళలను కించపరిచేలా వార్తలు ప్రచురించారన్నారు. హిందూపురంలో... రాధాకృష్ణ దిగజారుడు జర్నలిజాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో... వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్కు వినతిపత్రం అందజేశారు. మడకశిరలో... ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించ పరుస్తూ చేసిన వ్యాఖ్యలపై మడకశిరలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్మవరంలో... ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మహిళలు మండిపడ్డారు. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు, జయమ్మ, సానె వరలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే దిగజారుడు రాతలపై నిరసనలు, ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ -
కందికుంట అరాచకం!
కదిరి: దేశవ్యాప్తంగా డా.బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే కదిరిలో మాత్రం కందికుంట రాజ్యాంగం అమలవుతోంది. తన స్వార్థం కోసం ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బంది పెట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అరాచకంగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం.. అనే రీతిలో చెలరేగిపోతున్నారు. నిబంధనల ప్రకారం రెండు రోజుల క్రితం జరిగిన కొబ్బరి కాయల టెండర్ తాను చెప్పిన వారికి కాకుండా మరో వ్యక్తి దక్కించుకోవడంతో దాన్ని రద్దు చేయించి రీటెండర్ పిలవాలని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యేనే ఆర్డర్ వేయడంతో ఏం చేయాలో తెలియని ఈఓ ఆ టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల మేరకు టెండరు ఖరారు.. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తూర్పు గోపురం ఎదుట కొబ్బరి కాయలు విక్రయించుకునేందుకు ( 2027 మార్చి వరకు) ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ–టెండర్తో పాటు సీల్డ్ టెండర్, అలాగే బహిరంగ వేలం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంటి సీల్డ్ టెండర్ ద్వారా రూ.31.21 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇదే టెండర్ కోసం అదే పార్టీకి చెందిన దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు తలుపుల గంగాధర్ ప్రయత్నించినప్పటికీ ఆయన రూ.27.20 లక్షలకు మాత్రమే బహిరంగ వేలంలో తన పాటను ఆపేయడంతో నిబంధనల ప్రకారం హెచ్చుపాట దారుడైన చంటికి ఆలయ అధికారులు టెండర్ను ఖరారు చేశారు. అదే రోజు ఆలయ అధికారులు సూచించిన మేరకు చంటి ఆ మొత్తాన్ని డీడీ రూపంలో ఈఓకు అందజేశారు. రద్దు చెయ్.. లేదంటే సెలవుపై వెళ్లు! తనకు వ్యతిరేకంగా ఉన్న విష్ణువర్దన్రెడ్డి వర్గీయులకు టెంకాయల విక్రయ టెండర్ ఎలా కట్టబెడతారని ఆలయ ఈఓను ఎమ్మెల్యే కందికుంట బూతులు తిట్టినట్లు విష్ణు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ టెండర్ రద్దు చేయకపోతే సెలవుపై వెళ్లిపోవాలని కందికుంట హుకుం జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. న్యాయంగా, నిబంధనల మేరకు జరిగిన టెండర్ను చంటి దక్కించుకున్నారని. ఆయన కోసం అవసరమైతే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళతామని విష్ణువర్దన్రెడ్డి వర్గం చెబుతోంది. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని వారంటున్నారు. ఆగని ఆధిపత్యపోరు.. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి కదిరిలో తనకు వ్యతిరేకంగా పని చేశాడని స్థానిక ఎమ్మెల్యే కందికుంట ఆయనపై కోపంగా ఉన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు రాతపూర్వకంగా కందికుంట ఫిర్యాదు చేసినట్లు ఇటీవల సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మీడియా ముందు ఆ లెటర్ను బయట పెట్టారు. వారిద్దరి మధ్య గత రెండేళ్లుగా కోల్డ్వార్ నడుస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో తనను తేరుపైకి రాకుండా కందికుంట హౌస్ అరెస్ట్ చేయించారని విష్ణు ఆరోజు బహిరంగంగా ఆరోపించారు. కొబ్బరి కాయల టెండర్ను కూడా రూ.4 లక్షలు తక్కువకు పాడిన గంగాధర్కు కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఎలా చెబుతారని విష్ణు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో మహిమ గల కదిరి లక్ష్మీ నరసింహ స్వామితో రాజకీయం చేసిన వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధాస్తారని వారు హెచ్చరిస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుడి ఆదాయానికి గండి కొడతారా? అని భక్తులు ఆగ్రహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా కొబ్బరి కాయల టెండర్ పిలవకుండా జాప్యం చేస్తూ స్వామివారి ఆదాయానికి ఇప్పటికే భారీగా నష్టం తెచ్చారని భక్తులు మండిపడుతున్నారు. పగిలిన ‘అసమ్మతి’ టెంకాయ ఏకపక్షంగా నృసింహాలయ కొబ్బరికాయల టెండర్ రద్దు ఈఓపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించిన ఎమ్మెల్యే! ఈ నెల 16న మరోసారి వేలంపాట టెండర్ రద్దు వాస్తవమే ఈ నెల 7వ తేదీన జరిగిన కొబ్బరి కాయల టెండర్పై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అందుకే వేలం షరతుల్లో పేర్కొన్న వరుస నంబర్ 17ను అనుసరించి ఆ టెండర్ను రద్దు చేస్తున్నాం. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో కొత్తగా మళ్లీ వేలం పాట నిర్వహిస్తాం. –శ్రీనివాసరెడ్డి, ఖాద్రీ ఆలయ ఈఓ -
యూరియా కలిపిన నీరు తాగి గొర్రెల మృతి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో బుధవారం యూరియా కలిపిన నీరు తాగి 13 గొర్రెలు మృతిచెందాయి. స్థానికులు తెలిపిన మేరకు పట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన గొర్రెలను మేపు కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళుతూ.. మార్గ మధ్యంలో దాహమేసిన గొర్రెలు పరుగు తీస్తూ ఓ పొలం వద్ద యూరియా కలిపిన బకెట్లోని నీటిని తాగేశాయి. దీంతో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని కాపరి వాపోయాడు. పట్నం పశు వైద్యాధికారి డాక్టర్ సునీత సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధుడి ఆత్మహత్యఅమరాపురం: అనారోగ్యం తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అమరాపురంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిక్కాటప్ప (80) మంగళవారం రాత్రి తన కుమారుడు మల్లికార్జున ఇంట్లో భోజనం ముగించుకుని గేదెల కొట్టం వద్దకు నిద్రించేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున మాజీ సర్పంచ్ గోవిందప్ప పొలంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కడుపునొప్పి, మూత్రాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవాడని, ఈ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యంహిందూపురం: మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ చంద్రాంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం నుంచి ఆస్తికలు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మృతురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆలయంలో వెండి కిరీటం అపహరణ శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలోని అంబేడ్కర్ నగర్లో వెలసిన రామస్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వారి వెండి కిరీటంతో పాటు 5 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లిన పూజారి గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
యుద్ధ నివారణపై దృష్టి సారించని మోదీ
పుట్టపర్తి టౌన్: ‘తాను విశ్వ గురువు అని, తనకంతా తెలుసు’ అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ.. పశ్చిమాసియా యుద్ధ నివారణపై కృషి చేయకపోవడం బాధాకరమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. మొదటి రోజు సమావేశాలకు బీవీ రాఘవులు హాజరై పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతికి, ప్రశాంతతకు, సామరస్యానికి నిలయమైన పుట్టపర్తిలో యుద్ధాల గురించి చర్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఇరాక్ను సర్వనాశనం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తుంటే.. శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితేనే యుద్ధాన్ని విరమిస్తామని ఇరాక్ అంటోందన్నారు. శతాబ్దాలుగా మనకు ఇరాక్ చౌకగా ముడి చమురును సరఫరా చేస్తోందన్నారు. అలాంటి దేశం నాశనం అవుతుంటే యుద్ధ నివారణకు భారత్ ముందు వరసలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ దేశాల తరపున శాంతికి ప్రధాని మోదీ మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ సీట్లు పెంపుతో మరింత బలపడేలా దృష్టి సారించిందన్నారు. అయితే రిజర్వేషన్లు, సీట్లు పెంచాలన్నా మొదటగా 2026 జనగణన పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ దిశగానే కేంద్రం ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల సంస్కరణలకు సీపీఎం పోరాటాలు సాగిస్తుందన్నారు. కేరళలో తిరిగి లెఫ్ట్ప్రంట్ అఽధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని ఏర్పాటు అంశంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు -
పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి
పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్శాఖ ప్రతిష్ట పెంచాలని హోంగార్డులకు రాయలసీమ రీజియన్ ఇన్చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో బుదవారం నిర్వహించిన హోంగార్డుల ఒక రోజు పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అనంతరం త్వరలో తమిళనాడులో జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే హోంగార్డులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ వలి, ఆర్ఎస్ఐ ప్రదీప్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. రాయలసీమ రీజియన్ ఇన్చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్ -
స్వాతంత్య్ర సమరయోధుడు మెళవాయి గోవిందరెడ్డి కన్నుమూత
● నేడు అంత్యక్రియలు మడకశిర రూరల్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) కన్నుమూశారు. మడకశిర మండలంలోని తన స్వగ్రామం మెళవాయిలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. గురువారం ఉదయం మెళవాయి గ్రామ శివారున ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గోవిందరెడ్డి 1942లో విద్యార్థి దశలోనే శ్రీరామరెడ్డి, కల్లూరు సుబ్బారావు, నీలం సంజీవరెడ్డితో కలసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం పలు ఉద్యమాల్లో ఆయన పాలుపంచుకుంటూ వచ్చారు. ఆయన సేవలకు గుర్తుగా స్వాతంత్య్రనంతరం కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరగిన 75 ఏళ్ల స్వాతంత్య్రదినోత్సవంలో గోవిందరెడ్డిని అప్పటి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కాగా, గోవిందరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, ఈరన్న, సేవామందిర విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీదర్, విశ్రాంత జడ్జి శివలింగేగౌడ్, మాజీ సర్పంచులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు జగన్నాథ్రెడ్డి, వేమారెడ్డి, రామచంద్ర,శివానంద్, వివిధ సంఘాల నాయకులు వేర్వేరుగా మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
మహిళా రైతుకు సత్కారం
ప్రశాంతి నిలయం: చియా సాగుతో అద్భుత ఫలితాలు సాధించిన అమడగూరు మండలం జౌకుల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవిని కలెక్టర్ శ్యాం ప్రసాద్లో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. 1.30 ఎకరాల విస్తీర్ణంలో బైబ్యాక్ విధానం కింద చియా సాగు చేపట్టినట్లు వివరించారు. 11.03 క్వింటాళ్ల దిగుబడి సాధించడంతో క్వింటా రూ.14 వేలు చొప్పున రూ.1.54 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. పెట్టుబడుల పోను రూ.1.39 లక్షలు మిగిలినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఏఓ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయండి ప్రశాంతినిలయం: ఈ నెల 23 వరకూ జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన పోషణ పక్వాడ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. అంగన్వాడీలను బలోపేతం చేయడం, తల్లీబిడ్డల ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, జంక్ ఫుడ్తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. 0–6 ఏళ్ల పిల్లలకు ఆటల ఆధారిత విద్య, సృజనాత్మకత, స్క్రీన్ టైం తగ్గించి బహిరంగ ఆటలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం, డీసీపీఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ దుర్మరణం పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అమరాపురం మండలం విరుపసముద్రం గ్రామానికి చెందిన రవికుమార్ (38)కు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఆ గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం మడకశిరకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో పావగడ తాలూకా గౌడేటి గ్రామంలో మంగళవారం జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంపై వచ్చిన రవికుమార్... రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. దొమ్మతమరి గ్రామ పరిధిలోని ఎల్లగానిగుట్ట ప్రాంతంలో ప్రయాణిస్తుండగా రోడ్డు తగ్గు ప్రదేశంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో రోడ్డుపై పడిన రవికుమార్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. వృద్ధాప్యంలో తమ బాగోగులు ఎవరు చూసుకుంటారంటూ తల్లి అంజినమ్మ రోదించిన తీరు చూపరులను కంటి తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న జేడీఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, ఆర్సీ అంజినప్ప, తిమ్మారెడ్డి, బలరామరెడ్డి, ఎన్ఏ ఈరణ్ణ తదితరులు ఆస్పత్రికి చేరుకుని రవికుమార్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణంకనగానపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం కొండ్రెడ్డిబావి గ్రామానికి చెందిన రైతు కె.రంగారెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తూ అతి కష్టంపై కుమారుడు మధుసూదన్రెడ్డి (25)ని ఏబీఏ వరకు చదివించారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తల్లికి మోకాళ్ల ఆపరేషన్ కోసమని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తండ్రితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న మధుసూదన్రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో తల్లికి వైద్య సేవలు అందించేందుకు వచ్చే ట్రైనీ నర్సుతో (కర్నూలుకు చెందిన యువతి) మధుసూదన్రెడ్డి పరిచయమై ప్రేమగా మారింది. మూడు, నాలుగు నెలల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ యువతి తనను తప్పించుకుని తిరుగుతుండటంతో మధుసూదన్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటి వద్దనే పడుకున్న మధుసూదన్రెడ్డి... అర్ధరాత్రి సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో కర్నూలుకు చెందిన యువతి తనను ప్రేమించి మోసం చేసినట్లుగా రాసి ఉంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఎం.రిజ్వాన్ తెలిపారు. -
భక్తిపారవశ్యం.. జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. రత్నగిరితో పాటు గుడ్డగుర్కి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవికి గ్రామస్తులు జ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అలంకరణలో లక్ష్మీదేవి.. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారి మూలవిరాట్ను, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో విశేషంగా అలంకరించారు. సుప్రభాత సేవ మొదలుకుని అంకురార్పణ, అభిషేకం, కుంకుమార్చన పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో కనిపించిన అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చల్లంగ చూడు తల్లీ.. సాయంత్రం మహిళలు నియమనిష్టలతో జ్యోతులను సిద్ధం చేసుకుని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ తిరిగి గర్భగుడిలోని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అందరినీ చల్లంగ చూడు తల్లీ అంటూ ప్రార్థించారు. జ్యోతుల ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మొక్కుబడుల్లో భాగంగా అమ్మవారికి పొట్టేళ్లు, మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సాయంత్రం విందు భోజనాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు, వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలో ఉన్నవారు కూడా ఉత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కిక్కిరిసిన రత్నగిరి.. లక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన జ్యోతుల ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో రత్నగిరి గ్రామం కిక్కిరిసిపోయింది. గ్రామంలోని ఏ ఇళ్లు చూసినా బంధువులతో కళకళలాడుతూ కనిపించింది. ఇక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. గాజుల అంగళ్ల వద్ద మహిళలు, చిన్నారులు రద్దీ పెరిగింది. గ్రామస్తులు స్నేహితులు, బంధువులకు గాజులు వేయించి ముచ్చట తీర్చుకున్నారు. నేడు వివిధ గ్రామాల్లో జ్యోతుల ఉత్సవాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం టీడీ పల్లి, హెచ్ఎం పల్లి, వన్నారనపల్లి, హులీకుంట, బాజయ్యపాళ్యం, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, హొట్టేబెట్ట, దాసప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, వన్నప్పపాళ్యం, అలుపనపల్లి, ఏ.గొల్లహట్టి, దొమ్మరహట్టి, రొళ్లకొండ తదితర గ్రామాల్లో అమ్మవారికి జ్యోతుల నిర్వహించనున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. సంప్రదాయ కట్టు, బొట్టుతో మహిళలు... వివిధ పుష్పాలతో అలంకరించిన కలశాలు.. వాటిపై అమ్మవారి కోసం వెలిగించిన జ్యోతులు.. డప్పు దరువులు.. భక్తుల ఆనందోత్సాహాల నడుమ రత్నగిరిలో భక్తిపారవశ్యం ఉప్పొంగింది. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. వైభవంగా మహాలక్ష్మీదేవి జ్యోతుల ఉత్సవం వందలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి జ్యోతులను సమర్పించిన మహిళలు -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
ధర్మవరం: జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ రోతరాతలు రాసిన రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ నీచపురాతలను ఖండిస్తూ బుధవారం పట్టణంలోని పీఆర్టీ సర్కిల్లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు శీలం విష్ణువర్దన్, వినయ్ తేజ్గౌడ్, మండల అధ్యక్షుడు బిల్లే శ్రీనివాసులు, నాయకులు పోతుకుంట రామ్మోహన్రెడ్డి, హరీష్, సూర్యప్రతాప్రెడ్డి, ప్రవీణ్, బన్నీ తదితరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... వైఎస్ జగన్ చెప్పిన ‘మావిగన్’ కార్యరూపం దాలిస్తే తమకు జరగబోయే నష్టాన్ని ఊహించుకుని భయపడిన కూటమి నేతలు... ఏబీఎన్ రాధాకృష్ణతో వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై నీచపు రాతలు రాయించారని మండిపడ్డారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం -
ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు అన్యాయం చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించుకుపోవడంతో పాటు అస్మదీయ కాంట్రాక్టర్లకు భారీఎత్తున లబ్ధి చేకూర్చడానికే హంద్రీ–నీవా లైనింగ్ పనులు చేపట్టారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడంతో చుట్టుపక్క
ఆత్మకూరు/ కనగానపల్లి: చంద్రబాబు ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయించి సమీపంలో భూగర్భజలాలు అడుగంటేలా చేస్తూ రైతులకు కన్నీళ్లు మిగిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం ఉమ్మడి జిల్లా ప్రజలకు శాపంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా నీటిని సాఫీగా తీసుకెళ్లాలని కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే కాంక్రీట్తో లైనింగ్ చేస్తే నీరు ఆగకుండా ముందుకెళ్లిపోతాయి. సమీప ప్రాంతాల్లో నీరు ఇంకి భూగర్భజలాలు పెంపొందే అవకాశం లేకుండా పోతుంది. ఇలా చేయడం వల్ల తమకు నీటి ముప్పు తప్పదని రైతులు ఆందోళనలు చేసినా పెడ చెవిన పెట్టారు. రైతుల గోడు పట్టించుకోకుండా కాంక్రీట్ లైనింగ్ చకాచకా చేసేశారు. పనులు జరిగిన ఏడాదిలోపే రైతుల భయం నిజమైంది. భూగర్భజల మట్టం పడిపోయింది. క్రమేణా బోరుబావుల్లో నీరు తగ్గిపోయింది. కళ్లెదుటే కాలువలో నీళ్లు పోతున్నా ఉపయోగం లేకుండాపోయింది. రెండు ఇంచుల నీరు వచ్చే బోర్లు కూడా ఇప్పుడు రెండు ఎకరాలను తడపలేని పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాలువ పక్కనే బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా బయటకు రాలేదంటున్నారు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేకపోతున్నారు. దీంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడంతో వేగంగా ముందుకు వెళ్తున్న నీరు కాలువ పక్కనే బోరు వేసినా చుక్కనీరు పడని దృశ్యం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ భూమిలో ఇంకని నీళ్లు.. అడుగంటిన బోర్లు నీరందక పంటలు నిలువునా ఎండుతున్న వైనం కాలువ సమీపంలో బోర్లు వేసినా చుక్కనీరు పడని వైనం నీరందక బీళ్లుగా మారిన పొలాలు... లబోదిబోమంటున్న రైతులు -
పరిస్థితి తారుమారైంది
ఇది వరకు కాలువలో నీరు పారేటప్పుడు సమీపంలోని భూముల్లో నీరు ఇంకేవి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా వచ్చేవి. కానీ హంద్రీ– నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడంతో పరిస్థితి తారుమారైంది. బోరు బావుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. మా గ్రామానికి చెందిన ఒక రైతు కాలువ పక్కనే నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడలేదు. పచ్చగా ఉన్న భూములు కాస్తా ‘కాంక్రీట్ లైనింగ్’ పుణ్యమా అని బీళ్లుగా మారిపోతున్నాయి. – సుధాకర్రెడ్డి, రైతు, వై.కొత్తపల్లి, ఆత్మకూరు మండలం -
అపరాల సాగును ప్రోత్సహించాలి
ప్రశాంతి నిలయం: వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటలతో పాటు తక్కువ సమయంలోనే పంట చేతికొచ్చే కొర్ర, జొన్న, సజ్జ, అపరాల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కదిరి ప్రాంతంలో విజయవంతమైన ‘చియా’ సాగును జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ‘చియా’ సాగు పెరిగితే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఫారంపాండ్ల ప్రాముఖ్యతను వివరించి ప్రతి రైతూ తన పొలంలో నిర్మించుకునేలా వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. వ్యవసాయాధికారులు వారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్ర పర్యటనలు చేసి రైతులకు పంటల సాగులో సాంకేతిక తోడ్పాటును అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణాన్ని మరో 10 శాతం అధికం చేయాలని, ప్రతి అధికారి తమ పరిధిలో 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో మామిడి, దానిమ్మ, అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలన్నారు. యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ సమాచారం కోసం ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, కోఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు. ‘చియా’ సాగు విస్తీర్ణం పెంచాలి ఖరీఫ్ సన్నద్ధతపై సమీక్షలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
హంస వాహనంపై ఊరేగిన చౌడేశ్వరీదేవి
ఓడీచెరువు(అమడగూరు): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి రథం ఆలయం నుంచి బయలుదేరి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ మంగళవాయిద్యాల నడుమ సాగింది. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. కార్యక్రమానికి గాజులపల్లికి చెందిన జి.శాంతమ్మ, రాంమూర్తి, హర్షిత, నితిన్, లావణ్య, తేజస్, రామలక్ష్మమ్మ, బాలకృష్ణలు కార్యనిర్వహకులుగా వ్యవహరించారు. విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణాకటాక్షలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఇంటర్ మూల్యాంకనం పూర్తి పుట్టపర్తి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో బుధవారం పూర్తయ్యిందని డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని మూల్యాంకన క్యాంపునకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,09,708 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తర్వాత బుధవారంతో మార్కుల నమోదు పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రమంతటా మూల్యాంకనం ఈనెల 8, 9 తేదీల్లో పూర్తవుతుందని, ఫలితాలు 12న వెలువడే అవకాశం ఉందన్నారు. అలాగే మూల్యాంకనంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు పగడ్బందీగా చేపట్టారన్నారు. అందరి సహకారంతో గడువులోపు క్యాంపు పూర్తి చేశామన్నారు. -
కూలీలకు నీడ, నీరు కల్పించాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం పుట్టపర్తి: వీబీజీ రామ్జీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రాంతంలో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన బుక్కపట్నం సమీపంలోని కువ్వకొండ ప్రాంతంలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన ఖండిత కందకాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే ప్రాంతంలో తప్పనిసరిగా మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. అడిగిన కూలీలందరికీ పనులు కల్పించాలన్నారు. జిల్లాలో 77 వేల మందికి పనులు కల్పించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 19 లక్షల పని దినాలను పూర్తి చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ శ్యాంప్రసాద్ గునపం పట్టి మట్టి తవ్వారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ విజయ్ప్రసాద్, క్లస్టర్ ఏపీడీ రమేష్బాబు, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, ఈసీ మంజునాథ్, సిబ్బంది ఉన్నారు. మాతాశిశు మరణాలను నివారించాలి : కలెక్టర్ప్రశాంతి నిలయం: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పీజీఆర్ఎస్ హాలులో వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేయాలన్నారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై గ్రామ స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ ఓపీ నిర్వహించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. ఎన్సీడీ సర్వే వేగవంతం చేయాలన్నారు. అర్హత లేని చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు. రీ సర్వే పక్కాగా నిర్వహించాలి : జేసీఓడీచెరువు(అమడగూరు): ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రక్రియ పారదరర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గడువు లోపు సర్వే పూర్తి చేసి పాసుబుక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట తహసీల్దార్ మారుతీప్రకాష్, మండల సర్వేయర్, వీఆర్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వీడాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన అమడగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. త్వరలో కంప్యూటర్ ఆపరేటర్తో పాటు అన్ని గ్రామాలకు వీఆర్ఓలను నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ మారుతీప్రకాష్,ఆర్ఐ రామకృష్ణారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు -
పంటంతా ఎండిపోయింది
కనగానపల్లి మండలం పాతపాళ్యం కొత్తూరుకు చెందిన రైతు వెంకటరామిరెడ్డి రబీ సీజన్లో బోరుబావి కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. అప్పుడు వ్యవసాయ బోరుబావిలో నీరు పుష్కలంగా వచ్చేవి. కొద్దిరోజులుగా నీరు తగ్గుముఖం పడుతూ వచ్చింది. సక్రమంగా నీరందకపోవడంతో పంటంతా ఎండిపోతోంది. హంద్రీ–నీవా కాలువకు 150 మీటర్ల దూరంలోనే పొలం ఉన్నా.. కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. రైతు చేసేది లేక పంటను దున్నేసి పశువులకు మేతగా వాడుకుంటున్నాడు. దాదాపు రూ.3 లక్షల వరకు విలువైన పంట దిగుబడులు కోల్పోవాల్సి వచ్చింది. -
రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజం
చిలమత్తూరు: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జర్నలిజం చేయడం లేదని బ్రోకరిజం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. మంగళవారం వారు పార్టీ శ్రేణులతో కలిసి హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చెప్పిన ‘మావిగన్’ అమలులోకి వస్తే పరిస్థితి ఏమిటని భయపడిన కూటమి నేతలు ఏబీఎన్ రాధాకృష్ణతో వైఎస్సార్సీపీ నేతల భార్యలపై నీచపు కథనాలు, రోత రాతలు రాయించారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోతరాతలు క్షమించరాని నేరంమడకశిర: ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై మడకశిరలో మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ అని, మహిళలను కించ పరిచే విధంగా రోత రాతలు రాయడం క్షమించరాని నేరమన్నారు. వెంటనే రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, మండల మాజీ కన్వీనర్ రామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణరెడ్డి, పట్టణ కార్యదర్శి అంజలి, పట్టణ ఉపాధ్యక్షుడు గోపి, మాజీ కౌన్సిలర్ అన్సర్, పట్టణ నాయకులు ధను, నగేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రంగనాథ్, లక్ష్మీనారాయణ, వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఆర్కేను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ -
జగన్ హయాంలోనే మహిళలకు పెద్దపీట
చిలమత్తూరు: మహిళలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలకంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కువ అవకాశాలు కల్పించారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం హిందూపురం పట్టణంలోని సరిగమ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి అధ్యక్షతన మహిళా విభాగం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, జోనల్ విభాగం అధ్యక్షురాలు విజయ మనోహరి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రోజుకు 4 నుంచి 5 హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 60 –70 మంది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో మహిళలను సామాజికంగా , రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. రాజకీయంగా మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. గతంలో పథకాలన్నీ మహిళల పేరుపైనే ఇస్తూ ఆర్థికంగా బలీయంగా మార్చారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తుండటంతో 87 ఎమ్మెల్యే సీట్లు, 13 ఎంపీ సీట్లు రాబోతున్నాయన్నారు. మావిగన్ పై భయంనే ఏబీఎన్ రాధాకృష్ణ నీచపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నేతల భార్యలపై నీచపు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. బీసీశాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పింఛన్ ఇప్పించలేకపోయిన సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. అన్యాయం చేస్తున్న కూటమి నేతలకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెనుకొండ నియోజకవర్గ పరిశీలకురాలు మధుమతిరెడ్డి, మహిళా విబాగం నేతలు గాజుల శ్వేతారెడ్డి, మహిళా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలిచ్చారు హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం మహిళా సదస్సులో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి -
ఆడిట్ చేస్తే అవినీతి తేలుతుంది
ఒకప్పుడు ఇళ్ల ముందు పశువులు, గేదెలు, ఊరు ఆనుకొని గొర్రెలు, మేకల మందలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటికి మేతతో పాటు తాగడానికి నీళ్లు కూడా లేవు. దిక్కుతోచని పరిస్థితుల్లో సంతలకు తోలుకెళ్లి తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. నీటి తొట్టెల పథకం నీరుగారిపోయింది. ఆడిట్ చేస్తే అందులో జరిగిన అవినీతి బయటపడుతుంది. – జైనుల్లా, రైతువిభాగం జిల్లా నాయకులు, వైఎస్సార్సీపీ, కదిరి చర్యలు తీసుకుంటాం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలు నిర్మించాం. ఇంకా కొన్ని నిర్మించాల్సి ఉంది. స్థానికంగా కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే నిర్మించిన తొట్టెల్లో నీరు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలదే. ఎక్కడైనా నీరు నింపలేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. – విజయ ప్రసాద్, డ్వామా పీడీ -
వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు
కదిరి టౌన్: వైఎస్సార్సీపీ నేతల భార్యలను కించపరుస్తూ తన పత్రికలో తప్పుడు రాతలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సీఐ వి.నారాయణరెడ్డికి ఫిర్యాదు ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, నాయకులు మాట్లాడుతూ... సభ్యసమాజం తలదించుకునే విధంగా అత్యంత జుగుప్సాకర భాషతో వైఎస్సార్సీపీ నేతలను తిడుతూ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్లో కాలమ్ రాశారన్నారు. దాన్నే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో కూడా ప్రసారం చేశారన్నారు. తక్షణమే పేపర్, ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యమన్నారు. డబ్బా చానల్ పెట్టుకొని ముఖ్యమంర్రి చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు రవికుమార్రెడ్డి, మణికంఠనాయక్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్రెడ్డి, నాయకులు రమేష్యాదవ్, రామచంద్ర, భాస్కర్, సదాఖత్, సమీర్ఖాన్, షకిల్, ఎయెసానా తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
గుడిబండ: ‘మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలి. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. మహిళలు అనేక వ్యాపారాలు చేయడం.. లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉంది’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధలోని కరెకెర గ్రామంలో పర్యటించి పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, కొర్రమీను చేపల పెంపకం కేంద్రాన్ని, పాల డెయిరీ, ఆక్వా యూనిట్ను సందర్శించారు. అనంతరం జిల్లాలోనే తొలిసారిగా కరికెర గ్రామంలో ‘భర్తన్ బ్యాంక్’ను (స్టీల్ సామాన్ల బ్యాంక్) ప్రారంభించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కరికెర గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటి సారిగా కరికెర గ్రామంలో భర్తన్ బ్యాంక్ను ఏర్పాటు చేశామన్నారు. కరికెర గ్రామంలో మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమన్నారు. తర్వాత కరికెర గ్రామానికి చెందిన పాల డెయిరీ నిర్వహిస్తున్న లక్ష్మమ్మ ముచ్చటించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, అదనపు సీఈఓ వెంటసుబ్బారెడ్డి, ఎంపీడీఓ కేశవరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీకి నోటీసులు పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డీఆర్డీఏ పీడీ నరసయ్యకు నోటీసులు జారీ చేశారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన వి.గంగాధర్ ఓ విషయమై 2024 అక్టోబర్ 21న సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు పీడీకి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 16న వర్చువల్గా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధిపుట్టపర్తి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందాం.. ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దామని డీఎంహెచ్ఓ ఫైరోజబేగం పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఆహారపు అలవాట్లు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నాగేంద్రనాయక్, డీఈఎంఓ సుబ్రహ్మణ్యం, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, ఏపీ ఎన్జీఓ అసోషియేషన్ నాగేంద్ర, బాబా ఫకృద్దీన్, డిప్యూటీ హెచ్ఈఓ రామలక్ష్మి, ఏఎంఓ లక్ష్మీనాయక్ శివరాం, దేవేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా జలధి ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జలధి, గంగ పూజను ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూల విరాట్ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాన్ని పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత సమీపంలోని పాలబావి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చారు. గంగా జలంలో అమ్మవారి విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. అమ్మవారికి కట్టిన వడి బియ్యం, గాజులు, పండ్లు, పూలు, కొత్త దుస్తులు ఇతరత్ర వాటిని నైవేద్యంగా పాలబావికి సమర్పించారు. తిరిగి ఉత్సవ విగ్రహాన్ని యథావిధిగా ఆలయ ప్రాంగణంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు జ్యోతులను ఊరేగింపుగా తీసుకుచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి జ్యోతుల ఉత్సవాలు మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వివిధ గ్రామాల వారి ఆధ్వర్యంలో అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. రోజుకో గ్రామం చొప్పున చుట్టు పక్కల గ్రామాల వారు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. -
మీరా.. మేమా!
గోరంట్ల: గోరంట్ల మండలంలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి వర్గీయులు వేరు కుంపట్లు పెట్టుకుని ప్రతి విషయానికీ ఒత్తిడి చేస్తుండడంతో ఎవరి మాట వినాలో తెలియక అధికారులు నలిగిపోతున్నారు. మండలంలో అభివృద్ధి పనులు తమకు తెలియకుండా జరగడానికి వీలు లేదని అధికారులపై మంత్రి సవిత వర్గం అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతే స్థాయిలో ఎంపీ పార్థసారథి వర్గీయులు కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. తాము కూడా అధికార పార్టీకి చెందిన వారమేనని, అభివృద్ధి పనుల్లో తమకు సైతం భాగస్వామ్యం కల్పించాలని ఒత్తిడి తీసుకొస్తుండటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన నాయకులు సైతం తమకూ అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెస్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రూపు రాజకీయాల కారణంగా మండలంలో అభివృద్ధి అటకెక్కిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారపు సంత వేలంపాట రద్దుకు పావులు.. గోరంట్ల పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రావికుంట చెరువు ప్రాంగణంలో సంత నడుస్తుంది. వారపు సంతలో దుకాణదారుల నుంచి గుత్త వసూలు నిమిత్తం సంవత్సర కాలనికి వేలం పాట నిర్వహిస్తారు. ఈ నెల 3న వారపు సంతకు సంబంధించి గోరంట్ల పంచాయతీ కార్యాలయంలో వేలం పాట నిర్వహించగా.. ఎంపీ పార్థసారథి వర్గీయుడు పులచెట్లపల్లి అశ్వర్థరెడ్డి రూ.35.43 లక్షలకు పాట దక్కించుకున్నాడు. అయితే ఎంపీ వర్గీయుడు దక్కించుకున్న వేలం పాట రద్దు చేయాలంటూ మంత్రి సవిత వర్గీయులు పంచాయతీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో వేలం పాట రద్దు చేయకూడదంటూ ఎంపీ పార్థసారథి సైతం నేరుగా జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ● గోరంట్ల మండలంలో తారస్థాయికి గ్రూపు రాజకీయాలు ● ఒత్తిడిలో నలిగిపోతున్న అధికారులు -
గ్యాస్ సిలిండర్ పేలి బోదకొట్టం దగ్ధం
ఎన్పీకుంట: మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలి బోదకొట్టం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి గొర్రెలు మేపుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం గొర్రెలను మేపునకు తీసుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో సిలిండర్ గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారిని శకుంతల సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. 9న మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య శిబిరం ప్రశాంతినిలయం: అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు ఈనెల 9వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, డీసీహెచ్ఎస్ ఆధ్వర్యంలో పుట్టపర్తి గణేష్ సర్కిల్లోని షాదీ మహల్లో ఉదయం 8 గంటల నుంచి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారన్నారు. శిబిరానికి స్పెషలిస్ట్ వైద్యులు విచ్చేస్తారన్నారు. మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఇంటర్ కళాశాలల పరిశీలనపుట్టపర్తి: జిల్లాలోని పలు ఇంటర్ కళాశాలలను ఉన్నత విద్యాశాఖ అకడమిక్ అడ్వయిజర్లు పరిశీలించారు. కొత్తచెరువు ప్రభుత్వ కళాశాలను డాక్టర్ హైదర్ అలీ, డాక్టర్ నారాయణస్వామి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజమహమ్మద్ తదితరులు కళాశాలను మంగళవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోధనలో నాణ్యత, పరిశోధన, కరిక్యులం, ఈ గవర్నెన్స్ తదితరాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు శ్రీనివాసులు, డాక్టర్ ఓబులేషు, దస్తగిరి, ఆనంద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీవారికి ఊంజల్ సేవ కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి ఊంజల్ సేవను ఘనంగా చేపట్టారు. కదిరి మల్లెలు, తులసీ దళాలతో స్వామివారిని అలంకరించి శ్రీ రంగమండపంలో ఉయ్యాలోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏటా చైత్ర మాసం బహుళ పక్షం పంచమి రోజున ఊంజల్ సేవ నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. పండ్ల మండీలో అగ్నిప్రమాదం ● రూ.2 లక్షల నష్టం గుంతకల్లుటౌన్: పట్టణంలోని మోమినాబాద్ లో సయ్యద్బాషాకు చెందిన ఎస్బీ పండ్ల మండీలో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మండీలోని ఏసీలు, ఫ్రూట్ ప్లాస్టిక్ ట్రే బాక్స్లు, పండ్లు, ఫర్నీచర్ కాలిపోయాయి. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మండీలో ఉన్న కూలీలు బయటికి పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి అశ్వర్థ, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్థలం మాదంటే.. కాదు మాదంటున్నారు’
పెనుకొండ: పెనుకొండ మండలం మోట్రుపల్లి గ్రామంలో నెలకొన్న స్థల వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రి సవిత పీఏ నాగేంద్ర కుటుంబీకులకు, ఇతరులకు మధ్య సమస్య ఏర్పడింది. అయితే, ఇళ్లు కట్టుకుని నివసించిన ఆ స్థలం తమదంటే.. నేడు కొందరు తమదంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. గతంలో మోట్రుపల్లి పాత ఊరులో 12 మందికి పైగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు. కాలక్రమేణా ఇళ్లు పాతబడి పోవడంతో వారు ఆ ఇళ్లు వదిలి మరో చోట ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, వారి కుటుంబాలకు చెందిన ఈ స్థలంలో అన్నదమ్ములకు భాగాలు ఉండగా లక్ష్మిరెడ్డి అనే ఒక భాగస్తుడి నుంచి నాగేంద్ర, అతని సోదరుడి గౌరీశంకర్ తండ్రి ఎకరా భూమిని 2002లో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ స్థల విస్తీర్ణం 70 సెంట్లు మాత్రమే ఉండడంతో నాగేంద్ర, అతని సోదరుడు పాడుబడిన ఇళ్ల స్థలం 30 సెంట్లు కూడా తమదేనని వాదనకు దిగారు. సర్వే కూడా చేయించారు. అయితే, కొన్నేళ్ల పాటు అక్కడ నివాసం ఉండి ఇటీవల ఇతర ప్రాంతానికి వెళ్లి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు దీనిపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ ఇళ్లకు కరెంటు బిల్లులు, ఇంటి గుత్తలు చెల్లించామని, నేడు ఆ స్థలం తమదేనని రావడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. అయితే నాగేంద్ర, అతని సోదరుడు మాట్లాడుతూ ఆ స్థలం తమకు చెందినదనని అధికారులు సైతం నిర్ధారించారన్నారు. రిజిస్ట్రేషన్ రికార్డు మేరకే స్థలాన్ని తమకు అప్పగించాలని అధికారులను కోరామన్నారు. ఇరువర్గాలు ఈ విషయమై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమయ్యారు. మంత్రి సవిత పీఏ నాగేంద్ర, అతని సోదరుడి తీరుపై బాధితుల ఆవేదన -
నరసింహ స్వామికే ‘పచ్చ’ టోపీ!
కదిరి: బీజేపీతో కలిసున్న పచ్చ పార్టీ నేతలు మనుషులనే కాదు..చివరికి దేవున్ని కూడా మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం స్వామివారికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతూ శ్రీవారికే కుచ్చు(పచ్చ)టోపీ పెట్టాలని చూశారు. చేసేది లేక చివరకు స్వామి ముందు తలవంచక తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన కొబ్బరి కాయల బహిరంగ వేలం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి అనుచరుడు గంగాధర్ బహిరంగ వేలంలో పాల్గొని రూ 27.20 లక్షలకు పాట పాడాడు. ఇదే పార్టీకి చెందిన రామచంద్ర అలియాస్ లడ్డు చంద్ర రూ.25లక్షలు, మరో వ్యక్తి తలుపుల రమణ రూ.26 లక్షల దగ్గర తమ వేలం పాటను ఆపేశారు. అదే సమయంలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, దేవదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ సమక్షంలో అందరి ముందు సీల్డ్ టెండర్ తెరిచారు. అందులో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్రెడ్డి అనుచరుడు చంటి అనే వ్యక్తి అత్యధికంగా రూ.31.21 లక్షలకు తన టెండర్ దాఖలు చేశాడు. ఇతను హెచ్చుపాటదారుడు కావడంతో టెండర్ ఇతనికే కట్టబెడుతున్నట్లు ఆలయ ఈఓ అందరి ముందు ప్రకటించాడు. వెంటనే ఆయన ఆలయ అధికారులు సూచించిన బ్యాంకుకెళ్లి ఆ మొత్తం డబ్బుకు డీడీ తీసుకొచ్చి ఈఓ చేతికి అందజేయాలని వచ్చాడు. ఎమ్మెల్యే ఒత్తిడితో సీన్ రివర్స్ గత కొంత కాలంగా బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డికి, టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో విష్ణును రథంపైకి రాకుండా ఎమ్మెల్యే అతన్ని పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం విష్ణు అనుచరుడు కొబ్బరి కాయల టెండర్ దక్కిందని తెలిసి ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయాడు. వెంటనే ఆలయ ఈఓపై ఒత్తిడి తెచ్చాడు. ఎలాగైనా అతనికి కాకుండా తక్కువ ధరకే పాడిన గంగాధర్కు ఇవ్వాలని, లేదంటే వాయిదా వేయాలని ఆదేశించాడు. దీంతో ఈఓ అడకత్తెరలో పడ్డాడు. హెచ్చు పాటదారుడు తెచ్చిన రూ.31.21 లక్షల డీడీని తీసుకోకుండా రాత్రి 8.30 గంటల వరకూ కాలయాపన చేస్తే వారు ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చేసేది లేక చివరకు చంటి తెచ్చిన డీడీని తీసుకోక తప్పలేదు. కొబ్బరి కాయల టెండర్లో కూటమి కుట్ర రూ. 31.21 లక్షలకు పాడిన చంటి రూ. 27.21 లక్షలతో పాట ఆపేసిన గంగాధర్ గంగాధర్కే ఆ టెండర్ ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి అడకత్తెరలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి -
దళితుల ప్రాణాలంటే లెక్కలేదా బాబూ?
● ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు అనంతపురం టవర్క్లాక్: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా జరుగుతున్నాయి. అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దళితుల ప్రాణాలంటే లెక్కలేదా?’ అంటూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు అన్నారు. మంగళవారం స్థానిక పాతూలోని గిరిజన భవన్ లో మాదిగల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సువర్ణ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రమూ స్పందించడం లేదన్నారు. దళితులకు అండగా ఉంటానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నేడు కేవలం అగ్రవర్ణాల వారికి అండగా ఉంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరిగి నష్టపోయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. అగ్రవర్ణాల వారు నష్టపోతే వారికి పరిహారం అందిస్తున్నారని, దళితులవి మాత్రం ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. దళిత నాయకుడు టీఎం రమేష్ను అత్యంత కిరాతకంగా కొందరు హత్యచేస్తే ఇప్పటిదాకా ఆ కుటుంబానికి చిన్న సాయమూ అందలేదన్నారు. మాదిగల పెద్దబిడ్డనవుతానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు నేడు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ న్యాయం చేసి ప్రజల మన్నన పొందారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి చేయి చూపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో జెన్నే చిరంజీవి, సాకే ఓబులేసు, జయప్రకాష్, రామాంజినేయులు, సుదర్శన్, గిరిజన సంఘం నాయకులు మల్లి కార్జున నాయక్ పాల్గొన్నారు. -
పింఛన్ సొమ్ము మింగిన వెల్ఫేర్ అసిస్టెంట్ సరెండర్
ఎన్పీకుంట: మండల పరిధిలోని ఎదురుదోన సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రశేఖర్రెడ్డిని జిల్లా వెల్ఫేర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు డీఎల్డీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పార్థసారథి తెలిపారు. రూ.2.50 లక్షల సామాజిక పింఛన్ సొమ్మును తన సొంత అవసరాల కోసం వాడుకొని, తిరిగి చెల్లించకపోవడంతో అతనిని సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు. విషయం బయటికి వచ్చిన తరువాత తను వాడుకున్న పింఛన్ సొమ్మును చలానా రూపంలో తిరిగి చెల్లించడానికి సమయం ఇచ్చినా నిర్లక్ష్యం వహించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం గుత్తి రూరల్: వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని తురకపల్లిలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రంగస్వామి మంగళవారం చిన్న పాటి విషయంపై ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎద్దుల బండిని ఢీకొన్న టాటా ఏస్ తాడిపత్రి రూరల్: మండలంలోని పెద్దపొలమడ–చిన్నపోలమడ మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఎద్దుల బండిని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని బుగ్గకు చెందిన డ్రైవర్ వాసు, విజయ్ మహారాజ్లు పెద్దపప్పూరు మండలంలో జరిగిన చెక్క భజన కార్యక్రమానికి డీజే సామగ్రిని టాటా ఏస్లో తీసుకెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి బుగ్గకు వెళుతూ పెద్దపొలమడ–చిన్నపోలమడ రోడ్డులో ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొన్నారు. ప్రమాదంలో ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది. బండి నడుపుతున్న గంగాధర్, టాటా ఏస్లో డ్రైవర్ పక్కన కూర్చున్న విజయ్మహారాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయ్మహారాజ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదంలో రెండు ఎద్దులకు కూడా గాయాలయ్యాయి. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్ మధ్యాహ్న సమయంలో కాలిపోవడం అను మానాలకు తావిచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సండ్ర చెట్లపై అక్రమార్కుల కన్ను
తలుపుల: ‘చెట్లు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అడవులను సంరక్షిస్తే కొందరు స్వార్థపరులు ఆ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. విచ్చలవిడిగా చెట్లు కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు. తలుపుల మండలంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల కొందరు ఇష్టారాజ్యంగా చెట్లను నేలకూలుస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మడుగుతండా సమీపంలో వేలాది సండ్ర చెట్లను అక్రమార్కులు నేల కూల్చి మొద్దులుగా మార్చారు. 15 నుంచి 20 ట్రాక్టర్లలో తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఎర్రచందనం పోలికతో డిమాండు సండ్ర దుంగలు చూసేందుకు ఎర్ర చందనం దుంగల్లా కనిపిస్తుండడంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడినట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం దుంగల్లో వీటిని కలిపి విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోనే సండ్ర చెట్లు నరికినట్లు సమాచారం. ఈ విషయంపై తలుపుల ఇన్చార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరసింహమూర్తిని వివరణ కోరగా, ఆయన స్పందించారు. మడుగుతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో సండ్ర చెట్లను కొట్టి దుంగలుగా ఉంచారనే సమాచారంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. సండ్ర మొద్దులను తరలించకుండా నిఘా ఉంచామన్నారు. చెట్లు నరికిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తలుపుల మండలంలో ఇష్టారాజ్యంగా నరికివేత పట్టించుకోని అటవీ అధికారులు -
ప్రభుత్వ మోసంతోనే కౌలు రైతుల ఆత్మహత్యలు
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతోనే కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఉరవకొండలో 3వ జిల్లా కౌలు రైతు సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక గవిమఠం నుంచి వందలాది మంది కౌలు రైతులు సీపీఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో రాధాకృష్ణ మాట్లాడారు. కౌలు రైతుల బలవన్మరణాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అధికారంలోకి రాగానే కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చి జీవితాలు మార్చేస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కనీసం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయలేదన్నారు. బ్యాంకు రుణాలు, పంటల బీమా, నష్ట పరిహారం, ఈ–పంట నమోదు అమలు చేయలేదన్నారు. మహాసభల్లో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, అధ్యక్షుడు రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు పెద్దమూస్టురు వెంకటేష్, సీపీఎం నాయకుడు మధు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి రథోత్సవం కనులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించగా..ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. రథం లాగి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయమే అమ్మవారి మూలవిరాట్ను పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, తులసీపూజ చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. రథం ముందు వేద పండితులు శాంతి, నవగ్రహ హోమం, యోగీశ్వరారాధన, గణపతి పూజ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించిన అర్చకులు... మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం ప్రాంగణం, రథం చుట్టు ప్రదక్షిణలు చేసి విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చారు. మార్మోగిన అమ్మవారి నామస్మరణ.. రథంపై కొలువుదీరిన అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూపి భక్తులంతా నమో మహాలక్ష్మీ అంటూ కీర్తించారు. రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు తదితర వాటిని విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులంతా అమ్మవారిని కీర్తిస్తూ రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి సమీపాన ఉన్న ప్రధాన రోడ్డు వరకు లాగారు. గ్రామానికి చెందిన బ్రాహ్మణులు రాజవంశీకులతో కలిసి అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. అంతకుముందు వారంతా జ్యోతులను ఊరేగింపుగా మోసుకువచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. విశేష పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, కైవాడస్తులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాగా, రథోత్సవంలో దొంగలు చేతివాటం చూపారు. పలువురు భక్తుల జేబులు కత్తిరించి సొమ్ము కాజేశారు. నేడు గంగపూజ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి గంగ పూజ నిర్వహించనున్నారు. వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మీ బ్రహ్మరథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్త జనం -
తల్లిదండ్రుల కష్టంతోనే విజయం సాధించా
అమ్మ పద్మ టైలర్. నాన్న యల్లప్ప బేల్దారి. కష్టపడి నన్ను బీటెక్ చదివించారు. వారు పంపే డబ్బులు సరిపోకపోవడంతో కళ్యాణదుర్గానికి చెందిన మనోహర్, అతని తల్లిదండ్రులు రామకృష్ణ, తిప్పమ్మ ఆర్థికసాయం అందజేశారు. అధ్యాపకులు శ్రీలక్ష్మి, శ్యాంసుందర్, శంకర్ ప్రోత్సాహం మరువలేనిది. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడమే లక్ష్యంగా చదివాను. ఇక నుంచి అమ్మానాన్నలను సుఖంగా ఉండేలా చూసుకోవడమే నా బాధ్యత. దివి ల్యాబొరేటరీస్లో ఉద్యోగం వచ్చినా రోడ్డు ప్రమాదంలో గాయపడి చేతికి రాడ్లు ఉండటంతో మెడికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఆ రాడ్లు తొలగించడానికి ఆర్థిక ఇబ్బంది ఉంది. రాడ్లు తొలగించాక.. ఉద్యోగంలో చేరతాను. – ఇంద్ర, బీటెక్–ఈఈఈ, గుంతకల్లు -
విమానాశ్రయంలో గవర్నర్కు ఘన సాగతం
పుట్టపర్తి టౌన్: అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో సోమవారం పుట్టపర్తిలోని విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంత్రులు సవిత, టీజీ భరత్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం గం 10.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ ప్రత్యేక కాన్వాయ్తో రోడ్డు మార్గంలో అనంతపురంలోని జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ కార్యక్రమం ముగించుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రశాంతి నిలయంలో శ్రీనివాస గెస్ట్హౌస్ చేరుకున్నారు. 4.45 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పరిష్కార వేదికకు 49 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 49 వినతులు అందాయి. అదనపు ఎస్పీ అంకిత సురానా స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
పుట్టపర్తి: చందబ్రాబు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ గజ్జల హరి ప్రసాద్రెడ్డి, జనరల్ సెక్రెటరీ గౌస్ లాజం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం పదో తరగతి జవాబు పత్యాల మూల్యాంకనానికి ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గజ్జల హరి ప్రసాద్రెడ్డి, గౌస్ లాజం మాట్లాడుతూ..ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. 11వ పీఆర్సీ ముగిసి 3 ఏళ్లు పూర్తయినా 12వ పీఆర్సీ కమిషన్ నియమించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు రూ.30 వేల కోట్ల బకాయిలను విడతల వారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాల బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 4 డీఏలు చెల్లించాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానం తీసుకురావాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గోపాల్ నాయక్, జాఫర్ హుస్సేన్, ఏపీటీఎఫ్ నేతలు చంద్ర, అశోక్కుమార్, త్రిమూర్తి, యూటీఎఫ్ నేత లక్ష్మీనారాయణ, హెచ్ఎం అసోసియేషన్ ప్రతినిధులు గోపాల్, మనోజ్, డీపీఎఫ్ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్ల నిరసన నల్లబ్యాడ్జీలతో పదో తరగతి మూల్యాంకనానికి హాజరు -
జల సంరక్షణతోనే భవిత
పుట్టపర్తి టౌన్: జల సంరక్షణపైనే మన భవిత ఆధారపడి ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తి మండలంలోని బీడుపల్లి క్రాస్ వద్ద ‘నీటి భద్రత,–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా జలవనరుల శాఖ అధ్వర్యంలో చేపడుతున్న వంక పనులకు కలెక్టర్, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేశామన్నారు. వేసవిలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి వర్షాకాలం నాటికి ప్రతి నీటి చుక్కను భూమిలోకి పంపడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఇరిగేషన్ ఈఈ గురుమూర్తి, డీఈలు గంగాధర్, గంగాద్రి, ఏఈలు సుధాకర్ రాజు, జమునా భాయి తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరు వాసి దుర్మరణం
పెనుకొండ: లారీని ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని బెంగళూరు సిటీ బన్నేరుఘట్ట ప్రాంతానికి చెందిన గురురాజ్, అరుణ్ (26), మంజునాథ్, రాకేష్, గణేష్ సోమవారం వేకువజామున కారులో హైదరాబాద్కు బయలుదేరారు. తెల్లవారుజాము 3.30 గంటలకు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంటకరెడ్డిపల్లి సమీపంలో బ్రిడ్జిపైకి చేరుకోగానే మలుపు వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు -
ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 213 అర్జీలు అందగా.. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ ఏ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు. -
వివాహిత బలవన్మరణం
పెనుకొండ: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో సోమవారం వివాహిత ఈడిగ ఆనందమ్మ (52) ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సుధాకర్యాదవ్ తెలిపిన మేరకు... కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందమ్మకు బెంగళూరులోని నిమ్హాన్స్తో పాటు హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. సోమవారం ఉదయం పాపిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు ఇటీవల ఆయాసం, దగ్గు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ కదిరి టౌన్: కన్న కొడుకునే హతమార్చిన కేసులో తండ్రిని అరెస్ట్ చేసినట్లు కదిరి పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో ఈ నెల 1న కొమ్మినేని గణేష్నాయుడును తండ్రి నారాయణస్వామి రొకలి బండతో కొట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నారాయణస్వామిని సోమవారం సైదాపురం వాటర్ ట్యాంక్ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. నిందితుడికి రిమాండ్చిలమత్తూరు: యువకుడిని బ్యాట్తో కొట్టి హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపిన మేరకు... చిలమత్తూరు మండలం పలగలపల్లి పంచాయతీ బందేపల్లికి చెందిన రమేష్(33)కు భార్య, పదేళ్ల వయసున్న కుమార్తె, ఏడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవపడి సోమఘట్టలోని పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను పిలుచుకువచ్చేందుకు ఈ నెల 2న రమేష్ వెళ్లాడు. ఆ సమయంలో అత్తింటిలో గొడవ చోటు చేసుకోవడంతో సమీప బంధువు శ్రీనివాసులు బ్యాట్ తీసుకుని రమేష్ తలపై బాదాడు. ఘటనతో అపస్మారక స్థితికి చేరుకున్న రమేష్ను కుటుంబసభ్యులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం రమేష్ మృతి చెందాడు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాసులును అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఇద్దరు ఎస్ఐలకు స్థాన చలనంపుట్టపర్తి టౌన్: జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఎస్పీ సతీష్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ ఎస్ఐ కురుబ నరసింహుడును రొళ్ల పీఎస్కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎం.గౌతమిని వీఆర్ పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇటీవల కౌన్సెలింగ్ నిర్వించిన పలువురు హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లుకు సోమవారం డీఓ ఆర్డర్లు జారీ చేశారు. -
నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టండి
పుట్టపర్తి అర్బన్: నూతన ఆవిష్కరణలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్పెన్యూర్ (ఐడీఈ) బూట్ క్యాంప్ పుట్టపర్తిలోని సంస్కృతీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఏఐసీటీఈ–ఢిల్లీ ఇన్నోవేషన్ ఆఫీసర్ అభిషేక్ రంజన్ హాజరై, మాట్లాడారు. యువత సొంత గ్రామాలకు పరిమితం కాకుండా దేశంలో ఎన్నో పారిశ్రామిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఐడీఈ బూట్ క్యాంప్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఏపీలోని రెండో కళాశాలగా సంస్కతికి అవకాశం దక్కడం విశేషమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడతుందన్నారు. ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ హేమచంద్రారెడ్డి, డైరెక్టర్ నాగరాజు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు సంస్కృతిలో ఘనంగా ఐడీఈ బూట్ క్యాంప్ -
రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు
పుట్టపర్తి టౌన్: స్థానిక సాయి ఆరామంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. స్థానిక ఓ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాలకు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవిరాఘవులు, యు. వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించని భూములను తిరిగి రైతులకు స్వాధీనం చేయడం, పాత విధానంలోని ఉపాధి పథకం కొనసాగింపు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రాయలసీమకు నీటి కేటాయింపులు పూర్తిగా అమలు చేయాలని, జిల్లాలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు, చిత్రావతి నదిలో మురుగు నీరు కలవకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారని తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పెనుకొండ హరి, ఫిరంగి ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ, ప్రాంతీయ కార్యదర్శి బ్యాళ్ల అంజి, నాయకులు పైపల్లి గంగాధర్, సాంబశివ, వెంకటేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తల కృషితోనే రక్షణ వ్యవస్థ పటిష్టం
● మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ టెస్సీ థామస్ అనంతపురం: శాస్త్రవేత్తల అలుపెరుగని కృషి, కఠోర శ్రమతోనే అంతరిక్ష, రక్షణ, అణు సాంకేతిక రంగాల్లో అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ నిలిచిందని మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ టెస్సీ థామస్ అన్నారు. జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవం సందర్భంగా టెస్సీ థామస్కు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్ని–1 నుంచి అగ్ని –5 క్షిపణి వరకు రక్షణ రంగంలో స్వావలంబన సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. దేశ సేవలో అంకితభావం, నిరంతర అభ్యాసనం, పట్టుదల గెలుపునకు నిదర్శనంగా భావిస్తానన్నారు. క్షిపణి రూపకల్పనలో ప్రతి పరీక్ష విజయవంతం కాదని, కానీ వైఫల్యం ఒక అనుభవం, అవగాహన, సరైన దిశను అందిస్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు ప్రయోగశాలకే పరిమితమయ్యే రోజుల నుంచి స్టార్టప్, గ్రామాలు, తరగతి గదులు, డిజిటల్ వేదికలపై వికసిస్తుండడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. -
రైల్వే డివిజన్ పరిధిలో పలువురికి అవార్డులు
గుంతకల్లు: స్థానిక రైల్వే డివిజన్ పరిధిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఉద్యోగులకు మ్యాన్ అఫ్ మంత్ అవార్డులను డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సోమవారం అందజేశారు. వీరిలో ట్రైన్ మేనేజర్ హనుమంతు, పాయింట్స్మెన్ సచీంద్ర ఉన్నారు. ఓ రైలు ప్రయాణికుడు గాయపడిన సమాచారం అందుకున్న ట్రైన్ మేనేజర్ హనుమంతు సకాలంలో స్పందించి సమీపంలోని రైల్వేస్టేషన్కు సమాచారం చేరవేసి మెరుగైన వైద్యసేవలు అందించడంలో సఫలీకృతుడయ్యాడు. అలాగే బోగీ చక్రాల్లో వస్తున్న శబ్ధాల్లో తేడాను పసిగట్టి వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పెను ప్రమాదాన్ని పాయింట్స్మెన్ సచీంద్ర నివారించాడు. ఈ నేపథ్యంలో వారిని అభినందిస్తూ మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు
ప్రశాంతి నిలయం: వసతి గృహాల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల కింద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అందజేసిన 4 నీటిశుద్ధి యంత్రాలను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని 3 బీసీ సంక్షేమ వసతి గృహాలకు, ఓ ఎస్సీ సంక్షేమ వసతి గృహానికి అందజేశారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ రీజనల్ మేనేజర్ రమేష్, పుట్టపర్తి మేనేజర్ చంద్రశేఖరయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్రకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరుణించు .. కొల్హాపురి మహాలక్ష్మీ
● ఘనంగా ప్రారంభమైన అమ్మవారి బ్రహ్మోత్సవాలు ● నేడు బ్రహ్మ రథోత్సవంరొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం వద్ద అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేశారు. రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టిన అనంతరం ప్రధాన ఆలయం ప్రాంగణంలో పట్టం కూర్చోబెట్టారు. మధ్యరాత్రి సమీపాన గల పాలబావి వద్దకు మేళతాళాలతో చేరుకున్నారు. పాలబావిలో ఉత్సవ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం కట్టి, పూలు, పండ్లు ఉంచి హారతిచ్చిన తర్వాత నైవేద్యంగా బావిలోకి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తే సంతాన భాగ్యం, యువతులకు పెళ్లిళ్లు, ధీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో అమ్మవారిని కొలిచేందుకు మహిళలు తండోప తండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బ్రహ్మరథోత్సవం.. కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మ రథోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించు కోవచ్చని సూచించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రాంప్రశాంతినిలయం: దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జగ్జీవన్ రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ జగ్జీవన్ రాం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అందరూ తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి మోహన్రాం తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు పుట్టపర్తి టౌన్: రాష్ట్ర గవర్నర్ నజీర్ అహమ్మద్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక సత్యసాయి విమానాశ్రయం, ప్రశాంతి నిలయంలో బందోబస్తు ఏర్పాట్లు, కాన్వాయ్ రూట్లను ఎస్పీ సతీష్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం అనంతపురంలోని జేఎన్టీయూలో జరగనున్న 15వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ నజీర్ అహమ్మద్ రానున్నారన్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, ఇక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన అనంతపురం బయలుదేరి వెళ్తారన్నారు. స్నాతకోత్సవం ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయంలోని శ్రీనివాస గెస్ట్ హౌస్కు చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరతారన్నారు. గవర్నర్ పర్యటన ముగిసేంత వరకూ అప్రమత్తంగా విధులు నిర్వహించాని పోలీసులను ఆదేశించారు. లోటుపాట్లు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. -
ఘనంగా చౌడేశ్వరీ దేవి రథోత్సవం
ఓడీచెరువు (అమడగూరు): అమడగూరు మండల కేంద్రంలో ఆదివారం చౌడేశ్వరీ దేవి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో అమడగూరు జనసంద్రమైంది. అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఉదయం అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేశ్వరి దేవిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. రథం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటలకు అమ్మవారిని అందులో కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి ప్రాంతం నుంచి ఆలయం వరకూ సాగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తిగీతాలతో అలరించారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే క్రిష్టప్ప భక్తులందరికీ ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. పలువురు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త కొత్తపల్లి పొట్టా పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులతో కిటకిటలాడిన అమడగూరు -
సాంకేతిక దీప్తి.. జాతీయ కీర్తి
అనంతపురం: సాంకేతిక విద్యలో అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్టీయూ–ఏ) జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాజానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించిన ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాదు నాణ్యమైన పరిశోధనలకూ చిరునామాగా నిలిచింది. ఈ క్రమంలో జేఎన్టీయూ(ఏ) 15వ స్నాతకోత్సవం సోమవారం జరగనుంది. ఏపీ గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ హోదాలో మూడో దఫా జేఎన్టీయూ (అనంతపురం)కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త టెస్సీ థామస్కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ అందజేయనున్నారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా టెస్సీ థామస్ను పిలుస్తారు. అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ● జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవం సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగనుంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరై బంగారు పతకాలు పొందిన వారికి స్వయంగా అందజేస్తారు. పీహెచ్డీలను టెస్సీ థామస్తో పాటు జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అందజేస్తారు. స్నాతకోత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పాస్లు అందజేశారు. కట్టుదిట్టమైన భద్రత.. జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ హెచ్.సుదర్శనరావు పేర్కొన్నారు. జేఎన్టీయూ అనంతపురం మరో కాన్స్టిట్యూట్ కళాశాలగా శ్రీ కాళహస్తీశ్వర కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్ఐ, కలికిరి తరహాలో శ్రీకాళహస్తీశ్వర కళాశాలను కాన్స్టిట్యూట్ కళాశాలగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆయన యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడారు. స్నాతకోత్సవ ముఖ్యాంశాలను వివరించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ ఓ.దేవన్న, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ, పీఆర్వో డాక్టర్ అంకారావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, స్నాతకోత్సవ సన్నద్ధత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 40 వేల మందికి డిగ్రీలు జేఎన్టీయూ (ఏ) 15వ స్నాతకోత్సవంలో మొత్తం 40,782 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. పీహెచ్డీలు 97, ఎంటెక్ 1,197, ఫార్మా డీ 52, ఎం ఫార్మసీ 978, ఎంబీఏ 6,675, ఎంసీఏ 3,297, ఎమ్మెస్సీ 47, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 626 డిగ్రీలతో పాటు బీటెక్ సివిల్ 1533, ఈఈఈ 2,646, మెకానికల్ 1683, ఈసీఈ –6852, సీఎస్ఈ–11,274, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 72, అగ్రికల్చర్ ఇంజినీరింగ్– 12, కెమికల్ ఇంజినీరింగ్– 63, ఈఐఈ – 12, ఐటీ –274, సిస్టమ్స్ ఇంజినీరింగ్ –13, కంట్రోల్ ఇంజినీరింగ్–01, ఫుడ్ టెక్నాలజీ – 24, కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ –42, బీఫార్మసీ 3,312 డిగ్రీలు ప్రదానం చేస్తారు. జేఎన్టీయూ బంగారాలు వీరే.. జీవితంలో గోల్డ్ మెడల్ సాధించడం ఒక కల. లక్ష్యాన్ని నిర్దేశించి ప్రతిభ చాటి యూనివర్సిటీ స్థాయిలో సత్తా చాటారు. మెరిట్ సాధించడంతో బంగారు పతకాలకు ఎంపికయ్యారు. 89.5 శాతం ఉత్తీర్ణత సాధించి యూనివర్సిటీలోనే టాపర్లుగా నిలిచారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి.. ఎంటెక్లో ఆర్.ముస్తాక్ బాషా (సివిల్– స్ట్రక్చరల్ ఇంజినీరింగ్), కె.వాజిత సుల్తానా (ఈఈఈ– పవర్ సిస్టమ్)కు గోల్డ్మెడల్ దక్కాయి. జేఎన్టీయూ పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల నుంచి.. ఎస్.నౌషిన్ (సివిల్), టి.కిరణ్ (ఈఈఈ), ఎన్.వెంకటేశ్ (మెకానికల్), పి.ధనశ్రీ (ఈసీఈ), జి.కావేరి (సీఎస్ఈ )లకు గోల్డ్మెడల్స్ దక్కాయి. నేడు జేఎన్టీయూ (ఏ) 15వ స్నాతకోత్సవం హాజరు కానున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవానికి 40 వేల మంది విద్యార్థుల దరఖాస్తు 74 మందికి డాక్టరేట్లు.. 31 మందికి బంగారు పతకాలు మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్కు గౌరవ డాక్టరేట్ -
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు
పెనుకొండ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఆదివారం తన భర్త చరణ్ రెడ్డితో కలసి రాంపురం పంచాయతీలోని కొండంపల్లిలో ఆమె పర్యటించారు. పార్టీ కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. ఇటీవల రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు ఓ మహిళపై నడిరోడ్డుపైనే పోలీస్ లాఠీతో దాడి చేయడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కాకినాడ జిల్లాలో దళిత మహిళపై జనసేన నేతలు దాడి చేసినా ఎటువంటి చర్యలూ లేవన్నారు. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 164 సీట్లు గెలిచామంటున్న టీడీపీ నేతలు మెడికల్ కళాశాల నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్టు శిక్షణ పేరిట మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఎటువంటి మెటీరియల్ అందించకుండా రోజులో గంట మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. కూటమి పార్టీల నాయకులు ప్రతి గ్రామంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీ సాక్షిగా అనడం దుర్మార్గమన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రికి లేదన్నారు. మంత్రి సవిత తాను దత్తత తీసుకున్న సొంత పంచాయతీలో ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పార్టీ కార్యకర్తలు బెదిరిపోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, నారాయణ యాదవ్, చెన్నకేశవులు, భూమా నాగిరెడ్డి, చెన్నా రెడ్డి, బైపు రెడ్డి, శ్రీరాము రెడ్డి, గోపాల్ రెడ్డి, జి. నాగరాజు, శివ శంకర్, మల్లికార్జున రెడ్డి, వెంకటరెడ్డి, సతీష్, హరి, సమర, రవి వెంకటేషులు, చిన్న ఆంజనేయులు, టెంపో శీనా, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపాటు -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
● హత్యకు గురైనట్లు అనుమానాలు లేపాక్షి: మండల పరిధిలోని మానేపల్లి వద్ద యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. హంద్రీనీవా కాలువలో తేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని వద్ద ఉన్న ఐడెంటీ కార్డులను పరిశీలించి బెంగళూరుకు చెందిన వినయ్కుమార్ (30)గా గుర్తించారు. లేపాక్షి మండలంలోని ఎం.వెంకటాపురం గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో శనివారం రాత్రి బెంగళూరు నుంచి వెంకటాపురంకు బయలుదేరి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతన్ని మారణాయుధాలతో కొట్టి చంపారన్న ఆనవాళ్లను కూడా గుర్తించారు. మార్గమద్యలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడన్నారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. హిందూపురం అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్దన్, పోలీసు సిబ్బంది డాగ్స్క్వాడ్తో రక్తపు మరకల వద్ద తనఖీ చేశారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేడు పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలియజేవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. -
దళితులపై లెక్కలేనన్ని దారుణాలు
పుట్టపర్తి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై లెక్కలేనన్ని దారుణాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మండిపడ్డారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని అరాచకాల కట్టడికి చర్యలు చేపట్టాలని హితవు పలికారు. బాబు సర్కారు తీరుపై ఆదివారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా తట్టలతో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలి, దళితులపై దాడులు ఆపాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్టీలు, ఎస్సీలపై హత్యలు, మానభంగాలు, దాడులు, అక్రమ కేసులు పెరిపోయాయన్నారు. దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు తాను పెద్ద మాదిగనంటూ మభ్యపెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి పంగనామాలు పెట్టారన్నారు. రాష్ట్రంలో దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సి వస్తోందని వాపోయారు. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు భిక్షాటన చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. మోసం చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దళిత సంఘాలను ఏకం చేసుకొని సర్కారు మెడలు వంచుతామని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే దళిత మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు జుగుప్సాకరమని, ఇప్పటికీ అతడిని పదవి నుంచి తొలగించకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి తిప్పన్న, రాష్ట్ర కార్యదర్శులు ఎస్టీడీ నరశింహులు, ఆంజనేయులు, నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామయ్య, జిల్లా అధికారి ప్రతినిధి ఫోటో సాయి, రాష్ట్ర కార్యదర్శులు నరశింహులు అంజినప్ప, జిల్లా కార్యదర్శులు రంగనాథ్, చిన్నప్ప, కోగిర గంగాధర్, ఈశ్వర్, అజెంత, నాగరాజు,జిల్లా అర్గనైజింగ్ సెక్రటరీ కంబాలప్ప. పుట్టపర్తి పట్టణాధ్యక్షులు రవినాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణ స్వామి, నాగేంద్ర, నరశింహులు, మండల అధ్యక్షుడు శంకర్, రమణ, సినిమా నారాయణప్ప, మధు, రామాంజి, సురేష్, దుర్గా ప్రసాద్, అమీన్బాషాఅంజేయులు, బండ్లపల్లి నరశింహులు, గోవిందప్ప, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు తీరు మారకుంటే తగిన బుద్ధి చెబుతాం సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి -
మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి, భార్యపై దాడికి యత్నం
యల్లనూరు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని మండల కేంద్రానికి చెందిన అశోక్ తన తల్లితో పాటు భార్యపై దాడికి యత్నించాడు. అడ్డుగా వచ్చిన బావమరిది సురేంద్ర అలియాస్ సూరీపై దాడి చేయడంతో అతని తలకు తీవ్రగాయమైంది. అని ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... అశోక్ మద్యానికి బానిస అయ్యాడన్నారు. ఇందులో భాగంగానే తరచూ తల్లి కృష్ణమ్మ, భార్యతో గొడవ పడేవాడన్నారు. ఆదివారం కూడా డబ్బు కోసం తల్లి, భార్యతో గొడవ పడుతుండగా బావమరిది అశోక్ అడ్డుపడ్డాడని పేర్కొన్నారు. సురేంద్రపై కొడవలితో దాడిచేయడంతో తలకు తీవ్రగాయమైందన్నారు. క్షతగాత్రుడిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారన్నారు. అశోక్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జంబుకేశ్వరస్వామీ నమోనమః రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ముగిశాయి. చివరి రోజు ఆదివారం సాయంత్రం స్వామి వారి సప్త ప్రాకారోత్సవం, శయనోత్సవ వేడుకలను అర్చకుడు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేకులకుంట సత్యనారాయణ, దేవదాయశాఖ ఈఓ నరసింహారెడ్డి, బ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఘనంగా వందో పుట్టిన రోజు వేడుక బెళుగుప్ప: మండల కేంద్రానికి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పాటిల్ తిప్పారెడ్డి సతీమణి పాటిల్ తిమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకను ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షులు వై.మధుసూదన్రెడ్డి హాజరై తిమ్మమ్మను సత్కరించారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్గా ఎన్నికై న పాటిల్ తిప్పారెడ్డి సతీమణి అయిన తిమ్మమ్మకు ఐదు మంది కుమారులు సంతానం కాగా కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు, మునిమనవలు కలిపి సుమారు 50 మంది దాకా కుటుంబ సభ్యులు ఉన్నారు. తమ తల్లి వంద సంవత్సరాల వయస్సున్నా నేటికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఏనాడూ ఆస్పత్రి వైపు చూడకుండా సంతోషంగా ఉన్నారని కుమారులు పాటిల్ నాగిరెడ్డి, పాటిల్ శ్రీనివాసరెడ్డి, పాటిల్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. -
ఖల్నాయకా.. మజాకా
సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నా అడిగే అధికారులు లేరు. ఎవరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరు. ఉన్నతాధికారులకు విన్నవిస్తే ఆదేశాలు జారీ చేస్తున్నారు.. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. చర్యలు తీసుకోలేదా అని ప్రశ్నిస్తే.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు అధికారులే చెబుతుండటం గమనార్హం. పుట్టపర్తి మండలం పెడపల్లిలో ఏడాదిన్నరగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. టీడీపీకి చెందిన ‘ఖల్ నాయక్’ భూ దందాకు పాల్పడుతున్నాడు. ఓ మాజీ మంత్రి అండదండలతో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఖాళీ స్థలాలన్నీ కాజేస్తున్నాడు. కబ్జా చేయడంతో పాటు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నాడు. కొన్ని భవనాలకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అక్రమ కట్టడాల గురించి గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోవడం గమనార్హం. సీజ్ చేసి చేతులు దులుపుకొని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డిజిటల్ లైబ్రరీ కోసం కేటాయించిన స్థలంలో మిగులు భూమిపై ‘ఖల్ నాయక్’ కన్నేసి కాజేసి అక్రమంగా కట్టడం నిర్మించాడు. దీనిపై కలెక్టరేట్ వరకు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని ఆర్డీఓకు కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా అందాయి. అయితే ఆ తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు. కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. ఇటీవల ఉన్నతాధికారుల నుంచి సమస్య రాకుండా ఉండేందుకు సీజ్ చేసి చేతులు దులుపుకొన్నారు. రస్తాలో మరో అక్రమ నిర్మాణం పెడపల్లిలో ‘ఖల్ నాయక్’ నేతృత్వంలో మరో అక్రమ కట్టడం నిర్మితమవుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు వ్యక్తి పట్టా పొంది నిర్మాణం చేపట్టారని సమాధానం చెప్పినట్లు తెలిసింది. అది రస్తా పొరంబోకు అని.. తన స్థలానికి వెళ్లేందుకు మార్గం లేకుండా అక్రమంగా కడుతున్నట్లు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై విచారణ చేయాల్సిన రెవెన్యూ అధికారులు అది గ్రామ కంఠంగా చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇవ్వకుండా.. పెడపల్లిలో అక్రమ నిర్మాణాల గురించి ఎవరు ప్రశ్నించినా.. రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా కోరాలని చెబుతున్నారు. అయితే మాజీ మంత్రి ఒత్తిళ్లతో పెడపల్లిలో అక్రమాల వైపు అధికారులు వెళ్లకుండా ఉన్నట్లు తెలిసింది. ఏదైనా ఉంటే ‘మాజీ మంత్రి’ దగ్గర సెటిల్ చేసుకోవాలని చెబుతుండటం గమనార్హం. కబ్జాలు కొనసాగిస్తున్న తమ్ముడు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణం మాజీ మంత్రి అండతో రెచ్చిపోతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న రెవెన్యూ అధికారులు -
ఆనాటి స్నేహం.. ఆనంద గీతం
● 40 ఏళ్లకు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయక అగళి: మండలంలోని అగళి, ఇరిగేపల్లి వద్ద సువర్ణముఖి నదిపై వంతెన కూలిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అగళి నుంచి ఇరిగేపల్లి, నందరాజునపల్లి తదితర గ్రామలకు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలకు నిషేధించారు. వాహనాల రాకపోకలకు వీలుగా పక్కనే డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో ఆ రోడ్డులో బురద ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. 27ఎండీకెఎస్203: ధ్వంసమైన ఇరిగేపల్లి వంతెన 40 ఏళ్ల తర్వాత స్నేహితులందరూ ఒక్కచోట చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రొద్దం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986– 87 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 86 మంది పదో తరగతి వరకూ కలసి చదువుకోగా.. ప్రస్తుతం 70 మంది దాకా తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. సుమారు 40 ఏళ్లకు ఒకే వేదికపైకి రావడంతో అందరూ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులకు ప్రేమతో అభివాదం చేశారు. వారిని ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. – రొద్దం: -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
రొద్దం: మండల పరిధిలోని తురకలాపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి.చేతన్ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం వెంగప్ప, పీఈటీ రామకృష్ణ తెలిపారు. గత ఏడాది నవంబర్లో పులివెందులలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో చేతన్ అద్భుత ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో చేతన్ పాల్గొంటాడని తెలిపారు. పోటీల్లో మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థి చేతన్ను పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది. జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. బేల్దారి ఆత్మహత్య ధర్మవరం రూరల్: మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన బేల్దారి వినీత్కుమార్ (18) ఆదివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు .. మృతుడు బేల్దారి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉండేవాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వినీత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మద్యం తాగి ఆటో నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు కదిరి టౌన్: పట్టణంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఆటో నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. కదిరి జడ్జి ముందు హాజరుపర్చగా రూ.10 వేలు జరిమానా విధించారన్నారు. గత నెలలో 8 కేసులు నమోదు చేశామన్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికితే మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఫుట్బాల్ జట్టుకు ప్రాబబుల్స్ ఎంపికహిందూపురం టౌన్: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో బాలికల జూనియర్ ఫుట్బాల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా, వారిలోని నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా మొత్తం 27 మంది క్రీడాకారులను ప్రాబబుల్స్ కింద ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్కుమార్ తెలిపారు. ప్రాబబుల్స్కు ఎంపికై న వారికి క్యాంపు నిర్వహించి, తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా జట్టు తరుఫున ప్రాతినిత్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ సలీమ్, కోశాధికారి శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు లోకనాథ్, కదిరప్ప, వినోద్, శివప్రసాద్లు పాల్గొన్నారు. కనుల పండువగా హనుమద్ వాహనోత్సవం వజ్రకరూరు: మండల కేంద్రంలో జనార్దన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమద్వాహన కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమాలు చేశారు. రాత్రి హనుమద్ వాహన కార్యక్రమం నిర్వహించారు. ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ప్రధాన అర్చకుడు నరసింహమూర్తి, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాగా సోమవారం కల్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
కేజీబీవీ టీచర్ల గౌరవాన్ని కాపాడండి
అనంతపురం ఎడ్యుకేషన్: అనాథ, పేద విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కేజీబీవీ టీచర్ల గౌరవాన్ని కాపాడాలని కేజీబీవీ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో కేజీబీవీ టీచర్ల సంఘం విస్త్రత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీరేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయగౌరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం సంఘటిత విద్యారంగంలో అసంఘటిత ఉద్యోగులుగా ఉన్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వేతనాలు మిగుల్చుకోవడం ఒక భాగమైతే, హక్కులు, జీఓలు, చట్టాలు కాంట్రాక్టు విధానం అనే పేరుతో అమలు కాకుండా చేయడం మరో కుట్రన్నారు. పెరగాల్సిన వేతనాలు 2017 నుంచి నిలుపుదల చేశారన్నారు. మినిమం టైం స్కేలు అమలు చేస్తామని ఇచ్చిన జీఓలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం 352 కేజీబీవీల్లో పపనిచేస్తున్న 4,700 మందిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేజీబీవీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు అంపమ్మ, జ్యోతి, పార్వతి, దేవేంద్రమ్మ పాల్గొన్నారు. చివరగా అనంతపురం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షరాలుగా అంపమ్మ, ప్రధాన కార్యదర్శి జ్యోతి, 15 మంది కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. -
చేతిపంపులపై నిర్లక్ష్యం
ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేతి పంపుల నిర్వహణ అటకెక్కింది. పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 14 వేలకు పైగా చేతి పంపులు ఉన్నాయి. ఇందులో 9,200 చేతి పంపులు మరమ్మతుకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చింది. కొళాయిల ద్వారా నీటి సరఫరా కాకపోతే ఇక చేతిపంపులే దిక్కు. అయితే చాలా చోట్ల చేతిపంపులు మరమ్మతుకు నోచుకోక అలంకారప్రాయంగా మారాయి. దీంతో నీటి కోసం ప్రజలు ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలపై వ్యవసాయ తోటలు, బోరుబావులు బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మెకానిక్ల కొరతతో... అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో 2,530 చేతి పంపులు ఉన్నాయి. ఇందులో 1064 మరమ్మతుకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సత్యసాయి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో వారు కుడా ఏక్షణంలోనైనా సమ్మె బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కార్మికులు సమ్మెలోకి వెళితే ఆయా గ్రామాల్లో తాగునీటి కటకట తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకోని చేతిపంపులు మరమ్మతు చేయించాల్సి ఉంది. అనంతపురం జిల్లాలోనే 5 వేల వరకు చేతిపంపులు మూలన పడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం చేతిపంపులు మరమ్మతు చేయాల్సిన మోకానిక్లు కొరత పట్టిపీడిస్తోంది. చాలా ప్రాంతాల్లో గత్యంతరం లేక గ్రామీణులే చందాలు వేసుకొని చేతి పంపులను మరమ్మతు చేయించుకుంటున్నారు. అధికారులు దృష్టి సారిస్తేనే.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు లేని ప్రాంతాల్లో చేతిపంపులే దిక్కు. చాలా చోట్ల చిన్నపాటి మరమ్మతు చేస్తే నీరు సమృద్ధిగా వచ్చే పంపులు ఉన్నాయి. వాటిని అధికారులు మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు తాగునీటి సమస్య అత్యధికంగా ఉన్న గ్రామాలు ఎన్నో గుర్తించడంలోనూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఎండలు మండిపోతున్నాయి. జలాశయాలు, చెరువుల్లోనూ నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుతోంది. దీంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చేతి పంపుల మరమ్మతుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 వేలకు పైగా చేతి పంపులు నిరుపయోగంగా ఉన్న వాటి సంఖ్య 9,200 చేతి పంపుల మరమ్మతుపై దృష్టి పెట్టని అధికారులు పలు గ్రామాల్లో నీటి ఎద్దడితో ప్రజల ఇబ్బందులు మరమ్మతుకు చర్యలు గ్రామాల్లో మరమ్మతుకు నోచుకోని చేతిపంపులను గుర్తించి, వాటికి వెంటనే మరమ్మతు చేయిస్తాం. చేతిపంపుల మరమ్మతు చేసే మోకానిక్ల కొరతను అధికమించి ప్రత్యేక నిధులు కేటాయించి దశల వారీగా మరమ్మతు పనులు చేయిస్తాం. గ్రామాల్లో చేతిపంపుల నిర్వహణ ఎంతో అవసరంగా మారింది. వేసవిని దృష్టిలో ఉంచుకోని చేతిపంపులు మరమ్మతు చేయిస్తే ప్రజలకు ఎంతో ఊరట కల్గుతుంది. – సురేష్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, అనంతపురం -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
గుత్తి రూరల్: మండలంలోని ఊటకల్లు వద్ద శనివారం ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో ఓ విద్యార్థి గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్లోని చంద్రప్రియ నగర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విద్యార్థుల కోసం యాజమాన్యం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో శనివారం తొలుత కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పరపల్లి, రొళ్లపాడు తండా తదితర గ్రామాల నుంచి పిల్లలను ఎక్కించుకుంటూ గుత్తి మండలం ఊటకల్లు విద్యార్థుల కోసం బస్సు బయలుదేరింది. ఊటకల్లు గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న కుక్కలను గమనించగానే బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రొళ్లపాడు తండాకు చెందిన జెనిధర్ (4వ తరగతి) గాయపడ్డాడు. మరో విద్యార్థితో పాటు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఇరుకున్న మరో ఇద్దరు విద్యార్థులను డ్రైవర్ సాయంతో స్థానికులు వెలికి తీశారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాడితప్పిన ‘ఖజానా’ ● ముడుపులిస్తేనే బిల్లులకు మోక్షం ● ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు ● ఒక అధికారిపై ఫిర్యాదు చేస్తూ 18 లేఖలు ● ఉమ్మడి జిల్లా ఖజానా శాఖలోని ఓ అధికారి తీరుపై అదే శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అది కూడా ఏకంగా 18 రకాల ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాసినట్లు చర్చ సాగుతోంది. ● ఓ ఉద్యోగి రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈయన భూముల విక్రయాలకు సంబంధించిన వ్యాపారం జోరుగా చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ● ఓ అధికారికి శాఖలోని ఒకరిద్దరు ఉద్యోగులు రెస్టారెంట్లు, ధాబాల్లో విందు ఇస్తున్నట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఒక ధాబాలో పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విందులతో తమ పనులు చేయించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలోని కీలక శాఖల్లో ఖజానా శాఖ ఒకటి. అయితే ఈ శాఖలో ఉద్యోగుల పనితీరు గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అధికారి పనితీరుపై రాష్ట్రస్థాయి అధికారులకు ఒకరిద్దరు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటే పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొందరు ఉద్యోగులు అవినీతి దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు ముట్టచెబితేగానీ వీరు బిల్లుల పాస్ చేయరనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడి ఉద్యోగుల్లో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఒక అధికారికి రెస్టారెంట్లు, ధాబాల్లో విందులు ఇవ్వడం నిత్యకృత్యమయ్యింది. బజారున శాఖ పరువు ఖజానా శాఖ ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు తారస్థాయిలో ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటూ శాఖ పరువు బజారున వేస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఒక ముఖ్య అధికారి పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ఖజానా శాఖ పనితీరుపై అనంతపురం కలెక్టర్ ఆనంద్ దృష్టిసారించి దారిలో పెట్టాలనే అభిప్రాయాలు ఉద్యోగుల నుంచి కూడా వస్తుండడం గమనార్హం. అందుబాటులో ఉండకుండా.. ఉద్యోగి తనకు కేటాయించిన సీటులో ఉంటూ విధులు నిర్వర్తించాలి. అయితే టెక్నికల్ విధులు నిర్వర్తించే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎప్పుడూ తన సీట్లో అందుబాటులో ఉండరని తెలిసింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీట్లో ఆయన లేకపోవడంతో ఊసురోమంటూ వెనక్కు వెళుతున్నారు. ఈ విషయంపై శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్యను అడిగితే ఆ ఉద్యోగిని తన చాంబర్లో ఉంచుకుని పనిచేయిస్తున్నానని వివరణ ఇచ్చారు. -
రెండో స్థానంలో జిల్లా ఏపీఎంఐపీ
పుట్టపర్తి అర్బన్: రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించడంలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో రెండవ స్థానాన్ని జిల్లా దక్కించుకుందని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రోత్సాహాన్ని మరువలేమన్నారు. కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది సమష్టి సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 14 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 11,866 మంది రైతులకు 14,297 హెక్టార్లకు మెటీరియల్ అందించినట్లు తెలిపారు. ఆరుగురు రైతులకు ఆటోమెషిన్ మంజూరు చేసినట్లు వివరించారు. కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్ ● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం బత్తలపల్లి: కల్వర్టులోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరానికి చెందిన కుంటాల అభినయ్, సాత్విక్, వరుణ్.. నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం ముదిగుబ్బ మండలం కన్యకలగొందికి వెళ్లిన ముగ్గురు అక్కడ వివాహ వేడుక చూసుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని మోరీలోకి దూసుకెళ్లింది. వాహనంతో పాటు ముగ్గురూ మోరీలోకి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్ష/తగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, సాత్విక్, వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పెన్నహోబిలం ఆలయ ఈఓగా రమేష్బాబు ఉరవకొండ: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈఓగా సాకే రమేష్బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ ఆలయానికి ఇన్చార్జ్ ఈఓగా తిరుమలరెడ్డి కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆలయానికి రెగ్యులర్ ఈఓగా రమేష్బాబును నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆలయంలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమానికి తిరుమలరెడ్డి తన కుమార్తె దీక్షితా రెడ్డి పేరుపై రూ.10 వేలు విరాళాన్ని ఈఓ రమేష్బాబుకు అందజేశారు. పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు ఉరవకొండ: మేజర్ పంచాయతీ ఉరవకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి చిన్నారులు, పెద్దలు సహా 13 మందిని గాయపరిచింది. శనివారం సత్యనారాయణపేట, వడ్డే వీధిలోకి వచ్చిన పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసింది. రెడ్డికృష్ణ, మణికంఠ, సంజయ్, వన్నూర్స్వామి, ప్రేమ్, కృష్ణమూర్తి, నారాయణస్వామి, లక్ష్మి, ప్రభావతమ్మ, గోపి, మానస, సంజీవ, ప్రభాకర్ గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కాలనీవాసులు పంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. -
గ్యాస్ ఏజెన్సీపై నిరసనాగ్రహం
● గుడిబండలో ఖాళీ సిలిండర్లతో మహిళల బైఠాయింపు గుడిబండ: గ్యాస్ సిలిండర్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ ఇవ్వకుండా వేధిస్తున్న విష్ణుప్రియ గ్యాస్ ఏజెన్సీపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఖాళీ సిలిండర్లు తీసుకువచ్చి గుడిబండ బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. తామంతా గుడిబండలోని విష్ణుప్రియ గ్యాస్ ఏజెన్సీ నుంచి కొన్నేళ్లుగా హెచ్పీ గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల సిలిండర్ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరాలో ఇబ్బందులున్నాయని తాము కూడా సర్దుకున్నామన్నారు. అయితే వారం రోజుల క్రితం సిలిండర్ బుక్ చేసిన వారికి ఏజెన్సీ నిర్వాహకులు మూడు రోజుల తర్వాత టోకెన్లు ఇచ్చారని, దీంతో మరుసటి రోజు నుంచి రోజూ ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ వరకు వెళ్లడం సాయంత్రం వరకూ ఉండి వెనక్కు రావడం జరుగుతోందన్నారు. వృద్ధులు, మహిళలు కిలోమీటర్ల మేర క్యూలో ఎండలో నిలబడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలా ఎన్నాళ్లని ప్రశ్నిస్తే సిలిండర్లు సరఫరా కావడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారన్నారు. కానీ వచ్చిన సిలిండర్లను ఏజెన్సీ వారు అక్రమంగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు ఇప్పించడంతో పాటు విష్ణుప్రియ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బాలయ్య ఇలాకాలో టీడీపీకి గట్టి షాక్
చిలమత్తూరు(హిందూపురం): సీఎం చంద్రబాబు బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టి షాక్ ఇచ్చారు. అరాచక పాలన నచ్చక వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పళనీనగర్కు చెందిన 70 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి వైఎస్సార్సీపీలోకి చేరారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెంకటేష్ ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ ఆ పార్టీ నేత వేణురెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, రానున్న రోజుల్లో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరనుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఏఈ వెంకటేశులు, గోవిందరాజు, టి.రాజు, రాజా, మణి, నాగరాజు, సతీష్, విఘ్నేష్, మాధవన్, ప్రభాస్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి అమానుల్లా, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి వరుణ్రెడ్డి, నాయకులు అంబేడ్కర్ నవీన్, ముద్దిరెడ్డిపల్లి శివారెడ్డి, బండి రాము తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ డ్రైవింగ్.. ఇద్దరికి జరిమానా
హిందూపురం: ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురంలోని బజారు వీధిలో శనివారం సాయంత్రం రెండో పట్టణ సీఐ అబ్దుల్ వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వేర్వేరు ద్విచక్ర వాహనాలపై శరవేగంగా వచ్చిన ఇద్దరు మైనర్లను గమనించి అడ్డుకున్నారు. విచారణలో వారికి 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని తెలుసుకుని పీఎస్కు పిలుచుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు పిలిపించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు గాను ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. కౌన్సెలింగ్ అనంతరం ఇళ్లకు పంపారు. మైనర్లు వాహనాలతో రోడ్డెక్కితే ఊరుబోమన్నారు. -
తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదు
● ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని, అందుకోసం అన్ని మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వేసవిలో ఏ గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న నీటి కుంటలు, చెక్ డ్యాంల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నీటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రోజూ నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సమత, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వద్దు ప్రశాంతి నిలయం: కోర్టు కేసుల్లో కౌంటర్ దాఖలు చేయడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు సూచించారు. హైకోర్టు ధిక్కరణ కేసులు, ఇతర రిట్ పిటిషన్లపై శనివారం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. కాలయాపనతో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భూ సేకరణ, పట్టా మార్పిడి, ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. కోర్టు ఇచ్చిన గడువులోపు నివేదికలు సమర్పించాలని, ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించరాదన్నారు. ఆర్డీఓలు తమ పరిధిలోని తహసీల్దార్లను నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేసుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. న్యాయ పరమైన అంశాల్లో అలసత్వం వహిస్తే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వీసీలో జేసీ మౌర్యభరద్వాజ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
● కరువు సీమలో యాపిల్ సాగు
పొలంలో వరుస క్రమంలో నాటిన యాపిల్ మొక్కలువిరగ్గాసిన యాపిల్ కాయలుఎక్కడో ఎముకలు కొరికే చలిలో.. మంచుకురిసే ప్రాంతాల్లో పండే యాపిల్ గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు కేవీ రమణారెడ్డి ఆలోచన ఫలితంగా ప్రస్తుతం నిప్పులు కురిసే అనంత జిల్లాలోనూ విరగ్గాసింది. ఇజ్రాయిల్ నుంచి తెప్పించుకున్న కేఎల్డీ రకం 1,500 యాపిల్ మొక్కలను 2024, అక్టోబర్లో నాటాడు. పంట ఏపుగా పెరిగింది. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. స్థానిక మార్కెట్లో ఏ గ్రేడ్ టన్ను రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బీ గ్రేడ్ రూ. 1లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అడుగుతున్నారు. ఒక్కసారి మొక్క నాటితే 25 ఏళ్ల పాటు దిగుబడి ఇచ్చే యాపిల్ సాగుపై ఆసక్తి ఉన్న వారు తనను (93469 25502) సంప్రదిస్తే పూర్తి సహకారం అందిస్తానని రమణారెడ్డి అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
నవజాత శిశువు మృతి
పెనుకొండ రూరల్: ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఇంటికి చేరుకున్న నవజాత శిశువు మృతి చెందింది. పెనుకొండ మండలం గుట్టూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... గుట్టూరుకు చెందిన గర్భిణి స్నేహిలతకు 20 రోజుల క్రితం పురిటి నొప్పులు మొదలు కాగానే కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రసవం అనంతరం పండంటి మగబిడ్డతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి స్నేహలత చేరుకుంది. శనివారం ఉదయం ఉన్నఫళంగా నవజాతి శిశువు ముక్కు నుంచి రక్త స్రావం కావడంతో. కుటుంబ సభ్యులు గుట్టూరులోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సూచన మేరకు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువు అచేతనంగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందించడంలో గుట్టూరు సీహెచ్సీ సిబ్బంది విఫలమయ్యారంటూ శిశువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుట్టూరు సీహెచ్సీ డాక్టర్ నాగరాజు నాయక్ మాట్లాడుతూ.. నవజాత శిశువు బరువు తక్కువగా ఉన్న కారణంగా 15 రోజులకు పైగా అనంతపురంలోని సర్వజనాస్పత్రిలోనే చికిత్స చేశారన్నారు. గుట్టూరు సీహెచ్సీలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు లేకపోవడంతో పెనుకొండకు తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారన్నారు. పీటీ వారెంట్పై ఇద్దరి అరెస్ట్ హిందూపురం: ఓ కేసులో పట్టుబడి జైలులో ఉన్న ఇద్దరిని శనివారం హిందూపురం పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వివరాలు... హిందూపురంలోని త్యాగరాజ నగర్కు చెందిన కాల ప్రవీణ్, నాగేంద్ర.. ఈ ఏడాది జనవరిలో గంజాయి కేసులో పట్టుబడి అనంతపురంలోని సబ్జైలులో ఖైదీలుగా ఉంటున్నారు. ఈ కేసులో న్యాయస్థానంలో వారిని హాజరు పరచాల్సి ఉండడంతో పీటీ వారెంట్ కింద ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, హిందూపురానికి పిలుచుకువచ్చారు. శనివారం న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం తిరిగి సబ్జైలుకు తరలించారు. -
బ్రహ్మోత్సవం.. సర్వం సిద్ధం
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రత్నగిరి సంస్థానం రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు, గ్రామ పెద్దలు తదితరులు శనివారం తెలిపారు. నేడు అంకురార్పణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులు కానుక రూపంలో తీసుకొచ్చే పట్టు వస్త్రాలు, వడిబియ్యం కట్టి, వెండి, బంగారు ఆభరణాలతో పాటు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేస్తారు. రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ చుట్టూ మేళతాళాలతో పాటు పురవీధుల గుండా ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆలయం ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్ధరాత్రి మేళతాళాలతో సమీపంలోని పాలబావి వద్దకు భక్తులు చేరుకుంటారు. పాలబావిలో ఉత్సవ విగ్రహాలను ప్రధాన అర్చకులు గంగాజలంతో దేవతను శుద్ధి చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం, పూలు, పండ్లు, హారతి చేసిన తర్వాత నైవేద్యంగా బావిలోకి సమర్పిస్తామన్నారు. పాలబావిలో అమ్మవారికి గంగా జలంతో శుద్ధి చేసిన అనంతరం పూజలు నిర్వహిస్తే సంతాన భాగ్యం, వివాహ యోగం కలుగుతుందని, ధీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులు పాలబావి వద్దకు గంగ పూజ చేయడానికి మహిళలు తండోపతండాలుగా తరలివస్తారు. కార్యక్రమాలు ఇలా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తేదీన జలధి ఉత్సవం, కలశ స్థాపన, 6వ తేదీన బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 7వ తేదీన జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 12వ తేదీన అమ్మవారికి పుష్పాలంకారణ, పోతరాజుల విశేష పూజ, అదేరోజు రాత్రి శాంభవి మహాత్మే పౌరాణిక నాటిక ప్రదర్శన (కన్నడ), 13వ తేదీన పోతరాజు బండారు కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం నుంచి 13వ తేదీ వరకు పశువుల జాతర కూడా ఉంటుందని వెల్లడించారు. నేటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 వరకు జరగనున్న ఉత్సవాలు -
ఊరికో పేరు.. పూటకో మోసం
బొమ్మనహాళ్: గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త చిన్న ఓబులేసు ఘరానా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ సాగించిన మోసాలను ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ. లక్షకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత రూ. కోట్లలో వసూలు చేసుకుని పెట్టెబేడా సర్దుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇప్పటికే కణేకల్లు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా అవుకు, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మోసాలకు పాల్పడిన ఓబులేసు... తాజాగా బొమ్మనహాళ్ పీఎస్ పరిధిలోని ఉద్దేహాళ్లో మహేష్రెడ్డి పేరుతో రూ.1.50 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. గత ఆరేళ్లలో రూ.20 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో భాస్కర్రెడ్డిగా... మహేష్రెడ్డిగా 2022 మే లో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్రెడ్డిగా పరిచయమైన ఓబులేసు అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారమంటూ స్థానికులను నమ్మించి సుమారు రూ.3 కోట్ల వరకూ మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు అవుకు పోలీసులు గాలించి అన్నమయ్య జిల్లా గాలివీడులో పట్టుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం బయటకు వచ్చిన ఓబులేసు 2023 జనవరిలో శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో షేర్ మార్కెట్ వ్యాపారమంటూ సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతకు ముందు కణేకల్లుతో పాటు ఆత్మకూరులోనూ రూ. 4 కోట్ల వరకూ జనాలను మోసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చేరుకున్న ఓబులేసు... మహేష్రెడ్డి పేరుతో ఓ అద్దె ఇంట్లో దిగాడు. అద్దె కారును తన సొంత వాహనమని చెప్పుకుంటూ తిరిగేవాడు. సిగరెట్లు, చక్కెర ఎగుమతి..దిగుమతి వ్యాపారం చేస్తున్నానంటూ అందరినీ నమ్మించాడు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే రూ.లక్షకు రూ. 3 వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి, పది మందితో సుమారు రూ. 1.50 కోట్లను వసూలు చేసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో మాయమాటలతో గొర్రెల కాపరులను బురిడీ కొట్టించి వంద జీవాలను తీసుకెళ్లాడు. బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న ఓబులేసుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అయితే ఉద్దేహాళ్ గ్రామంలో రూ.1.50 కోట్ల మోసానికి సంబంధించి ఒక్క రూపాయిని కూడా నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేయకపోవడం గమనార్హం. ప్రజల అత్యాశే పెట్టుబడి ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి వేషాలు మార్చి.. మోసాలకు తెగబడి ఓబులేసు, మహేష్రెడ్డి, మనోహర్రెడ్డి, భాస్కర్రెడ్డి, చక్కరరెడ్డి.. పేరు ఏదైనా మనిషి మాత్రం ఒక్కడే. తాను ఎక్కడికెళ్లినా కొత్త పేరు పెట్టుకోవడం అతని నైజం. తనను నమ్మిన వారిని నట్టేట ముంచి జెండా ఎత్తేయడం అతని హాబీ. ఎక్కడ పాగా వేసినా రూ.కోట్లలోనే కుచ్చు టోపీ పెట్టడం అతని వృత్తి. పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఈ ఘరానా కేటుగాడు ఇప్పటికే పలుమార్లు పోలీసులకు పట్టుబడి రిమాండ్కు వెళ్లి వచ్చాడు. అయినా మార్పు రాలేదు. తాజా మోసాలతో మరోసారి రాయదుర్గం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణం తీశారు!
కదిరి: ప్రసవం కోసం తమ బిడ్డ వాణిశ్రీని సాయినాథ్ ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యులు ప్రాణాలు తీశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. శనివారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన వాణిశ్రీని రెండో కాన్పు నిమిత్తం కుటుంబీకులు ఈ నెల 1వ తేదీన కదిరిలోని సాయినాథ్ ఆస్పత్రిలో చేర్చారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో కాన్పు కష్టంగా ఉందని చెప్పిన వైద్యులు.. సిజేరియన్ చేసి ఆడ శిశువును బయటకు తీశారు. ప్రసవం అయిన గంట తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వాణిశ్రీని తక్షణం బెంగళూరుకు తీసుకెళ్లండని చెప్పి డిశ్చార్జ్ చేశారు. దీంతో కుటుంబీకులు బెంగళూరు తరలిస్తుండగా...మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. శనివారం ఆస్పత్రి వద్దకు వచ్చిన మృతురాలి కుటుంబీకులు, బంధువులు... వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వాణిశ్రీ చనిపోయిందని ఆరోపించారు. కళ్లు తెరవకుండానే కన్నతల్లిని కోల్పోయిన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా ఆసుపత్రిలోకి చొరబడటంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు డెలివరీ అనంతరం పేషంట్ వాణిశ్రీకి ‘ఆమ్నియోటిక్ ఫ్లూడ్ ఎంబాలిజమ్’ అనే ప్రాణాంతకమైన సమస్య రావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశామని, దురదృష్టవశాత్తు దారిలోనే ఆమె చనిపోయిందని సాయినాథ్ ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని పేర్కొంది. కదిరి సాయినాథ్ హాస్పిటల్ ఎదుట బాధితుల ఆందోళన -
●ఉత్సాహంగా సాగిన ‘రన్’
హిందూపురం: ఈస్టర్ పర్వదిన రాకను పురస్కరించుకుని శనివారం హిందూపురం పురవీధుల్లో ‘రన్ ఫర్ జీసెస్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ సెక్రటరీ డాక్టర్ ఎ.నాగేంద్ర కుమార్ అధ్యక్షతన స్థానిక సీఐజీ మిషన్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందూపురం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఎన్.డేవిడ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, టు టౌన్ సీఐ అబ్దుల్కరీం ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మెయిన్రోడ్డు మీదుగా సీఐజీ చర్చి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలు మాట్లాడారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్దాలను వెంటనే ఆపాలని, శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు, చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో చర్చి సెక్రెటరీ బి.జయరాజు, యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.సూర్యప్రకాష్, సెక్రెటరీ జాన్సన్, పాస్టర్లు ఇజ్రాయిల్ రాజు, దేవరాజ్, సీఐజీ మిషన్ చర్చి పాస్టర్ కె.రవి కిరణ్, జాయింట్ సెక్రెటరీ అరుణ్ కుమార్, ట్రెజరర్ సాల్మన్ రాజ్, జాయింట్ ట్రెజరర్ దేవరాజు, బోర్డు సభ్యులు ఆంజనేయులు, రూబేన్ పాల్, జార్జి బాబు, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, డేనియల్, శ్రీరాములు, శ్యాంబాబు, సంఘ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.సాంస్కృతి ప్రదర్శనతో అలరిస్తున్న విద్యార్థులుమాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున -
12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
పుట్టపర్తి అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు స్థానిక యూటీఎఫ్ నాయకులు బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ‘రణభేరి 3.0’ పేరుతో నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆశపడ్డామని, అయితే రెండేళ్లవుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికే రణభేరి 1.0, 2.0 చేసినా ఫలితం లేకపోవడంతో మడో వితగా ‘రణభేరి 3.0’ పేరుతో నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఐఆర్ ప్రకటిస్తామని, సీపీఎస్కు బదులు ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీం ప్రవేశ పెడతామని, 12వ పీఆర్సీ చైర్మన్ను నియమిస్తామని, ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు అధికారం చేపట్టాక హామీలన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాబోయే కాలంలో రాష్ట్రస్థాయి ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కూటమి సర్కార్ విద్యా విధానాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోందన్నారు. నిరాహార దీక్షలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణానాయక్, జేఏసీ నాయకులు రామ్మోహన్, వేణుగోపాల్, ఈశ్వరయ్య, శ్రీరాములు నాయక్, సంఘ నాయకులు మల్లికార్జునరెడ్డి, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, కార్యదర్శులు మల్లికార్జున, నరసింహప్ప, అమర నారాయణరెడ్డి, మురళీ, చెన్నకేశవులు, బాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ 3.0 రణభేరిలో టీచర్ల డిమాండ్ -
బ్రహ్మోత్సవాలపై కూటమి కుట్ర
తాడిమర్రి: తాడిమర్రికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. కొక్కంటి పాలెగాళ్ల వంశానికి చెందిన రామప్ప నాయుడు ఇక్కడ కోటను నిర్మించారు. పలువురు రాజులను జయించి, రాజ్యాలను కై వసం చేసుకున్నారని చరిత్రకారులు చెబుతారు. రామప్ప నాయుడు యుద్ధాలకు వెళ్లేప్పుడు కోటలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో తప్పకుండా ప్రత్యేక పూజలు చేసేవారని, అందుకే ఆయనకు తిరుగేలేకుండా పోయిందని పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏటా శ్రీరామ నవమి పండుగ నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించే వారని, ఇందుకోసం ఆలయానికి రామప్ప నాయుడు 30 ఎకరాల మాన్యం భూములను కేటాయించారని ఇక్కడి వారు గుర్తు చేసుకుంటుంటారు. గతంలో ఇక్కడ పెద్ద చక్రాలు కలిగిన రథం ఉండేదని, 40 ఏళ్ల క్రితం వరకూ ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించేవారు. అయితే ఆలయంలోని లక్ష్మీచెన్నకేశ్వస్వామి విగ్రహాల కింద గుప్త నిధులు ఉన్నాయని దుండగులు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఆగిపోయింది. చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వైఎస్సార్ ద్వారా దేవదాయ శాఖ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. అలాగే చంద్రశేఖరెడ్డి వంశస్తుల ఉమ్మడి ఆస్తి 10 ఎకరాలను అమ్మి ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల కాంట్రిబ్యూషన్ కింద నిధులు అందించారు. దీంతో 2006లో కోట ముఖ ద్వారం ముందు భాగంలో లక్ష్మీచెన్నకేశవస్వామి నూతన ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీరామ నవమి నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు సాగే వేడుకల్లో చివరి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవం రోజున చెక్కభజన, కీలు గుర్రాల నాట్యాలు, మరగాళ్ల విన్యాసాలతో పాటు పౌరాణిక నాటకం, రాతి దూలం లాగుడు పోటీలతో పాటు భక్తులకు అన్నదానం తదితర కార్యక్రమాలను ఆయన సొంత డబ్బులతో చేస్తూ వస్తున్నారు. రూ.40 లక్షల వ్యయంతో నూతన రథం లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలోని పురాతన రథం పాడై పోవడంతో ఎద్దుల బండిపై స్వామిని ఉంచి రథోత్సవం నిర్వహించేవారు. అయితే రెండేళ్ల క్రితం తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి తన సొంత డబ్బుతో పాటు కొంతమంది ద్వారా చందాలు తీసుకుని సుమారు రూ.40 లక్షల వ్యయంతో నూతన రథాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక కళ వచ్చి మరింత ఆదరణ లభించింది. ఏటికేడు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓర్వలేక..మోకాలడ్డు ఈ ఏడాది కూడా లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణ కోసం వైఎస్సార్ సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి కరపత్రాలను ముద్రించారు. అనంతరం ఉత్సవాలు నిర్వహణకు పోలీసుల అనుమతి కోసం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను కలిశారు. అనంతరం చంద్రశేఖర్రెడ్డి తన సొంత భూమిలో రాతి దూలం లాగుడు పోటీలను నిర్వహించడానికి జేసీబీతో భూమిని చదును చేయిస్తుండగా... పోలీసులు పనులను ఆపివేయించారు. ఎందుకని ప్రశ్నిస్తే కూటమి నేతలు ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతున్నారని, మీరు తప్పుకోవాలని చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు సుమారు వందమంది మరోసారి పోలీసుల అనుమతి కోసం వెళ్లగా, వారి నుంచి స్పందన లేదు. కనీసం రాతి దూలం లాగుడు పోటీలు, అన్నదానం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా... పోలీసులు ఒప్పు కోలేదు. తూతూ మంత్రంగా ఉత్సవాలు ఏటా శ్రీరామ నవమి నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే వారు. రోజూ లక్ష్మీచెన్నకేశవస్వామిని ప్రత్యేకంగా అలంకరించి రోజుకో వాహనంపై గ్రామంలో ఊరేగిస్తూ ఎనిమిదో రోజు రథోత్సవం నిర్వహించే వారు. అయితే ఈ సారి తామే ఉత్సవాలు నిర్వహిస్తామంటూ ముందుకు వచ్చిన కూటమి నేతలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వాహన సేవలు కూడా నిర్వహించడం లేదు. కీలకమైన రథోత్సవం గురువారం నిర్వహించాల్సి ఉండగా...ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉత్సవాల నిర్వహణకు రూ.లక్షలు ఖర్చవుతాయని, అంత డబ్బు కూటమి నేతలు ఖర్చు చేసేందుకు ఇష్టం లేని కూటమి నేతలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నామని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతకానప్పుడు ఎందుకు అడ్డగించారని మండిపడుతున్నారు. గతంలో తాడిమర్రిలో తేరు (రథోత్సవం) జరుగుతుందంటే బంధుమిత్రులతో ఊరంతా పండుగలా ఉండేదని, ఈసారి ఆ సందడి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దేవుడి ఉత్సవాన్ని రాజకీయాలకు వాడుకున్న వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని జనం అంటున్నారు. లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవ నిర్వహణకు మోకాలడ్డు / దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలకు అడ్డగింత పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులు / ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు / ఆందోళన చెందుతున్న భక్తులు తాడిమర్రి లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన రథోత్సవంపై నీలినీడలు అలుముకున్నాయి. దశాబ్దాలుగా తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను చూసి ఓర్వలేని కూటమి నేతలు కుట్ర చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల అండతో ఈసారి ఉత్సవాన్ని అడ్డుకుంటున్నారు. రూ.లక్షలు ఖర్చయ్యే ఈ వేడుక నిర్వహణ చెప్పినంత సులువు కాదని, దేవుడి ఉత్సవంతో రాజకీయం చేస్తున్న కూటమి నేతల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మడకశిరకు చేరుకున్న బైక్ యాత్ర
మడకశిర: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంక్షేమ పాలనపై ప్రజలను చైతన్య పరుస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన అడవికోటి రాజు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బైక్యాత్ర బుధవారం మడకశిరకు చేరుకుంది. పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. ఈ సందర్భంగా వైసీ గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ 175 నియోజకవర్గాల్లో బైక్ యాత్ర సాగిస్తుండడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల మాజీ కన్వీనర్ రామిరెడ్డి, టౌన్ కన్వీనర్ ఓంకుమార్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామి, స్థానిక నాయకులు వైసీ బాలకృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ, పాపసానిపల్లి వేమారెడ్డి, పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● గుడిబండ: అడవికోటి రాజు చేపట్టిన బైక్యాత్ర బుధవారం గుడిబండకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్పతో పాటు పలువురు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజకీయ పోస్టింగ్లకు చెక్
● శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ నిర్ణయంతో 30 మంది బదిలీ అనంతపురం సెంట్రల్: రాజకీయ సిఫారసులకు చెక్ పెడుతూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తనదైన మార్క్ను చూపించారు. వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 30 మందికిపైగా కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... జిల్లాల విభజన సమయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లలో 30 మందికి పైగా అక్కడ పనిచేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులతో సిఫారుసులతో అనంతపురం జిల్లాలోని వివిధ పీఎస్ల్లో తిష్ట వేశారు. వీరందరూ ఆయా పీఎస్ల్లో బాస్లకు అత్యంత కీలకమైన వారుగా చలామణి అవుతున్నారు. అనంతపురం వన్టౌన్ పీఎస్లోనే నలుగురు కానిస్టేబుళ్లు తిష్టవేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఓ కానిస్టేబుల్ ఇక్కడ పనిచేయడానికి ఇతర జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా నేరుగా డీజీపీ కార్యాలయం నుంచి సిఫారసు చేయించాడంటే వన్టౌన్ పీఎస్కు డిమాండ్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ సతీష్కుమార్ శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లందరూ తక్షణమే అక్కడ రిపోర్టు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాకు సదరు కానిస్టేబుళ్లు ఏకమై శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో సంప్రదించి ఎస్పీ సతీష్కుమార్పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ఎస్పీ సతీష్కుమార్ తలొగ్గకుండా ఆ కానిస్టేబుళ్లందరూ శ్రీసత్యసాయి జిల్లాలోనే విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కానిస్టేబుళ్ల వంతు కాగా, తర్వాత మిగిలిన కేడర్లోనూ స్థాన చలనం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ సతీష్కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పోలీస్ శాఖలో హాట్టాపిక్గా మారింది. కొడుకుపై తండ్రి రోకలి బండతో దాడి ●ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని సైదాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి తన కొడుకు గణేష్నాయుడిపై రోకలి బండతో దాడి చేశాడు. మద్యానికి బానిసైన గణేష్ నాయుడు (24)కు పెళ్లి కాలేదు. దీంతో తాగుడు మానేయాలని తరచూ తండ్రి చెబుతూ వచ్చేవాడు అయితే మద్యానికి అలవాటు పడిన గణేష్ నాయుడు తండ్రి మాటలు పెడచెవిన పెట్టి మత్తులో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడిని చూసి తండ్రి తీవ్ర స్థాయిలో మందలించాడు. ఆ సమయంలో కుమారుడు దుర్భాషలాడుతూ తండ్రిపైనే తిరగబడ్డాడు. అనంతరం మిద్దె పైకెళ్లి నిద్రకు ఉపక్రమిస్తుండగా తండ్రి నారాయణస్వామి రోకలిబండతో దాడి చేశాడు. ఘటనతో తీవ్ర రక్తగాయాలైన గణేష్ నాయుడిని కుటుంబసభ్యలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గణేష్ నాయుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇది దోపిడీ ప్రభుత్వం
రాప్తాడు రూరల్: రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం రాజ్యమేలుతోందని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లూ చాలా క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ సర్పంచులకు అనంతపురం రూరల్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిశీలకులు రమేష్రెడ్డి హాజరయ్యారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలం, ఆదాయం లేకపోవడం, నిధుల లేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల బాగాలేకపోవడంతో గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధి పనులు జరగలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం సర్పంచులగా పనిచేసిన వారందరికీ రానున్న రోజుల్లో మరింత గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు చేతనైన మేరకు సాయం చేశామన్నారు. గౌరవం నిలబడేలా గుడికో, బడికో, ఆస్పత్రులకో ఇతర వాటి కోసమే రూ.కోట్లలో ఖర్చు చేశామన్నారు. తనకు జగన్మోహన్రెడ్డితో ఉన్న అనుబంధం భగవంతుడు, భక్తుడికి ఉన్న బంధం లాంటిదన్నారు. రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. పరిటాల కుటుంబం అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తాము దూరం చేస్తూ వచ్చామన్నారు. వారు మనుషులను చంపుతూ భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ధర్మవరం పోయినా, పెనుకొండకు పోయినా, రాప్తాడు నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. పరిటాల ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కురుబ లింగమయ్యను హతమార్చారన్నారు. రాబోవు ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయలేమని భావించే పరిటాల కుటుంబం రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో దోపిడీలకు తెరలేపిందన్నారు. వారిలా హత్యలతో భయభ్రాంతులకు గురి చేసి జనాలను తాను లోబర్చుకోలేదన్నారు. తాను ఆర్థికంగా చెడిపోయినా రైతులకు మేలు చేశానన్నారు. జనాలకు ప్రేమతో దగ్గరయ్యానన్నారు. నేటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని పొరబాట్లను సరిదిద్దుకుంటామన్నారు. ఈసారి అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో 111లో కనీసం 106 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంటుందని పేర్కొన్నారు. జగన్ పాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయనపైనే అన్ని వర్గాల ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. అనంతరం మండలాల వారీగా సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో ఆహుడా మాజీ చైర్మన్ మహలక్ష్మీ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు కదిరి ఇస్మాయిల్, సానే రాజారెడ్డి, పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, మదిగుబ్బ వీరాంజనేయులు, గంగుల సుధీర్రెడ్డి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండలాల కన్వీనర్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదు వైఎస్ జగన్ క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
లాలేపల్లిలో వైద్య శిబిరం
చిలమత్తూరు: మండలంలోని లాలేపల్లిలో విజృంభిస్తున్న విష జ్వరాలపై ‘లాలేపల్లిలో విషజ్వరాలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హిందూపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి శివన్న, పర్యవేక్షకుడు గంగాధర్, వైద్యాధికారి డాక్టర్ లావణ్య నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరపీడితులు, జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీడీఓ బాలాజీ హరికృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రెయినేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దోమల నివారణకు మందును పిచికారీ చేయించారు.అనంతరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి చికిత్సలు అందజేశారు. రక్త నమూనాలను పరిశీలించిన అనంతరం పలువురికి టైఫాయిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దగ్గు, జలుబు, నొప్పులతో బాధపడుతున్న 27 మందికి మందులను అందజేశారు. అనంతరం మలేరియా, టైఫాయిడ్, డెంగీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా, గ్రామంలో నీరు కలుషితం కావడం వల్లనే విషజ్వరాలు ప్రబలాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటి ప్రాంతం నుంచి వస్తున్న తాగునీరు సురక్షితం కాదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో మరో మూడు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ఓ జయచంద్రకుమార్, ఆరోగ్య కార్యకర్త మహేష్, ఎంఎల్హెచ్పీ నరేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళపై దాడి
హిందూపురం టౌన్: ఇంటికి వేసిన తాళం, తలుపులు బద్ధలుగొట్టి యజమానురాలు భారతిపై దాడి చేసిన ఘటన లేపాక్షి మండలం కల్లూరులో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... కల్లూరు గ్రామంలో భారతికి సొంతిల్లు ఉంది. కుమారుడు, కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతి ఒక్కరే కల్లూరులోని ఇంట్లో ఉండలేక హిందూపురానికి మకాం మార్చింది. బుధవారం తన కుటుంబానికి సంబంధించిన వెంకటనారాయణమ్మ, ఆమె కుమారుడు నవీన్ కుమార్ కల్లూరులోని భారతి ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి లోపలికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న భారతి అక్కడు వెళ్లి వారిని ప్రశ్నించడంతో దుర్భాషలాడుతూ దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుపడడంతో ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి బయటపడిన ఆమె ఆటోలో హిందూపురం చేరుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పతిలో చేరింది. తనను హతమార్చి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆమె వాపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. -
భూ మాయాజాలం
పెనుకొండ: ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతతో కలిసి మండలంలోని మునిమడుగు గ్రామంలో వెయ్యి ఎకరాల భూమికి బోగస్ అగ్రిమెంట్లు సృష్టించి రూ. 8 కోట్లు స్వాహా చేసిన వైనం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ భూమాయాజాలంలో ఓ టీడీపీ ముఖ్య నాయకుడు ఉండటంతో గ్రామానికి చెందిన రైతులు నోరు విప్పడానికి కూడా భయపడుతున్నారు. నకిలీ అగ్రిమెంట్లతో టోకరా.. ‘కియా’ రాకతో పెనుకొండ సమీపంలోని భూముల ధరలు ఆకాశానికి చేరాయి. రియల్ వ్యావారం జోరుగా సాగింది. ఈక్రమంలోనే 2021–22 మధ్యకాలంలో నెల్లూరుకు చెందిన కొందరు భూవ్యాపారులు ‘కియా’ సమీపంలో భూములు కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ధర్మవరంలో తమకు తెలిసిన ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లను సంప్రదించారు. సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమకు పరిచయస్తుడైన మునిమడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిని కలిసి విషయం తెలిపారు. అయితే భూములు చూపి కమీషన్లు తీసుకోవాల్సిన సదరు టీడీపీ నాయకుడు దోపిడీకి ప్లాన్ చేశాడు. ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా నెల్లూరు భూవ్యాపారులకు టోపీ పెట్టాలని సిద్ధమయ్యాడు. కావాల్సినంత భూమి సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా నకిలీ అగ్రిమెంట్లు పంపి రైతులకు ఇవ్వాలంటూ రూ. 8 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నాడు. అనంతరం ఆ మొత్తాన్ని ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మునిమడుగుకు చెందిన టీడీపీ నాయకుడితో పాటు మరికొందరు వ్యక్తులు తలా ఇంతని పంచుకున్నారు. కడప రైతుల ఫొటోలతో పాస్ పుస్తకాలు.. రూ.8 కోట్లు ఇచ్చిన నెల్లూరు వాసులు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరగా... సదరు టీడీపీ నాయకుడు కడపకు చెందిన వారి ఫొటోలు సేకరించి మునిమడుగు రైతుల భూముల సర్వే నంబర్లతో బోగస్ పాసు పుస్తకాలు తయారు చేయించాడు. ఆ పాసు పుస్తకాలనే రూ. 8 కోట్లు ఇచ్చిన భూమి కొనుగోలు దారులకు ఇచ్చినట్లు మునిమడుగు రైతులు పేర్కొంటున్నారు. అయితే అప్పటి నుంచి ఏమీ పట్టించుకోని భూమి కొనుగోలు దారులు ఇటీవల మునిమడుగుకు వచ్చి తాము కొనుగోలు చేసిన భూముల పరిశీలనకు వెళ్లగా..రియల్ మోసం బయటపడింది. భూముల్లోకి వెళ్లిన వారిని రైతులు అడ్డుకోవడంతో పాటు కేసులు పెడతామని చెప్పడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు. వెంటనే వారు ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నిలదీయడంతో మోసం బయటపడింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు.. దర్యాప్తు రూ.8 కోట్లు ఇచ్చి మోసపోయిన నెల్లూరు జిల్లా రియల్ వ్యాపారులు ధర్మవరానికి చెందిన బ్రోకర్లపై ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము భూములు కొనుగోలు చేసింది, ఎక్కడ కొనుగోలు చేసింది, దీని వెనుక ఉన్న సూత్రధారుల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ధర్మవరం సీఐ నాగేంద్ర ధర్మవరానికి చెందిన బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే మునిమడుగుకు వెళ్లి రైతులనూ విచారించారు. అయితే తాము ఎవరికీ భూములను విక్రయించలేదన్నారు. దీంతో సీఐ సదరు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకాలు చూపగా... ఫొటోలను పరిశీలించిన రైతులు.. వారెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా కడపకు చెందిన రైతుల ఫొటోలని తేలింది. ప్రస్తుతం పోలీసులు 50 మంది రైతులతో స్టేట్మెంట్ తీసుకున్నారు. నేడోరేపో కీలక వ్యక్తి అరెస్ట్.. మునిమడుగు భూమాయాజాలం కేసులో ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించిన ధర్మవరం పోలీసులు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికారపార్టీకి చెందిన ఓ నేతను నేడోరేపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మునిమడుగు గ్రామంలో కలకలం రేపుతున్న భూమాయాజాలంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామ రైతులతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పెనుకొండ మండలం మునిమడుగులో ‘రియల్’ మోసం వెయ్యి ఎకరాలకు బోగస్ అగ్రిమెంట్లు కడప రైతుల ఫొటోలతో నకిలీ పాస్ పుస్తకాలు నెల్లూరు జిల్లా వాసుల నుంచి రూ. 8 కోట్లు వసూలు భూమి స్వాధీనానికి వెళితే అడ్డుకున్న రైతులు ధర్మవరం పోలీసులను ఆశ్రయించిన నెల్లూరు వాసులు పోలీసుల అదుపులో ధర్మవరం బ్రోకర్ నేడోరేపో టీడీపీ నాయకుడు, ఇతర సూత్రధారుల అరెస్ట్! కియా ఏర్పాటయ్యాక పెనుకొండ సమీపంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ‘రియల్’ మోసాలు అదే స్థాయిలో జరిగాయి. ఈ క్రమంలోనే ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మునిమడుగుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు కలిసి నెల్లూరుకు చెందిన వారికి ఏకంగా రూ.8 కోట్లకు టోపీ పెట్టారు. నకిలీ అగ్రిమెంట్లు, పాసుపుస్తకాలతో బురిడీ కొట్టించి తలా ఇంత పంచుకుతిన్నారు. తాజాగా భూముల వద్దకు వెళ్లిన బాధితులు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా... వారు కూపీ లాగుతున్నారు. బోగస్ పాసుపుస్తకాలు ఇచ్చేస్తే పోలా!!అంతా వాళ్లే చూసుకుంటారులే ! -
తాగునీరు మాకెందుకు ఇవ్వరు?
తలుపుల: తాగునీటి సమస్య పరిష్కారానికి ఇటీవల బోరు బావి ఏర్పాటు చేయించి కూడా ఎగువ ప్రాంతాలకు నీరు అందకుండా చేస్తారా? నీరు వదలమంటే దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి అంటూ టీడీపీ నాయకుడు బెదిరిస్తాడా? అసలు మాకు తాగునీరెందుకు ఇవ్వరు? అంటూ సచివాలయ ఉద్యోగులను మహిళలు గట్టిగా నిలదీశారు. తలుపుల మండలం ఓదులపల్లిలో బుదవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ... ఇటీవల తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్తగా బోరు బావి తవ్వించారని గుర్తు చేశారు. గ్రామానికి ఎగువన సుమారు 46 ఇళ్లకు పైప్లైన్ ఉన్నా తాగునీటిని వదలకుండా స్థానిక టీడీపీ నేత అడ్డుకుంటున్నాడని, వెళ్లి ప్రశ్నిస్తే దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బోరు బావి వేసింది కేవలం టీడీపీ వాళ్ల కోసమేనా అని ప్రశ్నించారు. తాగునీటి అందించే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీంతో విషయాన్ని ఎంపీడీఓ నసీమా దృష్టికి సచివాలయ కార్యదర్శి ఉదయశ్రీ తీసుకెళ్లారు. వెంటనే ఎంపీడీఓ నసీమా ఓదులపల్లి గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి తాగునీటిని అన్ని ఇళ్లకు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ సచివాలయ కార్యదర్శిని ఆదేశించారు. తాగునీటి విషయంలో రాజకీయాలు తగదని టీడీపీ నేతలకు హితవు పలికారు. సచివాలయ ఉద్యోగులను నిలదీసిన మహిళలు -
నేడు కూడేరు సంగమేశ్వరుడి రథోత్సవం
కూడేరు: స్థానిక సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 6.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఒ రమేష్ బాబు బుధవారం వెల్లడించారు. రథోత్సవానికి వేలాదిగా తరలి వచ్చే భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. 97 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఒకేషనల్ పరీక్షకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 5,082 మంది విద్యార్థులకు గాను 4,987 మంది హాజరు కాగా, 95 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సైతం పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 97 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. వ్యక్తి దుర్మరణంబత్తలపల్లి: మండలంలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని గాండ్లవీధికి చెందిన బలిజ చింతా చిన్న కొండప్ప(36) స్థానికంగా ఓ సిల్క్ హౌస్లో గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన కొండప్ప... అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై బత్తలపల్లి మండలం సంజీవపురం సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో కాటికోటేశ్వరక్షేత్రానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఆర్చ్ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొండప్ప భార్య గీత, కుటుంబసభ్యులు బంధువులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. వ్యక్తిపై కత్తితో దాడి కదిరి అర్బన్: మండలంలోని కౌలేపల్లి వద్ద కుమ్మరవాండ్లపల్లికి చెందిన రమేష్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలసి కౌలేపల్లి సమీపంలో ఫ్లైఓవర్ కిందకు వెళ్లిన సమయంలో అప్పటికే అక్కడ మద్యం సేవిస్తున్న కొందరు గమనించి అనుమానంతో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. -
పోలీస్ స్టేషన్ ప్రారంభం
కదిరి అర్బన్: ఇటీవల ఆధునీకరించిన కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సతీష్కుమార్, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ప్రారంభించారు. అలాగే పీఎస్ బయట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సైతం వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నిరంజన్రెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆటోను ఢీకొన్న బొలెరో రామగిరి: ఆటోను బొలెరో ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం రామగిరి ప్రాంతంలో కూలి పనులకు హాజరైన చెన్నేకొత్తపల్లి వాసులు రాత్రి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఎదురుగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
రెవెన్యూ భవన్ ప్రారంభం
పుట్టపర్తి అర్బన్: జిల్లా రెవెన్యూ భవన్ బుధవారం ప్రారంభమైంది. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లో ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన రెవెన్యూ భవన్, ఎస్ఆర్ శంకరన్ హాలును బుధవారం మంత్రులు సత్యప్రసాద్, సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర తదితరులు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు భవనం ఆవరణలో మొక్కలు నాటారు. తహసీల్దార్ శ్రీధర్ నివాసంలో ఏసీబీ సోదాలు ● భారీగా నగదు, బంగారు, పత్రాలు స్వాధీనం అనంతపురం సెంట్రల్: మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గుడిబండ మండల తహసీల్దార్ శ్రీధర్ నివాసంలోనూ బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కూడిబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే తనిఖీలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రూ. 55 లక్షల నగదు, 22 తులాలు బంగారు ఆభరణాలు, 68 తులాలు వెండి, బ్యాంకుల్లో రూ. 24 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే తహసీల్దార్ శ్రీధర్ను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేజీబీవీ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) టి.శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి బుధవారంతో గడువు ముగిసినప్పటికీ, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు 10వ తేదీ వరకు పొడిగిస్తూ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు https:// apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. సమస్యలు, సందేహాలుంటే 79933 29115, 70750 39990 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
ప్రశాంతి నిలయం: ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, ఎంఎస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, విద్య, వైద్య రంగాల్లో సాధించిన ప్రగతి, జిల్లాలో చేపట్టిన రహదారుల నిర్మాణం, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు వివరాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. కరువు ప్రాంతమైన శ్రీసత్యసాయి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు డ్రోన్ సాంకేతికతను అందిస్తామన్నారు. జిల్లాకు తగినంత నిధులు కేటాయించామన్నారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి రైతులకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రతి చెరువు నీటితో నింపుతామన్నారు. బీసీ సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ... జిల్లాలో మల్బరీ సాగు విస్తీర్ణం మరింత పెంచాలన్నారు. ఈ మేరకు సెరికల్చర్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మామిడికి ఫ్రూట్ కవర్ల కట్టే పద్ధతిపై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
వైభవంగా గొడుగుల మెరవణి
● ముగిసిన యోగి వేమన ఉత్సవాలు గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో జరుగుతున్న విశ్వకవి యోగి వేమన ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గొడుగుల మెరవణి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కటారుపల్లి, గొల్లపల్లి గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా గొడుగులను తీసుకెళ్తూ మెరవణి నిర్వహించారు. వేమన భక్తులు స్వామిగొడుగులకు టెంకాయలు సమర్పించారు. కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన కళాకారుల డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన, కథాకళి నృత్యం, కేరళ మిర్రర్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొడుగుల మెరవణి తెల్లవారుజామున వరకు కొనసాగింది. దీంతో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలు ముగిశాయి. -
వార్డుల సంఖ్య పెంపు
తాడిపత్రి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకుని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 36 నుంచి 48, గుంతకల్లులో 37 నుంచి 48, రాయదుర్గంలో 32 నుంచి 40, గుత్తిలో 25 నుంచి 32, కళ్యాణదుర్గంలో 24 నుంచి 32, కదిరిలో 36 నుంచి 44, పుట్టపర్తిలో 27 నుంచి 28, మడకశిరలో 20 నుంచి 23, హిందూపురంలో 38 నుంచి 52, పెనుకొండ నగరపంచాయతీలో 20 నుంచి 23కు వార్డుల సంఖ్య పెరిగింది. ఆటో బోల్తా – డ్రైవర్ మృతిహిందూపురం: ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బుధవారం తెల్లవారుజామున గోరంట్ల నుంచి హిందూపురం వైపుగా వస్తున్న ఆటో నందమూరి నగర్ వద్దకు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ను డ్రైవర్ గమనించకుండా వేగంగా పోవడంతో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ పక్క భాగానికి తగిలి బోల్తాపడింది. ఘటనలో పరిగి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ హిదాయతుల్లా (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సైఫుల్లా, ఆసీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమనీయం.. నారాయణుడి కల్యాణం పెద్దపప్పూరు: మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుండా నారాయణ స్వామి, లక్ష్మికాంత దంపతులు సొంతఖర్చుతో స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూలపల్లకిలో ఘనంగా ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానకార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రతి పౌర్ణమికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి..
పుట్టపర్తి అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దశల వారీ ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మరోసారి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్కు మార్చాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు సుజాత, నాగమణి, మంజుల, షర్మిల, భగవతి తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలియజేసిన అంగన్వాడీలు -
సోమందేపల్లి తహసీల్దార్పై కలెక్టర్ ఆగ్రహం
ప్రశాంతి నిలయం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమందేపల్లి తహసీల్దార్ గొల్ల మారుతీపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మారుతీని కలెక్టరేట్కు పిలిపించి విచారణ చేపట్టారు. మారుతీ పని చేసిన ప్రతి మండలంలోనూ భూసమస్యలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఆయా మండలాల్లో మహిళలతో అక్రమ సంబంధాలు వంటి ఆరోపణలు రావడంతో జేసీ మౌర్య భరద్వాజ్, కలెక్టర్ శ్యాంప్రసాద్ విడివిడిగా విచారణ చేశారు. అలాగే సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగి వేణు అనే వ్యక్తి తహసీల్దార్ మారుతీ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కాపురంలో చిచ్చుపెట్టారని వివరాలతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మారుతీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, పూర్తి వివరాలతో సంజాయిషీ కోరినట్లు తెలిసింది. చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పెనుకొండ రూరల్: సోమందేల్లి తహసీల్దార్ మారుతీపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతిప్రతం అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తహసీల్దార్పై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. వెంటనే తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, గోవిందప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యడు పెద్దన్న, నారాయణ, వెంకటరాముడు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ను విమర్శించే స్థాయి ‘కందికుంట’కు లేదు
కదిరి టౌన్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రజానేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి నీకెక్కడిదంటూ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ను వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.100 కోట్లతో పారన్నపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటిని కదిరికి అందించిన ఘనత వైఎస్ కుటుంబానిదేనన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే కందికుంట తాగుతున్న నీరు వైఎస్సార్ చలువతో సాధ్యపడిందేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లవుతున్నా కదిరి ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ విషయంగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. స్థాయి మర్చిపోయి విమర్శలు చేస్తే సహించబోమన్నారు. వైఎస్సార్ అంటే గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ,, జలయజ్ఞం, రుణమాపీ అని, వైఎస్ జగన్ అంటే గుర్తుకు వచ్చేవి నాడు నేడు, అమ్మఒడి, రైతు భరోసా ఇంకా ఎన్నెన్నో పథకాలు ఉన్నాయన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు సొంతంగా అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దిగుజారుడు మాటలు మాని సభ్యత కలిగిన అసెంబ్లీ సభ్యుడిగా ఉండాలని హితువు పలికారు. వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ -
ఓట్ల కోసం విష ప్రచారమా?
ధర్మవరం: ఓట్ల కోసం విష ప్రచారం చేయడం దారుణమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడుగా నియమితులైన బడన్నపల్లి నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. అసమానతలను దూరం చేసేందుకే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచేలా రిజర్వేషన్లను అంబేడ్కర్ తీసుకు వచ్చారన్నారు. అయితే ఓట్ల కోసం కులాల పేరుతో విభజించి వివక్ష చూపడం దారుణమన్నారు. చివరకు ఓట్ల కోసం ఆహార అలవాట్లపై కూడా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలు కల్తీతో రాజమండ్రిలో 15మంది చనిపోతే ఎందుకు జరిగిందనేది విచారణ కూడా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడా సంబారాల్లో మునిగి తేలారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 64 మంది కల్తీ నీళ్లతో ఆస్పత్రి పాలైనా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. మార్కాపురం వద్ద యాక్సిడెంట్ జరిగితే ఓ మహిళ 20 సార్లు ఫోన్ చేసినా 108 అంబులెన్స్కు కనెక్ట్ కాలేదన్నారు. ఫలితంగా 14మంది మృత్యువాత పడాల్సి వచ్చిందన్నారు. నల్లచెరువులో యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కదలక ఎస్ఐతో సహా దానిని ముందుకు తోయాల్సి వచ్చిందన్నారు. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు పాలకులు ప్రయత్నించాలి కానీ, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం, రాజకీయాలు చేయడం, విధ్వేషాలు రగల్చడం సరికాదన్నారు. మతం మీద, కులం మీద రాజకీయం చేసేవారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని ఎద్దేవా చేశారని, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా దేశం ఔన్నత్యానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాల్సిన లక్షణం లేని చంద్రబాబు ఎలా నాయకుడవుతాడని ప్రశ్నించారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ఊరు కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సామాజిక న్యాయం అనే అంశం మీద ముందుకు వెళ్లిన ఏకై క పార్టీ వైఎస్సార్సీపీ అని గుర్తు చేశారు. కుల, మత విధ్వేషాల నుంచి బయటపడి ప్రగతివైపు ముందుకు వెళ్లేలా పాలకులు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి చౌడప్ప, రూరల్ ఎస్సీ అధ్యక్షుడు రాంగోపాల్, మాజీ కౌన్సిలర్ గుజ్జల శివ, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కేశగాళ్ల రంజిత్కుమార్, సాకే విజయ్కుమార్, అజంతా కిష్ట, గరుడంపల్లి నారాయణస్వామి, రామాంజనేయులు, కేశగాళ్ల కృష్ణమూర్తి, అంజి, రాఘవ, భాస్కర్, మల్లి, నాగేంద్ర, తేజ, గంటాపురం దాము, రమేష్, బొమ్మన్న, బాబయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి -
వేడుకలకు వేళాయె..
వేడుకలకు వేళాయే..ఓడీచెరువు/పుట్టపర్తి: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీదేవి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 850 సంవత్సరాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. ‘కర్ణాటకకు చెందిన వడియార్ రాజులు వక్కల వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతంలో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో వారి ఒక్కగానొక్క పాప చౌడమ్మ కనిపించకుండా పోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పాప వాక్కులు వినపడ్డాయి. చిన్నారిని ఆవహించిన తాను చౌడేశ్వరీదేవినని, తనకు ఇక్కడే ఆలయం కట్టి నిత్య పూజలు చేస్తూ ఉండాలని ఆదేశించింది. దీంతో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు కొనసాగిస్తూ వస్తున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. కాగా, మరో కథనం ప్రకారం ఒకప్పుడు అమరావతి పట్టణాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు సంతానం కలగకపోవడంతో యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేస్తూ వచ్చాడు. ఒక రోజు చౌడేశ్వరీ అమ్మవారు కలలో కనిపించి అమరావతికి (నేటి అమడగూరు) రెండు వైపులా రెండు చెరువులు తవ్వించి, ఆలయం నిర్మిస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో రాజు అలాగే చేశాడు. దీంతో రాజు కోరికలు నెరవేరాయి.’ అప్పటి నుంచి అమడగూరు చౌడేశ్వరీ ఆలయం దినదిన ప్రవర్ధనమానం చెందుతూ వచ్చింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇలా... ఏటా ఛైత్ర మాసంలో అమడగూరులో చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివరాలను ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి మంగళవారం వెల్లడించారు. బుధవారం కుంభకూడుతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 2న ఊయల సేవ, 3న సూర్యప్రభ వాహన సేవ, 4న చంద్రప్రభ వాహన సేవ, 5న జ్యోతి ఉత్సవం, 6న అశ్వ వాహన సేవ, 7న సింహ వాహన సేవ, 8న హంస వాహన సేవ ఉంటుంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమడగూరు చౌడేశ్వరీదేవి 5న జ్యోతి ఉత్సవం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు ఉత్సవాలకే తలమానికంగా.. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా 5వ తేదీ నిర్వహించే జ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ ఉత్సవాన్ని ఏటా ఎ.కొత్తపల్లికి చెందిన పొట్టా పురుషోత్తంరెడ్డి కుటుంబసభ్యులు నిర్వహిస్తూ వస్తున్నారు. స్వయంగా ఆలయ ధర్మకర్త ట్రాక్టర్ నడుపుతూ జ్యోతిని పురవీధులగుండా ఊరేగించేవారు. ఈ సారి రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లాలోనే రెండవ అతిపెద్ద తేరు (కదిరి తర్వాత)పై జ్యోతిని ఊరేగించనున్నారు. ఉత్పవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు, కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పుట్టపర్తి టౌన్: స్థానిక చిత్రావతి నది నుంచి సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతలకు చెందిన మూడు ట్రాక్టర్లు, ఓ హిటాచీని పుట్టపర్తి అర్బన్ సీఐ తిమ్మారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కేసు నమోదు చేసి, మైనింగ్ అధికారులకు అప్పగించడంతో జరిమానా విధించారు. వ్యక్తి ఆత్మహత్య తనకల్లు: మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (50) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాదపడుతున్న ఆయనకు ఇటీవల బెంగళూరులో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా వ్యాధి పూర్తిగా నయం కాకపోవడంతో రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైధ్యులు క్యాన్సర్ గడ్డ తొలగించాల్సి ఉందన్నారు. దీంతో స్వగ్రామానికి వస్తూ మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో బీటీ క్రాస్ వద్ద రైల్వే అండర్బ్రిడ్జి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు రెవెన్యూ భవన్ ప్రారంభం పుట్టపర్తి అర్బన్: మండలంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ భవన్ను బుధవారం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు సత్యప్రసాద్, సవిత, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి హాజరు కానున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం ● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మడకశిర రూరల్: చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలు, దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళదామంటూ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రంగనాథ్తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ తదితర పథకాలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. దళితుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందన్నారు. కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు ప్రభుత్వం దళితులకు చేస్తున్నా మోసాలను వివరిస్తామన్నారు. -
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి
పరిగి: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై స్థానిక షాదీ మహల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రంగనాయకులు మాట్లాడారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు కనీసం పెట్టుబడులు కూడా రైతుల చేతికి అందలేదన్నారు. ఆదుకుంటామన్న ప్రభుత్వం రూ.2,500 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అన్నదాతలను నిట్టనిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. తక్షణమే మొక్కజొన్న పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్, మండల అధ్యక్షుడు సంజీవరాయప్ప తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎంపిక అఖిల భారత రైతు వ్యవసాయ కూలీల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శంకరప్ప, ఉపాధ్యక్షుడిగా గోపాలరెడ్డి, కార్యదర్శిగా సంజీవరాయప్ప, సహాయ కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా నంజేగౌడ, సభ్యులుగా శంకరప్ప, నరేష్, జయరామప్ప, వెంకటరమణప్ప, నరసింహప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పలు ప్రాంతాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండల వ్యాప్తంగా మంగళవారం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నఫలంగా ఆకాశం మేఘావృతమైంది. వెంటనే సుమారు అర గంట పాటు వర్షం కురిసింది. మండలంలోని మామిళ్లకుంట, ప్రశాంతి గ్రామం, కప్పలబండ, పెడపల్లి ,బత్తలపల్లి గ్రామాల్లో వాన పడింది. దీంతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. అయితే అకాల వర్షానికి మామిడి, మొక్కజొన్న, వేరుశనగ రైతుల్లో ఆందోళన మొదలైంది. సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్ మడకశిర: మండలంలోని సీ కొడిగేపల్లి గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ రామాంజనేయులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల ఆ గ్రామంలో ఓ బడా వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సామగ్రిని ఇచ్చారని తేలింది. దీంతో రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు విద్యుత్శాఖ డీఈ రఘు తెలిపారు. అలాగే విద్యుత్శాఖ ఏఈపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. రాత్రివేళ గస్తీ పెంచండిరొద్దం: అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలని ఎస్పీ సతీష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాత్రి వేళ గస్తీ పెంచి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, సీసీ చిరంజీవి, ఎస్ఐ వీరాంజినేయులు తదిరుతలున్నారు. -
లాలేపల్లిలో విషజ్వరాలు
లాలేపల్లిలో మురుగు కాలువప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గ్రామస్తుడుచిలమత్తూరు: మండల పరిధిలోని లాలేపల్లిలో విషజ్వరాలు ప్రబలాయి. జ్వరం, దగ్గు, నొప్పులు వంటి లక్షణాలతో గ్రామస్తులు మంచం పట్టారు. ఆస్పత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా జ్వరాలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయింది. దోమల వ్యాప్తి ఎక్కువకావడంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో సుమారు 30 నుంచి 40 మందికిపైగా జ్వరాల బారిన పడ్డారని చెబుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుంటున్నారు. కనిపించని వైద్య సిబ్బంది అపరిశుభ్రత , కలుషిత నీరు ప్రభావంతో లాలేపల్లిలో జ్వరాలు ప్రబలినా పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నా కనీసం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పడకేసిన పారిశుధ్యం.. పెరిగిన దోమలు ఇంటింటా జ్వర పీడితులు పట్టించుకోని అధికారులు -
అనుమానం పెనుభూతమై..
గుత్తి రూరల్: అనుమానం పెనుభూతం కాగా, భర్త చేతిలో ఓ భార్య హతమైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన శివలింగయ్యకు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కట్టేకల్లు గ్రామానికి చెందిన కొటేలీ లక్ష్మి(45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండు నెలలుగా శివలింగయ్య పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాలు పెంచుకుని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో గుంతకల్లు మండలం గొల్లలదొడ్డిలో ఉంటున్న పెద్ద కుమార్తె శ్రీవిద్య తన తల్లిని పిలుచుకెళ్లి రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ నెల 29న శివలింగయ్య గొల్లలదొడ్డికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గుంతకల్లు మండలం కదిరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. జాతరకు వెళదామంటూ... శివలింగయ్య, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె స్పందనకు కర్ణాటకలోని బళ్లారికి చెందిన యువకుడితో ఈ నెల 11, 12న వివాహం జరిగేలా నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి ముందు వరుడి ఇంట ఆచారం మేరకు మంగళవారం బళ్లారిలోని దుర్గమ్మ ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. వియ్యంకుల ఆహ్వానం మేరకు శివలింగయ్య కదిరిపల్లికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గొల్లలదొడ్డిలో ఉన్న పెద్ద అల్లుడు మురళీకృష్ణ, మరో బంధువుతో కలిసి బళ్లారికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మురళీకృష్ణను తప్పించి పూలకుంట గ్రామ శివారున మూతపడిన కంకర క్రషర్ యూనిట్ వద్దకు భార్యను పిలుచుకెళ్లి పై నుంచి కిందకు తోసేశాడు. ఈలోపు గుంతకల్లుకు చేరుకున్న మురళీ కృష్ణ తన మామకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి కాల్ చేశాడు. ఆ సమయంలో లక్ష్మి ఫోన్ ఎత్తి మాట్లాడుతూ... తనను ప్రాంతానికి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పబోతుండగా ఫోన్ను శివలింగయ్య లాక్కొని కట్ చేశాడు. అనంతరం బండరాళ్లను ఆమె తలపై వేసి హతమార్చాడు. పొంతన లేని సమాధానాలు ఫోన్ కట్ కావడంతో అనుమానం వచ్చిన మురళీకృష్ణ, బంధువులు వెంటనే చెర్లోపల్లి, పూలకుంట, తదితర ప్రాంతాల్లో గాలిస్తూ కదిరప్పస్వామి కొండ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారికి తారసపడిన శివలింగయ్యను ఆపి లక్ష్మి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో దేహశుద్ధి చేశారు. దీంతో పెద్ద అల్లుడుకి విషయం తెలిపి లక్ష్మిని హతమార్చిన చోటుకు పిలుచుకెళ్లాడు. సమాచారం అందుకున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. భార్యను హతమార్చిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు -
హాకీ రాష్ట్ర జట్టులో చోటు
ధర్మవరం అర్బన్: ఈ నెల 11వ తేదీ వరకు జార్ఖండ్లోని రాంచీ వేదికగా జరిగే 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ చాంపియన్షిప్ టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన వైష్ణవి, నవ్య, శ్రీలేఖ, భవ్యకు చోటు దక్కింది. ఈ సందర్భంగా వారిని జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతీప్రసాద్, ఇర్షాద్, అమీనుద్దీన్, కిరణ్, కోచ్ హస్సేన్ అభినందించారు. ఉత్సాహంగా ఉట్ల పరుష గాండ్లపెంట: విశ్వకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉట్ల పరుష ఉత్సాహంగా సాగింది. ఆలయం ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి పై భాగాన కట్టిన ఉట్టిని అందుకునేందుకు పలువురు యువకులు పోటీ పడ్డారు. చివరకు మద్దివారిగొందికి చెందిన సాయికుమార్ బృందం విజయం సాధించింది. విజేతలను నిర్వాహకులు అభినందించారు. రాత్రి 9గంటలకు ఆగ్నిసేవ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా బుధవారం గొడుగుల మెరవణి, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కేరళ ఛండ వాయిద్యం, కథాకళి నృత్య ప్రదర్శన, తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. -
పన్ను కట్టకపోతే చెత్త డంప్ చేస్తాం!
● మున్సిపల్ అధికారుల హెచ్చరిక ● చివరి రోజు రూ.80 లక్షల వసూలు హిందూపురం: ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఇన్ని రోజులుగా హిందూపురం మున్సిపల్ అధికారులు ప్రాధేయపడుతున్నా కొందరు స్పందించలేదు. పన్ను చెల్లింపులపై 50 శాతం వడ్డీ మాఫీని ప్రకటించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. పన్నులు చెల్లించకపోతే మున్సిపల్ సేవలు నిలిపి వేస్తామంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి విజయభారతి జారీ చేసిన నోటీసులు కూడా బేఖాతరయ్యాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బుధవారం ఆర్ఐలతో కలసి ఆర్ఓ విజయభారతి రంగంలో దిగారు. చివరి అస్త్రంగా ట్రాక్టర్ల నిండా చెత్త తీసుకెళ్లి పన్ను బకాయిదారుల గృహాలు, వాణిజ్య సముదాయల ఎదుట నిలిపి పన్ను చెల్లించకపోతే చెత్త డంప్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మంత్రం ఫలించింది. బకాయిదారులు ఆగమేఘాలపై స్పందించి పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ అధికారులు పన్నులు కట్టించుకున్నారు. చివరి రోజు ఏకంగా రూ.80 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. -
రెండేళ్లుగా నిరీక్షిస్తున్నా ..
నా భర్త మరణించి రెండేళ్లు కావస్తోంది. అయితే వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు నేటికీ అవకాశం లభించలేదు. అధికారులను అడిగితే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, పాలకులు స్పందించాలి. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. – జయలక్ష్మమ్మ, రామగిరి గ్రామం, మడకశిర మండలం మాట నిలబెట్టుకోవాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ మంజూరు చేయాలి. ప్రస్తుతం నా వయసు 55 సంవత్సరాలు. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తి. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ వస్తుందని ఆశించా. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. – సూర్యశేఖర్, చిన్నపల్లోళ్లపల్లి, నల్లచెరువు మండలం -
ఏసీబీ వలలో గుడిబండ తహసీల్దార్
● మ్యుటేషన్ కోసం రూ.లక్ష డిమాండ్ ● రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు గుడిబండ: మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి వివరాల మేరకు... గుడిబండ పరిధిలోని ఎస్.రాయాపురంకు చెందిన రైతు షేక్సద్దాం కొన్నేళ్లుగా పెనుకొండ మండలంలో ఉంటున్నారు. ఎస్.రాయాపురంలో తన పూర్వికుల ఆస్తి నాలుగు ఎకరాలు భూమి ఉండగా... ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఆస్తి వివాదం పెనుకొండ ఆర్డీఓ కోర్టుకు చేరింది. కేసు విచారించిన ఆర్డీఓ కోర్టు ఎస్.రాయాపురంలోని నాలుగు ఎకరాల భూమిని షేక్సద్దాంకు మ్యుటేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షేక్సద్దాం కుమారుడు సద్దాంహుస్సేన్ ఆర్డీఓ కోర్టు ఆదేశాల ప్రకారం తమకు చెందాల్సిన నాలుగు ఎకరాల భూమికి పట్టాదారు పాసుబుక్ చేసి ఇవ్వాలని తహసీల్దార్ శ్రీధర్ను కోరారు. అయితే నెలలుగా తిరుగుతున్నా తహసీల్దార్ పట్టించుకోలేదు. మధ్యవర్తుల ద్వారా సంప్రదించగా తహసీల్దారు శ్రీధర్ రూ.లక్ష డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టలేని సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు తొలుత రూ.20 వేలు ఇస్తానని తహసీల్దార్కు తెలిపి మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బుతో కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు రూ.20 వేలు ఇస్తుండగా... అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ శ్రీధర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. తహసీల్దార్ను కర్నూలు ఏసీబీ కోర్టు ఎదురు హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ఖాన్ తెలిపారు. -
వైభవంగా బండ్ల మెరవణి
గాండ్లపెంట: వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రెండవ రోజు సోమవారం బండ్ల మెరవణి కార్యక్రమం వైభవంగా సాగింది. ఎద్దుల బండ్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ సోమవారం వేమన సమాధిని సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కరరెడ్డి, మండల వైస్ కన్వీనర్ వైవీ శంకర్నాయుడు, మలమీదపల్లి పంచాయతీ రాజ్ కార్యదర్శి చలపతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉల్ల తిరునాల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టీఈ ఉచిత సీట్ల ఫలితాల విడుదలపుట్టపర్తి: బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం కింద 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో 874 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరందరూ దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో ఏప్రిల్ 7వ తేదీ లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సత్యసాయి వైద్య సంస్థకు వైద్య పరికరాల వితరణకడప సెవెన్రోడ్స్: పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్కు రూ.కోటి విలువైన 6 సెర్వో–సీ వెంటిలేటర్లు, 3 ఎఫ్ఎక్స్–8 సర్జికల్ యూనిట్లను ఎల్ఐసీ తరుఫున అందజేసినట్లు ఆ సంస్థ కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్వీ రవికుమార్ తెలిపారు. ఎల్ఐసీ శ్రీసత్యసాయి సంస్థల ముఖ్యుల సమక్షంలో సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్రాజ్కు ఈ పరికరాలను ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందజేశారన్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ధర్మవరం రూరల్: సెలవు రోజు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, ఆదెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. చిన్నవాడైన కుమారుడు వెంకీ స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుఆన్నడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులతో కలసి సరదాగా ఈత కోసమని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకెళ్లాడు. గట్టు అంచు పట్టుకుని ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సైతం అక్కడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రంతా బావిలోని నీటిని బయటకు తోడేశారు. సోమవారం ఉదయం నీటి అడుగున చెట్ల మొద్దుకు తగులుకుని ఉన్న వెంకీ మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదన పలువురిని కంట తడి పెట్టించింది. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్యపావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని బొమ్మతనహళ్లి మార్గంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ వద్ద వేప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94808 02941 కు సమాచారం అందించాలని పావగడ పీఎస్ సీఐ సురేష్ కోరారు. ఏపీఓపై దాడికి యత్నం పరిగి: విధుల నిర్వహణలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించిన ఏపీఓ అప్పస్వామినాయుడిపై హోన్నంపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ దాడికి ప్రయత్నించాడు. సోమవారం పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఉపాధి అధికారులు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీంతో మద్యం మత్తులో కార్యాలయానికి చేరుకున్న సతీష్ దూర్భాషలాడుతూ ఏపీఓపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అడుడకున్నారు. ఘటనపై ఏపీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


