Sri Sathya Sai
-
బడి గంటలు మోగే వేళ
పుట్టపర్తి/హిందూపురం టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద 2,025 పాఠశాలలు ఉండగా అందులో 1,25,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 1,70,000 పాఠ్య పుస్తకాలు అవసరం ఉంది. గత ప్రభుత్వంలో పేద విద్యార్థులపై భారం కాకుండా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, వర్కు పుస్తకాలు ఉచితంగా అందించారు. పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. అయితే, చంద్రబాబు సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు సరఫరా చేయలేదు. విద్యార్థులకు షూ, యూనిఫాం అందించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడం గమనార్హం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చేరేవారేరీ..? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలతో పాటు షూ, యూనిఫాం, ‘అమ్మ ఒడి’ అందించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చేరేవారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువై ప్రభుత్వ బడులలో చేరేవారు కనిపించడం లేదు. అమడగూరు మండలంలోని ఏటిగడ్డ తండా, కొలిమిరాళ్లపల్లి, లోకోజుపల్లి గ్రామాల్లోని 3 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లలో జిల్లాలో 50కి పైగా పాఠశాలలు మూతపడడం గమనార్హం. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు, స్కూల్ కిట్లు అందించని చంద్రబాబు సర్కార్ ప్రైవేటులో ఫీజుల మోతతో భయాందోళన చెందుతున్న తల్లిదండ్రులు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారు. పాఠశాలలో ఫీజుల వసూలు దందాలా మారిపోయింది. ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చాలా వాటిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. పాఠశాలల ఆవరణలోనే పుస్తకాలు, విద్యా సామగ్రిని విక్రయిస్తున్నారు. విద్యాశాఖాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. – బాబావలి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు -
లేపాక్షిలో ట్రైనీ కలెక్టర్లు
లేపాక్షి: లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని గురువారం అసిస్టెంట్ కలెక్టర్లు సీహెచ్ శ్రవణ్కుమార్రెడ్డి, హరిఓం పాండ్య, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత అగర్వాల్, ఏఆర్.పవన్తేజ్, ప్రియా, సుయాష్కుమార్, బి.వెంకటేష్ దర్శించుకున్నారు. ఆలయంలో దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఆలయకమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాల్రావు అసిస్టెంట్ కలెక్టర్లను సత్కరించారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తదితరులు ఉన్నారు. విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు ప్రశాంతినిలయం: జిల్లాలోని యువతీ యువకులకు విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. హిందూపురం సమీపంలోని రక్షా అకాడమీ ఆధ్వర్యంలో ప్రధాన విమానాశ్రయాలు, పవర్ ప్రాజెక్టులు, టోల్ ప్లాజాల వద్ద సెక్యూరిటీ ఉద్యోగాలకు నెల రోజుల పాటు ప్రొఫెషనల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తారన్నారు. పది ఆపైన చదివి, 18 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు, 18 నుంచి 35 ఏళ్ల లోపు పురుషులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6281557937, 6300676517 నంబర్లలో సంప్రదించాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ మూకల దాడి కదిరి టౌన్/గాండ్లపెంట: వైఎస్సార్సీపీ నాయ కుడిపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గాండ్లపెంట మండల కేంద్రంలో ఎస్ఆర్ ఫంక్షన్ హాలు సమీపంలోని సర్వే నంబరు 901లో 1.80 ఎకరాల భూమి తమ పెద్దల పేరుతో ఉందని గాండ్లపెంటకు చెందిన వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్ ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఈ విషయంపై మాట్లాడాలంటూ గురువారం టీడీపీ నాయకుడు రహంతుల్లా నరసింహ గౌడ్ను భూమి వద్దకు పిలిపించాడు. తన వర్గీయులతో కలిసి అతనిపై దాడి చేశాడు. గాయపడిన అతడిని స్థానికులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ పరామర్శించారు. టీడీపీ మూకల దాడిని ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్రెడ్డి, పంచాయతీ వింగ్ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో నిందితుడి అరెస్టు చిలమత్తూరు: మండల పరిధిలోని భూమయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణప్పను కొడవలితో నరికి చంపిన శివప్పను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ జనార్దన్, ఎస్ఐ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. భూమయ్యగారిపల్లిలోని సర్వే నంబరు 66 భూమి విషయంలో శివప్ప, రామచంద్రప్ప మధ్య చాలారోజులుగా వివాదం నెలకొంది. దీంతో రామచంద్రప్పపై శివప్ప కక్ష పెంచుకున్నాడు. ఆ భూమిలో సోమవారం రీసర్వే చేస్తుండగా కొడవలితో అక్కడికి వెళ్లాడు. రామకృష్ణప్పను నరికి పరారయ్యాడు. తీవ్రగాయాలైన రామకృష్ణప్ప మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శివప్ప కోసం గాలింపు చేపట్టారు. గురువారం దోర్నాలపల్లి క్రాస్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. -
బిల్లు.. ఘొల్లు
పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మోడల్స్కూళ్లలో ఉన్న ఇంటర్ కళాశాలల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మాత్రం చెల్లించకపోవడం గమనార్హం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 25 మోడల్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 4 వేల మంది ఉన్నారు. నాలుగు గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 20 మంది చొప్పున మొదటి సంవత్సరంలో 80 మంది,రెండో సంవత్సరంలో 80 మంది కలిపి 160 మంది విద్యార్థుల చొప్పున చదువుతున్నారు. వీరిలో 50 మంది చొప్పున బాలికలకు అక్కడే హాస్టల్ వసతి కల్పించారు. తక్కిన 110 మంది ఉదయం ఇంటి వద్ద టిఫిన్ చేసి వెళ్తే మధ్యాహ్నం కళాశాలలోనే భోజనం అందిస్తారు. మొత్తంగా బాలికలు 1,250 మందికి అక్కడే హాస్టల్లో భోజనాలు అందిస్తుండగా, 2,750 మందికి మధ్యాహ్న భోజనాలు ఏజెన్సీ నిర్వాహకులు అందిస్తారు. ఆయా విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులు ఏడాది నుంచి చంద్రబాబు ప్రభుత్వం అందించక పోవడంతో ఏజెన్సీ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో ఏజెన్సీకి రూ.10 వేలకు పైగా చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా ఏజెన్సీలకు రూ.2.5 లక్షల వరకూ చెల్లించాల్సి ఉందన్నారు. ఇంత కాలం పాఠశాలల విద్యార్థులకు వచ్చే బిల్లులతో సర్దుకుపోయామని, ఇకపై చేయలేమంటూ ప్రిన్సిపాళ్ల వద్ద పలువురు ఏజెన్సీనిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై డీఈఓ కిష్టప్పను వివరణ కోరగా పెండింగ్ బిల్లుల విషయం ప్రభుత్వానికి విన్నవించామన్నారు. నిధులు రాగానే చెల్లిస్తామన్నారు. ఏడాది నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న ఏజెన్సీలు ఉమ్మడి జిల్లాలో రూ.2.5 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలే
పుట్టపర్తి టౌన్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవని ఏపీ ఏజేసీ అమరావతి నాయకులు హెచ్చరించారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ మైనుద్దీన్, జనరల్ సెక్రటరీ వైపీ రావ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. తమ సమస్యలు ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ను ప్రకటించాలని, డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవులను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకూ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పే స్లిప్లలో చూపాలని, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులందరికీ 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, సరెండర్ లీవ్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, రమణప్ప, ఆదెన్న, ముత్యాలుతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణను అరికట్టేందుకు హెల్ప్లైన్ నంబర్
పుట్టపర్తి అర్బన్: లింగ నిర్ధారణను అరికట్టేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 18002332447ను ప్రవేశ పెట్టినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనపై సమాచారం అందించాలన్నారు. ఆడ శిశువు హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. హెల్ప్లైన్ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. అనుమతి లేని స్కానింగ్, డయాగ్నస్టిక్ కేంద్రాలు, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన కార్యకలాపాలు ఉన్నా హెల్ప్లైన్ నంబర్కు సమాచారం అందించాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అక్రమంగా లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టాలీ, కంప్యూటర్ కోర్సులపై శిక్షణ ధర్మవరం: నిరుద్యోగ యువతకు టాలీ, కంప్యూటర్ కోర్సుల్లో నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్ల కోఆర్డినేటర్ హరిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 రోజుల పాటు బెంగళూరులో శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టాలీ ప్రైమ్, కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల్లోపు వయసు ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అడ్మిషన్ల కోసం 9000487423 నంబర్లో సంప్రదించాలన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రీసర్వే భూముల పరిశీలన
ముదిగుబ్బ: మండల పరిధిలోని మంగళమడక గ్రామంలోని సర్వే నంబర్ 44 భూములను గురువారం కలెక్టర్ శ్యాంప్రసాద్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భూమి సరిహద్దులను, ప్రస్తుత స్థితిగతులను అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి తప్పులకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. రికార్డుల ప్రకారం భూమి వివరాలను సరిచూసి నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ముదిగుబ్బ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్రెడ్డి, ఎంపీడీఓ హజివలి, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై సమరశంఖం
సాక్షి, పుట్టపర్తి: ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్గా పేరుగాంచిన చంద్రబాబు తన పంథా మార్చుకోలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సంపూర్ణంగా అమలు చేసింది లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘పోరు బాట, ఫీజు పోరు, ఉచిత గ్యాస్ ఎప్పుడిస్తారు’ అంటూ పలుమార్లు ఉద్యమాలు చేయడంతో కొన్ని పథకాలు అరకొరగా అమలు చేశారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం అంటూ కొందరికే ఇచ్చారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అంటూ తొలిసారి కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు కొందరికే జమ చేశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి దగా చేశారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ను ఊసే లేకుండా చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకుండా ప్రైవేటు ఆస్పత్రులను ఇబ్బందులపాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుతో లక్షలాది మంది పింఛన్లు తొలగించారు. కొత్త పింఛన్ల ప్రస్తావనే లేదు. రెండేళ్లుగా ఎంతోమంది అర్హులు ఉన్నా పింఛన్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారు. వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని వారిని అడ్రస్ లేకుండా చేశారు. రెండేళ్లుగా రాక్షస పాలన.. ఎన్నికల హామీలు, పథకాలు పక్కన పెడితే రెండేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోంది. అరాచకాలు, అక్రమాలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, అరెస్టులు, హత్యలకు కేరాఫ్ అడ్రస్గా జిల్లా నిలిచింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గ్యాంగ్ రేప్లు, సామూహిక అత్యాచారాలు వెలుగు చూశాయి. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల సమయంలో లింగమయ్య హత్య కలకలం రేపింది. పేరూరు పంచాయతీలోని ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం భయభ్రాంతులకు గురి చేసింది. అంతకుముందు చిలమత్తూరులో గ్యాంగ్ రేప్తో మొత్తం జిల్లానే ఉలిక్కిపడింది. ఐదేళ్లూ సంక్షేమం, అభివృద్ధి .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు తీసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హత ఆధారంగా పథకాలు అందజేశారు. పేదలకు అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ పోరుబాట.. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికీ ఉద్యోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, విద్యార్థులందరికీ తల్లికి వందనం, ఏడాదికి మూడు సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 అందిస్తాం.’ – ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలివి ‘సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటే భయం వేస్తోంది. వాటి నిర్వహణ కష్టమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున కొత్త పింఛన్లు కష్టమే. తల్లికి వందనం అర్హులందరికీ ఇస్తున్నాం. కేంద్రం మద్దతు ఇస్తే రైతులందరికీ అన్నదాత సుఖీభవ జమ చేస్తాం. ప్రతి ఏటా ఉద్యోగాలు కల్పిస్తాం.’ – అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన మాటలివీ.. ప్రజలను దారుణంగా మోసగించిన చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒక్కటీ సరిగా అమలు చేయని వైనం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ పథకాలు బాబు దగాను నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ‘వెన్నుపోటు దినోత్సవం’ అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు సాధ్యం కాని హామీలు గుప్పించి అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్ర బాబు వెంటనే పదవి నుంచి దిగిపోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెన్నుపోటు దినోత్సవం’ నిర్వహణకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం ర్యాలీలు నిర్వహించనున్నారు. పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగుతుంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల కేంద్రంలో మరువ ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. కదిరి నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానం నుంచి సమన్వయకర్త బీఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో నానా దర్గా వరకు ర్యాలీ చేపడతారు. ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కేతిరెడ్డి వెంకటక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పీఆర్టీ సర్కిల్ వరకు ర్యాలీ ఉంటుంది. మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుంది. రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ నరిగెమ్మ గుడి దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. -
ఎస్ఐఆర్ను విజయవంతం చేయండి
ప్రశాంతినిలయం: కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 14,23,839 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 7,06,751, మహిళా ఓటర్లు 7,16,877, థర్డ్ జండర్ 65 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 67.44 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఈ నెల 14 వరకూ సన్నాహాలు, శిక్షణ, ముద్రణ ఉంటాయన్నారు. 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్ఓల ఇంటింటి సందర్శన, జూలై 14న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 20 వరకూ అభ్యంతరాల స్వీకరణ, జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకూ అభ్యంతరాల పరిష్కారం, ఆగస్టు 22న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. వేరే ప్రాంతాలకు మారిన, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ల్యాప్టాప్ల అందజేత డిజిటల్ విధానంతో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల సేవలు మరింత బలోపేతం అవుతాయని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. వెలుగులో పని చేసే డీపీఎం, ఏపీఎంలకు గురువారం కలెక్టరేట్లో ల్యాప్టాప్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవలను మరింత వేగవంతం చేయడానికి ల్యాప్టాప్లు కీలక సాధనాలుగా ఉపయోగపడతాయన్నారు. పనిలో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీపీఎంలు సత్యనారాయణ, రామిరెడ్డి, రామమోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి!
పరిమితికి మించిన ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కొందరు అలానే వెళ్తున్నారు. అనంతపురంలో ఓ ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఇంటిల్లిపాదీ ఒకే బైక్పై వెళ్లడం చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వ్యవసాయం మానేయడం మంచిది
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన రెండేళ్ల తర్వాత రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రకటించింది. సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, నూర్పిడి యంత్రాలు తదితర పనిముట్లు ఇస్తామని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 2న నోటిఫికేషన్ ఇవ్వగానే జిల్లాకు సంబంధించిన 2,600 మంది రైతులు సబ్సిడీ ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మే 26న లాటరీ ప్రక్రియను పూర్తి చేసి యంత్రాలను అందిస్తామని నమ్మబలికారు. అయితే పథకం ఆలస్యం కావడంతో రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించారు. మరోసారి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో 8 రోజులు గడువు పొడిగించారని సర్ది చెప్పారు. జూన్ 4 నాటికి యంత్రాలు అందజేస్తామన్న సమయమూ పూర్తయింది. రైతులు అధికారులను ప్రశ్నిస్తుండటంతో వారికి కూడా ఏ చేయాలో పాలుపోవడం లేదు. ‘ప్రభుత్వం పథకంలో మార్పులు చేసిందని .. సబ్సిడీ మొత్తం ఇవ్వలేదు’ ఇలా పలు రకాల సమాధానాలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2026–27 సంవత్సరానికి జిల్లాకు సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు, సెల్ఫ్ ప్రోఫెల్లెడ్ ఎక్విప్మెంట్, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, హెర్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు, రోటోవేటర్లు, విత్తనగొర్రు, ఎండు గడ్డి, మేత సామగ్రిలకు రూ.4.01 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు చిన్న, సన్న కారు రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీ ఇస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత రైతులకు భూమి ఉండాలని , కనీసం మూడుసార్లు ఈ–పంటలో నమోదు చేయించి ఉండాలని, గతంలో సబ్సిడీ పొంది ఉండకూడదని, భూమి రికార్డులు సమర్పించాలని, ఆన్లైన్ దరఖాస్తులను జేసీ స్వయంగా లాటరీ తీసి ఎంపిక చేస్తారని తెలిపారు. అనంతరం అర్హులైన జాబితాపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతకం చేసిన తర్వాత 15 రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు రెండు నోటిఫికేషన్లు ఇచ్చినా దరఖాస్తు ప్రక్రియ మాత్రమే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు తప్ప సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇప్పటికే సబ్సిడీపై యంత్రాలు అందజేసి ఉంటే బాగుండేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోలు ధరలు పెరగడంతో ట్రాక్టర్ల వ్యవసాయం సైతం భారంగా మారింది. కాడి ఎద్దులు ఎక్కడా కనిపించకుండా పోయాయని ప్రభుత్వం వెంటనే సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ చెప్పిన తేదీకి వైఎస్సార్ యంత్రసేవను ప్రారంభించారు. ట్రాక్టర్ల సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి అండగా నిలిచారు. ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక రైతు కమిటీని ఏర్పాటు చేసి ట్రాక్టర్లు అందజేశారు. వాటితో పాలు పలు రకాల యంత్రాలు కూడా అందజేశారు. ట్రాక్టరు ,యంత్రాల పొందిన రైతులు ఇప్పటికీ వైఎస్ జగన్ చేసిన మేలును మరచిపోలేదు. పత్తా లేని వ్యవసాయ యాంత్రీకరణ పథకం గడువు దాటినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం వేలాది మంది రైతుల ఎదురుచూపుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం, పంటలకు మద్దతు ధర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటిలో కర్షకులకు అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్సిడీతో ట్రాక్టర్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పింది. గడువు ముగిసినా నేటికీ ఆ పథకాన్ని అమలు చేయకుండా అటకెక్కించింది.ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాల పథకానికి ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాము. గడువు పూర్తయింది. కొన్నింటికి దరఖాస్తులు రాలేదు. రాని వాటి సబ్సిడీని వచ్చిన యంత్రాల దరఖాస్తులకు అందజేయాలని కోరాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ఇంకా అమలు కాలేదు. జిల్లాకు రూ.4.01 కోట్లు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సబ్సిడీ ట్రాక్టర్లు అందజేస్తాము. – నారాయణనాయక్, డీఏఓ చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు రైతులకు అందించేసరికి ఖరీఫ్ సీజన్ పూర్తయ్యేలా ఉంది. వాటి కోసం ఎదురు చూడటం కంటే వ్యవసాయం మానేయడం మంచిది. ఈ ఏడాది వర్షాలు ఎల్నినో ప్రభావంతో సరిగా కురవవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు ఉంటే మూడేళ్లు వ్యవసాయం జోలికి వెళ్లకపోవడమే మంచిది. రైతుకు ఒక్క సంక్షేమ పథకాన్నీ అందజేయడంలేదు. – నాగిరెడ్డి, రైతు, బుక్కపట్నం -
నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపు
ప్రశాంతి నిలయం: గోరంట్ల మండలానికి చెందిన ఓ రైతుకు చెందిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. గోరంట్ల మండలం బూదిలికి చెందిన కురుబ మల్లేశప్పకు సర్వే నంబర్ 476లో 3.30 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని చాలా కాలంగా నిషేధిత జాబితా 22ఏ (1) (ఇ) ఉంచారన్నారు. దాన్ని మంగళవారం నిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు. ఈ సందర్భంగా మల్లేశప్ప కలెక్టర్కు కృతజ్ఙతలు చెప్పారు. కలెక్టర్ స్వయంగా రైతును శాలువతో సన్మానించారు. మొహర్రం పండుగకు చెట్లు నరకవద్దు ప్రశాంతి నిలయం: మొహర్రం పండుగను పురస్కరించుకొని అగ్ని గుండలోకి వేయాలంటూ ఎవరూ చెట్లను నరకవద్దని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. మొక్కలు, చెట్లను కాపాడుకోవడం మన బాధ్యతన్నారు. చెట్ల వల్ల మనం పీల్చే ప్రాణవాయువు అందుతోందన్నారు. గ్రామ పొలిమేరల్లో ఉన్న సర్కార్ జాలి, కంపచెట్లు, మొద్దులను తీసి అగ్ని గుండంలో వేయాలన్నారు. సంబంధితశాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెట్లు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయండి పుట్టపర్తి అర్బన్: నల్లమాడ మండలంలో దొన్నికోటలో రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం దొన్నికోట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను సకాలంలో అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు .రీ సర్వేలో ఎలాంటి తప్పుల్లేకుండా గడువులోపు పూర్తి చేయాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. -
వడ్డీ వ్యావారి దాష్టీకం
● కంతు కట్టలేదని వ్యక్తి కిడ్నాప్... దాడి ధర్మవరం అర్బన్: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరంలో వడ్డీవ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. వడ్డీ డబ్బు కట్టలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారి...ఆపై దారుణంగా దాడి చేశాడు. బాధితుడి వివరాల మేరకు... పట్టణంలోని కేశవనగర్కు చెందిన పంచర్ షాపు నిర్వాహకుడు బుర్రా హరికృష్ణ స్థానిక దిమ్మిల సెంటర్ సమీపంలోని వడ్డీ వ్యాపారి మహేష్తో ఏడాది క్రితం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. వారానికి రూ.5 వడ్డీతో అతనికి నెలకు నాలుగుసార్లు వడ్డీ కట్టేవాడు. అయితే ఆరోగ్యం బాగలేక రెండునెలలుగా వడ్డీ కట్టడం లేదు. దీంతో మంగళవారం పంచర్ షాపు వద్దకు వచ్చిన మహేష్, అతని అనుచరులు ఆరుగురు హరికృష్ణను డబ్బులు అడిగారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో హరికృష్ణను బలవంతంగా టూవీలర్లో ఎక్కించుకుని దిమ్మిల సెంటర్ సమీపంలోని మసీదు పక్కకు పిలుచుకుని వెళ్లి చితకబాదాడు. హరికృష్ణ భార్య గీత వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దిమ్మిల సెంటర్ సమీపంలోకి వెళ్లగానే మహేష్తో పాటు అతని అనుచరులు పారిపోయారు. అప్పటికే వారు హరికృష్ణను చితకబాదడంతో అతనికి ఫిట్స్ వచ్చాయి. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు చికిత్స చేయించేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.8 లక్షల వరకూ అప్పు చేశానన్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రతరం కాగా, మే 29న ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎవరైనా తన ఇంటి వద్దకు వస్తే వారిని బైండోవర్ చేస్తామని పోలీసు అధికారులు చెప్పారన్నారు. అయినా డబ్బులు ఇవ్వాలంటూ రోజూ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని హరికృష్ణ వెల్లడించాడు. పని చేయకుంటే కఠిన చర్యలు అనంతపురం న్యూటౌన్: బాధ్యతలను గుర్తెరిగి సక్రమంగా విధులను నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి (సీఈఓ) విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం స్థానిక డీపీఆర్సీలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ‘గ్రామ పంచాయతీల అభివద్ధి ప్రణాళిక రూపకల్పన’ అనే అంశంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ కొందరు ఎంపీడీఓలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులకు డుమ్మా కొట్టడం సరికాదన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదంటూ ఫిర్యాదులందాయన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓపై నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామాల అభివృద్ధి ప్రణాళికల తయారీలో మెలకువలను వివరించారు. -
అన్ని వర్గాలనూ నట్టేట ముంచారు
చిలమత్తూరు: రెండేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాలనూ నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ‘‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు ఏడాదిగా నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరినీ సమానంగా చూసే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయన్నారు. రైతులకు భూములు లేకుండా లాక్కొంటున్నారని, వారు నిర్ణయించిందే ధరగా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్నింటికీ ధరలు పెరుగుతున్నా రైతు పండించే పంటకు మాత్రం ధరలు లేవన్నారు. రెండేళ్లుగా సొంత జేబులు నింపుకుంటున్నారే గానీ రైతుల కడుపు నింపడంలో విఫలం చెందారన్నారు. సంపద సృష్టి టీడీపీ నేతలకే... సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు సృష్టించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి మరీ టీడీపీ నేతల ఖాతాలకే మళ్లిస్తున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. సృష్టించిన సంపదతో ఏమి అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం తిరోగమిస్తోందన్నారు. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిన చంద్రబాబు సర్కారు అభివృద్ధిలోనూ వెనుకబడిందన్నారు. విద్య, వైద్యం అటకెక్కించారని దుయ్యబట్టారు. పదో తరగతి ఫలితాల్లో తేలిపోయారని, విద్యార్థులకు అందించిన బ్యాగులు పత్తాలేకుండా పోయాయని ఇప్పటికీ జగనన్న ఇచ్చిన నాణ్యమైన బ్యాగులు విద్యార్థులు వాడుతున్నారన్నారు. వైద్యం పేదలకు అందడం లేదన్నది వాస్తవమన్నారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ లేక బయటకు పంపిస్తున్నారని, గొప్పలు చెప్పే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల ఇబ్బందులు కనిపించవా అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తినే తిండి ఎవరు పండిస్తున్నారో తెలియదా అని ప్రశ్నించారు. ఉన్న భూములను లాగేసుకొంటే ఆహారం కొరత ఏర్పడదా అని నిలదీశారు. రెండేళ్లలో అరాచక శక్తుల్ని, అవినీతిని సాధించారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసి తమ జేబులు నింపుకుందామని చూసిన బాబుకు వైఎస్ జగన్ చెక్ పెట్టారన్నారు. సంపద సృష్టి అని సొంత జేబులు నింపుకుంటున్నారు అధ్వానంగా పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు వైఎస్సార్ సీపీ ‘పురం’ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ధ్వజం ఇది అరాచక ప్రభుత్వం -
యా అల్లా.. ఎంత పనిచేశావయ్యా
గుత్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ‘నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ తడారిన గుండెతో ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘యా అల్లా.. ఎంత పనిచేశావయ్యా’ అంటూ చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు. గుండెపోటుతో 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని కటిక బజారులో నివాసముండే జలాల్, హసీనా దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత మహమ్మద్ యాసిన్ జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఏడో తరగతి పూర్తి చేసుకున్న యాసిన్ (13) 8వ తరగతిలోకి అడుగు పెట్టాల్సి ఉంది. మంగళవారం తెల్లవారుజామున తమ ఇంటి వద్ద ఉన్న బాత్ రూమ్లో కాలు జారి కింద పడిన యాసిన్ను వెంటనే తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లగా.. కాసేపటికే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి దాకా ఎంతో ఆనందంగా తమ ముందు తిరిగిన యాసిన్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
బాధ్యతల స్వీకరణ
ప్రశాంతి నిలయం: ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ–కేఆర్సీసీ)గా విజయ కుమారి మంగళవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశిత ప్రాజెక్టులు, రెవెన్యూ పరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ఆమెకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. 53 కిలోల గంజాయి స్వాధీనం● వ్యక్తి అరెస్టు పుట్టపర్తి టౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.53 కిలోల గంజాయి, ఒక సెల్ఫోన్, కారు స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం ఇన్చార్జ్ డీఎస్పీ శివన్నారాయణ, సీఐ శ్రీనివాసులుతో కలసి నల్లమాడ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కదిరి–బెంగళూరు జాతీయ రహదారిలోని పులగంపల్లి సమీపంలో మంగళవారం తనిఖీలు నిర్వహించామన్నారు. కదిరి నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీలు చేయగా, వాహనం డిక్కీలో రెండు మూటల్లో 53 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. వాహనం నడుపుతున్న నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన వెంకటరమణను అరెస్ట్ చేశామన్నారు. రెడ్డిపల్లికి చెందిన మల్లికార్జున ఆదేశాలతో గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు తెలపగా.. అతడిపైనా కేసు నమోదు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సతీష్తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలిహిందూపురం: విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని డీఈఓ క్రిష్ణప్ప అన్నారు. హిందూపురం మండలం బసవనపల్లి హైస్కూల్లో 6 మండలాల ఉపాధ్యాయులకు జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కల్గి విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు డాక్టర్ హెచ్ గంగప్ప, నాగరాజు,ప్రకాష్, సల్మాన్ రాజ్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 7 విద్యుత్ సబ్ స్టేషన్ల మంజూరు అనంతపురం టౌన్: జిల్లాలో కొత్తగా ఏడు సబ్స్టేషన్ల నిర్మాణానికిప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బసాపురం, రాయదుర్గం నియోజకవర్గంలోని యర్రగుంట్ల, వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి, రాప్తాడు మండలం బండమీదపల్లి, శింగనమల నియోజకవర్గంలోని బొందలవాడ, గుంతకల్లు నియోజకవర్గం ఖాదర్పేటలో 33 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. -
మూగవేదన.. అరణ్య రోదన
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూగజీవాల వేదన అరణ్య రోదనగా మారింది. తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి పశుగ్రాసం కొరతతో రైతులు పశువులను అమ్మేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అక్రమ మార్గంలో వాటిని కబేళాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల లోని సంత మార్కెట్లలో పశువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి రాత్రిపూట అక్రమంగా కర్ణాటక తరలిస్తున్నారు. గేదెలు, ఎద్దులతో పాటు ఆవులు కూడా ఉంటున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలించకుంటే కర్ణాటక బదులు తమిళనాడు, కేరళకు అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రెండు మార్గాల్లో పశువుల కంటైనర్లు సరిహద్దు దాటిపోతున్నాయి. జాతీయ రహదారి పై సోమందేపల్లి, చిలమత్తూరు మీదుగా కర్ణాటక చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు కదిరి, తనకల్లు మీదుగా కర్ణాటకలో ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. ఆయా మార్గాల్లో అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండటంతో పశువుల అక్రమ రవాణా వ్యాపారం రాత్రింబవళ్లు దర్జాగా సాగిపోతోంది. అక్కడక్కడా ప్రజలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇస్తే కానీ పట్టుకోవడం లేదు. కంటైనర్లలో కుక్కి.. అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుని పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్లో సామర్థ్యానికి మించి 70 నుంచి 80 పైగా పశువులను ఎక్కిస్తున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకం చూపిస్తున్నారు. ఇటీవల నంద్యాల నుంచి కర్ణాటక వెళ్తున్న కంటైనర్ను ఎన్పీ కుంట వద్ద తనిఖీలు చేసి పట్టుకోవడంతో మూగవేదన బయటపడింది. పక్కా ప్లాన్తో ముందుగానే.. పశువుల కంటైనర్లను తరలించే దాని కంటే ముందుగా ఆ మార్గంలో ఒక కారు లేదా బైక్ అరగంట ముందే బయలుదేరుతుంది. ఎలాంటి సమస్య లేదని ముందు వెళ్తున్న వాహనం నుంచి కంటైనర్ డ్రైవర్కు సమాచారం ఇస్తుంటారు. ఎలాంటి నిఘా ఉండదని తెలిసిన తర్వాత అతివేగంతో పశువుల వాహనాలు వెళ్తుండడం గమనార్హం. ఆగని పశువుల అక్రమ రవాణా దందా పోలీసుల కళ్లు కప్పి కబేళాలకు తరలింపు కంటైనర్లలో కుక్కి రాత్రి వేళ అక్రమ రవాణా సరిహద్దు చెక్పోస్టుల వద్ద లోపించిన పర్యవేక్షణ ఇటీవల నంద్యాల నుంచి కదిరి మీదుగా కర్ణాటకకు పశువులను మూడు కంటైనర్లలో అక్రమంగా తరలిస్తుండగా.. ఎన్పీ కుంట వద్ద ప్రజలు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు రెండు కంటైనర్లు వెళ్లిపోగా.. ఒక వాహనం పట్టుబడింది. అందులో 50కు పైగా గేదెలను కుక్కి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేశారు. ఇదొక్కటే కాదు.. మూగజీవాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు జిల్లాలో కొన్ని రోజులుగా పెరిగిపోయాయి. హిందూపురంలో భారీ విక్రయాలు పాడి పరిశ్రమ పేరుతో సంతల్లో పశువులను విచ్చలవిడిగా కొంటారు. ఆ తర్వాత వధించి మాంసం అమ్ముతున్నారు. హిందూపురం పట్టణంలో విచ్చలవిడిగా పశు మాంసం విక్రయ కేంద్రాలు వెలిశాయి. అడిగే వారు లేకపోవడం ఎడాపెడా అమ్మకాలు సాగిస్తారు. బెంగ ళూరుకు నిత్యం మాంసం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తనిఖీలు అంతంతే.. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కర్ణాటక వెళ్లేందుకు ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకున్నారు. ఆయా మార్గాల్లో అయితే అధికారులు ఎవరూ ఉండరనే కారణంతో అక్రమార్కులు ఆ దారుల్లోనే పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. కొక్కంటి సరిహద్దున, కొడికొండ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేయరనే ఉద్దేశంతో పశువుల అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. ఒకరిద్దరు పోలీసులు కంటైనర్లను ఆపినా.. అంతో ఇంతో ముట్టచూపితేనే వదిలేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. -
మోసానికి కేరాఫ్ చంద్రబాబు
పెనుకొండ రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు మోసానికి కేరాఫ్ అని, ప్రభుత్వ వైఫల్యాలను, మోసపు హమీలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేవలం అధికారం కోసమే కూటమి నాయకులు తప్పుడు హామీలతో గద్దెనెక్కారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాంతియుతంగా ర్యాలీ చేపట్టాలన్నారు. వెన్నుపోటుకు గురైన ప్రజలు, కార్మికులు, కర్షకులు ర్యాలీకి మద్దతు తెలపాలన్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాలు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్సీపీ కన్వీనర్లు బోయ నరసింహా, సుధాకర్రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సల్లా సూర్యప్రకాశ్రెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు సద్దాం, యాసిన్, శ్రీరాములు, కొండలరాయుడు, బోయ రాము, నారాయణ యాదవ్, చెన్నకేశవులు, మల్లిరెడ్డి, శివయ్య, పురుషోత్తంరెడ్డి, సుధాకర్నాయక్, తదితరులు పాల్గొన్నారు. 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు విజయవంతం చేయాలన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
అనారోగ్యంతో కానిస్టేబుల్ కన్నుమూత
తాడిపత్రి రూరల్: తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదన్రాజ్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన మదన్రాజ్ 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లిలో నివాసానికి తీసుకురాగా, ఏఎస్పీ రోహిత్ కుమార్, సీఐ శివగంగాధర్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్నాథ్, లక్ష్మినారాయణ, శివారెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ భార్య అరుణకు ఎస్పీ జగదీష్ ఏఎస్పీ రోహిత్కుమార్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాల కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. గంజాయి విక్రేత అరెస్ట్ గుంతకల్లుటౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న షికారీ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శివసాగర్ మంగళ వారం తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం హనుమాన్ సర్కిల్లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ చౌర్యంపై 55 కేసులు అనంతపురం టౌన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విద్యుత్ శాఖ విజిలెన్సు డీఈ రాజేష్ హెచ్చరించారు. మంగళవారం అనంతపురం రూరల్ మండలం నరసనేయునికుంట, కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేట, తాడిపత్రి ప్రాంతాల్లో విజిలెన్సు అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ మీటర్లకు వైర్లు పెట్టి విద్యుత్ అక్రమంగా వినియోగించడంతోపాటు తాడిపత్రి ప్రాంతంలో విద్యుత్ మీటర్లే లేకుండా నేరుగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించి 55 కేసులను నమోదు చేశారు. అలాగే రూ.1.60 లక్షల మేర జరిమానా విధించినట్లు డీఈ వెల్లడించారు. దాడుల్లో విజిలెన్సు ఏడీ రాధిక, ఏఈ పీరాతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో పలుచోట్ల వర్షం
పెనుకొండలోని దర్గా సర్కిల్లో పడిపోయిన భారీ వృక్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. గాలివానతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పెనుకొండ, సోమందేపల్లిలో వర్షం దంచికొట్టింది. పుట్టపర్తి, బుక్కపట్నం, గోరంట్ల, కొత్తచెరువు, మడకశిర, అమరాపురం, అగళి, గుడిబండ, రొళ్ల తుంపర్లు పడ్డాయి. పెనుకొండలో దర్గా సర్కిల్లో భారీ వృక్షం కూలడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. – పుట్టపర్తి అర్బన్ -
‘టెట్’ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
కదిరి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. డీఎస్సీ రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఈ ఏడాది అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీ అర్హత మార్కులతో టెట్ నుంచి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో ఈసారి టెట్కు డీఎస్సీ రాసే అభ్యర్థుల నుండి ఎక్కువ పోటీ ఉండనుంది. వీరితో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో... ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి కానుంది. 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లు పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులంతా కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. జిల్లాలో అన్ని కేటగిరీలకు చెందిన టెట్ రాయాల్సిన ఉపాధ్యాయులు 4 వేల మంది దాకా ఉన్నారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిపి మొత్తం 9 వేల మంది దాకా ఈసారి టెట్కు పోటీ పడనున్నారు. టెట్కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా... ● ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 5 నుంచి జూలై 5 వరకు సమయం ఇచ్చారు. ● జూలై 15 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. ● జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ● ఆన్లైన్లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ● ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. ● ప్రాథమిక కీ ఆగస్టు 24న, ఫైనల్ కీ సెప్టెంబర్ 8న విడుదల చేస్తారు. ● సెప్టెంబర్ 15 టెట్ ఫలితాలు విడుదల చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5 ఇన్సర్వీస్ టీచర్లకు ప్రత్యేక ‘టెట్’ నిర్వహించాలని డిమాండ్ నోరు మెదపని చంద్రబాబు సర్కారు టీచర్లు సద్వినియోగం చేసుకోండి ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ను సద్వినియోగం చేసుకోవాలి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే భావనతో గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన టెట్కు చాలా మంది టీచర్లు దరఖాస్తు చేసుకోలేదు. కొందరైతే దరఖాస్తు చేసుకొని కూడా పరీక్షకు హాజరు కాలేదు. ఇప్పుడు రాయక తప్పదు. పదోన్నతులకు సైతం టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. – కిష్టప్ప, డీఈఓ -
విద్యుదాఘాతంతో 15 గొర్రెల మృత్యువాత
తనకల్లు: విద్యుదాఘాతంతో 15 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని మంగదిన్నెపల్లిలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన ఆంజినేయులు గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన గొర్రెలను ఇంటి నుంచి తీసుకెళ్లి షెడ్లో కట్టేశాడు. షెడ్ పైన విద్యుత్ తీగలు గాలికి అటూ ఇటూ ఊగుతూ రేకుల షెడ్కు తగలడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో 15 గుర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మృతదేహం లభ్యం రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద మంగళ వారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. వృద్ధుడి మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఎవరైనా తప్పిపోయి ఉంటే కుటుంబీకులు పరిశీలించుకోవాలని ఎస్ఐ సూచించారు. మడకశిర రూరల్ సీఐ ఫోన్ నంబర్ 9440796820, రొళ్ల ఎస్ఐ ఫోన్ నంబర్ 9346010559ను సంపద్రించాలని కోరారు. 12న పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ మేళాధర్మవరం అర్బన్: పట్టణంలోని గుట్టకిందపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు పెనుకొండ, అనంతపురం, బెంగళూరు, హిందూపురం, కళ్యాణదుర్గం, గోరంట్లలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటాతోపాటు ఆధార్కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకుని ఉదయం 9 గంటలకు కళాశాలలో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి బత్తలపల్లి: వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వెంకటగారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగాధర్, పరమేశ్వరి దంపతుల కుమారుడు జ్ఞానతేజ సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కలను తరిమి బాలుడిని రక్షించారు. గాయపడిన చిన్నారిని తీసుకుని వెంటనే బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండడంతో ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లి వైద్యం అందించారు. గ్రామంలో వీధికుక్కల బెడద అధికంగా ఉందని, చిన్న పిల్లలు, పెద్దలపై దాడి చేస్తున్నాయన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి వీధికుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంకదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం రాత్రి లారీ ఢీకొని వెంకటేష్ (55) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కూలి పనులకు వెళ్లిన వెంకటేష్ పనులు ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి బయలుదేరాడు.జెడ్పీ హైస్కూల్ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రూరల్ అప్ గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగు నింపారని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ధర్మవరం పట్టణం యంబావీధికి చెందిన యంబా పోతలయ్య (85) మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, డాక్టర్ బీవీ సుబ్బారావులు మృతుని కంటి కార్నియాను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారులు యంబా చంద్రమోహన్, జయసింహ, ఆదిశేషు, అంజనప్రసాద్లకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ వైకే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నవ సమాజ నిర్మాణంలో యువత కీలకం
కనగానపల్లి:నవ సమాజ నిర్మాణం, దేశాభివృద్ధి లో యువత పాత్ర కీలకమని ఎస్పీ ఎస్. సతీష్కుమార్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఎస్పీ సతీష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో యువత ముందుకుపోతే దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలన్నారు. గ్రామాల్లో కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతోనే రామగిరి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు. ఇందులో రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 60 టీంలు పాల్గొనగా, మొదటి స్థానంలో నిలిచిన మేడాపురం టీంకు రూ.40 వేలు, రెండో స్థానంలో నిలిచిన చెన్నేకొత్తపల్లి టీంకు రూ.30 వేలు, మూడవ స్థానంలో నిలిచిన తూంచర్ల టీంకు రూ.20 వేల నగదు బహుమతులతో పాటు విజేతలకు ట్రోఫీలను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రామగిరి సీఐ మహమ్మద్ అలీ, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి ఎస్ఐలు మహమ్మద్ రిజ్వాన్, ప్రదీప్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ -
పోలీసుస్టేషన్కు సూది పంచాయితీ!
శ్రీసత్యసాయి జిల్లా: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాబ్జాన్ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హ -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి
పుట్టపర్తి టౌన్: డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్లో డీఆర్ఓ కొండయ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ మూర్తి మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరున నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ దగా చేసిందన్నారు. మెరిట్లిస్ట్ బహిరంగ పరచకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక్కో పోస్టుకు రూ. లక్షల్లో బేరసారాలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్, పరీక్ష నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా పరిశీలకులు మిద్దె కుళ్లాయప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు మాతంగి తిప్పన్న, ఆంజనేయులు, చౌడప్ప, జిల్లా అధికార ప్రతినిధి ఫోటో సాయి, నాయకులు భాస్కర్, చిప్పప్ప, రామగిరి అనిల్, ఈశ్వర్, అజంతకిష్ట, చిన్నప్పయ్య, రంగనాథ్, రామయ్య, నరశింహులు, చందు, రామాంజి, గంగిశెట్టి, నారాయణస్వామి, ఓబుళేసు, నాగేంద్ర, శంకర్, గోపి, గంగాధర్, గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి -
దాహం కేకలు వినిపించట్లేదా?
కళ్యాణదుర్గం రూరల్: ‘రెండు నెలలుగా మంచి నీరు సరఫరా కావడం లేదు. గ్రామానికి సమీపంలోని బోరు బావుల నుంచి అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నాం. ఎవరికి విన్నవించుకున్నా దాహార్తిని తీర్చేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు’ అంటూ మండలంలోని గోళ్లవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చి రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోళ్ల గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గోళ్ల పంచాయతీలో ఉన్న పాతచెరువు, శిబాయి గ్రామాల్లో 10 బెల్టుషాపులు ఉన్నాయంటే మద్యం సరఫరా ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించలేదని సచివాలయానికి తాళం ఎమ్మెల్యే అమిలినేనికి విన్నవించినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన -
బాధితులకు న్యాయం చేయండి
పుట్టపర్తి టౌన్: అర్జీలను చట్టపరిధిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీసీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణంముదిగుబ్బ: స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఐచర్ వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సదరు వ్యక్తి కొన్ని రోజులుగా ముదిగుబ్బ పరిసరాల్లో యాచన చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి రోడ్డు పక్కన వెళ్తున్న అతన్ని ఓ ఐచర్ వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ కేతన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుస్టేషన్కు సూది పంచాయితీ! కదిరి అర్బన్: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాబ్జాన్ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హం. -
వ్యక్తిపై తేనెటీగల దాడి
కూడేరు: తేనెటీగలు దాడి చేయడంతో బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంట పల్లికి చెందిన రామచంద్రప్ప అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం మండల పరిధిలోని కమ్మూరులో ఓ రైతుకు చెందిన మామిడి పొలంలో కొమ్మలు కత్తిరించేందుకు రామచంద్రప్ప వచ్చాడు. కొమ్మలు కత్తిరిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కూడేరులోని పీహెచ్సీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను ఎస్కే విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జ్యోతికుమార్ సోమవారం విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కేయూ మూల్యాంకన విభాగం డైరెక్టర్ ఆచార్య లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి తిరుమలేష్లతో కలిసి ఫలితాలను ప్రకటించారు. 6వ సెమిస్టర్ ఇంటర్న్షిప్ పరీక్షలకు 875 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 871 మంది 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఉపకులపతి కళాశాల పరీక్షల విభాగాన్ని సంద ర్శించారు. పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలు, వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న పారదర్శకత, మెరుగైన విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు జీఎల్ఎన్ ప్రసాద్, చంద్రశేఖర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి ఆవు మృతి బ్రహ్మసముద్రం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందిన సంఘ టన బ్రహ్మసముద్రం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పాడి రైతు మహదేవమ్మ మాట్లాడుతూ రూ.50 వేలు ఖర్చుచేసి ఆవును కొనుగోలు చేసినట్లు తెలిపారు. జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. పాడి ఆవు కళేబరాన్ని సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ లింగన్న పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మట్కా రాస్తున్న అత్త, కోడలి అరెస్టు తాడిపత్రి రూరల్: మట్కా రాస్తున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీకి చెందిన అత్త,కోడలు వాసంతి, అలివేలు తమ ఇంట్లో మట్కా రాసేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50,150 స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీసు సాయంతో నిందితులిద్దరినీ కోర్టులో హజరుపరిచినట్లు సీఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య గుంతకల్లు రూరల్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లు మండలంలోని కసాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కసాపురం గ్రామంలో సుంకులమ్మ కట్ట వద్ద నారాయణ అనే రైతుకు తోట ఉంది. ఈ తోటలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి వద్ద సీ.అనిత అనే పేరుతో ఏటీఎం కార్డు లభించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరా తీసి అనితకు ఫోన్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన భర్త నగేష్ (38) అని, చిన్నపాటి గొడవ జరగడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగేష్కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ధర్మవరం అర్బన్: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి కొరత తలెత్తకుండా నీటి విడుదలకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువను పీఏబీఆర్ కుడి కాలువతో అనుసంధానం చేసి తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లో ఉద్యాన పంటలకు సాగునీరు, తాగునీటి భద్రత కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా నీటి సరఫరాను నిరంతరం కొనసాగించాలని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. కదిరిగేటు రైల్వే ఓవర్ బ్రిడ్జి, గ్రామీణ రహదారులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ -
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు. ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని కలలు కన్నారు. అయితే విధి ఒక్కసారిగా వారిపై పగబట్టినట్లు మారింది. ఇ
జయకృష్ణకు అన్నం తినిపిస్తున్న కుమారిరాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు చరణ్ ఈసారి 9వ తరగతికి, చిన్నకుమారుడు ప్రభాస్ 7వ తరగతికి వెళ్తున్నారు. జయకృష్ణ బేల్దారి పని చేస్తుండగా, కుమారి కూలి పనులకు వెళ్లేది. కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేళ్ల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన జయకృష్ణకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్వయంగా నడవలేని స్థితికి చేరుకోవడంతో భార్య తోడు తప్పనిసరి అయింది. దీంతో ఆమె కూలి పనులకు వెళ్లడం మానేసింది. పూట గడవడమే భారంగా... ఇద్దరూ పనులకు వెళ్లలేని పరిస్థితి రావడంతో కుటుంబానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఉదయం లేవగానే ఇతర కుటుంబాలు పనులకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఈ కుటుంబం మాత్రం పిల్లలకు పాలు ఎలా కొనాలి.. భోజనం ఎలా పెట్టాలి? అనే ఆలోచనలతో గడుపుతోంది. కనీస అవసరాలు తీర్చుకోవడమే భారంగా మారింది. గోరుచుట్టుపై రోకటిపోటులా.. కుటుంబం ఇప్పటికే కష్టాల్లో ఉండగా ఇటీవల భార్య కుమారి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఆ మొత్తం పెద్ద భారంగా మారింది. అప్పులు చేసి చికిత్స చేయించుకు న్నా ఇప్పటికీ వాటి నుంచి కోలుకోలేకపోతున్నారు. కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పెద్ద కుమారుడు చరణ్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో బడి మానేసి బేల్దారి పనులకు వెళ్లి రోజుకు రూ.300 సంపాదిస్తూ ఇంటికి అండగా నిలిచాడు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు మట్టిగంపలు మోశాయి. గ్రామస్తులు, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించినా, సెలవులు వస్తే ఇప్పటికీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాడు. వానొస్తే ఇంట్లోకే నీరు.. కుటుంబానికి ఉన్న ఏకై క నివాసం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పులు, ఇంకోవైపు ఆకలి ఇలా ప్రతి రోజు ఆ కుటుంబానికి అగ్నిపరీక్షగా మారింది. శిథిలావస్థకు చేరిన ఇల్లు, ఇద్దరు కుమారులతో బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులు మానవతామూర్తులు ఆదుకోవాలి అనారోగ్యం, అప్పులు, ఆకలి, పేదరికం ఒకేసారి దాడి చేయడంతో కుటుంబం సాయంకోసం ఎదురుచూస్తోంది. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న సాయం కూడా ఆ కుటుంబానికి పెద్ద ఊరటనివ్వగలదని చెబుతున్నారు. ఇద్దరు చిన్నారుల చదువులు ఆగిపోకుండా, ఆ కుటుంబం మళ్లీ నిలదొక్కుకునేలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఈ.కుమారి ఫోన్పే నంబరు 63049 15177కు పంపాలని కోరుతున్నారు. పేద కుటుంబంపై పగబట్టిన విధి కిడ్నీలు క్షీణించి మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద దిక్కు అనారోగ్యానికి గురై నిస్సహాయురాలిగా మారిన భార్య కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం 8వ తరగతి చదువుకుంటూ కూలీగా మారిన వైనం మానవతావాదుల చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొమ్మలాటపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ (37), కుళ్లాయప్ప (42), చాంద్బాషాలు ద్విచక్ర వాహనంలో నార్పలకు బయలుదేరారు. ఇదే సమయంలో నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎస్.అశోక్, ఎం.అశోక్ ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు.బొమ్మలాటపల్లి సమీపంలో చెన్నంపల్లి క్రాస్ వద్ద ఎదురెదురుగా వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగభూషణ అక్కడికక్కడే మృతి చెందగా, కుళ్లాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో చాంద్బాషాకు కూడా తీవ్ర గాయాలు కాగా ఎం. అశోక్, ఎస్. అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. నాగభూషణకు భార్య నిర్మల, ఓ కుమారుడు, కుమార్తె, కుళ్లాయప్పకు భార్య కృపాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. ఇంటిపై దాడి.. ఏడుగురిపై కేసు ● బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని దాష్టీకంరాప్తాడు రూరల్: కులాంతర ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఓ యువతి కుటుంబ సభ్యులు యువకుడి నాయనమ్మ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మురళి మనోహర్ ప్రేమించుకుని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మేజర్ కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతించారు. వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు మనోహర్ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రూరల్ మండలం పాపంపేట కాలనీలో ఉన్న మనోహర్ నాయనమ్మ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలతో పాటు ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. -
‘పరిష్కార వేదిక’లో అర్జీల వెల్లువ
ధర్మవరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు వెల్లువెత్తాయి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రీసర్వేలో దొర్లిన తప్పులు సరిచేయాలని, తమ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని...ఇలా జనం తమ సమస్యలను ఏకరు పెట్టారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ శ్యాంప్రసాద్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి, కలెక్టర్లకు అందించారు. నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలోనే ఏకంగా 132 అర్జీలు అందడం గమనార్హం. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి, కలెక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లాస్థాయి అధికారులు, నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు. అందిన అర్జీల్లో కొన్ని ఇలా... మృతి చెందిన, పదవీ విరమణ పొందిన మున్సిపల్ కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు జేవీ రమణ, మున్సిపల్ కార్మికులు మేకల బాబు, ముకుంద, లక్ష్మీ ఓబిలేసు మంత్రి, కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ధర్మవరం మన్సిపాలిటీలోని కార్మికుల సంఖ్యను 120కి పెంచాలన్నారు. ● తుంపర్తి కాలనీలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ రేషన్ షాపు, తాగునీటి సదుపాయం, ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలని ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర మంత్రికి విన్నవించారు. ● ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్చార్జ్లతో నెట్టుకొస్తున్నారని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్కుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులను నియమించి ఇన్చార్జ్ల పాలనకు ముగింపు పలకాలని కోరారు. ● చేనేత కార్మికులకు నేతన్న భరోసా రూ.25 వేలు అమలు చేయాలని, తిరుపతిలో ఉన్న ఆర్డీడీ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, అప్పుడే చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పట్టణ కార్యదర్శి రవికుమార్ తదితరులు మంత్రికి విన్నవించారు. వివిధ సమస్యలపై 132 వినతులు -
విద్యాశాఖ నిర్వీర్యం
చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు విద్యాశాఖను కట్టబెట్టి భ్రష్టు పట్టించారు. ఇంగ్లిష్ మీడియం విద్య నిరుపేదలకు అందకుండా చేశారు. జగన్ హయాంలో కార్పొరేట్ స్థాయికి వెళ్లిన ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసి యువతకు వెన్నుపోటు పొడిచారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నా... నేటికీ పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫాం పాఠశాలలకు చేరలేదు. వస్తాయో, రావో తెలియదు. – నాగిరెడ్డి, విశ్రాంత ఎంఈఓ,పుట్టపర్తి -
రూ.18 వేలు
రూ.36 వేలురూ.1.785.60 కోట్లు 4.96 లక్షలు జిల్లాలో 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు కదిరి: ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు మహిళలు కనపడగానే ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ప్రతి సంవత్సరం..నీకు రూ.18 వేలు..నీకు రూ.18 వేలు..నీకు రూ.18 వేలు’ అని ఊదరగొట్టారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేర్చలేదు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలాగే ‘మహిళలు బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు ఇంటికి రావాలంటే బాబు అధికారంలోకి రావాలి’..అన్నారు. ఒక్క నగ కూడా ఇంటికి రాలేదు. ఇక డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. తాజాగా ‘సూపర్ సిక్స్–సూపర్ సక్సెస్’ అంటూ చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలందరూ చెప్పుకుంటుండగా... ‘ఆడబిడ్డ నిధి ఏదీ బాబు’ అని జిల్లా మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు రూ.1785.6 కోట్లు బాకీ ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా ఒక్కో మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. ఈ క్రమంలో రెండేళ్లకు కలిపి ఒక్కో మహిళకు రూ.36 వేల చొప్పున చంద్రబాబు సర్కారు ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు 4.96 లక్షల మంది ఉన్నారని అంచనా. ఈ లెక్కన ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ద్వారా రెండేళ్లకు రూ.1,785.60 కోట్లు చెల్లించాల్సి ఉంది. మహిళలకు ఇచ్చిన హామీలు కొన్ని ఇలా.. ● ‘ఆడబిడ్డ నిధి’ పేరుతో 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ● ‘తల్లికి వందనం’ పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15,000 చొప్పున అందజేస్తాం. ● వంటింట్లో మహిళలు గ్యాస్బండ కోసం ఇబ్బంది పడకుండా ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఉచితంగా ఇస్తాం. ● డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలిస్తాం. ● ఆడపడుచులకు నీళ్లు మోసే బాధ లేకుండా ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇప్పిస్తాం. ● ఉద్యోగాలు చేసే మహిళలకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తాం. ● ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు ఇప్పిస్తాం ● పండుగ, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాం. ● పీ–4 ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ... ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బాబు...మహిళలను పూర్తిగా విస్మరించారు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద ఒక్కో మహిళకు ఏటా అందించాల్సిన సాయం ఒక్కో మహిళకు చంద్రబాబు బాకీ పడిన మొత్తం జిల్లా మహిళలకు అందాల్సిన మొత్తం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు అందజేస్తాం –ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ....చంద్రబాబు పాలన వగ్గాలు తీసుకుని రెండేళ్లు గడిచినా.. ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తావించడం లేదు. ఎవరైనా గుర్తు చేసినా హామీలన్నీ అమలు చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే ఈ పాపం ఊరికే పోదంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో నిండా ముంచిన చంద్రబాబు హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు ‘ఆడబిడ్డ నిధి’ ఏదీ బాబు అని ప్రశ్నిస్తున్న మహిళలు -
వెన్నుపోటు బాబుకు బుద్ధి చెబుదాం
పుట్టపర్తి అర్బన్: ‘‘ఆయన జీవితమంతా అబద్ధాలు...మోసాలే. అధికారం కోసం ఎంతకై నా దిగజారుతారు. ఎవరితోనైనా జతకడతారు. నమ్మి ఓట్లేస్తే... అందరినీ నట్టేట ముంచుతారు’’ అని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సోమవారం పుట్టపర్తి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మేధావులు, పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దుద్దుకుంట శ్రీధర్రెడ్డి మాట్లాడారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...రెండేళ్లలో దోచుకోవడమే తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే చేయలేదన్నారు. ఎన్నికల హామీలేవీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అందుకే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి మేధావులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తున్నారన్నారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ అక్కా చెల్లెమ్మలకు నెలకు రూ. 1,500, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, విద్యార్థులకు వసతి దీవెన, వితంతువులకు పింఛన్, అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేలు..అంటూ హామీలిచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. కానీ అమరావతికి రూ.వేల కోట్లు తగలేసేందుకు విచ్చల విడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. హామీలు అమలు చేయాలంటూ సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా జైల్లో పెట్టిస్తున్నారన్నారు. తన స్వార్థం కోసం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, విద్యా వ్యవస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేశారన్నారు. పేదలకు కొండంత అండనిచ్చే ఆరోగ్యశ్రీని అంపశయ్యపై పడుకోబెట్టారన్నారు. ఇక రైతులకు కనీసం విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం లేదన్నారు. యూరియా అడిగితే కేన్సర్ వస్తుందని భయపెడుతున్నారని మండి పడ్డారు. జగన్ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ జగన్ హయాంలోనే పుట్టపర్తి అభివృద్ధిలో దూసుకుపోయిందని శ్రీధర్రెడ్డి గుర్తుచేశారు. పుట్టపర్తిలో జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 193 చెరువులకు నీళ్లిచ్చే కార్యక్రమం ప్రారంభం, నిరుపేదలకు జగనన్న కాలనీలు, నియోజకవర్గానికి 3 టీఎంసీల నికర జలాలు, మార్కెట్ యార్డు...ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో పుట్టపర్తికి పునరుజ్జీవం పోశారన్నారు. అలాగే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి పేరుతో జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరిగిందన్నారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకామూ లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి మామ పల్లె రఘునాథరెడ్డి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి అధికారులను, పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు సర్కార్తో ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మన సత్తా చూపించాలన్నారు. తెలంగాణ దాటని ప్యాకేజీ స్టార్ ప్రజలు ఓట్లేసి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేలా చేస్తే...కృతజ్ఞత మరిచిన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణకే పరిమితమయ్యారని శ్రీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైపోయినా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఆయనకు ప్యాకేజీ ఇస్తేనే రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారు తప్ప...ప్రజల కోసం కాదన్నారు. సుగాలి ప్రీతి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్కళ్యాణ్... సుగాలి ప్రీతి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారన్నారు. ఇలాంటి నాయకుల్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు...మోసాలు ఆయన నైజం హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలకూ అన్యాయం డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసిన లోకేష్ ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ..? పుట్టపర్తి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి -
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉంది. అందువల్ల ఎల్నినో పరిస్థితులను తట్టుకునే విధంగా అంతర పంటల సాగు (వేరుశనగ, కంది)తో పాటు తక్కువ నీటితో పండే జొన్న, కొర్ర, సజ్జ, పెసర లాంటి ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసేలా ప్రోత్సహించండి.’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన ఛాంబర్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ ఏడాది జిల్లా వ్యవసాయ స్థూల విలువ లక్ష్యం రూ.1301.04 కోట్లుగా నిర్దేశించామన్నారు. ఉత్పాదకతలో గత ఏడాది కంటే కనీసం 10 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. ఖరీఫ్లో 1,97,518 హెక్టార్లలో పంటల సాగును ప్రతిపాదించామన్నారు. జిల్లాకు 42,351 టన్నుల ఎరువులు అవసరమవుతాయన్నారు. తొలకర్లు కురుస్తున్న నేపథ్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద 2,65,040 మంది రైతులకు రూ.371.06 కోట్లు, పీఎం కిసాన్ కింద 2,46,262 మంది రైతులకు రూ.147.76 కోట్లు మంజూరయ్యాయన్నారు. అర్హులై ఉండి పథకం అందని రైతుల సాంకేతిక సమస్యలు తొలగించి లబ్ధి చేకూర్చాలన్నారు. సమావేశంలో మార్క్ఫెడ్ డీఎం గీత, డీఏఓ నారాయణనాయక్, ఏపీ సీడ్స్ డీఎం సుబ్బయ్య, సైంటిస్ట్లు బాలాజీ నాయక్, రామసుబ్బయ్య, ఏడీఏలు పాల్గొన్నారు. డిగ్రీ ఫలితాల విడుదలకు కసరత్తు అనంతపురం: ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ఫలితాల విడుదలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జనవరిలో పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొనడంపై 13 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంపై ‘అంతా మా ఇష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ స్పందించారు. సోమవారం పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఆన్లైన్ నిర్వహణ సంస్థతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సక్రమమైన డేటాను ఇవ్వడంలో పరీక్షల విభాగం ఉన్నతాధికారులు విఫలమయ్యారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డేటా అందిస్తే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపుఅనంతపురం: జేఎన్టీయూ(ఏ) ఎస్కేయూ పరిధిలోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 8న దరఖాస్తు గడువు ముగియగా.. దాన్ని 15 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీల రిజిస్ట్రార్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు https:// apuniversitiesrecruitment. apcfss. in లో తెలుసుకోవచ్చు. -
రెడ్బుక్ పాలనకు చరమగీతం
రాష్ట్రంలో సాగుతున్న రెడ్బుక్ పాలనతో ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ కూడా కరువైంది. నూతన పథకాలు పక్కనపెడితే..కనీసం ఉన్న పథకాలు కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది పింఛన్లు తొలగించారు. మేనిఫెస్టోపై ఎవరూ ప్రశ్నించ కూడదని ఆన్లైన్లో దాన్ని తొలగించారు. సచివాలయ ఉద్యోగులను వేర్వేరు శాఖలకు పంపి సచివాలయ వ్యవస్థ లక్ష్యాన్ని ఖూనీ చేశారు. చివరకు ఉపాధి పథకం డబ్బును కార్యకర్తలకు పంచిపెడుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెడ్బుక్ పాలనకు చరమ గీతం పాడదాం. – గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు -
ఇదేం సబ్సిడీ బాబోయ్!
● సబ్సిడీ విత్తన వేరుశనగ ధరపై రైతుల పెదవి విరుపు ● చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు బత్తలపల్లి: చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ విత్తన వేరుశనగ ధరలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరొకర సబ్సిడీతో ఎలాంటి ఉపయోగం లేదంటూ పెదవి విరుస్తున్నారు. సబ్సిడీ పోనూ క్వింటాల్ విత్తన వేరుశనగ కాయల ధరను రాష్ట్ర ప్రభుత్వం రూ.6,120గా నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్లో ఈ ధరకే నాణ్యమైన విత్తన వేరుశనగ దొరుకుతుందని రైతులు చెబుతుండడం గమనార్హం. సబ్సిడీని పెంచి ఇంకా తక్కువ ధరకు విత్తనాన్ని అందించి కరువు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పెట్టుబడులకూ ఇబ్బందులు.. పది రోజులుగా తొలకర్లు పలకరిస్తుండటంతో వ్యవసాయానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈసారి సూపర్ ‘ఎల్–నినో’ ఉన్నందున ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరువు పరిస్థితుల నడుమ కష్టాలో ఉన్న రైతులు ఖరీఫ్లో పంట పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇవ్వలేదు. ఈ క్రమంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం సబ్సిడీ విత్తన వేరుశనగతోనే భారం మోపడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. సాగుకు సిద్ధంగా ఉన్న పొలం -
వీరభద్రుని సేవలో జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి
లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామిని ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి దర్శించుకున్నారు. దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం జస్టిస్ ప్రభాకర్ శాస్త్రిని శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఖతార్లో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రశాంతినిలయం: ఖతార్ దేశంలోని దోహా నగరంలో హోంకేర్ నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి కళ్యాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 9 నుంచి 10 లోపు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంపికై న వారికి నెలకు రూ.5 వేల ఖతారీ రియాల్స్ (భారత కరెన్సీ ప్రకారం రూ.1,30,000) వేతనం ఉంటుందన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్తో పాటు రెండేళ్లు పోస్ట్ రిజిస్ట్రేషన్ అనుభవం కలిగిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వసతి, వైద్య సదుపాయం, రవాణా, వీసా, విమాన ఖర్చులు ఉచితమన్నారు. ఇతర వివరాలకు 9988853335, 8790117279 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చేనేత కార్మికుడి ఆత్మహత్యగార్లదిన్నె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కల్లూరుకు చెందిన రమేష్ (42) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మగ్గం నిర్వహణ.. కుటుంబ అవసరాల కోసం ఇతరుల వద్ద రూ.7 లక్షల దాకా అప్పులు చేశాడు. అయితే వచ్చే సంపాదన కుటుంబ పోషణకే సరిపోతోంది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో రోజూ మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో రమేష్ ఈ నెల మూడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేకపోయాడు. శనివారం రాత్రి మృతి చెందాడు. రమేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు. -
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ను బ్లాక్లిస్టులో పెట్టాలి
నల్లచెరువు: హంద్రీ–నీవా రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో భారీఎత్తున అక్రమాలకు పాల్పడిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వారు కదిరి నియోజకవర్గ పరిధిలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను పరిశీలించారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపాన పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి... విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పనులు అత్యంత నాసిరకంగా చేపడుతున్నారన్నారు. రూ.207 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు చంద్రబాబు ప్రభుత్వం అదనంగా రూ.102 కోట్లు కేటాయించినప్పటికీ పనుల్లో ఏమాత్రమూ నాణ్యత లేదన్నారు. ఇందులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందన్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటంతో నీటి ప్రవాహానికి చాలా చోట్ల లైనింగ్ కొట్టుకుపోయిందన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకునేందుకే కూటమి నాయకులు లైనింగ్ పనులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న పనులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. హంద్రీ–నీవా లైనింగ్లో భారీ అక్రమాలు నాసిరకం పనులు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు లైనింగ్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ -
పట్టించుకోరు.. పరిష్కరించరు!
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు పాలన ప్రారంభం అయిన 2024 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకూ కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 43,239 అర్జీలు వచ్చాయి. ఇందులో 7,008 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయంటే అధికారులు ఏ మాత్రం పరిష్కారం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 2,380 అర్జీలు పరిష్కార దశలో ఉన్నట్లు తెలిసింది. అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించినవే ఉంటున్నాయి. రెవెన్యూకు సంబంధించి 20,510 అర్జీలు రాగా 1,210 పరిష్కారమైనట్లు చూపుతు న్నారు. 3,101 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయి. పోలీస్ శాఖకు సంబంధించి అందిన 6,383 అర్జీల్లో 1,557 రీ ఓపెన్ కాగా, 205 పరిష్కరించారు. ఇక.. సర్వే శాఖలో డబ్బు లేనిదే ఏ పనీ కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖకు 6,329 అర్జీలు రాగా 730 రీ ఓపెన్ అయ్యాయి. 219 పరిష్కారం కాలేదు. విద్యుత్ శాఖకు 842 అర్జీలు అందగా, 228 రీపెన్, 97 పరిష్కారమైనట్లు చూపారు. తిరిగి తిరిగి వేసారి.. పీజీఆర్ఎస్లో అందజేసే ప్రతి అర్జీ తిరిగి కింది స్థాయి సిబ్బందికే చేరుతుండడంతో పెండింగ్ పెడుతున్నారు. ఒక్కోసారి సమస్యను పరిష్కరించకుండానే సంతకం చేయించుకొని తిప్పి పంపుతున్నారని అర్జీదారులు వాపోతున్నారు. మండల కేంద్రాల్లో పరిష్కారం చూపకపోవడంతోనే బాధితులు జిల్లాస్థాయికి వస్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా, మండల కేంద్రాలకు వెళ్లినప్పుడు అర్జీలపై ఆరా తీయకపోవడం బాధితులకు శాపంలా మారుతోంది. ఈ క్రమంలో మళ్లీ అర్జీలు రీ ఓపెన్ అవుతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ఇటీవల కొంత మంది అర్జీదారులు ఆత్మహత్యకు యత్నించారంటే ఎంతలా మానసిక వేదన అనుభవించారో అర్థమవుతోంది. ప్రజా ‘ప్రదక్షిణ’ వేదికలా మారిన ‘పీజీఆర్ఎస్’ అర్జీలపై అర్జీలిస్తున్నా ఫలితం సున్నా కనీసం ఆరా తీయని ఉన్నతాధికారులు బాధితులకు తప్పని అవస్థలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రహసనంలా మారింది. కార్యక్రమం కాస్తా ‘ప్రదక్షిణ’ వేదికగా మారింది. దూర ప్రాంతాల నుంచి బాధితులు వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చి అర్జీలు సమర్పిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. -
పంచాయతీ కార్యాలయ భవనం కూల్చివేత
బ్రహ్మసముద్రం: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ నేతల అక్రమాలకు , ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గ్రామస్థాయిలో ముఖ్యంగా స్వపరి పాలనా వ్యవస్థలో అతి కీలకమైనది గ్రామ పంచాయితీ భవనం. టీడీపీ నేతలే దగ్గరుండి జేసీబీ యంత్రాలతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. వివరాలు... బ్రహ్మసముద్రం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలోని పంచాయతీ భవనాన్ని టీడీపీ నేతలు ఆదివారం ఉదయం కూల్చి వేసేందుకు జేసీబీ యంత్రాలతో అక్కడి వచ్చారు. అయితే పంచాయతీ భవనాన్ని కూల్చివేయడం ఏమిటని టీడీపీ మాజీ సర్పంచ్ కురుబ సందీప్ కుమార్తో పాటు టీడీపీ నేతలను గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ నాకే అడ్డు చెబుతారా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం.. కూల్చండి అంటూ.. రకెంలేశాడు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్పారంటూ జేసీబీతో పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. బాగున్న భవనాన్ని కూల్చివేయడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఘటనపై ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్యే అమిలినేని చెప్పారని రెచ్చిపోయిన టీడీపీ నేతలు బాగున్న భవనం కూల్చివేయడమేంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు -
అన్ని వర్గాలనూ మోసగించిన బాబు
కదిరి టౌన్: ఎన్నికల ముందు అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తరువాత హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ... పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వెన్నుపోటు.. ఆయనకు వెన్నతోపెట్టిన విద్యన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు నెలకు రూ.1500 ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. అధికారం వచ్చిన తర్వాత అక్రమాలు, అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు మీరు చేసిన అక్రమాలకు వడ్డీతో సహా చెల్లిస్తారన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా బ్లాక్ బెలూన్లను ఎగరవేసి నిరసన తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలియజేసీ చిత్రాలను ప్రదర్శించారు. 12న ర్యాలీని జయప్రదం చేయండి వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న కదిరిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీఎస్ మక్బూల్ తెలిపారు. బాలుర కాలేజ్ గ్రాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు కుర్లి శివారెడ్డి, పట్టణాధ్యక్షడు షేక్ బాబ్జాన్, మండల కన్వీనర్లు డీకే బాబు (కృష్ణారెడ్డి), మణికంఠనాయక్, రవికుమార్రెడ్డి, రవీంద్రరెడ్డి, రంగారెడ్డి, అశోక్వర్ధన్రెడ్డి, ఎంపీపీ అమర్నాథ్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి జైనుల్లా, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. 12న కదిరిలో జరిగే ర్యాలీని జయప్రదం చేయండి వైఎస్సార్సీపీ కదిరి నియోజకర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ -
విషపూరితమైన నీరు తాగి 50 గొర్రెల మృతి
కళ్యాణదుర్గం రూరల్: మండల పరిధిలోని మల్లికార్జునపల్లిలో ఆదివారం కలుషిత నీరు తాగి 50 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... మల్లికార్జునపల్లికి చెందిన గొర్రెల కాపరి కృష్టప్ప (దివ్యాంగుడు) గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులా ఆదివారం తన గొర్రెలను సమీప అడవిలోకి మోతకోసం తోలుకెళ్లాడు. అయితే అడవిలో విషపూరితమైన నీరుతాగి వెంటనే 50 గొర్రెలు చనిపోయాయి. దీంతో దాదాపుగా రూ. 5 లక్షపైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే అదుకోవాలని గొర్రెల కాపరి క్రిష్టప్ప కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ కలహాలతో కార్మికుడి ఆత్మహత్య తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని చుక్కలూరు క్రాస్లో ఉన్న ఎమ్మెస్సార్ గ్రానైట్ ఫ్యాక్టరీలో కుటుంబ కలహాలతో కార్మికుడు పన్నారామ్ (34) ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి వివరాలమేరకు.. రాజస్థాన్కు చెందిన పన్నారామ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం తాడిపత్రికి వచ్చాడన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో బంధువులు ఉండటంతో వారి సాయంతో కార్మికునిగా పనిచేస్తున్నాడని చెప్పారు. కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడని, అక్కడ కుటుంబ సభ్యులతో గొడవపడి తాడిపత్రికి వచ్చాడన్నారు. మనస్తాపంతో శనివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు కిటికిలోనుంచి చూడగా పన్నారామ్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించిదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామన్నారు. బెంగళూరులో యాడికి యువకుడు..యాడికి: మండల కేంద్రానికి చెందిన వెంకటనారాయణరెడ్డి , అరుణ దంపతుల చిన్న కుమారుడు కిశాంత్శాడ్డి (24) బెంగళూరులో తాను నివసిస్తున్న గదిలోనే శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కిశాంత్రెడ్డి బెంగుళూరులోనే చదువుకొని అక్కడే ప్రైవేటు కంపెనీలో నెల క్రితం ఉద్యోగంలో చేరారు. జూన్ నెలలో జీతం కూడా పొందిన కిశాంత్రెడ్డి తన తల్లికి తన మొదటి జీతం ఇవ్వడానికి వారం క్రితం యాడికికి వచ్చాడు. మూడు రోజుల క్రితం మళ్లీ బెంగళూరు వెళ్లిన కిశాంత్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని యాడికికి తీసుకురాగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కిశాంత్రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజంలో ఉన్నత స్థానాలను అందుకుని తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈడిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగర శివారులోని రేణుకా యల్లమ్మ కల్యాణ మండపంలో ‘ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసీ రమేష్గౌడ్, రేణుకా యల్లమ్మ సొసైటీ గౌరవ సలహాదారు బుర్రా ఆదినారాయణ గౌడ్, అధ్యక్షుడు జగలేటి నాగేశ్వరరావు గౌడ్, ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ గౌడ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం గౌడ్ హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో 16వ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఈడిగ (గౌడ) విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బీసీ రమేష్ గౌడ్, విశ్వనాథ్గౌడ్ మాట్లాడుతూ.. అవార్డులు అందుకున్న విద్యార్థులు రేపటి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల పంపిణీలో వక్తలు -
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి
లేపాక్షి: ప్రజల జీవనశైలిలో యోగా ఒక భాగం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. చరిత్రాత్మక లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్ యోగా క్యాంపెయిన్ ఘనంగా నిర్వహించారు. మంత్రులు సత్యకుమార్, సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ, అధికారులు, స్థానికులు, విద్యార్థులు యోగాసనాలు సాధన చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాభ్యాసకులుగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రజలు డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయుష్ ప్రతినిధులు, యోగా మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. 7 మండలాల్లో వర్షంపుట్టపర్తి అర్బన్: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 7 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 155.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా అమరాపురం మండలంలో 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, పెనుకొండలో 27.2 మి.మీ. గుడిబండ 24.2, పుట్టపర్తి 14.2, రామగిరి 12.8, బుక్కపట్నం 9.4, కొత్తచెరువులో 9.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. -
50 అడుగుల లోయలోకి పడిన ఐచర్
● క్లీనర్ మృతి, డ్రైవర్ ఆచూకీ గల్లంతు ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు సమీపంలోని పులివెందుల ఘాట్లో ఆదివారం సాయంత్రం ఐచర్ వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన క్లీనర్ నవేంద్ర (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్ వెంకటరమణారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. టమాట మొక్కలకు కట్టే కట్టెల లోడుతో పులివెందుల వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు వస్తున్న ఐచర్ వాహనం ఘాట్ రోడ్లో రెండో క్రాస్ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోతులోకి పడిపోయిందని పోలీసులు తెలిపారు. కట్టెల కింద పడి క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ ఆచూకీ లభ్యం కాలేదు. స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంపుట్టపర్తి అర్బన్: జిల్లాలోని కదిరి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లలో ఖాళీగా ఉన్న 230 అంగన్వాడీ ఆయా (సహాయకురాలు) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పీడీ ప్రమీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, సీకేపల్లి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి 18వ తేదీలోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకొని గడువు లోపు అక్కడే సమర్పించాలన్నారు. కదిరి మండలంలో 70, నల్లచెరువులో 51, ధర్మవరంలో 21, బత్తలపల్లిలో 63, సీకే పల్లిలో 25 మొత్తం కలిపి 230 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోయలోకి పడిన ఐచర్ -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు
సందర్భం : నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అనంతపురం సిటీ: ఇటీవల బెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్లు చాలా మందిని భయడపెతున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలితో పాటు రేడియేషన్, జెనెటిక్ డిసార్డర్ కూడా ఇందుకు కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుదైన కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగానూ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదముంటుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా వంద కేసులు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏడాదికి 80 నుంచి 100 కేసులు ఉంటున్నట్లు అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతున్నా.. నొప్పి తీవ్రత తాళలేక వాంతులవుతున్నా.. మూర్ఛపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి తోడు వినికిడి లోపం తలెత్తినా, చెవుల్లో ఈల వంటి శబ్ధం వస్తున్నా, నడుసున్నప్పుడు.. కూర్చున్నప్పుడు తడబాటుకు లోనవ్వడం కూడా బ్రెయిన్ ట్యూమర్కు ప్రాథమిక లక్షణాలను వైద్యులు అంటున్నారు. రేడియేషన్కు దూరంగా మేలు ఆధునికత సాంకేతికత అందుబాటులో వచ్చిన తర్వాత రేడియేషన్ ప్రభావం అందరిపై ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువత విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ దేశీయంగా బెయిన్ ట్యూమర్ బారిన పడిన వారిలో అత్యధికులు చిన్నపిల్లలు, యువతీ యువకులేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జెనిటిక్ డిసార్డర్ సమస్యలు ఉన్న వారు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రతి ట్యూమరూ క్యాన్సర్ కాదు రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ జెనెటిక్ డిసార్డర్తోనూ సమస్య సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ ప్రాథమిక లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ, తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు, వికారం, మూర్ఛ, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తదితర అంశాలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే ప్రతి బ్రెయిన్ ట్యూమర్.. బ్రెయిన్ క్యాన్సర్గా మారదని వైద్యులు పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన శస్త్రచికిత్స ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నయం చేయవచ్చని సూచిస్తున్నారు. తలనొప్పి.. ఎప్పుడో ఓ సారైతే పర్వాలేదు.. కానీ క్రమం తప్పకుండా తలనొప్పి ఉందంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది బ్రెయిన్ ట్యూమర్కి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని నిర్వహిస్తూ వస్తున్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి
పెనుకొండ: పట్టణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ మండలాల నుంచి వేలాది మంది భక్తులు, మహిళలు భారీ తరలివచ్చారు. స్థానిక 44వ జాతీయ రహదారి నుంచి అశేష భక్త జనుల మధ్య ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఊరేగించారు. జైశ్రీరాం అన్న నినాదాలతో పెనుకొండ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. హనుమత్ జయంతి కమిటీ పెద్దలు భక్తులకు తాగునీరు, భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్ నేతృత్వంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. -
ఫేక్ ఫోన్ పే మెసేజ్తో మోసం
●బియ్యంతో ఉడాయించిన మోసగాడు హిందూపురం టౌన్: ఓ బియ్యం దుకాణంలో బియ్యం ప్యాకెట్లు కొని డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు ఓ మోసగాడు. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు... స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బియ్యం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం బియ్యం కొనుగోలు చేయడానికి వచ్చాడు. రూ.10 వేల విలువైన బియ్యం ప్యాకెట్లు కొనుగోలు చేసిన తర్వాత సెల్ నంబర్: 8310220463 నుంచి డబ్బను ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని నమ్మబలిగాడు. అనంతరం ఫోన్ పే చేసినట్లు చూపిస్తూ సక్సెస్ ఫుల్ అనే మెసేజ్ను క్రియేట్ చేసుకుని ఫోన్ స్క్రీన్ పైన చూపించాడు. హడావుడిలో ఉన్న దుకాణాదారుడు దాన్ని నమ్మి ఆ మోసగాడికి బియ్యం ప్యాకెట్లను అప్పచెప్పాడు. చాలా ఆలస్యంగా రూ.10 వేలు తన ఖాతాకు పడలేదన్న విషయాన్ని దుకాణదారుడు గుర్తించాడు. సదరు వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు సైబీరియన్ పక్షులను వీక్షించిన జేసీచిలమత్తూరు: మండల పరిధిలోని వీరాపురంలో సైబీరియన్ పక్షులను వీక్షించేందుకు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదివారం వీరాపురం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పక్షులకు ఆయన కెమెరాలో బంధించారు. అనంతరం పక్షుల సంరక్షణ, నీరు, ఆహారం వంటివి ఎలా సమకూర్చుకుంటున్నాయో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో నీరు, ఆహారం కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్యధర్మవరం: పట్టణంలోని పోతుకుంట రైల్వే బ్రిడ్జి కింద రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం రైల్వే హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి వివరాల మేరకు... పట్టణంలోని పోతుకుంట రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వృద్ధుడు (70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వద్ద కట్టెల బ్యాగు అందులో రెండు జతల తెల్ల షర్టులు, తెల్ల పంచె, తెల్ల టవాల్ ఉన్నాయన్నారు. రైల్వే కీమాన్ సమాచారం మేరకు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. ఎవరైనా మృతి చెందిన వృద్ధుడి గుర్తిస్తే రైల్వే పోలీసులు 9182019510, 9247575615, 9247575612 నంబర్లకు సమాచారం తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిగోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో కదిరి–హిందూపురం ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరికి చెందిన నాగేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కదిరి పట్టణానికి చెందిన నాగేంద్ర పాలసముద్రం సమీపంలోని కియా అనుబంధ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. పని ముగించుకొని ద్విచక్ర వాహనంలో గోరంట్ల వైపు వస్తుండగా పాలసముద్రం సమీపంలోని పెట్రోల్ బంకు మలుపు వద్ద గోరంట్ల నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. లారీ ఢీ కొని యువకుడు..హిందూపురం: తూమకుంట పారిశ్రామికవాడ చెక్పోస్టు వద్ద వేగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు... కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలుకాకు చెందిన నరసింహప్ప (38) ఆదివారం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తూమకుంట పారిశ్రామికవాడ చెక్పోస్టు వద్ద వెనుక వైపు నుంచి లారీ ఢీ కొంది. ఘటనలో నరసింహప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విదేశీ అతిథులకు అవస్థల స్వాగతం
చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచివేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళతప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు ఆహారం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నా కానీ సైబీరియన్ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
అక్రమ మద్యం స్వాధీనం
హిందూపురం టౌన్: హిందూపురం ఎకై ్సజ్స్టేషన్ పరిధిలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, 350 మద్యం ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య పేర్కొన్నారు. శనివారం పరిగి మండలం గణపతిపల్లికి చెందిన మారెప్ప ద్విచక్ర వాహనంలో 240 ప్యాకెట్ల కర్ణాటక మద్యంను తరలిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నామన్నారు. అలాగే చిలమత్తూరు మండలం సోమగట్ల గ్రామ పరిసరాల్లో సుధాకర్, సోమశేఖర్ ద్విచక్ర వాహనంలో 110 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో వివిధ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన ముగ్గురిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో డీటీఎఫ్ సీఐ హరికృష్ణ, ఎస్ఐలు పృథ్వీ, నారాయణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 108లో ప్రసవంఓడీచెరువు: మండల పరిధిలోని సున్నంపల్లికి చెందిన అశ్విని (20) రెండో కాన్పు నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి శనివారం తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు కాల్ చేయడంతో కదిరి 108 సిబ్బంది కదిరి ఏరియా ఆస్పత్రి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అశ్విని నొప్పులు అధికం కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి వైద్యుల సూచన మేరకు కాన్పు చేశారు. ప్రసవానంతరం వైద్యపరీక్షలు చేసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలపడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. నారసింహా నమోస్తుతే కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పురం, మడకశిరలోని చెరువులన్నీ నింపాలి
హిందూపురం: కరువు ప్రాంతాలైన హిందూపురం, మడకశిరకు హంద్రీనీవా కాలువతో చెరువులన్నింటినీ అనుసంధానం చేసి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా 265 చెరువులను నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్ సమావేశ మందిరంలో పట్టు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమకుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘ గౌరవాధ్యక్షుడు ధనాపురం వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి సిద్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడారు. పట్టు రైతులకు రైతులకు ఇన్సెంటివ్ మంజూరు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్తో పాటు అంబికా లక్ష్మీనారాయణ, గుండుమాల తిప్పేస్వామి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా మంజూరు చేయించలేదని వాపోయారు. రాబోవు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై అలు పెరగని పోరాటం సాగిస్తామన్నారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిరికల్చర్ ఇన్చార్జ్ ఏడీ హంపయ్య తెలిపారు. కార్యక్రమంలో పట్టు రైతు సంఘం కార్యదర్శి హరి, ఓపీడీఆర్ నాయకులు శ్రీనివాసులు, పరిగి నవీన్, ఆదినారాయణప్పా, నారాయణస్వామి, మడకశిర పట్టు రైతులు సదాశివరెడ్డి, వేమారెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసగౌడ, గోవిందప్ప, ధర్మవరం పట్టు రైతులు చంద్రశేఖర్రెడ్డి, ఆదినారాయణప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘ఆల్ ఇండియా రేడియో’ మన దేశానికే గర్వకారణం. వార్తలు మాత్రమే కాదు రేడియో నాటికలు, ధారావాహికలు , ధర్మ సందేహాలు, చలన చిత్ర పాటలు, వివిధ భారతి, జాతీయ వార్తలు, స్పాట్ లైట్, సంగీత కచేరీలు, ప్రముఖుల పరిచయం, ఇంటర్వ్యూలు, జాతీయ నాయకుల ప్రసంగాలు ఇలా ఒక్కటేంటి అన్
●ఘనంగా ఆకాశవాణి అమృతోత్సవాలు ●అనంత రేడియో స్టేషన్ ఆరంభం ఆసక్తికరం ●90 ఏళ్లుగా కొనసాగుతున్న ఆల్ ఇండియా రేడియో సేవలు అనంతపురం కల్చరల్: ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శుయంతాం. ప్రవాచకః బలదేవానంద సాగరః’ అంటూ రేడియోలో సమ్మోహనంగా వినిపించే ఆ కంఠం కోసం వేలాది మంది శ్రోతలు ఎదురు చూసేవారు. దశాబ్దాల కిందట ఢిల్లీ నుంచి ప్రసారాలు ఆరంభమై తొలి తెలుగు రేడియో స్టేషన్ విజయవాడకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా కడప ప్రసారాల నుంచి స్వతంత్రంగా ‘అనంత’కు చేరింది. దీని వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగున్నాయి. జనరంజకంగా... సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దూసుకెళ్తున్నా తరగని ఆదరణ ఆకాశవాణిది. సాధారణ సెల్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వరకు ఎఫ్ఎం స్టేషన్ తప్పనిసరిగా ఉండడమే దీనికి నిదర్శనం. కాబట్టే అన్ని వర్గాల శ్రోతలు ఉదయం నుంచి రాత్రి దాకా సాగే వేర్వేరు కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్న విషయమూ ఆశ్చర్యకరంగా ఉంటుంది. తెల్లవారు జామున మధురమైన సంగీత ధ్వనితో తట్టిలేపుతూ సాగే భక్తిరంజని, దేశభక్తిగేయం, వినదగు మాట, సేద్యపు సుద్దులు మొదలు చిత్రసీమ, చిత్ర జగత్, హలో అభిలాష , శ్రోతలు కోరిన సినిమా పాటలు ఈ నాటికీ జనరంజకంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘ఆల్ ఇండియా రేడియో’గా నామకరణం చెంది 90 ఏళ్లు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘అమృతోత్సవ్’ పేరుతో ఆకాశవాణి విభిన్న కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రతి ఏడాది జూన్ 8న రేడియో దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజీవ్గాంధీ హత్యతో వాయిదా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 12 రేడియో స్టేషన్లుంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అనంతపురంతో కలిసి విశాఖపట్నం, విజయవాడ, మార్కాపురం, నెల్లూరు, కడప, తిరుపతి, కర్నూలు వంటి చోట్ల 8 కేంద్రాలు మాత్రమే మిగిలాయి. అనంత కేంద్రం 1991 మే 22న ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ అదే ఏడాది మే 21న రాజీవ్గాంధీ హత్య జరగడంతో వారం రోజుల తర్వాత అంటే 29న అనంతపురంలో (ఎఫ్.ఎం స్టేషన్ హోదాలో) అధికారికంగా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. స్థానిక కళలకు, కళాకారులకు, సాహిత్యానికి ఎక్కువ అవకాశాలివ్వడానికి తక్కువ పరిధి మాత్రమే ఉండే ఎఫ్.ఎం.(రీఫీక్వెన్సీ మాడ్యులేషన్) ప్రారంభించారు. వీటినే ఎల్ఆర్ఎస్ (లోకల్ రేడియో స్టేషన్)అని కూడా పిలుస్తారు. సృజనలో జాలువారిన ‘అనంత’ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది సినీ రచయితలు, నటులు ఆకాశవాణిని దిగ్విజయంగా నడిపినట్టే అనంతపురంలోనూ ఎంతో మంది అధికారులు విభిన్నంగా, విలక్షణంగా తమదైన సృజనతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శ్రోతలకు రేడియోను మరింత దగ్గర చేశారు. అనంతపురం ఆకాశవాణి ప్రారంభం నాటికి డాక్టర్ పద్మనాభరావు తొలి స్టేషన్ డైరెక్టర్ కాగా, తొలి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పనిచేశారు. ఆరవేటి శ్రీనివాసులు, డాక్టర్ మాచిరెడ్డి, అంజనప్పలు కేంద్రం డైరెక్టర్లుగా విధులు నిర్వహించారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా రమణమూర్తి, విద్యాలంకార్, కళాకృష్ణ, మహేశ్వర్, వసుమతి, హరి, శివశంకరరెడ్డి, మురళీ, వై.శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం శృతి ప్రియాంక కేంద్రం అధికారిణిగా ఉన్నారు. ప్రధానంగా నాగసూరి వేణుగోపాల్, నాగేశ్వరరెడ్డి హయాంలో అనంత కళలు, సాహితీ ప్రచారం మరింత విస్తృతమైంది. వీరందరూ ఒక ఎత్తైతే రేడియో అనగానే మధురంగా వినపడే కంఠాలు అనౌన్సర్లవి. తొలిరోజుల్లో పుష్పరాజ్, పోతన్న, అమృత ఉండేవారు. తర్వాత వచ్చిన సుభాన్, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి వంటి వారు మంత్ర ముగ్దులను చేసే కంఠంతో ఎన్నో కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు నడిపించారు. వీరందరూ పదవీ విరమణ చేయగా ప్రస్తుతం క్యాజువల్ అనౌన్సర్లు అనంతపురం ఆకాశవాణిని ఆ పాత ఒరవడిలోనే హృద్యంగా కొనసాగిస్తున్నారు. సందర్భం రేపు రేడియో దినోత్సవం శ్రోతలు మెచ్చే ఆ పాత మధురాలు ప్రాంతాలకు తగ్గట్టుగా కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా అనంత ఆకాశవాణి ప్రసారాల పేర్లను ఇక్కడి భాష, యాస వచ్చేవిధంగా మార్పు చేశారు. పొలం కబుర్లు కాస్తా ‘సేద్యం సుద్దులు’గా, సూక్తి సుభాషితం, సుభాషిత రత్నావళి వంటి వాటిని ‘వినదగు మాట’గా మార్చారు. రైతుల కోసమైతే నిత్యం ప్రత్యేక ప్రసారాలు సాగుతాయి. ప్రతి ఫిబ్రవరి 15న రేడియో రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక టీవీలు, సెల్ఫోన్లు ఎన్నున్నా రేడియోలో వచ్చే పాటలంటే ఎంతో మంది చెవి కోసుకుంటారు. కాబట్టే ఆకాశవాణి ప్రసారం చేస్తే అనేక కార్యక్రమాల్లో ఆ పాత మధుర గీతాలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచనలు, బాలల కోసం వచ్చే కార్యక్రమాలు, డాక్టర్లతో, లాయర్లతో, విద్యావేత్తలతో , కవులు, కళాకారులతో చేసే కార్యక్రమాలకు ఈనాటికీ ఎంతో ఆదరణ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. -
నయనానందకరం
నృత్య రూపకం.. ప్రశాంతి నిలయం: శ్రీకృష్ణుడి లీలామృతాన్ని, భాగవత ఇతిహాస వైభవాన్ని చాటుతూ చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం నయానందకరంగా సాగింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన మధ్యప్రదేశ్ సత్యసాయి భక్తులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత సామూహిక సత్యసాయి అష్టోత్తర శత నామావళిని పఠించారు. సామూహిక పఠనంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం మధ్యప్రదేశ్ బాలవికాస్ చిన్నారులు వ్యాస మహర్షిచే రచించబడిన శ్రీమత్ భాగవతం, సత్యసాయిచే రచించబడిన భాగవత వాహిని నుంచి స్వీకరించిన భాగవత ఘట్టాలను ప్రదర్శంచారు. భాగవత్ కథామృతం పేరుతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
లేపాక్షికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించాలి
లేపాక్షి: జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించాలని నిర్వాహకులకు విన్నవించినట్లు చరిత్రకారుడు, పర్యాటరంగ నిపుణుడు మైనాస్వామి వెల్లడించారు. శనివారం సాయంత్రం స్థానిక ఏపీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ సముదాయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. మూడు అంగుళాల సూక్ష్మ శిల్పం నుంచి 12 అడుగుల పెద్ద శిల్పం వరకు ఉన్న శిల్పాలు, ఆసియా దేశాల్లోకెల్లా పెద్దదైన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం, నేలను తాకని ఆకాశ స్తంభం, అతిపెద్ద నంది విగ్రహం, 33 అడగుల పొడువు 20 అడుగుల ఎత్తు గల నంది విగ్రహం లేపాక్షి ప్రత్యేకతలను చాటుతున్నాయని చెప్పారు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానిక నిర్వాహకులకు విషయం తెలుపగా త్వరలో వారు లేపాక్షిని సందర్శించి అన్ని విషయాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు రావడం ద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ఈ ప్రాంతం ఆర్థిక, ఉపాధి అవకాశాలు ఎంతగానో మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మవరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో సోదాలు ధర్మవరం రూరల్: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం టూటౌన్ సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలల్లో సోదాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే సోమందేపల్లి మండలం గాంధీనగర్కు చెందిన దీవెన్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రత్యేక టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్ష నిర్వహించగా గంజాయి వినియోగించినట్లు తేలిందని సీఐ తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు. ఇరు వర్గాల ఘర్షణ నార్పల: భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. మండలంలోని బండ్లపల్లిలో నివాసముంటున్న నారాయణరెడ్డికి నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. నాగభూషణరెడ్డి, సాయి భూషణ్రెడ్డి అన్నదమ్ములు. కాగా.. వీరికి ఆరెకరాలకు పైగా భూమి ఉంది. ఇటీవల జరిగిన రీ సర్వేలో నారాయణరెడ్డికి చెందిన 44 సెంట్ల భూమి నాగభూషణ్రెడ్డి పేరిట నమోదైంది. భూమిలో దుక్కులు చేసేందుకు నాగభూషణ్రెడ్డి ప్రయత్నించడంతో అది తన భూమి అంటూ నారాయణరెడ్డి, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగిసిన బీసీసీఐ శిక్షణ అనంతపురం: బీసీసీఐ (సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్) అండర్–16 టీమ్ సీ కోచింగ్ క్యాంప్ శనివారం ముగిసింది. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మే 11 నుంచి జూన్ 06వ తేదీ వరకు రెసిడెన్షియల్ శిక్షణ కల్పించారు. హెడ్ కోచ్ హిమ్ జోషిపుర, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ రొనాల్డ్ రాయ్ రోడ్రిజియస్, ఫిజియోథెరఫిస్ట్ మేఘాన్ సింఘ్ చౌహాన్, వైభవ్ గోసామి, అనుష్క ఆదిత్య, అనలిస్ట్ కలై సెల్వన్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి యోగాంధ్ర ప్రచారంప్రశాంతి నిలయం: యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఆదివారం నుంచి 21వ తేదీ వరకూ యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్యం, శేయస్సు పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. యోగా మాసంలో జూనియర్స్, సీనియర్స్, యువతకు సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా, యోగా క్విజ్, స్లోగన్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి పోటీలు 7 నుంచి 9 వరకూ, మండలస్థాయి పోటీలు 10 నుంచి 12 వరకూ, జిల్లా స్థాయి పోటీలు 14 నుంచి 16 వరకూ, రాష్ట్రస్థాయి పోటీలు 18 నుంచి 20 వరకూ వివిధ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు, పట్టణాల్లో 5 వార్డులకు ఒకరిని మాస్టర్ ట్రైనర్లుగా గుర్తించి సిద్ధం చేసి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. -
విద్యారంగం నిర్వీర్యం
చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫీజు రీయింబర్స్మెంట్, మధ్యాహ్న భోజనం, నాడు–నేడు వంటి పథకాలను నీరుగార్చారు. పేదలకు విద్యను దూరం చేశారు. విద్యారంగ సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం. – సకల రాజ, ఏఐవైఎఫ్ నాయకులు నిరుద్యోగులను మోసం చేశారు మోసం చంద్రబాబు నైజం. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించకుండా దగా చేశారు. స్పోర్ట్ సర్టిఫికెట్ల పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి అనర్హులకు అన్యాయం చేశారు. – పురుషోత్తం రాయల్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం -
కలెక్టర్ ‘ఉత్త’ర్వులు
● తహసీల్దార్ బదిలీల్లో ‘పచ్చ’ మంత్రాంగం ● విధుల్లో చేరకముందే మండలాలు మార్పు పుట్టపర్తి అర్బన్: కలెక్టర్.. జిల్లా మెజిస్ట్రేట్... పాలనలో కీలక పాత్ర. ఆయన ఒకసారి ఉత్తర్వులు ఇచ్చారంటే అది శాసనమే. కానీ ఇటీవల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులన్నీ ఉత్తవిగా మారిపోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం పలువురు తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. పుట్టపర్తి తహసీల్దార్గా త్రిభువన్రెడ్డిని, కొత్తచెరువు తహసీల్దార్గా సంహితను నియమించారు. ఏమైందో ఏమో గానీ.. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ‘పచ్చ’ మంత్రాంగం నడిచింది. దీంతో పుట్టపర్తి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకోవాల్సిన త్రిభువన్రెడ్డిని కొత్తచెరువుకు, కొత్తచెరువులో బాధ్యతలు తీసుకోవాల్సిన సంహితను పుట్టపర్తికి మార్చారు. దీంతో శనివారం ఆమె పుట్టపర్తి తహసీల్దార్గా బాధ్యతలు కూడా తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి వస్తున్న త్రిభువన్రెడ్డి తమ మాట వింటారో లేదో అని సందేహ పడిన స్థానిక ఎమ్మెల్యే... ఆయన్ను కొత్తచెరువుకు పంపించి.. డీఎస్ఓ కార్యాలయంలో సీఎస్డీటీగా విధులు నిర్వర్తిస్తున్న సంహితను పుట్టపర్తికి బదిలీ చేయించారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. లావాదేవీలకు ఇబ్బందులు రాకూడదనే! పుట్టపర్తి.. జిల్లా కేంద్రం. అందువల్ల ఇక్కడ తహసీల్దార్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మండలంలో ఏపీఐఐసీకి భూముల కేటాయింపు, డబ్బు లావాదేవీలు భారీగా చేయాల్సి ఉంది. ఆయా వ్యవహారాల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడంలో ఎమ్మెల్యే విజయం సాధించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ‘ప్రొటోకాల్’ విధులతో సమస్య.. పుట్టపర్తికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, రాష్ట్ర ప్రముఖులు, మంత్రులు తరచూ విచ్చేస్తుంటారు. దీంతో ఇక్కడి తహసీల్దార్, ఆర్డీఓలకు ప్రొటోకాల్ విధులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం పుట్టపర్తిలో ఆర్డీఓగా మహిళాధికారి ఉన్నారు. తహసీల్దార్గా కూడా మహిళను నియమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టరేట్ అధికారులే చెబుతున్నారు. కొన్ని సమయాల్లో రాత్రి వేళల్లో ప్రముఖులు విచ్చేస్తారని, వారికి స్వాగతం పలికేందుకు ఆ సమయంలో వేచి ఉండాల్సి ఉంటుందంటున్నారు. అందువల్ల తహసీల్దార్గా మహిళ కంటే పురుషులనే నియమిస్తే బాగుండేదని కలెక్టరేట్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఆర్డీఓ, తహసీల్దార్ ఇద్దరూ మహిళలే కావడంతో ప్రొటోకాల్ బాధ్యతలన్నీ తమపై పడతాయంటున్నారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్రం దివాలా
ధర్మవరం: సీఎం చంద్రబాబు అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పలువురు మేధావులు, విద్యార్థి సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇందుకోసం ప్రజలంతా సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న వైనంపై చర్చించేందుకు శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వివిధ పార్టీల నాయకులు, మేధావులు, కుల సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. తొలుత బీఎస్పీ నుంచి సాకే వినయ్కుమార్, ఎస్ఎఫ్ఐ నుంచి నామాల నాగార్జున, ఏఐవైఎఫ్ నుంచి సకల రాజ, ఆర్ఎస్పీ నుంచి మంజుల నరేంద్ర, ఏఐబీఎఫ్ నుంచి పోతలయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగం నుంచి అమర్నాథ్రెడ్డి, ఐటీ వింగ్ నుంచి తిప్పేపల్లి కళ్యాణ్రెడ్డి, లోకేశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి దేవరకొండ రమేష్, చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. అధికారమే పరమావధిగా ఎన్నికల వేళ చంద్రబాబు అలవిగాని హామీలిచ్చారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీని సరిగా అమలు చేయలేదని మండిపడ్డారు. రెండేళ్లుగా ప్రకృతి సహకరించక కరువు తాండవిస్తోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఉద్యోగ అవకాశాలు లేక యువత దిక్కుతోచని స్థితిలో పడిందన్నారు. అయినా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. పేదవారికి గతంలో మాదిరిగా నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బకాయిలు పెండింగ్లో ఉండటంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. అన్నివర్గాలకూ మోసం.. ఎన్నికలకు ముందు ‘సూపర్సిక్స్’ పథకాలతో ప్రజలకు ఆశలు చూపిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ యువతకు ప్రతినెల రూ.3 వేలు భృతికీ మంగళం పాడారన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు...గతంలో ఉన్న పింఛన్లను తొలగించి పేదలకు అన్యాయం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకుండా చేశారన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రచారానికే పరిమితయ్యాయని మండిపడ్డారు. కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.40 వేలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పిన చంద్రబాబు... అందులో సగం కూడా ఇచ్చిన పాపన పోలేదన్నారు. చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారగా... రెండేళ్లలోనే రాష్ట్రం 3 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైందని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచి ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షలకు అమ్ముకున్న నీచ ప్రభుత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసపూరిత పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే నినాదంతో ఈనెల 12న ధర్మవరంలో నిరసన కార్యక్రమం చేపట్టామని, పార్టీలకతీతంగా ప్రజలందరూ తరలిరావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఉనికి కోల్పోయిన విద్యారంగానికి చేయూత ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందించి పేద విద్యార్థులను ఆదుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి, లేకపోతే తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. – నామాల నాగార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రజలంతా సంఘటితం కావాలి సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. అభివృద్ధి పేరుతో అమరావతిలో సంపదను తన వారికే దోచి పెట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి విధానాలు, ఎన్నికల హామీల అమలు కోసం అందరం కలసి సంఘటితమై పోరాటం చేద్దాం. – సాకే వినయ్ కుమార్, బీఎస్పీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. మెగా డీఎస్సీలోనూ ఉద్యోగాలు అమ్ముకున్నారు. చంద్రబాబు మోసంపై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి శ్రీకారం చుడుతాం. – అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ విద్యార్థి విభాగం సంక్షేమ పథకాలకు మంగళం.. దోపిడీకి శ్రీకారం ఎన్నికల హామీలన్నీ విస్మరించి దారుణ మోసం ఆర్థిక మాంద్యంతో నరకం చూస్తున్న జనం చంద్రబాబు హామీల అమలు కోసం ప్రజలందరూ సంఘటితం కావాలి రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మేధావుల పిలుపు 12న ధర్మవరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం -
12 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ 12 మండలాల పరిధిలో వర్షం కురిసింది. పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 18.6 మి.మీ, రొళ్ల మండలంలో 15.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నల్లమాడ మండలంలో 11.2 మి.మీ., పెనుకొండ 7.4, ధర్మవరం 7.2, హిందూపురం 6.4, సోమందేపల్లి 4.2, అమరాపురం 3.4, రామగిరి 3.2, తలుపుల 2.0, గాండ్లపెంట 2.0, కదిరి మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 12 మండలాల పరిధిలో ఒక్కరోజే 82.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఎఫ్పీఓలను బలోపేతం చేయాలి ప్రశాంతి నిలయం: రైతు ఉత్పత్తి దారుల సంఘాలను(ఎఫ్పీఓలు) ఆర్థికంగా బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎఫ్పీఓ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎఫ్పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. సమావేశంలో డీఏఓ నారాయణ నాయక్, బ్యాంకు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఎఫ్పీఓల సీఈఓలు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ దరఖాస్తు గడువు పొడిగింపు రామగిరి: స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల (2026–27 విద్యా సంవత్సరం) దరఖాస్తు గడువును ఈనెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రవేశాల వివరాలకోసం 9391878837, 9885527674 నంబర్లలో సంప్రదించాలన్నారు. జేసీ ప్రభాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సాక్షి టాస్క్ఫోర్స్: తరచూ నోటికొచ్చినట్లు మాట్లాడే టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు బయటకు వస్తే తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ పల్లెల్లో గొడవలకు ఆజ్యం పోసేలా మాట్లాడారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో శనివారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో జేసీ మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారులు పోటీ చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని, అయితే తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం అలా పోటీ చేయనిచ్చే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు జెండా పట్టుకొని వస్తే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరన్నారు. పెద్దవడుగూరు మండలంలోని వైఎస్సార్సీపీ నేతలు గూడూరు సూర్యనారాయణరెడ్డి, ఎద్దుల శరభారెడ్డి, భీమునిపల్లి రామచంద్రారెడ్డి, మేడిమాకులపల్లి చితంబరరెడ్డిలను తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వారు ఎన్నికల్లో కలుగజేసుకోకుండా భయపెట్టాలన్నారు. -
సీకేపల్లి తహసీల్దార్ స్వామిభక్తి
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ఎన్నికల నిబంధనలన్నీ పాటించేలా చూడాల్సిన తహసీల్దారే వాటిని ఉల్లంఘించారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతల వద్ద స్వామిభక్తిని చాటుకున్నారు. వేదిక పంచుకుని... ప్రత్యేక ఓటరు నమోదు (సర్) కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బీఎల్ఏల ఇన్చార్జ్ ఫణికుమార్తో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులను తహసీల్దార్ సురేష్కుమార్ వేదికపైకి ఆహ్వానించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇందుకు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు అభ్యంతరం తెలిపారు. నిబంధనలు ప్రకారం ఇటువంటి సమావేశాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా అందరిని సమానంగా చూడాలన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తహసీల్దార్ తీరుకు వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు నిరసన తెలియజేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తహసీల్దార్తో పాటు టీడీపీ నాయకులు దీనిని పట్టించుకోకుండా వ్యవహరించటంతో వారంతా సమావేశాన్ని బహిష్కరించారు. ఈ ఘటనపై స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు సీఈఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు చింతా మధుసూదన్, మల్లెల నరసింహులు, కర్ర కిష్టప్ప తెలిపారు. ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనేనిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత తహసీల్దార్పై ఉంటుంది. కానీ ఆయనే ఓ రాజకీయ పార్టీ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వేదికపై కుర్చోబెట్టుకొని బీఎల్ఏల సమావేశం నిర్వహించటం ముమ్మాటికీ నిబంధనలు ఉల్లంఘించడమే. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి. సమావేశాల్లోనే అధికారులు ఇలా వ్యవహరిస్తే ఓటరు నమోదు ప్రక్రియలో ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తారోననే అనుమానం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ బీఎల్ఏల ఇన్చార్జ్ బీఎల్ఏల సమావేశంలో టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఏకంగా వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్న వైనం నిరసనగా సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ బీఎల్ఏలు -
రెచ్చిపోతున్న కేటుగాళ్లు
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గాండ్లపెంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.వేలల్లో డబ్బులు దండుకుని పరారయ్యాడు. ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తి మండల పరిధిలోని పెడపల్లిలో ఇద్దరితో రూ.1.50 లక్షలు చొప్పున ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. విద్యుత్శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడని, ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా.. డబ్బులు వెనక్కి ఇవ్వలేదని బాధితులు వాపోయారు.అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి వ్యాపారం పేరులో పలు చోట్ల ప్రజలతో డబ్బులు తీసుకుని పరారయ్యాడు. కణేకల్లు, నల్లచెరువు, సోమందేపల్లి మండలాల్లో మోసాలు బయట పడ్డాయి. రామగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్రతి నెలా పింఛన్లు ఇప్పిస్తానని పలువురితో డబ్బు వసూలు చేసి కనిపించకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి మోసగాడిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. సాక్షి,పుట్టపర్తి: హైటెక్ యుగంలో మోసాలు కూడా సరికొత్తగా చేస్తున్నారు కొందరు దుండగులు.అమాయకులను టార్గెట్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో కొందరు, అధిక వడ్డీ ఆశ చూపి మరికొందరిని ట్రాప్ చేసి అందినకాడికి దోచేస్తున్నారు. వ్యాపారం పేరుతో భారీ రాయితీలు ప్రకటించడం, ఖరీదైన వస్తువులు తక్కువ ధరకే వస్తాయని, సగం ధరకే భూమి దొరుకుతోందని ఇలా అవతలివారిని నమ్మిస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు. కారులో ఖరీదైన దుస్తులతో వచ్చి... అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు కారులో తిరుగుతూ ఖరీదైన దుస్తులు ధరించి ముందుగానే డబ్బులు ఖర్చు చేస్తారు. ఒకట్రెండు రోజులు గడిచిన తర్వాత అవతలి వ్యక్తి వద్ద ఉన్న డబ్బుల గురించి ఆరా తీసి.. ఏదో మార్గంలో లాగేయాలని చూస్తారు. ఆ వ్యక్తికి ఏది అవసరమో ఆ పని మీద దృష్టి సారించి.. ఒక్క రోజులో పని పూర్తి చేస్తామని.. కాకపోతే ఖర్చు అవుతుందని నమ్మిస్తారు. సదరు వ్యక్తి డబ్బు తెచ్చి ఇవ్వగానే.. ఒకట్రెండు రోజుల పాటు అధికారి లేరని చెబుతూ ఆ తర్వాత పరారవుతారు. మధ్యవర్తిత్వం చేసిన వారిని ప్రశ్నిస్తున్నా వారు కూడా.. ఆయన అందుబాటులో లేడని.. తనను కూడా మోసం చేశాడని దబాయించి మోసాలకు పాల్పడుతున్నారు. భూ విక్రయాలతో భారీ దందా ఒకే భూమిని ఇద్దరు.. ముగ్గురికి అమ్మి మోసాలకు పాల్పడటం.. సబ్ డివిజన్ కాని భూములను విక్రయించి తగాదాలు సృష్టించి.. డబ్బులు దండుకుని పరారవుతున్న కేసులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాలని నమ్మబలికి వివాదాల్లో ఉన్న భూములను అమ్మి.. సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పుట్టపర్తిలో ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. లోన్లు ఇప్పిస్తామని.. కార్లు కొనిస్తామని.. బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామని ఫేక్ ఫోన్ కాల్స్ చేయడం.. అమాయకుల నుంచి డబ్బులు లాక్కున్న ఘటనలు వెలుగు చూశాయి. అలాగే తక్కువ ధరకే కారు దొరుకుతుందని డబ్బులు వసూలు చేసి కారు కట్టబెడుతారు. అయితే నెలల తిరిగే లోపు యజమానులు వచ్చి కారు తమదేనంటూ దబాయిస్తారు. దొంగ సరుకు.. దోపిడీల్లో తెచ్చిన బంగారం అమ్మి.. జేబులు నింపుకుంటున్నారు. పుట్టపర్తిలో అద్దె ఇంట్లో ఉంటూనే.. ఆ ఇల్లు తమదేనంటూ నమ్మబలికి పలువురితో అప్పు తీసుకుని పరారీ అయిన వ్యక్తులు కూడా కోకొల్లలు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అధిక వడ్డీ ఆశ చూపితే మోసపోవద్దు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను ప్రైవేటు వ్యక్తులు ఇవ్వరనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వ్యాపారం చేయాలంటే తెలిసిన వాళ్లతోనే మాట్లాడండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల గురించి రిజి్రస్టేషన్, రెవెన్యూ కార్యాలయాల్లో సంప్రదించిన తర్వాతనే కొనుగోలు చేస్తే మంచిది. – ఎస్.సతీశ్కుమార్, పుట్టపర్తి, ఎస్పీ -
వ్యవసాయ ప్రణాళిక అమలులో చంద్రబాబు సర్కార్ విఫలమయ్యింది. కీలకమైన ఖరీఫ్లో తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. నైరుతి కూడా వచ్చేస్తోంది. అయితే సకాలంలో విత్తనం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. వేరుశనగ సాగు తగ్గించినట్లు చె
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2026 సాగుకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1.28 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ సేకరించి నిల్వ చేయాలని ఏపీ సీడ్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ 40 శాతం రాయితీపై అందిస్తామని ప్రకటించారు. నిధులు విడుదల చేయకుండా ఉత్తచేతులతో సేకరించడం తమ వల్ల కాదని ఏపీ సీడ్స్ చేతులెత్తేసింది. తీవ్ర ఒత్తిళ్ల మధ్య విత్తన పంపిణీ ప్రక్రియ మూడు రోజుల కిందటే మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలో 10, శ్రీసత్యసాయి జిల్లాలో రెండు... మొత్తం 12 ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి చేసి సరఫరా చేయాలని ఆదేశించారు. కానీ... అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లలో నిల్వ ఉన్న విత్తనకాయలు 20 వేల క్వింటాళ్లు మాత్రమేనని లెక్క వేశారు. ఈ పరిస్థితుల్లో కేటాయించిన మేరకు విత్తనం ఎక్కడి నుంచి సేకరించి నిల్వ చేస్తారో.. సకాలంలో రైతులకు ఎలా అందిస్తారో చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. బకాయిలతోనే విత్తన సమస్య.. గతేడాది ఖరీఫ్, రబీలో పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించడంతో ఏపీ సీడ్స్కు ఇప్పుడు విత్తన సమస్య ఎదురవుతోంది. ఏడాది కాలంగా రూ.90 కోట్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. బకాయిలు చెల్లించకపోతే విత్తనం అందించలేమని చేతులెత్తే పరిస్థితి ఉండటంతో రెండు రోజుల కింద సగం మొత్తం ఇచ్చినట్లు చెబుతున్నారు. రూ.కోట్లలో బకాయిలు పడటంతో తాము వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. అదే బకాయిలు పూర్తి స్థాయిలో గతంలోనే చెల్లించివుంటే రబీలో పండిన వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. గత రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 వేల హెక్టార్లలో పండిన 2.80 లక్షల క్వింటాళ్లకు పైగా వేరుశనగను రైతుల నుంచి కర్ణాటక, తమిళనాడు, బళ్లారి, ఇతర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకుపోయినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనకు విత్తనం కావాలంటే తిరిగి తమిళనాడు, కర్ణాటక, ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఆర్ఎస్కేలకు చేరింది 5 వేల క్వింటాళ్లే రాష్ట్ర ప్రభుత్వం పాతబకాయిలు సగమే చెల్లించడంతో కొందరు మిల్లర్లు మాత్రమే విత్తనశుద్ధి మొదలు పెట్టారు. 12 ప్రాసెసింగ్ ప్లాంట్లలో ఇంకా బెళుగుప్ప, ధర్మవరం, గుత్తి, కదిరి ప్రాంతాల్లో మొదలు కాలేదు. అంతో ఇంతో సొమ్ము వచ్చిందని తెలుసుకున్న ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకుడి ఇంటి దగ్గరకు అప్పులవాళ్లు వచ్చి తాము ఇచ్చిన అసలు, వడ్డీ తీసుకెళ్లారు. అయినా ఇంకా రూ.50 లక్షల వరకు అప్పు మిగలడంతో లబోదిబోమంటూ ఈసారి విత్తనశుద్ధి చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 4 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాలో వేయి క్వింటాళ్లు ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి రైతు సేవ కేంద్రా(ఆర్ఎస్కే)లకు మొత్తం 5 వేల క్వింటాళ్ల విత్తన కాయలు మాత్రమే చేరాయి. పరిస్థితి చూస్తే ఈసారి కూడా కేటాయించిన రైతులకు పూర్తిస్థాయిలో విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాకు 1.28 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు ప్రాసెసింగ్ ప్లాంట్లలో అందుబాటులో ఉన్నది 20 వేల క్వింటాళ్లు బకాయిలు తీవ్ర జాప్యం చేయడంతో కొనలేని పరిస్థితిలో మిల్లర్లు రబీలో పండిన వేరుశనగ ఇతర ప్రాంతాలకు తరలిపోయిన దుస్థితి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి తెప్పించాలని మిల్లర్లు, ఏపీ సీడ్స్పై ఒత్తిడి -
పుస్తకం లేదు.. యూనిఫాం రాదు
పుట్టపర్తి అర్బన్: వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలన్నీ పుస్తకాలు, యూనిఫాం అంటూ హడావుడి చేస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఎక్కడా ఆ సందడి కనిపించడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, సామగ్రి, యూనిఫాం అందిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గొప్పలు చెప్పినా...అవన్నీ నీటిమూటలేనని తెలుస్తోంది. ఇప్పటివరకూ తొలి విడతలో కేవలం కొన్ని పుస్తకాలు పంపిన ప్రభుత్వం... యూనిఫాం, షూ తదితర వాటి గురించి నోరెత్తడం లేదు. దీంతో పేద పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. గత ప్రభుత్వంలో అన్నింటినీ ఒకే సారి విద్యార్థులకు అందజేయడంతో మొదటి రోజే ఆనందంగా పాఠశాలలకు వచ్చి సంతోషంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్, యూనిఫారం, షూ తీసుకెళ్లేవారు. ఈసారి మాత్రం అన్నీ ప్రైవేటుగా కొనాల్సిన దుస్థితి నెలకొంది. అరకొరగా పుస్తకాల సరఫరా.. జిల్లాలోని 32 మండలాల్లో 2012 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 1,22,836 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. వీరిలో 1, 2 తరగతుల విద్యార్థులకు మూడేసి పాఠ్య పుస్తకాల చొప్పున 52,269 పుస్తకాలు, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు 5 పాఠ్య పుస్తకాల చొప్పున 1,61,750 పుస్తకాలు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 పుస్తకాల చొప్పున 1,48,560 పుస్తకాలు, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 7 పుస్తకాల చొప్పున 3, 38, 121 పుస్తకాలు కలిపి మొత్తంగా 7,00,700 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. వీటితో పాటు 6 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. మూడు విడతలుగా వచ్చే పుస్తకాల్లో ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా అరకొరగా పుస్తకాలు పంపారు. దీంతో వాటన్నింటినీ ఎమ్మార్సీలకు చేర్చారు. జగన్ హయాంలో తొలిరోజే ‘విద్యాకానుక’ గత జగన్ సర్కార్ పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్ అందించేది. అందులో పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, వర్క్బుక్కులు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టులు ఉండేవి. అలాగే యూనిఫాం కుట్టుకూలి కూడా ప్రభుత్వమే చెల్లించేది. ఇక 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇచ్చేవారు. నెలరోజుల ముందుగానే విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుని అందుకు తగ్గట్టుగా షూ పంపేవారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడేదికాదు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం...పాఠ్య పుస్తకాలను సైతం సరిగా పంపడం లేదు. రెండేళ్లుగా యూనిఫాం కుట్టు కూలీ డబ్బు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయడం లేదు. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం నేటికీ పాఠశాలలకు పూర్తిస్థాయిలో చేరని పుస్తకాలు మొదటి విడతలో సగం కూడా సరఫరా కాని వైనం యూనిఫాం, షూ మాటే ఎత్తని సర్కార్ -
పర్యావరణ పరిరక్షణకు కృషి
పుట్టపర్తి టౌన్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని ఎద్దుల కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం పుట్టపర్తి విద్యాగిరి ఆర్చ్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించి ‘మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 159 ప్రాంతాల్లో 40 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సామాజిక వన విభాగంలో భాగంగా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని కొండల్లో 40 వేల సీడ్బాల్స్ వేసినట్లు వెల్లడించారు. చెట్లను మనం రక్షిస్తే... చెట్లు మనలను కాపాడుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి హరిత పుట్టపర్తిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, డివిజనల్ అటవీ అధికారి శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. యోగా ఏర్పాట్ల పరిశీలన.. లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న యోగా తరగతుల ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. యోగా శిక్షణకు వచ్చే వారి వాహనాల కోసం ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. యోగా తరగతులు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 7వ తేదీ జరిగే యోగా తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు స్టేజీని సిద్ధం చేయాలన్నారు. శిక్షకులకు, యోగాభ్యాసకులకు అనుకూల వాతావరణం నెలకొల్పాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఎఫ్ఓ, మండల స్పెషల్ ఆఫీసర్ చక్రపాణి, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసులు, రూరల్ సీఐ జనార్దన్, ఎస్ఐ నరేంద్ర, టూరిజం, దేవదాయ, పురావస్తు, రెవెన్యూ శాఖల సిబ్బంది ఉన్నారు. సమష్టి కృషితోనే ‘హరిత పుట్టపర్తి’ సాధ్యం కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ వసతి గృహాలు పచ్చదనంతో కళకళలాడాలి గోరంట్ల: జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల ఆవరణలో వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన... అధికారులతో కలిసి స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి రెడ్డి బాలాజీ, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ జిల్లా అధికారి మోహన్రామ్, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
పుట్టపర్తి అర్బన్: వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ నాలుగు మండలాల పరిధిలో వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం మరోసారి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పుట్టపర్తి, గోరంట్ల, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. ఇక గురువారం రాత్రి గాండ్లపెంట మండలంలో 5.2 మి.మీ, ఎన్పీ కుంట మండలంలో 4.2 మి.మీ, లేపాక్షి మండలంలో 2.0 మి.మీ, కదిరి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాకు వర్ష సూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల రెండు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగిలిన ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి ఒకట్రెండు రోజుల్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో శుక్రవారం పగలు చాలావరకు ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం నార్పల, శింగనమల, ఆత్మకూరు, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, తాడిపత్రి, కూడేరు, శెట్టూరు, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
పరిగి: మెగా డీఎస్సీ అంటూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులను నిండాముంచి దగా డీఎస్సీగా మార్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను డీఎస్సీ అభ్యర్థులు కలిసి గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని చూస్తే... చంద్రబాబు సర్కార్ ఎంత మోసం చేసిందన్న విషయం యావత్ నిరుద్యోగుల్లో కలవరం రేపిందన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని శ్రీరంగరాజుపల్లి పంచాయతీ పాపిరెడ్డిపల్లిలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి తొలుత గ్రామం వరకూ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రతి గడపకూ వెళ్లి కూటమి సర్కార్ హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమను మోసం చేశారని ప్రజలు వాపోయారు. జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుంటామని తెలిపారు. అమరావతి రైతులను మోసం చేశారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా... అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. ఇంకా భూములు కావాలంటూ వారిని బలవంతం చేస్తున్నారన్నారు. ఈ చర్యలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 50 ఏళ్లకే బీసీలకు పింఛన్లు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని నమ్మబలికి.. అందరినీ మోసం చేశారన్నారు. అక్రమాలకు మారుపేరు మంత్రి సవిత.. పరిగి మండలంలో ఇసుక, మట్టి, పెనుకొండలో డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా, విక్రయాలు, భూకబ్జాలు చేస్తున్న సవితకు మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదని ఉషశ్రీచరణ్ అన్నారు. నిజాలు మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి వైఎస్సార్సీపీ తరపున తాను ఎక్కడికై నా వస్తామని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, మురళీమోహన్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థులను నిలువునా మోసం చేసిన చంద్రబాబు సర్కార్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం పాపిరెడ్డిపల్లిలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కొత్తగా ఒక్క పింఛనైనా ఇచ్చారా..? పెనుకొండ రూరల్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రెండేళ్ల పాలనలో కనీసం ఒక్క కొత్త పింఛన్ అయినా ఇచ్చారా.. అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో కూటమి నేతలు తమ అంతరాత్మను అడిగితే తెలుస్తుందన్నారు. శుక్రవారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తయినా చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి తమ జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కనీసం పింఛన్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు మాత్రమే పింఛన్ను బదాలాయిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఆర్థిక భరోసా కరువైందన్నారు. -
డబ్బు ఆశ చూపి దోచేస్తారు
అనంతపురం సెంట్రల్: ‘రూ. లక్షకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తాం.. బ్లాక్ నోట్లను కెమికల్స్ ద్వారా ఒరిజనల్ నోట్లుగా మారుస్తా’మంటూ అమాయక ప్రజలను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను ఎస్ఐ ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన పానుగంటి నాగ శంకర్, కర్నూలు జిల్లా బెలగాల మండలం బ్యాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేష్, కమ్మరి పరుశురాముడు ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో సామాన్య ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు. రూ. లక్షక్ష నిజమైన నగదు ఇస్తే కెమికల్ సాయంతో నకిలీ కరెన్సీని ఒరిజనల్గా మారుస్తామని నమ్మబలికేవారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకొని పరారయ్యేవారు. అనంతపురం జిల్లాతో పాటు కాకుండా నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల ఆచూకీపై సమాచారం రావడంతో తపోవనం సర్వీసు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఘరానా ముఠా అరెస్ట్ రూ.1.35 లక్షలు స్వాధీనం -
కదిరి మున్సిపల్ కమిషనర్గా అజయ్కుమార్
కదిరి: మున్సిపల్ కమిషనర్గా పి.అజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) ఎం.తిరుమల కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ ప్రస్తుతం జిల్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. డిప్యుటేషన్పై ఏడాది కాలానికి ఆయన్ను కదిరి మున్సిపల్ కమిషనర్గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో కదిరి మున్సిపల్ కమిషనర్గా ఉన్న కిరణ్కుమార్ను మాతృశాఖ (హార్టికల్చర్)కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన బదిలీ అనంతరం ఇక్కడే ఏఈగా పని చేస్తున్న వి.సందీప్ ఇన్చార్జ్ కమిషనర్గా ఉన్నారు. ఇద్దరు విలేజ్ సర్వేయర్లు సస్పెండ్ ప్రశాంతి నిలయం/కనగానపల్లి: ‘రీ సర్వే’లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కార్యాలయాలకు తరచూ ఆలస్యంగా వస్తున్న కనగానపల్లి మండలంలోని తూంచర్ల సర్వేయర్ వాణిశ్రీ, కేఎన్ పాళ్యం సర్వేయర్ శ్రీలతపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశాల మేరకు వారిని శుక్రవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి విజయశాంతి తెలిపారు. ప్రభుత్వ కార్యాక్రమాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: జిల్లాలోని 32 కేంద్రాలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎకనామిక్స్–1 పరీక్ష నిర్వహించగా, 1,841 మందికి గాను 1,646 మంది హాజరయ్యారు. 195 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించిన మేథమేటిక్స్–2 పరీక్షకు 1,566 మందికి గాను 1,388 మంది హాజరు కాగా, 178 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. చివరిరోజు 373 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. జూన్ 6వ తేదీన పర్యావరణ విద్య, జూన్ 12న నైతికత, మానవతా విలువలు పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. ఇక వేసవి సెలవులు ముగియడంతో జూన్ 6 నుంచి కళాశాలలు పునః ప్రారంభవుతాయన్నారు. వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ తనిఖీచిలమత్తూరు: మండల పరిధిలోని వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ను డీఈఓ కిష్టప్ప శుక్రవారం తనిఖీ చేశారు. అర్ధంతరంగా ఆగిపోయిన నూతన భవనాన్ని పరిశీలించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డీఈఓకు విన్నవించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1,2 హనుమంతరెడ్డి, సాల్మన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టంగా జీవనం
ఆర్టీసీలో 30 ఏళ్లు డ్రైవర్గా పని చేశా. పెరాలసిస్ రావడంతో రిటైర్మెంట్ తీసుకున్నా. అదనపు ప్రయోజనాల కింద రూ.8 లక్షలు రావాల్సి ఉంది. నాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదాయం లేకపోవడంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. – హనుమంతరెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, కదిరి చేతిలో చిల్లిగవ్వ లేదు కదిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా 14 ఏళ్లు పని చేశా. రెండుసార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. 2021లో రిటైర్మెంట్ పొందా. నాకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేయాల్సి ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. వైద్య ఖర్చులకు ప్రతినెలా రూ.5 వేలు ఖర్చవుతోంది. రూ.11 లక్షల అదనపు మానిటరింగ్ బెనిఫిట్స్ అందజేయాలి. – ఆంజనేయులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి -
ఇద్దరిని బలిగొన్న నిర్లక్ష్యం
గుమ్మఘట్ట: అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. విద్యుదాఘాతంతో మెకానిక్లైన తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన ఆనంద్, రాధమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఆనంద్ (50), చిన్న కుమారుడు తేజ (25) విద్యుత్ మోటర్లు రిపేరీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గుమ్మఘట్ట మండలం కరిసూరయ్యదొడ్డి గ్రామంలో తాగునీటి మోటర్ చెడిపోయింది. దీని రిపేరీ కోసం శుక్రవారం ఆనంద్, తేజను పిలిపించారు. వీరు వాహనం సహాయంతో మోటర్ను వెలికితీసేందుకు ఉపక్రమించారు. మోటర్ పై భాగంలో 11కేవీ విద్యుత్ లైన్ ఉంది. అయితే విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే మోటర్, ఇరన్ పైపు తీస్తుండగా 11కేవీ విద్యుత్లైన్ను తగిలింది. అంతే ఆనంద్, తేజ విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో ప్రాణం విడిచారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన రేవన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రిలో చేర్చారు. తండ్రీకుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో బొమ్మక్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ అధికారులు మోటర్ రిపేరీ సమయంలో విద్యుత్ అధికారుల నుంచి ఎల్సీ తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన తండ్రీకుమారుడు విద్యుదాఘాతంతో తండ్రీకుమారుడు దుర్మరణం పంచాయతీ బోరు మోటర్ మరమ్మతు చేస్తుండగా ఘటన -
అంతులేని వేదన
కదిరి అర్బన్: వారంతా ఏళ్ల పాటు ఆర్టీసీలో పనిచేశారు. చిత్తశుద్ధితో సేవలందించారు. అలాంటి వారు పదవీ విరమణ చేశాక ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. అదనపు ప్రయోజనాలు అందించకుండా చుక్కలు చూపుతోంది. వివరాలు.. ఆర్టీసీలో పనిచేసే సమయంలో అనారోగ్యం బారిన పడడంతో పలువురు పదవీ విరమణ పొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇలాంటి వారు దాదాపు 120 మంది ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ పొందినా ‘అదనపు ప్రయోజనాలు’ అందకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో 30 మంది వరకూ ఇప్పటికే మరణించడం గమనార్హం. జాప్యం.. శాపం మానిటరీ బెనిఫిట్ అందిస్తామంటూ ఇటీవల ప్రభుత్వం జీఓ నంబర్ 58 విడుదల చేసింది. ఆర్టీసీ నిధుల నుంచే రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం చెల్లించాలని మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు సెటిల్మెంట్స్ ఆడిట్ చేయించి నూతన జీఓ మేరకు బెనిఫిట్స్ ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం రిటైర్డ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అందని అదనపు ప్రయోజనాలు కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూపులు కుటుంబ జీవనానికి అష్టకష్టాలు -
గంగప్పకు అండగా పోస్టుకార్డు ఉద్యమం
కదిరి అర్బన్: ఆర్టీసీ డ్రైవర్గా 2019లో పదవీ విరమణ పొందిన గంగప్పకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శుక్రవారం ఎన్ఎంయూ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగప్ప తన పెన్షన్ పేపర్లను 2019లోనే సమర్పించినా మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. హైదరాబాద్లోని పీఎఫ్ కార్యాలయ సిబ్బంది చేసిన తప్పునకు ఆయనను బలి చేస్తున్నారన్నారు. పెన్షన్ రాక గంగప్ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు హరిమోహన్, అబ్బాస్, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ అనంతపురం: పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఈ.భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ ఆవశ్యకతను గుర్తించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ఒకరోజుకే పరిమితం కారాదన్నారు. నిరంతర ప్రక్రియ కావాలన్నారు. -
చెత్తతో సంపద కాదు కాలుష్యం !
పుట్టపర్తిలోని చెత్తను బ్రాహ్మణపల్లి పొలాల వద్ద కాల్చివేసిన చెత్త కొత్తచెరువులో వృథాగా ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రం పుట్టపర్తి మండలం కప్పలబండలో చెత్తను కాల్చివేసిన దృశ్యం పుట్టపర్తి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించేందుకు గ్రీన్ అంబాసిడర్లు (ప్రస్తుతం క్లాప్ మిత్రలు) నియమించి నెల నెల వేతనాలను అందిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరలకు విక్రయించి ఆదాయాన్ని పొందేవారు. ఇటు రైతులకు అటు పంచాయతీలకు లాభదాయకంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాగానే గ్రీన్ అంబాసిడర్లను ఉన్న ఫలంగా తొలగించి తమకు అనుకూలమైన వారిని చేర్చుకొని క్లాప్ మిత్రులుగా పేరు మార్చి వారితో పనులు చేయిస్తున్నారు. అయితే సచివాలయ సిబ్బందిని సచివాలయాల్లో ఉండనీయకుండా వేర్వేరు విధులకు వాడుకోవడంతో చెత్త సేకరణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెత్తను తగలబెడుతున్న క్లాప్ మిత్రలు జిల్లాలో 467 పంచాయతీలు ఉండగా అందులో 432 చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,180 మంది క్లాప్ మిత్రలు పని చేస్తున్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.10 వేల వరకూ వేతనాలు చెల్లిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.1.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు.అయితే వీరంతా చేయాల్సిన పనులు చేయకుండా లక్ష్యానికి విరుద్ధంగా పని చేస్తుండడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. రెండేళ్లుగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన సిబ్బంది వీధులకే పరిమితమయ్యారు. సేకరించిన తడి, పొడి చెత్తను ప్రధాన రహదారుల పక్కన ఖాళీ స్థలాల్లో పోసి తగులబెడుతున్నారు. దీంతో వారానికి రెండు, మూడు సార్లు అక్కడ కాలుష్యం పెరిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడి, పొడి చెత్తతో పాటు కవర్లు, డైపర్లు, మిగిలిన కూరలు, అన్నం తదితరాలను ఒక చోట పోస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆయా మండలాల ఎంపీడీఓలకు ఈ విషయం తెలియజేసినా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో ప్రతి నెలా రూ.1.18 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందంటున్నారు. ఇదే కాకుండా వాళ్లకు ఇచ్చిన వాహనాలు, చెత్త సంపద కేంద్రాల స్థలాలకు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పట్టించుకోని అధికారులు జిల్లాలోని గ్రామ పంచాయతీలతో పాటు పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర తదితర మున్సిపాలిటీల్లో సైతం చెత్తను ఎక్కడ పడితే అక్కడ చెత్తను పోగుచేసి తగలబెడుతున్నారు. మున్సిపాలిటీలకు అత్యాధునిక వాహనాలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా చెత్తను డంపింగ్ యార్డులకు తరలించకుండా రోడ్డు పక్కన, గుట్టల్లో, పొలాల్లో , ఖాళీ స్థలాల్లో అంటిస్తున్నారు. దీంతో అక్కడ రోజుల తరబడి పొగ వస్తూ కాలుష్యం పెరిగిపోతోంది. సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెత్తతో సంపద కేంద్రాలకు తరలని చెత్త ఇళ్లు, వీధుల్లో సేకరించిన చెత్తను కాల్చేస్తున్న క్లాప్ మిత్రలు కాలుష్యం పెరిగిపోతోందని సర్వత్రా ఆందోళన పట్టించుకోని అధికారులు చెత్తతో సంపద తయారు చేసి తద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోతోంది. సేకరించిన చెత్త సంపద కేంద్రాలకు కూడా చేరడం లేదు. చెత్తా చెదారాన్ని ఒకే చోటికి చేర్చి పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. దీంతో చెత్త నుంచి సంపద కాదు కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పంచాయతీల సంఖ్య : 467 చెత్త సంపద కేంద్రాలు : 432 క్లాప్ మిత్రల సంఖ్య : 1,180 ప్రతి నెలా వారికి చెల్లిస్తున్న వేతనం : దాదాపు 1.18 కోట్లు చెత్త కాల్చకుండా చర్యలు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న క్లాప్ మిత్రలకు తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తాం. చెత్తను సంపద కేంద్రాలకు కాకుండా ఖాళీ ప్రదేశాల్లో అంటించకుండా చర్యలు తీసుకుంటాం. చెత్త నుంచి సందప సృష్టించేలా అధికారులందరినీ సమన్వయం చేస్తాం. తద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా చూస్తాం. – సమత, డీపీఓ -
విద్యార్థుల సృజన అద్భుతం
హిందూపురం టౌన్: తమ ఆలోచనలకు పదును పెట్టి గోడలపై అద్భుతమైన చిత్రాలను గీసిన విద్యార్థుల సృజన అద్భుతమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కొనియాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో ‘స్క్రాప్ థీమ్ పార్కు’ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శుక్రవారం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో సామూహిక వాల్ ఆర్ట్ పెయింగ్ కార్యక్రమం నిర్వహించగా, పిల్లలతో కలిసి కలెక్టర్ గోడపై బొమ్మలు వేశారు. కలెక్టర్ ప్రతి ఒక్క చిన్నారితో మాట్లాడి... వారు గీస్తున్న చిత్రాల వెనుక ఉన్న కాన్సెప్ట్ను తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారు చూపిన చొరవను, వినూత్న కాన్సెప్ట్ను అభినందించారు. దాదాపుగా 400 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా తరలివచ్చి పర్యావరణంపై తమకున్న ఆలోచనలను, అద్భుతమైన అభిప్రాయాలను పార్కు గోడలపై రంగురంగుల చిత్రాల రూపంలో తీర్చిదిద్దారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మెప్మా పీడీ నాగరాజు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. వీరాపురంలో పర్యటించిన కలెక్టర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో పర్యటించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే వీరాపురం గ్రామంలోని సైబీరియన్ పక్షులను వీక్షించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను పరిశీలించారు. విద్యార్థులకు బైనాక్యులర్లు అందించి, వాటి ద్వారా పక్షులను ఎలా చూడాలో స్వయంగా వివరించారు. అటవీ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీడ్ బాల్స్ స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. సీడ్ బాల్స్ తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించి, వాటిని పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ షాపును కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పెనుకొండ అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాసులు రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గోడలపై పెయింట్ చూసి ఆశ్చర్యపోయిన కలెక్టర్ ‘పురం’లోస్క్రాప్ థీమ్ పార్కు పనుల పరిశీలన విద్యార్థులతో కలిసి పెయింటింగ్ వేసిన వైనం -
ఎస్ఐఆర్ను పక్కాగా చేపట్టాలి
ప్రశాంతినిలయం: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026ను పక్కాగా చేపట్టాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల ప్రాధాన్యత, సవరణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, రెండు చోట్ల నమోదులు తదితర వాటిని గుర్తించి కచ్చితమైన ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఫారాల నిర్వహణ ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ మృత్యువాతకదిరి టౌన్: ఆటో, బొలెరో ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందిన ఘటన కదిరి ఆర్టీఓ కార్యాలయ సమీపంలో జరిగింది. శుక్రవారం కదిరికి చెందిన ట్రాన్స్జెండర్ షామీర్ (21), మరో ఐదుగురు ఆటోలో అనంతపురం వైపు బయలుదేరారు. కుటాగుళ్ల వద్ద ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఆటోను బొలెరో వాహనం ఎదు రుగా ఢీకొంది. తీవ్ర రక్తగాయాలైన షామీర్ను వెంటనే కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. బాధ్యతల స్వీకరణఅనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జీవిగారి శివప్రసాద్ శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కమ్మన్న, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతాపరెడ్డి, జయరామ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సెస్సు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. అధికారులు, సిబ్బంది ఒకేతాటిపై నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ● తాత్కాలిక (ఎఫ్ఏసీ) కార్యదర్శిగా సేవలందించిన కమ్మన్నను రవికుమార్ నాయుడు, రామాంజనేయులు, గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు సన్మానించారు. విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు (38) అలియాస్ రామన్న విద్యుత్ స్తంభం నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు ప్రైవేట్ విద్యుత్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెద్దవడుగూరు మండలం జీ–వెంకటాం పల్లిలోని ఓ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును గుత్తి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మచ్చుకత్తితో వ్యక్తి వీరంగం డీ హీరేహాళ్ (రాయదుర్గం): డీ హీరేహాళ్ మండలంలోని మురడిలో వీరేష్రెడ్డి అనే వ్యక్తి మచ్చుకత్తితో వీరంగం సృష్టించాడు. వివరాలు.. గురువారం రాత్రి గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి, వీరేష్రెడ్డి మధ్య స్థలం విషయంపై ఘర్షణ జరిగింది. స్థానికుడు నరసింహారెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వీరేష్రెడ్డి రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే, చీకటి పడ్డాక తప్పతాగి వచ్చిన వీరేష్ రెడ్డి మచ్చు కొడవలి పట్టుకుని బీభత్సం సృష్టించాడు. ‘మీ అంతుచూస్తా..ఈ రోజు నరికే వెళతా’నంటూ హల్చల్ చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీ హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి గ్రామానికి చేరుకుని విచారించారు. వీరేష్రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఇకపై ఏటా అద్దె భారం
● మున్సిపల్ ఆస్తుల అద్దె వసూళ్ల విధి విధానాల్లో మార్పులు ● అంతస్తుల వారీగా అద్దెలు ● గతంలో మూడేళ్లకోసారే పెంపుదల కదిరి: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల ఆస్తులపై వసూలు చేసే అద్దెలు, లీజులకు సంబంధించి చంద్రబాబు సర్కారు విధి విధానాలను మార్పు చేసింది. ఇప్పటి దాకా మూడేళ్లకొకసారి మాత్రమే అద్దెలు పెంచేవారు. ఇకపై ఏటా 7 శాతం అద్దెలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ ఎంఎస్.నెం.92)జారీ చేసింది. అద్దె గదుల లీజ్ గడువు ముగియగానే కొత్త రూల్స్ అమలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్ విలువను బట్టి.. జిల్లాలో కదిరి, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి పట్టణంలోనూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అందులోని అద్దె గదులను పలువురు వ్యాపారులు వేలం పాట ద్వారా వాటిని దక్కించుకొని తమ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటి అద్దెలు మూడేళ్ల కొకసారి మాత్రమే కేవలం 33.5 శాతం పెంచి ఆ అద్దె గదులను వీరికే కేటాయిస్తూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏటా 7 శాతం మాత్రమే పెంచుతామని పైకి చెబుతున్నా..ఇందులో పెద్ద మోసమే దాగి ఉంది. మున్సిపాలిటీకి సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్లలోని అద్దె గదులను ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాణిజ్య దుకాణాల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకొని అందులో 10 శాతం కనీస అద్దెగా నిర్ణయిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని తర్వాత వేలం పాట పెడతారు. వేలంలో హెచ్చు పాటదారుడికి ఆ దుకాణం కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి ఏటా 7 శాతం అద్దెను పెంచుతూ పోతారు. పెంపును వ్యతిరేకిస్తే లీజ్ రద్దు: మున్సిపల్ అద్దె గదులకు సంబందించి 7 శాతం పెంపును ఎవరైన వ్యతిరేకిస్తే అలాంటి వారి లీజ్ను రద్దు చేసి, తిరిగి వేలం పాట వేసి, ఇతరులకు కేటాయిస్తారు. కోర్టును ఆశ్రయించేందుకు కూడా అవకాశం లేకుండా ముందే సదరు కాగితాల్లో సంతకాలు చేయించుకుంటారు. పై అంతస్తుల్లో ఉన్న అద్దె గదులకు పెద్దగా డిమాండ్ లేని కారణంగా గ్రౌండ్ ఫ్లోర్తో పోలిస్తే మొదటి అంతస్తుకు 20 శాతం, రెండు, ఆ పై అంతస్తుల్లో ఉన్న గదులకు 30 శాతం అద్దె తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల వరకూ మున్సిపాలిటీలే నిర్ణయం తీసుకుంటాయి. 4 నుంచి 25 ఏళ్ల లీజ్కు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
చివరి క్షణంలో ఉద్యోగం చేజారిపోయింది!
అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టుల భర్తీలో నాకు అన్యాయం జరిగింది. డీఎస్సీ–25 నోటిఫికేషన్లో ఎస్సీ–3 కేటగిరీ కింద ఐదు జనరల్ పోస్టులు చూపించారు. అందుకే 5వ అభ్యర్థిగా ఉన్న నాకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సంతోషించాను. అయితే చివరికి నాలుగు పోస్టులు భర్తీ చేసి, ఐదో పోస్టు స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. దీంతో నాకు ఉద్యోగం చేజారిపోయింది. 57 మార్కులు సాధించి 219 మెరిట్ ర్యాంకుతో ఎస్సీ–3 కేటగిరీలో 5వ అభ్యర్థిగా నిలిచా. ‘ఒకవేళ ఆ పోస్టు స్పోర్ట్స్ కోటాకు కేటాయించాల్సి ఉంటే నోటిఫికేషన్లోనే స్పష్టంగా చూపించాల్సింది. ఐదు పోస్టులూ ఎస్సీ–3 కేటగిరీలోనే చూపించి, తర్వాత ఒక పోస్టు స్పోర్ట్స్ కోటాకు మళ్లించడంతో నష్టపోయా. ఎస్జీటీ వైపు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ఎన్నో త్యాగాలు చేసి, రాత్రింబవళ్లు కష్టపడి చదివా. ఉద్యోగం చేతికొచ్చిందనుకునే సమయంలో ఇలా జరగడం చాలా బాధ కలిగించింది. నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో కూడా ఉద్యోగం వస్తుందని భావించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ చివరి క్షణంలో పోస్టు భర్తీ విధానం మారడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – జూటూరు రెడ్డప్ప, డీఎస్సీ–25 అభ్యర్థి, అనంతపురం -
ధరల పెంపుదలతో సామాన్యులపై భారం
అనంతపురం టవర్క్లాక్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. పెంచిన ధరలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో గురువారం సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తరచూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అధికంగా పెంచి ప్రజలపై గుదిబండ వేస్తోందన్నారు. ధరలు స్థిరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిపాలన కన్నా ప్రజల నాశనమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, వేమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నాయకులు నాగరాజు, వీరానారాయణ, మల్లికార్జున, వేమన, శ్రీరాములు, కేశవ రెడ్డి, నారాయణ స్వామి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్ గౌడ్, కుళ్లాయి స్వామి, చిరంజీవి, రామాంజనేయులు, పెద్దయ్య, నాగార్జున పార్వతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యధర్మవరం అర్బన్: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని చిన్నూరు లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. చిన్నూరుకు చెందిన శ్రీనివాసులు భార్య పుష్ప (33) గతంలో అనంతపురంలోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేది. ఇంటి వద్దనే ఉంటూ భర్త, పిల్లలతో ఉంటోంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త బేల్దారి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య మృతి చెందిందని తెలిసిన వెంటనే భర్త స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పుష్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గేటు వద్ద గురువారం ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు.. వడ్రహొన్నూరుకు చెందిన విజయ్, భాస్కర్ ట్రాక్టర్లో మట్టి నింపుకొని అనంతపురం రహదారి వైపు వెళ్తుండగా.. అదే సమయంలో రాయదుర్గం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ రెండు భాగాలుగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో విజయ్,భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అర్బన్ సీఐ జయానాయక్ పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అదృశ్యమైన మహిళ శవం మంత్రాలయంలో లభ్యం
హిందూపురం: పట్టణంలోని సత్యనారాయణ పేటకు చెందిన నేత్రావతి (35) శవం మంత్రాలయం తుంగభద్ర నది వద్ద గురువారం లభ్యమైంది. ఆరు రోజుల క్రితం నేత్రావతి కనిపించలేదని ఆమె కుమారుడు మురళి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన నేత్రావతి మృతదేహం లభ్యమైనట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. మంత్రాలయం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యులు అక్కడే దహన సంస్కారాలు చేస్తున్నట్లు తెలిసింది. రూ.30 లక్షల విలువైన కొరియర్ వస్తువులు చోరీ పెనుకొండ రూరల్: కొరియర్ వాహనం నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇతర విలువైన వస్తులు చోరికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కియా ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. బ్లూ కార్టు కొరియర్ వాహనం గత నెల 29న బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, రూ.30 లక్షల విలువజేసే కొరియర్ వస్తువులు చోరీకి గురయ్యాయి. వాహన డ్రైవర్ వేణు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కియా ఎస్ఐ తెలిపారు. ప్రాథమిక దశలో విద్యాభ్యాసం కీలకంపుట్టపర్తి: విద్యార్థి జీవితం బంగారు మయం కావాలంటే ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం అందించాలని జిల్లా విద్యాధికారి కిష్టప్ప పేర్కొన్నారు. గురువారం కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం ఆయన పాల్గొని, మాట్లాడారు. జిల్లాలో ఏడు కేంద్రాల్లో శిక్షణ ప్రారంభమైందన్నారు. ఒకటి, రెండు తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారి శిక్షణ తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని డిజైన్ చేశారన్నారు. ఈ విధానాన్ని పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేస్తే విద్యార్థుల జీవితం బంగారు మయమవుతుందన్నారు. ఏడి లాజరు మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యాలైన చదవడం, రాయడం పిల్లలకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఫ్యాక్షన్కు దూరంగా ఉండండి
ధర్మవరం రూరల్: కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలని ఎస్పీ ఎస్.సతీష్కుమార్ సూచించారు. గురువారం ఆయన మండలంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన ఓబుళనాయనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పాత కక్షలు, కుటుంబ విభేదాలు, ఫ్యాక్షన్ గొడవలు గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారతాయన్నారు. ప్రతీకార భావాలు, హింసాత్మక చర్యలు వ్యక్తులకే కాకుండా కుటుంబాల భవిష్యత్ను కూడా దెబ్బ తీస్తాయన్నారు. యువత చెడు అలవాట్లకు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, ఉపాధి వైపు ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా...శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు ఆయన గ్రామంలో పర్యటించి మహిళలు ప్రస్తావించిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలన్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ రాజశేఖర్, తదితరులు ఉన్నారు. ఓబుళనాయనపల్లి గ్రామస్తులతో ఎస్పీ సతీష్కుమార్ -
డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా 27 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఇటీవల డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన ఎ.హరికుమార్ను బాపట్ల ఆర్డీఓగా నియమించారు. ప్రస్తుతం ఈయన రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. అలాగే పి.విజయకుమారిని శ్రీసత్యసాయి జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీగా నియమించారు. ప్రస్తుతం ఈమె రాప్తాడు తహసీల్దారుగా ఉన్నారు. హెచ్ఎల్ఎల్సీ (భూసేకరణ) ఎస్డీసీగా ఉన్న ఎం.రామ్మోహన్ను అనంతపురం జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీగా నియమించారు. హెచ్ఎల్ఎల్సీ (భూసేకరణ) ఎస్డీసీగా వి.వెంకటనారాయణను నియమితులయ్యారు. లింగ నిర్ధారణ చట్టవిరుద్ధం ప్రశాంతి నిలయం: లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో డీఎల్ఎంఎంఏ సమావేశాన్ని నిర్వహించారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, అందుకు సహకరించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కొత్తగా నాలుగు అల్ట్రా సౌండ్, స్కాన్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేశారు. అలాగే మూడు పాత సెంటర్లను రెన్యూవల్ చేశారు. మార్పులు చేర్పులు, నూతన పరికరాల కొనుగోలు చిరునామా మార్పు కోసం అందిన 4 దరఖాస్తులను ఆమోదించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ప్రోగ్రాం అధికారులు, సబ్ డివిజనల్ అఽధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డెమో సుబ్రహ్మణ్యం, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. 10 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకూ జిల్లాలోని 10 మండలాల్లో వర్షం కురిసింది. మొత్తంగా 91.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిలమత్తూరు మండలంలో 28.6 మి.మీ, గోరంట్ల 24.2 మి.మీ, లేపాక్షి 10.4, నల్లచెరువు 10.2, గాండ్లపెంట 3.8, సీకేపల్లి 3.4, కదిరి 3.2, ఓడీచెరువు 3.2, అమడగూరు 2.4, తనకల్లు మండలంలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అర్హులందరికీ రుణాలివ్వాలి ● బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: అర్హులందరికీ నిర్ణీత గడువులోపు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. అలాగే సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి త్రైమాసిక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశం గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. జిల్లాలోని బ్యాంకింగ్ ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు మొత్తంగా రూ.12,051 కోట్లు డిపాజిట్లు సేకరించాయని, రూ.22,009 కోట్ల మేర రుణాలు ఇచ్చాయన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలన్నారు. అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్, పీఎంఎఫ్ఎంఈ పథకాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఫణీంద్ర కుమార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
జిల్లా బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: శ్రీ సత్యసాయి జిల్లా ఫుట్బాల్ బాలికల సబ్ జూనియర్స్, జూనియర్స్ జట్లను గురువారం ఎంపిక చేశారు. పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా జట్ల ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు జేవీ అనిల్కుమార్ మాట్లాడుతూ సబ్ జూనియర్స్, జూనియర్స్ జట్లకు సంబంధించి మొత్తం 50 మందితో ప్రాబబుల్స్ ఎంపిక జరిగిందని, వీరికి టీమ్ క్యాంప్ నిర్వహించి తుది జట్ల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ బాలికల జూనియర్స్, సబ్ జూనియర్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్ సలీం, ట్రెజరర్ శేఖర్, సభ్యులు ఆజాద్ బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు లోక్నాథ్, రామాంజనేయులు, సురేష్ బాబు, రాఘవేంద్ర, కదిరప్ప, వినోద్, శివయ్య, శివప్రసాద్, కోచ్లు దుర్గాప్రసాద్, కృష్ణవేణి, జగదీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవల్లీ.. నీకేమైంది తల్లీ!
హిందూపురం: మండలంలోని కిరికెర బసవన్నపల్లికి చెందిన దుర్గా, చిరంజీవి దంపతుల నాలుగేళ్ల చిన్నారి శ్రీవల్లి. రెండు రోజుల క్రితం అదృశమైంది. తల్లిదండ్రులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీవల్లి కోసం పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత చెరువులో శ్రీవల్లి శవం తేలియాడుతూ కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చిన్నారి శవాన్ని వెలికితీశారు. శవపంచనామా చేసిన అనంతరం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షల నిమిత్తం తరలించారు. చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు మమ్మరం చేశారు. శ్రీవల్లి శవమై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, చిన్నారికి నీటిలో ఆడుకోవడమంటే ఇష్టమని, పలుసార్లు చెరువు వద్దకు వెళ్లి ఆడుకునేదని, ఏమైనా చెరువు వద్దకు వెళ్లి జారి పడిపోయిందా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పర్మిషన్ లేకుండానే ప్రవేశాలు!
సాక్షి, టాస్క్ఫోర్స్: ధర్మవరంలో రఘు మెడ్జ్ స్కూల్, ఫజుల్లా స్కూల్, రిషి విద్యాలయ హైస్కూల్ పేరుతో కొత్తగా మూడు పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయా యాజమాన్యాలు పాఠశాల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు తెచ్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు. సైనిక్, నవోదయ కోచింగ్, ఏసీ క్యాంపస్ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి రూ.వేలకు వేలు ఫీజులు చేసుకుంటున్నారు. నిబంధనలకు నీళ్లు.. ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్న సదరు మూడు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలాయి. ప్రభుత్వం నుంచి యూడైస్ నంబర్ రాకుండానే అడ్మిషన్లు చేపట్టాయి. పైగా సమీపంలోని విద్యా సంస్థల నుంచి ఎన్ఓసీ కూడా తెచ్చుకోలేదు. నిబంధనల ప్రకారం నూతనంగా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తే సదరు పాఠశాల నుంచి కనీసం కిలోమీటర్ వరకు మరో ప్రాథమిక పాఠశాల ఉండకూడదు. అలాగే హైస్కూల్కు అయితే 3 కిలోమీటర్లలోపు మరో పాఠశాల ఉండకూడదు. కానీ ఈ నిబంధనను కొత్తగా ఏర్పాటైన పాఠశాలలు యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు ఆయా పాఠశాలలపై హైకోర్టులో కేసు వేశారు. అయితే వేసవి సెలవులు ఉండటంతో కేసు విచారణకు రాలేదు. ఈలోపే నూతన పాఠశాలల యాజమాన్యాలు హడావుడిగా అడ్మిషన్లు చేసేస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు.. కేవలం పాఠశాల ఏర్పాటుకు అనుమతి తెచ్చుకుని అడ్మిషన్లు చేస్తున్నా..జిల్లా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి పాఠశాల ఏర్పాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చినా... నిభందనలు పాటించక పోతే గుర్తింపు ఇవ్వదు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఈ మూడు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. అయినా వారు అడ్మిషన్లు చేస్తున్నారు. ఆ తర్వాత గుర్తింపు రాకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. ‘రిషి’ మాయాజాలం.. రిషి విద్యాలయాన్ని ఈ ఏడాది హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అయితే ఈ పాఠశాల క్యాంపస్ సీకేపల్లి మండలంలో ఉంది. మరో హాస్టల్ క్యాంపస్ ధర్మవరం పరిధిలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్కు 8, 9వ తరగతులకు మాత్రమే పర్మిషన్ తెచ్చుకుని.. మిగతా తరగతులకూ అడ్మిషన్లు చేస్తున్నారు. ధర్మవరంలో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం ప్రభుత్వ గుర్తింపులేకుండానే ముందస్తు అడ్మిషన్లు మామూళ్ల మత్తులో కళ్లు మూసుకున్న విద్యాశాఖ అధికారులు ఏడాది క్రితం బత్తలపల్లిలో ‘ఫినిక్స్ గ్లోబల్ స్కూల్’ పేరుతో కొందరు ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతులు రాకుండానే ఐఐటీ ఫౌండేషన్...ఏసీ క్యాంపస్.. అంటూ ప్రచారం ఊదరగొట్టారు. దీంతో 150 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. ఆ తర్వాత కూడా అనుమతులు రాకపోవడంతో ఆరు నెలల తర్వాత బోర్డు తిప్పేశారు. కానీ అప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 50 శాతం ఫీజులు వసూలు చేశారు. దీంతో వారంతా రోడ్డెక్కి ధర్నాకు దిగారు. విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాలను మూసివేస్తే పిల్లలను ఎక్కడ చేర్పించాలంటూ గగ్గోలు పెట్టారు. ఇంత జరిగినా విద్యాశాఖ చర్యలు తీసుకోలేదు. తాజాగా ధర్మవరంలోనూ కొత్తగా మూడు పాఠశాలలు ఇదేరకంగా ముందస్తు దందా ప్రారంభించాయి. -
17 నుంచి గూగూడు బ్రహ్మోత్సావాలు
నార్పల: జిల్లాలో ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయిస్వామి (మొహర్రం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. 29న చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈఏడాది ఉత్సవాలు నిర్వహణకు వందేళ్లు కానున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఇలా.. 17న కుళ్లాయి స్వామివారి ప్రఽథమ దర్శనం, 18న స్వామివారి నిత్యపూజ నివేదన, 19న స్వామివారి అగ్నిగుండం ఏర్పాటు, 20న స్వామి వారిని నిలుపుట, 21న స్వామివారికి నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదో సరిగెత్తు, 23న స్వామివారి నిత్యపూజ నివేదన, 24న స్వామివారి ఏడో సరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి, 25న స్వామివారి నిత్యపూజ నివేదన, విడిదినం, 26న స్వామివారి గ్రామోత్సవం, పెద్దసరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి , అగ్నిగుండ ప్రవేశం, 27న స్వామివారి అగ్నిగుండ ప్రవేశం,సాయత్రం 4 గంటలకు జలధి, 29న స్వామివారి చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. 29న స్వామివారి చివరి దర్శనం -
బుక్కపట్నంలో చోరీ
పుట్టపర్తి:బుక్కపట్నం మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. ప్రధాన రోడ్డులో నివాసం ఉన్న హేమలత గురువారం వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం ఇంటికొచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉంది..బీరువాలోని 5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. 20 క్వింటాళ్ల పత్తి అపహరణ బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లులో రైతు పొలం వద్ద నిల్వ ఉంచిన పత్తిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు, గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురాకుల హనుమంతరాయుడు ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఇటీవల పత్తి కోత పూర్తి చేసి దిగుబడిని పొలం వద్ద నిల్వ ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాదాపు 20 క్వింటాళ్ల పత్తిని ఎత్తుకెళ్లారు. పత్తి విలువ రూ.2 లక్షలకు పైగా ఉంటుందని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లోపాయికారిగా పోస్టులు కట్టబెట్టారు..
కళ్యాణదుర్గం: నేను మెగా డీఎస్సీ–2005లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి 72.90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించా. వాస్తవానికి ఉద్యోగాల భర్తీలో ఓపెన్ ర్యాంక్లో 11,13 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు ఓపెన్లో కాకుండా రెండు పోస్టులను బీసీ– డీ రిజర్వేషన్లో కేటాయించారు. ఓపెన్లో పంపించకుండా రెండు పోస్టులు రిజర్వేషన్ బీసీ– డీ రిజర్వేషన్కు పంపడం విద్యాశాఖ అధికారుల లోపాయికారి వ్యవహారం. ఎస్సీ, బీసీ కేటగిరీల్లోనూ ఇలాగే జరిగింది. నేను నెలలు పాటు అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండి డీఎస్సీ కోసం సన్నద్ధమయ్యా. ఇలాంటి సమయంలో మెరిట్ జాబితా, తుది ఎంపిక జాబితాను బయటకు పెట్టకుండా విద్యాశాఖ అధికారులు లోపాయి కారిగా పోస్టులు కట్టబెట్టారు. విద్యాశాఖ అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరపాలి. మా లాంటి వారికి న్యాయం చేయాలి. – పూజారి గోపాల్, ముప్పలకుంట , కళ్యాణదుర్గం: -
‘నారాయణ’లో పుస్తకాల గది సీజ్
పుట్టపర్తి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొత్తచెరువులోని నారాయణ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు విక్రయిస్తుండగా బుధవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. పాఠశాల ఎదుట బైఠాయించి ఎంఈఓ సోమశేఖర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు వచ్చి పాఠశాలలోని గదిని సీజ్ చేశారు. పుస్తకాలు, యూనిఫాం, షూ, తదితర వస్తువులు పాఠశాలల్లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువ రైతు ఆత్మహత్య ధర్మవరం రూరల్: మండలంలోని దర్శనమలలో బుధవారం మందల ఆంజనేయులు(35) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ధర్మవరం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఆంజనేయులు తనకున్న మూడు ఎకరాల్లో వేరుశనగ, కాయగూరల సాగు చేసేవాడు. పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు కూడా వచ్చేవి కావు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.5 లక్షల దాకా అప్పులు చేశాడు. వీటిని తీర్చే మార్గం కానరాక బుధవారం పొలంలో చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికని వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూడగా... విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి..కేసు నమోదు చేశారు. -
వడ్డీ పేరుతో వేధిస్తే ఊరుకోం
● ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘ఫైనాన్స్’ వేధింపులు పెచ్చుమీరాయి. హిందూపురం మండలం బీరేపల్లి గ్రామంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కూల్డ్రింక్లో విషపు గుళికలు కలిపిన మహిళ తాను తాగడంతో పాటు కుమార్తె, కుమారుడికీ తాగించింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ● మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వారం వడ్డీ పేరుతో వేధిస్తున్నారు. రూ.100కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. సక్రమంగా కంతులు చెల్లించకుంటే ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగడంతో పాటు భౌతిక దాడులకూ దిగుతున్నారు. ఆర్నెల్ల క్రితం శాంతినగర్లోని ఓ కుటుంబంపై యర్రగుంట్లకు చెందిన వడ్డీ వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి, పుట్టపర్తి జిల్లాలో ‘ఫైనాన్స్’ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులూ సందుకొకరు పుట్టుకువచ్చారు. ఫైనాన్స్ సంస్థ అయినా, వడ్డీ వ్యాపారి అయినా వాళ్ల టార్గెట్ వడ్డీ పేరుతో భారీగా దండుకోవడమే. ఈ క్రమంలోనే పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని రూ.10, రూ.20 చొప్పున వడ్డీతో రుణం ఇచ్చి పేదలపై మోయలేని భారం మోపుతూ వారి జీవితాలు ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక వడ్డీ భారం భరించలేక కుటుంబ పెద్దలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గతంలో వ్యవసాయంలో పెట్టుబడి కోసం రైతులు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పంట వచ్చాక చెల్లించేవారు. కానీ చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. వ్యాపారం బాగా జరుగుతుందన్న అశతో ఒక్కోసారి ఎంత వడ్డీ అయినా వెనకడుగు వేయడం లేదు. ఇక ఉన్నఫలంగా వచ్చి పడే ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు సైతం అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని గోరంట్ల, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులు పుట్టుకు వచ్చారు. సామాన్యులను పీల్చిపిప్పిచేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. అప్పు తీసుకున్న వారు ఎవరైనా సరే సకాలంలో డబ్బు తిరిగి చెల్లించాల్సిందే. లేకపోతే భౌతిక దాడులకూ వెనకాడటం లేదు. జిల్లాలోని కొందరు బడాబాబులు వడ్డీ వ్యాపారుల అవతారమెత్తారు. అక్కడక్కడా కొందరు ఏజెంట్లను పెట్టి.. ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల ఏటీఎం కార్డులు తీసుకుంటారు. వేతనం జమ కాగానే.. వడ్డీ డబ్బులు డ్రా చేసుకుని మిగతా మొత్తం వారికి ఇస్తారు. ఇక మహిళా ఉద్యోగులకై తే తక్కువ వడ్డీ అంటూ ఆశ చూపుతున్నారు. అనంతరం సదరు ఉద్యోగులతో పరిచయం పెంచుకుని మరింత అప్పు తీసుకునేలా పన్నాగం పన్నుతారు. ఆ తర్వాత ఉన్న ఫళంగా డబ్బుల కోసం గొడవలు చేస్తారు. అప్పు వసూలు పేరుతో వేళాపాలా లేకుండా ఫోన్లు చేస్తూ నరకం చూపుతారు. మెల్లగా లొంగదీసుకునే ప్రక్రియ మొదలుపెడతారు. గుట్టు చప్పుడు కాకుండా చేసే కార్యక్రమాలకు కొందరు అంగీకరించి ట్రాప్లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు చెల్లించలేక.. వారి అడిగింది ఇవ్వలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకొందరు ఆస్తులు అమ్మి.. అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో వెలుగు చూశాయి. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అవసరాల నుంచి హనీ ట్రాప్ వరకు.. సామాన్యులను పీల్చిపిప్పిచేస్తూ.. అధిక వడ్డీ కోసం వేధిస్తూ ఊరుకోం. బాధితులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో ధర్మవరంలో జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఫైనాన్స్ సంస్థలైనా, వడ్డీ వ్యాపారులైనా అధిక వడ్డీ వసూలు చేయడం నేరం. చట్టానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటాం. – ఎస్.సతీష్కుమార్, ఎస్పీ ప్రాణాలు తీస్తున్న ‘ఫైనాన్స్’ వేధింపులు అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరణాలు డబ్బు చెల్లించని వారిపై లైంగికంగా వేధింపులు ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురంలోనే అధికం గతంలో ధర్మవరంలో ఓ కుటుంబంపై వ్యాపారి దాడి హిందూపురంలో ఫైనాన్స్ వేధింపులకు కుటుంబం బలి -
దళితులపై దాడుల నిరోధానికి చర్యలు
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో దళితులపై దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. ఎక్కడైనా దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ... దళితుల రక్షణకు, హక్కులకు భంగం కలగకుండా చట్టాలను పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సీ సబ్ప్లాన్, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై 170 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెడ్డి బాలాజీ, ఐఏఎస్ అధికారి చిన్నరాముడు, కమిషన్ సభ్యులు భిక్షం మేకల, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పుట్టపర్తి సాయినగర్ ఎస్సీ కాలనీ వాసులు చైర్మన్ కె.ఎస్ జవహర్ను కలిశారు. ఎస్సీల శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సాయినగర్లో 350 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, తమకు శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతుమన్నామన్నారు. కమిషన్ చైర్మన్ జవహర్ స్పందించి... క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. దళితుల సమస్యలను పరిష్కరించండి.. పుట్టపర్తి: జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్కు విన్నవించారు. బుధవారం పలువురు దళితులతో కలిసి కలెక్టరేట్ విచ్చేసిన ఆయన... ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో దళితులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని 22–ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చిందన్నారు. వెంటనే వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలన్నారు. పారిశ్రామిక వాడలకు దళితుల భూమిని సేకరించకుండా చూడాలన్నారు. లేదంటే ఎకరాకు రూ.25 లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక కోసం రెండెకరాలు కేటాయించేలా చూడాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోసునేలా యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి ఫొటో సాయి, జిల్లా కార్యదర్శులు చిన్నప్ప, రామయ్య, సాకే నారాయణస్వామి, ఆలమూరు ఓబులేసు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ -
వివాదాస్పద భూమి పరిశీలన
రొద్దం: మండల పరిధిలోని రొద్దకంపల్లి గ్రామం సర్వేనంబర్ 97లోని వివాదాస్పద భూమిని బుధవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ పరిశీలించారు. ప్రభుత్వ కుంటను కొందరు ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి గతంలో ఇచ్చిన అనుమతుల మేరకు రైతులకు పట్టాలివ్వాలని గ్రామసభలో స్థానికులు కలెక్టర్ను కోరారు. దీంతో ఆయన సదరు స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు రొద్దకంపల్లి గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్.. పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి పనులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ ఉదయ్శంకర్రాజు, ఎంపీడీఓ ఆనంద్ప్రసాద్ ఉన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదు ● సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మడకశిర రూరల్: జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని సీడబ్ల్యూసీ సభ్యుడు రాఘువీరారెడ్డి అన్నారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. జాతీయ పరీక్షల వివాదాలు, పేపర్ లీక్లు, నిర్వహణపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్, యూజీసీ, ఎన్ఈటీ, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల్లో వరుస వైఫల్యాలు కేంద్రం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు పారదర్శకత, జవాబుదారీతనం లేదన్నారు. కేవలం అధికారులను మారిస్తేసరిపోదని, బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. -
ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం రాలేదు
నేను మెగా డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి.. 71.65 మార్కులతో జనరల్లో 121వ ర్యాంకు సాధించాను. శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల లెక్క ప్రకారం నాకు ఉద్యోగం ఖాయమని భావించా. కానీ ఎంపిక జాబితాలో పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎస్టీ కేటగిరీలో జిల్లాలో మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు మహిళలకు, నాలుగు జనరల్ అభ్యర్థులకు, ఒక పోస్టు నాన్లోకల్ కోటాకు కేటాయించారు. నాన్లోకల్ అభ్యర్థులు లేని కారణంగా ఆ పోస్టు కూడా స్థానిక ఎస్టీ అభ్యర్థులకే దక్కాలి. ఈ లెక్కన మొత్తం ఐదు పోస్టులు జనరల్ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. నాకు జనరల్లో 121 ర్యాంకుతో పాటు ఎస్టీ కేటగిరీలో ఐదో స్థానంలో ఉన్నాను. అయినా ఉద్యోగం రాలేదు. ఈ విషయమై మంగళగిరిలోని అధికారులను సంప్రదిస్తే ఆ పోస్టును ‘స్పోర్ట్స్ కోటా’కు కేటాయించినట్లు చెప్పారు. టెట్, డీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశాలు లేకుండా, ‘ప్రత్యేక కోటా’ పేరుతో పోస్టులు భర్తీ చేయడం వల్ల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఈసారి ముందుగానే ‘పోస్టు ప్రిఫరెన్స్’ తీసుకోవడం కూడా నా అవకాశాలను దెబ్బతీసింది. మెరిట్ జాబితాలు, తుది ఎంపిక జాబితాలను బహిర్గతం చేయకపోవడంపై అనుమానం కల్గుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – సుగాలి గోపాల్నాయక్, కుర్లపల్లి తండా, కనగానపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
ఉపాధి అక్రమాలపై ‘విజిలెన్స్’ విచారణ
పుట్టపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. బుక్కపట్నం మండలంలో చేసిన పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారి నితిన్ బృందం బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టింది. మండలంలో చేసిన పనులు...వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఏపీఓతో పాటు ఉపాధి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకు స్థానిక అధికారుల వద్ద సమాధానం లేకపోయింది. ముఖ్యంగా ఆరోపణలతో విధులు నుంచి తొలగించిన గశికవారిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ను తిరిగి విధుల్లోకి ఎందుకు తీసుకున్నారని ఏపీఓ శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. అదే విధంగా కూలీల నుంచి మేట్లు రూ.200 డిమాండు చేస్తున్నారన్న ఆరోపణలపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. కానీ ఏపీఓ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో బుక్కపట్నం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సమగ్ర విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
15 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 15 మండలాల పరిధిలో వర్షం కురిసింది. మొత్తంగా 193.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ధర్మవరం మండలంలో 36.4 మి.మీ, రామగిరి మండలంలో 26.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక కనగానపల్లి మండలంలో 24.4 మి.మీ, సీకేపల్లి 23.6, గాండ్లపెంట 22.4, బత్తలపల్లి 16.4, ముదిగుబ్బ 11.6, రొద్దం 9.4, ఓడీచెరువు 5.4, అమరాపురం 4.2, హిందూపురం 3.2, లేపాక్షి 3.0, తాడిమర్రి 2.8, రొళ్ల 2.4, గోరంట్ల మండలంలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.బాలసదనంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం బత్తలపల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సరస్వతి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలు మాత్రమే అర్హులన్నారు. తల్లిదండ్రులు లేని వారు, తల్లిదండ్రులలో ఒకరు ఉండి మరొకరు లేని వారు, నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం బాల సదనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాల సదనంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుందని, వసతి, ఉచిత విద్య, మెనూ ప్రకారం భోజనం అందిస్తామన్నారు. వివరాలకు 738611833, 7075633900 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఆరోగ్య శాఖలో అలజడి
సాక్షి, పుట్టపర్తి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అలజడి రేగింది. సిబ్బంది మధ్య రోజుకో తగాదా వెలుగు చూస్తోంది. మాటా మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తోంది. వీధి రౌడీల తరహాలో సిబ్బంది కార్యాలయంలోనే తన్నుకోవడం కలకలం రేపుతోంది. కార్యాలయంలోనే దాడులు.. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఓ సూపరింటెండెంట్తో సీనియర్ అసిస్టెంట్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మిగతా సిబ్బంది సర్దిజెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మరుసటి రోజు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరూ భౌతిక దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో ఫీల్డ్కు వెళ్లిన డీఎంహెచ్ఓ..ఆ తర్వాత ఇద్దరినీ పిలిచి మందలించారు. ఎవరికి వారే యమునాతీరేవైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తుంటారు. ఏదైనా పని చేయాల్సి వస్తే.. ఒకరిపై మరొకరు నెట్టేకునే క్జ్రమంలో మాట్లాడే ధోరణి కారణంగా ప్రతిసారీ గొడవ జరుగుతున్నట్లు తెలిసింది. గొడవకు కారణం అవుతున్న వారందరూ ఐదు పదుల వయసు దాటిన ఉద్యోగులే ఉండటం గమనార్హం. కార్యాలయంలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల గురించి డీఎంహెచ్ఓ ఫైరోజా బేగంను వివరణ కోరగా.. సిబ్బంది గొడవ పడిన మాట వాస్తవమేనన్నారు. సదరు సిబ్బందిని పిలిచి మందలించడంతో పాటు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించానన్నారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది మధ్య తరచూ తగాదాలు వీధి రౌడీల్లా తన్నుకుంటున్న సిబ్బంది -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, పుట్టపర్తి: హైటెక్ యుగంలో మోసాలు కూడా సరికొత్తగా చేస్తున్నారు కొందరు దుండగులు. అమాయకులను టార్గెట్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో కొందరు, అధిక వడ్డీ ఆశ చూపి మరికొందరిని ట్రాప్ చేసి అందినకాడికి దోచేస్తున్నారు. వ్యాపారం పేరుతో భారీ రాయితీలు ప్రకటించడం, ఖరీదైన వస్తువులు తక్కువ ధరకే వస్తాయని, సగం ధరకే భూమి దొరుకుతోందని ఇలా అవతలివారిని నమ్మిస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు. కారులో ఖరీదైన దుస్తులతో వచ్చి... అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు కారులో తిరుగుతూ ఖరీదైన దుస్తులు ధరించి ముందుగానే డబ్బులు ఖర్చు చేస్తారు. ఒకట్రెండు రోజులు గడిచిన తర్వాత అవతలి వ్యక్తి వద్ద ఉన్న డబ్బుల గురించి ఆరా తీసి.. ఏదో మార్గంలో లాగేయాలని చూస్తారు. ఆ వ్యక్తికి ఏది అవసరమో ఆ పని మీద దృష్టి సారించి.. ఒక్క రోజులో పని పూర్తి చేస్తామని.. కాకపోతే ఖర్చు అవుతుందని నమ్మిస్తారు. సదరు వ్యక్తి డబ్బు తెచ్చి ఇవ్వగానే.. ఒకట్రెండు రోజుల పాటు అధికారి లేరని చెబుతూ ఆ తర్వాత పరారవుతారు. మధ్యవర్తిత్వం చేసిన వారిని ప్రశ్నిస్తున్నా వారు కూడా.. ఆయన అందుబాటులో లేడని.. తనను కూడా మోసం చేశాడని దబాయించి మోసాలకు పాల్పడుతున్నారు. భూ విక్రయాలతో భారీ దందా ఒకే భూమిని ఇద్దరు.. ముగ్గురికి అమ్మి మోసాలకు పాల్పడటం.. సబ్ డివిజన్ కాని భూములను విక్రయించి తగాదాలు సృష్టించి.. డబ్బులు దండుకుని పరారవుతున్న కేసులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాలని నమ్మబలికి వివాదాల్లో ఉన్న భూములను అమ్మి.. సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పుట్టపర్తిలో ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. లోన్లు ఇప్పిస్తామని.. కార్లు కొనిస్తామని.. బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామని ఫేక్ ఫోన్ కాల్స్ చేయడం.. అమాయకుల నుంచి డబ్బులు లాక్కున్న ఘటనలు వెలుగు చూశాయి. అలాగే తక్కువ ధరకే కారు దొరుకుతుందని డబ్బులు వసూలు చేసి కారు కట్టబెడుతారు. అయితే నెలల తిరిగే లోపు యజమానులు వచ్చి కారు తమదేనంటూ దబాయిస్తారు. దొంగ సరుకు.. దోపిడీల్లో తెచ్చిన బంగారం అమ్మి.. జేబులు నింపుకుంటున్నారు. పుట్టపర్తిలో అద్దె ఇంట్లో ఉంటూనే.. ఆ ఇల్లు తమదేనంటూ నమ్మబలికి పలువురితో అప్పు తీసుకుని పరారీ అయిన వ్యక్తులు కూడా కోకొల్లలు ఉన్నారు. అమాయకులే లక్ష్యంగా దొంగాట ఉద్యోగాలు, అధిక వడ్డీ, రాయితీలంటూ వల ట్రాప్లో చిక్కుంచుకొని రూ.లక్షల వసూలు పోలీసుస్టేషన్ల చుట్టూ బాధితుల ప్రదక్షిణ జిల్లాలో రోజుకో చోట వెలుగు చూస్త్తున్న నేరాలు ఎవరైనా అధిక వడ్డీ ఆశ చూపితే మోసపోవద్దు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను ప్రైవేటు వ్యక్తులు ఇవ్వరనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వ్యాపారం చేయాలంటే తెలిసిన వాళ్లతోనే మాట్లాడండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల గురించి రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాల్లో సంప్రదించిన తర్వాతనే కొనుగోలు చేస్తే మంచిది. – ఎస్.సతీశ్కుమార్, పుట్టపర్తి, ఎస్పీ -
నరకానికి దారి
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం నుంచి కొత్తచెరువు మండలం బైరాపురం వరకూ ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా శిథిలం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 14 కిలో మీటర్లున్న రోడ్డుపై 1400కు పైగా గుంతలు ఏర్పడ్డాయి. బుక్కపట్నం మీదుగా కొత్తచెరువు, కమ్మవారిపల్లి, లోచర్ల, లింగారెడ్డిపల్లి క్రాస్, సాయినగర్, బైరాపురం వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్న వర్షం వచ్చినా మోకాలి వరకూ నీళ్లు నిలబడుతుండడంతో అవస్థలు పడుతున్నారు. తరచూ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర, కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. గర్భిణులు, వృద్ధులు చివరకు 108 వాహనాలు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల మధ్య కనీసం వంద మీటర్లు కూడా సరైన రోడ్డు కనిపించదంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.బుక్కపట్నం చెరువు కట్టపై ఉన్న గుంతలు శిథిలావస్థలో బుక్కపట్నం–బైరాపురం రోడ్డు 14 కి.మీటర్లు 1400కు పైగా గుంతలు తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు, వాహనదారులు -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
ఎన్పీకుంట: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం సమీపంలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై పశువులను అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి చేరుకుని పశువులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పశువుల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మూడు కంటైనర్లలో 129 ఎద్దులు, బర్రెలు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసి కేరళ రాష్ట్రం పొలాచికి తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తుండటంతో జరిమానా విధించి, డ్రైవర్లను తహసీల్దార్ దేవేంద్రనాయక్ ఎదుట బైండోవర్ చేశారు. కాగా, అంతకు మునుపే మరో నాలుగు కంటైనర్లు జిల్లా సరిహద్దు దాటి వెళ్లడం గుర్తించిన స్థానికులు టి.జగదీశ్వర్రెడ్డి, కసెట్టి రామ్మోహన్లు వెంబడించి గాలివీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ మక్బూల్బాషా, స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు. -
మల్బరీ సాగు విస్తీర్ణం పెంచండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో 2026–27 సంవత్సరానికి మల్బరీ సాగు విస్తీర్ణాన్ని 10 వేల ఎకరాలకు పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సెరికల్చర్ జేడీ, ఏడీలు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మల్బరీ సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి కేటాయించి విజయవంతం చేయాలన్నారు. అలాగే ఎకరాకు 900 కిలోల పట్టుగూళ్లు దిగుబడి సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హిందూపురంలో పట్టుగూళ్ల మార్కెట్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేడీ శోభారాణి, ఏడీలు హనుమంతరాయ, వెంకటస్వామినాయక్, హంపయ్య, సిబ్బంది పాల్గొన్నారు. సమయ పాలన పాటించాలి పుట్టపర్తి: సచివాలయ సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల తీరును స్వయంగా పరిశీలించారు. నిర్ధేశిత సమయాల్లో అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. భూసేకరణ పూర్తి చేయండి ప్రశాంతి నిలయం: పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటి సరఫరా కల్పించే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు, నీటి పారుదలశాఖ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుంచి గ్రావిటీ, లిప్ట్ పద్ధతుల ద్వారా నీటిని అందించేందుకు భూసేకరణ, పెగ్ మార్కింగ్, సర్వే పనుల పురోగతిపై సమీక్షించారు. -
బానిస వ్యవస్థ నిర్మూలించాలి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: బానిస వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవెలప్మెంట్ సొసైటీ (రెడ్స్) ఆధ్వర్యంలో బానిస వ్యవస్థ నిర్మూలన చట్టంపై పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, జిల్లా లీగల్ సర్వీసెస్ సెల్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కేసుల విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, వన్స్టాప్ సెంటర్లు, రెడ్స్ వంటి గుర్తింపు పొందిన స్వచ్ఛంధ సంస్థలను సమన్వయం చేసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. విదేశాల్లో ఉపాధి అంటూ జిల్లాలోని పలువురు మోసయిన సంఘటన ఉన్నాయన్నారు. బాధితుల రక్షణ కోసం భారత రాయబార కార్యాలయాలు, విదేశీ సంస్థలు సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఆత్మహత్యల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆఫ్టర్ కేర్ అధికారిణి ప్రియాంక, రెడ్స్ స్వచ్ఛంధ సంస్థ డైరెక్టర్ భానూజ మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి తదితర వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. -
రేపటి నుంచి ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఏ శిక్షణ
పుట్టపర్తి: జిల్లాలోని ఉపాధ్యాయులకు 4వ తేదీ నుంచి ఎఫ్ఎల్ఏ శిక్షణ ఇస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి చెప్పే వారు, సింగిల్ టీచర్లు, డీఎస్సీ– 2025 టీచర్లు, యూపీ స్కూల్, ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే వారు శిక్షణలో పాల్గొనాలన్నారు. కదిరి–1 కేంద్రంలో కదిరి, తలుపుల, ఓడీసీ, నల్లచెరువు మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. కదిరి–2 కేంద్రంలో ఎన్పీ కుంట, గాండ్లపెంట , తనకల్లు, అమడగూరు మండలాల టీచర్లకు, పెనుకొండలో పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండలాల టీచర్లకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మడకశిరలో మడకశిర, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం మండలాల టీచర్లకు, హిందూపురంలో హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మండలాల టీచర్లకు, ధర్మవరంలో ధర్మవరం, కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల టీచర్లకు, కొత్తచెరువులో కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం, నల్లమాడ, గోరంట్ల మండలాల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా శివప్రసాద్ అనంతపురం కల్చరల్: ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జె. శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ అకేపాటి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఏసీ కార్యదర్శిగా కొనసాగుతున్న కమ్మన్న నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కమ్మన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ డిప్యూటీ గ్రంథాలయాధికారిగా కొనసాగనున్నారు. శివప్రసాద్ ప్రస్తుతం తిరుపతి గ్రంథాలయంలో గ్రేడ్–1 లైబ్రేరియన్గా పనిచేస్తున్నారు. ‘బైండోవర్’ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానాధర్మవరం అర్బన్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన పసల మనోజ్కుమార్ 2025లో రూ.లక్ష విలువైన బాండ్ను ఏడాది కాలపరిమితితో రాసిచ్చాడని తెలిపారు. బాండ్ అమలులో ఉన్న సమయంలోనే మనోజ్కుమార్కు ఒక కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో నిందితుడికి నోటీసులు జారీ చేసి రూ.50 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు. భూసేకరణ పూర్తి చేయండి ప్రశాంతి నిలయం: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓ, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిలమత్తూరు, హిందూపురం, లేపాక్షి, పుట్టపర్తి, మడకశిర మండలాల్లో వివిధ గ్రామాల్లో జరుగుతున్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన భూ సేకరణ కేసులను , పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆర్.అనంతపురం గ్రామస్తులకు మంజూరైన ఎక్స్గ్రేషియా మొత్తాన్ని పంపిణీ చేసి భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రశాంతంగా ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో మంగళవారం సోషల్ పరీక్ష జరిగినట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 2,294 మంది హాజరుకావాల్సి ఉండగా 1,868 మంది హాజరయ్యారన్నారు. 426 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఓపెన్ విద్యార్థులు 244 మందికి గాను 214 మంది హాజరయ్యారని, 30 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
ప్రతి అర్జీనీ నాణ్యంగా పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించి ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 237 అర్జీలు అందగా, వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇంజినీర్ ఇంట్లో కొండ చిలువ! పెనుకొండ: పట్టణంలోని తోటగేరిలో వ్యవసాయ పొలంలో నివసిస్తున్న ఇంజినీర్ జగదీష్ ఇంటి ఆవరణలోకి ఆదివారం రాత్రి కొండ చిలువ చొరబడింది. ఒక కోడిని మింగేసి ఆవరణలోని ఓ చిన్న షెడ్డులో పడుకుంది. సోమవారం ఉదయం కొండచిలువను గమనించిన జగదీష్... వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా దాన్ని పట్టుకుని సమీప అటవీప్రాంతంలో వదిలేశారు. -
దగా డీఎీీస్సీపై ధర్మాగ్రహం
ప్రశాంతి నిలయం: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ నిర్వహించిన దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులు దాటుకుని కలెక్టరేట్కు చేరుకుని జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై నిరుద్యోగ యువతకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. పారదర్శకత లేక పోవడం, మెరిట్ లిస్ట్ బహిరంగ పరచకపోవడం, కేవలం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృష్టించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక్కో పోస్ట్కు రూ.లక్షల్లో బేర సారాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో పోస్టులు కేటాయించారన్న ఫిర్యాదులు, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చారన్న ఆరోపణలు యువతలో తీవ్ర అసంతృప్తులకు గురి చేస్తున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకపోవడం, కోర్టు తీర్పు తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల తయారీ, అప్లోడ్ నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలన్నారు. మెరిట్ లిస్ట్లు, మార్కులు, ఎంపిక వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్రమంగా ఎంపికైన వారిపై చర్యలు తీసుకొని నిజమైన వారికి న్యాయం చేయాలని కోరారు. ఆమరణ దీక్షలకు సిద్ధం లీకేజీ ప్రభుత్వం డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. – అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీ ప్రభుత్వం. పది, ఇంటర్, ఏపీసెట్...ఇలా అన్ని పరీక్ష పేపర్లను లీకేజీలు చేసి లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికై నా విచారణచేసి పేపర్ లీకులు, డేటా తొలగింపు, మెరిట్ లిస్ట్లో అవక తవకలపై వెంటనే సమాధానం చెప్పాలి. –గంగుల సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ -
ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
పుట్టపర్తి టౌన్: ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఆయన ఎలక్ట్రికల్ బైక్పై ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎనుములపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి సైతం ఈ–బైక్పైనే వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ–బైక్లతో ఇంధన పొదుపుతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. అనంతరం ఆయన ఎనుములపల్లిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
పోస్టింగ్ ఇస్తామన్నా ‘వద్దు సార్’ అంటున్న అధికారులు
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్చార్జ్ ఆర్డీఓ, ఇన్చార్జ్ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్ సబ్ డివిజన్కు 5 నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ఇన్చార్జ్గా నియమించినా, రెండు సబ్ డివిజన్లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అవస్థల పర్వం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంతులేని అవినీతి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్చార్జ్లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూధన్రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. –గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసిప్రజల్లో భయాందోళన ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం -
మధ్యాహ్నం వరకే వైద్య సేవలు
నల్లచెరువు: మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్యసిబ్బంది మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిథ ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే నల్లచెరువు మండలంలోని పాథ్రమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం నిబంధనలు తమకు వర్తించవు అన్నట్లుగా వైద్య అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 , 11 గంటలైనా విధులకు హాజరు కాని వైద్య అధికారులు మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పీహెచ్సీలో సేవలు అందిస్తున్నారు. ఉదయం ఓపీకి వచ్చిన రోగులను మాత్రమే చూసి తర్వాత తమకు సంబంధం లేనట్లు వెళ్లిపోతున్నారని రోగులు వాపోతున్నారు. పర్యవేక్షణ కరువు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా విధులకు వచ్చే సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలు దాటితే పత్తా లేకుండా పోతున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు సిబ్బంది లేకపోవడంతో విధిలేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్ర ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో శనివారం, ఆదివారం సిబ్బంది ఉండటం లేదని తెలిపారు. ఆస్పత్రిలో వైద్య అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యాధికారులు, సిబ్బందిపై డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆగ్రహం -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కనగానపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేసుకొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి బలవన్మరణం పెనుకొండ రూరల్: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గొందిపల్లి గ్రామం కై లాస దేవాలయం సమీపంలో చోటు చేసుకొంది. కియా ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపిన వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని మల్లాతహళ్లికి చెందిన రాజు (57) ఆలయానికి కిలో మీటరు దూరంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం దుద్దేబండ క్రాస్ నుంచి రాజు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీఆర్వో బషీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. బైక్ను ఢీకొన్న కారు.. రైతు మృతి తనకల్లు: మండలానికి చెందిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అన్నమయ్య జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ములకలచెరువు సీఐ ప్రతాప్ తెలిపిన వివరాలమేరకు.. తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి (55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు. ఆలయంలో చోరీ కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
పుట్టపర్తి టౌన్: చెత్త తరలింపు వాహనాలకు మరమ్మతు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అవి ఎండకు ఎండుతూ.. వానకు తుప్పుబడుతున్నాయి. పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డుల్లో చెత్త సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం పుట్టపర్తి మున్సిపాటీకి రెండు వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం రూ.16 లక్షలు. నిర్వహణ లోపం కారణంగా 15 నెలల క్రితం మరమ్మతుకు గురయ్యాయి. ఒక కంఫ్యాక్టర్ను రెడీ చేసి మరోదాని మెకానిక్ షెడ్ వద్ద వదిలేశారు. అలాగే గతంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, దాతల సహాయంతో చెత్త తరలించేందుకు 10 ఆటోలను సేకరించారు. అందులో ఇప్పుడు మూడు మాత్రం పనిచేస్తున్నాయి. ఏడు వాహనాలు పనిచేయడం లేదు. వాటిని కూడా మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి వదిలేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా కౌన్సిల్ సమావేశానికి హాజరై చెత్త సేకరణకు , పాత వాటిని మరమ్మతు చేయించాలని పదే పదే అధికారులను ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతు చేయించలేదు. అవి మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. ఇప్పటికై నా ప్రత్యేక అధికారి, కమిషనర్ చెత్త తరలింపు వాహనాలపై దృష్టి పెట్టి ప్రజలు సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త తరలింపు వాహనాల మరమ్మతును పట్టించుకోని అధికారులు నెలల తరబడి ఎండలోనే మగ్గుతున్న వాహనాలు -
ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
గోరంట్ల: ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్న అంజినప్ప (58) ఆదివారం మృతి చెందాడు. వివరాలు... మండల పరిధిలోని జీనంవాండ్లపల్లిలో భూవివాదంలో భాగంగా ఈనెల 26న అన్నదమ్ములైన బోయ రంగప్ప, అంజినప్ప వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో తమ్ముడు అంజినప్ప తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న అంజినప్ప ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అంజినప్పకు భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. సీఐ బోయ శేఖర్ తన సిబ్బందితో బెంగళూరు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసుల వైఫల్యంతోనే... జీనవాండ్లపల్లికి చెందిన బోయ రంగప్ప, ఆయన తమ్ముడు చిన్న అంజినప్ప మధ్య కొంత కాలంగా భూవివాదం నడుస్తోంది. పోలీసులకు సైతం ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. రెండు వర్గాలకు చెందిన రైతులు అధికార పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఒక వర్గానికి చెందిన రైతు మంత్రి సవితమ్మ ప్రధాన అనుచారుడైన ఓ గ్రామ నాయకుడికి అత్యంత సన్నితుడు కావడంతో పోలీసులు వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు సకాలంలో సమస్యను పరిష్కరించి ఉంటే అసలు ఘర్షణ జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. -
జోరుగా ఇసుక దందా
పరిగి: పెన్నా, జయమంగళీ నదుల్లో ఇసుక ఖాళీ అవుతోంది. ఇష్టారీతిలో తవ్వకాలు చేపట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకులు కూడా చోద్యం చూస్తుండటంతో ఇసుకాసురుల వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగుతోంది. ట్రాక్టర్ రూ.2 వేలు పరిగి మండల పరిధిలో పెన్నా, జయమంగళి నదులు అక్రమార్కులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర స్థానికంగా అయితే రూ.2 వేలు. అదేవిధంగా కర్ణాటకకు రూ.4 వేల వరకూ ధర పలుకుతోంది. ఇదే అదునుగా ఇసుక తరలింపు కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను కొనుగోలు చేసి రంగంలోకి దించుతున్న అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలించేస్తున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను అధికార బలంతో గంటల్లోనే బయటకు తెచ్చుకుంటున్నారు. రెండు నదుల్లోనూ ఇసుకను ఎడాపెడా తోలేస్తుంటుండటంతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ జీఓను అడ్డుపెట్టుకొని... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దందా సాగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు. నిత్యం వందలాదిగా ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా పొరుగు మండలాలకే కాకుండా కర్ణాటకకు భారీగా తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చన్న వెసులుబాటు కల్పించింది. దీన్నే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులకు పైసా పెట్టుబడి లేకుండా అనుమతులు పొంది ఉచితం మాటున ఇష్టానుసారంగా ఇసుక తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాత్రి వేళలో శ్రీరంగరాజుపల్లి, ఊటుకూరు, శాసనకోట, నేతులపల్లి, బాలిరెడ్డిపల్లి, ఎర్రగుంట, పైడేటి, గణపతిపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటూ ప్రకృతి వనరుగా ఉన్న ఇసుక, మట్టి అక్రమ తరలింపును కాపాడాల్సిన పాలకులు, అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ట్రాక్టర్ రూ.2 వేలు, కర్ణాటకకు తరలిస్తే రూ.4 వేలు పెన్నా, జయమంగళి నదులను ఖాళీ చేస్తున్న ఇసుకాసురులు పట్టించుకోని అధికారులు మండలంలోని మోదా వద్ద తాజాగా ఆదివారం జయమంగళి నది నుంచి రెండు ట్రాక్టర్లు, ఊటుకూరు పెన్నా నది వద్ద ఓ ఇసుక ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కేనులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కేఎస్ఆర్టీసీ కండక్టర్పై దాడి
హిందూపురం: పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ మంజునాథ్పై విచ్చన రహితంగా దాడి చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కర్ణాటక ప్రాంతంలోని గౌరీబిదనూరు డిపోకు చెందిన బస్సు (కేఏ401157) బెంగళూరు నుంచి బయలుదేరి హిందూపురం పట్టణానికి వస్తోంది. ఈ సందర్భంగా ఓ మహిళ పెద్ద లాగేజీ బ్యాగులో మాంసం పెట్టుకుని ప్రయాణించింది. వాసన వస్తుండటంతో ప్రయాణికులు చెప్పిన మేరకు కండక్టర్ ఆమెను ప్రశ్నించి ఇలా మాంసంతో ప్రయాణించడానికి వీలులేదని చెప్పాడు. హిందూపురం రాగానే ఆమెను దిగిపోవాలని సూచించాడు. దీంతో ఆమె బ్యాగుతో దిగివెళ్లింది. బస్సునేరుగా పాతబస్టాండ్ వద్ద వచ్చి చేరింది. కొంత సమయానికి ఆ మహిళకు సంబంధించిన బంధువులు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చి బస్సును వాహనాలతో అడ్డగించి కండక్టర్ మంజునాథ్తో వాదిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. బస్సుడ్రైవర్ గంగాధర్ అడ్డుపడటంతో అతన్ని కూడా దుర్భాషలాడి ఎక్కువ మాట్లాడవంటే బస్సు అద్దాలు పగలగొడతామని హెచ్చరించినట్లు బాధితుడు మంజునాథ్ తెలిపారు. ఈ మేరకు బాధితులు, కేఎస్ఆర్టీసీ డిపో అధికారులు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
పుట్టపర్తి టౌన్: కుటుంబ కలహాల కారణంగా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన సోముశేఖర్ ( 25) ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎస్ఐ నారాయణరెడ్డి వివరాల మేరకు... బుక్కపట్నంకు చెందిన సోముశేఖర్ నిర్మాణంలో ఉన్న సత్యసాయి డిగ్రీ కళాశాలలో బీర్ బాటిల్తో గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని తమ వాహనంలో ఎక్కించుకొని స్థానిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైనా వైద్యం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సరైన సమయంలో స్పందించిన పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వైన్ షాపులో చోరీ యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహానాడుకు హాజరుకాని కూలీలకు వేధింపులు కళ్యాణదుర్గం రూరల్: మండల పరిధిలోని గోళ్ల గ్రామంలో ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యాక్రమానికి హాజరు కాలేదన్న కారణంతో టీడీపీ నేతలు ఉపాధి హామీ హామీ కులీలపై వేధింపులకు దిగారు. ఆదివారం ఉపాధి పనులు అధికారంగా నిర్వహించకూడదు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి ఉపాధి హమీ పనులు నిర్వహించారు. అయితే మహానాడుకు హాజరుకాని కూలీలకు చెందిన ఫోటోలను మాత్రం తీయలేదు. ఎందుకు తమ ఫోటోలు తీయలేదని కొందరు కూలీలు నిలదీశారు. టీడీపీ నేతలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో మాట్లాడుతూ ‘మేము చెబితే మీటింగ్లకు తప్పకుండా హాజరుకావాలి.. మరోసారి ఇలా చేస్తే బాగుండదు’ అంటూ హెచ్చరించారు. అనంతరం వారి ఫోటోలను తీశారు. మహానాడుకు వెళ్లడం, వెళ్లకపోవడం అన్నది తమ వ్యక్తిగత విషయమని, వివిధ కారణాలతో వెళ్లడం సాధ్యపడలేదని కూలీలు చెబుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడాన్ని సాకుగా చూపి కూలీలను ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు తెలిపారు. కేవలం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామిపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఏపీఓను ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించలేదు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పరిగి: మండలంలోని సేవామందిరం ఏఎం లింగణ్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అదే స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముప్పై ఏడు ఏళ్ల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరి కష్టసుఖాలు ఒకరు తెలుసుకోవడంతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం గురువులకు శాలువాలతో సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గురువులు సుధాకర్రావు, ప్రభాకర్రావు, పుల్లప్ప, కనకవల్లి, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు లక్ష్మణమూర్తి, మహేష్, మల్లికార్జునస్వామి, అహమ్మద్, లక్ష్మణ్, సుదర్శన్రెడ్డి, శంకరప్ప, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బంగారంపేట పొలాల్లో మృతదేహం లభ్యం
తాడిమర్రి: మండలంలోని బంగారంపేట, చిల్లకొండయ్యపల్లి గ్రామాల మధ్య ఆదివారం రైతులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్తో సేద్యం చేయిస్తుండగా డ్రైవర్ బోరు వద్ద పడి ఉన్న మృతదేహాన్ని చూసి రైతుకు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. దాడితోట సమీపంలోని కొండపైన జరుగుతున్న అదాని గ్రీన్ ఎనర్జీ హైడ్రో ప్రాజెక్టులో పని చేస్తున్న కూలీలు శనివారం ఇచ్చిన వ్యక్తి అదృశ్యం ఫిర్యాదు మేరకు ఆ దిశగా ఎస్ఐ విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మృతదేహాన్ని పరిశీలించగా అదృశ్యమైన వ్యక్తిగా గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం గంగోటియా గ్రామానికి చెందిన ముగ్గురు పని కోసం నాలుగు రోజుల క్రితం ఆదానీ కంపెనీ వద్దకు వచ్చారు. వారిలో మతి స్థిమితం సరిగా లేని ప్రతాప్ ముండా (45) శుక్రవారం తన బావమరిదితో గొడవపడి అక్కడ నుంచి వచ్చాడు. మద్యం మత్తులో దారి తప్పి పొలాల్లోకి వెళ్లి కిందపడటంతో సృహతప్పి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య జాక్గ్రాణి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
వివాహిత బలవన్మరణం
పుట్టపర్తి అర్బన్: అనారోగ్యం తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన ఆవుల వెంకటేష్కు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చిన్నవాడైన భాస్కర్కు రామగిరి మండలం శేషంపల్లికి చెందిన రామాంజనేయులు కోనమ్మ దంపతుల కుమార్తె మౌనిక(23)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఆరు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందు నుంచే కడుపునొప్పితో మౌనిక బాధపడుతుండేది. బిడ్డ పుట్టిన అనంతరం నొప్పి తీవ్రమైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు లోనైన మౌనిక శనివారం తెల్లవారుజామున ఇంట్లోని బెడ్ రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నారాయణరెడ్డి, తహసీల్దార్ కళ్యాణ్చక్రవర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆటోను ఢీకొన్న కారు బత్తలపల్లి: మండలంలోని తంబాపురం క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మలింగ సిద్దలింగ దస్తారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారి దర్శనం ముగించుకున్న అనంతరం శనివారం కారులో తిరుగు ప్రయాణమైన ఆయన.. తంబాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా రామాంపురం నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బండి నారాయణస్వామి, బత్తలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, మాల్యవంతం గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 ద్వారా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ తిట్టాడని మహిళ ఆత్మహత్యాయత్నం తలుపుల: స్థానిక ఎస్ఐ చెన్నయ్య బూతులు తిట్టారంటూ మండలంలోని సోమలవాండ్లపల్లికి చెందిన వై.మమత ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఓ కేసు విషయంగా మమత భర్త గంగిరెడ్డిని పోలీసులు శుక్రవారం స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో భర్తను దూషిస్తుంటే మమత అడ్డుకుంది. ఆ సమయంలో ఎస్ఐ రెచ్చిపోయి రాయలేని పదజాలంతో దుర్భాషలాడారు. న్యాయం చేయాలని కోరితే ఇలా దుర్మార్గంగా మాట్లాడడం సరికాదని అన్నందుకు ఏమైనా తాగి చావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రత్యర్థుల నుంచి డబ్బు తీసుకుని తమను అన్యాయంగా కేసులో ఇరికించి గ్రామంలో పరువు తీసేందుకు సిద్ధమయ్యారంటూ మమత శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనౖపై ఎస్ఐను ఆరా తీయగా... ఓ వివాదం విషయంగా ఇరు పార్టీలను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయించామని పేర్కొన్నారు. తాము ఎలాంటి దూషణలకు పాల్పడలేదని తెలిపారు. -
మలకవేమల పీహెచ్సీ తనిఖీ
ముదిగుబ్బ: మండలంలోని మలకవేమల పీహెచ్సీని శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం తనిఖీ చేశారు. పలు రికార్డులు, పీహెచ్సీ పరిసరాలు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ఎంపీహెచ్ఈఓ వేణుగోపాలరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శేషజీవితం ప్రశాంతంగా గడపాలి : ఎస్పీ పుట్టపర్తి టౌన్: ఉద్యోగ విరమణ సర్వసాధారణమని, ఇంత కాలం తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించిన వారు ఇకపై శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ సతీష్కుమార్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ రహిమాన్, ఎస్ఐ బ్రహ్మానందరెడ్డి, ఏఎస్ఐ సోమశేఖర్, హెడ్సీ అల్లాబకాష్ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని డీపీఓలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు వారి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ వలి, ఆర్ఎస్ఐలు ప్రదీప్సింగ్, వీరన్న, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే అంతర్రారష్రట దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు మడకశిర యూజీ పీఎస్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను స్థానిక ఎస్ఐ లావణ్యతో కలిసి ఆయన వెల్లడించారు. మడకశిర ప్రాంతంలో ఇటీవల పలువురి ద్విచక్ర వాహనాలను దుండగులు అపహరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు... కల్లుమర్రి క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అగ్రంపల్లి గ్రామానికి చెందిన శివప్ప, సాయి అలియాస్ సాయిప్రభును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో మడకశిరతో పాటు కర్ణాటకలోని పావగడలో ద్విచక్ర వాహనాల అపహరించి అగ్రంపల్లి గ్రామ సమీపంలోని తన పొలానికి ఆనుకుని ఉన్న ముళ్లకంపల పొదల మాటున దాచినట్లు శివప్ప అంగీకరించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రూ.8.50 లక్షల విలువైన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పది ద్విచక్ర వాహనాల స్వాధీనం -
రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు
● రెడ్డి జేఏసీ నేతల ధ్వజం ధర్మవరం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామాటం శేషాద్రిరెడ్డి, జిల్లా కార్యదర్శి చందమూరి శివారెడ్డి ధ్వజమెత్తారు. హైకోర్టు అడ్వకేట్ అంజన్రెడ్డి, చిగిచెర్ల అరవింద్రెడ్డిపై దాడులు, ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న నరేంద్రరెడ్డిని బూతులు తిట్టి ట్రాన్స్ఫర్ చేయడం, అర్హత ఉన్న రెడ్డి ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండా అడ్డుపడటం, అనవసర బదిలీలు తదితరాలే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక రెడ్డి జేఏసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడంలో భాగంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి గన్మెన్లను తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా పేరుతో నమోదైన కేసుల్లో 800 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఈ దాడులను అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న రెడ్డి ప్రజా ప్రతినిధులు, రెడ్డి నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ పట్టణాధ్యక్షుడు కృష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ఆదిశేఖర్రెడ్డి, కార్యదర్శి మంజునాథ్రెడ్డి, రంగారెడ్డి, సనత్కుమార్రెడ్డి, కాటంరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు. -
మామిడి.. మిగలని దమ్మిడి!
పెనుకొండ: ఎన్నో ఆశలతో ఈ ఏడు లాభాలు గడించవచ్చని ఆశించిన మామిడి రైతులు... పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో కుదేలవుతున్నారు. విధి లేని పరిస్థితిల్లో మండీ వ్యాపారులు అడిగిన ధరకే కాయలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా... చివరకు రెక్కల కష్టమే మిగులతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా .. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగులో ఉండగా, నెలరోజుల క్రితం దిగుబడి ప్రారంభంలో మంచి డిమాండ్ ఉండేది. తోతాపురి రకం టన్ను రూ.30 వేలకు పైగా అమ్ముడు పోయింది. చిరు వ్యాపారులు సైతం మార్కెట్లో కిలో రూ.60 చొప్పున విక్రయిస్తూ లాభాలు గడించారు. ఇలాంటి తరుణంలో కాయ పరిమాణం మరికాస్త పెరిగితే ధర కూడా ఆశించిన మేర ఉంటుందని పలువురు రైతులు భావించారు. దీంతో కోతలు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ. 5 వేల నుంచి రూ. 6 వేలలోపే పలుకుతోంది. గతంలో మార్కెట్లో టన్ను రూ. 50 వేలకు పైగా పలికిన బేనీషా, బాదామి, రాజ్బేనీషా, కసి, రస్పూరి వంటి మేలు రకాలను సైతం ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి అడగడం లేదు. హైదరాబాద్, నాగపూర్, బెంగళూరు వంటి దూర ప్రాంత మార్కెట్లకు కాయలను తీసుకెళుతున్నా గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని ప్రభుత్వ సహకారం మార్కెట్లో ధరలు పతనమై నష్టపోకుండా రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కేవరకూ ఉత్పత్తులను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాక ప్రత్యేక రైలు మార్గం ద్వారా పంట ఉత్పత్తులను దేశంలోని మహానగరాలకు రవాణా చేయించి, ఉద్యాన తోటల రైతులకు లాభాలు దక్కేలా చొరవ తీసుకుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఉద్యాన రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పంటకు కనీస మద్ధతు ధర కల్పించకపోవడం, శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించకపోవడం తదితరాలతో ఉద్యాన రైతులు భారీగా నష్టాలను మూట గట్టుకోవాల్సి వస్తోంది. తోతాపురి టన్ను రూ.6 వేలలోపే కిలో రూ.20 దాటని ఇతర రకాలు మామిడి రైతుల బతుకులు వీధిన పడుతున్నాయి. కాయలకు గిట్టుబాటు ధరలు దక్కక, ఆదాయం రాక, అప్పులు తీర్చలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు ధరల్లేవు మామిడి ధర ప్రారంభంలో కాస్త బాగున్నా కాయ పూర్తి సైజు వచ్చే సరికి ఒక్కసారిగా పడిపోయాయి. సగానికి పైగా ధరలు పడిపోవడం ఒక విధంగా రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. తోతాపురి రకం టన్ను 5 వేలు, బేనీషా, బాదామి ఇతర మేలు రకాలు టన్ను రూ. 20 వేలకు మించి పోవడం లేదు. దీంతో రైతుతో పాటు తోటలను కొనుగోలు చేసిన నాలాంటి వ్యాపారులు టన్నుపై రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. – వినోద్, వ్యాపారి, పెనుకొండ -
వెంకటరమణప్పకు కన్నీటి వీడ్కోలు
పావగడ: వ్యవసాయదారుడు, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప పార్థివ దేహానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాళులర్పించారు. వెంకటరమణప్ప కుమారుడు స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. శనివారం పావగడ తాలూకాలోని హనుమంతనహళ్లికి చేరుకున్న సిద్దరామప్ప.. వెంటరమణప్ప భౌతిక కాయాన్ని చూడగానే కంట తడి పెట్టారు. వెంకటరమణప్ప మృతి తనకు వ్యక్తిగతంగా తీరని నష్టమని పేర్కొన్నారు. ఇంత త్వరగా తన మిత్రడు కనుమూస్తాడని అనుకోలేదని, ఇంకా పదేళ్లు బతికే అవకాశముండేదని బాధ పడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాలను గుర్తు చేశారు. మంత్రులు జమీర్ అహమ్మద్, కేజే జార్జ్, మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజణ్ణ, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య, రాజేంద్ర కేఎన్ రాజణ్ణ, ఎంపీ గోవింద కారజోళ, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు శాంతలారాజణ్ణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్సీ నారాయణస్వామి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి, కలెక్టర్ శుభ కళ్యాణ్, సీఈఓ అశ్విజ, తదితర ప్రముఖులు వెంకటరమణప్ప పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.రాజనహళ్లి వాల్మీకి ప్రసానందస్వామితో పాటు 25 మంది సాధువులు వెంకటరమణప్ప పార్థివదేహాన్ని సందర్శించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు తాను ప్రేమతో పెంచుకున్న వ్యవసాయ క్షేత్రంలో అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. -
‘సర్’ సర్వేకు సహకరించండి
● రాజకీయ పార్టీలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్– సర్) సర్వే జిల్లాలో పక్కాగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ పార్టీల నాయకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జూన్ 5 నుంచి 14వ తేదీ వరకూ సన్నాహక కార్యక్రమాలు, సిబ్బందికి శిక్షణ, ఓటరు గణన ఫారాల ముద్రణ ఉంటుందన్నారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేకరిస్తారన్నారు. ఏ ఇంటికై నా తాళం వేసి ఉంటే.. సదరు ఇంటిని కనీసం మూడు సార్లు బీఎల్ఓలు సందర్శిస్తారన్నారు. జూలై 21న ముసాయిదా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేస్తామని, జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అన్నీ పరిష్కరించి సెప్టెంబర్ 22వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా సర్ సర్వే సాగుతుందన్నారు. అలాగే నకిలీ ఓట్లు లేని స్వచ్ఛమైన జాబితా కోసం రాజకీయ పార్టీలు నియమించుకునే బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ కొండయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
పుట్టపర్తి అర్బన్: స్థానిక ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నలుపు షర్టు, మెడలో పచ్చ దారంతో కూడిన తాయత్తు తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం ఉదయం బసవ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఆచూకీ తెలిసిన వారు 91820 19510 కు సమాచారం ఇవ్వాలని కోరారు. తాటిచెట్టుపై పిడుగు బత్తలపల్లి: మండలంలో శనివారం సాయంత్రం కురిసిన మోస్తారు వర్షానికి నల్లబోయనపల్లి గ్రామ శివారున ఉన్న తాటిచెట్టుపై పిడుగు రాలింది. దీంతో తాటిచెట్టుపై మంటలు ఎగిసిపడ్డాయి. సంజీవపురం గంగమ్మ ఆలయం, ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. -
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్ /ధర్మవరం అర్బన్: ఉరుములు... మెరుపులు..భారీగాలులతో కూడిన వాన జిల్లాను ముంచెత్తింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వాన రాత్రి 9 గంటల వరకూ కురిసింది. ప్రధానంగా తాడిమర్రి, ధర్మవరం, చిలమత్తూరు, పుట్టపర్తి, కొత్తచెరువు ,గోరంట్ల హిందూపురం తదితర ప్రాంతాల్లో 2 గంటలకుపైగా దంచేసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిలమత్తూరులోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడి చెట్టు కాలి పోయింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. తాజా వర్షాలతో ఖరీఫ్ సాగుకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ధర్మవరంలో కుండపోత ధర్మవరంలో శనివారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. చేనేతల ఇళ్లల్లోని మగ్గం గుంతల్లో వర్షపునీరు చేరడంతో సామగ్రి తడిసిపోయింది. ఎన్టీఆర్ సర్కిల్లో ప్రధాన రహదారి మొత్తం జలదిగ్భంధమైంది. దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో వర్షపునీరు నిలవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
పెనుకొండ రూరల్: ‘‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే సమయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి. బీఎల్ఓల వెంట ఉంటూ అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలి. అలాగే నూతన ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలి.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పార్టీ బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజక వర్గంలోని బీఎల్ఓలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ‘సర్’ సర్వే సమయంలో బీఎల్ఓఏల వెంట బీఎల్ఏలతో పాటు పార్టీ ముఖ్యనాయకులు ఇంటింటి పరిశీలనకు వెళ్లాలన్నారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, మృతుల ఓటర్లును గుర్తించాలన్నారు. అధికారులు సమక్షంలో అక్కడికక్కడే నిర్ధారించుకోవాలన్నారు. అర్హత కలిగిన ఏ ఓటు తొలగించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి ఓటూ బంగారం కంటే విలువైనదిగా భావించాలన్నారు. బీఎల్ఓలు, నాయకులు సమష్టి కృషితో పనిచేస్తే స్థానిక సంస్థలలో పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. అన్మ్యాప్డ్ ఓటర్ల ఆధారాలు సిద్ధం చేయండి 2002 తర్వాత ఓటు హక్కు పొందిన ఓటర్లను అన్మ్యాప్డ్ ఓటర్లుగా పరిగణిస్తారని, అలాంటి ఓటర్ల ఆధారాలు సిద్ధం చేసుకోవాలని బీఎల్ఏలకు ఉషశ్రీచరణ్ సూచించారు. ఇంటి యజమాని ఓటు కార్డు మ్యాప్ అయి ఉంటే చాలని, కుటుంబ సభ్యులు ఓటరు కార్డు మ్యాప్ కాకపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించిన జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, భూమి పాసు పుస్తకం, ఇంటి పట్టా, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, పాస్ పోర్టు... ఇలా 13 రకాల పత్రాల్లో ఏవైనా రెండు త్రాలు అధికారులకు అందజేస్తే సరిపోతుందన్నారు. ‘సర్’ సర్వేలో కీలకంగా వ్యవహరించాలి అర్హులైన వారి ఓట్లు తొలగకుండా చూసుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఒక్క ఓటూ తొలగిపోకూడదు ‘సర్’ సర్వేలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీను మహేష్, పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో శ్రీసత్యసాయి జిల్లా ఇప్పటికే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ‘సర్’ పరిశీలనలోనూ నిజమైన ఓటర్లు తొలగించకుండా జాగ్రత్త పడుతూ తక్కువ ఓటర్లు తొలగించిన జిల్లాలో మొదటి స్థానంలో నిలువాలన్నారు. గ్రామస్థాయి నాయకులంతా విధిగా సర్వే సమయంలో బీఎల్ఓల వెంట ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే స్పందించాలన్నారు. సమస్య మీ పరిధిలో పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చి ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, పోలింగ్ బూత్ల జోన్–5 ఇన్చార్జ్ సురేష్, బూత్ కమిటీల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమాం వలి, ఐదు మండలాల బూత్ కమిటీల కన్వీనర్లు, బోయ రాము, విజయ్ కుమార్రెడ్డి, చిలకల రవి, గంగాధర్ రెడ్డి, బలిజ సుబ్రహ్మణ్యం, ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, నరసింహ మూర్తి, తిమ్మయ్య, వెంకటేష్, శంకర్, శ్రీనివాస్, గజేంద్ర, పలువురు ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
అయ్యవార్లలో అలజడి
పుట్టపర్తి: ‘టెట్’పై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2010 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన వారంతా తప్పనిసరిగా ‘టెట్’ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) రాయాల్సిందేనని తేల్చేసింది. అంతేకాదు..ఉద్యోగంలో కొనసాగాలంటే 2028 ఆగస్టు 31వ తేదీ లోపు ఉత్తీర్ణులు కావాల్సిందేనని శుక్రవారం తీర్పు చెప్పింది. దీంతో అయ్యవార్లలో అలజడి నెలకొంది. పాఠం చెప్పే తాము ఇప్పుడు మళ్లీ పాఠాలు నేర్చుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8,300పైచిలుకు మంది ఉపాధ్యాయులు ఉండగా కేవలం 2,900 మంది మాత్రమే ‘టెట్’ పాస్ అయ్యారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు 400 మందికి మించి ఉండరు... దీనిప్రకారం 5 వేల మంది ‘టెట్’ తప్పని సరిగా పాస్ కావాల్సి ఉంది. పదోన్నతులపై తీవ్ర ప్రభావం ఏటా వేసవిలోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘టెట్’ పాస్ అయిన వారికే ప్రమోషన్ కల్పించాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వేలాది మంది టీచర్ల ప్రమోషన్ కల ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది సీనియర్లు పదోన్నతులు కోల్పోనున్నారు. ఇన్సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పనిసరి తాజాగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జిల్లాలోని 5,000 మందిపైప్రభావం చంద్రబాబు, లోకేష్ హామీ నిలబెట్టుకోవాలని టీచర్ల డిమాండ్ మినహాయింపు ఇవ్వాలి టెట్ నుంచి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయాలి. 30 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న వారికి పరీక్ష పెట్టడం సరికాదు. పదోన్నతులకూ ‘టెట్’ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం కూడా దుర్మారం. ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘టెట్’ను ప్రామాణికంగా తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం. – కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎస్టీఏ హిందూపురంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవి అనే ఉపాధ్యాయుడు కొన్నేళ్లుగా పిల్లలకు గణితం బోధిస్తున్నాడు. ఆయన సర్వీసు కూడా ఆరేళ్లు మాత్రమే ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంది. 150 మార్కులకు నిర్వహించే ‘టెట్’లో తాను చెప్పే గణితానికి సంబంధించి 30 మార్కులే ఉంటాయని, మిగతా 120 మార్కులకు తాను సోషల్, తెలుగు తదితర సబ్జెక్టులు ఇప్పుడు చదువుకోవాల్సి వస్తోందని రవి ఆవేదన వ్యక్తం చేశాడు. ..ఇలా జిల్లాలోని టీచర్లంతా ‘టెట్’కు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తే తాము బోధించే సబ్జెక్టుపైనే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. -
హామీ నిలబెట్టుకోవాలి
ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్..గతంలోనే ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రంలో లక్షలాది మంది టీచర్లు నష్టపోతారు. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల జిల్లాలో వేలాది మంది టీచర్లు ఆందోళకు గురవతున్నారు. ఇన్సర్వీస్ టీచర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్లో చట్ట సవరణ కోసం బిల్లు ప్రవేశ పెట్టాలి. అప్పుడే టీచర్లకు న్యాయం జరుగుతుంది. ఇది తప్ప వేరే గత్యంతరం లేదు. – శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ -
పోలీస్ క్రికెట్ టోర్నీ విజేత కేజీఎఫ్ జట్టు
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వారం రోజులుగా సాగుతున్న పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 16 జట్లు పాల్గొనగా, శనివారం జరిగిన ఫైనల్స్లో క్యాంప్ జట్టుపై కేజీఎఫ్ జట్టు విజయం సాధించి ంది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు : ఎస్పీ క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెల రోజులుగా సాగుతున్న టేబుల్ టెన్నిస్ వేసవి శిక్షణా శిబిరం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై, శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత, డీఎస్పీ శివనారాయణస్వామి, పీడీ నరసింహాచారి, తదితరులు పాల్గొన్నారు. మహానాడులో హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్ చిలమత్తూరు: మండలంలోని కోడూరులో ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో గోరంట్ల హౌసింగ్ శాఖలో వర్క్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మల్లికార్జున పాల్గొనడం చర్చనీయాంశమైంది. మహానాడులో మల్లికార్జున సందడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రైతు సమస్యలు పట్టవా?
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారుల పని తీరులో చాలా మార్పులు వచ్చాయని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రధానంగా తాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, విద్యుత్, వెల్ఫేర్ వంటి అంశాలపై చర్చ సాగింది. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ సాలురెడ్డి మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంగా ఆలస్యం చోటు చేసుకుందని, రైతులకు జూన్ 4 నుంచి విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తీసుకెళ్లినా నేటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. రైతులకు పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని జెడ్పీటీసీ నాగరాజు గుర్తు చేశారు. సర్వజనాస్పత్రిలో నెలకొన్న సమస్యలను జెడ్పీటీసీ చంద్ర ప్రస్తావిస్తూ... రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అంబులెన్స్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్లు లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజమ్మ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. సమగ్ర విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కాగా, సమావేశానికి విద్యాశాఖాధికారులు గైర్హాజరు కావడంతో చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. ఐసీడీఎస్లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు. స్థాయీ సంఘ సమావేశంలో అధికారులను నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఎప్పుడు చేపడతారని నిలదీత తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం సర్వజనాస్పత్రిలో రోగులకు భోజనం సక్రమంగా అందివ్వాలని డిమాండ్ -
వీఆర్కు పుట్టపర్తి సీఐ తిమ్మారెడ్డి
పుట్టపర్తి టౌన్: అర్బన్ సీఐ తిమ్మారెడ్డిని వీఆర్కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే పుట్టపర్తి అర్బన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న తిమ్మారెడ్డి... అతి తక్కువ కాలంలోనే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అనంతపురం వీఆర్కు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తిమ్మారెడ్డి పనితీరుతో ఇబ్బంది పడిన కూటమి నాయకులు తనదైన శైలిలో స్థానిక ప్రజా ప్రతినిధులు వద్ద పావులు కదపడంతో ఉన్నతాధికారులు ఆయన్ను వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలో శాంతి భద్రతలు, ప్రొటోకాల్ రీత్యా ప్రశాంతి నిలయం సెక్యూరిటీ వింగ్ సీఐగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని అర్బన్ సర్కిల్కు ఇన్చార్జ్గా నియమించారు. ప్రశాంతంగా ‘పది’, ఇంటర్ పరీక్షలుపుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు శనివారం 23 కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,794 మంది హాజరుకావాల్సి ఉండగా 2,233 మంది హాజరు కాగా, 561 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. అలాగే ‘ఓపెన్’ విద్యార్థులు 171 మందికి గాను 130 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్షలకు 171 మంది గైర్హాజరు 32 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 171 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష నిర్వహించగా...1,255 మందికి గాను 1,166 మంది హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 828 మందికి గాను, 746 మంది విద్యార్థులు హాజరు కాగా, 82 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. జూన్ 5 నుంచి కళాశాలలు ప్రారంభం జూనియర్ కళాశాలలో మరో 5 రోజులు వేసవి సెలవులు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వలస కూలీల వాహనం బోల్తా ●బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో మహిపాల్ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
పశుపోషకులను ఆదుకోవాలి
విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, కుక్కల దాడి.. ఇలా ఏదో ఒక కారణంతో తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట జీవాలు, పశువులు చనిపోతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం పశుబీమా సక్రమంగా అమలు చేయకపోవడంతో పశుపోషకులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో రూ.10 కోట్ల దాకా పశుబీమా అందించింది. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ నిధులు విడుదల కావాల్సి ఉంది బీమా ప్రీమియంలో ప్రభుత్వం 85 శాతం రాయితీ ఇస్తూ పశుబీమాను అమల్లోకి తెచ్చింది. రైతు 15 శాతం మొత్తం చెల్లిస్తే చాలు. కాకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అందుకే కొంతకాలంగా బీమా చేయడం లేదు. పిడుగులు పడటం, ఇంకా పలు కారణాలతో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోయిన మాట వాస్తవమే. బీమా వర్తింపజేస్తే వారికి కొంత ఊరట లభిస్తుంది. – పెంచలయ్య, జేడీ, పశుసంవర్ధకశాఖ -
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
హిందూపురం టౌన్: ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హిందూపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను కేవలం ప్రకటనలతో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం దారుణమన్నారు. మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన తరుణంలో వాటిని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలు సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విద్యార్థులను సామాజిక, రాజకీయ చైతన్యంతో కూడిన ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దడానికి జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, మహేంద్ర, నాయకులు చంద్ర, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు -
పార్టీ కార్యక్రమంలో తరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు
ఎన్పీకుంట: స్థానిక శివాలయం వద్ద ఉన్న కమ్యూనిటీ భవనంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం చర్చనీయాంశమయ్యింది. మండల పరిధిలోని వెలిచలమల, పడమరనడిమిపల్లి, ఎదురుదోన పంచాయతీలకు చెందిన నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వేతనం పొందుతున్న వీరు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిబంధన ఉంది. అయినా నిబంధనలు బేఖాతరు చేస్తూ టీడీపీ లోగోలు, ట్యాగులు ధరించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ తనకల్లు: మండలంలోని మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామంలోని దళిత వాడలో 43వ జాతీయ రహదారి పక్కనే నివాసముంటున్న రమణమ్మ శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు రమణమ్మ ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు కలావర్లు, వెండి గొలుసులతో పాటు రూ. 6 వేలు నగదు అపహరించారు. మరో గదిలో ఉన్న ఎనిమిది బస్తాల బియ్యాన్ని ఆటోలో వేసుకుని వెళ్లిపోయారు. కూలి పనుల నుంచి ఇంటికి చేరుకున్న రమణమ్మ తలుపులు తెరచి ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ దిలీప్ కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ట్రావెల్ బస్సు బోల్తా గోపవరం: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పరిధిలోని 67వ జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు బోల్తాపడింది. విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, కదిరికి చెందిన శ్రీనివాసులుతో పాటు కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బద్వేలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై బద్వేలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక మద్యం స్వాధీనం హిందూపురం టౌన్: కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీ, ఫ్లో కేమ్ ఫ్యాక్టరీ, తిరుమల స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే బ్రిడ్జి వద్ద కర్ణాటక మద్యం దందా సాగుతున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో నలుగురు పట్టుబడగా, వారి నుంచి 90 ఎంఎల్ సామర్థ్యం కలిగిన 9 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అలాగే కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తూ నలుగురు పాత నిందితుల్లో ఒక్కొక్కరికి ఏడాది కాలానికి రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం కంబాలపల్లికి చెందిన ఊటుకూరు మానద్న (60) దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా కోగిర సమీపంలో ఎల్జీబీనగర్ వైపు నుంచి కోగిర గ్రామానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తూ ఢీకొన్నారు. ఘటనలో రోడ్డుపై పడిన మాదన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న నరసింహులతో పాటు బాలలు రాహుల్, భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 లో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మడకశిర రూరల్: స్థానిక 544ఈ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడీహళ్లి పంచాయతీలోని చౌలిపల్లికి చెందిన నరసింహయ్య (62), జగన్.. గొర్రెల వ్యాపార నిమిత్తం శుక్రవారం ద్విచక్ర వాహనంపై మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి వచ్చారు. పశువుల వ్యాపారి చెన్నయ్య గురించి ఆరా తీయడంతో ఆయన గ్రామంలో లేడని తెలుసుకుని మడకశిర వైపుగా బయలుదేరారు. అయ్యవారిపల్లి ప్రధాన కూడలికి చేరుకోగానే జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి కిందపడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా మడకశిరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరసింహయ్య (62) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జగన్ను తుమకూరులోని ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ఎస్ఐ లావణ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ జోరు
ఈ మ్యాచ్లో ఫలానా జట్టే గెలుస్తుంది. పందెం రూ.10 వేలు. ఈ ఓవర్లో వికెట్ పడుతుంది. మీది రూ.వెయ్యి మాది రూ.800, ఈ పార్టనర్ షిప్లో హాఫ్ సెంచరీ చేస్తారు. పందెం రూ.20 వేలు... ఇలా హిందూపురం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం నుంచి క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.కోట్లలో చేతులు మారినట్లు సమాచారం. హిందూపురం: ఐపీఎల్ సీజన్ ప్రారంభనుంచి హిందూపురం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈ బాగోతంలో బెంగళూరు ప్రాంతానికి చెందిన బుకీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. క్రీడా పరిజ్ఞానం ఉన్న యువకులతో పాటు ఇతర జూదాలలో రాటుదేలిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లలో బిజీగా ఉంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో సాగుతుండడంతో అడ్డుకట్ట వేయడం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. బెట్టింగ్లో ఇప్పటికే హిందూపురం పట్టణానికి చెందిన ఓ వ్యాపారి తొలుత రూ.2లక్షల వరకు గెలిచినట్లు సమాచారం. తర్వాత రూ.20 లక్షల వరకూ పోగొట్టుకున్నట్లు వదంతులు వినవస్తున్నాయి. దీంతో సదరు వ్యాపారి హిందూపురాన్ని వదిలి మరో ఊరిలో స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అలాగే బోయపేటకు చెందిన ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్లో బంగారు గొలుసు, బైక్, డబ్బు పోగొట్టుకుని బెంగళూరు వెళ్లిపోయాడు. జట్టు బలాల ఆధారంగా ఐపీఎల్లో తలపడుతున్న జట్ల బలాబలాల ఆధారంగా బెట్టింగ్ సాగుతోంది. అందిన సమాచారం మేరకు ఒక ఓవర్లో పరుగులు, వికెట్లు పడే సమయాలు, నో బాల్, వైడ్లు ఎప్పుడు పడతాయి, ఫోర్లు, సిక్సర్లు ఎప్పుడు కొడతారు.. ఇలా ప్రతి నిమిషానికి రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ కడుతున్నారు. చివరకు మ్యాచ్ ఫలితంపై కూడా భారీ బెట్టింగ్ సాగుతోంది. ఒక జట్టు బలహీనంగా ఉంటే దానిపై తక్కువ మొత్తం పందెం కాస్తున్నారు. బలమైన జట్టు వైపు ఉన్నవారు దానికి కాస్త ఎక్కువ మొత్తం బెట్టింగ్ కడుతున్నారు. హిందూపురంలోని బార్లు, టీ కేఫ్లు, ధాబాల్లో బెట్టింగ్ రాయుళ్లు గంటల తరబడి బైఠాయించి మ్యాచ్ ఫలితం తేలేవరకూ వేచి ఉండడం గమనార్హం. బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా హిందూపురంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ బెట్టింగ్ కేంద్రాలుగా బార్లు, టీ కేఫ్లు, ధాబాలు చేతులు మారుతున్న రూ.కోట్లు క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ ఐపీఎల్ సీజన్ సందర్భంగా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఏఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తూమకుంట వద్ద హిందూపురం రూరల్ సీఐలు చంద్ర, ఆంజనేయులు, సిబ్బంది తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తూ సందీప్కుమార్, తిమ్మారెడ్డి, మర్రబల్లి శ్రీనివాసరెడ్డి పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో హిందూపురం సీఐలు ఆంజినేయులు, జనార్థన్, రాజగోపాలనాయుడు, అబ్దుల్కరీం తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ప్రశాంతి నిలయం: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన ఎన్– కార్డ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పాత కేసుల్లోని నిందితులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్ చేయాలన్నారు. బెల్ట్ షాపులను నిర్మూలించాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, డీపీఈఓ గోవింద నాయక్, ఏఈఎస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 2న జిల్లా ఫుట్బాల్ బాలికల జట్ల ఎంపికహిందూపురం టౌన్: స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో జూన్ 2న జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్ శుక్రవారం వెల్లడించారు. సబ్ జూనియర్ విభాగంలో 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్య జన్మించిన వారై ఉండాలి. జూనియర్స్ విభాగంలో 2011 జనవరి నుంచి 2012 డిసెంబర్ మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మూడు ఫొటోలు, తల్లిదండ్రుల సమ్మతి పత్రం తీసుకుని మంగళవారం ఉదయం 10 గంటలకు క్రీడా మైదానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 80995 98958 లో సంప్రదించవచ్చు. మాజీ మంత్రి వెంకటరమణప్ప ఇక లేరుపావగడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప(84) గుండెపోటుతో కన్ను మూశారు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు వెంకటేష్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో భార్య శారదమ్మ మృతి చెందారు. తాలూకాలోని హనుమంతనహళ్లిలోని తన స్వగృహంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను బెంగుళూరులోని ఫోర్టీస్ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పావగడలోని గురుభవన్ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్ని వెంకటరమణప్ప భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. యువతి అదృశ్యం అగళి: మండలంలోని హళ్లికేర గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప నాల్గో కుమార్తె అంజలి కనిపించడం లేదు. పోలీసులు తెలిపిన మేరకు... 19 సంవత్సరాల వయసున్న అంజలి కర్ణాటకలోని దొడ్డేరి హోబళి రంగాపురంలో తన చిన్నాన్న నాగరాజు నూతనం నిర్మిస్తున్న ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం బహిర్భూమికని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని తమ్ముడు నాగరాజు ఫోన్ చేయడంతో హనుమంతరాయప్ప... బంధువుల సాయంతో చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు చేపట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. -
బీమాపై ‘మూగ’నోము
కదిరి: వైఎస్ జగన్ హయాంలో ‘వైఎస్సార్ పశు బీమా’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఏదైనా కారణంతో పాడి పశువులు లేదంటే జీవాలు (గొర్రెలు, మేకలు) మృత్యువాత పడితే వెంటనే సదరు రైతు ఖాతాలో బీమా సొమ్ము జమ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే జిల్లాలో పశువులకు బీమా కట్టించుకున్నారు. కానీ తర్వాత నిధులు లేవంటూ పశుబీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇటీవల గాలివాన, విద్యుదాఘాతం, కుక్కల దాడులు..ఇలా పలు కారణాలతో ఎన్నో జీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుపోషకులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అయినా ఈ ప్రభుత్వం సదరు రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. జగన్ హయాంలో ఒక్కో రైతుకు రూ.3 లక్షలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైనా కారణంతో గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి రూ.6 వేల చొప్పున గరిష్టంగా రూ.3 లక్షలు మంజూరు చేసేవారు. ఆ మొత్తాన్ని కూడా సదరు రైతు ఖాతాలో నేరుగా జమ చేసేవారు. ఆవు లేదా గేదెలు ప్రమాదవశాత్తూ చనిపోతే జగన్ ప్రభుత్వం ఒక్కోదానికి రూ.30 వేల చొప్పున రైతుకు నష్టపరిహారం ఇచ్చింది. రైతుకు భారం లేకుండా ప్రీమియం డబ్బులో కూడా 80 శాతం ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు నిధులు లేవని ఆ పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గడచిన ఐదు నెలల్లో 450 గొర్రెలు మృతి.. 2026 జనవరి నుంచి మే 20వ తేదీ వరకు జిల్లాలో 452 గొర్రెలు, 311 మేకలు, 28 గేదెలు, 36 ఆవులు, 12 ఎద్దులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. వీటికి పశుబీమా లేకపోవడంతో పశుపోషకులు భారీగా నష్టపోయారు. పాడిపశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించింది. గతంలో అమలు చేసిన పశువుల బీమా పథకానికి మంగళం పాడింది. ఫలితంగా ఏదైనా అనుకోని ప్రమాదంలో పశువులు, జీవాలు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పశు బీమాకు చంద్రన్న మంగళం నిధులు లేవంటూ దారుణ మోసం ఇటీవల తరచుగా మృత్యువాత పడుతున్న మూగజీవాలు పెద్ద మొత్తంలో నష్టపోతున్న పశుపోషకులు గత ప్రభుత్వంలో ‘వైఎస్సార్ పశు బీమా’తో ఎంతో లబ్ధి ఈనెల 26వ తేదీన తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఈదురుగాలులు వీచి కుళ్లాయప్పకు చెందిన పశువుల షెడ్డు కూలి ఐదు గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. అలాగే రూ.లక్షకుపైగా విలువ చేసే పాడిగేదె మృతి చెందింది. వారం క్రితం తలుపుల మండలం దేవరపల్లిలో గాలివానకు కరెంటు తీగలు తగిలి మల్లినాయుడుకు చెందిన రూ.లక్ష విలువ చేసే ఎద్దులు మృతి చెందాయి. గత నెలలో కదిరి మండలం మీటేనాయక్ తండాలో పొలం వద్ద యూరియా కలిపిన నీళ్లు తాగి బద్దే నాయక్కు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. ఇటీవల రొద్దం మండలం ఎం.కొత్తపల్లి ఎస్సీ కాలనీలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో నాగన్నకు చెందిన 22 గొర్రెలు మృతి చెందాయి. నెల రోజుల క్రితం ఎన్పీకుంట మండలం భీమబోయినపల్లిలో కుక్కల దాడిలో కొమ్మల సురేష్ అనే రైతుకు చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో ఉప్పర గోపాల్కు చెందిన 20 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ఇటీవల జరిగిన సంఘటనలు కొన్ని... -
పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను గడువులోపు ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్డీపీ పోస్టల్ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలన్నారు. అనంతరం నెడ్క్యాప్ ద్వారా చేపడుతున్న సౌరశక్తి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంపై ఎస్పీడీసీఎల్ అధికారులతో చర్చించారు. పరిశ్రమలకు సబ్సిడీలు, పీఎం విశ్వకర్మ ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, జెడ్ఎం నాగముని, ఏపీఐఐసీ ప్రతినిధి శశికళ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 23 కేంద్రాల్లో మేథమెటిక్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,546 మందికి గాను 2,086 మంది హాజరుకాగా, 460 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ‘ఓపెన్ స్కూల్’ విద్యార్థులు 213 మందికి గాను 171 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వెల్లడించారు. మొత్తంగా 502 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్షకు 300 మంది గైర్హాజరు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జనరల్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ఫిజికల్ సైన్స్ పరీక్ష జరిగింది. జిల్లాలోని 32 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు 3,633 మందికి గాను 3,410 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 776 మందికి గాను 699 మంది విద్యార్థులు హాజరు కాగా, 77 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా శుక్రవారం 300 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ‘కియా’ యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహం ● ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి ప్రశాంతి నిలయం: జిల్లాలోని ఎన్హెచ్–44 పరిధిలో ‘కియా’ ఫ్యాక్టరీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని, అలాగే ఆ ప్రాంతంలోని రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ సతీష్కుమార్, జిల్లా రవాణా అధికారి కరుణసాగర్రెడ్డితో కలిసి రహదారి భద్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలోనే ‘కియా’ వద్ద జరిగిన ప్రమాదాల గురించి అధికారులు వివరించగా...కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కియా యాజమాన్యం వెంటనే రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. హరిపురం, అమ్మవారిపల్లి, పుట్టపర్తి క్రాస్, దుద్దేబండ క్రాస్, గుట్టూరు క్రాస్ వద్ద తక్షణమే రంబుల స్ట్రిప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలన్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం, లింగారెడ్డిపల్లి క్రాస్ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను కట్టడి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
పుట్టపర్తి: ‘‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించి డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు పాతరేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన నిర్వాకానికి అర్హులైన వేలాది మంది విద్యార్థుల కుటుంబాలు బలవుతున్నాయి. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ చేయించాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్, నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలి. మెరిట్ లిస్ట్, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలి’’ అని వైఎస్సార్ విద్యార్థి (వైఎస్సార్ ఎస్యూ) విభాగం నేతలు డిమాండ్ చేశారు. డీఎస్పీలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పుట్టపర్తి గణేష్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే డీఎస్సీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అన్నీ అనుమానాలే.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో మెరిట్ లిస్ట్ను పక్కన పెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైఎస్సార్ ఎస్యూ నేతలు ఆరోపించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా కేవలం ఎంపికై న విద్యార్థులకు మాత్రమే సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృషించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ డీ మెరిట్ విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చారన్నారు. కనీసం అభ్యంతరాలకు గడువు కూడా ఇవ్వలేదన్నారు. భవి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకంలోనే తప్పులు చేసి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నా... మంత్రి లోకేష్ మొద్దు నిద్రలో ఉన్నారన్నారు. ప్రభుత్వ చర్యలతో నష్ట పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి నియోజక వర్గం అధ్యక్షుడు నరేష్రెడ్డి, మహేష్, అమడగూరు అధ్యక్షుడు చరణ్, ధర్మవరం పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ పోస్టులను అమ్ముకోవడం సిగ్గుచేటు మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ నిరసన తెలిపిన వైఎస్సార్ ఎస్యూ నాయకులు సీబీఐతో విచారణ చేయించాలి మెగా డీఎస్సీలో జరిగిన తప్పులను సరిదిద్ది అర్హులకు న్యాయం చేయడానికి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏటా ఉద్యోగాల క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసగిస్తున్నారు. మరో మూడేళ్లలో మీ పాపం పండనుంది. – వేముల అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ విద్యార్థి విభాగం ‘క్రీడల కోటా’ అభ్యర్థులకు న్యాయం జరగాలి మెగా డీఎస్సీలో ‘క్రీడల కోటా’లో దరఖాస్తు చేసిన వారికి న్యాయం చేయాలి. మెరిట్ లిస్ట్ను వెంటనే ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలి. ఎంపిక విషయాన్ని ఎందుకు అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపారో తెలియజేయాలి. కాల్ లెటర్ల విషయంలో ఎందుకు గందరగోళం జరిగింది. స్పోర్ట్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇది దగా డీఎస్సీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ దగా డీఎస్సీగా మారిపోయింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతగానితనంతో వేలాది మంది అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. లోటు పాట్లను సవరించకుండా... అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకుండా వారిపైనే దాడులకు తెగబడడం విడ్డూరంగా ఉంది. అర్హులకు న్యాయం జరగక పోతే పోరాటం ఉధృతం చేస్తాం. – పురుషోత్తం రాయల్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం -
వైభవంగా సప్తమాత్రుక జ్యోతుల ఉత్సవం
పరిగి: మండల కేంద్రంలో వెలసిన పన్నేడమ్మ (సప్తమాత్రుక) అమ్మవారి జాతర శుక్రవారంతో ముగిసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జాతర నిర్వహించడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు రోజుల పాటూ వివిధ ఆధ్యాత్మిక కొనసాగాయి. శుక్రవారం చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గోపుర కలశ ప్రతిష్ఠాపన, చండీ యాగం, మహాబలి సమర్పణ, మహా పూర్ణాహుతి, మహా నీరాజనం అనంతరం 9 గంటల నుంచి దీపోత్సవం ప్రారంభమైంది. మహిళలు జ్యోతులను సమర్పించారు. అమ్మవారి సేవలో ఉష శ్రీచరణ్ శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ పాల్గొన్నారు. తొలుత పన్నేడమ్మ ఆలయ ప్రాంగణం వరకూ జ్యోతులను తలపై పెట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం జ్యోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సప్తమాత్రుక అమ్మవారి కరుణతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాత్రి జరిగిన గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. చివరి రోజు అట్టహాసంగా సాగిన గ్రామోత్సవం తరలివచ్చిన వేలాది మంది భక్తులు -
విలేకరి ముసుగులో వసూళ్లు!
సాక్షి, టాస్క్ఫోర్స్: పరిటాల అనుచరుడినని చెప్పుకొంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ను నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ భార్గవరెడ్డినీ బెదిరింపులకు గురిచేశాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చానల్లో డాక్టర్, ఆస్పత్రి గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్ భార్గవరెడ్డి లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ను రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు డాక్టర్ తిరస్కరించడంతో ఆస్పత్రిలో హంగామా చేశాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నంద్యాల త్రీటౌన్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతనిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. హరిజన రవి చరిత్ర ఆది నుంచీ నేరమయమేనని పీఆర్ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని పరిటాల కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో చాలా చోట్ల బెదిరింపులకు పాల్పడుతూ దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని చెప్పుకుంటూ వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా తరచూ అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని పలు పట్టణాల్లోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు. ‘పరిటాల’ అనుచరుడు రవి దందా డబ్బుల కోసం నంద్యాలలో ఓ వైద్యుడికి బెదిరింపులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన నంద్యాల పోలీసులు రవి చరిత్ర అంతా నేరమయం.. -
దోచుకునేందుకే అమరావతి మంత్రం
పెనుకొండ రూరల్: ‘‘చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదు. అందుకే గతంలో వైఎస్ జగనన్న అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసి పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. పైగా ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్దకు అప్పులకు వెళ్తున్నారు. అమరావతి పేరు చెప్పి రూ.లక్షల కోట్లు దండుకుంటున్నారు. అనుచరులకు, బినామీలకు దోచిపెడుతున్నారు. అమరావతిలో నాలుగు రోడ్లకు చేసే ఖర్చును, మెడికల్ కాలేజీల కోసం వెచ్చించి ఉంటే రాష్ట్రంలోని పేద, మద్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేది. ఇది ప్రజా కంఠక ప్రభుత్వం.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమందేపల్లి మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు మహానాడు అంటూ అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారని, కానీ ఏ మహానాడులోనూ బీసీల సంక్షేమం గురించి ఆయన మాట్లాడలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు పింఛన్, కురుబల్లోని గుడికట్టు పూజార్లకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి...ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. అసలు ఈ ప్రభుత్వం బీసీలకోసం ఏం చేసిందో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సమాధానం చెప్పాలన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా వైఎస్ జగనన్న ప్రభుత్వం ఎందరో నిరుపేద చేనేతలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ హయాంలో చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం నేతన్నలకు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించలేక పోతోందన్నారు. సొంత మగ్గాలున్న యజమానులకు మాత్రమే పథకం వర్తింపజేస్తోందన్నారు. యజమాని దగ్గర మగ్గం నేసే నేతన్నలకు పథకం ఎందుకు వర్తింపజేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. విజయ్తో నీకు పోలికా..? పార్టీ స్థాపించి...ఎవరితోనూ పెత్తుపెట్టుకోకుండా ఎన్నికల్లో నిలిచి...ప్రజాభిమానంతో గెలిచి సీఎం అయిన విజయ్తో పోలిక పెట్టుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ఉషశ్రీచరణ్ హితవు పలికారు. తమిళనాడు సీఎం కమిట్మెంట్ ఉన్న నాయకుడన్నారు. బీజేపీ పొత్తుకు ఆహ్వానించినా..ఆయన ఒప్పుకోలేదన్నారు. ప్రజల కోసమే పార్టీ పెట్టాడనీ, ప్రజలకు కూడా ఆయన్ను నమ్మి ఆ పార్టీని గెలిపించారన్నారు. పొత్తులతో రాజకీయం చేసే పవన్కళ్యాణ్కు విజయ్కి చాలా తేడా ఉందన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వైఎస్సార్ సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి నోరు జారితే సహించబోమని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. మంత్రిగా ఉన్న ఆమె.. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, ఇందుకు సంబంధించిన చర్చకు వైఎస్సార్ సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సవిత...వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చింది మంచి చేయడానికి గానీ, కక్షలు రేపటానికి, తప్పుడు కేసులు పెట్టడానికి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, నాయకులు మంజు, వేణుగోపాల్, హనుమంతు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ -
42 అర్జీలకు పరిష్కారం
పుట్టపర్తి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ‘ఒక నెల–ఒక నియోజక వర్గం– నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో గతవారం అందిన అర్జీల పరిష్కారంపై చర్యలు చేపట్టారు. గత వారం 77 అర్జీలు అందగా... 42 అర్జీలను పరిష్కరించడంతో పాటు పరిష్కార పత్రాలను అర్జీలకు అందజేశారు. ముఖ్యంగా వేళ్లమద్ది పరిధిలోని ఎర్రవంకపల్లి గ్రామంలో సుదీర్ఘకాలంగా ఉన్న రస్తా సమస్యను పరిష్కరించారు. అలాగే బొగ్గలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కోసం అవసరమైన భూమిని కేటాయించారు. ఇక కురుమాల గ్రామ పొతంలో 150 ఎకరాల భూ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుండగా... రైతులకు న్యాయం చేస్తూ సదరు భూమిని రిజిస్టర్ను పూర్తిగా తొలగించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మనోజ్కుమార్రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేబుల్ కత్త్తిరిస్తూ పట్టుబడిన దొంగ
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్ కత్త్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు. ‘దుర్గం’లో పోలీసుల దందా!కళ్యాణదుర్గం రూరల్: స్థానిక అర్బన్ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు. బాలిక ఆత్మహత్య ఎన్పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. నగరంలో ఇద్దరి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చెరువులో వృద్ధురాలి మృతదేహంగార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విణ్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు. -
బడి బస్సు.. భద్రత తుస్సు!
కదిరి: జిల్లా రవాణా శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి బడి బస్సులను కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి బస్సులోనూ ఏదో ఒక లోపం బయటపడుతుండడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న జూన్ 12 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యం, నిబంధనలకు అనుగుణంగా బస్సులు ఉండాలని హెచ్చరిస్తున్నారు. బయటపడిన లోపాలెన్నో.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి మొత్తం 596 బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులు 342 బస్సులను తనిఖీ చేశారు. మరో 254 బస్సులను తనిఖీ చేయాల్సి ఉంది. తనిఖీ చేసిన వాటిలో ఇప్పటి వరకూ 183 బస్సుల్లో వివిధ రకాల లోపాలు బయటపడడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. 56 శాతం బస్సుల్లో ప్రధమ చికిత్స పెట్టెలు లేవని గుర్తించారు. 92 శాతం బస్సుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు, పరికరాలు లేవని తేలింది. 36 శాతం బస్సుల్లో హ్యాండ్ బ్రేక్ లేదని, చాలా బస్సుల్లో అత్యవపర ద్వారం వద్ద కూడా సీట్లు అమర్చినట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. 96 శాతం బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు కానరాలేదు. కేవలం 12 బస్సుల్లో మాత్రమే వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం బస్సుల్లో నాసిరకం వైరింగ్ ఉన్నందున అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకునే ప్రమాదమున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 36 బస్సులకు డ్రైవర్లుగా 60 ఏళ్లు పైబడిన వారిని నియమించుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరి కొన్ని వారాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల భద్రతపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో బడి బస్సుల నిర్వహణలో డొల్లతనం వెలుగు చూస్తుండడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కవుతున్నారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం తనిఖీల్లో వెలుగు చూస్తున్న డొల్లతనం ఖాళీగా ప్రథమ చికిత్స బాక్స్లు చాలా బస్సుల్లో తెరుచుకోని అత్యవసర ద్వారాలు నిశితంగా పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు తనిఖీలకు సహకరిస్తాం మా స్కూల్కు 3 బస్సులు ఉన్నాయి. వేసవి సెలవుల్లో అన్ని బస్సులూ కండీషన్లో ఉండేలా చిన్నపాటి మరమ్మతులు చేయిస్తున్నాం. ఫిట్నెస్ విషయంలో రాజీ పడం. ఎందుకంటే పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చే వరకూ మాదే పూర్తి బాధ్యత. అందుకే బస్సుల తనిఖీ విషయంలో రవాణాశాఖ అధికారులకు సహకరిస్తాం. – పి.సురేష్కుమార్, షిర్డీ సాయి స్కూల్, కదిరి ఫిట్నెస్ లేకుంటే చర్యలు తప్పవు వేసవి సెలవులు కావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను తనిఖీలు చేసి అందులో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం. ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అది బుక్కపట్నం వద్ద ఉంది. ఫిట్నెస్ పత్రాలు లేకుండా బస్సులు రోడ్డెక్కితే చర్యలు తీసుకుంటాం. – కరుణసాగర్ రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి -
దర్గా కట్ట వద్ద యువకుడి మృతి
యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
17 నుంచి కడపలో ఏపీఎల్
కడప వైఎస్పార్ సర్కిల్: ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళగిరిలో ఫైనల్స్ నిర్వహించనున్నారు. కడప వేదికగా తొమ్మిది మ్యాచ్లు... జూన్ 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులపాటు మొత్తం కడపలో 9 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందుకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. మూడేళ్ల క్రితం స్టేడియంలో రూ.8 కోట్ల వ్యయంతో ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డే అండ్ నైట్ మ్యాచ్ ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహించేలా జిల్లా క్రికెట్ సంఘం చేసిన కృషి ఫలించింది. తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తుడటంతో క్రీడాభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తుంది. మూడు వేదికల్లో ఐదో సీజన్ నిర్వహణ మంగళగిరిలో ఫైనల్స్ -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
● రూ.7.20 లక్షల నగదు స్వాధీనం మడకశిర: నియోజకవర్గ కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినటులపెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. గురువారం మడకశిర పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్యతో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ సుధీర్, సతీష్, దేవరాజ్, ఇర్ఫాన్ పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.7.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్ తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నాటుసారా విక్రేత అరెస్ట్ ధర్మవరం: మండలంలోని నేలకోటతండాకు చెందిన వడిత్యా శంకర్నాయక్ నాటు సారా విక్రయిస్తూ పట్టుబడినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐ నాగరాజు తెలిపారు. గురువారం వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు చేపట్టిన సమయంలో శంకర్నాయక్ పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు మడకశిర రూరల్: మండలంలోని జమ్మానపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో నెల్లూరుకు చెందిన వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్త గాయాలతో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జమ్మానపల్లిలో విద్యుత్ స్తంభాలకు తీగలను లాగడానికి కూలి పని కోసం వచ్చినట్లుగా సమాచారం. గురువారం రాత్రి పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై మడకశిరకు వెళుతుండగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. -
తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై ప్రభుత్వ కుట్ర
మడకశిర: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్రెడ్డి, వాగేష్ విమర్శించారు. గురువారం మడకశిరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో రాప్తాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు భద్రతను పెంచారే కానీ తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యేతోపుదుర్తి ప్రకాష్రెడ్డికి గన్మెన్లను తొలగించడాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే పరిగణించాల్సి వస్తోందన్నారు. తోపుదుర్తి రాజశేఖర్రెడ్డిపై హత్య కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడానికే కుట్ర పూరితంగా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కుట్ర పూరిత రాజకీయాలకు స్వస్తి పలకకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కక్ష సాధింపుల భాగంగానే గన్మెన్ల తొలగింపు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్రెడ్డి, వాగేష్ -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు తరలించారు.


